buy
-
దేశీ స్టాక్ ఇండెక్సులకు బూస్ట్
నేడు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే వీలుంది. ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్లు బలపడటంతో సెంటిమెంటు మెరుగుపడింది. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లను 90 రోజుల వరకూ నిలిపివేయడంతోపాటు.. ఎల్రక్టానిక్స్కు మినహాయింపు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హుషారు నెలకొంది. ముంబై: అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం దేశీ స్టాక్మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ఆసియా మార్కెట్లు 0.5–1.5% బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మరింత అధికంగా 1.5–2.5% ఎగశాయి. యూఎస్ మార్కెట్లు సైతం 1% పైగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) దేశీ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే యూఎస్ టారిఫ్ల అమలు 3 నెలలపాటు నిలిచిపోగా.. తాజాగా ఎల్రక్టానిక్స్కు మినహాయింపు లభించింది. కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్టాప్సహా పలు ప్రొడక్టులపై కొత్త టారిఫ్లను ఎత్తివేశారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు. టోక్యో ఎల్రక్టాన్, శామ్సంగ్ ఎల్రక్టానిక్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. మార్చిలో చైనా ఎగుమతులు 12 శాతంపైగా పుంజుకున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. బాండ్లు, కరెన్సీపై.. తాజాగా 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.47 శాతానికి బలపడింది. ఒక దశలో 4.58 శాతానికి ఎగసింది. వారంక్రితం 4.01 శాతంగా నమోదైంది. వెరసి ట్రేడ్ వార్ కారణంగా యూఎస్ వెలుపలి ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లను విక్రయిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నష్టాలను కవర్ చేసుకునే బాటలో హెడ్జ్ ఫండ్స్ సైతం బాండ్లను విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లపై అటూఇటుగా వ్యవహరిస్తుండటంతో ప్రపంచ దేశాలలో రక్షణాత్మకంగా భావించే యూఎస్పై విశ్వాసం తగ్గే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది మరోవైపు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో న్యూ యార్క్ కామెక్స్లో ఔన్స్ బంగారం తాజాగా 3,261 డాలర్లను తాకింది. ద్రవ్యోల్బణం.. ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మార్చి గణాంకాలు అంచనాలకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభా వాన్ని చూపనున్నట్లు భావిస్తున్నారు. ఫలితంగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానాల్లో స్వేచ్చగా వ్యవహరించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.శుక్రవారం సెలవు గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(18న) స్టాక్ మార్కెట్లతోపాటు కమోడిటీ మార్కెట్లు సైతం పనిచేయవు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయలేదు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఈ వారం పలు దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలు ప్రకటించనున్నాయి. 15న ఇరెడా, ఐసీఐసీఐ ప్రు, 16న స్వరాజ్ ఇంజిన్స్, విప్రో, 17న హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏఎంసీ, ఇన్ఫోసిస్, టాటాఎలక్సీ, 18న మాస్టెక్, 19న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకుల పనితీరు వెల్లడికానుంది. -
కొనుగోళ్లకే ఎఫ్పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
ఎకో హోటల్స్లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్మైట్రిప్ బ్రాండ్తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్స్టార్కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
కారట్లేన్లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్లేన్లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్లేన్లో తమ వాటా 98.28 శాతానికి జంప్చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
ఆ నిర్మాత ఇంటి పక్కనే బంగ్లా కొన్న ఊర్వశి రేటెంతో తెలుసా..!
-
అక్షయ తృతీయ..కళ్ళు చెదిరే ఆఫర్స్
-
యాక్సెంచర్ చేతికి ఫ్లూచురా
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సర్వీసుల దిగ్గజం యాక్సెంచర్.. బెంగళూరు కంపెనీ ఫ్లూచురాను కొనుగోలు చేయనుంది. ఇండస్ట్రియల్ కృత్రిమ మేధ(ఏఐ) సేవలందించే ఫ్లూచురా 110 మంది నిపుణుల(ప్రొఫెషనల్స్)తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తయారీ, ఇతర ఆస్తుల ఆధారిత కంపెనీలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ డేటా సైన్స్ సర్వీసులు సమకూరుస్తున్న ఫ్లూచురాను సొంతం చేసుకోనున్నట్లు యాక్సెంచర్ తాజాగా పేర్కొంది. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో తమ ఇండస్ట్రియల్ ఏఐ సర్వీసులు మరింత పటిష్టంకానున్నట్లు యాక్సెంచర్ తెలియజేసింది. వీటి ద్వారా ప్లాంట్లు, రిఫైనరీలు, సప్లై చైన్ల పనితీరును మెరుగుపరచనున్నట్లు వివరించింది. అంతేకాకుండా క్లయింట్ల నెట్జీరో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు దోహదపడనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గోపీనాథన్ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! -
'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..'
లక్నో: అంబానీ, అదానీ దేశంలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు, మీడియాను కొన్నట్లుగా రాహుల్ గాంధీని కొనలేరని వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధీ. తన సోదరుడు వారియర్ అని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోని సరిహద్దులో ఘన స్వాగతం పలికారు ప్రియాంక. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు. దాదాపు 3,000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన తన సోదరుడ్ని చూస్తే గర్వంగా ఉందని ప్రియాంక అన్నారు. రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెట్టిందని, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయిందని పేర్కొన్నారు. తన సోదరుడు యుద్ధవీరుడని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీషర్ట్లోనే కన్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన టీషర్టే ధరించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ విషయంపై ప్రియాంక స్పందిస్తూ తన సోదరుడికి సత్యం అనే రక్షణ కవచం ఉందని, అందుకే చలికాలంలో టీషర్టులు ధరించినా అతనికి ఏమీ కాదని పేర్కొన్నారు. मेरे भाई सत्य का कवच पहनकर चल रहे हैं। : @priyankagandhi जी#BharatJodoYatra pic.twitter.com/chp3baB0Pb — Congress (@INCIndia) January 3, 2023 కాంగ్రెస్కు పునరుత్తేజం తీసుకురావడమే లక్ష్యంగా సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 150 రోజులు, 3,500 కిలోమీటర్లు కవర్ చేస్తూ కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుంది. రాహుల్ పాదయత్రలో పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో కొనసాగుతోంది. చదవండి: 'మహిళలంటే పార్టీలో గౌరవం లేదు..' బీజేపీకి నటి గుడ్బై.. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్ఫోలియో కంపెనీ కోహేన్స్ను సువెన్లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్కేర్లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మాస్క్
-
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్వే ఎడిషన్ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్లాండ్కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్లో న్యూ ఓర్లిన్స్లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. 5384 చదరపు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్సిరీస్లో కనిపించింది. -
రూ.10 నాణేలతో లక్షలు ఖరీదు చేసే కారు...కారణం వింటే షాక్ అవుతారు
ఇంతవరకు తమకు నచ్చిన స్కూటీ, లేదా మంచి ఖరీదు చేసే బైక్ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ ఇక్కడొక వ్యక్తి వారిలానే నాణేలను పోగుచూసి తన కలల కారుని కొనుకున్నాడు. కానీ అతను వారందరికీ భిన్నం. పైగా అతను ఎందుకు అలా చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను సుమారు రూ. 6 లక్షలు పోగుచేసి వాటితో తనకు నచ్చిన కారుని కొనుకున్నాడు. ఐతే మొదటగా ఆ షాప్ డీలర్ ఈ రూ. 10 నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు అంగీకరించ లేదు. వెట్రివేల్ ధృడ నిశ్చయం విని షాప్ డీలర్ ఈ విక్రయానికి అంగీకరించాడు. ఇంతకీ అతను ఎందుకు ఏకంగా రూ. 6 లక్షల రూ. 10 నాణేలను పోగు చేశాడంటే...అతని తల్లి ఒక దుకాణం నడుపుతుంటుందని చెప్పాడు. ఐతే కస్టమర్లు రూ. 10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించాడంతో చాలా పెద్ద మొత్తంలో రూ.10 నాణేలు ఉండిపోయాయి. పైగా పిల్లలు కూడా ఆ రూ. 10 నాణేలు విలువ లేనివని ఆడుకోవడం చూశానని చెప్పాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలతోనే కారు కొనుక్కుని చూపి.. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నట్లు తెలిపాడు. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడూ ఎందుకు బ్యాంకులు స్వీకరించడంలేదంటూ ప్రశ్నించాడు. తాను ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలు విలువైనవేనని చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ పని చేశానని చెప్పాడు. అందుకోసం తాను దాదాపు నెలరోజులకు పైగా పది రూపాయల నాణేలను రూ. 6 లక్షలు పోగుచేశానని చెప్పుకొచ్చాడు. (చదవండి: సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్) -
లగ్జరీ కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్ఆర్ఆర్తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Volvo Car India (@volvocarsin) -
గూగుల్ చరిత్రలో మరో అతి పెద్ద డీల్..!
ప్రముఖ టెక్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ మరో అతి పెద్ద భారీ డీల్ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్గా నిలిచే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు పోటీగా..! గూగుల్ సమీప టెక్ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్ డాలర్లతో గూగుల్ కైవసం చేసుకుంది. మరింత వేగంగా..! మాండియంట్ ఇంక్ కొనుగోలుతో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ కోసం 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్తో మాండియంట్ ఇంక్ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.! -
ఖరీదైన బైక్ కొన్న బిగ్బాస్ బ్యూటీ.. ధర ఎంతంటే..
Bigg Boss 5 Lahari Shari Buys Expensive BMW Bike, Video Goes Viral: బిగ్బాస్ సీజన్-5లో లేడీ అర్జున్రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షోతో బోలెడంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్బాస్ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మొత్తానికి ఈ బైక్ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్ సౌండ్ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆనీ మాస్టర్ సహా పలువురు లహరికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్కి చెందిన ఈ బైక్ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్..! విదేశీ కంపెనీను కొనుగోలుచేసిన రిలయన్స్..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ వచ్చే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీరంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ అక్టోబర్ 10న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్జెటి) యాక్సెస్తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తయారీలో దిగ్గజ ప్లేయర్గా మారడానికి ఆర్ఐఎల్ పనిచేస్తోంది. 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. చదవండి: టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్లో... -
టాటాల తరువాత జెస్ట్డయిల్ వేటలో రిలయన్స్ ఇండస్ట్రీస్
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ డయల్ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్ డాలర్లతో జస్ట్డయల్ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్ డయల్కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్ మార్కెట్లో రిలయన్స్ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్ డయల్ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్ డయల్ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. 2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్డయల్ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్డయల్ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్డయల్ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది. -
మైక్రోసాఫ్ట్ బిగ్ ప్లాన్స్ : భారీ కొనుగోలుకు సన్నాహాలు
వాషింగ్టన్: ప్రముఖ మెసేజింగ్ సైట్ డిస్కార్డ్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పావులు కదుపుతోంది. డిస్కార్డ్ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లతో డిస్కార్డ్ను కొనుగోలు చేయాలనుకుంటునట్లు సమాచారం. చాలా సంస్థలు డిస్కార్డ్ ను కొనేందుకు ప్రయత్నిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ముందు వరుసలో ఉందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇరు కంపెనీల ప్రతినిధులు కొనుగోలు విషయంపై క్లారీటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్, గిట్ హబ్, మైన్క్రాఫ్ట్ను కొనుగోలు చేసింది. ఈ వేదికలు కేవలం ప్రొఫెషనల్స్ కు మాత్రమే అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ సోషల్ మీడియా సైట్ ను సొంతం చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.గతంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్టాక్ను సొంతం చేసుకోవాలకున్న, అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే డిస్కార్డ్ పై దృష్టి పెట్టింది. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్తో యూజర్లకు వీడియో, వాయిస్, టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ కరోనా మహమ్మారి సమయంలో అత్యంత ప్రజాదరణ పొందింది.100 మిలియన్లకు పైగా యూజర్లను డిస్కార్డ్ కలిగి ఉంది.ప్రముఖ గేమింగ్ బ్రాండ్ ఎక్స్ బాక్స్ కు రూపకల్పన చేసింది డిస్కార్డే. గత ఏడాది డిసెంబరు వరకు కంపెనీ విలువ 7 బిలియన్ల డాలర్లకు చేరింది.అంతేకాకుండా దీనిని ఐపీవో కంపెనీగా మార్చాలని నిర్వహకులు భావిస్తున్నారు. గతంలో డిస్కార్డే ఏపిక్ గేమ్స్, అమెజాన్ కంపెనీలతో చర్చలు జరిపింది. (చదవండి: గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!) -
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్లో భారత్ ఫోర్జ్, కెమ్కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్ఫెర్ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్డౌన్తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్ను కేటాయించడమైంది. -
జెఫ్పారీస్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..! 1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్లో పైప్స్లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది. 2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది. 3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది. -
3రంగాల నుంచి 3స్టాక్ సిఫార్సులు
మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ షేర్లు క్యాచ్ అప్ ర్యాలీకి సిద్ధమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు వినయ్ రజనీ అంటున్నారు. ఇప్పటికి వరకు లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ ర్యాలీకి సహకరించాయని ఆయన్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ర్యాలీ చేసేందుకు మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డైలీ ఛార్ట్ల్లో నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కన్సాలిడేషన్ ప్యాట్రన్ నుంచి బయటపడేందుకు రజనీ అన్నారు. నిఫ్టీకి అప్సైడ్లో 9,970 నిరోధాన్ని, దాన్ని అధగమిస్తే 10,550 వద్ద తదుపరి నిరోధాన్ని కలిగి ఉంది. డౌన్సైడ్లో 9500, 9580 వద్ద కీలకమైన మద్దతు స్థాయిలను కలిగి ఉన్నాయని రజనీ తెలిపారు. డైలీ ఛార్ట్లో 9,889 వద్ద ఉన్న కీలకమైన నిరోధాన్ని అధిగమించింది. ఇది రోజువారీ ఛార్ట్లో హయ్యర్ టాప్, హయ్యర్ ఫార్మేషన్ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 3రంగాల నుంచి చెందిన 3 షేర్లు సిఫార్సు చేస్తున్నారు. 1.షేరు పేరు: అపోలో టైర్స్ టార్గెట్ ధర: రూ.118 స్టాప్ లాస్: రూ.96 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: గత 4వారాలుగా కనిపించిన కన్షాలిడేషన్ ప్యాట్రన్ నుంచి షేరు బయటపడింది. బోలింగర్ ఎగువ బ్యాండ్పై ముగిసింది. ఇది అప్ట్రెండ్లో మూమెంటంకు సంకేతం. అటో రంగానికి చెందిన షేర్లు అవుట్ఫర్ఫామ్ చేస్తున్నాయి. తాజాగా అటో యాన్సలరీ , టైర్ స్టాకుల ఛార్ట్లో అప్ట్రెండ్ను సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఛార్ట్స్లో ఇండికేటర్లు, ఓస్కిలేటర్లు బుల్లిష్గా మారాయి. 2.షేరు పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టార్గెట్ ధర: రూ.96 స్టాప్ లాస్: 78 అప్ సైడ్: 11శాతం విశ్లేషణ: 2020 మార్చి 29 ముగిసిన నెలవారీ ఛార్ట్లో బుల్లిష్ హ్యమర్ క్యాండింల్ స్టి్క్ ప్యాట్రన్ను నమోదు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం బాటమ్ నుంచి బయటపడింది. అలాగే అయిల్ మార్కెటింగ్ కంపెనీల ఛార్ట్ల్లో మరింత పెరిగే సంకేతాలు కన్పిస్తాయి. ఈ షేరు షార్ట్-టర్మ్ మూవింగ్ రిసిస్టెంట్ దాటి ముగిసింది. ఇది రోజువారీ చార్టులలో రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా నమోదైంది. 3.షేరు పేరు: కేడిలా హెల్త్కేర్ టార్గెట్ ధర: రూ.375 స్టాప్ లాస్: రూ.333 అప్ సైడ్: 7శాతం విశ్లేషణ: ఇటీవల మార్కెట్ పతనం నుంచి ఫార్మా షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. అలాగే మార్కెట్ బుల్లిష్ ర్యాలీలో బలమైన ర్యాలీని ప్రదర్శిస్తున్నాయి. చివరి 8వారాలుగా ఈ షేరు చాలా తక్కువ వాల్యూమ్స్తో కన్సాలిడేషన్ను చూస్తోంది. వీక్లీ, డైలీ ఛార్ట్స్లో మూవింగ్ యావరేజ్, ఓస్కిలేటర్ సెటప్లు బలంగా ఉన్నాయి. ఈ స్టాక్ దాని మూమెంటంను తిరిగి పొందుతుంది. -
స్వల్పకాలంలో 13శాతం ర్యాలీ చేసే 3స్టాక్లు ఇవే..!
స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప గ్యాప్ అప్తో మొదలైంది. అయితే ప్రారంభంలో అనూహ్య కొనుగోళ్లతో సూచీలు భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒకదశలో 400 పాయింట్ల లాభపడి 30,596.17 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 9వేల స్థాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 స్టాక్లకు ‘‘బై’’ రేటింగ్ను కేటాయించారు. ఈ మూడు షేర్లు స్వల్పకాలంలో 13శాతం వరకు ర్యాలీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. షేరు పేరు: మారికో బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.354 స్టాప్ లాస్: 285 అప్సైడ్: 13.40శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ చార్టులలో హయ్యర్ హై.., హయ్యర్ బాటమ్ ఫార్మాషన్ ఏర్పాటుతో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా షేరు 100 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.306 వద్ద, అలాగే 200 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.323 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. బోర్డర్ స్ట్రక్చర్పై..., స్టాక్ డైలీ ఛార్ట్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నమూనా ఏర్పాటు చేసింది. ప్యాట్రన్ ఫార్మేషన్ నెక్లైన్పై తాజా బ్రేక్ అవుట్ అంచనా ఉంది. అదనంగా, మూమెంటమ్ ఇండికేటర్స్, ఓసిలేటర్స్ డైలీ, వీక్లీ స్కేల్ పై సానుకూల సంకేతాలను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.285 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.354 టార్గెట్ ధరగా రూ.310-312 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడెక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.627 స్టాప్ లాస్: రూ.505 అప్సైడ్: 12.77శాతం విశ్లేషణ: రూ.485 వద్ద సపోర్ట్ తీసుకున్న తర్వాత, షేరు వీ-ఆకారపు రీకవరీని తీసుకుంది. మరోసారి రూ.550 ధరను అధిగమించిన తర్వాత వెనక్కి వచ్చింది.ప్రస్తుత దశలో, ఈ స్టాక్ డైలీ చార్టులలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్స్ను ఏర్పాటు చేసింది. స్వల్ప హయ్యర్ వాల్యూమ్లతో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది స్టాక్స్లో లాంగ్-బిల్డప్ నిర్మాణాన్ని సూచిస్తుంది. షేరు ధరలో తరువాత అప్స్వింగ్ ఉంటుందని మూమెంటమ్ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.505 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.627 టార్గెట్ ధరగా రూ.రూ.550-553 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. షేరు పేరు: భారతి ఇన్ఫ్రాటెల్ బ్రోకరేజ్ సంస్థ: ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.240 స్టాప్ లాస్: 185 అప్సైడ్: 11.63శాతం విశ్లేషణ: సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాట్రన్కు పైన బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత షేరులో తదుపరి కొనుగోళ్లను చూస్తున్నాము. ఈ వారం, స్టాక్ డైలీ ఇంటర్వెల్లో 100రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడైంది. ఇది ధరలలో స్వల్పకాలిక రివర్సల్ను, రాబోయే సెషన్లలో మరింత అప్సైడ్ ట్రెండ్ను సూచిస్తుంది. కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.185 స్టాప్లాస్గా పెట్టుకొని రూ.240 టార్గెట్ ధరగా రూ.రూ.205-210 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం. -
‘యస్’ వాటాల కొనుగోలుకు ఎస్బీఐ ఆమోదం
సాక్షి, ముంబై: యస్ సంక్షోభం, ఆర్బీఐ డ్రాప్ట్ ప్లాన్ల తదితర పరిణామాల నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్బీఐ బోర్డు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్బీఐ వద్దకు చేరిందని తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ బృందం కృషి చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫైనల్ నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల కాలానికి తమ రూ.5500 కోట్లుగా (26 శాతం) వుంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడుల నిమిత్తం దేశీయ, అంతర్జాతీయంగా 23 మంది పెట్టుబడిదారులు తమను సంప్రదించారని ఎస్బీఐ చైర్మన్ చెప్పారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందని ఆ లోపు ఆర్బీఐ ముందు ఉంచుతామని చైర్మన్ చెప్పారు. 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్ధం చేస్తామని, ఇందుకు 24 గంటలూ పని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకులో నగదు పూర్తి భద్రంగా వుంటుందని యస్ బ్యాంకు కస్టమర్లు, డిపాజిట్దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చినవిషయాన్ని ఆయన మరో సారి గుర్తు చేశారు. అలాగే ఎస్బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం వుండబోదమని ఆయన స్పష్టం చేశారు. చదవండి : ‘యస్’ సంక్షోభం : రాణా కపూర్కు లుక్ అవుట్ నోటీసు -
వాటా కొనుగోలు : యస్ బ్యాంకుకు ఊరట
సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు యస్ బ్యాంకు కానీ, ఇటు ఎస్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గృహరుణంపై వడ్డీ రాయితీ 2020 మార్చి వరకూ...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద మధ్యాదాయ వర్గాల (ఎంఐజీ) వారికి ఇస్తున్న క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని (సీఎల్ఎస్ఎస్) 2020 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం కూడా చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద గృహ రుణం తీసుకున్న వారికి రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని ఇస్తారు. డిసెంబర్ 30 నాటికి 3,39,713 మంది లబ్ధిదారులు సీఎల్ఎస్ఎస్ను వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు. తొలుత వడ్డీ రాయితీతో కూడిన రుణ పథకాన్ని 2017 డిసెంబర్ వరకు ఏడాది కాల పరిమితితో కేంద్రం తీసుకొచ్చింది. నూతన నిర్మాణం, తిరిగి కొనుగోలు చేసే గృహాలపైనా దీన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత దీన్ని 2019 మార్చి వరకు పొడిగించింది. తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. వార్షికంగా రూ.6– 12 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 20 ఏళ్ల కాలానికి సంబంధించి రూ.9 లక్షల రుణం మొత్తంపై 4 శాతాన్ని రాయితీగా పొందొచ్చు. రూ.12– 18 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి వడ్డీ రాయితీ మూడు శాతమే లభిస్తుంది. -
సన్ ఫార్మా చేతికి జపాన్ పోలా ఫార్మా
న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా... జపాన్కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్ చేస్తున్నామని సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ కీర్తి గనోర్కార్ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్ ఫార్మా జపాన్ హెడ్ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు. పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... పోలా ఫార్మా కంపెనీ జపాన్లో జనరిక్, బ్రాండెడ్ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. సన్ ఫార్మా కంపెనీ జపాన్ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్ ఫార్మా జపాన్ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్ ఫార్మా మార్కెట్ 8,480 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్ ఫార్మా మార్కెట్ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
ఇల్లు కొంటున్నారా?
‘ఇల్లు మన ఆశలు, ఆకాంక్షలు, అభిరుచికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటాం. నగరాల్లో ఇప్పటి బిజీ లైఫ్లో ఎవరి ఇల్లు వాళ్లు కట్టుకోవడం ఊహకే అందదు. పైగా మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ హవా నడుస్తున్న పరిస్థితుల్లో తప్పని సరిగా బిల్డర్ను వెతుక్కోవలసిందే. 1. ఇల్లు కట్టించుకోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ముందుగా బిల్డర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. ఎ. అవును బి. కాదు 2. బ్రోచర్లో సూచించిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారా లేదా అని, ముందుగా పూర్తి చేసిన వెంచర్స్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ల ద్వారా (అడ్వాన్సు ఇవ్వడానికి ముందే) తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. కొనుగోలు దారులకు చూపించడానికి కట్టిన మోడల్ ఫ్లాట్ను నిశితంగా పరిశీలిస్తారు. అందులో ఇంటీరియర్ డెకరేషన్ను కాకుండా నిర్మాణంలో నాణ్యతను గమనిస్తారు. ఎ. అవును బి. కాదు 4. నిర్మాణానికి ప్రభుత్వశాఖల నుంచి అన్ని ఆమోదాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. నిర్మాణ దశలో స్వయంగా వెళ్లి బ్రోచర్లో చెప్పిన క్వాలిటీ పరికరాలను వాడుతున్నారా అని చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఇంట్లోకి చేరేముందుగానే కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. పైకి కనిపిస్తున్న ధరలతోపాటు అంతర్లీనంగా ఉన్న చెల్లింపుల వివరాలను ముందుగానే బిల్డర్ను అడిగి స్పష్టంగా తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. మీకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూనిట్, సోలార్ ఎక్విప్మెంట్ అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి తగిన విలువను రాబట్టుకోవడం తెలుసు. ‘బి’లు ఎక్కువైతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అరకొర సౌకర్యాలతో ఏదో ఒకలా పూర్తయిందనిపించిన ఇంటిని స్వాధీనం చేసుకుంటే తర్వాత ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే !
ప్రొద్దుటూరు :‘‘రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం నాఫెడ్ ద్వారా కొనగా మిగిలే కందులను రాష్ట్రమే సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 45వేల టన్నుల కందుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చింది, అదనంగా 55వేల టన్నులు కొనుగోలు చేయాలని కోరినా అంగీకరించలేదు. కందుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి గత సోమవారం అమరావతిలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అయితే గురువారం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. దీంతో రైతులు మంత్రుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విమర్శిస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ అధికారులు మినుముల కొనుగోలుకు సం బంధించి కడప మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా కందుల కొ నుగోలుకు కడప, రాయచోటి, ఎర్రగుంట్ల, శనగ కొనుగోలుకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో వ్యాపారులు మినుములు అమ్ముతున్నారని అధికారులు బుధవారం కడప మార్కెట్ యార్డులో దాడులు చేయడంతో అక్కడ కొనుగోలు తాత్కాలికంగా నిలిపేశారు. మిగతా కొనుగోలు కేంద్రాలతో పోల్చితే చివరగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగలు, కందులు, మినుములు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ముందే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందనే విషయం తెలుసుకున్న రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకోవాలని ఆశతో వచ్చారు. కందులు, మినుములు క్వింటాలు ధర బయట మార్కెట్లో రూ.4వేలు మాత్రమే ఉండగా కొనుగోలు కేంద్రంలో కందులు రూ.5,450, మినుములు రూ.5,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, లింగాల, వేంపల్లి తదితర దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొనుగోలు కేంద్రంలోని డీసీఎంఎస్ అధికారులు ససేమిరా అంగీకరించలేదు. కేవలం శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉండటంతో టోకన్లు ఇస్తున్నామని, తొలి రోజు కందుల కొనుగోలుకు టోకన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పై అధికారుల అనుమతి వచ్చేంత వరకు కందులు, మినుములను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో రైతులు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారుల హవా నడుస్తోందని, ఈ కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత్కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
ఓలా చేతికి ఫుడ్పాండా: భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఫుడ్పాండా భారత వ్యాపార్యాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఓలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్కు చెందిన డెలివరీ హీరో గ్రూప్ నుంచి ఫుడ్పాండా భారత వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఓలా ప్రకటించింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆహారపదార్ధాల వ్యాపారం ఓలాకు బదిలీ అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్ల బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు. 2014 లో, ఓలా కేఫేతో ఓలా ఆహార పంపిణీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తన సేవలను విస్తరించింది. తరువాత మూసివేసింది. అయితే ఉబెర్ ఈట్స్కు పోటీగా ఫుడ్ పంపిణీ వ్యాపారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో ఫుడ్పాండాను కొనుగోలు చేయడం కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్లైన ఫుడ్ సర్వీసుల సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి. ఇండియాలో ఫుడ్ సర్వీసులను మరింత అభివృద్ధి చేసే కృషిలో ఈ భాగస్వామ్యంపై సంతోషిస్తున్నామని, ఫుడ్ పాండా ఇండియాలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. తమ తాజా భాగస్వామ్యం మార్కెట్ల ఏకీకరణకు అనుమతిస్తుందని డెలివరీ హీరో గ్రూపు సహ-వ్యవస్థాపకుడు, సీఈవో నిక్లాస్ ఓస్టర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓలాలో తమ వాటా చాలా విలువైన ఆస్తిగా పరిగణిస్తామన్నారు. -
రైతుల ఆందోళన కనపడదా: డీకే అరుణ
పంటలు కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళన పడుతున్నారని, రైతుల గోస టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనపడదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. రైతును రాజు చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వేరుశనగ ధర గతేడాది ఇదే సమయంలో క్వింటాలుకు రూ.4,600 ఉందని, ఇప్పుడు గద్వాల మార్కెట్లో రూ.1,600కే కొంటున్నారని అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గూగుల్ చేతికి హాలీ ల్యాబ్స్
న్యూఢిల్లీ: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ .. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ హాలీ ల్యాబ్స్ను ’ఆక్వి–హైరింగ్’ ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. భారత్లో గూగుల్ ఏదైనా సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కొత్త యూజర్లకి ఇంటర్నెట్ను చేరువ చేసేందుకు హాలీ ల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడనుంది. గూగుల్కి చెందిన నెక్స్ట్ బిలియన్ యూజర్స్ టీమ్లో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషంగా ఉందని హాలీ ల్యాబ్స్ తమ బ్లాగ్లో పేర్కొంది. ఏదైనా కంపెనీ అందించే ఉత్పత్తులు, సర్వీసుల కన్నా.. అందులోని సిబ్బంది కోసమే కొనుగోలు చేయడాన్ని ఆక్వి–హైరింగ్గా వ్యవహరిస్తారు. గూగుల్ ఇటీవలి కాలంలో కంపెనీల కొనుగోలు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
స్నాప్డీల్కి ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’.. స్నాప్డీల్కు అతిత్వరలోనే మరొక ఆఫర్ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్డీల్, సాఫ్ట్బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది. -
అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్కార్ట్తో స్నాప్డీల్ చర్చలు న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో తీవ్ర పోటీలో స్నాప్డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించిన స్నాప్డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది. -
బుక్మైషో చేతికి బర్ప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెట్ సేవల సంస్థ బుక్మైషో (బీఎంఎస్) తాజాగా ముంబైకి చెందిన బర్ప్ సంస్థను కొనుగోలు చేసింది. స్థానిక రెస్టారెంట్ల సమాచార వివరాలు అందించే ఈ సంస్థను నెట్వర్క్18 నుంచి దక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ బిగ్ట్రీలో భాగమైన ఫుడ్ఫెస్టా వెల్కేర్ ద్వారా ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నెట్వర్క్18కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్ కాగా.. బీఎంఎస్ బిగ్ట్రీ నిర్వహణలో ఉంది. 2006లో ప్రారంభమైన బర్ప్లో ప్రస్తుతం 12 నగరాల్లోని 56,000 పైచిలుకు రెస్టారెంట్లు లిస్ట్ అయి ఉన్నాయి. 2016–17లో సంస్థ ఆదాయం రూ. 56.67 లక్షలు. నెట్వర్క్18 టర్నోవర్లో ఇది 0.69 శాతం. 2017 మార్చి ఆఖరు నాటికి బర్ప్ నికర విలువ మైనస్ రూ. 28.89 కోట్లుగా ఉంది. స్లంప్ సేల్ ప్రాతిపదికన కన్సల్టెన్సీ సంస్థ ఈవై.. బర్ప్ విలువను రూ. 6.7 లక్షలుగా లెక్కగట్టినట్లు నెట్వర్క్18 పేర్కొంది. -
బిగ్ బాస్కెట్పై అమెజాన్ కన్ను!
ప్రాథమిక స్థాయిలో చర్చలు న్యూఢిల్లీ: అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నిత్యావసర సరుకుల విక్రయ ఆన్లైన్ సంస్థ బిగ్బాస్కెట్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇవి ఫలవంతం కావొచ్చు లేక కాకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూపర్మార్కెట్ గ్రాసరీ సప్లైస్ సంస్థలో భాగమైన బిగ్బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన అబ్రాజ్ గ్రూప్, హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన ఇన్వెస్టర్ల నుంచి గతేడాది 150 మిలియన్ డాలర్లు సమీకరించింది. కొత్తగా గిడ్డంగుల ఏర్పాటుకు, డెలివరీ నెట్వర్క్ను పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ట్రైఫెక్టా క్యాపిటల్ నుంచి మరో 7 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆదాయాలు గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న బిగ్బాస్కెట్ ఇప్పటికే రెండు నగరాల్లో బ్రేక్ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ భారత్లో భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. -
అలీబాబా పిక్చర్స్కి టికెట్న్యూలో మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ టికెట్న్యూలో చైనాకి చెందిన అలీబాబా గ్రూప్ సంస్థ అలీబాబా పిక్చర్స్ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో తమ కార్యకలాపాలు, సర్వీసుల పోర్ట్ఫోలియో మరింత పటిష్టం కాగలదని టికెట్న్యూ పేర్కొంది. అలీబాబా విడతలవారీగా రూ. 120 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు టికెట్న్యూ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్కుమార్ నమ్మాళ్వార్ తెలిపారు. ఈ డీల్తో తమ సిబ్బందికి, కంపెనీకి ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. 2007లో రామ్కుమార్ నమ్మాళ్వార్ .. టికెట్న్యూని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. -
ఎన్డీటీవీనీ రాందేవ్ బాబా కొంటున్నారా?
ముంబై: ఒకవైపు ఎన్డీటీవీపై సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఎన్డీవీని కొనుగోలు చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈవార్తలను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ నిధి రాజ్దాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. Fake news from @e4mtweets: https://t.co/sc9JdSKGxD — VISHAL (@VishalManve12) June 5, 2017 Hello people, Ramdev is not buying NDTV. Thank you — Nidhi Razdan (@RazdanNidhi) June 5, 2017 -
అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు. ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. -
అక్షయ తృతియ: ఒక్క రూపాయికే బంగారం!
న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత అలీబాబాకు చెందిన పేటీఎం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎం మరో కొత్తరకం సర్వీసులతో మన ముందుకు వచ్చింది. ఇంకా ఒక్క రోజుల్లో అక్షయ తృతీయ కావడంతో, ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం 'డిజిటల్ గోల్డ్' ను లాంచ్ చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను కస్టమర్లకు అందించనుంది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎం పేర్కొంది. తమ పేటీఎం మొబైల్ వాలెట్స్ ను వాడుకుంటూనే వినియోగదారులు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని ఆన్ లైన్ లో కొనుకోవచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ చెప్పింది. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ సెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చట. బంగారానికి భారతీయుల పెట్టుబడుల సాధనంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, బంగారంలో డిజిటల్ గా పెట్టుబడులు పెట్టడానికి తాము సులభతరంగా సేవలందిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మార్కెట్ ఆధారిత ధరలతోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ బంగారాన్ని అమ్మడానికి, కొనడానికి కస్టమర్లకు అవకాశముంటుందన్నారు. ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుక్కునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తామని విజయ్ శేఖర్ చెప్పారు. 20వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను అందించాల్సినవసరం ఉండదు. -
ఫ్లిప్‘కార్ట్’లోకి ఈబే ఇండియా?
⇒ భారత విభాగం విక్రయంపై ఈబే చర్చలు ⇒ ఫ్లిప్కార్ట్లో మైనారిటీ వాటాలు కొనుగోలు యోచన ⇒ 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి ప్రతిపాదన ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం కన్సాలిడేషన్ పర్వం నడుస్తోంది. ఇప్పటికే స్నాప్డీల్ విక్రయం వార్తలు నడుస్తుండగా.. తాజాగా ఈబే కూడా ఈ జాబితాలో చేరింది. మార్కెట్లోకి ప్రవేశించి దశాబ్దం పైగా దాటిపోయినా.. ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోయిన ఈబే తాజాగా తమ భారత విభాగాన్ని మరో ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిపాదిత డీల్ ప్రకారం ఫ్లిప్కార్ట్లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం 1.5–2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. ఒకప్పుడు 15 బిలియన్ డాలర్ల పైగా పలికిన ఫ్లిప్కార్ట్ వేల్యుయేషన్ తాజా నిధుల సమీకరణ సమయంలో సుమారు 11 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గిపోయింది. ప్రస్తుతం సమీకరిస్తున్న పెట్టుబడులు.. అత్యంత వేగంగా విస్తరిస్తున్న అమెజాన్కి గట్టి పోటీనిచ్చేందుకు ఫ్లిప్కార్ట్కి చాలా కీలకం కానున్నాయి. సంపన్న మార్కెట్లపై దృష్టి.. ప్రస్తుతమున్న చాలా మటుకు ఈకామర్స్ సంస్థల కన్నా ముందుగా భారత మార్కెట్లోకి ఈబే అడుగుపెట్టినప్పటికీ.. అంతగా విజయవంతం కాలేకపోయింది. 2004లో బాజీడాట్కామ్ను కొనుగోలు చేసిన ఈబే 2005లో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ కొనుగోలుదారులకు పెద్దగా చేరువకాలేకపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలే కాకుండా చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్నాప్డీల్, పేటీఎం, షాప్క్లూస్ వంటి సంస్థలు కూడా దూసుకెడుతుండగా.. ఈబే మాత్రం రాణించలేక చతికిలబడింది. 2015లో రూ. 172 కోట్లు, గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ. 262 కోట్ల మేర నష్టాలు నమోదు చేసింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్న ఈబే ప్రధానంగా మళ్లీ అమెరికా, యూరప్ వంటి సంపన్న మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. భారత్ మార్కెట్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే, అలాగని పూర్తిగా వైదొలగాలని కూడా భావించడం లేదు. ఫ్లిప్కార్ట్లో పెట్టుబడుల ద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో ఎంతో కొంత వాటాలతో కొనసాగాలని ఈబే యోచిస్తోంది. దూకుడుగా అమెజాన్ .. అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ గతేడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2030 నాటికి ఇది 228 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించడంపై అమెజాన్ దూకుడుగా ఉంది. దాదాపు 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. దేశీయంగా సీ2సీ ఈ–కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం క్వికర్, ఓఎల్ఎక్స్ సంస్థలు ఇందులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్నాప్డీల్ ఇటీవలే షాపో సంస్థను మూసివేయడం ద్వారా ఈ విభాగం నుంచి వైదొలిగినప్పటికీ.. అమెజాన్ మాత్రం ఈ మార్కెట్పై ఆశావహంగా ఉంది. మరోవైపు వివిధ మార్గాల్లో చైనాకి చెందిన ఆలీబాబా, జపాన్ సంస్థ రకుటెన్ మొదలైనవి కూడా భారత ఈ–కామర్స్ మార్కెట్లో చొరబడేందుకు పోటీపడుతున్నాయి. -
ఎయిర్టెల్ చేతికి ‘టికోనా’
♦ 4జీ వ్యాపారం కొనుగోలు ♦ డీల్ విలువ రూ.1,600 కోట్లు న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్టెల్... ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్వర్క్స్కు చెందిన 4జీ వ్యాపారాన్ని రూ.1,600 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలులో భాగంగా టికోనా సంస్థకు చెందిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 5 టెలికం సర్కిళ్లలో విస్తరించి ఉన్న 350 సైట్లు తమ పరం అవుతాయని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టికోనా సంస్థకు గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో 2,300 మోగాహెట్జ్ బ్యాండ్పై 20 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. టికోనా కొనుగోలుతో దేశంలో రిలయన్స్ జియో తర్వాత దేశవ్యాప్త 4జీ నెట్వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్టెల్ అవతరిస్తుంది. టికోనా సంస్థ కొనుగోలుతో వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలందించగలమని కంపెనీ ఎండీ, సీఈఓ (ఇండియా,దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఈ డీల్ పూర్తికాగానే ఈ ఐదు సర్కిళ్లలో 4జీ సేవలందిస్తామని తెలియజేశారు. -
ఎయిర్టెల్ మరో భారీ డీల్
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ కీలక అడుగు వేసింది. భారత్లో 4జీ ఇంటర్నెట్ సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ బ్రాడ్బాండ్ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్ను స్వాధీనం చేసుకోనుంది. టికోనా 4జీ డిజిటల్ నెట్వర్క్ బిజినెస్ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కాగా ఒకవైపు జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్ జియో సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్, ఐడియా మెగామెర్జర్ టెలికాం పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ టికోనాతో నిశ్చయాతమ్మకం ఒప్పందం చేసుకోవడం విశేషం. జియో ఎంట్రీ స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థ నిష్క్రమణకు ఉత్ర్పేరకంగా నిలిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవం: నాగార్జున ఫెర్టిలైజర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోరమాండల్ ఇంటర్నేషనల్ తమ సంస్థను కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎఫ్సీఎల్) ఖండించింది. కంపెనీ విక్రయ వార్తలు అవాస్తవాలని తెలిపింది. కంపెనీ గానీ ప్రమోటర్లు గానీ ఇందుకు సంబంధించి ఏ సంస్థతోనూ చర్చలు జరపడం లేదని ఎన్ఎఫ్సీఎల్ వివరించింది. తమకున్న వివిధ వ్యాపార విభాగాల్లో యూరియా కూడా ఒకటని తెలిపింది. గెయిల్ పైప్లైన్ ప్రమాదం కారణంగా యూరియా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని, నష్టాలు భర్తీ చేసుకునేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించింది. ప్రభుత్వం తాజాగా గ్యాస్ కేటాయింపులు జరపడంతో యూరియా ఉత్పత్తి మళ్లీ ప్రారంభించామని ఎన్ఎఫ్సీఎల్ తెలిపింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ చేతికి ఐఎస్ఎస్ఎల్
వంద శాతం వాటా కొనుగోలు ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్)కు చెందిన సెక్యూరిటీస్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్(ఐఎస్ఎస్ఎల్)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్ ఇండ్ తెలియజేసింది. తాము ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నామని, 500కు పైగా బ్రోకర్లకు సేవలందిస్తున్నామని ఐఎస్ఎస్ఎల్ కొనుగోలుతో తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని ఇండస్ఇండ్ ఎండీ, సీఈఓ రొమేశ్ సోబ్తి చెప్పారు. 3 నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందన్నారు. 2007లో ప్రారంభమైన ఐఎస్ఎస్ఎల్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్ క్లియరింగ్, డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీస్లను నిర్వహిస్తోంది. రిటైల్, సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లతో పాటు వెయ్యికి పైగా బ్రోకర్లకు సేవలందిస్తోంది. రోజుకు పది లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది. -
ఇంటెల్ చేతికి మొబైల్ఐ
15 బిలియన్ డాలర్ల డీల్ న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తాజాగా ఇజ్రాయెల్కి చెందిన సెన్సర్ కంపెనీ మొబైల్–ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ను సరఫరా చేస్తుంది. రెండు కంపెనీల సంయుక్త ప్రకటన ప్రకారం మొబైల్ఐ షేరు ఒక్కింటికి 63.54 డాలర్ల చొప్పున ఇంటెల్ ఆఫర్ చేసింది. శుక్రవారం నాటి మొబైల్ఐ షేరు ధర 47.27 డాలర్లతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. వచ్చే తొమ్మిది నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఇంటెల్ పేర్కొంది. సుమారు 40 సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ కార్ల తయారీకి సంబంధించి ఈ రెండు సంస్థలు ఇప్పటికే జర్మనీ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూతో కలసి పనిచేస్తున్నాయి. 1999లో ఏర్పాటైన మొబైల్ఐ 2007లో గోల్డ్మన్ శాక్స్ సంస్థ నుంచి 130 మిలియన్ డాలర్స్ సమీకరించింది. 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో లిస్టయింది. -
టీవీఎస్ లాజిస్టిక్స్ చేతికి యూకే కంపెనీ
డీల్ విలువ రూ.165 కోట్లు చెన్నై: టీవీఎస్ గ్రూప్కు చెందిన టీవీఎస్ లాజిస్టిక్స్ ఇంగ్లండ్కు చెందిన ఒక కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. దీని కోసం రూ.165 కోట్లు వెచ్చించామని టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎండీ, ఆర్. దినేశ్ చెప్పారు. ఎస్పీసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లోవేకియా, అమెరికా, భారత్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తం 350 మంది ఉద్యోగులున్నారు. సాంకేతికంగా, అంతర్జాతీయంగా మంచి సేవలందిస్తున్న కంపెనీలను కొనుగోలు చేయడంలో భాగంగా ఎప్పీసీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నామని వివరించారు. -
27 నుంచి ఏడో విడత బంగారు బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27న ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.20వేల వరకు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంది. అంతకుమించితే డీడీ లేదా చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత జారీ. ‘‘ఆర్బీఐతో ప్రభుత్వం సంప్రదించిన అనంతరం సౌర్వభౌమ బంగారు బాండ్లు 2016–17 ఏడో సిరీస్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్లను కేటాయిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రత్యామ్నాయ సాధనంగా సౌర్వభౌమ బంగారు బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబర్లో తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు బాండ్లను జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటిపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. బాండ్ల కాల వ్యవధి 8 ఏళ్లు కాగా, ఐదో ఏట నుంచి వైదొలగేందుకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్టాక్ ఎక్సేS్చలలో ట్రేడ్ అవుతాయి. -
ఎయిర్టెల్ గూటికి టెలినార్!
టెలినార్ ఇండియా కొనుగోలుకు ఎయిర్టెల్ ఒప్పందం... ⇒ అప్పులు, ఫీజులు కట్టేందుకు అంగీకారం... ⇒ రిలయన్స్ జియో పోటీ ఎఫెక్ట్... ⇒ టెలినార్కు ఏడు సర్కిళ్లలో 4.4 కోట్ల మంది యూజర్లు... ⇒ 11 శాతం దూసుకెళ్లిన ఎయిర్టెల్ షేరు... దేశీ టెలికం రంగంలో మరో వికెట్ పడింది. రిలయన్స్ జియో చౌక టారిఫ్ల దెబ్బకు తోడు.. స్పెక్ట్రం రేట్లు చుక్కలు చూపిస్తుండటంతో విదేశీ టెలికం కంపెనీలు భారత్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో నార్వేకు చెందిన టెలికం దిగ్గజం టెలినార్ చేరింది. తన భారత్ కార్యకలాపాలను భారతీ ఎయిర్టెల్కు విక్రయించనుంది. ఈ మేరకు టెలినార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ గురువారం ప్రకటించింది. దీంతో ఇప్పుడు దేశంలో ఒక్క జపాన్ టెల్కో డొకోమో(టాటాలతో జాయింట్ వెంచర్) తప్ప విదేశీ కంపెనీలన్నీ దాదాపు ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి వైదొలగినట్టే లెక్క!! ఇటీవలే వొడాఫోన్.. ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి టారిఫ్లను అమలు చేస్తామంటూ తాజాగా జియో ప్రకటించిన నేపథ్యంలో అంతకుముందే భారత్ టెలికం రంగంలో భారీస్థాయిలో విలీనాలు, కొనుగోళ్లకు తెరలేవడం గమనార్హం. న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్.. టెలినార్ ఇండియాను చేజిక్కించుకుంది. దేశంలో టెలినార్కు ఉన్న ఏడు సర్కిళ్లలో కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెలినార్ సౌత్ ఏషియా ఇన్వెస్ట్మెంట్స్తో ఒప్పం దం ఖరారు చేసుకుంది. డీల్ ప్రకారం ఎయిర్టెల్ టెలినార్కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. అయితే, ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లైసెన్స్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్టెల్ భరిస్తుంది. కాగా, తాజా లావాదేవీతో తమ అసెట్స్కు సంబంధించి ఎలాంటి ఇంపెయిర్మెంట్(వ్యాపార నష్టం)కూ దారితీయదని టెలినార్ ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది(2016) చివరినాటికి తమకు భారత్కు 0.3 నార్వేజియన్ క్రోన్ల విలువజేసే ఆస్తులు(స్థిర, చర, ఇతరత్రా ఆస్తులన్నీ కలుపుకుని) మిగిలినట్లు వెల్లడించింది. 12 నెలలలో ఎయిర్టెల్తో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ‘ప్రతిపాదిత కొనుగోలుతో టెలినార్ ఇండియా ఆస్తులు, యూజర్లు, ఉద్యోగులు మొత్తం మాకు దక్కుతారు. దీనివల్ల మా వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు ఏడు సర్కిళ్లలో మరింత స్పెక్ట్రం కూడా అందుబాటులోకి వస్తుంది. మొత్తంమీద ఈ డీల్తో 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్లో 43.4 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం లభిస్తుంది’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికం శాఖ, కాంపిటీషన్ కమిషన్ ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ డీల్ పూర్తవుతుంది. ఏడు సర్కిళ్లు.. 4.4 కోట్ల కస్టమర్లు భారత్లో టెలినార్.. మొదట యూనిటెక్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా యూనినార్ పేరుతో 2008లో టెలికం సేవల్లోకి అడుగుపెట్టింది. అయితే, స్పెక్ట్రం కుంభకోణం నేపథ్యంలో సుప్రీం కోర్టు అప్పట్లో ఇచ్చిన లైసెన్స్లను రద్దు చేయడంతో యూని టెక్తో జేవీకి టెలినార్ ముగింపు పలికింది. ఆ తర్వాత యూనినార్ పేరును టెలినార్గా మార్చి.. కేవలం ఏడు సర్కిళ్లలో మాత్రమే స్పెక్ట్రంను కొనుగోలు చేసి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెలినార్కు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్(తూర్పు), ఉత్తరప్రదేశ్(పశ్చిమం), అస్సాం సర్కిళ్లలో 4.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దేశీ మార్కెట్లో మొత్తం వాటా దాదాపు 2.6%గా ఉంది. 700–800 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది తొలి క్వార్టర్ నుంచే తమ భారత్ కార్యకలాపాలను విక్రయానికి ఉంచిన ఆస్తులుగా పరిగణిస్తామని.. గ్రూప్ ఆర్థిక ఫలితాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని టెలినార్ పేర్కొంది. గతేడాది టెలినార్ ఇండియా ఆదాయం 6 బిలియన్ నార్వేజియన్ క్రోన్స్(దాదాపు రూ.రూ.4,800 కోట్లు)గా నమోదైంది. 40 కోట్ల నార్వేజియన్ క్రోన్ల(దాదాపు రూ.320 కోట్లు) నిర్వహణ నష్టాలను మూటగట్టుకుంది. ఎయిర్టెల్కు ‘స్పెక్ట్రం’ జోష్... ఇక ఎయిర్టెల్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా కంపెనీకి 26.9 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు. 33% పైగా మార్కెట్ వాటాతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు టెలినార్ సబ్స్క్రయిబర్లు జతయితే, ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 30 కోట్లను మించిపోతుంది. మార్కెట్ వాటా 35.6 శాతానికి చేరుతుంది. మరోపక్క, ఏడు కీలక సర్కిళ్లలో 1,800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం లభిస్తుండటంతో(దీన్ని 4జీ సేవలకు ఎక్కువగా వినియోగిస్తారు) ఎయిర్టెల్ తన 4జీ నెట్వర్క్ను మరింతగా పటిష్టం కానుంది. జియోతో పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుంది. టెలినార్ అప్పులు, ఫీజులకు ప్రతిగా అదనపు స్పెక్ట్రం లభించడం ఎయిర్టెల్కు ప్రయోజనకరమేనని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది. డీల్ కారణంగా కంపెనీ రేటింగ్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. జియో ప్రవేశం వల్లే దేశీ టెలికంలో ఈ భారీ స్థిరీకరణ జరుగుతోందని పేర్కొంది. కాగా, గడిచిన ఐదేళ్లలో ఎయిర్టెల్కు ఇది అయిదో కొనుగోలు కావడం గమనార్హం. 2012లో క్వాల్కామ్ ఇండియా వ్యాపారాన్ని దక్కించుకుంది. 2014లో లూప్ మొబైల్ను, 2015లో ఆగెర్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఇండియాను కొనుగోలు చేసింది. ఇక గతేడాది వీడియోకాన్ టెలికం వ్యాపారాన్ని, ఎయిర్సెల్ డిష్నెట్ వైర్లెస్ను చేజిక్కించుకుంది. టెలినార్తో డీల్ నేపథ్యంలో గురువారం ఎయిర్టెల్ షేర్లు రివ్వుమన్నాయి. బీఎస్ఈలో ఒకానొక దశలో 10.93 శాతం దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని(రూ.401) తాకింది. చివరకు 1.36 శాతం మాత్రమే లాభంతో రూ.366 వద్ద ముగిసింది. టెలినార్ ఇండియా కొనుగోలుతో నెట్వర్క్ పరంగా, మార్కెట్ వాటా పరంగా పలు కీలక సర్కిళ్లలో ఎయిర్టెల్ మరింత బలోపేతం అవుతుంది. ఎయిర్టెల్ అందిస్తున్న అనేక ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవలను టెలినార్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. ఈ డీల్ ద్వారా లభించనున్న అదనపు స్పెక్ట్రంతో మా వ్యాపార కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి. – గోపాల్ విట్టల్, భారతీ ఎయిర్టెల్ (భారత్, దక్షిణాసియా) ఎండీ–సీఈఓ మా భారత్ వ్యాపారానికి తగిన దీర్ఘకాలిక పరిష్కారం లభించింది. ఎయిర్టెల్తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది. భారత్ నుంచి వైదొలగాలన్న నిర్ణయం ఏదో ఆషామాషీగా తీసుకున్నది కాదు. ఇక్కడ సేవలను మరింతగా విస్తరించాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. మరోపక్క, దీనిపై ఆశించిన మేరకు రాబడలు వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. – సిగ్వీ బ్రెకీ, టెలినార్ గ్రూప్ సీఈఓ తీవ్రమైన పోటీ.. అప్పుల భారం రిలయన్స్ జియో సంచలనాత్మక ఉచిత ఆఫర్కు తోడు.. అది ప్రకటించిన అత్యంత చౌక టారిఫ్లు దేశీ టెలికం రంగంలో పెను మార్పులకు కారణమవుతోంది. మరోపక్క, కంపెనీలకు అధిక స్పెక్ట్రం రేట్లు గుదిబండగా మారుతున్నాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీనికితోడు దేశంలో పన్ను సంబంధ, ఇతరత్రా వివాదాలు కొన్ని విదేశీ కంపెనీలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్)లో రష్యా టెలికం కంపెనీ సిస్టెమా(ఎంటీఎస్ బ్రాండ్) విలీనం అయ్యేందుకు ఓకే చెప్పింది. ఇక ఎయిర్సెల్(ప్రమోటర్ మలేసియా మాక్సిస్ గ్రూప్) ఆర్కామ్ల విలీనం కూడా త్వరలో సాకారం కానుంది. ఇదిలాఉంటే.. టాటా డొకోమో జాయింట్వెంచర్ నుంచి వైదొలిగేందుకు జపాన్ కంపెనీ డొకోమో చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా.. కోర్టు వివాదం కారణంగా ఇది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. భారత ప్రభుత్వంతో పన్ను వివాదంతో చాన్నాళ్లుగా గుర్రుగా ఉన్న బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్.. ఐడియాతో విలీనం ద్వారా ఇక్కడి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ డీల్తో ఏర్పాటయ్యే కంపెనీ దాదాపు 40 కోట్ల మంది యూజర్లతో ఎయిర్టెల్ను అధిగమించి టాప్ ర్యాంక్లోకి దూసుకెళ్తుంది. భారత్కు గుడ్బై చెప్పేస్తామంటూ సంకేతాలిస్తూ వచ్చిన టెలినార్ సైతం ఇప్పుడు దీన్ని ఖాయం చేసింది. మొత్తానికి ఒకప్పుడు పొలోమంటూ టెలికం రంగంలోకి కంపెనీలు ప్రవేశించడంతో కిక్కిరిసిన భారత్ మార్కెట్లో ఇప్పుడు మొత్తం టెల్కోల సంఖ్య దాదాపు అరడజనుకు పడిపోయే పరిస్థితి నెలకొంది. -
కొనుగోలు వార్తలతో ‘యాక్సిస్’ జోరు
యాక్సిస్ బ్యాంక్ కోసం పలు ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయన్న వార్తలతో మంగళవారం ఈ బ్యాంక్ షేరు భారీగా పెరిగింది. యాక్సిస్ను విలీనం చేసుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, యాక్సిస్ వాటాను కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇంద్ బ్యాంక్లు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయనే వార్తలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దాంతో ఈ షేర్ 5 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. కొటక్ బ్యాంక్తో విలీనమేదీ లేదని సోమవారం యాక్సిస్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ, మీడియాలో పదేపదే వార్తలు వెలువడుతుండటంతో బ్యాంక్ షేరు హఠాత్ ర్యాలీ జరిపింది. అలాంటిదేమీ లేదు..: కేంద్రం యాక్సిస్ బ్యాంక్ను విలీనం చేసుకునేందుకు, అందులో వాటా కొనుగోలుకు ఏ బ్యాంకూ తమవద్దకు ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి చెప్పారు. ఈ బ్యాంక్లో 12% వాటా ప్రభుత్వం వద్ద వుంది. ఆ వాటాను విక్రయించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి వుంది. అయితే తక్షణమే ఈ వాటాను విక్రయించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టంచేశారు. -
పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా
న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్ పంపారు. ఆటోమేషన్ కంపెనీ పనయను ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది. వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని, కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. -
బై బ్యాక్ కు టీసీఎస్ బోర్డు ఓకే
ముంబై: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)వాటాదారులకు ఉత్సాహకరమైన వార్త అందించింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్ల బై బ్యాక్ పై టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5.6 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.16 వేల కోట్ల విలువకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డ్ సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలించింది. 14.6 శాతం ప్రీమియంతో తన సొంత షేర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ రేటు పై ఈ ప్రీమియాన్ని అందించనుంది. రూ.2,850 ధర వద్ద షేరును కొనుగోలు చేయనున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.33 శాతంగా ఉంది. ఈ వార్తలతో మార్కెట్ ముగింపులో టీసీఎస్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. అటు టీసీఎస్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు హర్షం ప్రకటించాయి. -
వీటిల్లో కొంటే అంతే!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొనుగోలు చేయొద్దు సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజు ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో, బఫర్ జోన్లోనో, ఎఫ్టీఎల్లోనో అపార్ట్మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు. బఫర్ జోన్ అంటే: బఫర్ జోన్ అంటే నీటి పరీవాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా. ఎఫ్టీఎల్ అంటే: ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతంను ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి «ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కులు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు. -
సిస్కో చేతికి ‘దేశీ’ స్టార్టప్ సంస్థ
3.7 బిలియన్ డాలర్లకు యాప్డైనమిక్స్ కొనుగోలు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ వ్యాపారవేత్త జ్యోతి బన్సల్ నెలకొల్పిన ‘యాప్డైనమిక్స్’ స్టార్టప్ సంస్థను దిగ్గజ కంపెనీ సిస్కో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కంపెనీలు తమ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను మెరుగ్గా నిర్వహించుకునేందుకు, వ్యాపార పనితీరునును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సేవలను యాప్డైనమిక్స్ అందిస్తోంది. ఢిల్లీలోని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన బన్సల్.. 2008లో యాప్డైనమిక్స్ను ప్రారంభించారు. 2015 సెప్టెంబర్లో సీఈవో హోదా నుంచి బన్సల్ తప్పుకున్న తర్వాత డేవిడ్ వాధ్వానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బన్సల్ కంపెనీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. యాప్డైనమిక్స్ సంస్థ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీల్ పూర్తి కావొచ్చని అంచనా. -
కంది కొనుగోలుకు 80 కేంద్రాలు
• కందులకు మద్దతు ధరపై సమీక్షలో మంత్రి హరీశ్ • 2.17 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో కందులకు మద్దతు ధర ఇచ్చేందుకు 80 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటివరకు 68 కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. కంది మద్దతు ధర చెల్లింపు, సేకరణపై మార్కెటింగ్, ఎఫ్సీఐ, నాఫెడ్, హాకా, డీసీఎంఎస్, వ్యవసాయాధి కారులతో సోమవారం ఆయన సమీక్షిం చారు. మద్దతు ధర అందించాలని, దళారు లను అరికట్టాలనే ఉద్దేశంతో పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా కొనుగోలు చేయా లని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 20,720 మంది రైతుల నుంచి 2,17,628 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసి రూ.50 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన మొత్తం కూడా రైతులకు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదే శింశామన్నారు. కందిS కొనుగోళ్లలో సమ స్యలుంటే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల పరి ష్కారానికి మార్కెటింగ్శాఖ కార్యాలయం లో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశా మన్నారు. 040–23222306 నంబర్కు ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ప్రతి సోమ వారం మార్కెటింగ్ డైరెక్టర్ సమీక్ష నిర్వ హించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. కందుల రెగ్యులేషన్ జరుగుతున్న మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వ ఏజెన్సీలు కొన్న తర్వాత ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఆయా కార్యదర్శులు తగిన జాగ్రత్తలు తీసుకొని రైతుకు మంచి ధర వచ్చేలా చూడాలని చెప్పారు. వివాదాల పరిష్కారానికి కమిటీలు వేయాలన్నారు. రైతులు 12 శాతం తేమ మించకుండా కందులను యార్డుకు తీసుకొచ్చేలా ఆయా మార్కెట్ యార్డుల తరపున ప్రచారం చేయాలన్నారు. రైతు సరుకును యార్డుకు తీసుకొచ్చి కుప్పపోసేందుకే చార్జీలు చెల్లిం చాలని.. ఏ ఇతర చార్జీలు రైతులు చెల్లిం చాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కొనుగోలుకు సంబంధించి తూకం, హమా లీ అన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీలే భరిస్తా యన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తాత్కాలిక మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లోకి కందులు చేరిన వెంటనే ఇన్వాయిస్ బిల్లులు తయారుచేసి రైతులకు డబ్బులందేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. దేశం నుంచి కంది ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసేం దుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖపై అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. కల్వకుర్తి, కొల్హాపూర్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కె టింగ్ శాఖ అధికారులు ఆయా మార్కెట్ల లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్రావు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి, మార్క్ఫెడ్ జీఎం రేఖ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ఫోర్జ్ చేతికి అమెరికా ఆటో కంపెనీ
డీల్ విలువ రూ.95 కోట్లు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్ఎల్సీ (డబ్ల్యూఎఫ్టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు)కొనుగోలు చేయనున్నది. వాహన, ఇతర పారిశ్రామిక విభాగాల్లో తన ఉత్పత్తులను మరింతగా పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని భారత్ ఫోర్జ్ కొనుగోలు చేయనున్నది. తమ అమెరికా అనుబంధ కంపెనీ భారత్ ఫోర్జ్ అమెరికా ద్వారా డబ్ల్యూఎఫ్టీని కొనుగోలు చేయనున్నామని భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలును తమ ఫైనాన్స అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదించిందని భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా ఎన్. కల్యాణి చెప్పారు. ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. డబ్ల్యూఎఫ్టీ కంపెనీ ఈ ఏడాది 2.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా. -
శాంసంగ్ భారీ డీల్
కనెక్టెడ్ కార్ల ఉత్పత్తిలో వేగవంతంగా పెరుగుతున్న ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఓ అమెరికన్ కంపెనీని సొంతం చేసుకోబోతుంది. అమెరికన్ ఆటో పార్ట్ల తయారీదారి హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లుగా(సుమారు రూ.54,107 కోట్లు) ఉండనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న శాంసంగ్, ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుందని, శాంసంగ్ బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం ముగింపు ధరకు 27.8 శాతం ప్రీమియంగా ఈ డీల్ ఉంది. ఒక్కో షేరుకు 112 డాలర్ల నగదును హర్మాన్కు శాంసంగ్ చెల్లించనుంది. అమెరికాలో లిస్టు అయిన హర్మాన్, కనెక్టెడ్ కారు టెక్నాలజీలో లీడర్గా ఉంది. ఈ డీల్ శాంసంగ్ విలువలోనే అతిపెద్దదని, గ్లోబల్ మార్కెట్లోని ఆన్లైన్ కనెక్టెడ్ ఆటో టెక్నాలజీలో తనదైన ఉనికిని చాటుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని సంస్థ పేర్కొంది. తాము ఆటోమోటివ్ ఫ్లాట్ ఫామ్లో వృద్ధి చెందడానికి శాంసంగ్కు హర్మాన్ ఓ బలమైన పునాదిని వెంటనే ఏర్పరుస్తుందని పేర్కొంది. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, ఇతర ఇంటర్నెట్ తరహా వినోద ఫీచర్లను జనరల్ మోటార్స్, ఫియట్ క్రిస్లర్ వంటి గ్లోబల్ కారు కంపెనీలకు హర్మాన్ ఉత్పత్తిచేస్తోంది. -
బంగార దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
-
బంగారం దుకాణదారులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు 500, 1000ను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం, మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా చేసింది. బ్లాక్మనీని బంగారం వైపు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కొనుగోలు దారులు పాన్ నెంబర్ సమర్పించకపోతే అసలు బంగారం విక్రయాలు చేపట్టవద్దని ఆభరణ దుకాణదారులకు తెలిపింది. ఒకవేళ కొనుగోలుదారుల నుంచి పాన్ నెంబర్ తీసుకోని పక్షంలో ఆభరణ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పాన్ నెంబర్ తీసుకోవడంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆభరణ దుకాణదారులకు రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సూచించారు. బంగారం కొనుగోలు చేస్తున్నవారందరి వివరాలను భద్రపరచాలని వ్యాపారులకు తెలిపారు. పాన్ నెంబర్ ను తనిఖీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ఉంటుందని స్పష్టంచేసింది. శుభకార్యాల కోసం నగదు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ప్రజలు కూడా భారీగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. ప్రజల కొనుగోలు డిమాండ్ను క్యాష్ చేసుకున్న దుకాణదారులూ బంగారం ధరలను భగ్గుమనేలా పెంచారు. దీంతో బంగారం ధరలు కొన్ని ఆభరణ దుకాణాల్లో రూ.50వేల వరకు పలుకుతున్నాయి. ప్రధాని నిర్ణయాన్ని క్యాష్ చేసుకుని, బ్లాక్ మనీకి సహకరించే బంగార దుకాణదారులపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. -
హెరిటేజ్ ఫుడ్స్ చేతికి రిలయన్స్ డెయిరీ వ్యాపారం
• డీల్ విలువ వెల్లడించని సంస్థ • దేశవ్యాప్త విస్తరణకు అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా రిలయన్స్ రిటైల్కి (ఆర్ఆర్ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తోంది. డీల్ ఖరారయినా... డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడి కాలేదు. నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతరత్రా అంశాలకు లోబడి ప్రతిపాదిత లావాదేవీ ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ శుక్రవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 553 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 2,400 గ్రామాల రైతుల నుంచి రోజుకు 2.25 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి కీలక మార్కెట్లతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కొత్తగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడుతుందని హెరిటేజ్ ఆశాభావం వ్యక్తంచేసింది. డీల్ అనంతరం కూడా హెరిటేజ్ డెయిరీ ఉత్పత్తులు సహా.. ఇతరత్రా డెయిరీ ఉత్పత్తులను కూడా తమ రిటైల్, హోల్సేల్ స్టోర్స్ ద్వారా విక్రయించడం కొనసాగిస్తామని తెలియజేసింది. 1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ తదితర ఆరు వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో 1,13,500 రిటైల్ అవుట్లెట్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 123 హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. హెరిటేజ్ రిటైల్ వ్యాపార విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను హెరిటేజ్ ధ్రువీకరించటం తెలిసిందే. హెరిటేజ్ లాభం రూ. 16 కోట్లు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.641 కోట్ల ఆదాయంపై సుమారు రూ.15.69 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.587 కోట్లు కాగా లాభం రూ.15.29 కోట్లు. అయితే స్టాండెఅలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2లో డెయిరీ విభాగం రూ.462 కోట్ల ఆదాయంపై రూ.30 కోట్ల లాభం నమోదు చేసింది. రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. ఈ విభాగం రూ.175 కోట్ల అమ్మకాలపై రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. -
టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి
ముంబై: టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ అనుబంధ ప్రచురణ విభాగం వెస్ట్ల్యాండ్ను కొనుగోలు చేయనున్నట్టు అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఎంత మొత్తానికి అన్న విషయం తెలియజేయలేదు. ఈ కొనుగోలుతో వెస్ట్ల్యాండ్ రచయితలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా తమ ప్రచురణల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవచ్చని అమెజాన్ తెలిపింది. టాటాలకు చెందిన వెస్ట్ల్యాండ్లో అమెజాన్ గతంలోనే 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. వెస్ట్ల్యాండ్ కంపెనీ పుస్తక విక్రయాలు, పంపిణీ, ప్రచురణ విభాగంలో 50 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
టెలీకాం,మీడియా దిగ్గజాల మధ్య బ్లాక్ బస్టర్ డీల్?
అమెరికాలోని డాలస్ కు చెందిన దిగ్గజ టెలికం సంస్థ ఏటీఅండ్టీ మరో దిగ్గజ కంపెనీ న్యూయార్క్ దిగ్గజం మీడియా మేజర్ టైమ్వార్నర్ను కొనుగోలు చేసేందకు రంగం సిద్ధమైంది. సుమారు 85 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై సూత్ర ప్రాయ అంగీకారం ముగిసిందనీ,ఆదివారం ఒక ప్రకటన రావచ్చని సమాచారం. ఈ తాజా ఒప్పందంతో ఏటీఅండ్టీకి హెచ్బీవో, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ వంటి ఛానెల్స్పై పట్టు వస్తుంది. ఏటీఅండ్టీ వైర్లెస్ టెలిఫోన్ల విక్రయంలో, బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో రారాజుగా ఉన్న ఈ సంస్థ గత ఏడాది డైరెక్ట్ టీవీని దాదాపు 2.5లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టైమ్వార్నర్ ప్రతి షేరుకు ఏటీఎండ్టీ 110 డాలర్లు( రూ.7200) చెల్లించడానికి సిద్ధమైంది. ఈ లెక్క ప్రకారం డీల్ రూ.ఐదులక్షల కోట్లను దాటనుంది. మరోవైపు ప్రపంచంలో ఇటీవలి కాలంలో ఇదే బ్లాక్ బస్టర్ డీల్ గా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్కు సంబంధించిన నియమ నిబంధనలను ఆదివారం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా టెలికం కంపెనీలు టీవీ ఛానెల్స్ పంపిణీ నెట్వర్క్లోకి వచ్చాయి. ఈ జాబితాలోకి ఏటీఅండ్టీ కూడా చేరుతుంది. అయితే ఈ రెండు సంస్థ ఈ డీల్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. మరోవైపు ఈ భారీ ఒప్పందం వార్తలపై అక్కడి ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం సంస్థ చేతిలో కేవలం ఏడు బిలియన్ డాలర్లు (రూ.46వేల కోట్లు)మాత్రమే ఉన్నాయంటున్నారు.. మిగిలిన సొమ్ముకోసం రుణదాతల తలుపు తట్టాల్సిందేననీ, ఇప్పటికే ఈ సంస్థకు భారీగా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తంతా నెక్ట్స్ జనరేషన్ 5జీ మొబైల్స్ దే నని వాదిస్తున్నారు. పేటీవీ సర్వీసులకు మొబైల్ ప్రొవైడర్లు పెద్ద ఆటంకంగా మారనున్నారని వ్యాఖ్యానించారు. పంపిణీ, కంటెంట్ లను జోడించడం ఎపుడూ సాధ్యంకాదన్నారు. కానీ ఈ ఒప్పంద వార్తలను మీడియా పరిశ్రమ సానుకూలంగా స్వీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఇంక్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ సహా మీడియా షేర్లు లాభాలను ఆర్జించాయి. -
మేక్ మైట్రిప్ చేతికి ‘ఐబిబో’..
న్యూఢిల్లీ: ఆన్లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్మైట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది. దీంతో ఈ విభాగంలో మేక్మై ట్రిప్ ప్రధాన సంస్థగా అవతరించనుంది. ఐబిబోను దాని వాటాదారులైన దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టాన్సెంట్ హోల్డింగ్స్ మేక్ మైట్రిప్కు విక్రయించేందుకు ముందుకు రాగా, దీనికి ప్రతిగా మేక్ మై ట్రిప్ ఆయా సంస్థలకు తాజా వాటాలను జారీ చేయనుంది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. డీల్ పూర్తయితే ఐబిబో పూర్తిగా మేక్ మైట్రిప్ పరం అవుతుంది. అదే సమయంలో నాస్పర్స్, టాన్సెంట్ హోల్డింగ్స్ కలసి మేక్ మై ట్రిప్లో 40 శాతం వాటాను కలిగి ఉంటారు. ఇందుకు అనుగుణంగా మూలధన నిధులను సైతం అందించనున్నట్టు మేక్ మైట్రిప్ సంస్థ తెలిపింది. మేక్ మైట్రిప్ గతంలో సీట్రిప్ డాట్ కామ్కు జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్ను సాధారణ ఈక్విటీ కిందకు మార్చనున్నట్టు దీంతో ఈ సంస్థకు 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. మేక్మైట్రిప్ వాటాదారులతోపాటు నియంత్రణ సంస్థల అనుమతి అనంతరం ఈ డీల్ డిసెంబర్లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మేక్ మై ట్రిప్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ. కాగా, తాజా డీల్ నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళశారం ఇంట్రాడేలో దాదాపు 50% ఎగసి 31 డాలర్లను తాకడం గమనార్హం. -
ట్విట్టర్ను కొనేవారే కరువయ్యారు
-
రాస్ నెఫ్ట్, ట్రాఫిగుర సంస్థల చేతికి ఎస్సార్ ఆయిల్
♦ రేపు గోవాలో పుతిన్ సమక్షంలో ఒప్పందం ♦ డీల్ విలువ రూ. 86,000 కోట్లు న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ కంపెనీని రష్యా ఆయిల్ దిగ్గజం రాస్నెఫ్ట్, ఇతర సంస్థలతో కలిసి కొనుగోలు చేయనున్నది. రాస్నెఫ్ట్ కంపెనీ, యూరప్ కమోడిటీస్ ట్రేడర్ ట్రాఫిగుర, రష్యా ఫండ్ యూసీపీతో కలిసి ఎస్సార్ ఆయిల్ కంపెనీని 1,300 కోట్ల డాలర్లకు (రూ. 86,000 కోట్లు) కొనుగోలు చేయనున్నాయని సమాచారం. వాటాను విక్రయించిన తర్వాత ఎస్సార్ ఆయిల్లో 2 శాతం వాటా మాత్రమే ప్రస్తుత ప్రమోటర్లు, రుయా కుటుంబానికి ఉంటుంది. ఈ డీల్లో భాగంగా ఎస్సార్ ఆయిల్ కంపెనీకి వున్న 450 కోట్ల డాలర్ల రుణ భారాన్ని కొనుగోలు సంస్థలు టేకోవర్ చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రేపు(శనివారం) గోవాలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవాలో ఈ నెల 15-16 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదురనున్నది. ఈ ఒప్పందంలో భాగంగా రాస్నెఫ్ట్ పీజేఎస్సీ సంస్థ 49 శాతం వాటాను, ట్రాఫిగుర గ్రూప్ పీటీఈ, యూసీపీలు కలసి మరో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ డీల్లో వాదినర్ రిఫైనరీ, వాదినర్ పోర్ట్, 2,500కు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. రిఫైనరీకి సేవలందిస్తున్న విద్యుత్ ప్లాంట్, కంపెనీ కోల్ బెడ్ మీధేన్(సీబీఎం) బ్లాక్లు ఈ ఒప్పందం కిందకు రావు. -
టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా
డీల్ విలువ రూ.188 కోట్లు న్యూఢిల్లీ: హెల్త్కేర్ స్టార్టప్ ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా రూ.188 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ప్యూరో వెల్నెస్ తెలిపింది. దీంతో ఈ స్టార్టప్లో వ్యవస్థాపకుడు రుచిర్మోడికి 25%, టొరంటొ ఫార్మాకు 75% చొప్పున వాటాలుంటాయని వివరించింది. రుచిర్ మోడీ రూ.62 కోట్లతో ఈ స్టార్టప్ను ప్రారంభించారని, సీడ్ ఫండింగ్గా రూ.250 కోట్లు సమీకరించామని వివరించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్ను టొరంటొ ఫార్మా మాజీ ఈడీ రుచిర్ మోడీ ప్రారంభించారు. ఈ స్టార్టప్ సేంద్రియ ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. త్వరలో సొలైట్ బ్రాండ్ కింద ఉత్పత్తులను మార్కెట్లోకి అందించనున్నది. -
నకిలీ.. మకిలీ..
* పరిచయంలేని వ్యక్తి కారుపై రుణం పొందిన వైనం * అక్రమానికి సహకరించిన ఆర్టీఏ అధికారులు * మరో 8 మంది బాధితుడి ఫిర్యాదుతో నలుగురి అరెస్టు గుంటూరు రూరల్: పరిచయంలేని వ్యక్తి ఆధార్ కార్డును ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అతని కారుౖపై మాగ్జిమా అనే ప్రైవేటు సంస్థలో రూ 5.5 లక్షల రుణం పొందిన ఘటనలో నిందితులను నల్లపాడు పోలీస్లు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... నగరంలోని నవభారత్నగర్కు చెందిన చైతన్య అనే వ్యక్తి 2014లో రూ 5.7 లక్షల రుణంతో కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో నగరంలోని అరండల్పేట, విజయవాడ గవర్నర్పేట తదితర పోలీస్ స్టేషన్లలో నమ్మించి మోసం చేసే కేసులున్న తాడేపల్లి పాతూరుకు చెందిన సంకురు రవికిరణ్ అనే వ్యక్తి చైతన్యకు చెందిన ఆధార్ కార్డును ఆన్లైన్ ద్వారా 2015లో డౌన్లోడ్ చేశాడు. ఆధార్ కార్డుతో ఆతని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అతనికి కారుందని గమనించాడు. ఇదే అదనుగా భావించిన రవికిరణ్ చైతన్యకు చెందిన కారు తాను కొనుగోలు చేసినట్లు నకిలీ క్లియరెన్స్ పత్రాలను సృష్టించాడు. ఆధార్ కార్డుతోనే అంతా.... క్లియరెన్స్ పత్రాలు, ఆధార్ కార్డుతో సహా ఆర్టీఏ కార్యాలయానికి స్థానికంగా ఉండే ఏజెంట్ రఘునా«థరాం ద్వారా వెళ్ళి తన కారు సీబుక్ పోయిందని చెప్పి విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేçÙన్లో పొందిన ఎప్ఐఆర్ కాపీతో కారుకు చెందిన నకిలీ సీబుక్ను ఆర్టీఐ అధికారులనుంచి పొందాడు. అనంతరం తన వద్దనున్న నకిలీ క్లియరెన్స్, సీబుక్తో మాగ్జిమా సంస్థకు చెందిన ఏజెంట్ రాజేష్బాబును కలిసి తన కారుపై రుణం కావాలని కోరాడు. విషయం తెలిసిన రాజేష్బాబు సంస్థకు చెందిన ఉద్యోగి వెంకటశివనాగరాజును కలిసి కారుపై రూ 5.5 లక్షల రుణాన్ని పొందాడు. రుణం అందిన వెంటనే కనుమరుగయ్యాడు. ఈ క్రమంలో చైతన్య తన కారుపై ఉన్న రుణం తీర్చి క్లియరెన్స్ను పొదేందుకు ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్ళగా తన కారు తనపేరుపై లేదని గమనించి నిర్ఘాంతపోయాడు. ఏం జరిగిందని ఆర్టీఏ అధికారులను ప్రశ్నించటంతో విషయం ఎక్కడ బయటకు వచ్చి తమ మెడకు చుట్టుకుంటుందోనని ఆర్టీఏ అధికారులు ఏజెంట్లు గుట్టు చప్పుడు కాకుండా చైతన్య కారుపై మాగ్జిమా సంస్థలో ఉన్న రుణాన్ని చెల్లించారు. కేసులో 10 మంది నిందితులు.. ఈ క్రమంలో గత 5 రోజుల కిందట ఏడాది కిందట కనుమరుగైన రవికిరణ్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్ రఘునాధరాంకు కనిపించటంతో అతనిని పట్టుకుని ఆర్టీఏ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయగా తమను మోసం చేశాడని ఆర్టీఏ అధికారులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు తమదైన శైలిలో రవికిరణ్ను విచారించారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాలతో మాగ్జిమా సంస్థలో రుణం పొందిన వైనాన్ని వెళ్ళగక్కాడు. దీంతో ఈ ఘటనలో 10 మంది నిందితులున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చి అందులో ఏజెంట్ రఘునాథబాబు, రవికిరణ్, మాగ్జిమా సంస్థ ఉద్యోగి వెంకటశివనాగరాజు, రాజేష్బాబులను అరెస్ట చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరిచారు. నిందితులైన ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది ఇద్దరు కోర్టులో లొంగిపోయి బెయిల్ను సైతం పొందారు. 10 మంది నిందితులలో ఒకరు మృతి చెందగా ఇప్పటికి 6గురు అదుపులో ఉన్నట్లు మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నారని తెలిసింది. ఆన్లైన్ ద్వారా మోసాలు చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టే ఘరానా మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఏమరు పాటు తగదని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుల తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడమే.. రవాణాశాఖలో ఆరునెలల కిందట జరిగిన పొరపాటు సర్దుబాటు చేసినా ఇంకా వెంటాడుతునే ఉంది. ఆరునెలల తర్వతా అసలు నిందితుడు దొరకటంతో పునర్విచారణ పేరుతో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దొంగను పట్టించిన రవాణాశాఖ అధికారులపై సైతం కేసులు నమోదు కావటం సంచలనంగా మారింది. కేసులో రవాణాశాఖ అధికారులదే తప్పంటూ పోలీసులు నిర్ధారిస్తుండగా .. పోలీసులు ఇచ్చిన తప్పుడు మిస్సింగ్ సర్టిఫికేట్ వల్లే ఈ తప్పు జరిగినట్లు రవాణాశాఖ అధికారులు మండిపడుతున్నారు. మార్చినెలలో యార్లగడ్డ నాగ చెతన్య తన వాహనం పై సంకూరి రవికిరణ్ అనే వ్యక్తి తనకు తెలియకుండా రూ.5.5లక్షలు రుణం తీసుకున్నాడని దీనిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఉప రవాణా కమిషనరును కోరారు. దీనిపై విచారించిన రవాణాశాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన మిస్సింగ్ సర్టిఫికేట్ ఆధారంగానే రవికిరణ్ సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లుతో పొరపాటు జరిగిందని గ్రహించారు. -
పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభం
పిట్లం : పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి పెసర, మినుముల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నిజాంసాగర్, పిట్లం మండలాల్లో గల పెసర, మినుము రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలిపారు. క్వింటాలుకు 5,225 మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, సెక్రెటరీ రాంనాథ్రావు, డైరెక్టర్ సాయిరెడ్డి, సంపత్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, రెహమత్, నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ట్విట్టర్ను మేం కొనం...
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అమ్మక వార్త గత కొన్ని నెలలుగా సంచలనం రేపుతోంది. ఈ విక్రయానికి సంబంధించి ఇప్పటికే పలు టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం గూగుల్, వెరిజోన్, మైక్రోసాప్ట్లు ట్విట్టర్ను చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇవి త్వరలోనే బిడ్డింగ్ దాఖలు చేయనున్నాయని తెలిసింది. కానీ ట్విట్టర్ను కొనుగోలు చేసే ఆలోచన నుంచి టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ తప్పుకుందట. త్వరలోనే దాఖలు చేయబోయే బిడ్డింగ్ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. మైక్రోసాప్ట్ ఇటీవలే లింక్డ్ఇన్ను 26.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోలుతో ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి మైక్రోసాప్ట్ ఆసక్తి చూపడం లేదని సమాచారం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్విట్టర్కు ఫుల్ క్రేజ్ ఉంటోంది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ట్విట్టర్నే ఫాలో అవుతారంటే ఎలాంటి సందేహమే లేదు. అలాంటి కంపెనీకి యూజర్ల వృద్ధి మందగించి, కోలుకోలేని ఆర్థిక నష్టాలను మూటకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దీన్ని విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ట్విట్టర్ అమ్మక వార్తతో సెప్టెంబర్ 23వరకు ఆ కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 19 శాతం మేర జంప్ అయ్యాయి. 2013 తర్వాత ఒక్కరోజులో ఈమేర పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ట్విట్టర్ మార్కెట్ విలువ16 బిలియన్ డాలర్లకు ఎగిసింది. తాజాగా ట్విట్టర్ కొనుగోలు నుంచి మైక్రోసాప్ట్ తప్పుకోవడంతో ఏ కంపెనీ దీన్ని చేజిక్కించుకుంటుందో వేచిచూడాలి. -
కోర్టుకొచ్చిన వారి భూములను కొనడం లేదు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల భూములను జీవో 123 కింద తా ము కొనుగోలు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. బలవంతంగా భూములు తీసుకుం టున్నామని పిటిషనర్లు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనంది. హైకోర్టు స్పందిస్తూ, పిటిషనర్లు చెబుతున్న దాంట్లో వాస్తవముందని తేలితే, వారి భూముల జోలికి వెళ్లొద్దని స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూ కొనుగోలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. రైతులను బెదిరిస్తూ బలవంతంగా భూములు తీసుకుం టున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన రామ్మోహన్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మిస్టర్ ఏజీ! ఇదే విధమైన ఫిర్యాదులతో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇంతకూ ఏం జరుగుతోంది?’’ అని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. ‘‘కోర్టుకొచ్చిన వారి భూములను కొనుగోలు చేయబోమని మీరు స్పష్టంగా హామీ ఇచ్చారు కదా? అందుకు విరుద్ధంగా వెళ్తుంటే మేం స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేసింది ఏజీ బదులిస్తూ, పిటిషనర్లవి ఆరోపణలేనని అన్నారు. అసైన్డ్ భూములున్న వారికి అతి తక్కువ పరిహారం చెల్లిస్తున్నారని మరో న్యాయవాది అర్జున్ అన్నారు. మిగతా వారికి ఎకరాకు రూ.5.5 లక్షలు ఇస్తుంటే, వారికి మాత్రం రూ.3.5 లక్షలే ఇస్తున్నారని తెలిపారు. గౌరెల్లి రిజర్వాయర్ కోసం 2009లో చేపట్టిన భూ సేకరణకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని రచనారెడ్డి అన్నారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారంటున్న ప్రభుత్వం వాస్తవానికి బలవంతపు భూ సేకరణకు దిగుతోందన్నారు. సామాజిక అధ్యయనం నిర్వహించకుండానే భూములను తీసుకుంటోం దని వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గురించి పరోక్షంగా ఆమె ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, రాజకీయ ప్రసంగాలకు కోర్టులను వేదిక చేసుకోరాదంటూ ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘పిటిషన్లో ప్రస్తావించని అంశాలన్నింటినీ చెప్పడం సరికాదు. వాదనలను జీవో 123కే పరిమితం చేయాలి’’ అన్నారు.భూములను కొనుగోలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
క్వికర్ చేతికి ‘స్టెప్నీ’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనల పోర్టల్ క్వికర్, స్టెప్నీని బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. కారు యజమానులను, సమీపంలోని కారు సర్వీసు కేంద్రాలతో అనుసంధానానికి వీలు కల్పించేదే స్టెప్నీనీ. ఈ కొనుగోలుతో క్వికర్కార్స్ ద్వారా మరింత మందిని చేరువ కావచ్చని భావిస్తున్నట్టు క్వికర్ ప్రకటించింది. -
హైదరాబాద్లో బెంట్లే బెంటేగా..
ఓ టీవీ మీడియా అధిపతి కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యంత ఖరీదైన ఎస్యూవీగా పేరొందిన బెంట్లే బెంటేగా హైదరాబాద్ రోడ్లపైనా హుందా ఒలకబోస్తోంది. ఇప్పటివరకూ దేశంలో ఐదుగురు మాత్రమే ఈ వాహనాన్ని సొంతం చేసుకోగా... వారిలో హైదరాబాద్కు చెందిన ఓ టీవీ చానెళ్ల అధినేత కూడా ఉన్నట్లు తెలిసింది. మిగిలిన నలుగురూ ఇతర రాష్ట్రాల వారే. ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలో ఆవిష్కరించిన బెంటేగా ధర 3.85 కోట్లు. అది కూడా ఢిల్లీలో ఎక్స్షోరూం. ఇక రాష్ట్రానికి తెచ్చేసరికి పన్నులతో కలసి రూ.4.3 - 4.5 కోట్ల దాకా అయ్యే అవకాశముంది. బెంటేగా ఖరీదైనదే కాదు... వేగం కూడా ఎక్కువే. బ్రిటన్కు చెందిన బెంట్లే సంస్థ తెచ్చిన తొలి ఎస్యూవీ ఇది. 6.0 లీటర్ డబ్ల్యూ12 ఇంజన్ను ఇందులో పొందుపరిచారు. 4.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటలో 301 కిలోమీటర్లు ప్రయాణించిన రికార్డుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి ఏడాది 3,000 యూనిట్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. ఇవన్నీ ఇప్పటికే బుక్ అవడం మరో విశేషం. 2015 సెప్టెంబర్లో ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో బెంటేగా ఆవిష్కరించారు. అదే ఏడాది నవంబర్ నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమయింది. -
యాక్సెంచర్ చేతికి ఆస్ట్రేలియా సెక్యూరిటీ సంస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్, ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ కంపెనీ రెడ్కోర్ను కొనుగోలు చేసింది. రెడ్ కోర్ కంపెనీని ఎంతకు కొనుగోలు చేసిందన్న వివరాలను యాక్సెంచర్ వెల్లడించలేదు. రెడ్కోర్ కంపెనీ కొనుగోలు కారణంగా తమ సెక్యూరిటీ సేవల విభాగం మరింతగా విస్తరిస్తుందని, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమ అగ్రస్థానం మరింతగా పటిష్టమవుతుందని యాక్సెంచర్ సెక్యూరిటీ ఎండీ, కెల్లీ బిస్సెల్ చెప్పారు. రెడ్కోర్ కంపెనీ క్లౌడ్, వెబ్, మొబైల్, ఆడాప్టివ్ యాక్సెస్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్లలో హోలిస్టిక్ అథంటికేషన్, ఆథరైజేషన్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసులను డెవలప్ చేస్తోంది. యాక్సెంచర్ దన్నుతో క్లయింట్లకు మరింత సమర్థవంతమైన, విస్తృతమైన సేవలందించగలమని రెడ్కోర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జోసెఫ్ ఫైల్లా పేర్కొన్నారు. -
మైక్రోసాఫ్ట్ చేతికి ఏఐ స్టార్టప్ ‘జెనీ’
హోస్టన్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా స్మార్ట్ షెడ్యూలింగ్ యాప్ ‘జెనీ’ని కొనుగోలు చేసింది. గూగుల్, యాపిల్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాన్ని మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగానే కంపెనీ ఈ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. లావాదేవీకి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు. జెనీ ప్రస్థానం 2014లో ప్రారంభమైంది. -
ఇజ్రాయెల్ సంస్థలో వాటా కొన్న విప్రో
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఇటీవలే పలు కంపెనీల్లో వాటాను చేజిక్కించుకున్న ఈ కంపెనీ తాజాగా ఇజ్రాయెల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ... ఇన్సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్లో మైనారిటీ వాటాను కొనుగోలుచేసింది. ఇన్సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలో 20 శాతం కంటే తక్కువ వాటాను 15 లక్షల డాలర్లతో కొనుగోలు చేశామని విప్రో తెలిపింది. గతేడాదే ప్రారంభమైన ఇన్సైట్స్ కంపెనీ టెల్ అవీవ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ కొనుగోలు లావాదేవీ ఈ నెల చివరికల్లా పూర్తవగలదని వివరించింది. కాగా విప్రో కంపెనీ ఇటీవల కాలం ఓ హెల్త్ప్లాన్ సర్వీసెస్, సెలెంట్, వీటియోస్ గ్రూప్ తదితర కంపెనీల్లో చెప్పుకోదగ్గ వాటాలను కొనుగోలు చేసింది. -
భారతి టెలికాంలో సింగపూర్ టెలీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సింగ్టెల్ రెండు దేశాల టెలికాం దిగ్గజాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సింగ్ టెల్ థాయ్ టెలికాం సంస్థ ఇన్ టచ్ హోల్డింగ్స్ , ఇండియాకు చెందిన భారతి టెలికం లిమిటెడ్ కంపెనీల్లో సుమారు రెండు బిలియన్ల డాలర్లతో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, థాయ్ లాండ్ టెలికాం మార్కెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్న సంస్థ ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పాగా వేయాలనే దాని వ్యూహంలో భాగంగా మొత్తం 1.8 మిలియన్ డాలర్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఇన్ టచ్ లో 21 శాతం, భారతి ఎయిర్టెల్ సొంతమైన భారతి టెలీలో 7.39 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్టు సింగపూర్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో సింగ్ టెల్ పేర్కొంది. సింగె టెల్ కొనుగోలు చేస్తున్న భారతి టెలీవాటాల విలువ రూ. 4,400 కోట్లకు పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలిపింది. అంతర్గత నగదు, స్వల్పకాలిక రుణాల ద్వారా ఈ వాటాలను హస్తగతం చేసుకోనున్నట్లు సింగ్ టెల్ తెలిపింది. ఈ రెండు లావాదేవీల ద్వారా రెండు కంపెనీల్లోతమ పెట్టుబడుల వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలున్న రెండుదేశాల్లోతమ కార్యకలాపాల వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నామని సింగ్టెల్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చువా సాక్ చెప్పారు. ఈ రెండుదేశాల్లోని యువత జనాభా వివరాలను ఉదాహరించిన ఆమె తమ టెలికాం వ్యాపారానికి సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. ఇది వెల్ ప్యాకేజ్డ్ డీల్ అని నోమురా బ్యాంక్ వ్యాఖ్యానించింది. సింగ్టెల్ ఆదాయాలకు బూస్ట్ ఇస్తుందని, కానీ థాయ్ మరియు భారత మార్కెట్లలో ఎల్లప్పుడూ నిశ్చితంగా ఉండవనేది గమనించాలని తెలిపింది. మరోవైపు సింగ్ టెల్ భారతి టెలీలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేసిందన్న వార్తలతో మార్కెట్లో షేరుకు డిమాండ్ పెరిగింది. 2 శాతానికి పైగా లాభపడింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని థాయిలాండ్ స్టాక్ ఎక్సేంజీ తెలపగా , దీనిపై వ్యాఖ్యానించడానికి భారతి ఎయిర్ టెల్ నిరాకరించడం విశేషం. -
పిరమాల్ చేతికి యాష్ స్టీవెన్స్...
న్యూఢిల్లీ: పిరమాల్ ఎంటర్ప్రెజైస్ కంపెనీ అమెరికాకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ‘యాష్ స్టీవెన్స్’ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 53 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.350 కోట్లు). తమ అమెరికా పూర్తి అనుబంధ సంస్థ.. యాష్ స్టీవెన్స్తో ఒప్పందం కుదుర్చుకుందని, డీల్ మొత్తాన్ని నగదు రూపంలో యాష్ స్టీవెన్స్ కంపెనీకి చెల్లిస్తామని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈకి నివేదించింది. కాగా యాష్ స్టీవెన్స్ కంపెనీ హై పొటెన్సీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియంట్స్ను (హెచ్పీఏపీఐ) అభివృద్ధి చేయడంతోపాటు తయారు కూడా చేస్తోంది. కొనుగోలు వార్తల నేపథ్యంలో పిరమాల్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 7 శాతంపైగా వృద్ధితో రూ.1,801కి ఎగసింది. -
ఆర్టీసీకి 1,391 కొత్త బస్సులు
► కొత్తగా 750 గ్రామాలకు రవాణా సౌకర్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రికార్డు స్థాయిలో కొత్త బస్సులను రోడ్డెక్కించబోతోంది. ఈ ఏడాది 1,391 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. రూ.350 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 1,100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లటం లేదు. కొత్త బస్సులతో మొత్తం 750 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించబోతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి భాగ్యనగరానికి ‘రాజధాని’ ఏసీ బస్సులు నడిపేందుకు అదనంగా 95 ఏసీ బస్సులను సమకూర్చుకోబోతోంది. తొలిసారిగా 236 మినీ బస్సులను కూడా కొంటోంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో గతంలో చాలా ఊళ్లకు బస్సులను నిలిపివేసింది. ఆ సమస్యకు మినీ బస్సులతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇందులో 100 వరకు ఏసీ బస్సులుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వటంతోపాటు, నగరాల్లోని కాలనీల నుంచి వేరే ప్రాంతాలకు నడిపేందుకు వాటిని వాడతారని పేర్కొంటున్నారు. ఇవి కాకుండా 386 సూపర్ లగ్జరీ బస్సులు, 600 ఎక్స్ప్రెస్ బస్సులు, 74 పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. -
ఇంటెల్ చేతికి భారత సంతతి వ్యక్తి స్టార్టప్
డీల్ విలువ 40.8 కోట్ల డాలర్లు ! శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటెల్ సంస్థ.. కాలిఫోర్నియాకు చెందిన లెర్నింగ్ స్టార్టప్ నిర్వాణ సిస్టమ్స్ను కొనుగోలు చేసింది. దీంతో చిప్లు తయారుచేసే ఇంటెల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) రంగంలోకి ప్రవేశించినట్లయింది. ఈ నిర్వాణ సిస్టమ్స్ను భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్ నవీన్రావు 2014లో ప్రారంభించారు. డీల్ విలువ నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ స్టార్టప్ను 40.8 కోట్ల డాలర్లకు ఇంటెల్ కొనుగోలు చేసిందని టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ రికోడ్ తెలిపింది. -
లుపిన్ చేతికి బ్రాండెడ్ డ్రగ్స్
ముంబై : దేశీయ అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్, 21 బ్రాండెడ్ డ్రగ్స్ పోర్ట్ ఫోలియోను జపాన్స్ షియోనోగి అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్గా ఉన్న జపాన్లో తన ఉనికిని విస్తరించడానికి 150మిలియన్ డాలర్లకు(రూ.10,010కోట్లకు) ఈ డ్రగ్స్ను లుపిన్ కొనుగోలు చేయనుంది. నియంత్రణ ఆమోదాలు, ముగింపు షరతులకు లోబడి డిసెంబర్ 3న ఈ డ్రగ్స్ పోర్ట్ ఫోలియో లుపిన్కు ట్రాన్స్ ఫర్ కానుందని కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ కొనుగోలు ప్రక్రియను జపనీస్ లుపిన్ డ్రగ్ యూనిట్ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రి కంపెనీ లిమిటెడ్ పూర్తిచేయనుంది. లుపిన్ కొనుగోలు చేసిన ఈ 21 ప్రొడక్ట్లు, షియోనోగికి మార్చితో ముగిసేనాటికి 90 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కేంద్ర నాడీ వ్యవస్థ, ఆంకాలజీ, హృదయ, యాంటీ ఇన్ఫెక్టివ్స్ చికిత్సలకు ఈ ఔషధాలు ఉపయోగపడుతున్నాయి. -
కలగా గోదాం నిర్మాణం
- రంగంపేట పీఏసీఎస్ ప్రతిపాదనలు బుట్టదాఖలు కొల్చారం : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రంగంపేట సంఘానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రంగంపేట పీఏసీఎస్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంఘం పరిధిలో రంగంపేట, సంగాయిపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్, ఎనగండ్ల గ్రామాలు కొనసాగుతు ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటలను అమ్మేందుకు రంగంపేట పీఏసీఎస్కు తీసుకువస్తారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలు కోసం తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉండటానికి కూడా నిలువ నీడలేని పరిస్థితి నెలకొంది. నాలుగున్నర ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రస్తుతం చిన్న గదుల్లోనే సహకార సంఘాన్ని కొనసాగిస్తున్నారు. గోదాం నిర్మాణం కోసం గత ఐదేళ్ల నుంచి ఇక్కడి సహకార సంఘం పాలకవర్గం చేస్తున్న ప్రతిపాదనలు, విన్నపాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఏడాదిన్నర క్రితం గోదాం నిర్మించేందుకు జిల్లా డీసీసీ అధికారులు , స్థానిక పాలకవర్గం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లింది. గోదాం నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. ఇప్పటికైనా జిల్లా సహకార సంఘం అధికారులు, పాలకవర్గం స్పందించి గోదాము నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
ఎరువుల దుకాణాలు.. - జాడేలేని వర్షాలు - ఎరువుల కొనుగోలుకు ఆసక్తి చూపని రైతులు - మూడేళ్ల క్రితం 5,650 హెక్టార్లలో సాగు - ఈసారి 2,120 హెక్టార్లు వెల్దుర్తి: పంటల సాగు కోసం రైతులు ఎరువుల కొనుగోలులో అంతగా ఆసక్తి చూపడం లేదు. గత మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలతో వాగులు, కుంటలు, చెరువులు జలకళతో పొంగి పొర్లాయి. మూడు సంవత్సరాల క్రితం మండలంలో వివిధ రకాల పంటలను 5,650 హెక్టార్లలో సాగు చేశారు. గత సంవత్సరం 3,800 హెక్టార్లు, ఈసారి 2,120 హెక్టార్లలో సాగు చేశారు. అప్పట్లో గుంట భూమిని కూడా వదలకుండా రైతులు పంటలను సాగు చేశారు. అప్పట్లో రైతులు ఎరువుల కొనుగోలు కోసం సొసైటీ, వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీశారు. నిలబడే ఓపిక లేక రైతులు ఎరువుల కోసం చెట్ల కొమ్మలు, పాదరక్షలను గుర్తుగా లైన్లో పెట్టి ఎరువులు కొనుగోలు చేశారు. గత ఏడాది కురిసిన అంతంత మాత్రం వర్షానికి భూగర్భజలాలు అడుగంటాయి. నీటి వసతి లేక పంటల సాగు కాక ఎరువుల కొనుగోలుపై ఆసక్తి చూపడంలేదు. ఈసారి కూడా వర్షాల జాడ లేక పోవడంతో సాగు అంతగా లేదు. ఎరువుల కొనుగోలుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎరువుల దుకాణాల వద్ద రైతులు మచ్చుకైనా కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు 2,148 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. 2012లో 2 వేల మెట్రిక్ టన్నులు, 2013లో 1,544 మెట్రిక్ టన్నులు, 2014లో 1,394 మెట్రిక్ టన్నులు, 2015లో 1,509 మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ఈసారి ఇప్పటి వరకు 412 మెట్రిక్ టన్నుల యూరియా, 24 మెట్రిక్ టన్నుల డీఏపీ, 263 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 128 మెట్రిక్ టన్నుల పొటాష్ ఎరువులను మాత్రమే కొనుగోలు చేశారు. నాడు రైతులు బారులు తీరి కొనుగోలు చేయడంతో ఎరువుల దుకాణాలు ళకళలాడాయి. నేడు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి అంతగా పంటలు సాగుకు నోచుకోకపోవడంతో ఎరువుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. నాడు రూ.50 వేల విలువ చేసే ఎరువులు కొనుగోలు మూడేళ్ల క్రితం నాకున్న నాలుగెకరాలు, మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశా. అప్పట్లో రూ.50 వేల విలువైన ఎరువులను కొనుగోలు చేశా. రెండేళ్ల క్రితం వర్షాలు సరిగ్గా లేక ఉన్న కాడికి సాగు చేసి రూ.25 వేల ఎరువులను తెచ్చా. గత ఏడాది రూ.15 వేల ఎరువులు తీసుకున్నా. ఈ ఖరీఫ్లో నీరులేక కేవలం రెండెకరాల్లో సాగు చేపట్టి రూ.5 వేల ఎరువులను మాత్రమే కొనుగోలు చేశా. - ఎర్ర యాదగిరి, వెల్దుర్తి పెట్టుబడి వస్తే చాలు నాకున్న ఒకటిన్నర ఎకరంలో మూడేళ్ల క్రితం చేసిన సాగుకు రూ.10 వేల ఎరువులు కొనుగోలు చేశా. గత ఏడు అంతగా నీరు లేక ఎకరంలో సాగు కోసం రూ.4 వేల ఎరువులను కొనుగోలు చేశా. ఈసారి నీరులేక అర ఎకరంలో మాత్రమే తుకం పోశా. దీని కోసం రూ.2 వేల ఎరువులు మాత్రమే తీసుకున్నా. ఈ పెట్టుబడి వస్తే చాలు. వర్షాలు కురిస్తే బాగుండు. - చాకలి ఆశయ్య, వెల్దుర్తి ఎకరమే.. నాకున్న నాలుగెకరాల పొలంలో సాగు కోసం మూడేళ్ల క్రితం రూ.20 వేల విలువ గల ఎరువులను తీసుకున్నా. రెండేళ్ల క్రితం రూ.15 వేలు, గత సంవత్సరం రెండెకరాల్లో మాత్రమే సాగు చేసి రూ.10 వేల ఎరువులను కొనుగోలు చేసుకున్నా. ఈసారి నీటి జాడ అంతగా లేకపోవడంతో ఎకరం పొలంలో సాగు చేశా. ఇందు కోసం రూ.6 వేలతో ఎరువులను కొనుగోలు చేశా. - పొన్నం పోతాగౌడ్, వెల్దుర్తి -
1.26 బిలియన్ డాలర్ల డీల్
గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్కు 86% వాటా బోర్డులోనే వ్యవస్థాపకులు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లాండ్ ఫార్మాలో సంస్థ వ్యవస్థాపకులు, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్కు కలిపి మొత్తం 96% వాటాలు ఉన్నాయి. 2014లో ఇన్వెస్ట్ చేసిన కేకేఆర్ .. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుండగా.. ప్రమోటర్లు సింహభాగం వాటాలు విక్రయిస్తున్నారు. ఒక భారతీయ కంపెనీని చైనా సంస్థ ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కానుంది. ఒప్పందం ప్రకారం మిగతా షేర్హోల్డర్ల వాటాలతో పాటు కేకేఆర్ ఫ్లోర్లైన్ ఇన్వెస్ట్మెంట్స్కి చెందిన అన్ని షేర్లను ఫోసన్ ఫార్మా కొనుగోలు చేస్తుంది. డీల్ అనంతరం కూడా వ్యవస్థాపక కుటుంబానికి సంస్థలో వాటాలు ఉంటాయి. గ్లాండ్ ఫార్మా వ్యవస్థాపకుడు పీవీఎన్ రాజు, ఆయన కుమారుడు రవి పెన్మెత్స బోర్డులో కొనసాగుతారు. కంపెనీ ఎండీ, సీఈవోగా పెన్మెత్స కొనసాగుతారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి డీల్ ఉంటుందని గ్లాండ్ ఫార్మా వివరించింది. ఒప్పందానికి సంబంధించి సింప్సన్ థాచర్ అండ్ బార్ట్లెట్, సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ సంస్థలు న్యాయసలహాలపరమైన సేవలు అందించగా, జెఫ్రీస్ సంస్థ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. ఫోసన్ను ఎంచుకున్న కారణమేంటంటే.. కేకేఆర్ సహాయంతో వాటాల విక్రయానికి పలు సంస్థలను పరిశీలించి, చివరికి ఫోసన్ను ఎంపిక చేసుకోవడం జరిగిందని పెన్మెత్స తెలిపారు. ఫోసన్కు పుష్కలమైన వనరులు, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు ఉండటం ఇందుకు కారణమని వివరించారు. అమెరికా, చైనాలోనూ కంపెనీకి పలు ఆర్అండ్డీ కేంద్రాలు, తయారీ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను మరింతగా పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఫోసన్ ఫార్మా చైర్మన్ చెన్ కియు తెలిపారు. ప్రధానమైన అమెరికా మార్కెట్లో 2019 నాటికి దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇంజెక్టబుల్స్ పేటెంట్ల కాల వ్యవధి తీరిపోనున్న నేపథ్యంలో ఈ విభాగంలోని భారత సంస్థలకు పుష్కలంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని పరిశీ లకులు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా ఇంజెక్టబుల్స్ మార్కెట్ ఏటా 10% వృద్ధి చెందనుందని అంచనా. గ్లాండ్-ఫోసన్ల కథ ఇదీ.. గ్లాండ్ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా భారత్, అమెరికా మార్కెట్లతో పాటు 90 దేశాలకు జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు అందిస్తోంది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేకేఆర్ దాదాపు 200 మిలియన్ డాలర్లతో గ్లాండ్ ఫార్మాలో వాటాలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి అప్పట్లో సంస్థ విలువ సుమారు 600-650 మిలియన్ డాలర్లు. మరోవైపు, చెనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. ఇది కార్డియోవాస్కులర్ ఔషధాల నుంచి వ్యాధి నిర్ధారణ పరికరాల దాకా వివిధ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. -
లాఇకో చెంతకు అమెరికా ఎలక్ట్రానిక్స్ సంస్థ
2 బిలియన్ డాలర్లకు కొనుగోలు న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ‘విజియో’కి చెందిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెక్నాలజీ వ్యాపారం, మేథోసంపత్తి హక్కులు ఈ ఒప్పందంలో భాగంగా లాఇకో సొంతం అవుతాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందని లాఇకో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్నతమ విధానంలో విజియో కొనుగోలు కీలకమైన అడుగని, ఉత్తర అమెరికాలో తమ స్థానాన్ని బలోపేతం చేస్తుందని లాఇకో చైర్మన్, సీఈవో యూటింగ్ జియా చెప్పారు. ఉత్తర అమెరికాలో... కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఇర్విన్ పట్టణంలో 2002లో ఏర్పాటైన విజియో ఉత్తర అమెరికాలో ప్రధాన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్గా ఎదిగింది. స్మార్ట్ టీవీలు, సౌండ్బార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది. విజియో బ్రాండ్కుతోడు పంపిణీదారుల నెట్వర్క్ లాఇకో కంపెనీకి కలసిరానున్నాయి. కొనుగోలు అనంతరం విజి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వ్యాపారాన్ని తన పూర్తి అనుబంధ కంపెనీ కింద లాఇకో నిర్వహించనుంది. డేటా వ్యాపారం ‘ఇన్స్కేప్’ను విడిగా ఓ ప్రైవేటు కం పెనీ కిందకు మార్చనుంది. -
చైనా ఫోసన్ చేతికి.. గ్లాండ్ ఫార్మా!
♦ 96% వాటాల కొనుగోలు...? ♦ డీల్ విలువ రూ.9,500 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీ ఫార్మా రంగంలో భారీ డీల్కు తెరతీస్తూ.. హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మాను చైనా సంస్థ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,500 కోట్లు) వెచ్చించనున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల ప్రకారం.. వ్యవస్థాపకుల వాటాలు సహా ఫోసన్ సుమారు 96 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటాల కొనుగోలుకు సంబంధించి గ్లాండ్ ఫార్మాకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఈ ఏడాది మే లోనే షాంఘై ఫోసన్ ఫార్మా వెల్లడించింది. గ్లాండ్ ఫార్మాను దక్కించుకునేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్, బాక్స్టర్, టోరెంట్ ఫార్మా తదితర సంస్థలు కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. డీల్ పూర్తయితే ఒక దేశీ కంపెనీ పూర్తిగా చైనా సంస్థ అజమాయిషీలోకి వెళ్లనున్నందున దీన్ని నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2014 నాటి గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయంగా ఇంజెక్టబుల్స్ మార్కెట్ 300 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. ఇందులో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 35 శాతం పైచిలుకు ఉంది. భారత మార్కెట్ విలువ 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా అమెరికా తదితర మార్కెట్ల కోసం జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. కంపెనీకి చెందిన ప్లాంట్లకు అమెరికా, బ్రిటన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల అనుమతులు కూడా ఉన్నాయి. ఫార్మా లిక్విడ్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్డీఏ అనుమతులు పొందిన తొలి దేశీ కంపెనీగా గ్లాండ్ ఫార్మా గుర్తింపు పొందింది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్లోని రెండు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో సుమారు 250 మంది పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో మైలాన్, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలకు ఇంజెక్టబుల్స్ను గ్లాండ్ ఫార్మా అందిస్తోంది. 2013లో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్.. దాదాపు 200 మిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. దీని ప్రకారం అప్పట్లో గ్లాండ్ ఫార్మా విలువ 600-650 మిలియన్ డాలర్లు. గ్లాండ్ ఫార్మాలో ప్రమోటర్ రవి పెన్మెత్స కుటుంబం, కేకేఆర్లకు 96 శాతం మేర వాటాలు ఉన్నాయి. 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్లాండ్ ఫార్మా ఆదాయాలు రూ. 994 కోట్ల మేర ఉండగా లాభం సుమారు రూ. 209 కోట్లుగా నమోదైంది. ఫోసన్ గ్రూప్... చైనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. గతేడాది కంపెనీ ఆదాయాలు సుమారు 1.9 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఆర్థిక సేవలు, హెల్త్కేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఉన్న ఫోసన్ గ్రూప్ ఇటీవలి రెండేళ్ల కాలంలో వివిధ అంతర్జాతీయ డీల్స్పై బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. భారత్లో సూలా వైన్యార్డ్స్, స్పైస్జెట్ వంటి సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరిపింది. గ్లాండ్ ఫార్మా డీల్తో రీసెర్చ్, తయారీ సామర్ధ్యాలను భారత్లో విస్తరించుకునేందుకు ఫోసన్కు తోడ్పడనుంది. -
ఫ్లిప్‘కార్ట్’లోకి.. జబాంగ్
♦ డీల్ విలువ రూ. 470 కోట్లు... ♦ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా కొనుగోలు న్యూఢిల్లీ : దేశీ ఈ-కామర్స్ రంగంలో మరో కీలక డీల్కు దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ తెరతీసింది. ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జబాంగ్ను చేజిక్కించకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు). గతేడాది జబాంగ్ ఆదాయంలో ఈ మొత్తం సగం కావడం గమనార్హం. కాగా, ఈ డీల్తో భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ మరింతగా దూసుకెళ్లేందుకు దోహదం చేయనుంది. ప్రధానంగా మహిళల ఫ్యాషన్ అపారెల్(దుస్తులు) వంటి విభాగాల్లో గట్టి పట్టున్న జబాంగ్ను దక్కించుకోవడం ద్వారా మింత్రా.. ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్లో సత్తా చాటేందుకు వీలవుతుంది. వివిధ రకాల అనుమతులకు లోబడి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తికావచ్చనేది అంచనా. కాగా, జబాంగ్ కొనుగోలు రేసులో మరో ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్తో పాటు ఫ్యూచర్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్ అబాఫ్ కూడా పోటీపడటం గమనార్హం. మింత్రాతో ఆరంభం... 2014లో మింత్రాను ఫ్లిప్కార్ట్ దాదాపు రూ.2,000 కోట్ల మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. దేశీ ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా కూడా ఇది నిలిచింది. జబాంగ్ కొనుగోలుతో మింత్రా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.5 కోట్ల మందికి చేరుకోనుంది. జబాంగ్ వద్ద 1,500 ఇంటర్నేషనల్ హై-స్ట్రీట్ బ్రాండ్స్, స్పోర్ట్స్ లేబుల్స్, ఇండియన్ ఎత్నిక్-డిజైనర్ లేబుల్స్ లిస్ట్ అయి ఉన్నాయి. 1,000కి పైగా సెల్టర్లు రిజిస్టర్ అయ్యారు. 2012 జబాంగ్ ఆరంభమైంది. అయితే, ఈ సంస్థకు ప్రధాన ఇన్వెస్టర్ అయిన రాకెట్ ఇంటర్నెట్.. లాటిన్ అమెరికా, రష్యా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో ఉన్న మరో నాలుగు ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్లతో జబాంగ్ను విలీనం చేయడం ద్వారా జీఎఫ్జీని ఏర్పాటు చేసింది. స్వీడన్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ కినెవిక్కు ఇప్పుడు జబాంగ్ మాతృ సంస్థ జీఎఫ్జీలో అత్యధికంగా వాటా ఉంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన 12 నెలలకు జబాంగ్ నికర ఆదాయం 12.6 కోట్ల యూరోలుగా నమోదైంది. కాగా, ఈ ఏడాది(2016) తొలి త్రైమాసికంలో ఆదాయం 14% ఎగసి 3.26 కోట్ల యూరోలకు చేరింది. విడి విడిగానే... మింత్రా, జబాంగ్లను అనుసంధానించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని.. విడివిడిగానే ఇవి రెండూ కార్యకలాపాలను కొనసాగిస్తాయని మింత్రా సీఈఓ అనంత్ నారాయణ్ పేర్కొన్నారు. దీనికున్న 40 లక్షల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు, అనేక అంతర్జాతీయ బ్రాండ్ల నేపథ్యంలో రెండూ ఒకదానితో ఒకటి సమన్వయంతో ముందుకెళ్లాలనేది తమ ప్రణాళిక అని ఆయన చెప్పారు. కాగా, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) అంచనాల ప్రకారం దేశంలో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం(ఈ-టైలింగ్) వార్షికంగా 57 శాతం వృద్ధిని సాధిస్తోంది. 2014 డిసెంబర్ నాటికి రూ.2,4046 కోట్లుగా ఉన్న మార్కెట్.. గతేడాది డిసెంబర్కు రూ.37,689 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది చివరికల్లా ఇది రూ.72,639 కోట్లకు దూసుకెళ్తుందనేది ఐఏఎంఏఐ అంచనా. భారత్ ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధికి ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తులు కీలకంగా నిలుస్తున్నాయి. ఈ విభాగాల్లో దూసుకెళ్లడమే మా లక్ష్యం. మింత్రా ద్వారా ఇప్పటికే తగినంత మార్కెట్ను సొంతం చేసుకున్నాం కూడా. దేశీ ఈ-కామర్స్ రంగంలో కీలక పరిణామాలకు అనుగుణంగా మా గ్రూప్ సాగిస్తున్న ప్రస్థానానికి జబాంగ్ కొనుగోలు నిదర్శనంగా నిలుస్తుంది. - బిన్నీ బన్సల్, ఫ్లిప్కార్ట్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జబాంగ్ విక్రయం తర్వాత మా కీలక ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్స్ వృద్ధిపై దృష్టిపెట్టనున్నాం. లామోడా, డాఫిటి, నమ్షి, ద ఐకానిక్, జలోరా ఆన్లైన్ స్టోర్స్కు 24 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వీటిని విస్తరించనున్నాం. - లారెంజో గ్రాబూ, జీఎఫ్జీ చైర్మన్, కెనెవిక్ సీఈఓ -
వెరిజాన్ చేతికి యాహూ!
♦ ఇంటర్నెట్ అసెట్స్ కొనుగోలుకు ఒప్పందం ♦ డీల్ విలువ రూ.32,500 కోట్లు... ♦ యాహూను ఏఓఎల్తో అనుసంధానించనున్న వెరిజాన్ న్యూయార్క్: సెర్చ్, మెయిల్, చాట్, న్యూస్... ఇలా ఏదన్నా మొదట గుర్తుకొచ్చే పేరు యాహూనే. కాకపోతే ఇదంతా గూగుల్ రాకముందు. ఒకప్పుడు మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న యాహూ... చివరకు గూగుల్తో పోటీపడలేక చతికిలబడిపోయింది. వరస నష్టాలతో... తెచ్చిన కొత్త ఉత్పత్తులన్నీ ఫ్లాప్ కావటంతో దిక్కుతోచక కొట్టుకుంటున్న ఈ సంస్థ... ఎట్టకేలకు చేతులు మారుతోంది. ఈ అమెరికన్ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న యాహూ వ్యాపారాన్ని (ఇంటర్నెట్ అసెట్స్) మాత్రమే వెరిజాన్ దక్కించుకోనుంది. ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్తో (అమెరికా ఆన్లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. కాగా, యాహూ దగ్గరున్న నగదు నిల్వలు, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్లో దానికున్న వాటా, యాహూ జపాన్లో షేర్లు, కొన్ని మైనారిటీ పెట్టుబడులు, కొన్ని నాన్-కోర్ పేటెంట్లు ఈ కొనుగోలు ఒప్పందం పరిధిలోకి రావని ఆ ప్రకటనలో వివరించింది. ఇక ఇన్వెస్ట్మెంట్ కంపెనీగానే... యాహూ కొనుగోలు ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉది. ముఖ్యంగా యాహూ వాటాదారుల ఆమోదం, నియంత్రణ సంస్థలు ఇతరత్రా అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెరిజాన్ తెలిపింది. కాగా, డీల్ పూర్తయిన తర్వాత యాహూ తన పేరును మార్చుకుంటుంది. రిజిస్టర్డ్ పబ్లిక్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారుతుంది. డీల్ పూర్తయ్యేవరకూ యాహూ ప్రస్తుత నిర్వహణ మొత్తం స్వతంత్రంగానే కొనసాగుతుందని.. యూజర్లు, అడ్వర్టయిజర్లు, డెవలపర్లు, పార్ట్నర్లు అందరికీ సేవలు, ఉత్పత్తులను యథావిధిగా అందిస్తుందని వెరిజాన్ తెలియజేసింది. 1994లో ఆవిర్భావం... స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులైన జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో కలిసి యాహూను 1994లో నెలకొల్పారు. ఇంటర్నెట్ రంగంలో తొలితరం సెర్చింజన్గా, ఈ-మెయిల్ సేవల్లో కూడా తనదైన మార్కును ప్రపంచవ్యాప్తంగా యాహూ చూపించింది. వెబ్ బ్రౌజర్ నెట్స్కేప్ ఇతరత్రా కొన్ని సంస్థల మాదిరిగా కాకుండా డాట్కామ్ బూమ్ బద్దలైన తర్వాత కూడా యాహూ నిలదొక్కుకోవడంతో పాటు షాపింగ్, న్యూస్ వంటి ఇతర సేవల్లో కూడా విస్తరించి ముందుకెళ్లింది. అయితే, గూగుల్ బరిలోకి దిగాక పరిస్థితి మారింది. పోటీలో వెనుకబడటంతోపాటు ఈ విధమైన సేవల్లో విపరీతమైన పోటీ కారణంగా నెమ్మదిగా యాహూ ప్రాభవం మసకబారింది. కాగా, ప్రస్తుతం యాహూకు 100 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లున్నట్లు అంచనా. ఇందులో 60 కోట్ల మేర యాక్టివ్ మొబైల్ యూజర్లు. నాలుగేళ్ల కిందట కంపెనీ పగ్గాలు చేపట్టిన మరిస్సా మేయర్.. గూగుల్ ఇతర పోటీ కంపెనీలను తట్టుకొని యాహూకూ పూర్వ వైభవం తీసుకురావడంలో విఫలమయ్యారు. మేయర్ అంతక్రితం గూగుల్లోనే పనిచేయడం విశేషం. యాహూ! మరికొన్ని విశేషాలు.. ♦ 2000 సంవత్సరంలో డాట్కామ్ బూమ్ బద్దలయ్యే ముందు వరకూ యాహూ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2008లో కూడా యాహూను కొనుగోలు చేయడం కోసం మైక్రోసాఫ్ట్ 44 బిలియన్ డాలర్లకు బిడ్ వేయడం గమనార్హం. ♦ యాహూ సోషల్ మీడియాపై పట్టు సంపాదించేందుకు ఆన్లైన్ బ్లాగింగ్ సంస్థ టంబ్లర్ను 2013లో బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా యాహూలో 2014 వరకూ 11,000 మంది ఉద్యోగులుండగా కోతల కారణంగా ఈ మార్చి నాటికి 9,400 మంది మిగిలారు. ♦ 2015లో 4.9 బిలియన్ డాలర్ల ఆదాయంపై 4.4 బిలియన్ డాలర్ల నష్టం రావటం గమనార్హం. ♦ ప్రస్తుతం యాహూ మార్కెట్ విలువ 38 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు)గా ఉంది. అయితే, ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో యాహూకు ఉన్న 15 శాతం వాటా ఆధారంగానే ఇంతటి విలువ ఉంది. అలీబాబాలో ఉన్న యాహూ వాటా విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లు. ♦ ఇంకా నాన్-కోర్ పేటెంట్లను యాహూ విడిగా విక్రయించనుంది. ఈ డీల్ బిలియన్ డాలర్లకుపైగానే (సుమారు రూ.6,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. ♦ దాదాపు 228 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న అమెరికా టెలికం అగ్రగామి వెరిజాన్... గతేడాది ఏఓఎల్ను 4.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా హఫింగ్టన్ పోస్ట్, టెక్క్రంచ్, ఎన్గ్యాడ్జెట్ తదితర న్యూస్ వెబ్సైట్లను తన యాజమాన్యంలోకి తీసుకొచ్చింది. ♦ యాహూను ఏఓఎల్తో అనుసంధానించడం ద్వారా గూగుల్, ఫేస్బుక్ తరహాలోనే డిజిటల్ అడ్వర్టయిజింగ్లో దూసుకెళ్లాలనేది వెరిజాన్ వ్యూహం. ‘డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఇంటర్నెట్ సేవలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఏడాది క్రితం మేం ఏఓఎల్ను చేజిక్కించుకున్నాం. ఇప్పుడు యాహూను కూడా దక్కించుకోవడంతో ఇకపై ప్రపంచంలోని దిగ్గజ మొబైల్ మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించేందుకు వీలవుతుంది. డిజి టల్ అడ్వర్టయిజింగ్లో ఆదాయం కూడా భారీగా పుంజుకోనుంది’. - లావెల్ మెక్ఆడమ్, వెరిజాన్ చైర్మన్, సీఈఓ ‘వెబ్ బ్రౌజింగ్, ఇంటర్నెట్ సేవల్లో ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఘనత యాహూ సొంతం, వెరిజాన్-ఏఓఎల్ల నేతృత్వంలో ఇకపై కూడా యాహూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ప్రధానంగా ప్రస్తుత నిర్వహణ వ్యాపారాన్ని అమ్మడం ద్వారా ఆసియాలో ఉన్న అసెట్ ఈక్విటీ వాటాలను విడగొట్టేందుకు వీలవుతుంది. వాటాదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రణాళికల్లో ఇది కీలకం. ఈ రోజుకు యాహూకు చాలా గొప్ప రోజు. వ్యక్తిగతంగా నాకు కూడా. నేను కంపెనీతోనే కొనసాగుతాను. అంతేకాదు కంపెనీ కొత్త అధ్యాయంలో నేను భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. మీ అందరిపై(ఉద్యోగులు) నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఐ లవ్ యాహూ’. - ఉద్యోగులకు లేఖలో మరిస్సా మేయర్, యాహూ సీఈఓ -
ఐడీఎఫ్సీ బ్యాంక్ చేతికి గ్రామ విదియాల్
ముంబై : ఐడీఎఫ్సీ బ్యాంక్... తమిళనాడుకు చెందిన సూక్ష్మ రుణ సంస్థ గ్రామ విదియాల్ను కొనుగోలు చేసింది. ఈ సూక్ష్మ రుణ సంస్థ కొనుగోలుతో మరింతగా విస్తరిస్తామని ఐడీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఐడీఎఫ్సీ వెల్లడించలేదు. ఈ కొనుగోలు కారణంగా మూడు దశాబ్దాల చరిత్ర గల గ్రామ విదియాల్ ఇక నుంచి తమ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని ఐడీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ, రాజీవ్ లాల్ చెప్పారు. ఒక సూక్ష్మ రుణ సంస్థను ఒక బ్యాంక్ చేజిక్కించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. తమ పూర్తిస్థాయి బిజినెస్ కరెస్పాండెంట్గా ఈ సంస్థ వ్యవహరిస్తుందని వివరించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్.. ఈ ఏడు రాష్ట్రాల్లోని 310 గ్రామ విదియాల్ కేంద్రాలు ఐడీఎఫ్సీ పరం అవుతాయని, 12 లక్షల కుటుంబాలు తమ బ్యాంక్ ఖాతాదారులవుతాయని తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి గ్రామ విదియాల్కు రూ.1,502 కోట్ల నిర్వణ ఆస్తులు, 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ ఖాతాల్లో ఉన్న అన్ని రుణ ఆస్తులు ఐడీఎఫ్సీ బ్యాంక్కు బదిలీ అవుతాయి. అణగారిన వర్గాల, గ్రామీణ ప్రాంతాల వారీ జీవనోపాధిని మరింత మెరుగుపరచాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని గ్రామ విదియాల్ చైర్మన్ ఎస్. దేవరాజ్ చెప్పారు. ఈ కొనుగోలు వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేరు 8.4 శాతం లాభంతో రూ.52 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి ఫరెవర్ 21
డీల్ విలువ రూ.176 కోట్లు న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) కంపెనీ అంతర్జాతీయ క్లోథింగ్ బ్రాండ్ ఫరెవర్ 21ను(భారత మార్కెట్) కొనుగోలు చేయనున్నది. భారత్లో ఫరెవర్21 బ్రాండ్ను రూ.175.52 కోట్లకు (2.6 కోట్ల డాలర్లకు) కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. ఈ మేరకు డయానా రిటైల్, డీఎల్ఎఫ్ బ్రాండ్స్తో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. ఫరెవర్ 21 బ్రాండ్కు డయానా రిటైల్ సంస్థ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఫరెవర్ 21ఆన్లైన్, ఆఫ్లైన్ హక్కులను చేజిక్కించుకోనున్నామని ఈ ఏడాది మేలోనే ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ఫరెవర్ 21 బ్రాండ్.. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా స్టోర్స్ను నిర్వహిస్తోంది. -
టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు
వైజాగ్ ప్లాంటు కొనుగోలుకు ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం టోరెంట్ ఫార్మా తాజాగా గ్లోకెమ్ ఇండస్ట్రీస్కు చెందిన వైజాగ్ ప్లాంటును, కొన్ని డ్రగ్ మాస్టర్ ఫైల్స్ (డీఎంఎఫ్)ను ఏకమొత్తంగా కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి గ్లోకెమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లోకెమ్.. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడిపదార్ధాలు (బల్క్ డ్రగ్స్ లేదా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్-ఏపీఐ) ఉత్పత్తి చేస్తుంది. వైజాగ్లో పరవాడకు దగ్గర్లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న ప్లాంటుకు ఎఫ్డీఏ, యూరోపియన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులున్నాయి. ఇందులో నాలుగు బ్లాక్లు ఏపీఐల తయారీకి ఉపయోగపడుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ, పైలట్ ప్లాంట్ తదితర సదుపాయాలున్నాయి. ప్లాంటులో అగ్నిప్రమాదం కారణంగా కొద్దిరోజుల క్రితమే వార్తల్లో నిల్చింది. ఇక డీల్ విలువను కంపెనీలు వెల్లడించనప్పటికీ .. సుమారు రూ. 300 కోట్ల మేర ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్కు అనుగుణంగా ఔషధాల ఉత్పత్తికి ఈ కొనుగోలు తమకు ఉపయోగపడగలదని టోరెంట్ ఫార్మా ఈడీ (ఆపరేషన్స్ విభాగం) జినేష్ షా తెలిపారు. వివిధ ఔషధాల ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనాలు తదితర వివరాలతో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)కి తయారీ సంస్థలు సమర్పించే పత్రాలను డీఎంఎఫ్గా వ్యవహరిస్తారు. టోరెంట్ ఫార్మాకు 5 ఫార్ములేషన్ ప్లాంట్లున్నాయి. తాజాగా గ్లోకెమ్ వైజాగ్ కేంద్రాన్ని కొనుగోలు చేయడంతో ఏపీఐ ప్లాంట్ల సంఖ్య మూడుకు చేరుతుంది. హైదరాబాద్కే చెందిన ఇంజెక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్ ఫార్మా కొనుగోలుకు పోటీపడిన సంస్థల్లో టోరెంట్ కూడా ఉంది. అయితే, వాల్యుయేషన్ల వల్ల వైదొలిగింది. -
డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) షేర్ల బైబ్యాక్ ఆఫర్ కింద 51 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. సగటున షేరు ఒక్కింటికి రూ. 3,090.92 చొప్పున కొనుగోలు చేశామని, ఇందుకోసం మొత్తం రూ. 1,569 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. దీంతో బైబ్యాక్ ముగిసినట్లయిందని పేర్కొంది. షేరు ఒక్కింటికి రూ. 3,500కు మించకుండా రూ. 1,569.4 కోట్లు వెచ్చించి ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్ చేపట్టాలన్న ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఆర్ఎల్ బోర్డు ఆమోదించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో డీఆర్ఎల్ షేర్ల బైబ్యాక్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల దరిమిలా మంగళవారం కంపెనీ షేరు ధర 0.81 శాతం పెరిగి రూ. 3,266.81 వద్ద ముగిసింది. -
నియోటెల్కు ‘టాటా’..
♦ డీల్ విలువ రూ.2,900 కోట్లు ♦ టాటా కమ్యూనికేషన్స్కు రూ.1,992 కోట్లు న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ తన ఆఫ్రికా అనుబంధ సంస్థ, నియోటెల్ పీటీైవె ను విక్రయించనున్నది. ఈకోనెట్ వెర్లైస్ గ్లోబల్ అనుబంధ కంపెనీ లిక్విడ్ టెలికం, రాయల్ బాఫోకెంగ్ హోల్డింగ్స్(ఆర్బీహెచ్)లు నియోటెల్ కంపెనీని రూ.2,900 కోట్లకు కొనుగోలు చేయనున్నాయి. ఈ మేరకు నియోటెల్లో మెజారిటీ వాటా ఉన్న టాటా టెలికమ్యూనికేషన్స్తోనూ, మైనారిటీ వాటాదారులకు నాయకత్వం వహిస్తున్న నెక్సస్ కనెక్సియన్తోనూ లిక్విడ్ టెలికం, ఆర్బీహెచ్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్కు రూ.1,992 కోట్లు. నెక్సస్ కనెక్సియన్ నేతృత్వంలోని మైనారిటీ వాటాదారులకు రూ.908 కోట్లు లభిస్తాయి. ఈ వాటా కొనుగోలు తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ఎంపవర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అయిన ఆర్బీహెచ్కు నియోటెల్లో 30 శాతం వాటా ఉంటుంది. లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి.. నియోటెల్ తర్వాతి దశ వృద్ధికి లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి అని టాటా కమ్యూనికేషన్స్ ఎండీ,సీఈఓ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ డీల్ అన్ని ఆమోదాలు పొంది సాకారమైతే, దక్షిణాఫ్రికాలో అతి పెద్ద బ్రాడ్బాండ్ నెట్వర్క్, బీ2బీ టెలికం ప్రొవైడర్ నియోటెల్ అవుతుంది. 2009లో నియోటెల్లో 68.5ు వాటాను టాటా కమ్యూనికేషన్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్ఈలో 8% లాభంతో రూ.486కు ఎగసింది. చివరకు 2.4%లాభంతో రూ.461 వద్ద ముగిసింది. -
ఎస్ఎస్టీఎల్లో రష్యా ప్రభుత్వ వాటా కొంటాం
సిస్టెమా జేఎస్ఎఫ్సీ వెల్లడి ముంబై: భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తన అనుబంధ కంపెనీలో కొంత వాటాను రష్యాకు చెందిన సిస్టెమా జేఎస్ఎఫ్సీ కంపెనీ కొనుగోలు చేయనుంది. భారత్లోని తమ అనుబంధ సంస్థ, సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్(ఎస్ఎస్టీఎల్)లో 17.14 శాతం వాటాను కొనుగోలు చేస్తామని రష్యా పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సిస్టెమా సోమవారం వెల్లడించింది. రష్యా ప్రభుత్వం నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఈ డీల్ విలువ 77.7 కోట్ల డాలర్లు ఉండొచ్చని అంచనా. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో ఇన్స్టాల్మెంట్లలలో రష్యా ప్రభుత్వానికి చెల్లిస్తామని వివరించింది. ఎస్ఎస్టీఎల్ సంస్థ ఎంటీఎస్ బ్రాండ్ కింద భారత్లోని తొమ్మిది టెలికం సర్కిళ్లలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్లో విలీనం కానున్నది. ప్రస్తుతం ఎస్ఎస్టీఎల్ విలీన ప్రక్రియ కొనసాగుతోంది. విలీనంతరం ఏర్పడే కంపెనీలో ఎస్ఎస్టీఎల్కు 10 శాతం వాటా ఉంటుందని అంచనా. -
32 కోట్లతో ఇల్లు కొన్న ఫ్లిప్కార్ట్ చీఫ్ బిన్నీ బన్సల్
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తాజాగా బెంగళూరులోని ఎంట్రప్రెన్యూరియల్ (ఐటీ) హబ్ ‘కోరమంగళ’లో రూ. 32 కోట్లు వెచ్చించి ఇంటిని (10,000 చదరపు అడుగుల విస్తీర్ణం) కొనుగోలు చేశారు. ఇందుకోసం రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. బెంగళూరులో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఖరీదైన ఇళ్ల కొనుగోళ్లలో ఇది కూడా ఒకటి. బిన్నీ బన్సాల్ తాజాగా కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఫ్లిప్కార్ట్ మరొక సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్కు కూడా ఇల్లుంది. అలాగే ఇక్కడ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని, క్రిష్ గోపాలకృష్ణన్, నారాయణ ెహ ల్త్ వ్యవస్థాపకుడు దేవీ ప్రసాద్ శెట్టి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ వంటి తదితర ప్రముఖులు నివసిస్తున్నారు. ఇక్బాల్ కుటుంబం నుంచి బిన్నీ బన్సాల్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. కోరమంగళ ప్రాంతం.. సంపన్నులకు నెలవు. -
ఆ సీఈవో రూ.32 కోట్ల సౌధానికి యజమాని
బెంగళూరు: బిగ్గెస్ట్ ఆన్ లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ సీఈవో బిన్నీబన్సల్ (32) టెక్ సిటీలోని విలాసవంతమైన ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. దాదాపు రూ.32కోట్లు (5మిలియన్ డాలర్లు) ఖరీదు చేసే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతలో ఓ విశాలమైన సౌధాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. 32 సం.రాల వయసులో 32 కోట్ల రూపాయిల కలల సౌధానికి అధిపతిగా అవతరించాడు ఫ్లిప్ కార్ట్ బాస్. ఇటీవల బెంగళూరులో జరిగిన అతిపెద్ద గృహ కొనుగోలు డీల్స్లో ఇదీ ఒకటని అంచనా. తొమ్మిదేళ్ల క్రితం ఫ్లిప్కార్ట్ను ప్రారంభించిన ప్రదేశానికి ఇది సమీపంలోనే ఉండడం విశేషం. అన్నట్టు ఫ్లిప్కార్ట్ మరో సహవ్యవస్థాపకుడైన సచిన్ బన్సాల్ దీనికి పొరుగునే కొన్నేళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన ఫ్లిప్కార్ట్లోని కొన్ని షేర్లను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడ ఇల్లు కొన్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, క్రిస్ గోపాల కృష్ణన్, డాక్టర్ దేవిశెట్టి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు నివసించే ఏరియాకి దగ్గరలోనే బన్సాల్ , ఆయన భార్య త్రిష కూడా చేరారు. కాగా బన్సాల్ రెండు ప్రైవేటు బ్యాంకుల్లో కొంత మొత్తం అప్పు తీసుకొని మరీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇక్బాల్ కుటుంబంనుంచి దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు కొన్ని వారాల క్రితమే రిజిష్ట్రేషన్ పూర్తయింది. అయితే దీనిపై స్పందించడానికి బిన్నీ బన్సల్ నిరాకరించారు. -
టెక్ మహీంద్రా చేతికి బయో ఏజెన్సీ కంపెనీ
డీల్ విలువ 4.5 కోట్ల పౌండ్లు న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా ఇంగ్లండ్కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బయో ఏజెన్సీని అంతా నగదులోనే కొనుగోలు చేశామని టెక్ మహీంద్రా తెలిపింది. ఈ కంపెనీ చేరికతో తమ డిజిటల్ సర్వీసుల పోర్ట్ఫోలియో మరింత శక్తివంతం అవుతుందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి. పి. గుర్నాని చెప్పారు. ఈ డీల్ వచ్చే నెల మొదటి వారంలో పూర్తవుతుందని వివరించారు. బయో ఏజెన్సీ కొనుగోలు కారణంగా అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్లో మరిన్ని సంస్థల నుంచి ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 2006, ఏప్రిల్లో ప్రారంభమైన బయో ఏజెన్సీ సంస్థ, గత ఆర్థిక సంవత్సరంలో 1.25 కోట్ల పౌండ్ల ఆదాయం ఆర్జించింది. -
ట్వీట్టర్ చేతికి మ్యాజిక్ పోనీ
డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ! న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్టర్, లండన్కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోన్’ను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ కొనుగోలు కారణంగా తమ మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అంశాల్లో తమ సామర్థ్యాలు మరింతగా విస్తరిస్తాయని ట్వీట్టర్ తెలిపింది. 2014 జూలైలో మ్యాడ్బిట్స్ ఇమేజ్ సెర్చ్ స్టార్టప్ను, గత ఏడాది జూన్లో వెట్ల్యాబ్ మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ను కొనుగోలు చేశామని ట్వీట్టర్ సీఈఓ జాక్ డార్సే.. ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. తాజాగా మ్యాజిక్ పోన్ను కొనుగోలు చేయడం... మెషీన్ లెర్నింగ్పై పెట్టిన ఇతర పెట్టుబడులకు అదనమని వివరించారు. తమ లైవ్, వీడియోలను మరింత పటిష్టం చేసేందుకు మ్యాజిక్ పోనీ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. మ్యాజిక్ పోనీ ఉద్యోగులను మెషీన్ లెర్నింగ్ అంశంపై పరిశోధనలు చేసే ట్వీట్టర్ కోర్టెక్స్ సంస్థలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. మ్యాజిక్ పోనీ సంస్థను కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను డార్సే వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని టెక్క్రంచ్డాట్కామ్ వెల్లడించింది. -
ఏ బైక్ కొందాం?
ఏ బైక్ కొందాం? బైక్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులోనూ మొదట మెదిలే ప్రశ్న ఇదే. కొందరైతే తమ స్నేహితుల్ని అడుగుతారు. ఇంకొందరైతే బంధువుల్ని అడుగుతారు. మరికొందరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. సమీక్షలు చదువుతారు... వివిధ బైక్ల ప్రకటనలు చూస్తారు. కాకపోతే విచిత్రమేంటంటే ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా అయోమయంలో పడతారు. ఎందుకంటే అన్ని బైక్లూ బాగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరేం చెయ్యాలి? బైక్ కొనేటపుడు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ధర... మైలేజీ... ఫీచర్స్... లుక్. వీటిలో కూడా ఎవరి అవసరాలు వారివి. బడ్జెట్లో కొనాలనుకున్న వారు ధర చూస్తారు. ఎక్కువ తిరిగేవారు మైలేజీ చూస్తారు. కాస్త స్టైల్ కోరుకునే కుర్రకారు లుక్, ఫీచర్లు చూస్తారు. ఇక్కడ ఎవరి చాయిస్ వారిదే. అందుకే ఇపుడు దేశంలో అత్యధిక మైలేజీతో జనాదరణ పొందిన బైక్లపై ఈ ప్రత్యేక కథనం... ♦ మైలేజీయే ప్రధానాస్త్రంగా మార్కెట్లోకి కొత్త బైక్లు ♦ హీరో, బజాజ్, టీవీఎస్... అన్ని కంపెనీలదీ ఇదే రూటు ♦ స్ల్పెండర్ ఐస్మార్ట్ నుంచి ప్యాషన్ ప్రొ వరకూ అన్నీ దీన్లో కింగ్లే ♦ తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్లతో బజాజ్ పోటీ ♦ డిజైన్, ధరతో కూడా ఆకట్టుకుంటున్న టీవీఎస్ ♦ మైలేజీ, ధర, ఫీచర్లు, లుక్లో దేనికదే సాటి... హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 102.5 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,008 దేశంలో అత్యధిక మైలేజ్ను ఇచ్చే బైక్ ఇది. లీటరుకు 102.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్... దేశీ టూవీలర్ మార్కెట్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్’ ఉత్పాదన. కంపెనీ ఈ బైక్లో వినూత్న ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. అంతేకాదు!! క్లచ్ పట్టుకుంటే చాలు. బైక్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ బటన్, కిక్రాడ్తో పని లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ ప్రాంతాలకిది అనువుగా ఉంటుంది. ఎయిర్కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ వాడటం వల్ల ఈ మైలేజీ ఇస్తోంది. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. ట్యాంక్లో 8.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. బజాజ్ సీటీ 100 ఇంజిన్ - 99.27 సీసీ మైలేజ్ - 99.1 కిలోమీటర్లు/లీటర్ ధర - 39,389 తక్కువ ధరలోనే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘బజాజ్ ఆటో’ అందిస్తున్న మైలేజ్ బైక్ ఇది. ఐస్మార్ట్ రాక ముందువరకూ దేశంలో అత్యధిక మైలేజీ బైక్ ట్యాగ్ దీనిదే. ఇపుడు మైలేజీలో రెండో స్థానానికి చేరింది. ఇందులో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్కూల్డ్ ఇంజిన్ను అమర్చారు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బైక్... ఫ్యూయెల్ ట్యాంక్లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.05 ఎన్ఎం-4,500 ఆర్పీఎం. బజాజ్ ప్లాటినా ఈఎస్ ఇంజిన్ - 102 సీసీ మైలేజ్ - 96.9 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,230 బజాజ్ ఆటో బైక్ల శ్రేణిలో మైలేజీలో రెండో స్థానంలో ఉన్న బైక్ ఇది. లీటరుకు 96.9 కిలోమీటర్ల మైలేజ్ను ఇచ్చే ఈ బైక్లో అడ్వాన్స్డ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ డీటీఎస్ -ఐ ఇంజిన్ను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ప్లాటినా ఫ్యూయెల్ ట్యాంక్లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.6 ఎన్ఎం-5,000 ఆర్పీఎం. టీవీఎస్ స్పోర్ట్ ఇంజిన్ - 99.77 సీసీ మైలేజ్ - 95 కిలోమీటర్లు/లీటర్ ధర - 44,140 ‘టీవీఎస్ మోటార్’ కంపెనీ అందిస్తున్న బైకుల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇదే. లీటరుకు 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపెనీ ఈ బైక్లో 4 స్ట్రోక్ డ్యూరాలైఫ్ ఇంజిన్ను పొందుపరిచింది. ఇంజిన్ పవర్ 7.8 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 7.8 ఎన్ఎం-5,500 ఆర్పీఎం. ఆకట్టుకునే డిజైన్ ఈ బైక్ సొంతం. స్పోర్ట్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 12 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 50,500 హీరో మోటొకార్ప్ తయారీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర ఈ బైక్ను మనం గమనిస్తూనే ఉంటాం. అధిక సంఖ్యాక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బైక్... బహుశా ఇదే అనొచ్చేమో. లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎకో ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 48,336 హీరో మోటోకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను వాడారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 51,300 హీరో మోటోకార్ప్ అందిస్తోన్న మరో మైలేజీ బైక్ స్ల్పెండర్ ప్రొ క్లాసిక్. ఇది లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను పొందుపరిచారు. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 11లీటర్ల పెట్రోల్ పడుతుంది. ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్ సొంతం. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,318 హీరో మోటొకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్యూ-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో ప్యాషన్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 87.37 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,400 హీరో మోటొకార్ప్ నుంచి వచ్చిన మరో బైక్ ఇది. లీటరుకు 87.37 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 12.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డాన్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 40,070 ఇది కూడా దేశీ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఉత్పాదనే. ఇది లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. గమనిక పైన పేర్కొన్న మైలేజీలు... సెంట్రల్ మోటార్ వె హికల్ రూల్స్(సీఎంవీఆర్)ను అనుసరించి ప్రత్యేక పరీక్షల్లో నిర్ధారించినవి. రోడ్డుపై వాస్తవంగా వచ్చే మైలేజీకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడా మామూలు ట్రాఫిక్లో 20% వరకూ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది.అమ్మకాల్లో టాప్-10 స్కూటర్లు... నిజానికి దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో బైక్ల వాటాయే ఎక్కువ. కాకపోతే ఐదేళ్లుగా స్కూటర్ల వాటా మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2015-16లో స్కూటర్ల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా 50 లక్షల యూనిట్ల మార్కును దాటి 50,31,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 24.66 లక్షల యూనిట్ల విక్రయాలతో హోండా యాక్టివా టాప్లో నిలిచింది. ఇక టీవీఎస్ జూపిటర్ అనూహ్యంగా హీరో మాస్ట్రోను ఓవర్ టేక్ చేసి 5.37 లక్షల యూనిట్లతో రెండో స్థానానికి చేరింది. మాస్ట్రో 4.98 లక్షల యూనిట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హోండా డియో, హీరో ప్లెజర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, హీరో డ్యూయట్, హోండా ఏవియేటర్, యమహా రే టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. 2015 మే నెలలో ఆవిష్కరించిన ఫాసినో నాలుగు నెలల్లోనే 1 లక్ష యూనిట్ల మార్కును దాటి.. యమహాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిలిచింది. భారత్లో కార్ల మార్కెట్ అంతకంతకూ పుంజుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కార్ల కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్ను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. మరి ఇన్నిరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతీయ కస్టమర్లు కారు కొనే ముందు మైలేజీ, డిజైన్, కంపెనీ బ్రాండ్ ఇలా దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్లు.. వాటి ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులను కట్టిపడేస్తున్న లగ్జరీ కార్ల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే వారం ప్రాఫిట్ ప్లస్లో ఇవన్నీ మీ కోసం ప్రత్యేకం. సో.. గెట్ సెట్.. వెయిట్! -
ముప్పు తప్పాలంటే ముందే చూడాలి!
ఫ్లాటు కొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేంటి? వాణిజ్య సముదాయాల్లో స్థలం కొనేవారు, అద్దెకిచ్చేవారు చూడాల్సిన వివరాలేంటి? ఫ్లాట్ కొనేటప్పుడు మోసపోతున్నామని ముందే తెలుసుకోవటమెలా? స్థిరాస్తి కొనేముందు ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిందే. లేకపోతే కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. త్వరలోనే స్థిరాస్తి రేట్లు పెరుగుతాయనో.. ఇప్పుడు కొనకుంటే అసలిక కొనలేమనో.. ఆఫర్లు, రాయితీలిస్తున్నారనో.. స్థిరాస్తి కొనుగోలులో తొందరపడొద్దు. సాక్షి, హైదరాబాద్ :అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, వాణిజ్య భవనంలో స్థలం కానీ కొనేటప్పుడు అమ్మే వ్యక్తి అసలు పత్రాల్ని చూపించమనండి. ఏదో ఒక సాకు చెప్పి.. పత్రాలు ప్రస్తుతం లేవని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే. ఫ్లాట్ అమ్మే వ్యక్తికి ఆ ఆస్తిపై క్లియర్ టైటిల్ లేకపోవడమో, ఆస్తి పత్రాల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టడమో జరిగిందని దానర్థం. కాబట్టి అసలు పత్రాల్ని చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. ♦ స్థిరాస్తిని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయాన్ని నిర్ణయించే యాజమాన్య హక్కుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ల పత్రాలు జిరాక్స్ కాపీలను ఇవ్వాలని కోరండి. అనుభవమున్న న్యాయవాదికి ఆ పత్రాలను చూపించి సలహా తీసుకోవటం మంచిది. ♦ ఇంతకుమందే ఆ స్థిరాస్తిపై రుణాలు తీసుకొని ఉంటే, వాటిని తీర్చేయమనండి. ఆ తర్వాతే కొనుగోలు చేయండి. అమ్మే వ్యక్తికి యాజమాన్య హక్కుపై ఎలాంటి వివాదాలు లేవని తెలిశాకే ముందడుగు వేయాలి. ♦ స్థానిక సంస్థల నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టారా అనేది తెలుసుకోవాలి. కట్టిన ఇంటినే విక్రయిస్తుంటే ఎన్ని అంతస్తులకు అనుమతి పొందారో కనుక్కోండి. నిర్మాణ నిబంధనల్ని అతిక్రమించి కట్టాడా అన్న విషయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. ♦ అపార్ట్మెంట్ అయితే ఎత్తు, సెట్బ్యాక్, సైడ్ బ్యాక్ విషయాల్ని నిర్మాణ నిబంధనలను అనుగుణంగా వదిలేశారా లేదా చూడండి. ♦ స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు బదిలీ రుసుం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించండి. అదేవిధంగా అమ్మకందారులు ఆస్తి పన్ను, విద్యుత్, నీటి చార్జీలు, సొసైటీ చార్జీలు, నిర్వహణ రుసుం చెల్లించారా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ♦ అసలు క్రయ ఒప్పంద పత్రం (సేల్ అగ్రిమెంట్)లో ఫ్లాట్ మున్సిపల్ అప్రూవ్డ్ ప్లాన్, ఫ్లాట్ విస్తీర్ణం, ఉమ్మడి స్థలాల వివరాలు, ఫ్లాట్ మొత్తం ధర వంటి వివరాలన్నీ ఉండాలి. ♦ మీరు కొనబోయే ఫ్లాట్ సహకార సంఘం పరిధిలో ఉంటే అసలు వాటా పత్రాలను పరిశీలించండి. వాటి ద్వారానే ఆ స్థిరాస్తి అసలు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ♦ స్థిరాస్తికి సంబంధించి అసలు పత్రాలను తీసుకోవటం మరవొద్దు. ♦ బిల్డర్ పేరు ప్రఖ్యాతలనూ పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో అతను చేపట్టిన నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. ♦ స్థిరాస్తి మొత్తం విలువను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అసలు ధరతో పాటూ స్టాంపు రుసుం, రిజిస్ట్రేషన్ చార్జీలు, బదిలీ రుసుం, సొసైటీ చార్జీలు, సదుపాయాలకు చెల్లించే మొత్తం ఇలా అనేక అంశాలను ముందే తెలుసుకోవటం ఉత్తమం. ♦ సదుపాయాల విషయానికొస్తే కావాల్సినంత నీటి సరఫరా, విద్యుత్తు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోవటం ముఖ్యం. వాస్తు వంటి అంశాలపై మీకు నమ్మకం ఉంటే ఫ్లాట్/ప్లాట్ కొనుగోలుకు ముందే నిపుణులతో పరిశీలింపజేసి నిర్మాణం అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోండి. ♦ మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్ను నిర్మించాలి. -
బీఎల్ఏ పవర్ లో వాటా కొన్న ప్రిజమ్ సిమెంట్
న్యూఢిల్లీ: బీఎల్ఏ పవర్లో 15.23% వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎల్ఏ పవర్ కంపెనీ బొగ్గుతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా 25 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం బీఎల్ఏ పవర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రిజమ్ సిమెంట్ తెలిపింది. మధ్యప్రదేశ్లోని సాత్నాలోని తమ సిమెంట్ ప్లాంట్లలో యూనిట్-1, యూనిట్-2లకు విద్యుత్ సరఫరా కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. -
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లో వాటా కొన్న టాంగ్ మీడియా పార్ట్నర్స్
ముంబై: అనిల్ అంబానీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఐఎం గ్లోబల్లో మెజారిటీ వాటాను టాంగ్ మీడియా పార్ట్నర్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక కొత్త టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్ కోసం టాంగ్ మీడియా, ఐఎం గ్లోబల్ కంపెనీలు కలిసి ఆసియా ఇంటర్నెట్ దిగ్గంజ టెన్సెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా..ఈ కంపెనీలు టీవీ ప్రసారాల కంటెంట్ , టీవీ ప్రోగ్రామ్లు, సినిమాల కోసం, డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫార్మ్ విస్తరణ కోసం పెట్టుబడులు పెడతాయి. ఐఎం గ్లోబల్ సంస్థకు, కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ ప్రొడక్షన్ జాయింట్ వెంచర్కు కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా స్టువర్ట్ ఫోర్డ్ వ్యవహరిస్తారు. ఐఎం గ్లోబల్ టెలివిజన్కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మార్క్ స్టెర్న్ అదే పదవిలో కొనసాగుతారు. వినూత్నమైన వినోదాత్మకమైన కంటెంట్ డెవలప్మెంట్, దీనికి కావలసిన నిధుల సమకూర్చడం, పంపిణి తదితర రంగాల్లో లాస్ ఏంజెల్స్, షాంఘై కేంద్రాలుగా టాంగ్ మీడియా పార్ట్నర్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. టాంగ్ పార్ట్నర్స్ వాటా కొనుగోలు కారణంగా తమకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు సమకూరుతాయని ఐఎం గ్లోబల్ సీఈఓ స్టువర్ట్ ఫోర్డ్ పేర్కొన్నారు. 2007లో ఫోర్డ్చే ప్రారంభించిన ఐఎం గ్లోబల్ సంస్థ.. ప్రపంచ అగ్రశ్రేణి ఫిల్మ్, టెలివిజన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫార్మ్ల్లో ఒకటి. -
షావోమి మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్
మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్స్ కొనుగోలు చేసిన షావోమి న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్లను కొనుగోలు చేసింది. ఈ పేటెంట్లు వీడియో, క్లౌడ్, మల్టీమీడియా టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ ఒప్పందంలో భాగంగా షావోమి.. తన స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్స్లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ (ఆఫీస్, స్కైప్తోపాటు)ను అప్లోడ్ చేసి, వాటిని ఇండియా, చైనాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. పేటెంట్ల కొనుగోలు సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు. షావోమి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కైప్లను తన పలు మొబైల్ హ్యాండ్సెట్లలో ప్రి-లోడింగ్ చేయనున్నది. ఈ ఫోన్లు తొలిగా చైనాలో, తర్వాత భారత్లో అందుబాటులోకి రానున్నవి. -
టెక్ మహింద్రా చేతికి యూకే టార్గెట్ గ్రూప్
న్యూఢిల్లీ : సాప్ట్ వేర్ సర్వీసుల సంస్థ టెక్ మహీంద్రా, యూకేకి చెందిన టార్గెట్ గ్రూప్ ను 12 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసుల స్పేస్ లో తన స్థానాన్ని బలపర్చుకోవడానికి టార్గెట్ గ్రూప్ తో ఈ డీల్ కుదుర్చుకుంది. రుణాలు కల్పించడంలో ఆటోమేటెడ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లకు, ఇన్వెస్ట్ మెంట్లకు, ఇన్సూరెన్సు మార్కెట్ లకు ఈ డీల్ సహకరించనుంది. ఈ ఒప్పందం వల్ల యూకే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో సాప్ట్ వేర్ సర్వీసులు అందించడానికి టెక్ మహింద్ర వార్షికంగా 45-60 బిలియన్ పౌండ్ లను వెచ్చించనుంది. దీంతో యూకే ఆర్థిక సేవలు అందిస్తున్న షేరును అధిక మొత్తంలో టెక్ మహింద్రానే కలిగిఉంటుంది. టార్గెట్ గ్రూప్ విలువ 112 మిలియన్ పౌండ్లతో పాటు, సర్ ప్లస్ నగదు 8 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తూ టెక్ మహింద్రా ఈ సంస్థను సొంతంచేసుకోనుంది. ముందస్తుగా 64 మిలియన్ పౌండ్లను టెక్ మహింద్రా, టార్గెట్ గ్రూప్ కు చెల్లించనుంది. అనంతరం 2017లో 16.28 మిలియన్ పౌండ్లను మహింద్రా చెల్లిస్తుంది. ఈ ఒప్పందంతో టెక్ మహింద్రా యూకే లో ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థల్లో టాప్-3 స్థానాన్ని దక్కించుకోనుంది. -
జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్
బెంగళూరు: ఆహార ఉత్పత్తుల డెలివరీ కం పెనీ సంగీత ఆహార్ను జియో నేచురల్ కంపె నీ కొనుగోలు చేసింది. సంగీత ఆహార్ విలీనం కారణంగా తమ ఆదాయం 30 శాతం మేర పెరగగలదని జియో నేచురల్ అంచనా వేస్తోంది. సంగీత ఆహార్ కొనుగోలు వల్ల రోజుకు 6వేలకు పైగా భోజనాలను అందించగలమని జియో నేచురల్ ఎండీ, జయాస్ దామోదరన్ చెప్పారు. వచ్చే క్వార్టర్ నుంచి రెడీ-టు-కుక్, పర్సనలైడ్డ్ మీల్స్ వంటివి ఆఫర్ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన జియో నేచురల్ కంపెనీ పోషకాలు పుష్కలంగా ఉన్న, రసాయనాలు లేని, పోషకాలపరంగా సమతూకమైన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తోంది. -
సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్
లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. అది కూడా తన భార్య సమంతకు గిఫ్ట్గా ఇవ్వడం కోసం. ఆయన చూసి చూడగానే ఆ కారుపై మనసుపడి తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దాదాపు 1,495 ఫౌండ్లు వెచ్చించి ఈ కారును తీసుకున్నారు. తన నియోజకవర్గం మినిస్టర్ లోవెల్లో గల ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణానికి వెళ్లిన కామెరూన్ 2004 నిస్సాన్ మైక్రా బ్లూకారును కొనేశారు. ఈ కారు అమ్మిన యజమాని లేయిన్ హ్యారీస్ ఈ విషయంపై వివరణ ఇస్తూ 'శుక్రవారం రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. ప్రధాని కామెరాన్ తన కార్లు షెడ్లలో ఓ కారును చూసేందుకు వస్తున్నారని. కానీ, నా సహచరుల్లో ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఆయన నిజంగానే నా వద్దకు వచ్చేసరికి నమ్మలేకపోయాను. కనీసం అరగంటపాటు కారును చూస్తూ ఇక్కడే గడిపారు. ఇలాంటి కార్లు బ్రిటన్ లో తయారుచేస్తే బాగుంటుందని అన్నారు. ఆయన చాలా సాన్నిహిత్యంతో ఉండే వ్యక్తి. వేరే వారు కార్లు కొనేందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉన్నారు. కారు ఇన్సూరెన్స్ వివరాలు.. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు' అని చెప్పారు. -
క్వికర్ చేతికి సలోస బ్యూటీ సంస్థ
క్వికర్ సర్వీసెస్ పటిష్టత కోసం కొనుగోళ్లు బెంగళూరు: సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. తమ గృహ సేవల విభాగం, క్వికర్ సర్వీసెస్ను మరింత శక్తివంతం చేసుకునే వ్యూహాంలో భాగంగా ఈ బ్యూటీ సేవల సంస్థను కొనుగోలు చేశామని క్వికర్ పేర్కొంది. క్వికర్ సర్వీసెస్ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తరహా సంస్థలను కొనుగోలు చేయడం కోసం రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని క్వికర్ సర్వీసెస్ హెడ్ పీడీ సుందర్ తెలిపారు. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్లో జేఎస్డబ్ల్యూ స్టీల్
ఏడు ఈఓఐలు వచ్చాయి: టాటా స్టీల్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్డబ్ల్యూ స్టీల్ చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్డమ్లోని ప్లాంట్ల కోసం జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది. వృద్ధి వ్యూహం లో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వివరించింది. మరోవైపు తమ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల కోసం ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది. దక్షిణ వేల్స్లోని పోర్ట్ తాల్బొట్, న్యూపోర్ట్, రో దర్హమ్ ప్లాంట్లను టాటా స్టీల్ విక్రయిం చనున్నది. ఇక జేఎస్డబ్ల్యూ గ్రూప్కు చెందిన జేఎస్డబ్ల్యూ స్టీల్కు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో స్టీల్ ప్లాంట్లున్నాయి. సజ్జన్ జిందాల్కే చెందిన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ, నవీన్ జిందాల్కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి చెందిన విద్యుత్ ప్లాంట్ను కొనుగోలు చేయనున్నామని ఇటీవలే వెల్లడించింది. -
రూ. వందల కోట్లు పెట్టి 17 మంది ఎమ్మెల్యేలను కొన్నారు
♦ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనైతిక చర్య ఇది ♦ నైతిక బాధ్యత ఉంటే ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి ♦ లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేయాలి ♦ వాజ్పేయ్ ఒక్క ఎంపీని తీసుకుంటే అధికారం ఉండేది ♦ లోక్సభలో మేకపాటి ఆవేదనపూరిత ప్రసంగం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ రూ.వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసినా అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వైఎస్సార్సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం లోక్సభలో కేంద్ర పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘మేం ఈ బడ్జెట్కు సిన్సియర్గా మద్దతు పలుకుతున్నాం. కానీ ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి ఫిరాయించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా అనైతికమైన పని, దురదృష్టకరమైన చర్య. దీనిని మనం సరిచేయాల్సి ఉంది. లేదంటే ఇదొక పరిహాసంగా మారుతుంది. ఇదే పార్లమెంటులో మనం చేసుకున్న చట్టాలను మనమే నాశనం చేసుకుంటే ఎలా? ఆంధ్రప్రదేశ్లో 175 మంది సభ్యులు ఉండే సభలో 108 మంది సభ్యులతో ప్రభుత్వం స్థిరంగా ఉంది. మా ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ సుస్థిరత పట్ల భయపడాల్సిన పనేమీ లేదు. కానీ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఒకరొకరిగా ప్రతిరోజు, దినం తప్పించి దినం లాక్కుంటున్నారు. వందల కోట్లు చెల్లించి ఇప్పటివరకు 17 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు జరిపారు’’ అని ఆవేదన పూరితంగా ప్రసంగించారు. టీడీపీ ఎంపీల ఆందోళన.. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఇది సరికాదంటూ ఆందోళనకు దిగగా స్పీకర్ ఈ ఆందోళన విషయాన్ని, మేకపాటి రాజమోహన్రెడ్డి అభియోగం మోపిన నేత పేరు రికార్డులకు వెళ్లవని ప్రకటించారు. టీడీపీ నేతల ఆందోళనకు ప్రతిస్పందించిన మేకపాటి... ‘‘నేను చెప్పింది పూర్తి వాస్తవం. నేనెన్నడూ అబద్ధం చెప్పలేదు. వాళ్లు భారీగా సొమ్ములు చెల్లించి మా ఎమ్మెల్యేలు 17 మందిని కొనుగోలు చేశారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇది చాలా అనైతికం. వాళ్లకు నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే గౌరవ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలి..’’ అని డిమాండ్ చేశారు. వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి.. ఉత్తరాఖండ్లో స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని మేకపాటి చెప్పారు. ‘‘కానీ ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపుదారులపై మేం ఫిర్యాదులు చేసినప్పటికీ స్పీకర్ చర్య తీసుకోవడం లేదు. ఈ విషయంలో మనకు వాజ్పేయి గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఆయన అధికారంలో ఉండాలనుకుంటే, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తలిస్తే, ఇతర పార్టీలకు చెందిన సభ్యులను తీసుకుని ఉండేవారు.మధ్యంతర ఎన్నికలు రాకుండా ఉండేవి. కానీ ఆయన అలా చేయలేదు. ఈ గొప్ప ఉదాహరణను మనం అనుసరించాలి’’ అని చెప్పారు. ‘‘అందుకే ఆయన భారతరత్న అయ్యారు’’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ... ‘‘అవును మేడమ్. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనను ఆరాధించాల్సిన అవసరం ఉంది. మనం చేసుకున్న ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సరిచేసుకోని పక్షంలో దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ఒక పార్టీ టికెట్పై ఎన్నికై మరో పార్టీకి మారిన 3 నెలల్లో ఆ ఫిరాయింపుదారుడిపై అనర్హత వేటు పడాలి. మనం ఫిరాయింపు నిరోధక బిల్లును సరిచేసుకోవాలి..’’ అని విజ్ఞప్తి చేశారు. -
బలపరీక్షకు ముందు రావత్ కు స్టింగ్ దెబ్బ!
న్యూఢిల్లీ: బలనిరూపణకు ముందు హరిశ్ రావత్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. మే10న అసెంబ్లీలో బలనిరూపణకు కొంతమంది సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ సింగ్ బేరమాడినట్లు చూపుతున్న వీడియో ప్రస్తుతం దుమారం రేపుతోంది. తనకు డబ్బు అవసరం లేదని.. పేద ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వదలుచుకున్నానని ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున సొంత ఖర్చులకు ఇచ్చినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చానని.. హరిష్ రావత్ కు కూడా ఈ విషయం తెలుసననే మదన్ సింగ్ మాటలు ఉన్నాయి. ఈ వీడియోను ఉత్తరాఖండ్ సమాచార్ ప్లస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బయటపెట్టారు. పాత స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోతో పాటు ఈ వీడియోను కలిపి సమాచార్ ప్లస్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారనే హరీశ్ రావత్ ఆరోపణలు అబద్ధమని తెలిపోయాయి. కుర్చీని నిలబెట్టుకోవడానికి రావత్ ఎంతకైనా దిగజారతారని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గ్యానంద్ అన్నారు. -
ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా?
ఢిల్లీ: 'అక్షయ తృతీయ' అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే 'తృతీయ' తిథి అని పెద్దలు చెపుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం సంప్రదాయం. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు అప్పు చేసైనా సరే బంగారం కొనడం భారతీయుల్లో ఆనవాయితీ. అయితే ఈ నెల (మే) 9 న వస్తున్న అక్షయ తృతీయరోజు బంగారం కొనాలా? వద్దా.... అనే దానిపై విశ్లేషకులు ఏమంటున్నారు. స్వదేశీ బంగారం ధరలు గత రెండు సంవత్సరాలుగా 10 గ్రాములు 30,000 ల మార్కు దగ్గరే అటూ ఇటూ కదలాడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కఠినతరం కావడం, పెళ్లిళ్ల సీజన్,డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్రధాన కరెన్సీల్లో నమోదవుతున్న బలహీనత కూడా బంగారం ధరల్లో జోరు పెంచింది. దీంతో గత వారం రోజులు 30 వేల దగ్గర స్థిరంగా ట్రేడవుతోంది పసిడి. ఈ నేపథ్యంలో బంగారం కొనడం సరైన నిర్ణయమా కాదా అనే అనుమానం రాక తప్పదు. అయితే ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనడమే సబబు అని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా పసిడి జోరు ఇకముందు కూడా కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న ర్యాలీ ముందు కూడా కొనసాగనుందని , ప్రపంచ ఆర్థిక వ్యవస్తలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా, స్వర్గంగా భావిస్తారని సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా తెలిపారు. అమెరికా ఫెడ్ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని, ఇది బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత స్తాయినుంచి ధరల్లో ఎలాంటి క్షీణత కనిపించినా ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొనుగోళ్లు జరపాలని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులు తమ క్రమబద్ధమైన పెట్టుబడుల్లో బంగారాన్ని తప్పకుండా జోడించడాలని రైట్ హారిజాన్స్ సీఈఓ అనిల్ రేగో సూచించారు. మౌలిక, నిర్మాణాత్మక పెట్టుబడులకు గోల్డ్ ఎపుడూ స్వీట్ స్పాట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం బంగారం ఒక మంచి అవకాశమని చెపుతున్నారు అటు భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్ నెలలో భారీగా తగ్గాయి. 66.33 శాతం క్షీణతతో 19.6 టన్నులుగా నమోదయ్యాయి. బంగారు, వజ్రాలు లాంటి ఇతర విలువైన ఆభరణాలపై ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించిన ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపు, ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏటా భారత్ దిగుమతి చేసుకునే వేల టన్నుల బంగారంలో దాదాపు 80 శాతం ఆభరణాల తయారీకే పోతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా. మరోవైపు పసిడి కొనుగోళ్లు పెరిగినా, దిగుమతులు తగ్గుముఖం పట్టడం విశేషం. -
ప్రభుత్వం నుంచి 25% వాటా కొంటున్న నాల్కో
కేంద్రానికి రూ.3,250 కోట్లు సమకూరే అవకాశం! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో... కంపెనీకి చెందిన 25 శాతం వాటాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయనుంది. ఏ ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి నాల్కో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ మరో 15 రోజుల్లో సమావేశం కానున్నదని గనుల కార్యదర్శి బల్విందర్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసేలా నాల్కోకు మార్గదర్శకత్వం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తమకు లేఖ రాసిందని పేర్కొన్నారు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,250 కోట్ల నిధులు వస్తాయని అంచనా. నాల్కోలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,300 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం గతంలో భావించింది. కానీ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. -
పెగాసిస్టమ్స్ చేతికి అమెరికా సంస్థ.. ఓపెన్ స్పాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే ందుకు తోడ్పడే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) సాఫ్ట్వేర్ సర్వీసులను ఓపెన్స్పాన్ సంస్థ అందిస్తుందని పెగాసిస్టమ్స్ సీఈవో అలాన్ ట్రెఫ్లర్ తెలిపారు. తద్వారా కస్టమర్లకు కంపెనీలు మెరుగైన సేవలు అందించడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్ చేతికి ‘ఫోన్ పే’
బెంగళూరు: మొబైల్ పేమెంట్స్ కంపెనీ ‘ఫోన్పే’ను కొనుగోలు చేసినట్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుక్రవారం తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించారనేది వెల్లడించలేదు. ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగులైన సమీర్ నిగమ్, రాహుల్ చారి ఈ సంస్థను బెంగళూరులో నెలకొల్పారు -
పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చేతికి అడాప్టివ్
న్యూఢిల్లీ: పిరమాల్ ఎంటర్ప్రెజైస్ తాజాగా అమెరికాకు చెందిన అడాప్టివ్ సాఫ్ట్వేర్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 24.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు). పిరమాల్కు చెందిన అమెరికన్ అనుబంధ సంస్థ డెసిషన్ రిసోర్సెస్ గ్రూప్ (డీఆర్జీ) ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 7.4 మిలియన్ డాలర్లు చెల్లించింది. తదుపరి నిర్దిష్ట గడువులోగా, నిర్దిష్ట నిబంధనలకు లోబడి దశలవారీగా మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. ఫార్మసీ నెట్వర్కింగ్, ప్రైసింగ్ తదితర అంశాలకు సంబంధించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను అడాప్టివ్ అందిస్తోంది. ఈ డీల్తో హెల్త్కేర్ పేయర్ విభాగంలోకి ప్రవేశించేందుకు డీఆర్జీకి వెసులుబాటు లభిస్తుంది. -
రూ.251 ఫోన్కు ఆర్డరిచ్చే ముందు జాగ్రత్త!
నోయిడా: ఆశ.. దోశ.. అప్పడం.. వడ అన్నతీరుగా ఉంది రింగింగ్ బెల్స్ కంపెనీ వ్యవహారం. కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ విడుదల చేసి మొబైల్ రంగాన్ని ఓ కుదుపుకుదిపేసినట్లు కనిపించిన ఆ సంస్థ గురువారం చేతులెత్తేసి విమర్శలు రావడంతో తిరిగి శుక్రవారం ఫోన్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. బుధవారం ఈ ఫోన్ విడుదల చేసిన ఆ సంస్థ తమ ఫోన్ బుకింగ్లకోసం అనూహ్య స్పందన వచ్చిందంటూ బుకింగ్ అవకాశాలను గురువారం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే, ఇలా నిలిపేయడంపట్ల సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే, శుక్రవారం ఈ ఫోన్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిది. బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి 1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదు. 2. మొబైల్ ఫోన్ షిప్పింగ్కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందని మాత్రం అనుకోలేం. 3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు. 4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. 5. ఈ ఫోన్లు కేవలం భారత్లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు. -
ఎన్పీఎస్.. పన్ను ప్రయోజనాలు
నేను ఈ ఏడాది మొదట్లో ఒక ఫండ్లో రూ.10,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.13,000కు చేరింది. అయితే ఈ ఫండ్ పనితీరుతో నేను సంతృప్తిచెందలేకపోతున్నాను. దీంతో ఇదే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన మరో ఫండ్కు ఈ ఇన్వెస్ట్మెంట్ను బదిలీ చేద్దామనుకుంటున్నాను. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కు మారడం కొత్త ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు కదా ! ఈ ఇన్వెస్ట్మెంట్పై నేను ఈ ఏడాది పొందిన రూ.3,000పై మూలధన లాభాల పన్ను చెల్లించాలా? - ప్రసాద్, విశాఖపట్టణం పన్ను విధింపు దృష్ట్యా, ఇన్వెస్ట్మెంట్స్ను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్కు మార్చడాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసినట్లుగా పరిగణిస్తారు. మీ విషయంలో ఏడాది గడవక ముందే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్లో మీరు ఈ విషయం వెల్లడించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్పై పొందిన రాబడులపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే ఏ బీమాపాలసీలు ఉత్తమం. టర్మ్ పాలసీలు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్), మనీ బ్యాక్, ఎండోమెంట్ .. వీటిల్లో వేటిని ఎంచుకోవాలి? - క్రాంతి, నెల్లూరు జీవిత బీమా కవర్ కావాలనుకుంటే టర్మ్ ప్లాన్లు తీసుకోవం ఉత్తమం. టర్మ్ పాలసీలు పూర్తిగా బీమా పాలసీలు. వీటిల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. అందుకనే ఇవి చౌకగా లభిస్తాయి. ఇక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్)వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తాయి. వీటికి సంబంధించిన పాలసీ బ్రోచర్లో చార్జీలు అనే శీర్షిక కింద అన్ని చార్జీలను ఆ యులిప్ను ఆఫర్ చేసే సంస్థ వెల్లడిస్తుంది. సంప్రదాయబద్ధ పాలసీలైన మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలు..తాము విధించే చార్జీల వివరాలను వెల్లడించవు. నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా పన్ను సంబంధిత ప్రయోజనాలున్నాయా? - తన్మయి, హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కల్పిస్తోంది. ఇది మార్కెట్తో అనుసంధానమై ఉన్న స్కీమ్. మీ ఇన్వెస్ట్మెంట్స్లో 50 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ఈపీఎఫ్ వంటి స్థిరాదాయ ఆప్షన్స్ కన్నా ఇలా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ మంచి రాబడులను ఇస్తుంది. ఇది చాలా సరళమైన స్కీమ్. నెలకు తక్కువలో తక్కువ కనీసం రూ.500 ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీసీడీ(1) కింద ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి (వేతనంలో(బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతానికి మించకుండా) పన్ను రాయితీలు లభిస్తాయి. సెక్షన్ 80సీసీఈ కింద లభించే మొత్తం రాయితీ రూ.1.5 లక్షల్లోనే ఇది కూడా కలిసి ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం, ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 లక్షల రాయితీకి అదనంగా రూ.50,000 వరకూ పొందే అవకాశం ఉంది. ఇక ఎన్పీఎస్ విత్డ్రాయల్స్పై పన్ను చెల్లించాల్సి ఉంటంది. ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మెచ్యూర్ అయిన తర్వాత దాంట్లో 40 శాతం సొమ్ముతో యాన్యూటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యూటిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎన్పీఎస్లో టైర్ వన్, టైర్ టూ అని రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్ వన్ అకౌంట్లో ఏడాదికి కనీసం రూ.6.000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట మొత్తం ఏమీ లేదు. ఎన్పీఎస్ ప్రారంభించేటప్పుడు టైర్ టూ అకౌంట్లో కనీసం రూ.1,000 జమ చేయాలి. ఏడాదిలో కనీసం ఒకసారి జమ చేయాలి. ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీస మొత్తం బ్యాలెన్స్ రూ.2,000కు తగ్గకుండా ఉండాలి. టైర్ టూ అకౌంట్ అనేది స్వచ్ఛందమైన సేవింగ్స్ అకౌంట్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంత కావాలనుకుంటే అంత ఈ అకౌంట్ నుంచి మీ సొమ్ములను విత్డ్రా చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఏది ? - భాస్కర్, వరంగల్ ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ సరైన సమయమే. అంచనా వేసిన రాబడులను నిర్దేశిత కాలానికి పొందవచ్చు. అయితే వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులున్నప్పుడు ఎఫ్ఎంపీల నుంచి మీరు ప్రయోజనం పొందలేరు. నెలకు రూ.20,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ డబ్బులు నాకు ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి అవసరం. రికరింగ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులనిచ్చే ఫండ్స్ను సూచించండి. - సతీష్, నెల్లూరు రికరింగ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువ రాబడులు కావాలనుకుంటే ఆల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, డీడబ్ల్యూస్ ఆల్ట్రా షార్ట్టెర్మ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్టెర్మ్ బాండ్ఫండ్, బరోడా పయనీర్ ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్.. మీ ఇన్వెస్ట్మెంట్స్కు ఈ ఫండ్స్ను పరిశీలించవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం'
ముంబై: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ లండన్లో నివసించిన ఇంటిని కొనేందుకు మరో రెండు రోజుల్లో ఒప్పందం చేసుకోనున్నట్లు మహారాష్ట్ర సర్కారు సోమవారం ప్రకటించింది. ఆ ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజుల్లోగా స్వాధీనం చేసుకోనుందని ఆ రాష్ట్ర మంత్రి రాజ్కుమార్ బదోలే వెల్లడించారు. ఇంటి విక్రయానికి యజమాని సోమవారాన్ని చివరి తేదీగా నిర్ణయించారని, ఆలోగా స్పందించకపోతే.. మరో పార్టీకి ఇంటిని అమ్మనున్నారంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. ఈ విషయమై ఇప్పటికే సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వినోద్ తావ్డే లండన్ వెళ్లారన్నారు. ఇంటికోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 40 కోట్ల నిధులను కేటాయించింది. -
గతవారం బిజినెస్
మొబైల్ యాప్లో మాత్రమే ఫ్లిప్కార్ట్ సేవలు! ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తను కొనుగోలు చేసిన ఫ్యాషన్ పోర్టల్ మింత్రా దారిలోనే పయనిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్కార్ట్ కేవలం మొబైల్ యాప్లో మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుంది. అంటే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మూతపడనుంది. ప్రస్తు తం కంపెనీ లావాదేవీలు దాదాపు 70-75 వరకు మొబైల్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ షేర్లు కొనేటప్పుడు జాగ్రత్త ట్రేడింగ్ జరగని 450కు పైగా కంపెనీల్లో షేర్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్టాక్ ఎక్స్ఛేంజ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తమ సభ్యులను హెచ్చరించాయి. ఈ రెండు జాబితాల్లో ఉన్న కొన్ని కంపెనీల షేర్లు-బిల్పవర్, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్, తిజరియ పాలిపైప్స్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్, జెనిత్ కంప్యూటర్స్, ప్రదీప్ ఓవర్సీస్, గోల్డ్స్టోన్ టెక్నాలజీస్. నెట్వర్క్18లో రిలయన్స్ షేర్ల విక్రయం నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.10 శాతం వాటాలను విక్రయించింది. ఇందుకోసం షేరు కనీస ధరను రూ. 53.40గా నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ప్రమోటర్ గ్రూప్ వాటాలను 75 శాతానికి తగ్గించుకునేందుకు, పబ్లిక్ షేర్హోల్డింగ్ 25%కి పెంచేందుకు నెట్వర్క్18 ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎఫ్ఎస్ ద్వారా రూ.77 వేల కోట్ల సమీకరణ భారత కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో భారీగా నిధులు సమీకరించాయి. 2012, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 129 కంపెనీలు ఓఎఫ్ఎస్ విధానంలో రూ.77,023 కోట్ల నిధులు సమీకరించాయి. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.63,576 కోట్లుగా ఉంది. కంపెనీలు ఓఎఫ్ఎస్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,486 కోట్లు చొప్పున నిధులు సమీకరించాయి. హైదరాబాద్లో ఉబర్ కేంద్రం ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ ఇప్పుడు భారత్లో భారీగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రెస్పాన్స్, సపోర్ట్ ఫెసిలిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. ఇందుకు వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.317 కోట్లను వెచ్చించనుంది. ఫెసిలిటీలో 500 మందికి ఉపాధి లభించనుంది. పీఈ పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు 128 డీల్స్లో 4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 80 శాతం అధికం. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 115 లావాదేవీల్లో పీఈ సంస్థలు 2.24 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. మూడు నెలల కనిష్టానికి బంగారం బంగారం ప్రధాన బులియన్ మార్కెట్లో బుధవారం మూ డు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగిం పుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.155 తగ్గి రూ.26,100కు చేరింది. ఇక 22 క్యారె ట్ల పసిడి ధర అదే స్థాయిలో తగ్గి రూ.25,950కి పడింది. యునెటైడ్ బ్రూవరీస్కు యూఎస్ఎల్ గుడ్బై విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(యూబీఎల్) నుంచి యునెటైడ్ స్పిరిట్స్(యుూఎస్ఎల్) పూర్తిగా వైదొలగింది. బ్రిటన్ లిక్కర్ దిగ్గజం డియాజియో ప్రస్తుతం యూఎస్ఎల్లో ప్రధాన వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. యూబీఎల్లో తనకున్న మొత్తం 3.21 శాతం వాటాను సుమారు రూ.872 కోట్లకు విక్రయించింది. రూ. 55 వేల కోట్ల సమీకరణ దిశగా కేంద్రం! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం బాండ్ల పథకం ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ.40,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. దీని కోసం ఏడు ప్రభుత్వం రంగ సంస్థలకు అనుమతినిచ్చింది. ఇండియా పోస్ట్ ఎస్ఎంఎస్ సర్వీసులు ఇండియా పోస్ట్ సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు పార్సిళ్లు, మని ఆర్డర్ తదితర వస్తువుల డెలివరీ సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా అందించనుంది. దీనితోపాటు జీపీఎస్తో పోస్ట్మ్యాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే విధానాన్ని అక్టోబర్ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈక్విటీ ఫండ్స్లోకి 9 బిలియన్ డాలర్లు ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్ ఆధారిత ఈక్విటీ ఫండ్స్లోకి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు 9.52 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే వ్యవధిలో చైనా ఫండ్స్ నుంచి అత్యధికంగా 17 బిలియన్ డాలర్లు తరలిపోయాయి. భారత్, రష్యా మి నహా వర్ధమాన దేశాల మార్కెట్ల ఈక్విటీ ఫండ్స్ నుంచి ప్రథమార్ధంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. టీసీఎస్ లాభం రూ.5,684 కోట్లు దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.5,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,568 కోట్లతో పోలిస్తే లాభం 2.1 శాతమే వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ1లో 16.1 శాతం ఎగబాకి రూ.25,668 కోట్లకు చేరింది. నిధుల సమీకరణ దిశగా మహీంద్రా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రై వేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.5,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధులను స్వల్ప, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, మూలధన వ్యయాల కోసం ఖర్చు చేయాలని కంపెనీ ఆలోచన. వచ్చే నెల 7న కంపెనీ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) జరగనుంది.. అప్పటి నుంచి దశలవారీగా ప్రై వేట్ ప్లేస్మెంట్ విధానంలో దేశీయ/ విదేశీ మార్కెట్ల ద్వారా ఈ నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఫాక్స్కాన్ యూనిట్లు చైనాకు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్లో డేటా సెంటర్ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ల తయారీ యూనిట్ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఫాక్స్కాన్ కంపెనీ యాపి ల్ కోసం ఐఫోన్లను, ఐప్యాడ్లను, అమెజాన్ కోసం కిండి ల్ ట్యాబ్లను, ఇతర కంపెనీలకు ట్యాబ్లను, తదితర ఎల క్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. నియామకాలు - బీజింగ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కు ప్రెసిడెంట్గా చైనా మాజీ ఆర్థికమంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్గా హరదయాళ్ ప్రసాద్ నియమితులయ్యారు. - హౌసింగ్డాట్కామ్ తాత్కాలిక సీఈఓగా రిషబ్ గుప్తా నియమితులయ్యారు. డీల్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ - అమెరికాలోని షేల్ఆయిల్, గ్యాస్ పైప్లైన్ జాయింట్ వెంచర్లో ఉన్న తన 49.9 శాతం వాటాను ఎంటర్ప్రైజ్ ప్రాడక్ట్స్ పార్టనర్స్కు 1.07 బిలియన్ డాలర్లకు విక్రయించింది. - రష్యా చమురు దిగ్గజం రాస్నెఫ్ట్, ఎస్సార్ ఆయిల్లో 49% వాటాలు కొనుగోలు చేయనుంది. - ప్రోడక్ట్ అవుట్సోర్సింగ్ సంస్థ జెనీను ఆన్లైన్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ప్రాక్టో కొనుగోలు చేసింది. - డెన్మార్క్ కంపెనీ ‘డిజైన్ఇట్’ను రూ.595 కోట్లకు కొనుగోలు చేయాలని విప్రో భావిస్తోంది. -
ముకేశ్ కోసం ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ కారు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. తమ సీఎండీ ముకేశ్ అంబానీ వ్యక్తిగత భద్రతను మెరుగుపరచడం కోసం ఈ వాహనాన్ని కొనుగోలు చేశామని కంపెనీ పేర్కొంది. లెవల్-9 వెహికల్ రెసిస్టెన్స్(వీఆర్9) ఫీచర్ ఉన్న ఈ 2015 మోడల్ ఎస్600 కారును జర్మనీలోని బెంజ్కు చెందిన సిండెలింజెన్ ప్లాంట్లో కస్టమైజ్ చేయించామని వివరించింది. ఈ కారు బేస్ ధర రూ.1.5 కోట్లని అంచనా. అయితే భద్రతా ఫీచర్లతో కస్టమైజ్ చేయడం, దిగుమతి సుంకం, రోడ్ ట్యాక్స్, బీమా తదితరాలన్నింటిని కలుపుకుంటే ఈ కారు వ్యయం రూ.11 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ కారును ముంబై సెంట్రల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్(ఆర్టీఓ)లో శనివారం రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. భారత అతి పెద్ద ప్రైవేట్ కంపెనీ చైర్మన్ అయిన ముకేశ్ అంబానీకి 2013 ఏప్రిల్ నుంచి జెడ్-కేటగిరీ భద్రతను కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అత్యంత ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారు వెయిటింగ్ లిస్ట్లో రిలయన్స్ 57వ స్థానంలో ఉంది. ఎనిమిది నెలల పాటు ఈ కారు కోసం వెయిటింగ్ చేయాల్సి వచ్చిందని సమాచారం. 2015 మోడల్ ఎస్600 కారు భారత్లో ఇదే మొదటిది. -
’పరాటపోస్ట్’ని కొనుగోలు చేసిన ’హలో కర్రీ’
-
‘ఆప్’లో ఆరని అగ్గి..!
ఎమ్మెల్యేలను కొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో రాజుకున్న అగ్గి ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ తాజాగా ఆప్ మాజీ ఎమ్మెల్యే ఒకరు విడుదల చేసిన ఆడియో టేప్ పెను దుమారాన్ని రేపింది. గత ఏడాది ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని ఆప్ మాజీ ఎమ్మెల్యేరాజేశ్గార్గ్ బుధవారం ఆరోపించారు. ‘మనం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం గా ఉన్నాం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. మనీశ్ కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నారు. నువ్వు ఒక పని చెయ్యి. కాంగ్రెస్ని విడగొట్టు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొత్త పార్టీ ఏర్పాటు చేసి మనకు మద్దతు ఇవ్వమని చెప్పు’ అని కేజ్రీవాల్ తనతో మాట్లాడిన ఆడియోటేప్ను గార్గ్ బహిర్గతం చేశారు. అప్పట్లో కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధపడలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలును తాను వ్యతిరేకించానని, అప్పటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లడం మానేశానని చెప్పారు. అంజలీ దమానియా రాజీనామా మహారాష్ట్ర ఆప్ నేత అంజలీ దమానియా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో పార్టీ బేరసారాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. బుధవారం ట్వీటర్ ద్వారా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేజ్రీవాల్.. ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడ్డారని ఓ చానెల్ ప్రసారం చేసిన ఆడియో క్లిప్ను ఆమె తన ట్వీట్కు జతపరిచారు. ఎమ్మెల్యేల సంతకాల సేకరణ.. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్భూషణ్, శాంతి భూషణ్లను ఆప్ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిపై కఠిన చర్య తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేత్వత్వంలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. యాదవ్, భూషణ్ల బహిరంగ లేఖ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమపై వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు ఖండించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్శించారు. వారిద్దరూ ఈ మేరకు బుధవారం సంయుక్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఓ బహిరంగ లేఖ రాశారు. తమపై వచ్చిన అన్ని ఆరోపణలకూ అంశాల వారీగా వివరిస్తూ వారు లేఖలో వివరణ ఇచ్చారు. ఏదేమైనా, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. వ్యక్తుల కన్నా సంస్థే గొప్పదని పేర్కొన్నారు. పార్టీ కన్వీనర్ పదవిపై యాదవ్ కన్నేశారన్నఆరోపణలనూ వారు ఖండించారు. -
సీసీఐకి రైతుల షాక్ !
సంస్థకు విక్రరుుంచేందుకు వెనుకంజ తక్కువ ధర అరుునా.. వ్యాపారుల వైపే మొగ్గు వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం.. బ్యాంకుల కొర్రీలే కారణం వరంగల్ సిటీ :ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వారికి విక్రరుుంచేందుకు రైతులు పోటీపడతారు. ఇందులోనూ.. తెల్లబంగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అరుున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూకు అమ్ముకునేందుకే ఎగబడతారు. వ్యాపారులు తమ జిమ్మిక్కులతో ధర తగ్గించి కొనుగోలు చేసినప్పుడల్లా... సీసీఐ కొనుగోలు చేయూలంటూ రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. ఎన్ని రోజులు ఆలస్యమైనా సరే... ఆ సంస్థ అధికారులు కొనుగోళ్లు చేసేవరకూ కర్షకులు రోజుల తరబడి పత్తి బస్తాలతో మార్కెట్లోనే వేచి ఉండేవారు. ప్రభుత్వ మద్దతు ధర అందుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అలాంటిది... ఆసియూలోనే అతి పెద్దదిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీన్ రివర్స్ అరుుంది. పత్తి బస్తాలతో మంగళవారం మార్కెట్కు తరలివచ్చిన రైతులు తమ పం ట ఉత్పత్తులను సీసీఐకి అమ్మడానికి వెనుకంజ వేశారు. మంగళవారం మార్కెట్కు సుమారు 20 వేల పత్తి బస్తాలు వచ్చారుు. ఉదయం సీసీఐ అధికారులు 1,600 పత్తి బస్తాలను కొనుగోలు చేశారు. మరికొన్ని బస్తాలను కొనుగోలు చేస్తున్న క్రమంలో సీ న్ మారింది. రైతులందరూ ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచేందుకు మొగ్గుచూపా రు. మార్కెట్ అధికారులు నచ్చజెప్పినా... వారు సీసీఐకి విక్రరుుంచేందుకు ససేమిరా అన్నారు. సీసీఐకి అమ్మినదానికంటే రూ. 100 నుంచి రూ.200 తక్కువ అయినా... అడ్తిదారుల ద్వారా వ్యాపారులకే అ మ్మా రు. ముందుగా ప్రభుత్వ మద్దతు ధర క్విం టాల్కు రూ.4,050తో సీసీఐకి అమ్మిన రైతులు సైతం మనసు మార్చుకుని... వ్యా పారులకే విక్రరుుంచడం విశేషం. ఒక్క అ గ్రంపాడ్కు చెందిన రైతు వెంకటేశ్వర్లు మా త్రమే సీసీఐకి 25 బస్తాల పత్తిని అమ్మాడు. కారణం ఇదే.. పత్తి బస్తాలను సీసీఐకి విక్రరుుంచకపోవడంపై ‘సాక్షి’ ఆరా తీసింది. విక్రరుుంచిన వెంటనే సీసీఐ డబ్బులివ్వదని, వాళ్ల చు ట్టూ కాళ్లరిగేలా తిరగాలని పలువురు రైతు లు చెప్పారు. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయూయని.. మిత్తి కట్టేందుకు ఎంతో కొంతకు అమ్ముకున్నామని కొందరు తెలిపారు. చెక్లు ఇస్తుండడంతో బ్యాంకుల్లో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని.. బ్యాంకులో అప్పు ఉంటే వారి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని.. అందుకనే తక్కువ వచ్చి నా... వ్యాపారులకే అమ్ముకున్నామని మరి కొందరు వాపోయూరు. అరుుతే.. అడ్తివ్యాపారులు ఏకమై రైతులను భయభ్రాంతులకు గురిచేసినట్లు వినికిడి. అందుకే అమ్మిన రైతులు సైతం అమ్మకాలు రద్దు చేసుకున్నట్లు మార్కెట్ వార్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
బెస్ట్ 4 బ్రైట్ ఫ్యూచర్
లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు.. వీరికి అదనంగా ప్రతిఏటా పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే..! కోర్సు ఏదైనా ప్రతి ఒక్కరి లక్ష్యం.. మంచి ఉద్యోగం, మెరుగైన భవిష్యత్తు. ఈ క్రమంలో కచ్చితమైన కొలువులకు మార్గం వేస్తున్న ఈ-కామర్స్; ఎఫ్ఎంసీజీ; రిటైల్; బీఎఫ్ఎస్ఐ రంగాలపై ఫోకస్.. ఎమర్జింగ్ ఫీల్డ్.. ఈ-కామర్స్ ముఖ్యాంశాలు Mi3 కొనుగోలు కోసం వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. కొద్ది నిమిషాలపాటు స్తంభించిన ఫ్లిప్కార్ట్ వెబ్సైట్.. ఒక గదిలో ప్రారంభమైన ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ రెడ్బస్ను.. 135 మిలియన్ యూ.ఎస్ డాలర్లకు సొంతం చేసుకున్న ఐబీబో సంస్థ.. కేవలం ఇద్దరితో ప్రారంభమై నాలుగేళ్లలోనే రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్న స్నాప్డీల్. ఆన్లైన్ షాపింగ్పై పెరుగుతున్న మక్కువకు, ఈ-కామర్స్ వృద్ధి చెందుతున్న తీరుకు మూడు నిదర్శనాలు. హైరింగ్ ట్రెండ్.. ఐఐఎంలు, ఐఐటీల్లో సైతం క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్పంచుకుంటున్న ఈ-కామర్స్ సంస్థలు.. 2013-14 బ్యాచ్లో మొత్తం 137 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్న ఫ్లిప్కార్ట్. ఇంకా ఈబే ఇండియా, స్నాప్డీల్, అమెజాన్ వంటివి భారీగా ఉద్యోగాలిస్తున్నాయి. సగటున రూ.12 లక్షల వార్షిక వేతనం అందిస్తున్న కంపెనీలు.. కోర్ కంపెనీల కంటే ఈ-కామర్స్ సంస్థల వైపు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు.. ఈ-కామర్స్ రంగం ఉద్యోగావకాశాల పరంగా క్రేజీగా మారుతోందనడానికి ఉదాహరణలు. ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా నిమిషాల్లో నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు దోహదపడుతోంది..ఈ-కామర్స్. 2013లో 88 శాతం వృద్ధి నమోదు కావడమే ఈ-కామర్స్కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనం. ఈ-కామర్స్ రంగం వేగం ఇదే విధంగా కొనసాగుతుందని.. నియామకాలు భారీగా జరుగుతాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 2016 చివరికి ప్రత్యక్షంగా 50 వేల మందికి, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. పెరుగుతున్న ఆసక్తి: విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో సైతం ఈ-కామర్స్ రంగంలో కెరీర్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. నీల్సన్ ఇండియా.. ఐఐఎంలు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్లో నిర్వహించిన సర్వేలో మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది ఈ-కామర్స్ను తమ మొదటి ఆప్షన్గా పేర్కొనడం విశేషం. అవకాశాలు: ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రైసింగ్/ప్రాఫిట్ మేనేజ్మెంట్; కస్టమర్ సెల్లింగ్ వంటివి సేల్స్, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఎక్కువగా లభించే అవకాశాలు. టెక్నికల్గా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డిజైన్ మేనేజర్, కంటెంట్ డెవలపర్ వంటి వాటితోపాటు టెక్నికల్ సపోర్ట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంట్రీలెవల్లో నెలకు రూ.10 వేల జీతం లభిస్తుంది. అనుభవంతో ఆకాశమే హద్దుగా ఎదగొచ్చు. కోర్సులివే.. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సు: ఈ-కామర్స్లో డిప్లొమా, ఎంఈ అన్నా యూనివర్సిటీ కోర్సు: ఈ-కామర్స్లో సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్- స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోర్సు: ఈ-కామర్స్ అప్లికేషన్ ట్రైనింగ్ ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: ఎంకాం (ఈ-కామర్స్) ఇవేకాకుండా మరికొన్ని విద్యా సంస్థలు ఎంబీఏ, పీజీ డిప్లొమా స్థాయిలోఈ-బిజినెస్ పేరుతో పలు ప్రోగ్రామ్లను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ కొలువుల కేరాఫ్గా నిలుస్తున్న రంగం.. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్). ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలోనే 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, ఇప్పటికే ఉన్న బ్యాంకుల విస్తరణ వంటి కారణాలతో రానున్న ఐదేళ్లలో మరో 5 నుంచి 6 లక్షల నియామకాలు జరగనున్నాయి. మరోవైపు బీమా రంగంలో కంపెనీలు కూడా ఇదే రీతిలో ప్రగతి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లలో విస్తరణ కార్యకలాపాలు పెరిగాయి. ఇన్సూరెన్స్ రంగం 2020 నాటికి 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడం ఖాయం. మొత్తం మీద బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో 2020 నాటికి లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలతోపాటు.. నిపుణులను తీర్చిదిద్దేలా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహిక విద్యార్థులకు ఇవి కెరీర్ పరంగా ఎంట్రీ పాస్లుగా పేర్కొనొచ్చు. కోర్సులు నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కోర్సు: ఎంబీఏ యాక్చుయేరియల్ సైన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రీసెర్చ్- చెన్నై కోర్సు: పీజీ డిప్లొమా మేనేజ్మెంట్- ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్పూర్ కోర్సు: ఎంబీఏ- ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఐఐఆర్ఎం- హైదరాబాద్ కోర్సులు: పీజీ డిప్లొమాలో ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్; యాక్చుయేరియల్ సైన్స్తోపాటు సర్టిఫికెట్ కోర్సులు. ఇవేకాకుండా మరెన్నో సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. రిటైల్ రంగం రిటైల్ రంగం ప్రతి ఏటా దాదాపు పది శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. 2020 నాటికి వేయి బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలోని మొత్తం నియామకాల్లో 8 శాతం వాటా రిటైల్దే అని అసోచామ్ నివేదిక తెలుపుతోంది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ కెరీర్ గమ్యంగా నిలుస్తోంది. స్టోర్ కీపర్ నుంచి సీఈఓ స్థాయి వరకు ఎన్నో అవకాశాలకు వేదికగా మారుతోంది. ఔట్లెట్స్, సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్ల్లో ఎన్నో ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వం కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో బహుళ జాతి సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఉద్యోగాలు కస్టమర్ సేల్స్ అసోసియేట్: తమ సంస్థలోని ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించి కొనుగోలు చేసేలా మెప్పించడం కస్టమర్ సేల్స్ అసోసియేట్ ప్రధాన బాధ్యత. ఎంతో సహనం, ఓర్పు, వాక్చాతుర్యం అవసరం. ఫ్లోర్ మేనేజర్/కేటగిరీ మేనేజర్: రిటైల్ ఔట్లెట్లో పర్యవేక్షణ బాధ్యతలతో కూడిన ఉద్యోగం ఫ్లోర్ మేనేజర్ / కేటగిరీ మేనేజర్. స్టోర్ మేనేజర్: వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను నిక్షిప్తం చేసే గోడౌన్లలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి స్టోర్ మేనేజర్. రిటైల్ మేనేజర్: ఔట్లెట్ పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి రిటైల్ మేనేజర్. వినియోగదారులను, ఉద్యోగులను సమన్వయం చేస్తూ విక్రయాలు పెరిగేలా చేయడం, అకౌంటింగ్, క్యాష్ మేనేజ్మెంట్ వంటి విధులు నిర్వర్తించాలి. రిటైల్ బయ్యర్స్/మర్చండైజర్స్: రిటైల్ ఔట్లెట్ ఏర్పాటు చేసిన ప్రాంతం, ఆ ప్రాంతంలోని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ఉంచాల్సిన వస్తువులను గుర్తించడం, వాటికి సంబంధించి ఉత్పత్తిదారులతో సంప్రదింపులు చేయడం వీరి ప్రధాన విధులు. అదే విధంగా బ్యాక్ ఎండ్ విభాగంలో.. బ్యాక్ ఎండ్ మేనేజర్స్: రిటైల్ కమ్యూనికేషన్ మేనేజర్స్; ఫైనాన్స్ మేనేజర్స్ వంటి అవకాశాలుంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్లోని స్టోర్ కీపర్ ఉద్యోగాలకు నెలకు రూ.8 వేల జీతం లభిస్తోంది. స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్కు సగటున రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుతోంది. రిటైల్ మేనేజ్మెంట్లో పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నుంచి పీజీ కోర్సుల వరకు అందిస్తున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ).. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ).. ఉదయాన్నే ఉపయోగించే టూత్ బ్రష్ మొదలు మన దినచర్యలో అవసరమైన వస్తువుల విక్రయాలకు సంబంధించిన రంగం! ముఖ్యంగా మన దేశంలో ఇటీవల కాలంలో ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా సగటున పదిశాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. ఎఫ్ఎంసీజీలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది. మరోవైపు జోరుగా నియామకాలు జరుపుతూ ఉద్యోగార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నివేదికల ప్రకారం- ఈ రంగం మార్కెట్ విలువ 2018 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. తద్వారా ఎఫ్ఎంసీజీ రంగం దాదాపు 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బహుళ జాతి సంస్థలు సైతం ఈ రంగంలోకి ప్రవేశించడంతో ఉద్యోగార్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఆయా ఉత్పత్తులకు సంబంధించి ముడిపదార్థాల సేకరణ నుంచి వినియోగదారుల అభిరుచులు, అవసరాలు పరిగణనలోకి తీసుకుంటూ తుది ప్రొడక్ట్ను రూపొందించేవరకూ.. విభాగాల వారీగా అనేక ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో కీలక విభాగాలు.. సేల్స్: ఈ విభాగంలో అభ్యర్థులకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్స్గా ఉద్యోగాలు లభిస్తాయి. సంస్థ ఉత్పత్తుల విక్రయంతోపాటు చక్కటి మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించడం కీలక విధులు. ఈ విభాగంలో ప్రారంభంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్తో కెరీర్ ప్రారంభించి మార్కెటింగ్ డెరైక్టర్ వంటి అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్: సంస్థలోని ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ, సంస్థకు అవసరమైన మానవ వనరుల సంఖ్యపై అంచనాలు, ఉద్యోగులను, యాజమాన్యాన్ని సమన్వయం చేస్తూ ఉత్పత్తి పెంచే విధంగా చేయడం హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ విధులు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్: ముడి పదార్థాల సేకరణ, వాటి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వంటి ఎన్నో బాధ్యతలతో కూడిన విభాగం ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఫైనాన్స: ఈ విభాగంలో సంస్థ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విధులు, అకౌంటింగ్ విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ రంగంలో పర్చేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి ఇతర మార్కెటింగ్ విభాగాల్లోనూ పలు ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఎఫ్ఎంసీజీ.. ఫాస్ట్ గ్రోత్ ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రత్యేక కోర్సులు లేకపోయినప్పటికీ.. ఆయా విభాగాల్లో స్పెషలైజ్డ్ డిగ్రీలు పొందిన వారికి సంస్థలు నియామకంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉదాహరణకు పీజీ స్థాయిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణులకు ఫైనాన్స్ విభాగం, హెచ్ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగాలుంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీతోనూ ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వీరికి జనరల్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఎంట్రీ పోస్టులు లభిస్తాయి. సేల్స్, మార్కెటింగ్లో అడుగుపెట్టాలనుకునే వారికి అకడమిక్ అర్హతలకంటే ఇతరులను మెప్పించే వాక్చాతుర్యం, నలుగురిలో కలిసిపోయేతత్వం ప్రధాన అర్హతలు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు సగటున రూ.1.5 లక్షలు; స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్లు రూ.2 లక్షల వార్షిక వేతనం కచ్చితంగా పొందొచ్చు. క్యాంపస్లకు టాప్ రిక్రూటర్స్ ఈ రంగంలో ఐటీసీ, నెస్ట్లే ఇండియా లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్, క్యాడ్బరీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర సంస్థలు ఐఐఎంల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లోని కళాశాలల వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేసుకుంటున్నాయి. ఈ-కామర్స్ ఔత్సాహికులకు సరైన సమయం ఇదే.. దేశంలో ఆన్లైన్ షాపింగ్ కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు, సుస్థిర అభివృద్ధికి అవకాశం ఉన్న రంగం ఈ-కామర్స్. ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ విభాగంలో కస్టమర్ సపోర్ట్, కస్టమర్ రిలేషన్, క్లయింట్ సర్వీస్, ప్రొడక్ట్ డెలివరీ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్పై అవగాహన, ఆయా ఉత్పత్తుల గురించి వినియోగదారులకు వివరించే అనలిటికల్ స్కిల్స్ ఉంటే రాణించడం సులువు. ఇక బ్యాక్ ఎండ్ విభాగంలో వెబ్సైట్స్ నిర్వహణ, మేనేజీరియల్ విధులకు సంబంధించిన ఉద్యోగాలు లభిస్తాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఉత్తీర్ణులు ఈ విభాగంలో రాణించేందుకు వీలవుతుంది. అకడమిక్ స్థాయిలోనే సంబంధిత కోర్ అంశాలపై శిక్షణనిచ్చే విధంగా కోర్సులు రూపొందిస్తే పరిశ్రమ అవసరాలు తీరతాయి. - కె. సందీప్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - స్నాప్డీల్ అందరికీ అవకాశాలు కల్పించే రిటైల్, ఎఫ్ఎంసీజీ.. పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హతల ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్న రంగాలు రిటైల్, ఎఫ్ఎంసీజీ. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో ఈ రంగాలు బాగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రిటైల్ ఆపరేటర్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలను కూడా లక్ష్యంగా పెట్టుకుని విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. గత ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో మానవ వనరుల పరంగానూ విస్తృత అవకాశాలు లభించడం గ్యారంటీ. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నియామకాలకు ఆయా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అదే సమయంలో వేతనాలు కూడా గుర్తించదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. - రీతూపర్ణ చక్రవర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్-లీజ్ సర్వీసెస్ బీఎఫ్ఎస్ఐ.. ఆ రెండు కారణాలే సోపానాలు ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు అనుమతినివ్వడం, ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న రెండు కారణాలు బీఎఫ్ఎస్ఐ రంగంలో కెరీర్ సోపానాలుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్కు సంబంధించి ఇటీవల కాలంలో పీజీ, బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అకడమిక్ అవేర్నెస్ పెరుగుతోంది. కానీ ఇన్సూరెన్స్ రంగంలోనే ఇది ఇంకా పెరగాల్సి ఉంది. అకడమిక్ ఇన్స్టిట్యూట్లు కూడా కొంత తక్కువగానే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐఐఆర్ఎం-హైదరాబాద్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలు ఈ రంగంలో కోర్సుల పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు. నిరంతర అధ్యయన నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన వంటి లక్షణాలతో ఈ రంగంలో సుస్థిర కెరీర్ను ఆశించొచ్చు. - సబా ఆదిల్ టాలెంట్ హెడ్- ఏగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ -
విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై దర్యాప్తునకు సభా సంఘం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో 2004 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి గురువారం 11 మంది సభ్యులతో కూడిన సభా సంఘాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప నియమించారు. విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘంలో శివానంద ఎస్. పాటిల్, కేఆర్. రమేశ్ కుమార్, ప్రమోద్ మధ్వరాజ్, కేఎన్. రాజన్న, పీఎం. నరేంద్ర స్వామి, బసవరాజ్ బొమ్మయ్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, హెచ్డీ. కుమారస్వామి, జీటీ. దేవెగౌడ, పీ. రాజీవ్ సభ్యులుగా ఉంటారు. ‘2004 నుంచి అన్ని కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్, వినియోగం, అవసరాలపై పరిశీలన జరపాలి. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు, అలాంటి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, తద్వారా రాష్ట్ర బొక్కసానికి వాటిల్లిన నష్టం, వాటి సాధక బాధలు, అక్రమాలకు కారకులెవరు...లాంటి అన్ని విషయాలపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, తగు సిఫార్సులతో నివేదికను మూడు నెలల్లో సమర్పించాలి’ అని స్పీకర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ప్రైవేటు ప్లాంట్లు కొనేద్దాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) గడువు తీరే మూడు ప్రైవేటు ప్లాంట్లు కొనేసేందుకు విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటికే స్థిరచార్జీల రూపంలో ఆయా ప్లాంట్ల పెట్టుబడిని ప్రజలు చెల్లించేశారు. దీంతో తక్కువ ధరకు ఈ ప్లాంట్లను కైవసం చేసుకునేందుకు రెండు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా ఏ ప్లాంటుకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే లెక్కలు ‘థర్డ్పార్టీ’ద్వారా తీయిస్తున్నాయి. మరోవైపు ప్లాంట్లను కొనుగోలు చేయాలంటే తమకు భారీగా చెల్లించాల్సి ఉంటుందంటూ సదరు కంపెనీలు అంచనాలను సమర్పించాయి. అయితే, కేవలం 240 కోట్లు చెల్లిస్తే... పీపీఏలోని క్లాజు కింద ఏకంగా 779 మెగావాట్ల గ్యాస్విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని (బయ్అవుట్) అధికారులు అంచనా వేస్తున్నారు. అధికంగా అంచనాలు ఇచ్చిన కంపెనీలు ప్రభుత్వపరం కాకుండా తమ కంపెనీలను కాపాడుకునేందుకు ప్రైవేటుప్లాంట్ల యాజమాన్యాలు మరమ్మత్తులు, ఆధునీకరణ (ఆర్అండ్ఎం) పేరిట తీవ్రయత్నాలు చేస్తున్నాయి. కొనుగోలు చేయాలంటే తమకు 500 కోట్లు-600 కోట్ల మేర భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. దీనికంటే ఆర్ ఎండ్ ఎం మేలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఆర్ అండ్ ఎం చేపడితే తిరిగి ప్లాంటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుంది. మరమ్మతులకు అయిన మొత్తాన్ని మరి కొన్నేళ్లపాటు సర్కార్ చెల్లించాల్సివస్తుంది. ఇది ప్రజలకు భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను కొనుగోలు చేయడానికే డిస్కంలు నిర్ణయించాయి. యాజమాన్యాల వాదనలతో అధికారులు ఏకీభవించడం లేదు. కేవలం 250 కోట్ల మేరకు చెల్లిస్తే మూడు ప్లాంట్లు ప్రభుత్వపరం అవుతాయని భావిస్తున్నారు. పీపీఏలోని క్లాజుల ప్రకారమే థర్డ్పార్టీని నియమించాలని డిస్కంలు నిర్ణయించాయి. థర్డ్పార్టీకి మదింపు బాధ్యతను అప్పగించి, అది ఇచ్చే నివేదికపై ప్రైవేటుప్లాంట్లతో చర్చించాలని డిస్కంలు భావిస్తున్నాయి. బయ్ అవుట్ క్లాజ్ ఏం చెబుతోంది? ప్రైవేటుగ్యాస్ ఆధారిత విద్యుత్ప్లాంట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పీపీఏలు కుదుర్చుకుంది. దాని పరిమితి 15 సంవత్సరాలు. జీవీకేతో కాలపరిమితి వచ్చే జూన్ నాటికి ముగియనుంది. ఇక ల్యాంకోతో డిసెంబర్ 2015 నాటికి, స్పెక్ట్రమ్తో జనవరి 2016కు కాలపరిమితి ముగియనుంది. పీపీఏలోని 11.7 క్లాజు బయ్అవుట్కు అవకాశం కల్పిస్తోంది. బయ్అవుట్ చేయాలంటే సదరు కంపెనీకి 540 రోజుల ముందుగా నోటీసులు జారీచేయాలని, ఇందుకయ్యే మొత్తాన్ని విద్యుత్ సంస్థలు ఒకేసారి చెల్లించాలి. లేదంటే గతంలో ఉన్నట్టుగానే పీపీఏ అమల్లో ఉంటుంది. అలాగే, కంపెనీలకు స్థిర, అస్థిర చార్జీలను యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది అని ఈ క్లాజు స్పష్టం చేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రైవేట్ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు నోటీసులు జారీచేశాయి. వచ్చేఏడాది జూన్లో పీపీఏ గడువు ముగియనున్న జీవీకే-1ను కైవసం చేసుకునేందుకు కేవలం 50 కోట్ల మేరకు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్లాంట్ల నుంచి ఒప్పందం మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ లభించనుంది. -
ఈ పర్వతమిక మిట్టల్ సొంతం!!
-
ఆయనంటే హడల్
- ఆస్తిపాస్తుల కిరికిరి - ఎస్సైలకు చార్జిమెమోలు - వివరణ ఇచ్చినా బేఖాతరు - రాష్ట్రస్థాయికి పేచీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్:‘కనీసం సమాచారం ఇవ్వకుండా విలువైన అస్తులు కొనుగోలు చేశారు. ఎందుకు మీపై చట్టప్రకారం చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ... ’ ఇటీవల జిల్లాలో దాదాపు 43 మంది ఎస్సైలకు డీఐజీ కార్యాలయం నుంచి చార్జీమెమోలు జారీ అయ్యాయి. వీరిలో చాలామంది రెండేళ్ల కిందటే పోస్టింగ్లు పొందారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో అవగాహనలోపంతో కొందరు ఎస్సైలు తమ ఆస్తులు ఉన్నవి, లేనివి చూపించారు. గతేడాది ఆరంభంలో డీఐజీ కార్యాలయం నుంచి వీరందరికీ ఆస్తులపై వివరణ ఇవ్వాలని మెమోలు జారీ అయ్యాయి. ఈ మధ్య వ్యవధిలో కొందరు ఎస్సైలు పెళ్లి చేసుకున్నారు. కట్నకానుకలు, డబ్బులు, బంగారం, వాహనాలు ఇతర విలువైన అస్తులు అదనంగా వచ్చిచేరాయి. ఆస్తుల వివరాల్లో తప్పులుంటే మన్నించాలని, ముందుగా అనుమతి తీసుకోవాలని తమకు తెలియదని ఎస్సైలు వివరణ ఇచ్చుకున్నారు. కొన్ని జిల్లాల్లో తమ ఉద్యోగులు నిజాయితీగా సమాధానం ఇచ్చారని భావించి అక్కడి అధికారులు మానవతా దృక్పథంతో మెమోలు పక్కన బెట్టారు. కానీ.. మన జిల్లాలో ఎస్సైల వేడుకోలు బుట్ట దాఖలైంది. గతంలో చేసిన పొరపాటు మళ్లీ చేయబోమని, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందున దయతో మన్నించాలని ప్రొబేషనరీ ఎస్సైలు సంజాయిషీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మీపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ 15 రోజుల కిందట చార్జిమెమోలు జారీ అయ్యాయి. దీంతో ఎస్సైలు హడలెత్తిపోయారు. ప్రొబేషనరీ సమయం కావటంతో... ఇప్పుడు చార్జిమోమోలు ఇస్తే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఏం కిరికిరి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అదే అదనుగా సదరు ఉన్నతాధికారి కార్యాలయంలో చక్రం తిప్పే ఉద్యోగి రంగప్రవేశం చేసి... ఎంతోకొంత సమర్పిస్తే సమస్యను పరిష్కరిస్తానంటూ అసలు కబురు అందరికీ జారవేశారు. దీంతో మెమోల జారీ వెనుక లోగుట్టు బయట పడినట్లయింది. ఎలాగైతేనేం.. అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకోవటం నయమని కొందరు, అంత భారీ మొత్తం సమర్పించుకోలేమని కొందరు.. ఈ రాయ‘బేరం’పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఉద్యోగి చెప్పిన ‘ఫిగర్' విన్నాక కొందరు ఎస్సైలు బిత్తరపోయారు. దీంతో ఆస్తుల మెమోల వ్యవహారానికి తాత్కాలికంగా పీటముడి పడింది. లూప్లైన్లో పని చేస్తున్న ఎస్సైలు అంత ‘భారం' భరించలేమంటూ చేతులెత్తేశారు. చార్జిమెమోల సాకుతో తెరవెనుక జరుగుతున్న వసూళ్ల పర్వంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో స్వయానా సీఎం, హోంమంత్రి, డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్సైల ఆస్తిపాస్తులు, అధికారి వసూళ్ల పేచీ రాష్ట్ర స్థాయికి చేరనుంది. గతంలోనూ ఇదే అధికారిపై జిల్లాలో పలు ఆరోపణలు వెల్లువెత్తటం గమనార్హం. పోస్టింగ్ల్లో తల దూర్చడం, పోలీస్స్టేషన్ తనిఖీకి వెళ్లి బేరమాడటం, మాట వినకుంటే తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేయటం, అదే కార్యాలయంలో పాతుకుపోయిన ఓ ఉద్యోగిని అడ్డుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్న ఫిర్యాదులన్నీ మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది. -
కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారాజ్యం
కడెం, న్యూస్లైన్ : రైతులను దళారుల బారి నుంచి కాపాడి.. ధాన్యానికి మద్దతు ధర దక్కేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నాడు. క్వింటాల్ ధాన్యంపై రెండున్నర కిలోల ధాన్యం కోతపడుతోంది. తేమ పేరిట సా గుతున్న ఈ అదనపు దందాను పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలో పాత మద్దిపడగ, కొత్త మద్దిపడగ, లింగాపూర్, దస్తురాబాద్, మున్యాల, బు ట్టాపూర్, పాండ్వాపూర్ గ్రామాల్లో 20 రోజుల క్రితం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యంలో 17శాతం తేమ ఉంటే సరిపోతుంది. ఆ ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. కానీ తేమ పేరిట నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని, రైస్మిల్లులో తూకం వేస్తే బరువు తగ్గి నష్టపోతామని చెబుతూ.. 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేస్తున్నారు. కాంటాలో 41 కిలోల బాట్లు వేసి 40 కిలోలుగానే పరిగణిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్కు రెండున్నర కిలోల ధాన్యం అదనంగా నిర్వాహకులకు చేరుతోంది. రైతులు ఈ రెండున్నర కిలోలు నష్టపోవాల్సి వస్తోంది. మంగళవారం పెద్దూరు గ్రామానికి చెందిన రైతు జీల నాగరాజు 52 సంచుల ధాన్యాన్ని పాండ్వాపూర్లోని కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి తీసుకెళ్లాడు. తేమ శాతం సరిగ్గానే ఉన్నా 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేశారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఇలా చేయాల్సి ఉన్నా అందరికీ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. దస్తురాబాద్లోని కేంద్రంలో ఖాళీ గన్నీ బ్యాగుపై తూకం రాళ్లు వేసి ఉంచుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూ కం విషయమై ఐకేపీ ఏపీఎం బుచ్చన్నను సంప్రదిం చగా.. కేంద్రాలను తనిఖీ చేస్తామని చెప్పారు. అదనంగా తూకం వేయడం సరికాదని, ఖాళీ సంచులు పెట్టి తూకం వేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.