
మండుతున్న టమాటా ధరలతో జనం జేబుకు చిల్లులు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాయితీ ధరలకు టమాటా విక్రయించే ఏర్పాట్లు చేసింది.

దీంతో టమాట కోసం కడపలో ప్రజలు లైన్లలో బారులు తీరారు.

కడప చిన్న చౌక్ స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తున్నారు.

ఉదయం నుంచే క్యూలైన్లో నిల్చొని జనం టమాటాలు కొనుగోలు చేశారు.


ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

