పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా | Infosys says will investigate Panaya allegations | Sakshi
Sakshi News home page

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

Feb 21 2017 1:37 AM | Updated on Sep 5 2017 4:11 AM

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా

పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విశాల్‌ సిక్కా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  విశాల్‌ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్‌ పంపారు. ఆటోమేషన్‌ కంపెనీ పనయను ఇన్ఫోసిస్‌  రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది.

వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్‌ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది  దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని,  కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement