Boyfriend
-
బాయ్ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ను పంచుకోనున్నారు. -
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
జ్యోతినగర్(కరీంనగర్): ఇరువురు ప్రేమించుకున్నారు. ఆపై యువతి మరొకరిని వివాహమాడింది. అయినా వాళ్ల ప్రేమ బంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమెకు ఒక పాప జన్మించింది. ప్రియుడు చెప్పిన మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు విడాకులిచ్చింది. ఈ తర్వాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ నర్రాశాలపల్లెకు చెందిన మహిళ(26) ఆరు సంవత్సరాలుగా సమీప బంధువైన వ్యక్తితో ప్రే మాయణం కొనసాగింది. ఈ క్రమంలో మహిళ కుటుంబ సభ్యులు ఆమెకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశా రు. అయినా మహిళ ప్రేమించిన వ్యక్తితో సంబంధం కొనసాగింది. మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రాంతంలో గది అద్దెకు తీసుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులు మహిళ అదృశ్యం కేసు సైతం నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి సదరు మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని మహిళ తెలిపింది. కుటుంబ సభ్యులు కుల పెద్దలతో పంచాయితీలు నిర్వహించారు. భర్తతో విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రియుడి మాటలు నమ్మి విడాకులు సైతం చేసుకుంది. విడాకులు పొందినా ప్రి యుడు పెండ్లికి నిరాకరించడంతో.. చేసేదేం లేక ప్రి యుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. దీంతో ప్రి యు డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పోలీసుల జోక్యంతో.. ఎస్సై మానస ఘటనా స్థలానికి చేరుకొని మహిళతో మాట్లాడారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో.. ఎనీ్టపీసీ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. -
ప్రియుడి బర్త్డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)
-
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది. తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటిమీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు. కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. ఔరా అంటారు. హాలీవుడ్ రేంజ్లో..ఇదేం ట్విస్ట్ రా మామా.. అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే..A high school student in China jumps out of building to express his true love pic.twitter.com/m96l96VcbG— Crazy Clips (@crazyclipsonly) April 21, 2025 y"> ప్రియురాలితో గొడవ పడుతూ.. క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీ లోంచి అమాంతం దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తోంది. మొదట దూకడానికి ప్రయత్నించి నపుడు అమ్మాయి తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు. కానీ రెండో సారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసి పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలోని యుహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాలో మాత్రం అసలు విషయం బైటపడింది. కిటీకిలోంచి దూకిన తరువాత అతడు మరో చిన్న వాల్ పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపీగా, సైడ్ వాక్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సో..ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరూ లవర్స్ అని తేల్చి చెప్పింది. ఇద్దరూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, తాము జోక్యం చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రోజర్ రాబిట్ సినిమాను గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లా పనికి వస్తాడంటూ కమెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?చివరిగా సరదాగా అనిపించినా.. ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి.అలాగే ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా కారణం ఏదైనా సయమనం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారమవుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలనుంచి బైటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థం మవుతుంది. క్షణికావేశం..కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆగి ఆలోచించే ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు బాటను చేసుకోవాలి. -
జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈమె.. క్రమంగా సినిమాలతో హిట్ కొడుతూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్, లవ్ బ్రేకప్స్ గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) 'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి''బ్రేకప్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్? అని అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. నా వరకు వస్తే నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతున్నానని అర్థం. ఇప్పటికీ నాకు సరైన ప్రేమ దొరకలేదు' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్) 'కెరీర్ ప్రారంభంలో తెలుగులో నా రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. నన్ను చాలా మాటలు అన్నారు. కానీ హీరో సిద్ధార్థ్ ని మాత్రం ఏం అనలేదు. నాకు గబ్బర్ సింగ్ మూవీతో సక్సెస్ వచ్చింది. ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ నా మనసుకు నచ్చిన మూవీస్ చేస్తున్నానని వాళ్లకు తెలీదు' అని శ్రుతి తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఒకరిద్దరు హీరోలతో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఇద్దరు యువతులతో ప్రేమాయణం
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం వేలాడుతున్నా చూడకుండా.. ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
పిల్లలను వదిలి.. ప్రియుడితో వెళ్లి..
జగిత్యాలక్రైం: నవమాసాలు మోసి.. ఇద్దరు పిల్లలను కనిపెంచిన తల్లి ఆ పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన యువతిని మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి గతంలో వివాహం చేశారు. వీరికిద్దరు పిల్లలు జన్మించారు. యువతి భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పిల్లలను పోషించాల్సిన సదరు మహిళ.. మరో వ్యక్తి మోజులో పడింది. ఈ క్రమంలో యువతి తండ్రి అనారోగ్యంతో జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు కుమారులను తీసుకుని ఆస్పత్రికి వచ్చిన ఆ యువతి కుమారులను అక్కడే వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. తండ్రి ఎందుకు రావడం లేదో.. తల్లి ఎప్పుడొస్తుందో తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనాథలుగా మారి న ఆ పిల్లలను అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు. -
పెళ్లయిన ఏడు రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు!
మణికొండ, హైదరాబాద్: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్హౌస్లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్హౌస్లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్స్టేషన్లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్హౌస్లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర! -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా తన ఇన్స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.అయితే తాజాగా మరోసారి తన బాయ్ఫ్రెండ్ సామ్ మర్చంట్తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమ రిలేషన్పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. #TriptiiDimri was seen on a bike with rumoured beau #SamMerchant.🫶🏻#FilmfareLens pic.twitter.com/FvH0s70F7Z— Filmfare (@filmfare) February 19, 2025 -
అద్దెకు బాయ్ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాయ్ఫ్రెండ్కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తన బాయ్ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్పుత్ తన ఇన్స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
రిలేషన్షిప్లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్ఫ్రెండ్తో కలిసి!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.డిన్నర్కు వెళ్తూ..తాజాగా మరోసారి తన భాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
'బిగ్బాస్' ఫేమ్ సోనియా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
Keerthy Suresh: కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే
-
దే..వుడా!
జాన్వీ కపూర్ స్నేహితురాలికి ఆమె బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ అయిందట. ఆ అమ్మాయి శోక సముద్రంలో మునగడం జాన్వీని కదిలించింది. దాంతో తన ఫ్రెండ్ బీఎఫ్ని ఉడికించాలని.. తను స్విట్జర్లండ్లో వింటర్ జాకెట్తో బ్యాక్ నుంచి తీసుకున్న ఓ ఫొటోను తన ఫ్రెండ్ ఇన్స్టాలో పోస్ట్ చేసిందట.. విత్ మై బాయ్ఫ్రెండ్ ఇన్ స్విట్జర్లండ్ అనే రైటప్తో! ఆ పోస్ట్ చూసి ‘అబ్బా.. తన ఎక్స్కి స్విట్జర్లండ్ తీసుకెళ్లే రిచ్ బాయ్ఫ్రెండ్ దొరికాడా!’ అని ఆమె బీఎఫ్ కుళ్లుకుంటాడని ఆశపడిందట జాన్వీ! కానీ ఆప్పటికే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇన్స్టా అకౌంట్ని అన్ఫాలో చేసేశాడట. ఆ నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన జాన్వీ ‘దే..వుడా!’ అంటూ తల పట్టుకుందట. -
ఫ్యావరేట్ టైం:బోయ్ ఫ్రెండ్తో దేవర బ్యూటీ ఫెస్టివ్ మూడ్ (ఫొటోలు)
-
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
ప్రేమ పేరుతో ట్రాప్.. గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమన్నందుకు..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (19)ని గర్భవతిని చేసిన ఆమె బాయ్ఫ్రెండ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను పూడ్చిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సంజూ అకా సలీమ్ అనే ఓ యువకుడితో పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే.. పెళ్లి చేసుకోవాడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అబార్షన్ చేయించుకోవాలన్నాడు.#LoveJihad: In a tragic incident in Nangloi, Delhi, a 19-year-old pregnant woman named Soni was allegedly murdered by her boyfriend, Mohammad Salim, also known as Sanju, with the assistance of two accomplices.Soni, seven months pregnant, had been pressing Salim for marriage,… pic.twitter.com/M0cqJDDfCq— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 26, 2024దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అతడిని కలిసేందుకు యువతి వెళ్లగా.. సలీమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహ్తక్కు తీసుకెళ్లి హత్య చేశాడు. ప్రస్తుతం సోని ఏడు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. ఇక.. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుతులు సలీమ్, అతడి స్నేహితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.చదవండి: ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్ -
ప్రియుని హత్య... ప్రియురాలి ఆత్మహత్య
గోదావరిఖని: కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఓ మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది నచ్చని ఆమె అన్న, మాజీ భర్త కలిసి ప్రియుడిని హత్య చేశారు. దీంతో నిర్వేదానికి గురైన ఆమె ఉరివేసుకుని జీవితాన్ని చాలించింది. గోదావరిఖని హనుమాన్నగర్కు చెందిన అంజలి (25) భర్త, ఇద్దరు పిల్లలను కాదని యైటింక్లయిన్ కాలనీకి చెందిన ప్రియునితో కాపురం సాగిస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రియుడితో ఉండేందుకే మొగ్గుచూపింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక ఇష్టపడిన ప్రియునితో పంపించేశారు. ఇలా 3 నెలలపాటు గడిచాయి. అయితే శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చూ డాలంటూ అంజలికి అన్న ఫోన్ చేశాడు. నిజమని నమ్మిన ఆమె ప్రియుడిని ఎదురుగా పంపించింది. చెల్లిని ఇంట్లో బంధించి బయట గడియవేసి ప్రియుడు వినయ్కుమార్ (26)ను అన్న, మాజీ భర్త కలిసి హతమార్చారు. ఈ సంఘటన తర్వాత అంజలిని పోలీసులు అదేరోజు పెద్దపల్లిలోని సఖీ కేంద్రానికి పంపించారు. అనంతరం గుంటూరుకు వెళ్లి న అంజలి చిన్నమ్మ ఇంట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
బీచ్లో ప్రియుడు గౌతమ్తో రచ్చచేస్తున్న బిగ్ బాస్ 'ఇనయా సుల్తానా' (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్ రూమర్.. ఇంతలోనే హీరోయిన్ బ్రేకప్!
మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రభాస్ 'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. గత కొన్నాళ్లుగా రాహుల్ మోదీ అనే రైటర్తో ప్రేమలో ఉంది. దీన్ని నిజం చేసేలా పలు ఈవెంట్స్లో జంటగా కనిపించారు. నెల క్రితం కూడా రాహుల్ గురించి శ్రద్ధా పోస్ట్ పెట్టింది. ఇంతలోనే బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)శ్రద్ధా కపూర్.. రాహుల్తో పాటు అతడి కుటుంబ సభ్యులు అందరినీ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. దీంతో బ్రేకప్ అయిందని అంటున్నారు. మరికొందరు మాత్రం త్వరలో శ్రద్ధా నటించిన 'స్త్రీ 2' త్వరలో రిలీజ్ కానుందని, దీనిపై బజ్ లేకపోవడంతో కావాలనే ఇలా స్టంట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా చెబితే తప్ప దీనిపై ఓ క్లారిటీ రాదు.తండ్రి శక్తి కపూర్ నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2010 నుంచి హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తోంది. ప్రభాస్ 'సాహో'తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇలా బ్రేకప్ న్యూస్ వల్ల వైరల్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్లు రిలీజ్) -
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్స్టాగ్రామ్లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్ఫ్రెండ్గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
డైరెక్టర్తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్
యంగ్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టింది. కాకపోతే పరోక్షంగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే కుర్రాడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం ఇక్కడ ఆసక్తికర విషయం. తాజాగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఏకంగా వీడియో పోస్ట్ చేయడంతో హీరోయిన్ ప్రేమ కహానీపై క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్)చెన్నైకి చెందిన అమ్ము అభిరామి.. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది. దళపతి 'భైరవ' మూవీతో నటిగా మారింది. కాకపోతే తమిళ సూపర్ హిట్ సినిమా 'రాక్షసుడు'లో స్కూల్ స్టూడెంట్గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ నారప్ప, ఎఫ్సీయూకే, రణస్థలి, డెవిల్ చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు సహాయ పాత్రల్లోనూ నటిస్తోంది.అభిరామి ప్రేమ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ 'కుక్ విత్ కోమలి' అనే వంటల ప్రోగ్రామ్లోనూ చేసింది. ఈ షోకి పనిచేస్తున్న డైరెక్టర్ పార్థివ్ మణితో అలా ప్రేమలో పడింది. గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది. కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.. 'నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తే త్వరలో వీళ్ల పెళ్లి వార్త చెబుతారేమో!(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పెళ్లి అంటేనే పెద్ద వార్తగా మారుతున్న పరిస్థితి. కొంత కాలం పాటు డేటింగ్ చేసి కొందరు పెళ్లి పీటలెక్కుతే.. మరికొందరు మాత్రం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడ్ని పరోక్షంగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో శుభం కార్డు వేయాలని ఆ బ్యూటీ చూస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..?రజీషా విజయన్ గుర్తుందా. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పాపులర్ అయిన ఈ కేరళ భామ.. 2016లో మలయాళంలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా పొందింది. 2021లో తమిళంలో కర్ణన్ చిత్రంలో ధనుష్కు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జైభీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో మెప్పించింది. సర్దార్ చిత్రం తరువాత కోలీవుడ్ లో కనిపించని రజీషా తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తాజా సమాచారం. మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు టోపిన్ థామస్తో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. అయితే దీనికి సబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) -
ప్రియుడితో పెళ్లి వార్తలు.. తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్!
-
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్ను గిఫ్ట్గా ఇచ్చాడు. విగ్ను గిఫ్ట్గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్ఫ్రెండ్తో సబలెంక (ఫొటోలు)
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
కెమెరామ్యాన్తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్?
హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమె రిలేషన్లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ? (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Tobin Thomas (@tobin_thomas7) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార) -
దారుణం.. బాయ్ఫ్రెండ్ కూతురిని చంపిన యువతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో అలెసియా ఓవెన్స్ అనే యువతి మానవత్వాన్ని మరిచి తన బాయ్ఫ్రెండ్కు చెందిన 18నెలల చిన్నారిని పొట్టనబెట్టుకుంది. గతేడాది జూన్లోని జరిగిన ఈ ఘటనలో అలెసియాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అటార్నీ జనరల్ మిచెల్ హెన్రీ తెలిపిన వివరాల ప్రకారం.. 18 నెలల ఐరిస్ రీటా అల్ఫెరా మృతికి కారణం అలెసియా అని.. పాపకు జరిపిన శవపరీక్షలో నమ్మలేని నిజాలు భయటపడ్డాయని తెలిపారు. అసిటోన్ అనే రసాయనం, వ్యాచ్ బ్యాటరీలు, స్క్రూలను పాపకు తినిపించడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల అలెసియా ఓవెన్స్.. జూన్25, 2023న పాప ఐరిస్ రీటా అల్ఫెరా తండ్రి బెయిలీ జాకబ్ పక్కనే ఉన్న ఒక స్టోర్ వెళ్లాడు. అదే సమయంలో పాపలో ఇంట్లో ఉన్న అలెసియా ఐరిస్ రీటాలో ఉలుకుపలుకు లేదని గమనించారు. అయితే ఈ సమాచారాన్ని ఆమె బెయిలీ జాకబ్కు అందించింది. దీంతో బెయిలీ జాకబ్ పాపను పిట్స్బర్గ్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం పాప ఐరిస్ రీటా మృతి చెందింది. పాప అవయవాల వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పాప ఐరిస్ తన తల్లి ఎమిలి అల్ఫెరాతో ఉంటోంది. అయితే తండ్రి బెయిలీ జాకబ్కు కేవలం సందర్శన హక్కులు మాత్రమే ఉండటం గమనార్హం. పాప మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు అలెసియా ఫోన్ పరిశీలించగా.. పలు నమ్మలేని నిజాలు భయటపడ్డాయి. పాప ఐరిస్ మృతికి ముందు.. అలెసియా పిల్లలకు హానీ చేసే వస్తువులు, పద్దతులకు సంబంధించి ఫోన్లో సమాచారాన్ని వెతికినట్లు బయటపడింది. పిల్లలకు హాని కలిగించే అసిటోన్ రసాయనం, బ్యాటరీలు, నెయిల్ పాలీష్, చిన్న వాటర్ బాల్స్, చిన్నపిల్లలకు విషపూరితంగా మారే బ్యూటీ ప్రాడక్టులను కూడా వెతికినట్లు పోలీసులు గుర్తించారు. శవ పరీక్షల నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తేలటంతో అలెసియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఎందుకు చిన్నారిని చంపిందనే విషయంపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: గాల్లో ఉండగానే కాక్పిట్ అద్దంలో పగుళ్లు! -
ఎంగేజ్మెంట్ అయిన ఏడాదికి పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన లైగర్ భామ.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
రకుల్ భామకు బాయ్ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్స్టా పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 10న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె బాయ్ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషళ్ విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్స్టాలో జాకీ రాస్తూ..'మీ ఈ ప్రత్యేకమైన రోజున.. నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదు. మీరు నా సహచరుడి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం.. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున, మీరు కలలుగన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజమవుతాయి.. ఎందుకంటే మీరు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హులు. ప్రతి రోజును ఎక్స్ట్రార్డినరీగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) -
ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం. తూర్పు లండన్లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్లైన్లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్హుడ్కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది. జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది? -
యువతి కిరాతకం.. అడ్డుగా ఉన్నాడని 11 ఏళ్ల బాలుడిని..
న్యూఢిల్లీ: బాయ్ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లయిందని తెలిసినా.. పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. ఇలా దొరికింది.. హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్గఢ్లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్సభ స్పీకర్ కీలక నిర్ణయం -
ఒక్క ఏడాదిలోనే వందమంది బాయ్ఫ్రెండ్స్ను మార్చిన యువతి
పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నామంటేనే పేరెంట్స్ తాట తీసేస్తారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అబ్బాయిలకు దూరంగా ఉండమని, వీలైతే మాట్లాడటం కూడా చేయొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్కు పంపించింది. కూతురి ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్ చేయమని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఎంత అప్గ్రేటెడ్ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది. తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్ఫ్రెండ్స్ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్టాక్లో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్గా వేడుకలు జరిపిందట. కేక్పై 100 నెంబర్ క్యాండిల్తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారట. దుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. కూతురికి తల్లి ఐదందల డాలర్లు బహుమతిగా ఇచ్చిందట. కన్నతల్లి అయ్యిండి కూతురికి డేటింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రశ్నించగా.. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని, అందుకే చాలామంది పురుషులతో డేటింగ్కు వెళ్లమని ప్రోత్సహించినట్లు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్తో సెలవిచ్చింది. -
అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా
ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. బ్రేకప్తో బరువు పెరిగా 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) డేటింగ్తో స్లిమ్గా 'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? ఆ మూవీస్తో బిజీ రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
9 నెలలు...బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఇలియానా
-
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
బాయ్ఫ్రెండ్తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లివ్ ఇన్లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్ఫ్రెండ్కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
కీర్తిసురేష్ డేటింగ్ వార్తలపై స్పందించిన తండ్రి
హీరోయిన్ కీర్తి సురేష్ ఈమధ్య కాలంలో పెళ్లి వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కీర్తి ఓ అబ్బాయితో డేటింగ్లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయితో క్లోజ్గా ఫోటోలు దిగడం, ఇద్దరూ సేమ్ కలర్ అవుట్ఫిట్లో దర్శనం ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సోషల్ మీడియాలోనూ కీర్తి ప్రేమ విషయం వైరల్గా మారడంతో స్వయంగా ఆమె స్పందించక తప్పలేదు. తను జస్ట్ ఫ్రెండ్ అని, ఈ వార్తల్లో అతన్ని లాగకండి అంటూ పేర్కొంది. అంతేకాకుండా తన లైఫ్లోని నిజమైన మిస్టరీ మ్యాన్ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తిసురేష్ తండ్రి కూడా ఈ వార్తలపై స్పందించారు. 'నా కూతురు ప్రేమలో ఉందని,అతనితో త్వరలోనే పెళ్లి అంటూ కథనాలు రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు. రీసెంట్తో కీర్తి షేర్ చేసిన ఫోటోల్లోని అబ్బాయి నాకు తెలుసు. అతను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే తప్పకుండా మీడియాకు తెలియజేస్తాము. అంతేకానీ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల కుటుంబంలో మనఃశాంతి కరువవుతుంది' అంటూ ఆవేదన వ్యక్తి చేశారు. -
డీసీపీతో గొడవ.. బాయ్ఫ్రెండ్ మ్యాటర్ లీక్ కావడంతో డింపుల్ అప్సెట్!
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్టాపిక్గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్షిప్ విషయం బయటపడిందని ఫీల్ అవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్ఫ్రెండ్ గురించి లీక్ అయ్యింది. ఈ విషయంపైనే డింపుల్ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్ హయతి, ఆమె బాయ్ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్ డిజైనర్ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. -
కీర్తిసురేష్ పెళ్లి చేసుకునేది ఇతడినేనా? ట్వీట్తో క్లారిటీ వచ్చేసింది
హీరో,హీరోయిన్ల సినిమా సంగతులతో పాటు వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఓ బిజినెస్ మ్యాన్తో కీర్తిసురేష్ లవ్లో ఉందని, త్వరలోనే వీరి వివాహం జరగనుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయి ఫోటో షేర్ చేయడంతో ఇతడే మహానటికి కాబోయే వరుడు అంటూ ఒక్కసారిగా కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు కీర్తి షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ దుస్తులు వేసుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో కీర్తిసురేష్ పెళ్లిపై ఫిల్మీదునియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కీర్తి స్వయంగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ను ఈ వార్తల్లోకి తీసుకొచ్చారా?నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. అప్పటిదాకా చిల్గా ఉండండి' అంటూ పేర్కొంది. దీంతో రీసెంట్గా కీర్తి షేర్ చేసిన ఆ అబ్బాయి బాయ్ఫ్రెండ్ కాదని తేలిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో కీర్తి లైఫ్లో మిస్టరీ మ్యాన్ ఉన్నడన్నది మాత్రం స్పష్టమైంది. ఆయన ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. Hahaha!! Didn’t have to pull my dear friend, this time! I will reveal the actual mystery man whenever I have to 😉 Take a chill pill until then! PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU — Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023 -
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని.. -
అదే ప్రాబ్లమ్.. ఎవరూ ప్రపోజ్ చేయట్లేదు: అనన్య
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్ సాబ్’తో మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ని అలరిస్తుంది. తాజాగా ఈ నటి.. తన బాయ్ఫ్రెండ్, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్స్టా లైవ్లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్ఫ్రెండ్ పేరు, అతని ఇన్స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది. అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్ ‘లాస్ట్ టైమ్ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది. -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి తిరుమలలో జాన్వీ ప్రత్యేకపూజలు
దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి పెళ్లికి ముందే ఇలా స్వామివారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేసిన జాన్వీ ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తిశ్రద్దల్లో మునిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జాన్వీ ప్రియుడు శిఖర్ కూడా పంచె కట్టులో దర్శనమిచ్చారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎయిర్పోర్టులో కూడా ఇద్దరూ జంటగా కనిపించారు. దీనికి తోడు నీతా అంబానీ కల్చరల్ ఈవెంట్కు శిఖర్ బోనీ కపూర్తో కలిసి వెళ్లాడు. దీంతో వీరి ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A — ANI (@ANI) April 3, 2023 -
మాజీ సీఎం మనువడితో జాన్వీ డేటింగ్? వీడియో వైరల్
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వీ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్లో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది. బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ముంబైలోని కలినా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరూ వైట్డ్రెస్లో ట్విన్నింగ్ అవుట్ఫిట్లో కనిపించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో పలు పార్టీలకు కలిసి హాజరైన జాన్వీ-శిఖర్లు ఇప్పటివరకు తమ రిలేషన్షిప్పై అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్కు పరిచయం కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
భవనంపై నుంచి పడి ఎయిర్హోస్ట్ మృతి.. బాయ్ఫ్రెండ్ అరెస్ట్
బెంగళూరు: ఎయర్హోస్ట్ భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరుమంగళలో రేణుకా రెసిడెన్సీలోని అపార్ట్మెంట్లో ఎయిర్ హోస్ట్ అర్చన ధీమాన్, ఆమె బాయ్ఫ్రెండ్ ఆదేశ్తో కలిసి నివసిస్తోంది. ఆదేశ్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి డేటింగ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. గత ఆరు నెలలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు. కాగా ఎయిర్హోస్ట్ అర్చన మృతిలో ఆదేశ్ పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయని ఆదేశ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపాడు. ఆరోజు అర్చన నాల్గో అంతస్థు బాల్కనీ నుంచి జారిపడిందని, తాను ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో ఈ ప్రమాదానికి నాలుగు రోజుల ముందే అర్చన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు. (చదవండి: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు) -
ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..
సాధారణ అమ్మాయిల నుంచి నటీమణుల వరకు ప్రియుడి వేధింపులకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ప్రియుడి చేతిలో మృతి చెందిన శ్రద్ధా వాకర్ నుంచి బాయ్ఫ్రెండ్ చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న నటి ఫ్లోరా సైనీ(అలియాస్ ఆశ) ఘటనలే ఇందుకు ఉదహరణ. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ఆశ ఇటీవల ఓ ఇంటర్య్వూలో బాయ్ఫ్రెండ్ వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ తాజాగా మరో నటి బాయ్ఫ్రెండ్ బాధితురాలుగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాయ్ఫ్రెండ్ చిత్రహింసలకు గురి చేశాడంటూ ప్రముఖ తమిళ నటి అనిఖా విక్రమన్ సోషల్ మీడియా వేదికగా నోరు విప్పింది. ఈ సందర్భంగా తన రిలేషన్ తాలూకు అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు, నోట్ షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనిఖా శరీరమంత గాయాలతో, ముఖం, కళ్లు కందిపోయి కనిపించింది. ఆ ఫొటోలన్నింటిని ఆమె షేర్ చేస్తూ తన బాయ్ఫ్రెండ్ వల్ల ప్రాణహానీ ఉందని, తనని.. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపింది. ‘గతంలో అనూప్ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అది నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టిననా అతడిలో అసలు మార్పే లేదు. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాడు’ అని పేర్కొంది. అయితే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనిఖా పేర్కొంది. చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ అలాగే మరో పోస్ట్లో ‘మొదటి సారి కొట్టినపుడు.. నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. అందుకే వదిలేశా. రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. ఒళ్లంతా కమిలేలా కొట్టాడు. ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ పోలీసులకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాము. రిలేషన్షిప్లో ఉన్నపుడు తరచుగా అతడు నా ఫోన్ను చెక్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవటానికి వెళ్లాడు. నేను ఆ దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావంటూ ఎద్దేవా చేస్తూ వెకిలిగా నవ్వాడు’ అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Anicka Vijayi Vikramman (@anickavikramman) -
శాంతను అలాంటివాడు.. బాయ్ఫ్రెండ్పై శ్రుతిహాసన్ కామెంట్స్
హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ హీరో కమల్హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ మధ్య కెరీర్ కాస్త అదుపు తప్పినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే శ్రుతి తన పర్సనల్ విషయాలను ఎప్పడూ సీక్రెట్గా ఉంచలేదు. బాయ్ఫ్రెండ్ శాంతను హజారికతో రిలేషన్లో ఉన్నట్లు పేర్కొన్న శ్రుతిహాసన్ అతనితోనే కలిసి ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా ప్రియుడు శాంతనుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తాజాగా మరోసారి శాంతను గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 'నాకు బయటకు వెళ్లి తినడం అంటే చాలా ఇష్టం. నేను, శాంతను తినడం కోసం బతుకుతుంటాం. తినే టైంలో ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. నాలాగే భోజన ప్రియుడ్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. తను నా లైఫ్లోకి వచ్చినందుకు నేనంతో లక్కీ' అంటూ బాయ్ఫ్రెండ్పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. -
యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
కంచికచర్ల(ఎన్టీఆర్ జిల్లా): కంచికచర్లలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య పట్టణంలో కలకలం రేపింది. నందిగామ రూరల్ సీఐ ఐవీ నాగేంద్రకుమార్ కథనం మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన కుంచం రామారావు(47) తన భార్య పిల్లలతో కంచికచర్ల పెద్ద బజారులోని పోస్టాఫీసు రోడ్డులో అద్దెకుంటున్నాడు. రామారావు స్వగ్రామంలో రేషన్ డీలర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య భార్గవి కంచికచర్ల మండలం మోగులూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. వారికి సంతానం లేకపోవటంతో పదేళ్ల క్రితం రామారావు తమ్ముడు శ్రీను చిన్న కుమార్తె జోహారికను పెంచుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత భార్గవికి సుస్మిత అనే పాప పుట్టింది. రామారావు గతంలో జేసీబీ ఉండేది. దానిపై జుజ్జూరు గ్రామానికి చెందిన మోగులూరు ప్రవీణ్కుమార్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలోనే డ్రైవర్ ప్రవీణ్కుమార్ తన యజమాని రామారావు భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటినుంచి ప్రవీణ్కుమార్ తరచుగా రామారావు ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ రామారావు ఇంటికి రాగా రామారావు అతడిని మందలించాడు. దీంతో రామారావు భార్య భార్గవి, ఆమె ప్రియుడు ప్రవీణ్, అతని స్నేహితులు మోగులూరు బుజ్జిబాబు, పులి సురేష్ కలసి రామారావుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకుని వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.35 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రామారావు సోదరుడు కుంచం శ్రీను ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' -
రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..
తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందాడనే ఆవేదనతో ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో నెలకొంది. వివరాలు.. కోవిల్పతాగై ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె వినోదిని(22). ఈమె అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ముత్తాపుదుపేట సమీపంలోని కరిమేడు ప్రాంతానికి చెందిన వసంత్(23)ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వసంత్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వినోదిని శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కైవసం చేసుకున్న ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కీళ్పాక్కం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
బాయ్ఫ్రెండ్ని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ కృతి కర్భందా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బోణి సినిమాతో టాలీవుడ్కు పరిచయైన కృతి తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్కు ఆమెకు అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. దీంతో టాలీవుడ్కు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి సినిమాలతో ఆకట్టుకుంది. సినిమాల విషయం పక్కన పెడితే కృతి కర్భందాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తాజాగా వలైంటైన్స్ డే సందర్భంగా తన బాయ్ఫ్రెండ్ని పరిచయం చేసింది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్తో ప్రేమలో ఉన్న కృతి తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడితో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే పులికిత్ విషయానికి వస్తే.. పలు సినిమాలు, సీరియల్స్తో ఆకట్టుకున్న ఆయన గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్ను పెళ్లాడాడు. అయితే వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. ఇప్పుడు ఆయన కృతితో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. -
ఫేస్బుక్ లవ్.. ప్రియురాలి ఇంటి ఎదుట షాకింగ్ ఘటన..
ఓజిలి(తిరుపతి జిల్లా): ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రియుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని కురుగొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల మేరకు, కోట మండలం చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన శివతేజ(20) ఎన్బీకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాలలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో కురుగొండకు చెందిన యువతి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి తిరుగుతుండడంతో, ఇరువురి ఇళ్లలో తెలిసింది. ఇటీవల కోట పోలీస్స్టేషన్లో పంచాయితీ పెట్టారు. అయినా వీరి మధ్య ఫోన్ ద్వారా సంభాషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో యువతికి శనివారం కురుగొండ గ్రామంలో పెళ్లిచూపులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న శివతేజ ఆదివారం యువతి ఇంటికి వచ్చాడు. యువతి బంధువులు, శివతేజకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అనంతరం వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని గ్యాస్ లైటర్ను వెలిగించాడు. చదవండి: నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం! మంటలు వ్యాపించి, అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు మంటలను అదుపుచేసి 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దారం ఆదిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాహాల్లో పనిచేస్తూ జీవనం... శివతేజ కాలేజీలో చదువుకుంటూ కోటలోని అరుణా థియేటర్లో ఆపరేటర్గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఎన్సీసీలో చేరి రెండు రోజులు క్రితం నెల్లూరులో పరీక్ష రాశాడని శివతేజ తల్లి సంధ్య తెలిపింది. ఆరు నెలల క్రితం చెల్లెలికి వివాహం చేశాడు. ఈ క్రమంలో ప్రియురాలి నుంచి ఫోన్ రావడంతో ఎన్సీసీ పరీక్షకు వెళుతున్నానంటూ కురుగొండకు వచ్చినట్లు సంధ్య తెలిపింది. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు శివతేజ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
Odisha College: ‘ఆ రోజులోపు బాయ్ఫ్రెండ్ ఉండాల్సిందే’
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్ఫ్రెండ్తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎస్వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెరటం చిత్రంతో టాలీవుడ్కు, తడయార తాక్క చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో సరైన సక్సెస్లు లేక నిరాశ పడినా ఆ తరువాత దక్షిణాదిలో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద క్రేజ్ లేకపోయినా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వస్తనే ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటిస్తున్న అయలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు పదుల వయసు దాటిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు బాయ్ ఫ్రెండ్తో చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును కూడా జాకీ బద్నానితో ఖుషీ ఖుషీగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక వధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్ జాకీ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బాయ్ఫ్రెండ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో తాను రిలేషన్లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్ ఎప్పుడూ సీక్రెట్గా ఉంచలేదు. సోషల్ మీడియాలో అతనితో క్లోజ్గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్ కామెడీగా ఉంటాయి. ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్. ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. -
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులు! ఆఖరికి కూతురి క్లాస్మేట్ను...
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులకు ఒడిగట్టింది ఒక మహిళ. ఆఖరికి ఆమె బాయ్ఫ్రెండ్, క్లాస్మేట్లను సైతం వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలడంతో ఆమె జైలు పాలయ్యింది. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...42 ఏళ్ల కెన్రా గెయిల్ లికారీ అనే మహిళ తన సొంత కూతరిని, ఆమె బాయ్ప్రెండ్ని, క్లాస్మేట్స్ని వివిధ మెసేజ్లతో సైబర్ వేధింపులకు పాల్పడింది. ఆమె ఫేక్ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్లైన్లో టీనేజర్లను ఇలా వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టినేజర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు బీల్ సిటీ పబ్లిక్ స్కూల్స్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్లోనే బాస్కెట్ బాల్ కోచ్గా పనిచేస్తోంది. ఐతే విచారణలో సదరు మహిళ ఫేక్ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్వేర్ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్లను వినియోగించినట్లు తేలింది. సైబర్ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్ సాయంతో ఆమెను ట్రాక్ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్మేట్లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్ మెసేజ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు మోపి కోర్టు ముందు హజరపరిచారు. దీంతో ఆమె సైబర్ వేధింపులకు పాల్పడినందుకుగానూ 10 ఏళ్లు జైలు శిక్ష, నేరాన్ని తారుమారు చేసేందుకు యత్నించినందుకు గానూ మరో ఐదు ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ. 4 లక్షల పూచికత్తుతో బెయిల్పై విడుదలయ్యింది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే..
రాజోలు(కోనసీమ జిల్లా): మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజోలు మండలం తాటిపాకకు చెందిన వివాహితకు తన బావ అయిన మలికిపురం మండలం గూడపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేరంటూ అతడిని ఆమె ఇంటికి పిలిచింది. ఇంట్లో ఉన్న తన కుమారుడిని వివాహిత మరో రూములో పడుకోబెట్టి గడియ పెట్టింది. సన్నిహితంగా ఉన్న సమయంలో అతడికి, ఆ వివాహితకు మధ్య వివాదం తలెత్తింది. మరో మహిళతో చనువుగా ఉంటున్నాడంటూ ఆగ్రహించిన ఆమె అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి మర్మావయవాన్ని కోసేసింది. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతడు బంధువుల సహకారంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయడంతో అతడు కోలుకుంటున్నాడని బంధువులు తెలిపారు. అతడిపై దాడి చేసిన వివాహితపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే.. -
బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’
చిత్తూరు అర్బన్: ‘మనది స్వచ్ఛమైన ప్రేమ. దీన్ని గెలవాలంటే మా ఆయన్ను తప్పించాలి. ఆయన్ను చంపేస్తే మనం హాయిగా కలిసి ఉండొచ్చు...’ అని ప్రియురాలు చెప్పిన మాటల్ని తలకెక్కించుకున్న ప్రియుడు ఆమె భర్తను స్నేహితులసాయంతో హతమార్చాడు. తీరా పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యాడు. గతవారం చిత్తూరు శివారుల్లో వెలుగుచూసిన ఆటోడ్రైవర్ వడివేలు హత్య కేసు మిస్టరీని తాలూక పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎ.సెల్విరాణి (26), ఎస్.వినయ్ (30), ఆర్.నిరంజన్ (30), ఎం.కిషోర్ (29) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తాలూక స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసమూర్తి.. సీఐ మద్దయ్య ఆచారి, ఎస్ఐ రామకృష్ణతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు బాలాజీనగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వడివేలు ఈనెల 5వ తేదీ రాత్రి సీతమ్స్ బైపాస్ వద్ద హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి రాణెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్విరాణి గత ఏడాదిగా నగరంలోని చర్చివీధిలో ఓ బిందెల దుకాణంలో పనిచేస్తోంది. ఇదే వీధిలో ఎంబీఏ వరకు చదువుకుని ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్న వినయ్తో ఈమె తనకు పెళ్లికాలేదంటూ పరిచయం చేసుకుంది. ఏడాదిపాటు వీళ్ల ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. పెళ్లి చేసుకోవడానికి వినయ్ ఒత్తిడి పెంచడంతో ఓ రోజు తనకు పెళ్లయ్యిందని సెల్విరాణి అసలు విషయం చెప్పింది. తన భర్తను తప్పిస్తే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయొచ్చని చెప్పడంతో వినయ్ వడివేలుతో స్నేహం చేసి, రెండుసార్లు మద్యం సేవించాడు. అయితే భార్యపై అనుమానం రావడంతో వడివేలు పలుమార్లు ఆమెను కొట్టాడు. విషయం తెలుసుకున్న వినయ్, వడివేలును హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు. సంతపేటకు చెందిన తన స్నేహితుడు నిరంజన్కు విషయం చెప్పగా వళ్లియప్పనగర్కు చెందిన కిరాయి హంతకుడు ఎం.కిషోర్ను సంప్రదించారు. హత్యకు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా, రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వినయ్ నుంచి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న కిషోర్, రెండు నెలలుగా వడివేలును చంపడానికి ప్రయతి్నస్తున్నాడు. ఆటోస్టాండులో గిరాకీలు తెచ్చిస్తూ, వడివేలుకు స్నేహితుడిగా మారిన కిషోర్, ఇతడ్ని చంపడానికి అమెజాన్లో కత్తిని కూడా బుక్ చేసుకున్నాడు. నాలుగు మార్లు శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి, మద్యం తాగించినప్పటికీ వడివేలు నిబ్బరంగా ఉండటంతో సాధ్యంకాక వచ్చేశాడు. తన భర్తకు మద్యం తాగిన తరువాత స్వీటు తినిపిస్తే మత్తు ఎక్కు తుందని సెల్విరాణి చెప్పడంతో ఈనెల 5వ తేదీ రాత్రి వడివేలుకు గిరాకీ ఉందని చెప్పిన కిషోర్, మద్యం తాగించి బీరుబాటిల్తో తలపైకొట్టి కత్తితో శరీరంలో 23 చోట్ల పొడిచి, ఆపై గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు ఘటనా స్థలానికి వచ్చిన సెల్విరాణి, కుటుంబ సభ్యులతో కలిసి భర్త మృతదేహాన్ని చూసి ఏడుస్తూ నటించింది. అప్పుడు వినయ్కు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. హత్యానంతరం మృతుడి సెల్ఫోన్ తీసుకుని చెరువులో పడేసిన కిషోర్.. వినయ్, నిరంజన్తో కలిసి పారిపోయాడు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆదివారం ఉదయం నిందితులు ముగ్గురినీ పోలీసులు చిత్తూరు–తిరుపతి బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వీళ్ల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లను సీజ్ చేశారు. చదవండి: శ్రీకాళహస్తి: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి.. -
థ్రిల్లింగ్ స్టోరీ: బాయ్ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిల బిగ్ ఫైట్
పట్నా: ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్న సంఘటనలు చూసే ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కోసం ఏకంగా ఐదుగురు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన సంఘటనే బిహార్లో జరిగింది. సోన్పుర్ మేళలో బాయ్ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిలు గొడవ పడ్డారు. జట్టుపట్టుకుని చితక్కొట్టుకున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా.. చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ఫైటింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇంతకీ బాయ్ఫ్రెండ్ని వదిలేసి వారు కొట్టుకోవటానికి కారణాలేంటి? సోన్పుర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదుగురితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లు చూసుకున్నాడు. అయితే, ఆ ఐదుగురు అమ్మాయిల్లో ఒకరితో సోన్పుర్లో జరుగుతున్న ‘మేళ’కు రావటమే అతడు చేసిన తప్పు. అదే మేళకు మిగిలిన నలుగురు అమ్మాయిలు రావటంతో రెడ్హ్యాండేడ్గా దొరికిపోయాడు. కానీ, ఆ యువకుడి కోసం అమ్మాయిలు గొడవకు దిగటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువకుడితో వచ్చిన యువతిని చితకబాదారు. ఆ యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ అమ్మాయి కాలితో తన్నుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సేపటి తర్వాత అక్కడే ఉన్న కొంత మంది కలుగజేసుకుని గొడవను ఆపారు. #Bihar: Five girls fight for a boyfriend, in Sonpur's mela. The girls saw that the guy was roaming with another girl, and they attacked her.#Viral #viralvideo #india pic.twitter.com/LBDdqqQMaK — Siraj Noorani (@sirajnoorani) November 29, 2022 ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
ప్రియుడిపై అనుమానం.. ఫుల్గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్లాండ్లో వెలుగుచూసింది. పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు. ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..! -
ఆ హీరోతో డేటింగ్.. దుబాయ్కు పారిపోయానన్నారు : శివానీ రాజశేఖర్
ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ ప్రియుడితో దుబాయ్కు పారిపోయిందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్వయంగా ఆమె తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది శివానీ. అహనా పెళ్లంట వెబ్సిరీస్లో పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇదే లైన్ను నాకు తగిలేసి శివానీ బాయ్ఫ్రెండ్తో దుబాయ్కు వెళ్లిందన, ఇంకోసారి శివానీ కాదు శివాత్మిక పారిపోయిందని ఫేక్ వార్తలు పుట్టించారు. దీంతో ఇంతకీ పారిపోయింది నేనా? లేక శివాత్మికనా? అసలు ఆ బాయ్ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది. దీనికి తోడు నేను వెళ్లింది బాయ్ఫ్రెండ్తో కాదు, నా ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశారు. అప్పుడు ఈ ఫేక్ న్యూస్కి తెరపడింది అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరో రాజ్తరుణ్తో ఆమె ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా శివానీ మాట్లాడుతూ... రాజ్తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ అని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తమ మధ్య స్నేహం తప్పా ప్రేమ లేదని క్లారిటీ ఇచ్చేసింది. -
ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య
సాక్షి, చెన్నై(అన్నానగర్): కడలూర్ సమీపంలో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ప్రియుడితో కుమార్తె వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కడలూరు సమీపం పుదుచత్రం సమీపంలోని వేలంగిపట్ట గ్రామానికి చెందిన సుందరమూర్తి (65) రైతు. ఇతని భార్య సుమతి (50). వీరి కుమార్తె పుష్పరోహిణి(19). సి.ముడ్లూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమెకి పెరియాండికులి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించగా ఆదివారం (ఈరోజు) నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాల వారు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పుష్పరోహిణి కాలేజీకి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. కాలేజీ ముగించుకుని ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పుష్పరోహిణి కోసం పలు ప్రాంతాల్లో వెతికారు. అప్పుడు పుష్పరోహిణి వేలంగిపట్టు గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, ప్రియుడితో వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సుందరమూర్తి, సుమతి తీవ్ర ఆవేదనకు గురై.. పొలం వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరు బ్యూటీషియన్ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా?) -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గంగవరం(చిత్తూరు జిల్లా): పెద్దపంజాణి మండలం ఇటుక నెల్లూరు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దామోదరం హత్య కేసులో నిందితులుగా ఉన్న మృతుడి భార్య అనూరాధ, ఆమె ప్రియుడు గంగరాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు నిర్ధారించారు. గురువారం గంగవరం పోలీస్స్టేషన్లో డీఎస్పీ గంగయ్య వివరాలను వెల్లడించారు. పుంగనూరు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన దామోదర్కి, పెద్దపంజాణి మండలం పెనుగొలకలకి చెందిన అనురాధతో ఏడాది క్రితం వివాహమైంది. దామోదరం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి.. వివాహ సమయంలో అనురాధాకు అత్తింటి వారే నగలు పెట్టి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అనురాధకు నాగిరెడ్డిపల్లికి చెందిన గంగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. అతనికి ఇది వరకే కొత్తపల్లికి చెందిన మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం అనంతరం అనురాధ తన భర్తతో సక్రమంగా కాపురం చేసేది కాదు. కాగా అత్తింటివారు పెట్టిన నగలను కొన్ని నెలల తరువాత భర్తకు తెలియకుండా ప్రియుడి అవసరార్థం ఇచ్చింది. కొన్నాళ్ల తరువాత పుంగనూరు పట్టణంలో సైటు కొనేందుకు కొంత నగదు సరిపోకపోవడంతో నగలను ఇవ్వమని అనురాధను అడగడంతో పుట్టింటిలో ఉన్నాయంటూ తప్పించుకుంది. అలా అడిగిన ప్రతిసారి సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఈ దీపావళి పండుగ (ఈ నెల 24)న భార్య భర్తలిద్దురూ అత్తింటికి వెళ్లారు. పండుగ ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాము వస్తున్న లొకేషన్ గురించి ప్రియుడికి తరచూ సెల్ఫోన్లో మెసేజీలు పెట్టుకుంటూ వచ్చింది. తరువాత తుర్లపల్లి గ్రామ సమీపంలో నాగలాకుంట చెరువు కట్టపై వెళ్లగానే గంగరాజు వాహనాన్ని ఆపాడు. దామోదరం కళ్లలో కారం కొట్టి తల, శరీర భాగాల్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హతమార్చి నగలు దోచుకెళ్లారంటూ అనురాధ కథ అల్లింది. అందురూ నిజమనే అనుకున్నారు. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలిసులు హత్యకు వినియోగించిన కత్తి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
అతడితో పెళ్లి.. స్పందించిన 'కొమురం పులి' హీరోయిన్
కొమురం పులి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన భామ నిఖీషా పటేల్. ఈ సినిమా నిరాశపచడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్బై చెప్పేసి విదేశాల్లో సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తనకు నచ్చలేదంటూ వార్తల్లో నిలిచింది. రీసెంట్గా ఓ విదేశియుడితో ప్రేమలో ఉన్నానంటూ వెల్లడించింది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఓ వ్యక్తితో క్లోజ్గా దిగిన ఫోటోను సైతం షేర్ చేయడంతో నిఖీషా పటేల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఓ ఫోటోను డిలీట్ చేసిన ఆమె తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. -
దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ 2010లో వచ్చిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె తెలుగు తెరకు దూరమైంది. కొమురం పులి మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు తమిళ, కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్క వరుస సినిమాలు చేసింది. అయితే ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆమె సినిమాలకు బై చెప్పేసింది. చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి ప్రస్తుతం నిఖీషా విదేశాల్లో ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో బాయ్ఫ్రెండ్ ఎవరని, అతడి చూపించాలంటూ ఫ్యాన్స్ నుంచి సందేశాలు రావడంతో తన ప్రియుడిని చూపింది నిఖీషా పటేల్. దీపావళి పండగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్ఫ్రెండ్తో దిగిన ఫొటోను ఇన్స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: మరో కొత్త బిజినెస్లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
వీడియో లీక్ ఘటన.. ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేసిన పోలీసులు
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వీడియో పంపిన విద్యార్థినిని అరెస్టు చేయగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడ్ని 23 ఏళ్ల సన్నీ మెహతాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ప్రైవేట్ వీడియోను తన బాయ్ఫ్రెండ్ సన్నీ మెహతాకు పంపిన అమ్మాయిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆమె సొంత వీడియో అని, ఇతర అమ్మాయిల వీడియోలేవీ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు సిమ్లాలోని రోహ్రూ ప్రాంతానికే చెందినవారని పోలీసులు వెల్లడించారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. విద్యార్థినులంతా యూనివర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
పెళ్లికి నిరాకరించిందని హత్య
ఖిల్లాఘనపురం: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ప్రియుడు మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపు రం మండలం మానాజీపేటలో ఈ నెల 5న జరగగా 8వ తేదీ సాయంత్రం వెలుగు చూసింది. మానాజీపేటకు చెందిన బత్తని అంజన్న 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి శంషాబాద్ దగ్గర జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు శ్రీశైలంకు మిత్రుల ద్వారా హైదరాబాద్లోని కాటేదాన్కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పడంతో అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో సాయిప్రియ శంకర్తో మాట్లాడటం మానేసింది. తర్వాత కరోనా ప్రభావంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం కుటుంబం మానాజీపేటకు వెళ్లింది. మళ్లీ మాటలు కలిసి.. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. ఈ క్రమంలో నెల 5న సాయిప్రియ భూత్పూర్ వరకు రాగా అక్కడి నుంచి శంకర్ బైక్పై మానాజీపేటలోని తన షెడ్ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శంకర్ సాయిప్రియ మెడలోని చున్నీతో గొంతు నులిమి చంపాడు. తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసు విచారణతో.. సాయిప్రియ ఇంటికి రాకపోవడంతో మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనాస్థలానికి చేరుకుని తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ ఇదిలా ఉంటే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పిది. చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్డే వేడుకలు, ఫొటోలు వైరల్ అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. కానీ తనకు బాయ్ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కవాలని చెప్పింది. ‘మంచి హైట్, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్ఫ్రెండ్గా కావాలి. లైట్గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. ఇకపోతే సురేఖకు రెండో వివాహం చేయాలనుకుంటున్నానని ఆమె కూతురు సుప్రీతా ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పిన విషయం తెలిసిందే. -
సురేఖవాణి మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? రివీల్ చేసిన కూతురు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. త్వరలో సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా అందుకు సుప్రీత అవుననే సమాధానం ఇచ్చింది. మా అమ్మకు పెళ్లిచేస్తానంటూ బదులిచ్చింది. ఇక రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? మీరిద్దరు సింగిలా అని అడగ్గా ప్రస్తుతానికి అవునని, కానీ మాకొక బాయ్ఫ్రెండ్ కావాలంటూ సురేఖవాణి పేర్కొంది. అంతేకాకుండా బాయ్ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా రివీల్ చేసింది. అయితే నువ్వు చెప్పే క్వాలిటీస్ ఆయనలో లేవెంటీ మమ్మీ అంటూ సుప్రీత కొంటెగా ప్రశ్నించగా ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖవాణి ఆమె నోరు కట్టేసింది. దీంతో సురేఖవాణి త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్ -
హీరోయిన్ రేంజ్లో పరుగెత్తి... చివరికి నేలకి అతుక్కుపోయింది
మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని సంతోషం వస్తుంది. వాళ్లను చూడగానే హయ్ అని పలకరించడం లేదా కరచలనం చేయడం వంటి పనులు చేస్తాం. బాగా నచ్చిన వాళ్లయితే వెంటనే వాళ్లను హగ్ చేసుకోవడం వంటివి చేయడం సహజం. అచ్చం అలానే ఇక్కడొక ఆమె అత్యుత్సహంతో పరిగెట్టి అబాసుపాలైంది. వివరాల్లోకెళ్తే...ఒక అమ్మాయి తన భర్తను ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవానిడానికి వస్తుంది. ఐతే చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటున్నారు. దీంతో ఆమె ఎయిర్ పోర్ట్లో తన భర్త కనిపించగానే ఆనందంతో హగ్ చేసుకోవడానికి పరిగెట్టింది. అచ్చం సినిమాలోని హిరోయిన్ మాదిరి పరిగెడుతుంది. ఇంతలో అనుకోకుండా భర్త స్లిప్ అయి కిందపడిపోవడంతో వేగంగా వస్తున్న ఆమె కూడా భర్తని గుద్దుకుని పడిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు షాక్ అవుతారు. ఆ జంటకు సాయం చేసేందుకు అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు రాకమునుపే వారికివారే సర్దుకుని లేగిసిపోవడం జరిగిపోతుంది. పైగా సదరు మహిళ జంప్త చేసి మరీ తన భర్తను గట్టిగా ప్రేమతో ఆలింగనం చేసుకుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజనల్లు మొదట ఆ జంటకు మంచి చెప్పులు కొనివ్వాలి ఇలా పడిపోకుండా ఉండేందుకుని అని కామెంట్లు చేస్తు ట్వీట్ చేశారు. 'Falling' in love! 😂 pic.twitter.com/1m2Ojg2uOY — Harpreet (@CestMoiz) August 8, 2022 (చదవండి: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..) -
బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేషన్!.. అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్షిప్ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్డేను బాయ్ఫ్రెండ్తో ఫారిన్లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్లో ప్రియుడు సిద్ధార్థ్తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలోని పలు పోస్ట్లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్ను ఎంపిక చేశాం: డైరెక్టర్ అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్డేను సిద్ధార్థ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ View this post on Instagram A post shared by SidKiara (@siara_vogue) కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఎపిసోడ్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. -
బాయ్ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
Kolkata Model Pooja Sarkar Suicide After Boyfriend Call: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదం నెలకొంటోంది. అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే, ఆత్మహత్యలకు పాల్పడుతూ పలువురు తనువు చాలిస్తున్నారు. వీరిలో కొందరు మోడల్స్ సైతం ఉంటున్నారు. తాజాగా కోల్కతాలో పూజా సర్కార్ (21) అనే మోడల్ విగతజీవిగా కనిపించింది. తను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూజా సర్కార్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం చదువుతోంది. సౌత్ కోల్కతాలోని బాన్స్ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన ఫ్రెండ్స్తో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లింది పూజా. రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాకు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకున్న పూజా.. ఆమె ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. దీంతో పూజా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజా సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని పూజా స్నేహింతులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్లర్' హీరోయిన్.. కాగా గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ బలవన్మరణం చెందారు. బిదిషా డే మజుందార్ అనే కోల్కతా మోడల్ మే 24న డమ్డమ్లోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయింది. తర్వాత పరిశ్రమలోని బిదిషా స్నేహితురాలు మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న పటులిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ రిలేషన్షిప్తోపాటు సరైనా అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
Rakul Preet Singh Dance Video Goes Viral Jackky Bhagnani Comment: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'రన్ వే 24', 'ఎటాక్' చిత్రాలతో బీటౌన్ ఆడియెన్స్ను పలకరించింది. ప్రస్తుతం రకుల్ చేతిలో థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి, డాక్టర్ జీ, ఓ మై గోస్ట్, మిషన్ సిండ్రెల్లా, 31 అక్టోబర్ లేడీస్ నైట్ తదితర చిత్రాలు ఉన్నాయి. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది రకుల్. తాజాగా తన డ్యాన్స్తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ కాగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగానే 'పసూరి' (Pasoori) పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంటూ ఈ సాంగ్ తన ఫేవరెట్గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు కొడుతూ గంటలోనే సుమారు 3 లక్షలకుపైగా వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన సెలబ్రిటీలు ఓ మై గాడ్, చంపేశావ్ బేబీ అని కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. ఇక రకుల్ బాయ్ఫ్రెండ్, యాక్టర్ జాకీ భగ్నానీ డియర్ లవ్.. నాకు కూడా నేర్పించవా అని కామెంట్ చేశాడు. కాగా రకుల్ డ్యాన్స్ చేసిన 'పసూరి' సాంగ్ యూట్యూబ్లో 20 కోట్లకు పైగా వ్యూస్ సొంత చేసుకుని సెన్సేషనల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్ఫ్రెండ్ అట..
Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్ను ప్రతిక్షణం థ్రిల్లింగ్కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్గా నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 11 కోట్ల మంది నెట్ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్తో నెట్ఫ్లిక్స్కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్ఫ్లిక్స్ సిరీస్గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్వైడ్గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్ఫ్రెండ్గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు. Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM — Netflix (@netflix) June 12, 2022 అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. Red light… GREENLIGHT! Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39 — Netflix (@netflix) June 12, 2022 how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77 — xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022 the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa — brooke (@brookeab) June 12, 2022 now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc — jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022 Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7 — shera || (@ddiddirere) June 12, 2022 -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. గర్భం పోయేందుకు అబార్షన్ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్ ఒప్పకున్నాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్ 12 తేదీన సతీశ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది. నెలలోపు పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది. -
ఫుడ్ డెలివరీ బాయ్ ఎంట్రీతో సీన్ రివర్స్
Food delivery boy intervenes in lovers spat: ఎక్కడైన ఏదైనా గొడవ జరుగుతుంటే సర్ది చెప్పి గొడవ ఆపేందుకు లేదా సద్దుమణిగేలా చేయడం సహజం. అయితే అలాంటి ఘటనల్లో ఒక్కోసారి మంచి చేద్దామని జోక్యం చేసుకున్నందుకు వాళ్లపైనే తిరగబడిన వాళ్లు ఉంటారు. ఏది ఏమైన ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగానే హ్యండిల్ చేయాలి లేదంటే మంచికిపోతే చెడు ఎదురైందన్న సామెత మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒడిశాలో భువనేశ్వర్లోని ఇందిరాగాంధీ పార్క్ వెలుపల ఒక అమ్మాయి తన ప్రియుడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె తన బాయ్ఫ్రెండ్ను తిట్టడం కొట్టడం వంటివి చేసింది. ఇంతలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేద్దామనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడూ ఆ అమ్మాయి ఆ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ని భయంకరంగా తిట్టడం మొదలు పెట్టింది. ఇక సహనం కోల్పోయిన ఆ వ్యక్తి ఆ అమ్మాయిపై చేయి చేసుకుంటాడు. దీంతో అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా షాకై పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ అమ్మాయి గానీ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో డీసీపీ ఉమాశంకర్ దాష్ ఆ ఇద్దరి పై కేసు నమోదు చేయమని సంబంధిత పోలీసులను ఆదేశించారు. (చదవండి: చెడు అలవాట్లకు బానిసై... ఆ వ్యక్తి 14 ఏళ్లుగా అక్కడే..) -
ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు
వరంగల్: రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువతి హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడికి బుధవారం జిల్లా కోర్టు జీవిత ఖైదీగా శిక్ష విధించింది. సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధాదేవి తీర్పును వెలువరించారు. కాజిపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహీద్ లష్కర్, సింగారంకు చెందిన మునిగాల హారతి హనుమకొండలోని ఓ కళాశాలలో 2016లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివారు. ఆసమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొంత కాలం ప్రేమ సాఫీగానే సాగింది. షాహిద్ డిగ్రీ ఫెయిలయ్యాడు. కాజీపేటలోని తన తండ్రికి చెందిన మటన్ షాపులో చేదోడుగా ఉండేవాడు. హారతిని కలిసేందుకు ఆమె అక్క నివాసం ఉంటున్న హనుమకొండలోని రాంనగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో షాహిద్తో హారతి సన్నిహితంగా ఉండడం లేదని, వేరే యువకుడితో సాన్నిహిత్యంగా ఉంటోందనే నెపంతో హారతిని హత్య చేసేందుకు షాహిద్ ప్రణాళిక రూపొందించుకున్నాడు. 2020 జనవరి 10న షాహిద్ తన గదికి రమ్మని హారతిని పిలిచాడు. ఆమె రాగానే.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షాహిద్ హారతిపై అత్యాచారం చేసి కత్తితో గొంతుకోశాడు. కాజీపేట, విష్ణుపురి కాలనీలోని తన ఇంటికెళ్లి రక్తం అంటిన దుస్తులను మార్చుకున్నాడు. సుబేదారి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ జితేందర్రెడ్డి సాక్షులను విచారించి నిందితున్ని జైలుకు పంపించారు. అధికారులకు అభినందనలు బాధితురాలు తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.అజయ్కుమార్ 29 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధ దేవి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డిని, కోర్టు కానిస్టేబుల్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్దార్, ప్రాసెస్ హోంగార్డు శ్రీధర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
ఘాతుకం: కన్నతల్లి కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు..
తిరువొత్తియూరు(చెన్నై): బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడాన్ని ఖండించిందనే కోపంతో ఓ బాలిక తన తల్లిని హత్య చేసింది. వివరాలు.. తూత్తుకుడి కార్పొరేషన్ చాకలిపేట రెండో వీధిలో మాడస్వామి. మునిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో మునిలక్ష్మి శనివా రం రాత్రి హత్యకు గురైంది. తూత్తుకుడి పోలీసు లు మునిలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మునిలక్ష్మి కుమార్తె (17) రాజీవ్నగర్కు చెందిన కన్నన్ (20), ముత్తయ్యపురానికి చెందిన తంగకుమా ర్ (22)తో స్నేహం కలిగి ఉందని తేలింది. అలాగే తంగ కుమార్కు, ఈ బాలికకు ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో మునిలక్ష్మి దాన్ని తీ వ్రంగా ఖండించినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన బాలిక, కన్నన్, తంగకుమార్, మరోస్నేహితుడితో కలిసి మునిలక్ష్మిపై దాడి చేసి నోటిలో గుడ్డపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. పోలీసులు కన్నన్ను అరెస్టు చేశారు. తంగకుమార్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. -
ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు
Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. బాయ్ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్స్టోరీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్డే విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. -
Shruti Haasan: నాకు శ్రుతీహాసన్తో అలా పెళ్లయిపోయింది
శ్రుతీహాసన్తో తన వివాహం జరిగిపోయిందంటున్నారు చిత్రకారుడు, ర్యాపర్ శంతను హజారికా. అయితే ఆయన మాటల్లో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. శ్రుతీతో తన వివాహం క్రియేటివ్గా అయ్యిందని చెబుతున్నారు. ఈ విషయం గురించి ఓ ఇంగ్లీష్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్గా మా (శ్రుతి, శంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయాలనుకుంటాం. నా జీవితంలో శ్రుతీ ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే నన్ను చూసి తను ఇన్స్పైర్ అవుతుంటుంది. మా క్రియేటివ్ (సృజనాత్మకత) థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంపై మాత్రం నాకు క్లారిటీ లేదు’’ అన్నారు. క్రియేటివ్గా పెళ్లయిందంటే.. మానసికంగా తమ బంధం ముడిపడిందని శంతను చెబుతున్నారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ‘కపుల్ గోల్స్ చాలెంజ్’లో శంతను, శ్రుతి పాల్గొన్న విషయం గుర్తుండే ఉంటుంది. -
ప్రేమజంట నిర్వాకం: పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్లు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశం వెళ్లాడు.. కడుపు కట్టుకుని.. పైసాపైసా కూడబెట్టుకున్నాడు.. ఆ సొమ్ముతో ముందుగా పెద్దకూతురు వివాహం చేయాలని నిశ్చయించాడు.. కానీ, ప్రేమికుడితో కలిసి రెండోకూతురు ఆ సొమ్మును పట్టుకుని ఎటో వెళ్లిపోయింది.. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నెగూడేనికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి వెతుక్కుంటూ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. తన ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురు వివాహం చేద్దామని భావించాడు. నెలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇన్నాళ్లూ కూడబెట్టిన రూ.6.40లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో నిల్వచేశాడు. బాధితుడికి డబ్బు అందిస్తున్న సీఐ రాజశేఖర్రాజు గమనించిన ఆయన రెండో కూతురు.. ఆ సొమ్ము తీసుకుని తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి పదిరోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తండ్రి.. ఈ విషయంపై కోరుట్ల సీఐ రాజశేఖర్రాజుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. మేడిపెల్లి ఎస్సై సుధీర్రావు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, విజయ్తో కలిసి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ బృందం ఖమ్మం జిల్లా కూసుమంచిల ఆ ప్రేమజంటను గుర్తించి చాకచక్యంగా పట్టుకుంది. బుధవారం సీఐ రాజశేఖర్రాజు ఎదుట హాజరుపర్చింది. ఆ జంటనుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. పోలీసు బృందాన్ని మెట్పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందించారు. ఈ సొమ్మును సీఐ రాజశేఖర్రాజు బాధితుడికి అందజేశారు. తన పెద్దకూతురు వివాహం కోసం దాచిన సొమ్ము మళ్లీ తన వద్దకు రావడంతో ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సీఐ మాట్లాడుతూ, యువత తల్లిదండ్రులను నమ్మించి ప్రేమపేరిట మోసపోవద్దని సూచించారు. ఎస్సైలు సతీశ్, శ్యామ్రాజ్ పాల్గొన్నారు. -
అవును.. బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, అతనెవరో చెప్పేస్తా.. కానీ: హీరోయిన్
ప్రస్తుత సౌత్ టాప్ హీరోయిన్లతో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఒకరు. తెలుగులో నేరుగా మూవీ చేయకపోయిన హీరో విజయ్ ‘మాస్టర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ప్రస్తుతం తమిళ, కన్నడలో వరస ప్రాజెక్ట్స్తో మాళవిక ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఇటీవల మాల్దివులు టూర్ వెళ్లోచ్చిన మాళవిక ఇన్స్టాలో లైవ్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక తాజాగా ఓ వీడియో షేర్ చేసిన మాళవిక.. తన బాయ్ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. ఇందులో మాళశిక మేల్ షర్ట్, షేవింగ్ కిట్ను వాలైంటైన్ డే గిఫ్ట్కు సిద్ధం చేస్తూ కనిపించింది. చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్ స్టేషన్కు పిటిషనర్.. అదేంటని అడగ్గా ఓ కంపెనీ వాలంటైన్స్ డే సందర్భంగా తనకు ఈ బహుమతులు పంపించినట్టు చెప్పింది. అయితే ఇది మేల్ షేవింగ్ కిట్ కదా.. బాయ్ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఆమె అవును ఉన్నాడు అని సమాధానం ఇచ్చింది. అతనేవరో చెప్పాలని పట్టుబట్టడంతో.. ‘బాయ్ ఫ్రెండ్ ఎవరో ఖచ్చితంగా చెప్తాను. ప్రామిస్. కానీ ఈ వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వస్తనే’ అంటూ కండిషన్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి మళవిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియాలంటే ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) చదవండి: ఆర్జీవీ ట్వీట్, పెద్దవాళ్లపై వర్మ షాకింగ్ కామెంట్స్ -
అవును.. అలాంటి వాళ్లతో డేటింగ్ చేశా.. తాప్సి షాకింగ్ కామెంట్స్
‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్కి పరిచయం అయిన తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఇక్కడ పలు సినిమాల్లో నటించి, మెప్పించి బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. అలాగే డిజిటల్ రంగలో కూడా రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే తాప్సీ.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్స్పై షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా.. `అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను` అని చిరునవ్వులు చిందిస్తూ సమాధానం ఇచ్చింది. అలాగే తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. ‘నేను మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న. .అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు’అని చెప్పుకొచ్చింది తాప్సీ. గతంలో తన తొలి చిత్ర దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసిన తాప్సీ.. తాజాగా తన స్నేహితులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అతడెవరని అడిగిన నెటిజన్కి సుప్రిత స్ట్రాంగ్ కౌంటర్
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. పొట్టి దుస్తుల్లో ఉన్న తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్ అయి, చివరకు ట్రోల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్గా ఉంటుంది సుప్రిత. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన బాయ్ఫ్రెండ్ గురించి అడిగిన ఓ నెటిజన్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది. View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగ్లో అమ్మాయిలు, అబ్బాయిలుంటారు. ఇక ఈ విషయంపై ఓ నెటిజన్ నందు నీకేం అవుతాడు. బాయ్ ఫ్రెండా.. ? బాయ్ లో బెస్టీనా? అని అడిగారు. దానికి సుప్రీత స్పందిస్తూ.. ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు.కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’అని చెప్పుకొచ్చింది. -
ఆమెను తాకొద్దు.. ఐరా బాయ్ఫ్రెండ్కు ఫ్యాన్ వార్నింగ్.. తర్వాత ?
Ira Khan Boyfriend Nupur Shikhare Gets Message From Her Fan: బాలీవుడ్ సూపర్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన బాయ్ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ తమపై ఒకరిపై ఒకరికున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించడంలో అస్సలు మొహమాటపడరు. గతేడాది వాలెంటైన్స్ వీక్లో భాగంగా తాను నుపుర్ శిఖరేతో రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా తెలిపింది ఐరా. ప్రామిస్ డే సందర్భంగా నుపుర్తో కలిసి దిగిన ఫొటోలను 'నీతో ప్రామిస్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను; అంటూ షేర్ చేసింది. తర్వాత వీరు దీపావళి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నుపుర్ శిఖరే ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నాడు. అందులో అతనికి ఐరా అభిమాని పంపిన మెస్సెజ్ చూపించాడు. 'ఐరా నా ప్రేమ (నా ప్రేయసీ, ఐరా నాది), తనని తాకొద్దు' అంటూ ఐరా ఫ్యాన్ ఒకరు నుపుర్ శిఖరేకు సందేశం పంపాడు. ఇది చూసిన నుపుర్ కొద్దిసేపు ఆలోచించి పక్కనే పని చేసుకుంటున్న ఐరాను చేతివేలితో తాకుతాడు. అది అంతగా పట్టించుకోదు ఐరా. తర్వాత నుపుర్ వచ్చి ఐరాకు ముద్దు పెడతాడు. ఆ ముద్దుతో ఐరా నవ్వుతుంది. దీంతో ఆ వీడియో పూర్తి అవుతుంది. ఐరాను తాకద్దు అని వార్నింగ్ ఇచ్చిన ఆమె ఫ్యాన్కు ఐరాకు ముద్దు పెట్టి బదులిచ్చాడు నుపుర్ శిఖర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఎపిక్ రిప్లై అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) ఇదీ చదవండి: తండ్రిని పట్టుకుని బంధువా అన్నాడు.. ఐరా ఖాన్ స్ట్రాంగ్ రిప్లై -
ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా!
వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ సంతానం లేరు. తమకు జీవితాంతం తోడుగా ఉంటుందని పదిరోజుల పసిగుడ్డును దత్తత తెచ్చుకున్నారు. పెంచి పెద్దచేశారు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇంటర్ వరకు చదివించారు. ఎదిగిన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ.. ప్రేమికుడి చేతిలో హతమవడంతో తమకు దిక్కెవరని ఇద్దరు తల్లులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సాక్షి, కరీంనగర్: పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి పోశవ్వ, బోయిని రాజవ్వ అక్కాచెల్లెళ్లు. పది రోజుల వయసప్పుడే వరలక్ష్మి(19)ని దత్తత తీసుకొని ఇంటర్ వరకు చదివించారు. ఈనేపథ్యంలో అదే మండలం పొరండ్లకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ అఖిల్, వరలక్ష్మి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అభ్యంతరం తెలిపినా వీరి తీరు మారలేదు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన కూతురు కోసం 5వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మానకొండూర్ మండలం చెంజర్ల దేవునిగుట్ట వద్ద వరలక్ష్మిని అఖిల్ హత్య చేశాడని తెలియడంతో తల్లులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం కుళ్లి, ఎడమ చేయి, తల భాగాలను జంతువులు పీక్కుతినడం చూసి గుండెలు బాదుకున్నారు. అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్వో) శ్రీనివాస్, తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎస్సై ప్రమోద్రెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అఖిల్ తల్లీ నిందితురాలే..! ►ఈ నెల2న హత్య జరిగిన అనంతరం అఖిల్ నేరుగా వైన్షాపునకు వెళ్లాడు. ►వరలక్ష్మిని చంపిన తరువాత అతడిలో భయం మొదలైంది. ►ఆ భయాన్ని మర్చిపోవాలని వైన్షాపు వద్ద ఫుల్ బాటిల్ కొని ఒక్కడే తాగాడు. అయినా, అతడిలో భయం పోలేదు. ►వెంటనే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అఖిల్పై చేయిచేసుకున్నారు. ►ఆపై అఖిల్ కూడా వింతవింతగా ప్రవర్తించసాగాడు. ►బయటికి వచ్చి కంటికి కనిపించిన ప్లెక్సీలు చించడం, తోరణాలు తెంపేయడం, చేతికి దొరికిన వస్తువులు విసిరికొట్టడం చేశాడు. ►కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినలేదు. దీంతో కొందరు ఇరుగుపొరుగువారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ►వెంటనే తిమ్మాపూర్కు చెందిన ఇద్దరు బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ►ఇంతలో కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి పంపారే తప్ప.. హత్య విషయం వారికి చెప్పలేదు. ►ఈ విషయంలో నిజాన్ని దాచినందుకు పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కి తరలించారు. పోలీసుల ముందే నిలదీసి ఉంటే..? ఈ గొడవ జరుగుతుండగానే.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి అమ్మమ్మ అఖిల్ ఇంటికి చేరుకుంది. ఆమె అక్కడ పోలీసులను చూసింది. కానీ, నేరుగా అఖిల్ తల్లి వద్దకు వెళ్లి వరలక్ష్మి ఏది? అని నిలదీసింది. ‘తన కొడుకు అసలు ఉదయం నుంచి గడప దాటలేదు నీ మనవరాలు ఎక్కడుందో వెదుక్కో పో’ అని అఖిల్ తల్లి ఆమెను కసిరింది. ఆ మాటలు నమ్మిన వరలక్ష్మి అమ్మమ్మ తిరిగి ఇంటిముఖం పట్టింది. అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పి ఉంటే.. హత్య విషయం అదే రోజు వెలుగుచూసి ఉండేది. రెండ్రోజుల తర్వాత మృతదేహం వద్దకు.. రెండురోజులు గడిచినా అఖిల్లో భయం పోలేదు. వరలక్ష్మి బతికే ఉందా? చనిపోయిందా? అన్న విషయం నిర్ధారించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మరోసారి చెంజర్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే అక్కడే వరలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో ఊరి వదిలి పారిపోతే అనుమానం వస్తుందని, ఫోన్కాల్స్ పోలీసులు తీస్తే తాను దొరికిపోతానని అక్కడే తన సెల్ఫోన్ పగులగొట్టాడు. తర్వాత తల్లి సెల్ఫోన్ వాడుతున్నాడు. పోలీసులను కూడా పక్కదారి పటిద్దామనుకున్నా.. వరలక్ష్మికి అఖిల్ చేసిన సీడీఆర్ (కాల్ రికార్డ్స్ డేటా) ముందుంచి ప్రశ్నించడంతో అఖిల్ నోరువిప్పక తప్పలేదు. -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న బాలీవుడ్ జంట
Richa Chadha and Ali Fazal planning to tie the knot in March 2022: బాలీవుడ్లో వరుసగా లవ్బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా 2022 మార్చిలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముంబైతో పాటు ఢిల్లీలోనూ పెళ్లి సంబరాలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో సైతం నటిస్తున్నాడు. మరోవైపు రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్సిరీస్లో కనిపించనుంది. -
ప్రియుడితో సుస్మితా సేన్ బ్రేకప్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియుడు!
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బాయ్ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్తో బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూ, లివింగ్ రిలేషన్షిప్ను కొనసాగిస్తున్న సుస్మిత తాజాగా ఆ బంధానికి ముగింపు పలికినట్లు ఆంగ్ర పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరూ తమ రిలేషన్ను బ్రేక్ చేసుకోవడంతో రోహ్మాన్ సుస్మితా ఇంటి నుంచి కూడా వెళ్లిపోయాడని సమాచారం. ప్రస్తుతం అతడు సన్నిహితుల ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సుస్మిత-రోహ్మాన్ల మధ్య ఈ ఏడాది నుంచే విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ తమ బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లు తెలుస్తుంది. దీనికి తోడు సుస్మితా వరుస ఇన్స్టా పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లు కనిపిస్తున్నాయి. బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ అనంతరం తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్న సుస్మితా..బాధ నుంచి బయటపడేందుకు ఇదే సరైన వైద్యం అంటూ జిమ్లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. దీంతో రోహ్మాన్తో బ్రేకప్ నిజమేనని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్!
నాగ్ఫూర్: బాయ్ ఫ్రెండ్ను పెళ్లాడటానికి 19 యేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యానంటూ కట్టుకథ అల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు మంగళవారం నాగ్పూర్ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు యువతి సోమవారం ఉదయం 11 గంటలకు కలమ్నా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో నాగ్పూర్ పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్తో సహా, ఇతర సీనియర్ అధికారులతో కూడిన సుమారు వెయ్యి మంది భద్రతా సిబ్బందిఈ కేసును విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా సిటీలోని 250కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఇదంతా కట్టుకథని పోలీసధికారులు ధృవీకరించారు. ఐతే ఇదంతా ఎందుకు చేసిందో ఖచ్చితమైన కారణం తెలియచేయలేదని పోలీసులు తెలిపారు. కాగా ఆమె ఇచ్చిన పిర్యాదులో నాగ్పూర్ చిఖ్కలిలో నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు తెల్పింది. ఉదయం మ్యూజిక్ క్లాస్కు వెళ్తుండగా మార్గం మధ్యలో వైట్ కలర్ వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు డైరెక్షన్లడిగే నెపంతో మాట్లాడుతూ, వ్యాన్లోకి బలవంతంగా లాగి, ముఖాన్ని గుడ్డతో కప్పారని తెల్పింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసిన తర్వాత పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్, అడీషనల్ సీపీ సునీల్ ఫులారీ, ఇతర సీనియర్ అధికారులు సీతాబుల్దీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కమీషనర్ కుమార్ దాదాపుగా వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్లను ఏర్పాటుచేసి, సిటీలోని వ్యాన్లను, సీసీటీవీలను పరిశీలిండానికి, యువతి స్నేహితులను ప్రశ్నించడానికి హుటాహుటీన పంపారు. యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం మేయో హాస్పిటల్కు తరలించారు. ఈ ఉదంతంపై పోలీసధికారులు ప్రశ్నించగా తన బాయ్ఫ్రెండ్ను వివాహమడటానికి చేశానని చెప్పినట్లు తెల్పింది. ఆరు గంటలపాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, దాదాపు 50 మందిని విచారించిన తర్వాత అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్ను వివాహం చేసుకోవడానికే ఈ నాటకమంతాడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
షణ్నూతో హగ్గులు: సిరి తల్లి రియాక్షన్పై ఆమె బాయ్ఫ్రెండ్ ఏమన్నాడంటే..
Siri Boy Friend Comments On Siri Shannu Relationship: బిగ్బాస్ షోలో సిరి- షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో బాగానే ఉన్నా, ఈ మధ్య చీటికిమాటికి హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో షణ్న-సిరిలపై సోషల్ మీడియాలోనూ కాస్త నెగిటివిటి పెరుగుతుంది. వీరిద్దరూ సింగిల్గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్బాస్కు రాకముందే సిరి శ్రీహాన్తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా సిరి వల్లే షణ్నూ గేమ్ దెబ్బతింటుంది అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్యామిలీ ఎపిసోడ్లోనూ షణ్నూని హగ్ చేసుకోవడం నచ్చడం లేదని సిరి తల్లి ఆమెకు అందరిముందే వార్నింగ్ ఇచ్చింది. ఎవరి గేమ్ వాళ్లు ఆడితే మంచిదంటూ ఇద్దరికీ హితబోద చేసింది. అయితే హౌస్లో అందరిముందే సిరి వాళ్ల మథర్ అలా అనడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సదరు తల్లిగా కూతురికి తప్పొప్పులు గురించి చెప్పిందంటూ కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, షోలో అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సిరి బాయ్ఫ్రెండ్, కాబోయే భర్త శ్రీహాన్ స్పందించాడు. 'సిరి మథర్కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్ను నేను గౌరవిస్తాను' అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
బాయ్ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే
భోపాల్: పోలీసు ఉద్యోగం అంటేనే ప్రతి రోజు నేరాలు, నేరగాళ్లతో సావాసం చేయక తప్పదు. రోజు పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేవరకు నేరాలు, నేరస్తుల గురించే ఆలోచిస్తుంటారు. ఇక పోలీసులు దగ్గరకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని వింత ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. వాటిని చూసి పోలీసులు కూడా సరదాగా నవ్వుకుంటారు. ఈ కోవకు చెందిన ఫిర్యాదు ఒకటి మధ్యప్రదేశ్ పోలీసుల చెంతకు వచ్చింది. బాయ్ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు.. సాయం చేయండి సార్ అని కోరింది ఓ మహిళ. ఆవివరాలు.. మధ్యప్రదేశ్ చింద్వారాకు చెందిన ఓ మహిళకు సారానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి... అది కాస్త ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం వరకు వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగింది. ఈ క్రమంలో ఓరోజు లవర్స్ ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకు బాయ్ఫ్రెండ్ పుట్టినరోజు వచ్చింది. అంతకుముందే గొడవపడి ఉండటం మూలానా సదరు మహిళ బాయ్ఫ్రెండ్కి బర్త్డే విషేస్ చెప్పలేదు. (చదవండి: వింత ఘటన: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత) ఆ తర్వాత గొడవ ఇలానే కొనసాగింది. ఇక సదరు వ్యక్తి ప్రియురాలితో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. సదరు మహిళ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. అతడు ఆమెతో మాట్లాడలేదు. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజులుగా బాయ్ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని.. కావాలనే తనను దూరం పెడుతున్నానడి ఆరోపించింది. (చదవండి: అసలేం జరిగింది? సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య) ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని స్టేషన్కు పిలిపించి.. కొన్ని గంటల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇంట్లో వారికి వీరి విషయం చెప్పి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. పోలీసులు సూచన మేరకు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు సదరు లవర్స్. ఇరువైపులా పెద్దలు వారికి పెళ్లికి అంగీకరించడమే కాక.. ఆర్యసమాజ్లో వివాహం చేశారు. అలా వారి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది. చదవండి: గర్ల్ఫ్రెండ్కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు
Ira Khan Celebrates Diwali With Boyfriend Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా నుపూర్ షిఖరేతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా తొలిసారి తన ప్రియుడిని పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది దీపావళి పండుగను సైతం ప్రియుడు నుపూర్తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖరే కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. ఇక నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నారు. సుస్మితా సేన్కు గత పదేళ్లుగా ట్రైనర్గా ఉన్నారు. ఆమిర్ ఖాన్కు నుపూర్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నాడు. అనంతరం ఐరాకు కూడా ఆయన కోచ్గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) -
బాయ్ఫ్రెండ్తో వెళ్లి.. నరహత్యకు గురైంది
వాషింగ్టన్: గత కొన్ని రోజులుగా టిక్టాక్లో ట్రెండిగ్గా మారిన గబ్బి పెటిటో అదృశ్యం కేసును అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు చేధించారు. బాయ్ఫ్రెండ్ చేతిలో ఆమె నరహత్యకు గురైనట్లు వెల్లడించారు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ల యువతి గబ్బి పెటిటో తన బాయ్ఫ్రెండ్తో కలిసి రోడ్ ట్రిప్కు వెళ్లి.. కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐ అధికారులు వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు గబ్బి పెటిటోవి గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన గబ్బి పెటిటో ఈ ఏడాది ఆగస్టులో తన బాయ్ఫ్రెండ్తో కలిసి వ్యోమింగ్లోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్కు వెళ్లింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 గబ్బి పెటిటో బాయ్ఫ్రెండ్ బ్రియాన్ లాండ్రి మాత్రం ఒంటరిగా ఫ్లోరిడాలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియ లేదు. (చదవండి: గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?) గబ్బి గురించి ఆమె బాయ్ఫ్రెండ్ లాండ్రీని ఎంతలా ప్రశ్నించినా.. అతడు సమాధానం చెప్పలేదు. లాండ్రీ సెప్టెంబర్ 1న ఇంటికి తిరిగి రాగా, ఆ తర్వాత పది రోజులకు పెటిటో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పెటిటో అదృశ్యంపై లాండ్రీ మాట్లాడటానికి నిరాకరించాడు. ఈ క్రమంలో పోలీసులు గబ్బి పెటిటో ఆచూకీ గురించి ఎవరికైనా.. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని లాండ్రీ తోపాటూ, ప్రజలను కూడా విజ్ఞప్తి చేశారు. (చదవండి: పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం) ఈ క్రమంలో వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు పెటిటోకు సరిపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న లాండ్రీ గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గబ్బి పెటిటో హత్యకు గల కారణాలు తెలియాలంటే లాండ్రీ పట్టుబడాలి. గబ్బి పెటిటో అదృశ్యం అయిన నాటి నుంచి ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. టిక్టాక్లో గబ్బి పెటిటో అనే హ్యాష్ట్యాగ్తో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటివరకు దీనికి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
గర్ల్ఫ్రెండ్కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు
వాషింగ్టన్: స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏం బంధమైన సరే కలకాలం నిలవాలంటే.. నమ్మకం అనే బలమైన పునాది అవసరం. అనుమానం ఉంటే ఆ బంధం త్వరగా ముగిసిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రేమలో అనుమానం ఉంటే.. అది మధ్యలోనే తెగిపోతుంది. ఏ రిలేషన్ అయినా సరే ఎదుటివారికి తగిన స్పేస్ ఇవ్వడం వల్ల ఆ బంధం మరింత బలపడుతుంది. లేదంటే అర్థాంతరంగా ముగుస్తుంది. ఇదే అనుభవం ఎదురయ్యింది అమెరికా యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని కరోలిన్కి. ఆమె బాయ్ఫ్రెండ్ తమ రిలేషన్ కొనసాగాలంటే.. కరోలిన్ 11 నియమాలను తప్పకుండా పాటించాలని తెలిపాడట. (చదవండి: ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్ఫ్రెండ్) తన బాయ్ఫ్రెండ్ ఇచ్చిన నియమాల నోట్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోలిన్ బాయ్ఫ్రెండ్ 'కంట్రోలింగ్' స్వభావం గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. కరోలిన్ బాయ్ఫ్రెండ్ విధించిన నిబంధనల ప్రకారం ఆమె బయట తినడం, తాగడం, బిగుతు దుస్తులు ధరించడం నిషేధం. వీటితో పాటు ఆమె ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. (చదవండి: ఒక్కడి కోసం ఇద్దరు యువతుల ఫైట్.. జుట్టు పట్టుకొని!) ఇవేకాక కరోలిన్ బాయ్ఫ్రెండ్ ఆమెను అబ్బాయిలతో కలవకుండా నిషేధించాడు. అతను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తీసివేయకూడదని తెలిపాడు. అంతేకాక కరోలిన్ రాత్రి 9 గంటలకు తన హాస్టల్ గదికి తిరిగి రావాలని సూచించాడు. అలానే క్రాప్ టాప్, టైట్ డ్రెస్ ధరించడం.. పార్టీలకు హాజరు కావడానికి కూడా ఆమెకు అనుమతి లేదు. కరోలిన్ బాయ్ఫ్రెండ్ చేసిన నియమాలను రోజూ ఆమె పాటించాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్షాట్ షేర్ చేసిన కరోలిన్.. అతడితో బంధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఆమె నిర్ణయంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు.. -
ప్రియుని ఇంట్లో కన్న కొడుకు హత్య.. ఆరు నెలలు గడిచిన తర్వాత..
శివాజీనగర: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కొడుకు.. ప్రియుని చేతిలో హత్యకు గురికాగా, ఆరు నెలల తరువాత తల్లి ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నిందితులు నిజం కక్కారు. నగరంలోని మైకో లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... ఓ యువతికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె తన ప్రియుని ఇంట్లో ఆ కుమారున్ని ఉంచింది. ఫిబ్రవరి 7న సదరు వ్యక్తి తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని బాలున్ని కొట్టిచంపాడు. ఆ వెంటనే తన రెండో ప్రియురాలితో బాలుని తల్లికి ఫోన్ చేయించి పిలిపించారు. హత్య విషయం ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. అనంతరం ప్రియుడు, తన రెండవ ప్రియురాలితో కలిసి ఓ కారులో తమిళనాడులోని బర్గూరు వద్ద ఓ నిర్జన ప్రదేశంలో పడేసి వచ్చారు. బాలుడు కనిపించపోవడంతో బంధువులు ఒత్తిడి చేయడంతో సదరు మహిళ తన కుమారుడు కనిపించలేదని ఆగస్టు 25న మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు వీరిపై నిఘా పెట్టి విచారణ చేయగా అసలు విషయం వెల్లడించారు. దీంతో పోలీసులు బాలుని తల్లితో పాటు ప్రియుడు, ఇతనికి సహకరించిన మరో ప్రియురాలిని అరెస్ట్ చేశారు. -
బాయ్ఫ్రెండ్ పేరును మెడపై టాటూ వేసుకున్న నటి
నటి, గాయని శిబానీ దండేకర్ కొత్త టాటూ వేయించుకున్నారు. బాయ్ఫ్రెండ్ ఫర్హాన్ అక్తర్ పేరును ఆమె మెడమీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ విషయాన్ని శిబానీనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెడపైన ఉన్న ఫర్హాన్ అక్తర్ అని ఉన్న టాటూ చిత్రాన్ని పంచుకున్నారు. ముందుగా దీనిని టూటూ ఆర్టిస్ట్ కే షేర్ చేయగా అనంతరం శిబానీ రీపోస్టు చేశారు. ఈ ఫోటోలో ఆమె ముఖం పూర్తిగా కనిపించపోయిన మెడపై పచ్చబొట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిబానీ, పర్హాన్ గత మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్.. అయితే తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ దాచేందుకు ప్రయత్నించలేదు ఈ జంట. కొన్నేళ్ల క్రితమే తామ బంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి శిబానీ దండేకర్, ఫర్హాన్ అక్తర్ తరచూ ఇన్స్టాగ్రామ్లో తమకు చెందిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. కాగా గత ఫిబ్రవరిలో షీబానీ, ఫర్హాన్ ప్రేమ ప్రయాణానికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫర్హాన్.. శిబానీని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇటీవల వీరి పెళ్లి ప్రస్తావన రాగా.. వివాహం గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని, ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడుకోలేదని నటి పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చెబుతామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ ఇంతకముందే హెయిర్స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక సినిమా విషయానికొస్తే రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఫర్హాన్ నటించిన తుఫాన్ చిత్రం జూలై 16న ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో విడుదల అయింది. చదవండి: టాలీవుడ్లోకి మరో వారసురాలు.. హీరోయిన్గా మేధ శ్రీకాంత్! View this post on Instagram A post shared by Farhan Akhtar (@faroutakhtar) -
ఒక్కడి కోసం ఇద్దరు యువతుల ఫైట్.. జుట్టు పట్టుకొని!
ప్రేమ.. రెండక్షరాల ఈ పదం ఎంతో మంది జీవితాలను ముడిపెడుతుంది. అదే సమయంలో ఎంతోమంది జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రేమించిన వారు దక్కితే ఆనందం.. మనల్ని కాదని వెళ్లిపోతే కొండంత దుఃఖం.. వీరిలో కొంతమంది మాత్రమే మనసిచ్చిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించి పోరాడుతారు. అలకలు, గొడవలు, దెబ్బలు ఇలా ఎన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అది ప్రేమకున్న గొప్పతనం. ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడిదంతా ఎందుకుంటే ప్రేమకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది. ఇష్టపడిన ఒకరి కోసం ఓ ఇద్దరు బీభత్సం సృష్టించారు. సాధారణంగా అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలు పడడం ఇప్పటి వరకు చూసే ఉన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఒక యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డెక్కారు. నడిరోడ్డు మీద జుట్టూ.. జుట్టూ పట్టుకొని కొట్టుకున్నారు. సిగపట్లుతో కుస్తీ పట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని సరాయకేలాలో చోటుచేసుకోగా కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో తిరగడాన్ని అమ్మాయి సహించలేకపోయింది. వారు ఎదురుగా కనిపించడంతో కోపం ఎక్కువై.. తోక తొక్కిన తాచుపాములా విరుచుకుపడింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతి జుట్టు పట్టుకొని, పిడిగుద్దులతో దాడి చేసింది. అయితే నాలుగు దెబ్బలు పడగానే అవతలి అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గలేదు. యువతిపై ఎదురు దాడికి దిగింది. ఇద్దరు అమ్మాయిలు కిందపడి పొర్లుతూ కొట్టుకున్నారు. ఇది చూసిన వారికి ఓ సినిమా చూసిన పనైంది. చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో యువతులతో పాటు యువకుడు సైతం అక్కడ్నుంచి జంప్ అయ్యారు. -
ఊహించని సంఘటన అది: సుస్మిత బాయ్ ఫ్రెండ్
సాక్షి, ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రియుడు కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షా షూటింగ్లో అనుకోకుండా ఒక చిన్నప్రమాదంలో ఇరుక్కు న్నాడట. దీనికి సంబంధించిన వీడియోను రోహ్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్టార్హీరో అమీర్ ఖాన్ 1997 నాటి ఇష్క్ మూవీ షూటింగ్ దృశ్యాలను తాజాగా ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఫన్నీ వీడియోను ఫ్యాన్స్కు షేర్ చేశాడు. ఇష్క్ మూవీ షూటింగ్లో కృష్ణుడి వేషంలో కొలనులో గోపికలతో ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఊహించని పరిణామం ఎదురైంది. పువ్వులతో అలంకరించిన ఒక ఊయలలో రోహ్మాన్ షూట్ కొనసాగుతుండగా, ఒకవైపు తాడు తెగిపోయింది. దీంతో అతను పడిపోబోయాడు. కానీ వెంటనే బ్యాలెన్స్ చేసుకొని పడిపోకుండా నొలదొక్కుకున్నాడు. ఈ పరిణామంతో అక్కడున్న సిబ్బంది కాసేపు ఖంగారుపడ్డారని తెలిపాడు. అంతేకాదు త్రిపాఠి నమ్రతా ఆందోళనగా పరిగెత్తుకు రావడాన్నిప్రస్తావించాడు రోహ్మాన్ షా . View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
బాయ్ఫ్రెండ్ను హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు
పాయల్ రాజ్పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు .. గాయకుడు అయిన సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. తాజాగా తనకున్న పరిచయాలతో సౌరభ్ను తెలుగులో హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓ సినిమాలో ప్రియుడు సౌరభ్ను హీరోగా సెట్ చేసిందని ఫిల్మ్నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇక పాయల్ ప్రస్తుతం సాయికుమార్ సరసన ‘కిరాతక’అనే మూవీలో నటిస్తుంది. జన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. -
నమ్మించి మోసం చేశాడు; పెళ్లి పెటాకులు చేసుకున్నా
''నేను ఎంతో ప్రేమించిన నా బాయ్ఫ్రెండ్ ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదు. నా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ లిస్ట్ను గమనిస్తే కానీ నాకు ఆ విషయం తెలియలేదు. నా ఇన్స్టాలో ఉన్న ఒక అమ్మాయిని నాకు తెలియకుండానే బ్లాక్ చేశాడు. ఆ అమ్మాయితో లవ్ ఎఫైర్ నడిపాడు. తను నా ఫ్రెండ్ అని తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇలా చేశాడు. ఒకసారి మోసం చేస్తే ప్రేమించాడని వదిలేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. కానీ రెండోసారి అదే తప్పుచేశాడు. అందుకే వాడితో పెళ్లి పెటాకులు చేసుకున్నా'' అంటూ న్యూయార్క్కు చెందిన గాబీ మార్సెల్లస్(25) చెప్పుకొచ్చింది. గాబీ మర్సెల్లస్ టిక్టాక్ వీడియోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. యూకేకు చెందిన ఒక యువకునితో ప్రేమాయణం కొనసాగించింది. 2019 సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గాబీ బాయ్ఫ్రెండ్ అమెరికాకు వచ్చాడు. ఆరోజు రాత్రి తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేసిన వారిద్దరికి ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత గాబీ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోగా.. ఆమె బాయ్ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు నిద్రలేచిన గాబీ తన ఫోన్ చూసుకోగా.. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం గమనించింది. తాను ఈ పని చేయలేదు.. మరి ఎవరు చేసుంటారు అని ఆలోచించింది. ఇది కచ్చితంగా ఆమె బాయ్ఫ్రెండ్ పనేనని, తనకు తెలియకుండా ఈ అమ్మాయితో ఎఫైర్ నడిపిస్తున్నాడా అనే అనుమానం కలిగి వెంటనే బాయ్ఫ్రెండ్ను అడగ్గా.. ఆరోజు తాగిన మత్తులో తెలియక బ్లాక్ చేసి ఉంటానని కవర్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లండన్కు వచ్చిన గాబీ తన బాయ్ఫ్రెండ్ వేరే అమ్మాయితో సీక్రెట్ ట్రిప్కు వెళుతున్నట్లు తెలుసుకుంది. ఇదే విషయమై అతన్ని నిలదీయగా.. అలాంటిదేం లేదని.. ఆమెను తన ఇంటిదగ్గర దిగబెట్టడానికి వెళుతున్నానని చెప్పాడు. కానీ గాబీ అతని మాటలు నమ్మకుండా నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని నిలదీసింది. దానికి ఆమె బాయ్ఫ్రెండ్ ఒప్పుకోవడంతో అదేరోజు ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వారి జీవితం సాఫీగానే సాగింది. ఉద్యోగం పేరుతో గాబీ బాయ్ఫ్రెండ్ లండన్కు వచ్చాడు. ఆ తర్వాత అక్టోబర్ 2020లో గాబీ కూడా లండన్ షిఫ్ట్ అయింది. అప్పుడే గాబీకి షాకింగ్ విషయం తెలిసింది. తన బాయ్ఫ్రెండ్ ఇంకా ఆ అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటేన్ చేస్తున్నాడని, ఇంతకాలం తనను మోసం చేశాడని గ్రహించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆమె బాయ్ఫ్రెండ్తో గొడవపడింది. ఆ తర్వాత ఇద్దరికి జరిగిన ఎంగేజ్మెంట్ చెల్లదని... అతను పెట్టిన రింగ్ను మొహం మీద కొట్టేసి గాబీ అక్కడినుంచి వచ్చేసి ప్రస్తుతం న్యూయార్క్లో తన లైఫ్ చూసుకుంటుంది. -
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడి పక్కా స్కెచ్!
సాక్షి, ఖమ్మం: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు భాస్కర్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వివరాలు.. భాస్కర్, జనార్దన్ స్నేహితులు. గత రెండేళ్లుగా భాస్కర్ భార్యతో జనార్దన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి జనార్దన్ను పలుమార్లు నిలదీశారు. కొన్ని రోజులు దూరంగా ఉండి మరలా రాధమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో భార్య రాధమ్మ, ప్రియుడు జనార్దన్ కలిసి ఉండగా చూసిన భాస్కర్.. గంట తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి రాధమ్మే హత్య చేయించిదని మృతుని బంధువులు ఆరోపించారు. భాస్కర్ మృతికి కారకుడైన ప్రియుడు జనార్దన్ ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. -
రూ. 175 కోట్ల బంగ్లాలో హీరోయిన్ సహజీవనం
బాలీవుడ్ నటి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో ఉన్నారని టాక్. అంతేకాదు.. తన బాయ్ఫ్రెండ్తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనున్నారట. బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ను కూడా ఖరారు చేశారట. కాగా జాక్వెలిన్ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్ఫుల్ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్తో ఆమె డేటింగ్ చేశారని, 2013లో బ్రేకప్ అయ్యారని టాక్. అయితే ఆ బ్రేకప్కి ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్ బాయ్’కి జాక్వెలిన్ డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
వ్యాపారవేత్తతో స్టార్ హీరోయిన్ సహజీవనం!
Jacqueline Fernandez: వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది సాహో బ్యూటీ ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’. ‘సాహో’లో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ శ్రీలంకన్ లేడీ.. రీసెంట్గా మరో టాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ శ్రీలంక భామ ఓ ఇండియన్తో ప్రేమలో పడిందట. సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె రిలేషనల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి. ఈ భామ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొనిదంట. అందులోనే బాయ్ఫ్రెండ్తో కలిసి ఉంటుందని సమాచారం. బాలీవుడ్ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం కామన్. ఇప్పుడు ఆ లిస్ట్లో జాక్వెలిన్ కూడా చేరింది. మరి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. చదవండి: భార్యకు నటుడి సర్ప్రైజ్; థాంక్యూ అంటూ భావోద్వేగం డేటింగ్ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?! -
‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’
‘ప్లేట్లు కడిగాను. సర్వర్గా పనిచేశాను. అదే హోటల్లో ప్రధాన చెఫ్గా చేరాను. పైసాపైసా కూడబెట్టి ఉన్నతంగా చదివించాను. కళ్లెదుటే ఎదుగుతున్న కూతురుని చూసి సంబరపడ్డాను. కుటుంబానికి తోడుగా.. జీవితంలో స్థిరపడే విధంగా దేవుడు దీవించాడని ఆనందించాను. వెంటబడుతున్న వాడి నుంచి కాపాడాలని పోలీస్స్టేషన్ మెట్లెక్కాను. కానీ ఆ భగవంతుడు కూడా కనికరించలేదు. నా గారాల పట్టి ప్రాణాలను ఆ రాక్షసుడు అతి కిరాతకంగా తీసుకెళ్లిపోయాడు. మేము ఎలా బతికేది తల్లీ’ అంటూ చిత్తూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన సుస్మిత తండ్రి వరదయ్య రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. చిత్తూరు అర్బన్: నగరంలోని రిడ్స్పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత, సునీల్ సంతానం. పెద్దగా చదువుకోని వరదయ్య పెళ్లయ్యి భార్య, పిల్లల్ని పోషించడానికి 25 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. తొలినాళ్లలో పనులు దొరక్క ఓ హోటల్లో చేరి పిల్లలు ఇద్దరినీ ఇంగ్లిషు మీడియంలో చదివించాడు. సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాడు. భార్య లత అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కుమార్తె సుస్మితకు వేలూరు సీఎంసీ వైద్య కళాశాలలో సీటు రావడం.. కోర్సు పూర్తయ్యాక మూడు నెలల క్రితం ఆమెకు గుడిపాల సమీపంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం రావడం అదృష్టమనుకున్నాడు. నెలకు రూ.17 వేలు జీతం. నైట్డ్యూటీలతో కలిపి మూడు రోజుల క్రితం రూ.18 వేల జీతాన్ని చేతిలో పెట్టడంతో ఇక తన కష్టం తీరిపోయిందని అనుకున్నాడు. ప్రేమ పేరిట చదువు, ఉద్యోగం లేని చిన్నా వేధించడంతో ఈ ఏడాది జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీలాపల్లె పోలీసులు ఐపీసీ 354–డీ సెక్షన్ కింద నాన్బెయిలబుల్ కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు. తర్వాత బెయిల్పై వచ్చిన అతను తమపై పగ పెంచుకుంటాడేమోననుకుని మళ్లీ వన్టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. భవిష్యత్లో ఎప్పుడూ సుస్మితతో వివాదం పెట్టుకోకూడదని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేయడంతో అతను మారాడని భావించాడు. తీరా సుస్మితను కిరాతకంగా కత్తితో పొడిచి హత్యచేసిన చిన్నా చివరకు తనూ తనువు చాలించాడు. కూతురి రక్తంతో ఆ ఇల్లంతా తడిసి ముద్దవడం చూసిన తండ్రి తట్టుకోలేక పోయాడు. గుండెలు బాదుకుంటూ చిట్టితల్లిని తీసుకెళ్లిపోయావా దేవుడా.. అంటూ రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి.. ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?! -
రోహ్మాన్తో, సుస్మిత బ్రేకప్!.. తొలిసారిగా స్పందించిన ప్రియుడు..
మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్, ఆమె బాయ్ ఫ్రెండ్ కశ్మీరి మోడల్ రోహ్మాన్ షాల్లు బ్రేకప్ చెప్పుకున్నారంటు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాక సుస్మిత వరుస పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఆసక్తికరంగా రోహ్మాన్ ఇన్స్టా స్టోరీలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమించాయి. ఇవి చూస్తుంటే నిజంగానే వారి మధ్య ఎదో జరిగినట్లుగా అనిపిస్తుంది. దీంతో వీరి ప్రేమాయణం, బ్రేకప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా కొన్నేళ్లుగా సుస్మిత, రోహ్మాన్ లివింగ్ రిలేషన్షిప్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం రోహ్మాన్ ఇన్స్టాలో ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ను నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేగాక సుస్మిత సేన్ గురించి కూడా అడగ్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఈ క్రమంలో సెలబ్రెటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారాని, దీని వల్ల స్వేచ్చగా రోడ్డుపైకి రాలేకపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారని ఓ అభిమాని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే నేను ఇంకా స్వయంగా సెలబ్రేటీ హోదా రాలేదు. అది వేరేవాళ్ల కృషి వల్ల వచ్చింది(సుస్మితను ఉద్దేశించు చెప్పినట్లుగా ఉంది). కానీ ఒకరోజు నేను ఆ స్థాయికి తప్పకుండా చేరుకుంటాను. ఆ రోజున మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను మై ఫ్రెండ్’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే సుస్మిత సేన్ గురించి ఏదైన చెప్పమని కోరగా.. ఆమె చాలా ఉత్తమైనది అని తెలిపాడు. అంతేగాక తనలో ఆయనను ఆకర్షించేందని అడగ్గా.. తన అవగాహన అంటు సమాధానాలు ఇచ్చాడు. కాగా రోహ్మాన్ తదుపరిగా ఆర్య వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో నటిస్తున్నాడు. మొదటి సీజన్లో సుస్మిత లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే సుస్మిత ఇవాళ తాను 45 ఏళ్ల వయసులో కూడా తన ఎంపికలో పొరపాట్లు చేశానంటు ఇన్స్టాలో ఓ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రోహ్మాన్ తన లైవ్ సెషన్ స్టోరీనీ పంచుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: సహజీవనం : బాయ్ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసిన నటి 45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్ -
బాయ్ఫ్రెండ్ ఫోటో చూసి ఇరా ఖాన్ ఏమందంటే..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె తరుచూ నుపూర్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్కు పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ సందర్భంగా ఇద్దరూ ఫాంహౌజ్లో ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ప్రియుడు నుపూర్ మజిల్స్ చూపిస్తూ ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ఇరా 'వాట్ ఏ హాటీ' అంటూ ఇరా కామెంట్ చేసింది. దీనికి నుపూర్ కూడా లవ్ సింబల్తో ఇరాకు తన ప్రేమను తెలియజేశాడు. ప్రస్తుతం ఇరా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవలె ఇన్స్టా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లోనూ మీ జీవితంలో మీకే సొంతమైన వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారా అని ఐరా ప్రశ్నించగా, అవును..నా జీవితంలో ఒకరు ఉన్నారు. ఆమె పేరు ఇరా అంటూ నుపూర్ ఆమె ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునేది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్నెస్పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్గా మారాడు. ఆ సమయంలోనే విరిద్దరూ ప్రేమలో పడ్డారు. నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్న సంగతి తెలిసిందే. సుస్మితా సేన్కు గత పదేళ్లుగా ట్రైనర్గా ఉన్నారు. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) చదవండి : పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్ లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె -
‘రోజూ నరకం చూపేవాడు.. కసితీరా పొడిచి చంపేశా’
గాంధీనగర్: నిండా పదిహేనేళ్లు కూడా లేవు.. లోకం పోకడ గురించి తెలియదు. చదువుకుంటూ.. స్నేహితులతో కలిసి.. సంతోషంగా గడపాల్సిన ఆ కుర్రాడు హంతకుడిగా మారాడు. క్షణికావేశంలో తల్లి చేసిన తప్పు ఆ కుర్రాడి జీవితాన్ని గందరగోళం చేసింది. ఆ వివరాలు.. గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన నిందితుడి తల్లి.. చాలా ఏళ్ల క్రితమే ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజులు తర్వాత ప్రియుడి నిజ స్వరూపం బయటపడింది. చీటికి మాటికి ఆమెతో గొడవపడుతూ.. చికతబాదేవాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె మైనర్ కుర్రాడిని కూడా కొట్టేవాడు. ప్రతి రోజు చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ బాధ భరించలేకపోయిన నిందితుడు.. తల్లి ప్రియుడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 17న అతడిని తీసుకుని బైక్ మీద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతడు మరణించేవరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు. ఇక దర్యాప్తులో మైనర్ బాలుడి పేరు వెలుగులోకి రావడంతో.. కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడు.. చనిపోయిన వ్యక్తి ప్రతి రోజు తనను, తల్లిని చిత్ర హింసలకు గురి చేసేవాడని.. నరకం చూపేవాడని.. అందుకే అతడిని హత్య చేశానని అంగీకరించాడు. చదవండి: ‘అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి’ -
ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్ఫ్రెండ్
సాధారణంగా లవ్లో అమ్మాయిలు మోసం చేస్తే.. అబ్బాయిలు అస్సలు కామ్గా ఉండరు. తన మాజీ ప్రియురాలి గురించి అడ్డమైన చెత్తంతా ప్రచారం చేసి.. వారి పరువు తీసి సంతోషిస్తారు కొందరు. మరి కొందరు ఏకంగా ప్రియురాలి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. అదే అమ్మాయి ప్రియుడి చేతిలో మోసపోతే.. ఎవరికి చెప్పుకోలేదు. తనలో తానే బాధపడుతుంది. ఏం చేయలేక మౌనంగా రోదిస్తుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటు. కొందరు తమను మోసం చేసిన వాడిని జైలుకు లాగుతారు. మరికొందరు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ తరహా వార్తనే. మోసం చేసిన ప్రియుడికి ఓ మహిళ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అతడిని జైలుకు పంపడంతోనే ఆగిపోలేదు. ఏకంగా అతడు చనిపోయినట్లు ప్రచారం చేసి.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. సదరు మహిళ చేసిన పనికి నెటిజనులు అభినందిస్తున్నారు. ఆ వివరాలు.. థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్ఫ్రెండ్ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్ చేయసాగాడు. అయితే తన బాయ్ఫ్రెండ్ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది. ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్, అతడి మొబైల్కు అనేక సార్లు కాల్ చేసింది.. మెసేజ్లు పంపంది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్ పేల్చింది. ‘‘మీ బాయ్ఫ్రెండ్ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ప్రియుడి కొత్త లవర్కి మెసేజ్ చేసింది. ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది. ఇక ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చదివిన నెటిజనులు థేయాను అభినందిస్తున్నారు. మోసం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకుండా తగిన బుద్ది చెప్పారు. మీరు చాలా మంది ఆడవారికి ఆదర్శం అని కామెంట్ చేస్తుండగా.. కొందరు మాత్రం మీ మాజీ ప్రియుడి కొత్త గర్ల్ ఫ్రెండ్ అతడు చనిపోయాడని నమ్ముతుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే.. భవిష్యత్తులో చచ్చిపోయాడని భావించిన ఆమె లవర్ కళ్ల ముందు ప్రత్యక్షం అయితే ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: నోముల ఆడియో దుమారం -
‘అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి’
సాక్షి, ఆదిలాబాద్: తనను పెళ్లిచేసుకోవాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయించిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. వివాహిత అనూష తెలిపిన వివరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రామానికి చెందిన జయరాజ్, అనూష కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో జయరాజ్ తల్లిదండ్రులు అతడిని రాత్రికి రాత్రే ఇంటి నుంచి వేరే చోటికి పంపించారు. ఈ సమస్యల నేపథ్యంలో అనూష తల్లి మరణించగా తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. అనూషకు మరో వ్యక్తితో వివాహం జరిపించాడు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించారు. వారి ప్రేమ విషయం భర్తకు తెలియడంతో తనను వదిలేశాడని అనూష వాపోయింది. జయరాజ్ వల్లనే తన భర్త వదిలేశాడని తనను పెళ్లి చేసుకోవాలని అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
ప్రధాని పెళ్లి డేట్ కొద్ది గంటల క్రితమే ఫిక్స్ అయింది!
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెళ్లి డేట్ కొద్ది గంటల క్రితమే ఫిక్స్ అయింది! అయితే పెళ్లికి పిలవకపోయినా నొచ్చుకోని వారి జాబితా ఖరారు అయ్యాక మాత్రమే ఆ తేదీని జసిండా వెల్లడిస్తారట!! అందుకు కరోనా ఒక కారణం కావచ్చు. అంతేకాదు, ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఎబ్బెట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాను కనుక పెళ్లి ముస్తాబులు ఏమీ ఉండవు’ అని కూడా ఆమె ప్రకటించారు. జసిండాకు రెండేళ్ల కూతురు ఉంది. ప్రధానిగా ఉండగా తల్లి అయిన రెండో మహిళ బెనజీర్ భుట్టో తర్వాత జసిండానే! ఇప్పుడామె తన బాయ్ ఫ్రెండ్, బిడ్డ తండ్రి అయిన వ్యక్తినే వివాహమాడబోతున్నారు. వచ్చే జూన్ 21 న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కూతురు నీవ్ తియారహ మూడో పుట్టిన రోజు. మూడు నిండి నాలుగు వస్తుంది. ఈ తల్లికూతుళ్లతో కలిసి వెల్లింగ్టన్లోని అధికార నివాసం ‘ప్రీమియర్ హౌస్’లో క్లార్క్ గేఫోర్డ్ అనే వ్యక్తి కూడా ఉంటారు. జసిండా కూతురు నీవ్కి అతడే తండ్రి. అయితే జసిండాకు అతడు భర్త కాడు. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే ఆ చిన్న కుటుంబంలో అతడి స్థానం ప్రస్తుతానికైతే.. ‘డొమెస్టిక్ పార్ట్నర్’. జసిండా, క్లార్క్ ఇంతవరకు పెళ్లి చేసుకోక పోవడం వల్ల ‘ఇంటి సభ్యుడు’గా మాత్రమే అతడు ఆమె జీవితంలో ఉన్నారు. తాజా ‘బ్రేకింగ్ న్యూస్’ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే వచ్చే సమ్మర్లో జసిండా, క్లార్ పెళ్లి చేసుకోబోతున్నారు! మన సమ్మర్ కాదు. వాళ్ల సమ్మర్. న్యూజీలాండ్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ మూడు నెలల్లో ఏదో ఒక రోజు క్లార్క్.. ‘ఇంటి సభ్యుడు’ అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. అయితే పెళ్లికి పిలకవక పోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని ‘కోస్ట్ రేడియో’ ప్రతినిధితో జసిండా అన్నట్లు ‘న్యూజీలాండ్ హెరాల్డ్’ పత్రిక మంగళవారం నాడు వార్త మోసుకొచ్చి ఇంటింటికీ పెళ్లి పత్రికలా పంచి వెళ్లింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి ఇది! 2019 ఈస్టర్ సెలవుల్లోనే జసిండా, క్లార్క్ల నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా వాయిదా పడుతూ వస్తోంది! 2017 అంతా జసిండా బిజీ. ఆ ఏడాదే, జసిండా తన ముప్పై ఆరేళ్ల వయసులో న్యూజీలాండ్ ప్రధాని అయ్యారు. ఆ దేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయిన తొలి మహిళ జసిండా. తర్వాత 2018 అంతా బిజీ. తల్లి కావడం, ప్రధాని బాధ్యతలతో పాటు తల్లి బాధ్యతల్నీ నెరవేర్చడం! బిడ్డ పుట్టాక నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వరకు రావడానికి మళ్లీ ఒక ఆటంకం! కరోనా కట్టడిలో జసిండా బిజీ అయిపోయారు. దేశంలోని యాభై లక్షల మంది జనాభాను కరోనా నుంచి కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశారు. ప్రజలకు ఆమె ఒకటే మాట చెప్పారు. ‘‘యాక్ట్ లైక్ యు హ్యావ్ కరోనా వైరస్’’. మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని! బాధ్యతను నెత్తి మీద పెట్టకుండా బాధ్యులను చేయడం అది. కరోనా కంట్రోల్ అయింది! అదయ్యాక మళ్లీ ఎన్నికలు. న్యూజిలాండ్లో మూడేళ్లకొకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. 2020 ఎన్నికల్లో జసిండా మళ్లీ ప్రధాని అయ్యారు. ఈ మధ్యలో ఎక్కడా పెళ్లికి గ్యాప్ దొరకలేదు. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి ఆలోచన చేసే సమయం.. అదీ ఆలోచన వరకే.. దొరికినట్లుంది. ప్రధానిగా జసిండా మాత్రమే కాదు, క్లార్క్ గేఫోర్డ్ కూడా పెళ్లికి ఒక డేట్ని ఫిక్స్ చేసుకోడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్లని ‘ప్రధానికి కాబోయే భర్త’గా ఉండటం. కానీ అతడికీ కుదరడం లేదు. క్లార్క్ రేడియో బ్రాడ్కాస్టర్, టెలివిజన్ ప్రెజెంటర్. ‘ఫిష్ ఆఫ్ ది డే’ డాక్యుమెంటరీ షోతో బాగా పాపులర్. మీడియాలో పెద్ద స్థాయిలో ఉన్నవారికి సహజంగానే పని ఎక్కువగా ఉంటుంది. ఆయన ‘ఫిష్’ సీరీస్ కొన్నిటిని నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కూడా అడిగి తీసుకుని ప్రపంచమంతటా ప్రసారం చేస్తుంటుంది. పార్లమెంటులో జసిండా, చేపల కార్యక్రమాల షూటింగులతో క్లార్క్ ఎవరికి వారు బిజీగా ఉంటుంటే పెళ్లి చేసుకోవడం తర్వాతి సంగతి. అసలు కలుసుకునేదెప్పుడు? మాట్లాడుకోవడం ఎప్పుడు? చివరికి వాళ్లిద్దర్నీ కలిపి ఒకచోట ఉంచేందుకే పాప పుట్టినట్లుంది. పగలంతా ఎక్కడున్నా సాయంత్రానికి ఇద్దరూ ఇంటికి చేరుతున్నారు. ఇక ఈ పెళ్లి తొందర కూడా పాప కోసమే కావచ్చు. ఆ చిన్నారిని ప్లే స్కూల్లోనో, ప్రీ స్కూల్లోనో చేర్చే సమయం దగ్గర పడుతోంది మరి. అడ్మిషన్ ఫారమ్లో తండ్రి పేరు ఉండాలంటే.. తండ్రిగా అతడు ఉండాలి. తండ్రిగా ఉండాలంటే ముందు భర్తగా ఉండాలి. పెళ్లికి తను మాత్రం వధువుగా అలంకరించుకోనని జసిండా చెప్పేశారు! ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా’’ అంటారామె. క్లార్క్దేముందీ, కోటు వేసుకుంటే చాలు.. పెళ్లి కళ వచ్చేసినట్లే. ఆమె వయసు 40. అతడి వయసు 44. ఆమె పలుచగా ఉంటే, అతడు దృఢంగా ఉంటాడు. చక్కటి జోడీ అని ఆక్లాండ్ సిటీ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జి అయి పాపతో బయటికి వస్తున్నప్పుడు తొలిసారి వీళ్లిద్దర్నీ చూసినప్పుడే ఆ దేశ ప్రజలు అనుకున్నారు. చక్కటి సాంగత్యమే కాదు, చక్కటి సంస్కారం కూడా ఈ జంటది. ఆ మధ్య గేఫోర్డ్తో కలసి రెస్టారెంట్కి వెళితే టేబుల్స్ ఖాళీ లేక బయటే కాసేపు నిలబడ్డారు జసిండా. వేరే రెస్టారెంట్కి వెళ్లబోతుంటే అప్పుడు టేబుల్ ఒకటి ఖాళీ అయిందని చెబితే లోపలికి వెళ్లారు. నేను ప్రధానిని కదా అని ఆమె అనుకోలేదు. నేను ప్రముఖ ప్రెజెంటర్ని కదా అని అతడూ అనుకోలేదు. ఒకరికొకరం అనుకున్నారంతే. హోదాల్ని పక్కన పెట్టి, కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేందుకు కాస్త సమయమే వాళ్లకు కావలసింది. ఆ సమయం ఎప్పుడొస్తే మాత్రం ఏముంది? రావడమే అపురూపం. లవ్ ఉంది.. స్టోరీనే లేదు! కాలిన్ జెఫ్రీ అని న్యూజీలాండ్ మోడల్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ ఒకాయన ఉన్నారు. ఆయన ద్వారా 2012లో తొలిసారి జసిండా, క్లార్క్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడామె లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. పరిచయం తర్వాత కొన్నాళ్లకు క్లార్క్ జసిండాను కలిశారు. వివాదాస్పద ‘గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ బ్యూరో బిల్’ గురించి వివరాల కోసం వచ్చారు ఆయన. మీడియా కనుక ఏదో స్టోరీ పని మీద అయుండొచ్చు. అలా వాళ్ల స్నేహం మొదలైంది. ఆమె ఫెమినిస్టు. ఆయన హ్యూమనిస్టు. స్థూలంగా ఇద్దరూ ఒకటే. ఏడేళ్ల స్నేహం తర్వాత 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ నెరవేరలేదు! జసిండా, కాబోయే భర్త క్లార్క్ -
ప్రేమలో ఉన్నాను..కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : షకీలా
పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఒకానొక దశలో స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే షకీలా సినిమా కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదుడుగులు చవి చూశారు. తనను అర్థం చేసుకునే వాడు దొరకకపోవడంతో.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని పలు సార్లు చెప్పారు షకీలా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. గతంలోనూ తనకు బాయ్ ప్రెండ్స్ చాలామందే ఉన్నారని, అయితే వాళ్లు అందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది. 'ప్రస్తుతం నేను ఒకరితో లవ్లో ఉన్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. లవ్ అంటే లవ్ అంతే. ఇప్పటికే 43 ఏళ్లు వచ్చాయి. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పటివరకు ఏడుగురితో రిలేషన్లో ఉన్నా. ఈ వయసులో లవ్ ఏంటి అని అనుకోవాల్సిన పని లేదు. నాకు 43. అతనికి 30 తను నాకంటే చిన్నవాడు. కానీ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అయినా నేను పెళ్లైన వ్యక్తితో లవ్లో లేను కదా అతని ఫ్యామిలీని డిస్ర్టబ్ చేయడానికి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇందులో తప్పేం ఉంది' అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఎవరితోనూ సీక్రెట్ రిలేషన్ పెట్టుకోవడం లేదని, ఒకరితో విడిపోయిన తర్వాతే మరొకరితో రిలేషన్ షిప్ పెట్టుకున్నాని పేర్కొంది. ఇక గతంలో తమిళంలో ప్రసారమయ్యే ఓ షోలో పాల్గొన్న షకీలా..తన కూతురిని పరిచయం చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిల్లా నా కుమార్తె అంటూ ఓ యువతిని పరిచయం చేశారు. అయితే మిల్లా ట్రాన్స్జెండర్ అని, చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం డిజైనర్గా పని చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇటీవలె షకీలా బయోపిక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఐదు భాషల్లో రిలీజైంది. చదవండి : కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా షణ్ముఖ్తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది? -
బాయ్ఫ్రెండ్తో లాక్డౌన్కు రెడీ: స్టార్ హీరో కూతురు
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వినూత్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకొని మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కూతురు ఇరా ఖాన్ కూడా కావాల్సినంత ఫేమస్ అయిపోయారు. అయితే సినిమాలతో కాదు.. తన పర్సనల్ జీవితంలోని విషయాలతో తరుచూ వార్తల్లో నానుతున్నారు. ఇటీవల తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా తన డేటింగ్ వ్యవహారంతో మరోసారి హాట్టాపిక్గా మారారు. నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారత్లో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అయితే ఒకవేళ మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ విధిస్తే ఆమిర్ కూతురు ఇరా తన ప్రియుడు నుపూర్ కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇరా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పోస్టు చేశారు. బాయ్ఫ్రెండ్ నుపూర్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాక్డౌన్కు సిద్ధం అంటూ పేర్కొన్నారు. చదవండి: పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్ ప్రస్తుత ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాక్డౌన్ విధిస్తారని జనాలు ఓ వైపు భయపడుతుంటే సూపర్స్టార్ కూతురు మాత్రం బాయ్ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేందుకు లాక్డౌన్ కోసం ఎదురుచూస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్న ఇరా ఖాన్ మళ్లీ ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్తో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నారు. సుస్మితా సేన్కు గత పదేళ్లుగా ట్రైనర్గా ఉన్నారు. చదవండి: 'కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు' -
బాయ్ఫ్రెండ్ కోసం వంట చేసిన శ్రుతీహాసన్.. పాపం
గత కొద్ది రోజులుగా హీరోయిన్ శ్రుతీ హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే శ్రుతీ, శంతనుతో కలిసి డేట్కు వెళ్లడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్ గురించి ఇన్డైరెక్ట్గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రుతీ హాసన్ బాయ్ఫ్రెండ్ కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక బాయ్ఫ్రెండ్ కోసం శ్రుతి హాసన్ పైనాపిల్తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శ్రుతీ చేసిన వంట చూసి ఆమె బాయ్ఫ్రెండ్ ‘‘ఇది వెస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా’’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శంతను హజారికా గువహతికి చెందిన వ్యక్తి. అతను రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్తో కలిసి పని చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో శంతను వెల్లడించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్, శంతను హజారికా చెన్నైని సందర్శించారు. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ జంట శ్రుతి తండ్రి కమల్ హాసన్ను కూడా అతని ఇంట్లో కలుసుకున్నారు. చదవండి: మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్ఫ్రెండ్! -
స్మార్ట్ వాచ్.ఆ పని చేస్తున్న బాయ్ ఫ్రెండ్ను పట్టిచ్చింది!
వాషింగ్టన్: ఇది స్మార్ట్యుగం.. స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, లాపీలు మనుషులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మనిషి జీవింతంలో ఒక భాగమైపోయాయి. అయితే, ఇవి కొందరికి వరంగా మారితే, మరికొంత మందికి ఇబ్బందికరంగా కూడా తయారయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నాదియా ఎసెక్స్ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్కు స్మార్ట్ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చింది. ఈ వాచ్లో ప్రధానంగా.. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఫిట్నెస్ అలెర్ట్, రిమైండర్స్, ఫిట్బిట్ రీడింగ్..ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే , ఆ స్మార్ట్ వాచ్ అలెర్ట్ నోటిఫికేషన్ను ఆ యువతి తన స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ చేసుకుంది. ఈ క్రమంలో, ఒకరోజు బాయ్ఫ్రెండ్కు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 500ల కేలరీల శక్తి ఖర్చయినట్లు ఆమెకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంత రాత్రి అన్నికాలరీల శక్తి ఖర్చవ్వడానికి కారణం ఏంటని ఆలోచించింది.. అతని ప్రవర్తనలో మార్పును గ్రహించింది. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని గ్రహించింది. ఈ విషయాన్ని నాదియా ఎసెక్స్.. టీక్ టాక్ వీడియోతో తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకొంది. అయితే ఇప్పుడిది తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నీ తెలివికి ఫిదా’..‘నీకు మంచే జరిగింది’..‘ఎసెక్స్ రాణి ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: సెక్స్డాల్తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు! -
ఇతడే నా బాయ్ఫ్రెండ్.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
'దేవదాసు' చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా అడుగు పెట్టిన ఇలియానా..ఆ తర్వాత బాలీవుడ్కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం 'అన్ఫెయిర్ అండ్ లవ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా 'ఆస్క్మీఎనీథింగ్' సెషన్ను నిర్వహించిన ఇలియానాకు..మీ బాయ్ఫ్రెండ్ పేరంటని ఓ నెటిజన్ ప్రశ్నించారు. తన పేరు చార్లి అంటూ ఓ ఫోటోను షేర్ చేసి నెటిజన్కు షాకిచ్చింది ఈ సన్నజాజి భామ. చార్లి అంటే ఇలియానా ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కుక్క పేరు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్తో ఇలియానా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఇలియానా..ఈ మధ్య కెరియర్పై ఫోకస్ పెట్టి వరుస సినిమాల్లో నటిస్తుంది. మీ చర్మ సౌందర్యం కోసం ఏదైనా శస్త్రచికిత్స తీసుకున్నారా అని మరో నెటిజన్ ప్రశ్నించగా...ఇప్పటివరకు అయితే లేదని, మన శరీరం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని బదులిచ్చింది. ‘గతంలో నా శరీరాకృతి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని. ఎలా కనిపిస్తున్నాం? బాగానే కనబడుతున్నామా? అని తెగ ఆలోచించేదాన్ని.ఆ ఒత్తిడి ఎలా ఉండేదో చెప్పలేను. నా ముక్కు షార్ప్గా లేదని, పెదాలు ఇంకా పెద్దగా లేవని, చేతులు సరిగ్గా లేవని, పొట్ట కొంచెం ముందుకు ఉంటుందని, నడుము పెద్దగా ఉంటుందని, ఇంకా ఎత్తు ఉండాల్సిందేమోనని, చురుకుగా లేనేమోనని, ఫన్నీగా ఉండనేమోనని, ఫర్ఫెక్ట్గా లేనేమో అని... ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోలనుకోవడం లేదని, నాకున్న లోపాలతో సంతృప్తిగానే ఉన్నాను’’ అని పేర్కొంది ఇలియానా. చదవండి :(‘నా శరీరం అందంగా లేదని అనుకునేదాన్ని’) (18 ఏళ్లకే ఫస్ట్ కిస్.. డేటింగ్ మాత్రం..) -
ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే
ముంబై : సుపారి ఇచ్చి ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేయించింది ఓ యువతి. ఈ దారుణ ఘటన మహారాష్ష్ర్టలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..నాగ్పూర్కు చెందిన చందూ మహాపూర్ అనే వ్యక్తి 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు ఒప్పుకోలేదు. ఇదివరకే పెళ్లయి, పిల్లలు కూడా ఉండటంతో రెండో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ప్రియుడిని పథకం ప్రకారం హత్య చేయించింది. ఇందుకోసం ప్రియుడి స్నేహితుడు, దూరపు బందువైన భరత్ గుర్జార్ అనే వ్యక్తిని నియమించుకుంది. తన ప్రియుడిని హత్య చేస్తే రూ.1.5 లక్షల సుపారీతో పాటు ఓ రాత్రి నీతో గడుపుతానంటూ బంపర్ ఆఫర్ చేసింది. దీనికి అంగీకరించిన నిందితుడు..పార్టీ ఇస్తానని చెప్పి యువతి ప్రియుడిని తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించి తలపై బండరాయి మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని క్రషింగ్ మెషిన్లో పడేసి పారిపోయాడు. నిందితుడికి ఇదివరకే చందూతో డబ్బు విషయంలో వివాదం ఉందని, అది కూడా మనసులో పెట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ ప్లాన్లో యువతికి సహకరించిన ఆమె తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : (వివాహేతర సంబంధం: ప్రియుడు, ప్రియురాలు మృతి) (మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన) -
బాయ్ ఫ్రెండ్తో శృతిహాసన్ మ్యూజిక్ వీడియో
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతీహాసన్ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య శ్రుతీ బర్త్డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబైలో వీళ్లు ప్రేమగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలం ఇస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. కొంతకాలంగా మ్యూజిక్ కంపోజింగ్ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. లండన్లో కొన్ని షోలు కూడా చేశారామె. తాజాగా శ్రుతి చేస్తున్న మ్యూజిక్ వీడియోలో శాంతను ర్యాప్ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది. రికార్డింగ్ స్టూడియోలో ఈ మ్యూజిక్ వీడియోకి పని చేస్తూ శాంతనుతో సరదాగా చిన్న వీడియోను షేర్ చేసుకున్నారు శ్రుతీ. మరి ఈ మ్యూజిక్ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. అలాగే తమ రిలేషన్షిప్ గురించి ఈ ఇద్దరూ ఎప్పుడు బయటపెడతారో చూడాలి. -
రెండేళ్లుగా అత్యాచారం: యువకుడి అరెస్టు
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని తానే పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో 21 ఏళ్ల యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బాధిత యువతి గత వారం తానే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తానేలోని గౌతమ్ నగర్కు చెందిన 21 ఏళ్ల యువతికి ఖాన్ అనే వ్యక్తితో 2018లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా పెళ్లి పేరుతో 2018 నుంచి 2020 వరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా ఖాన్ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఖాన్ను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతడు మాట్లాడటం, ఫోన్ చేయడం తగ్గించాడు. దీంతో బాధితురాలు తానే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పి ఖాన్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఖాన్పై ఐపీసీ సెక్షన్ 376తో పలు కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సహజీవనం వార్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ప్రియుడు, డిజైనర్ రోహ్మాన్ షాల్తో కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్షిప్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రోహన్ ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుస్మిత పరిచయం, పెళ్లి ఆలోచన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. కశ్మీర్ మూలాలున్న రోహ్మాన్ పుట్టి పెరిగిందంతా నైనిటాల్లోనని పేర్కొన్నాడు. డెహ్రాడూన్లో ఇంజనీరింగ్ తరువాత మోడలింగ్లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. అయిదు, ఆరు సంవత్సరాల తర్వాత ముంబై వచ్చానని, అనంతరం రెండేళ్లకు సుస్మిత పరిచయం అయ్యిందని రోహ్మాన్ వెల్లడించాడు. సుస్మితతో పరిచయం ఏర్పడ్డాక నా జీవితంలో ప్రతిదీ మారిపోయింది. బయటి వ్యక్తులకు ఓ స్టార్ జీవితం గురించి నిర్ధిష్ట అవగాహన ఉంటుంది. కానీ ఒకసారి మనం వారితో కలిసుంటే దాని వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది. సుషు కలిసాక నా వ్యక్తిగత జీవితం మారిపోయింది. ఆ తర్వాతే నేను జీవితాన్ని సీరియస్గా చూడటం, ఇతరులు గౌరవించడం మొదలు పెట్టాను. నేను మోడలింగ్ ప్రారంభించినప్పుడు ఒక స్టార్ అవ్వాలనుకున్నాను, కానీ వేర్వేరు ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మోడలింగ్కు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఫేమస్ అవ్వాలనే ఆలోచన ఇప్పుడు నా జాబితాలలో లేదు.’ అని పేర్కొన్నాడు. చదవండి: సుష్మితకు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియుడు అదే విధంగా సుస్మితతో పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. ‘సుష్మిత, తన కుమార్తెలతో ఇప్పటికే నేను ఒక కుటుంబంగా ఏర్పడ్డాం. నేను ఆ పిల్లలకు తండ్రి లాంటివాడినని కొన్నిసార్లు అనుకుంటా. మరి కొన్నిసార్లు వాళ్లకు స్నేహితుడినని ఫీల్ అవుతాను. పిల్లలతో పోట్లాడుతాను. ఇలా అన్ని షేర్ చేసుకుంటాను కాబట్టి మేము కుటుంబంగా చేరి నార్మల్గానే జీవిస్తాం. దీన్నే నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగే ప్రశ్నలపే మేము మాట్లాడలేము. పెళ్లి జరిగినప్పుడు దాన్ని దాచము. అందరికీ చెబుతాం. ప్రస్తుతానికి మేము సుషు వెబ్ సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. దాని తరువాత ఆలోచిస్తాం. సుష్మితతో డేటింగ్ గురించి నేను మా తల్లిదండ్రులతో చెప్పలేదు. వాళ్లే తెలుసుకొని నాకు సపోర్ట్గా నిలిచారు. మా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు.’ అని స్పష్టం చేశాడు -
బాయ్ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ
'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమమైన తాప్సీ పన్ను.. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బాలీవుడ్కు మాకాం మార్చిన ఈ సొట్టబుగ్గల సుందరి అక్కడ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బీటౌన్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా కొన్నాళ్లుగా ఈ ఢిల్లీ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇటీవల తాప్సీ వెళ్లిన మాల్దీవుల వెకేషన్కు కూడా మథియాస్ వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా తాప్సీ షేర్ చేసింది. తాజాగా ఈ భామ తన బాయ్ఫ్రెండ్ గురించి మొదటిసారి నోరు విప్పింది. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి పబ్లిక్గా ఎప్పుడూ మాట్లాడరెందుకని తాప్సీని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దానిపై ఆమె స్పందించింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం తనకిష్టం లేదని తెలిపింది. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేర్వేరుగా ఉంచాలనుకుంటాను. నాకు సంబంధించిన వారి పుట్టినరోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్ను పంచుకుంటాను. నా పర్సనల్ లైఫ్లో భాగమైన మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి తాప్సీ మాట్లాడుతూ..‘నేను ఏదో ఒకసారి అయిదారు సినిమాలు చేయడానికి బదులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడతాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరుకుతుంది’ అని పేర్కొంది. ఇక పోతే ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, సినిమాలు తగ్గించాలనుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పకనే చెప్పింది తాప్సీ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రష్మీ రాకెట్, తమిళంలో జనగణమన చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది. చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్ -
మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్ఫ్రెండ్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల తనయ, టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ నటిగా, గాయనిగా మాత్రమే కాకండా, మ్యూజిక్ కంపోజర్గా, రచయితగా తనకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే శృతి వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో కొన్నివెబ్ సిరీస్లు చేసిన ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్బస్టర్గా నిలిచింది. ‘క్రాక్’ హిట్తో ఫుల్ జోష్లో ఉన్న శృతి ఇటీవల తన 35వ పుట్టిన రోజును స్నేహితులు మధ్య సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. (చదవండి: 2021లో శృతిహాసన్ పెళ్లి?: హీరోయిన్ రిప్లై) అయితే ఇందులో శృతి ఓ వ్యక్తిని హత్తుకుని అత్యంత సన్నిహితంగా కనిపించారు. అంతేగాక ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘నా పుట్టిన రోజును ప్రత్యేకంగా మలచినందుకు ధన్యవాదాలు శాంతను’ అంటూ ట్యాగ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి శృతి కొత్త బాయ్ఫ్రెండ్ అయింటాడని తన ఫాలోవర్స్ అంతా అభ్రిప్రాయపడుతున్నారు. అయితే అతడి పేరు శాంతను హజారికా. అతడు ఓ పెయింటర్. శృతి బర్త్డేను దగ్గరుండి అతడే సెలబ్రెట్ చేశాడంట. ఇక అతడిని శాంతను అంటూ శృతి ముద్దుగా పిలవడంతో ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారని ఫిక్స్ అయిపోతున్నారు. కాగా 2016లో లండన్ నటుడు మైఖేల్ కర్సెల్తో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటి నుంచి కాస్తా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి మళ్లీ తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. (చదవండి: శృతి హాసన్ గురించి ఇది మీకు తెలుసా?) -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
సాక్షి, జగిత్యాల: ప్రేమ పేరుతో రహస్యంగా వివాహం చేసుకొని, కుమారుడు పుట్టిన తర్వాత తనకేమీ తెలియదంటూ మోసం చేశాడని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాల్లోకి వెళ్లే.. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుజ్జుల స్వప్న, అదే గ్రామానికి చెందిన కట్కూరి వెంకటేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ పలుమార్లు విదేశాలకు వెళ్లివచ్చాడు. వీరికి మూడేళ్ల కిందట బాబు జన్మించాడు. గల్ఫ్ నుంచి రెండు నెలల కిందట స్వగ్రామం వచ్చిన వెంకటేశ్ స్వప్నను నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు. కుమారుడు కూడా నాకు పుట్టలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో స్వప్న మంగళవారం అతని ఇంటి ఎదుట కుమారుడితో కలిసి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. -
తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి..
బెంగళూరు : ప్రియుడితో బంధాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో తప్పుదారి పట్టిందో నర్సు. తోటి ఉద్యోగుల బాత్రూం వీడియోలను తీసి ప్రియుడికి పంపింది. గుట్టురట్టయి చివరకు జైలు పాలైంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన అశ్వినికి ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడు వేల్లూర్కు చెందిన ప్రభు అనే చెఫ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఓ రెండు మూడు సార్లు కలుసుకున్నారు. అయితే ఆమెకు ఇది వరకే రెండు సార్లు పెళ్లైందని, విడాకులు కూడా తీసుకుందని ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టసాగాడు. బంధంలో రెండు సార్లు విఫలమైన ఆమె, అతడ్ని వదులుకోవటనానికి ఇష్టపడలేదు. అతడు చెప్పినట్లుగా నడుచుకునేది. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్!) ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని అడిగాడు. ఆమె అలాగే పంపేది. అతడికి అవి బోర్ కొడుతున్నాయని చెప్పటంతో హాస్టల్ గదిలో తనతో పాటు ఉంటున్న తోటి ఉద్యోగులు స్నానం చేస్తునపుడు తీసిన వీడియోలను అతడికి పంపేది. ఓ రోజు బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్లిన ఓ సిబ్బంది అక్కడ కిటికీ దగ్గర సెల్ఫోన్ ఉండటం గమనించింది. దీనిపై అశ్వినిని ప్రశ్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు చాలా వరకు నర్సుల బాత్రూం వీడియోలను ఆన్లైన్లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
కూతురి బాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన ఒబామా
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తను తాజాగా రాసిన పుస్తకం ‘ ఏ ప్రామిస్డ్ లాండ్’ను ప్రమోట్ చేసుకోవటంలో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి హోం క్వారెంటైన్లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా కుటుంబాల్లోలానే మేము కూడా ఓ నెల ఆటలు ఆడుకుంటూ, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ సరదాగా గడిపాము. మాలియా బాయ్ఫ్రెండ్ కూడా మాతో ఉన్నాడు. రాత్రి పూట కూడా ఆటలు ఆడుకునేవాళ్లం. కొద్దిరోజులకే వారు బోర్గా ఫీలయ్యారు. అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్ఫ్రెండ్కు కార్డ్సు(పేకలు) కూడా నేర్పించాను. మాలియా బాయ్ఫ్రెండ్ బ్రిటీష్ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట నాకతడు నచ్చలేదు. కానీ, చాలా మంచి వ్యక్తి. మగపిల్లల తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మా ఇంటి నిత్యావసరాల ఖర్చు 30 శాతం పెరిగింది.’’ అని అన్నారు. (నాకు మరణశిక్ష విధించినా సరే..) కాగా, ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను ఒబామా నెమరువేసుకున్నారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. -
8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు..
ప్రేమ కథలన్నీ పెళ్లి పీటలెక్కవు, కొందరి ప్రేమ మాత్రమే పెళ్లి బంధం వరకు రాగలుగుతుంది. ఓ అమ్మాయి కూడా తన ప్రేమ పెళ్లితో మరింత బలపడాలని కలలు కంది. ఇద్దరి గుర్తుగా ఓ బిడ్డను కూడా కంది. కానీ ఎనిమిదేళ్లవుతున్నా ప్రియుడి నోటి వెంట ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుందాం అన్న మాట రాలేదు. దీంతో ఓపిక నశించిన ఆ యువతి పెళ్లంటే ముఖం చాటేస్తున్న బాయ్ఫ్రెండ్పై ఏకంగా కోర్టులో దావా వేసింది. ఈ ఘటన జాంబియా దేశంలో చోటు చేసుకుంది. గెర్టూడ్ నోమా(26), హెర్బర్ట్ సలాలికి(28) ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఈ సందర్భంగా మహిళ తల్లిదండ్రులు అతడికి వరకట్నం ఇచ్చారు. ఎనిమిదేళ్ల అనుబంధంలో అతడు ఒక్కసారి కూడా పెళ్లి ఊసెత్తలేదు. (చదవండి: 2020లో మోత మోగిన పాపులర్ ట్వీట్స్ ఇవే!) దీంతో విసుగు చెందిన యువతి ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని కోర్టుకెక్కింది. "అతడు దేన్నీ సీరియస్గా తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో నా వేలికి ఉంగరం తొడుగుతానని మాటిచ్చాడు. కానీ అది ఇంతవరకు జరగలేదు. ఇంతకాలం తన సమయాన్ని వృధా చేశాడు. చూస్తుంటే అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనన్న అనుమానం వస్తోంది. అందుకే నా భవిష్యత్తు ఏంటో తెలుసుకునేందుకు అతడిని కోర్టుకీడ్చాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రియుడు సలాలికి మాట్లాడుతూ ఆవిడే తనను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇద్దరి మాటలు విన్న న్యాయమూర్తి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడివరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. దీన్ని కోర్టు బయటే పరిష్కరించుకొమ్మని సూచించారు. అయితే సదరు ప్రియుడికి కుటుంబాన్ని పోషించే స్థోమత లేనందువల్లే పెళ్లికి వెనకడుగు వేస్తున్నాడట. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’) -
బాయ్ఫ్రెండ్తో కలిసి నటి స్టెప్పులు
ముంబై: బాలీవుడ్ నటి అంకితా లోఖండే తరచు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఆమె తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విక్కిజైన్తో కలిసి డాన్స్ చేసిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘నేను, విక్కి కలిసి డాన్స్ చేస్తున్నాము’ అని ఆమె కాప్షన్ జతచేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి నృత్యం చేశారు. 2014లో విడుదలైన హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలోని ఓ పాటకు ఇద్దరూ హుషారుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: బాయ్ఫ్రెండ్ని ఉద్దేశించి అంకిత భావోద్వేగం ఇటీవల ఈ జంట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా అంకిత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. హిందిలో ప్రజాధారణ పొందిన టీవీ షో ‘పవిత్ర రిష్ట’ ద్వారా అంకిత పాపులర్ అయ్యారు. దీంతో పాటు ఏక్ థి నాయక, శక్తి-అస్తిత్వా కే ఎహ్సాస్ కి వంటి షోల్లో ఆమె నటించారు. గత ఏడాది కంగానా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘మణికర్ణిక’ మూవీ ద్వారా అంకిత బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ బాగీ-3 నటి జలక్ దిఖ్లాజా, కామెడీ సర్కస్ వంటి ప్రముఖ రియాలటీ షోలలో కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) -
‘గణేష్ లేకపోతే నేను బతకలేను’
-
16 గంటలు నరకం చూసిన యువతి
ముంబై : ప్రియుడి చేతిలో యాసిడ్, పెట్రోల్ దాడికి గురైన యువతి 16 గంటల పాటు నరకం అనుభవించింది. సహాయం చేసే వారు లేక రోడ్డు ప్రక్కన ప్రాణాల కోసం అల్లాడిపోయింది. చివరకు ఆసుపత్రిలో చేరి కన్నుమూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాంధేడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవినాష్ ఆర్ రాజురే.. సావిత్ర డి. అన్కుల్కర్లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసే ఉంటుంన్నారు. శుక్రవారం దీపావళి పండుగ జరుపుకోవటానికి పూనేనుంచి నాంధేడ్ జిల్లాలోని సొంత ఊరు సెల్గాన్ గ్రామానికి బైకుపై బయలుదేరారు. మార్గం మధ్యలో నిర్మానుష ప్రాంతంలో వాహానాన్ని నిలిపిన రాజురే సావిత్రపై దాడికి దిగాడు. ఆమె గొంతునులిమి చంపాలని చూశాడు. ( చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి) ప్రతిదాడి చేయటంతో సావిత్రపై యాసిడ్ పోశాడు. భరించలేని నొప్పితో సహాయం కోసం అరుస్తూ.. కిందపడి కొట్టుకుంటున్నా దయలేకుండా బైకులోని పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓ గొర్రెల కాపరి కాలిన గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 16 గంటల సుధీర్ఘ నరకం తర్వాత అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’
బాలీవుడ్ నటి అంకితా లోఖండే బాయ్ఫ్రెండ్, సోల్మెట్ విక్కిజైన్కి ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తన వల్లే అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని వాపోయారు. తనలాంటి పబ్లిక్ ఫిగర్తో కలిసి ఉండటం వల్లే అతను విమర్శలు ఎదుర్కొంటున్నాడని.. కానీ వాటికి అసలు అతడు ఏ మాత్రం అర్హుడు కాదని తెలిపారు. అలానే ప్రతిసారి తనను అర్థం చేసుకుని.. మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రేమికుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని కోరారు. అభిమానులు కూడా అంకితకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అంకిత విక్కి జైన్కి క్షమాపణలు, కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’) ఈ మేరకు అంకిత తన ఇన్స్టాగ్రామ్లో ‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్మెట్గా పంపినందుకు. అలానే నీవు నాకు అన్ని వేళలా తోడుగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ విక్కి జైన్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు అంకిత. (చదవండి: 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) View this post on Instagram I can’t find the words to describe my feelings for you. One thing which come in my mind when I see us together is I’m grateful to god for sending u in my life as a friend, partner and as soul mate ❤️ Thanku for being someone who was always there for me. Thanks for making all my problems as yours and helping me whenever I needed you.Thankyou for being my support system. Most important thanku for understanding me and my situations ❤️ And I am sorry because of me u hv to face criticism which u don’t deserve at all . Words fall short but this bond is amazing🤗I love you 😽 @jainvick #viank A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Nov 1, 2020 at 11:04pm PST పవిత్ర రిష్తా సిరీయల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అంకిత. ఇందులో సుశాంత్ ఆమె కో స్టార్గా నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. 2019లో అంకిత మణికర్ణిక చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు.