టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ | Tata Steel says seven firms in frame to bid for rest of UK operations | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్లో జేఎస్డబ్ల్యూ స్టీల్

May 11 2016 1:07 AM | Updated on Sep 3 2017 11:48 PM

టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్లో జేఎస్డబ్ల్యూ స్టీల్

టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్లో జేఎస్డబ్ల్యూ స్టీల్

టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చేరింది.

ఏడు ఈఓఐలు వచ్చాయి: టాటా స్టీల్
న్యూఢిల్లీ: టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్  చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ప్లాంట్‌ల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది.  వృద్ధి వ్యూహం లో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వివరించింది.

మరోవైపు  తమ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల కోసం ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది.  దక్షిణ వేల్స్‌లోని పోర్ట్ తాల్బొట్, న్యూపోర్ట్, రో దర్‌హమ్  ప్లాంట్‌లను టాటా స్టీల్ విక్రయిం చనున్నది. ఇక జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో స్టీల్ ప్లాంట్లున్నాయి. సజ్జన్ జిందాల్‌కే చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ, నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి చెందిన విద్యుత్ ప్లాంట్‌ను కొనుగోలు చేయనున్నామని ఇటీవలే వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement