breaking news
-
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్లైట్ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
బ్లాక్ డ్రెస్లో దివ్య పిళ్లై స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ఇన్స్టాలో 90% విరాళాల ఖాతాలు అనుమానాస్పదమే!
అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.తనిఖీల్లో వెల్లడైన అంశాలుపరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలుప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
ఇద్దరు పిల్లల తల్లిని లేపుకెళ్లిన 21 ఏళ్ల కుర్రాడు..!
చిత్తూరు జిల్లా: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత ప్రియుడితో కలిసి కొత్త కాపురం పెట్టగా బంధువులు పట్టుకున్న సంఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం బెగ్గిలిపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాంతిపురం మండలంలోని బిఎం గొల్లపల్లికి చెందిన శోభకు గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఈ నేపద్యంలో శోభ(27)కు సామాజిక మాధ్యామాల ద్వారా గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్(22)తో పరిచయమైంది. ఈ పరిచయం ముదిరి ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. దీంతో నెల రోజుల క్రితం శోభ ఇంటి నుంచి పరారు కావటంతో తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపద్యంలో శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించిన చిరంజీవి తరపు బంధువులు ఆ ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైన శోభ బలవంతంతో ఆమెను పెళ్లి చేసుకున్నానని బాలాజీ నాయక్ చెప్పాడు. తను చెప్పినట్టు వినకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించటంతో ఆమెతో ఉన్నానన్నాడు. తన భర్త అనుమానంతో వేధింపులకు పాల్పడటంతో ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచమైన బాలాజీ నాయక్ను ఇష్టపడి తనతో తాళి కట్టించుకున్నానని శోభ చెప్పింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకొంటున్నారు. -
మ్యాచింగ్ డ్రస్సుల్లో ముచ్చటైన సినీ జంట (ఫొటోలు)
-
చిన్న పిల్లలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ (ఫొటోలు)
-
లీకేజీ ముఠాలను వదలం: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోల పరంపర కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ‘ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణ బిల్లు’ ఆమోదం పొందిన వేళ ప్రధాని మోదీ గురువారం రాత్రి ఇన్స్టా గ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియో ఒకటి విడుదలచేశారు. ‘‘అత్యంత పటిష్టమైన పరీక్ష విధానాన్ని తీసుకొచ్చేందుకు అనుక్షణం శ్రమిస్తున్నాం. పేపర్ లీకేజీలు కోట్లాది మంది పరీక్షార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయి. కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పేపర్ లీకేజీ గ్యాంగ్లను, లీకేజీ మాఫియాను వదిలేది లేదు. నేను మాట ఇచ్చినట్లే శక్తివంతమైన పేపర్ల లీకేజీ నివారణ బిల్లును రూపొందించాం. అది ఇప్పుడు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడం సంతోషకరం. పేపర్ల లీకేజీలపై మా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్ ప్రభావమే చూపాయి. జెన్–జీ ప్రియ నేస్తం ఇన్స్టాగ్రామ్పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్స్టాగ్రామ్పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్స్టా సందేశం పంపడం, జెన్–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్గా పోస్ట్ చేశారు.చదవండి: నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇన్స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్ మార్గం పట్టించిన ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మలవీయా కూడా జెన్–జీకి దగ్గరైన ఇన్స్టాగ్రామ్పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.టాప్లో పీఎం... భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్స్టాగ్రామ్లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రెడిషనల్ లుక్లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)
-
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్కు కౌంటర్గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్రైటర్గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్?
2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ను నిషేధిస్తారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇన్స్టా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. కొందరు తమ ఫొటోలు, వీడియోలను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సూచిస్తూ పోస్టులు చేశారు. అయితే.. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం.. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ నిషేధానికి సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆగస్టు 25 నుంచి ఇన్స్టాను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కొత్త నిబంధనలు లేదా నిషేధాలపై సమాచారం వస్తే.. సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తప్పకుండా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడుతుందని హెచ్చరించింది.మొత్తం మీద.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే వార్తలో ఎలాంటి నిజం లేదనే విషయం ప్రజలు గమనించాలి.A post is being shared on social media claiming that #Instagram will be banned in India from the night of 25 August 2026 #PIBFactCheck:❌ The claim is false✅ No such announcement has been made by the Government of India https://t.co/3sottwhjvJ— PIB India (@PIB_India) July 27, 2026 -
మల్లెపూలు.. వడ్డాణంతో అందంగా రుక్మిణి (ఫొటోలు)
-
'కొరియన్ కనకరాజు' బ్యూటీ.. అచ్చం అలానే ఉందే! (ఫొటోలు)
-
చాక్లెట్ కలర్ డ్రస్లో పూజా హెగ్డే (ఫొటోలు)
-
'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?
నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్ని క్యాష్ చేసుకునేందుకు ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)'ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు''ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.రియా యాదవ్ ఎవరు?రియా యాదవ్ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?) View this post on Instagram A post shared by ʀʜɪʏᴀ ʏᴀᴅᴀᴠ (@rhiyaahir) -
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 -
బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)
-
నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)
-
విచారం వద్దు... అవి ఘోస్ట్ జాబ్స్ అయినా కావచ్చు!
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్శ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్శ్రీ.రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్లో ప్రస్తావించింది దేవ్శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్శ్రీ.ఘోస్ట్ జాబ్స్ అంటే?ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్లైన్లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్ను కంపెనీలు సృష్టిస్తుంటాయి. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే?
మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్గా, కంటెంట్గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర్తయ్యాడు. వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్పూర్ కొత్వాలి ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. -
మెరూన్ కలర్ చీరలో శివాని నాగారం అందాల సందడి..ఫోటోలు
-
'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
-
చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)
-
స్టన్నింగ్ లుక్స్లో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
పట్టు చీరలో నభా నటేష్ అందాల మెరుపులు (ఫొటోలు)
-
తెల్లని చీరలో శ్రీదేవి విజయ్కుమార్ మనసు దోచే అందాలు (ఫొటోలు)
-
సింపుల్గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
ఉంగరాల జుట్టు.. వావ్ అనిపించే గ్లామర్ (ఫొటోలు)
-
ఫిఫా ఫైనల్కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్గా మారింది. ఫైనల్కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్ల్లో 8 గోల్స్తో పాటు నాలుగు అసిస్ట్లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్ల్లో 10 గోల్స్తో పాటు 4 అసిస్ట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్గా రికార్డు -
కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)
-
చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)
-
డిఫరెంట్ డ్రెస్లో అవికా గోర్ అందాలు.. ఫోటోలు
-
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
-
పిల్లల చాటింగ్పై తల్లిదండ్రులకు మెసేజ్!
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ టీనేజర్లలో మానసిక సమస్యలు, సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్బాట్లతో పిల్లలు ఎక్కువగా సమయం గడుపుతుండటం, కొన్ని సందర్భాల్లో అవి వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ‘మెటా ఏఐ’ చాట్బాట్లో రక్షణ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇకపై టీనేజర్లు చాట్బాట్తో ఆత్మహత్య వంటి సున్నితమైన అంశాల గురించి చర్చిస్తే తక్షణమే వారి తల్లిదండ్రులకు అలర్ట్ వెళ్లేలా సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.ఫీచర్ పనితీరు - మానవ పర్యవేక్షణఇన్స్టాగ్రామ్లో ‘పేరెంటల్ సూపర్విజన్’ (తల్లిదండ్రుల పర్యవేక్షణ) నియంత్రణలను ఎంచుకున్న వారికి మాత్రమే ఈ అలర్ట్లు అందుతాయి. పిల్లలు మెటా ఏఐతో జరిపే సంభాషణల్లో ఆత్మహత్యకు సంబంధించిన అంశాలు లేదా తమను తాము గాయపరుచుకునే ప్రస్తావనలు వస్తే ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ వ్యవస్థ దానిని గుర్తిస్తుంది. అయితే, టెక్నాలజీ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఏఐ ఫ్లాగ్ చేసిన ప్రతి చాట్ను మెటా అంతర్గత బృందం మ్యాన్యువల్గా సమీక్షిస్తుంది. ఆ తర్వాతే తల్లిదండ్రులకు యాప్ నోటిఫికేషన్, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. ఒకవేళ పిల్లల ఉద్దేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ ప్రాణ రక్షణే ధ్యేయంగా ముందుజాగ్రత్త చర్యగా అలర్ట్ పంపాలని మెటా నిర్ణయించింది.గోప్యతకు భంగం కలగకుండా..ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం వెళ్లినప్పటికీ పిల్లల ప్రైవసీ దెబ్బతినకుండా మెటా జాగ్రత్తలు తీసుకుంది. తల్లిదండ్రులకు పిల్లల పూర్తి సంభాషణలు (చాట్ హిస్టరీ) కనిపించవు. కేవలం తమ సంభాషణలో అటువంటి సున్నితమైన అంశం ప్రస్తావనకు వచ్చిందనే విషయం మాత్రమే తెలుస్తుంది. దీనితో పాటు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి.. వారికి మానసిక ధైర్యం ఎలా కల్పించాలనే విషయాలపై నిపుణులు రూపొందించిన గైడ్లైన్స్, హెల్ప్లైన్ నంబర్లను కూడా మెటా తల్లిదండ్రులకు అందజేస్తుంది.కంటెంట్ నిబంధనలు - లభ్యతప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్స్టాగ్రామ్ టీన్ అకౌంట్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఖాతాలన్నింటికీ దీనిని విస్తరించనున్నారు. వీటితో పాటు టీనేజర్ల ఖాతాలకు డిఫాల్ట్గా ‘13+ కంటెంట్ సెట్టింగ్’ (పరిమిత కంటెంట్ మోడ్) వర్తింపజేస్తున్నారు. దీనివల్ల వయసుకు సరిపోని లేదా సున్నితమైన ప్రాంప్ట్లకు మెటా ఏఐ స్పందించదు. అంతేకాదు, ఎవరైనా యూజర్ ఏఐ చాట్లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తిస్తే నేరుగా స్థానిక అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించే మరో వ్యవస్థపై కూడా మెటా పనిచేస్తోంది. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ప్రమాదంలో ఉన్న 19,000 మందిని అత్యవసర సేవల సహాయంతో కాపాడినట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర! -
గుడ్ నైట్ హీరోయిన్ మీతా రఘునాథ్ స్మైలీ లుక్స్.. ఫోటోలు
-
వైట్ శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
-
అత్తపై ఫన్నీ రీల్.. కోడలికి ఊహించని షాక్!
తమిళనాడు: రీల్స్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టడం వల్ల గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన శ్రీకాంత్ (24), అభిరామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు చెన్నైలో నివసిస్తున్నారు. అభిరామి తన వాట్సాప్ స్టేటస్లో అత్తని కోడలు పని చేయమని పురమాయించేలా ఉన్న ఒక ఫన్నీ రీల్ను పోస్ట్ చేసింది. దీన్ని చూసిన శ్రీకాంత్ సోదరి అతనికి సమాచారం అందించింది.దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో అభిరామి తన పుట్టింటికి వెళ్లిపోయింది. జూలై 9న శ్రీకాంత్ అక్కడికి వెళ్లి మళ్లీ గొడవ పడి, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అభిరామి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. -
పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ అందాలు.. ఫోటోలు
-
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
-
ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు
-
శారీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందాలు.. ఫోటోలు
-
శ్రీలీల ఇన్ స్టా ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు..!
-
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
'బాసింగ బలాలే'.. తెలంగాణ జానపదానికి కొత్త ఊపు.. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తున్న ఫోక్ సాంగ్..ఒక మంచి జానపద పాటకు కాలంతో సంబంధం ఉండదు. మట్టివాసన, పల్లె పలుకులు, సంప్రదాయాల సోయగం కలిస్తే ఆ పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది 'బాసింగ బలాలే' ఫోక్ సాంగ్. తెలంగాణ పల్లె సంస్కృతిని, పెళ్లి వేడుకల సందడిని, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే ఈ పాట సోషల్ మీడియా వేదికలపై విపరీతమైన ఆదరణ పొందుతోంది. "బాసింగం" అనేది తెలుగు సంప్రదాయ వివాహాల్లో వధూవరులు నుదుటిపై ధరించే పవిత్రమైన అలంకారం. పెళ్లి వేడుకలో దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదే సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన "బాసింగ బలాలే" పాటలో తెలంగాణ యాస, జానపద సంగీతం, డప్పు బీట్లు, ఉత్సాహభరితమైన సాహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.పాట విడుదలైన నాటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వీడియోలు రూపొందుతున్నాయి. పెళ్లిళ్లు, హల్దీ వేడుకలు, కాలేజీ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా ఎక్కడ చూసినా 'బాసింగ బలాలే' పాటే మార్మోగుతోంది. చిన్నారుల నుంచి యువత వరకు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. -
యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
కొత్త ఏఐ టూల్ను నిలిపేసిన మెటా
శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్ను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుకుగా వాడుకుంటోందని ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వారి పబ్లిక్ కంటెంట్ను ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దానిపై అందరికీ అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీనిని ఇకపై అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం ‘మ్యూజ్ ఇమేజ్’ పేరిట కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రిఫరెన్స్గా ఉపయోగపడటానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. -
ముగ్గురు బాలికలపై కామాంధుడి లైంగిక దాడి..!
కర్ణాటక: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్లను చూపుతూ ఆమెను బెదిరించాడు. స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
శ్రీలీల ఇన్స్ట్రాగామ్ ఆదాయం ఎంతో తెలుసా?
తమిళంలో ఒక సామెత ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు సంబళం కంటే గింబళం ఎక్కువ అని. అంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయమే అధికం అని అర్ధం. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల పారితోషికంతో పాటు ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ నటి శ్రీలీల. కన్నడ సినీ రంగం నుంచి నటిగా కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అలా తొలి చిత్రంతోనే తన చలాకి నటన, రంజింపజేసే డ్యాన్స్తో కుర్రకారును ఆకట్టుకున్నారు. అలా అక్కడ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న ఈ భామ పరాశక్తి చిత్రంతో కోలీవుడ్కు పరిచయమయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా కథానాయకిగా ఎదిగారు. దీంతో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. యూత్ ఫుల్ క్రేజ్ హీరోయిన్లకు ఇన్స్ట్రాగామ్ ఫాలోవర్స్ మామూలుగా ఉండరు. అలా శ్రీలీలకు 17 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ప్రతిఫలాన్ని శ్రీలీల అధికంగానే పొందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను శ్రీలీల ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకు రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అలా ఈ అమ్మడు నెలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
డిఫరెంట్ అవుట్ఫిట్లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు
-
హాఫ్ శారీలో లెనిన్ భామ భాగ్యశ్రీ బోర్సే అందాలు.. ఫోటోలు
-
సిస్టర్ పెళ్లిలో ఖుషీ కపూర్ స్టైలిష్ అవుట్ఫిట్.. ఫోటోలు
-
వైజాగ్లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
-
మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)
-
రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్స్క్రిప్షన్'పై తెలుగు హీరోయిన్
కొన్నిరోజుల క్రితం ఇన్స్టా 'సబ్స్క్రిప్షన్' వల్ల యాంకర్ విష్ణుప్రియ ఎంతలా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బులు తీసుకుని అర్థనగ్న ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేస్తుందని చెప్పి ఈమెపై పోలీసులకు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు తన సబ్స్క్రిప్షన్ అకౌంట్లో ఎలాంటి కంటెంట్ పెడతారనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చేసింది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)తన సబ్స్క్రిప్షన్ ఛానెల్పై వస్తున్న అపోహలపై క్లారిటీ ఇచ్చిన పాయల్.. ఎలాంటి రొమాంటిక్ కంటెంట్ లేదా హాట్ పిక్స్ ఉండవని స్పష్టం చేసింది. తెర వెనుక తన నిజమైన జీవితం, అన్ఫిల్టర్డ్ మూమెంట్స్ని మాత్రమే అభిమానులతో పంచుకుంటానని చెప్పింది. తన వ్యక్తిగత హద్దులను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్పుత్.. తర్వాత వెంకీమామ, ఆర్డీఎక్స్ లవ్, డిస్కో రాజా, జిన్నా, మాయపేటిక, మంగళవారం తదితర మూవీస్ చేసింది. ప్రస్తుతం 'కిరాతక' అనే చిత్రంలో నటిస్తోంది.(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
చీరకే అందం తీసుకొచ్చిన శ్రుతిహాసన్ (ఫొటోలు)
-
కుందనపు బొమ్మలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు)
-
సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)
-
నిన్ను మిస్సవుతున్నా: బర్త్డే వేడుకలపై పీవీ సింధు పోస్ట్
-
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్!
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం.. మెటాను వివరణ ఇవ్వాలని కోరింది.ఈ విషయంపై సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులకు మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ లేదా అలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికల్లో ఉండటం చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వారం మెటాపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్లో యూజర్నేమ్ ఫీచర్ తీసుకురావాలన్న మెటా నిర్ణయంపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఆన్లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ దాడులు ఎక్కువ కావచ్చు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం సులభమవుతుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ను అమలు చేయవద్దని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.భారత ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అక్రమ కంటెంట్ను అరికట్టడం, వినియోగదారుల భద్రతను కాపాడడం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మెటాకు హెచ్చరించింది. -
ఆలయంలో చీరల ప్రమోషన్ రీల్స్..
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం ఓ మహిళ చీరల ప్రమోషన్ కోసం వీడియో చేయడం వివాదాస్పదమైంది. ఓ యువతి యువకుడు దేవస్థానంలో ఓ బోటిక్ ప్రమోట్ చేయడం కోసం వీడియోలు తీశారు. ఆ యువతి ధరించిన చీరను ప్రమోట్ చేసేందుకు బోటిక్ సంగతులు పంచుకుంటూ కావాల్సిన వారు ఆ బోటిక్ను సంప్రదించవచ్చని ప్రమోషన్ వీడియో తీశారు. నృసింహుని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం ఓ రకమైన ఆధ్యాతి్మక ప్రశాంతత, దైవచింతనను అనుభవిస్తుంటారు. అయితే ఇలాంటివారి కారణంగా భక్తులు ఇబ్బంది పడడమే కాకుండా ఆధ్యాత్మికతను పాడుచేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ను వివరణ కోరగా జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దేవస్థానంలో రీల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు. -
స్క్రీన్కు దూరం – లైఫ్కు దగ్గర!
2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)
-
అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)
-
హీరోయిన్ లయ ఫ్యామిలీ టైమ్ (ఫొటోలు)
-
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
-
థాయ్ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
-
సూపర్స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
-
కేన్స్లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
-
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
-
థానా రామయ్య... నువ్వు చాలా గ్రేటయ్యా!
నీళ్లు కూడా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో డెబ్బై ఏడేళ్ల థానా రామ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రాజస్థాన్కు చెందిన థానా రామ్ గత రెండు దశాబ్దాలుగా బాటసారులకు ఉచిత నీరు అందిస్తున్నాడు. బార్మర్లోని రద్దీ రహదారి వెంబడి రోడ్డు దాటుతున్న ప్రజలకు చల్లటి తాగు నీరు బాటిళ్లను అందిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.బార్మర్–బటాడు మార్గంలో బస్సు ప్రయాణీకులు, ట్యాక్సీ డ్రైవర్లు, బాటసారుల కోసం ప్రతిరోజూ ఖాళీ బాటిల్స్లో చల్లటి తాగునీరు నింపుతూ కనిపిస్తాడు థానా రామ్. వేసవిలో ఉష్ణోగ్రతలు రోజూ 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఈ ప్రాంతంలో థానా రామ్ చేసే సహాయం ఎంతోమందికి ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ పని కోసం ఆయన విరాళాల సేకరించడం లేదు. తాను చేస్తున్న పనికి ప్రచారం రావాలని కూడా అనుకోలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో చాలామందికి థానా రామ్ గురించి తెలిసింది. -
మెదక్ ఇన్స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్
సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఇన్స్టా, ఫేస్బుక్లో కొత్త రూల్స్!
డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్)లలో కొత్త భద్రతా అప్డేట్స్ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! -
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
-
ఇన్స్టాగ్రామ్లో ‘మనదే’ అంతా!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది.Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN— Jash (@jeetcasm) June 16, 2026మీమ్ నుంచి గ్లోబల్ క్రేజ్ దాకా.. మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Melodi అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్ట్యాగ్ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.మెలోనీకి టాఫీలు!ఈ మెలోడీ ఫినామినన్ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.వైరల్ కెమిస్ట్రీఅంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ కపుల్" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్ అయ్యింది. -
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క రీల్కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా!
భారతదేశంలో ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా స్టాండ్ అప్ కమెడియన్లు ఈ రంగంలో తిరుగులేని రారాజులుగా ఎదుగుతూ, సంపాదన పరంగా మిగిలిన వారందరినీ వెనక్కి నెట్టేస్తున్నారు. కేవలం డిజిటల్ వినోదానికే పరిమితం కాకుండా, బ్రాండ్ విలువను అమాంతం పెంచేస్తూ వాణిజ్యపరంగా అత్యంత డిమాండ్ ఉన్న క్రియేటర్లుగా మారుతున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో వినిపిస్తున్న కొన్ని నమ్మశక్యం కాని సంపాదన గణాంకాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.ఒక్క ఇన్స్టా రీల్కు రూ. 80 లక్షల రేంజ్పరిశ్రమ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ సమయ్ రైనా ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన కామెడీ క్రియేటర్గా అవతరించారు. ఆయన ఒకే ఒక్క బ్రాండెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏకంగా రూ. 70 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్లో అత్యధిక కమర్షియల్ వాల్యూ ఉన్న టాప్ క్రియేటర్లలో ఆయన ఒకరిగా నిలిచారు.స్టోరీలు, స్టాటిక్ పోస్టులకు కూడా లక్షల్లోనే డిమాండ్ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్లకు (కోటి మందికి) పైగా ఫాలోవర్లను కలిగిన సమయ్ రైనా సోషల్ మీడియా రేట్లు పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేయడానికి ఆయన రూ. 20 లక్షలకు పైగా వసూలు చేస్తుండగా, ఒక సాధారణ స్టాటిక్ పోస్ట్ కోసం రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీనిని బట్టి క్రియేటర్ల మార్కెట్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యంప్రస్తుతం ప్రకటనకర్తలు కేవలం రీచ్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులతో బలమైన కనెక్షన్, కల్చరల్ రెలవెన్స్ అందించగల కామెడీ క్రియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సమయ్ రైనా ప్రస్తుతం బోల్డ్ కేర్, కేఎఫ్సీ, ఫ్లిప్కార్ట్, టిండర్, బోట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఇది ఆయనకున్న మార్కెట్ క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తున్నది.యూట్యూబ్ రికార్డులను తిరగరాసిన 'స్టిల్ అలైవ్'గత ఏప్రిల్ నెలలో సమయ్ రైనా విడుదల చేసిన ‘స్టిల్ అలైవ్’ అనే స్టాండ్-అప్ స్పెషల్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. చిన్నతనంలో బుల్లీయింగ్, కశ్మీరీ పండిట్ గుర్తింపు, మానసిక ఆరోగ్యం, ఆయన కెరీర్లో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదాల తాలూకు పరిణామాల వంటి సున్నితమైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ వీడియోకు యూట్యూబ్లో 63 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒకే అప్లోడ్పై వచ్చిన వ్యూస్ ఆధారంగా, ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ఫుల్-లెంగ్త్ స్టాండ్-అప్ కామెడీ స్పెషల్గా ఇది రికార్డు సృష్టించింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ వివాదం తర్వాత కూడా ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో ఈ విజయం నిరూపించింది.రేసులో దూసుకుపోతున్న ప్రాంతీయ కమెడియన్లుఈ భారీ సంపాదన కేవలం జాతీయ స్థాయి స్టార్లకే పరిమితం కాలేదు, ప్రాంతీయ క్రియేటర్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మరాఠీ కమెడియన్ ప్రణిత్ మోరే దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన ప్రాంతీయ కామెడీ క్రియేటర్లలో ఒకరిగా నిలిచారు. ఇటీవలే ఆయన ‘రూ. 370 బిరియాని’ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇన్స్టాగ్రామ్లో సుమారు 30 లక్షల (3 మిలియన్) ఫాలోవర్లు ఉన్న మోరే, ఒక స్టోరీకి రూ. 2.5 లక్షలకు పైగా, స్టాటిక్ పోస్ట్కు రూ. 4 నుంచి 5 లక్షలు, అలాగే ఒక బ్రాండెడ్ రీల్ కోసం రూ. 13-14 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. వీరితో పాటు అభిషేక్ ఉపమన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, డానిష్ సైత్ వంటి ప్రముఖులు కూడా బ్రాండ్ పార్ట్నర్షిప్లలో టాప్ రేట్లు అందుకుంటున్నారు.మారుతున్న కామెడీ బిజినెస్ రూపురేఖలుగడిచిన ఐదేళ్లలో కామెడీ బిజినెస్లో ఊహించని మార్పులు వచ్చాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు చిన్న క్లబ్ పెర్ఫార్మెన్స్ల నుండి పెద్ద పెద్ద అరీనా షోల వరకు లైవ్ కామెడీ షోలను చూసేందుకు భారీగా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీనివల్ల క్రియేటర్లు కేవలం డిజిటల్ ప్లాట్ఫారమ్లపైనే ఆధారపడటం తగ్గింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న భారతీయ సంతతి ప్రేక్షకుల ఆదరణ కారణంగా గ్లోబల్ టూర్లు వీరికి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ తరహా పెద్ద టూర్ల ప్లానింగ్ సాధారణంగా 8 నెలల నుండి ఏడాది ముందే జరిగిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు.ఇది కూడా చదవండి: భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్! -
హీరోయిన్ పేరుతో ఫేక్ అకౌంట్.. ఫ్యాన్స్కు అలర్ట్
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్ నంబర్తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు కూడా గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సూర్యకుమార్ను అన్ఫాలో చేసింది. టిట్ ఫర్ టాట్ అన్న తరహాలో సూర్యకుమార్ కూడా తన ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ఫాలో చేయడమే గాక పేజీ నుంచి ముంబై ఇండియన్స్కు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలను తొలగించాడు. ప్రస్తుతం సూర్య ఇన అకౌంట్లో దీంతో ముంబై ఇండియన్స్తో సూర్యకుమార్కు బంధం ముగిసినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం అభిమానులు నిద్రలేచేసరికే ఇదంతా జరిగిపోవడంతో సూర్యకుమార్కు బ్యాడ్టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొన్న కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవమానిస్తే.. ఇవాళ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ను అన్ఫాలో చేసి అవమానించిందని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.సూర్యకుమార్ బయోను అభిమానులు పరిశీలించి చూడగా.. అతడి బయోలో ముంబై ఇండియన్స్తో పాటు ముంబై అనే పదాన్ని కూడా తొలగించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్కు సంబంధించి కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శర్మలతో కలిసి దిగిన ఫొటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్యకుమార్ అన్ఫాలో చేయడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్లాడిన సూర్యకుమార్ 270 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతడి ఖాతాలో రెండు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చిన సూర్యకుమార్ అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా ముంబైకే ఆడుతూ వచ్చాడు. ఇందులో ముంబై రెండుసార్లు (2019, 2020) ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాను మూడోసారి టీ20 చాంపియన్స్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అతడి టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి దూరమయ్యేలా చేసింది. శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ను చేయడంతో ఇక టీమిండియాలో సూర్యకుమార్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు అటు సూర్యకుమార్ కానీ.. ఇటు ముంబై ఇండియన్స్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సూర్యకుమార్ ముంబైని వీడుతాడా లేదా ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too. What's cooking? pic.twitter.com/PL6ErA6tDc— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026 -
మీనాకుమారి పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. రిమాండ్ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఇన్స్ట్రాగామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పిటిషనర్ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ వివరాలను భద్రపరచాలని కోరారు. హోం జీపీ మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామర్.. చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..!
ఇట్స్ మై డ్రీమ్ అంటోన్న అనన్య నాగళ్ల..చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..కాశీలో బిగ్బాస్ బ్యూటీ అశ్వినీ శ్రీ పూజలు..మంచుకొండల్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ పోజులు.. View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Archana Ravichandran (@iam_archanaravichandran) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
వైభవ్ సూర్యవంశీ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్
-
ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ కొత్త ఫీచర్ మీకోసం!
ఫొటో–షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ‘ఆ క్షణంలో తీసిన ఫొటోలను, ఫిల్టర్ చేయని, సహజమైన ఫొటోల రూపంలో స్నేహితులతో షేర్ చేసుకోవడానికి కొత్త మార్గం’ అని ‘ఇన్స్టంట్స్’ గురించి అభివర్ణించింది ఇన్స్టాగ్రామ్. యాప్ ఇన్బాక్స్ ద్వారా నేరుగా తాత్కాలిక ఫొటోలను పంపడానికి యూజర్లను ఈ ఫీచర్ అనుమతిస్తుంది.సాధారణ, రోజువారీ ఫొటోలు మీ స్నేహితులు చూడడానికి ఇది ఒక కొత్త మార్గం. వారు చూసిన తరువాత ఫొటోలు మాయమైపోతాయి. ఇన్స్టంట్స్ మీ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ బాటమ్ రైట్ కార్నర్లో ఉంటుంది. కెమెరాపై టాప్ చేయడం ద్వారా ఫ్రెండ్స్, మ్యూచువల్స్ (మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్) ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. ‘ఇన్స్టంట్స్’ని నచ్చిన వారితో పాటు నచ్చనివారు కూడా ఉన్నారు.నచ్చకపోతే... ‘ఇన్స్టంట్స్’ను టర్న్ ఆఫ్ చేయడానికి...ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్స్లోకి వెళ్లాలి.టాప్ రైట్ కార్నర్లోని 3 లైన్స్పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ ఓపెన్ చేయాలి.కంటెంట్ ప్రిఫరెన్సెస్–స్క్రోల్ డౌన్‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ ఇన్బాక్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ బాక్స్’ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఇన్బాక్స్ నుంచి ఇన్స్టంట్స్ తొలగించవచ్చు.ఇన్స్టాగ్రామ్ క్యారెసెల్..ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ని తీసుకువచ్చింది. దీని ద్వారా క్యారెసెల్స్ క్రియేట్ చేయవచ్చు. వాటికి మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఇమేజ్ ఎడిట్ చేయవచ్చు. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఈ కొత్త ఫీచర్ ‘ఫీడ్’ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే...ఇన్స్టాగ్రామ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లోని ‘ప్లస్’ ఐకాన్ క్లిక్ చేయాలి.‘పోస్ట్’పై క్లిక్ చేయాలి.మినిమమ్ రెండు పిక్చర్లను సెలెక్ట్ చేసుకోవాలి.క్లిక్ నెక్స్›్టమల్టిపుల్ ఎడిటింగ్ టూల్స్ కనిపిస్తాయి.మీ చిత్రాలు నిలువుగా (పోర్ట్రెయిట్) చతురస్రాకారంలో ఉండడానికి అవసరమైన టూల్స్ ఎంచుకోవచ్చు. ఫొటోలను ఓవర్లే చేయవచ్చు. టెక్ట్స్, మ్యూజిక్ జోడించవచ్చు. ఎడిటింగ్ పూర్తయ్యాక... ‘నెక్ట్స్’పై క్లిక్ చేసి ఫొటోలను పోస్ట్ చేయడానికి ‘షేర్’పై క్లిక్ చేయాలి. -
ప్లేఆఫ్స్ చేరని పంజాబ్.. అర్ష్దీప్ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. లీగ్ దశలో పంజాబ్ తమ చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ, ముంబైపై రాజస్తాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరని నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ అర్ష్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను చాలా వరకు క్లియర్ చేశాడు. దాదాపు 200 పోస్టులను ఇన్స్టా ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోహ్లీతో కలిసి రీల్ చేసిన వీడియోను తొలగించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీతో చేసిన రీల్ దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే అర్ష్దీప్ ఉన్నపళంగా తన ఇన్స్టా నుంచి పోస్టులు తొలగించడం వెనుక బలమైన కారణముంది. లీగ్ స్టేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పంజాబ్ స్పిన్నర్ చాహల్.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన తర్వాత ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే యాజమాన్యం కఠిన సూచనలు చేసింది. అందుకే అర్ష్దీప్ తన పోస్టులను తొలగించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో అర్ష్దీప్ సింగ్ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్లాడిన అర్ష్దీప్ కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు. అందునా ప్రతీ మ్యాచ్లోనూ ఓవర్కు దాదాపు 10 పరుగుల పైనే సమర్పించుకున్నాడు.Arshdeep Singh to Virat Kohli ; Paaji run km rah gye century pakki thi. Kohli ; Toss jeet gye nhi to teri bhi pakki thii dew mein 🤣#INDvSA #ViratKohli pic.twitter.com/hSxkG4ma5n— Ali Tweets (@ali_tweets05) December 6, 2025చదవండి: క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన! -
కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామరస్ పిక్స్(ఫోటోలు)
-
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..పర్పుల్ కలర్ డ్రెస్ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్ పోజులు..లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..సిస్టమ్ టీమ్తో జ్యోతిక చిల్..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by @natasastankovic__ -
వైట్ డ్రెస్లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
కర్రసాము చేస్తోన్న సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి ..వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ అందాలు..స్పెయిన్ వీధుల్లో ఆషిక రంగనాథ్ చిల్.. ఎల్లో శారీలో బిగ్బాస్ రీతూ చౌదరి అందాలు.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
‘ఇన్స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీని దాటేసిన క్రేజ్!కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్ను భారత్లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ స్పందించారు.సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమంనిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్వర్క్బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్మెంట్ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ! -
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.VIDEO | Thanjavur, Tamil Nadu: DMK chief MK Stalin says, "TVK leader Vijay became CM by influencing children through Instagram, without even appointing booth agents properly."(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HhI7ofAjeY— Press Trust of India (@PTI_News) May 18, 2026'డిజిటల్ సునామీ'తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశఅధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
విడాకులపై ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..!
ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. -
మరో వివాదానికి తెరలేపిన ఎలాన్ మస్క్
ఇన్స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమేనంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్లైన్ ట్రెండ్స్పై జరుగుతున్న ఒక వైరల్ చర్చకు స్పందిస్తూ పురుషులను ఎగతాళి చేసే విధంగా కామెంట్స్ చేశారు. మనుషుల ఆన్లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై చర్చ నడిచింది.రోజంతా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో వండిన వంటకాల ఫోటోలను అప్లోడ్ చేయడం, ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ను ఆ థ్రెడ్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కొంతమంది మగవాళ్లు తమ ఇన్స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుందంటూ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.LmaoInstagram is for girls— Elon Musk (@elonmusk) May 15, 2026దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వగా.. మస్క్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ అంతా ఫేక్ మాత్రమే కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు. -
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
జిమ్ డ్రెస్లో నభా నటేశ్.. అనన్య నాగళ్ల స్మైలీ లుక్స్..!
జిమ్ డ్రెస్లో హీరోయిన్ నభా నటేశ్..సద్గురు ఫౌండేషన్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..స్మైలీ లుక్స్తో హీరోయిన్ అనన్య నాగళ్ల పోజులు..వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్..వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Prakriti 💫 (@prakritikakar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు
-
విష్ణుప్రియ స్టన్నింగ్ పోజులు.. శారీలో పుష్ప బ్యూటీ పావని..!
రెడ్ డ్రెస్లో యాంకర్ విష్ణు ప్రియ స్టన్నింగ్ పోజులు..ఏప్రిల్ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యషిక ఆనంద్..శారీలో మరింత అందంగా పుష్ప బ్యూటీ పావని..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ నుస్రత్..చీరతో ముసుగేసిన ఐటమ్ సాంగ్ గర్ల్ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
మాములోడు కాదు..! ఈ స్కామ్ లో వాడి తల్లి కూడా ఉంది
-
గ్రీన్ డ్రెస్లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్ఫిట్లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్ఫిట్లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
జ్ఞాపకాల్లో మెగా డాటర్ నిహారిక.. శారీలో సీతారామం బ్యూటీ..!
మూవీ ఈవెంట్లో మెరిసిన పాయల్ రాజ్పుత్..బిగ్బాస్ సావిత్రి ఇంట 21 రోజుల వేడుక..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిఖా సురేంద్రన్..శారీలో మృణాల్ ఠాకూర్ హోయలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రాశి ఖన్నా హోయలు.. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
చిరుత హీరోయిన్.. డబ్బు కోసం ఇదేం పని..?
బాలీవుడ్ నటి నేహా శర్మ సోషల్మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత కుర్రాడు మూవీ మాత్రమే తెలుగులో చేసింది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ అయిపోయింది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేకమైన కంటెంట్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చింది. దీంతో యూత్ను తప్పుదోవ పట్టిస్తోందని ఆమెపై విమర్శలు వచ్చాయి.నేహా శర్మను సుమారు 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఆమె ప్రత్యేకంగా షేర్ చేసే కంటెంట్ను పొందేందుకు మాత్రం 10వేల వరకు వినియోగుదారులు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. అందుకోసం నెలకు రూ. 299 చెల్లిస్తున్నారు. అంటే నెలకు రూ. 30 లక్షల వరకు ఆమె సంపాధిస్తుంది. అయితే, ఆమె అభిమానుల్లో కొందరు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.నేహా శర్మ ఒక ప్రతిష్టాత్మక కుటుంబానికి చెందినది కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె తండ్రి అజిత్ శర్మ రాజకీయ నాయకుడు కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఆర్థికంగా బాగానే ఉన్న నేహా.. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను ఎందుకు క్రియేట్ చేసిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.నెహా శర్మపై ఒక యూజర్ విరుచుకుపడింది. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అంటూ.. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని కోరింది. బహుశా ఇలాంటి వారిని ప్రోత్సహించే ప్రదేశం భారతదేశం మాత్రమే కావచ్చని అభిప్రాయ పడింది. మరొకరు ఇలా రాశారు, "ఇది ఆమెకు సులభంగా డబ్బు సంపాదించే మార్గం. పైగా, దీనికి డిమాండ్ కూడా ఉంది. ఇది విచారకరం, కానీ వాస్తవం ఇదే." అంటూ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..
ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..) View this post on Instagram A post shared by Vrutika Patel (@vrutikaapatel) -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
‘ఝాల్మురీ’కి విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 9 కోట్ల వ్యూస్ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్ సెర్చ్లో ‘ఝాల్మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. -
ఇన్స్టా పోస్ట్కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్
-
రిచ్ అమ్మాయిలే టార్గెట్..స్టైలిష్ ఫోటోలు పెట్టి 10 మందిని బోల్తా కొట్టించిన కేటుగాడు
-
అతని టార్గెట్ బంజారాహిల్స్ అమ్మాయిలే..!
హైదరాబాద్: సంపన్న వర్గాల బాలికలే లక్ష్యంగా వల విసురుతాడు. వారిని ప్రేమలోకి దింపుతాడు. ఆపై వ్యాపారం పేరుతో రూ.లక్షలు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తున్నాడు. ఇలా బాలికలు, యువతులను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆదివారం జూబ్లీహిల్స్కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని గుంటూరుకు చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ (29) కూకట్పల్లిలో ఉంటూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. జూబ్లీహిల్స్కు ఓ బాలికను చంద్రశేఖర్ ఆజాద్ ఎలియాస్ అర్జున్ ఇన్స్టా్రగామ్లో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నాంటూ వెంటబడ్డాడు. తరచూ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం గత ఏడాది ఏప్రిల్లో బాలిక తల్లికి తెలియడంతో చంద్రశేఖర్పై జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన తర్వాత మళ్లీ బాలికను కలుసుకున్నాడు. స్టార్టప్ పెడుతున్నానంటూ ఆమె నుంచి రూ.13.11 లక్షలు వసూలు చేశాడు. రూ.9 లక్షలు గుంజిన కారు డ్రైవర్ భార్య.. బాలికకు తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేయడంతో.. కారు డ్రైవర్తో పాటు ఆయన భార్య ఫోన్ల నుంచి చంద్రశేఖర్కు ఫోన్లు చేసేది. ఈ విషయంలో డ్రైవర్ భార్య.. చంద్రశేఖర్తో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులతో చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రూ.9 లక్షలు వసూలు చేసింది. ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ బాలికతో ప్రేమలో ఉండగానే నార్సింగికి చెందిన మరో యువతితో చంద్రశేఖర్ తిరగసాగాడు. ఇలా ఇద్దరి నుంచి ముగ్గురు యువతులను ప్రేమలోకి దింపి వారిని మోసగించి రూ.లక్షల్లో డబ్బులు లాగేవాడు. ఈ క్రమంలో ఓ కారు కూడా కొనేసి అమ్మాయిలతో తిరుగుతూ తాను ధనవంతుడినంటూ నమ్మబలికేవాడు. బాధిత బాలిక ఇచి్చన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద జూబ్లీహిల్స్ పోలీసులు రెండోసారి చంద్రశేఖర్ను రిమాండ్కు తరలించారు. మరో యువతి ఫిర్యాదు.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ చంద్రశేఖర్పై మరో యువతి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి బంగారు గొలుసు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 69, 318 (2) కింద కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ను నార్సింగ్ ఠాణాకు బదిలీ చేశారు. ప్రేమ పేరుతో చంద్రశేఖర్ ఇప్పటివరకు సుమారు 10 మందిని మోసగించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. -
బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్
రీసెంట్ టైంలో ఇన్స్టా సబ్స్క్రిప్షన్తో యాంకర్ విష్ణుప్రియ లాంటి వాళ్లు లక్షలు సంపాదిస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఇందులో భాగంగా రూ.399 కడితే అర్థ నగ్న వీడియోలు పోస్ట్ చేస్తుందనే ఆరోపణలతో ఈమెపై విజయవాడలో కేసు కూడా పెట్టారు. ఈ ఫిర్యాదు మాటేమో గానీ ఈ వివాదం జరగక ముందు విష్ణుప్రియకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగారు. ఈమె సంగతి పక్కనబెట్టి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లపై పడ్డారు.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)వకీల్సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్స్టా సబ్స్క్రిప్షన్ పేరిట లక్షల సంపాదించేస్తుందని విష్ణుప్రియని వదిలేసి ఈమెపై పడ్డారు. దీంతో తప్పక ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను ఈ సబ్స్క్రిప్షన్ని మొదలుపెట్టింది అంతా ఓ కమ్యూనిటీలా కలిసి ఉండేందుకే అని చెప్పుకొచ్చింది.అలానే తన దినచర్యలో చేసే వాటి గురించి చెప్పేందుకే ఈ సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టానని చెబుతూ.. గతేడాది ఏప్రిల్ 7వ తేదీన పోస్ట్ చేసిన వీడియోని ఇప్పుడు షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య.. ఓం నమః శివాయ మంత్రాన్ని 21 రోజులు 108 సార్లు చదివితే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతూ కనిపించింది.అలా 2025లోనే సబ్స్క్రిప్షన్ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ అనన్య క్లారిటీ ఇచ్చింది. ఇన్స్టా సబ్స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని, అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ద్వారా తను సబ్స్క్రిప్షన్లో గ్లామరస్ ఫొటోలు గానీ, బూతు కంటెంట్ గానీ పోస్ట్ చేయట్లేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడైనా ఈమెపై విమర్శలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
బ్లాక్ శారీలో నిహారిక అందాలు.. కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ..!
కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా హోయలు.. View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanoor Sana Begum (@shanoor_sana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు, 40ఏళ్ల వితంతువు చేసిన పని నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సోషల్మీడియా పరిచయం పెళ్లికి దారి తీసింది. మరి వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? నెటిజన్లు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకుందాంఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 'రీల్స్' చాటింగ్ ద్వారా వీరి పరచయం కాస్తా ప్రణయంగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇరు కుటుంబ సహ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా, గుడిలో పెళ్లి చేసుకున్నారు.కలిసి జీవితం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం అబ్బాయి తల్లికి తెలిసింది. ఆగ్రాలోని మహిళ ఇంట్లో ఇద్దరినీ గుర్తించారు. కానీ కుటుంబ సభ్యులు ఈ యువకుడిని ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనిపై నెటిజనులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇది నిజమైన ప్రేమా లేక కేవలం తాత్కాలిక ఆకర్షణా? 19 ఏళ్ల వయసు వ్యత్యాసం, రహస్య వివాహం ఎంతవరకు నిలబడుతుంది అని కొందరు ప్రశ్నించగా, కుటుంబ మద్దతు లేకుండా ఇంత పెద్ద అడుగు వేయడం కష్టమే, అని ఒకరు వర్చువల్ చాటింగ్, రీల్స్ను చూసి నిజజీవితంలో నిజమని నమ్మితే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇన్స్టాలో పరిచయం అయిన ఒక మహిళ కోసం తన కుటుంబాన్ని, ఇంటిని త్యాగం చేశాడు. సోషల్ మీడియాలో కలిసిన ఒక అపరిచితుడి కోసం ఏ అబ్బాయి లేదా అమ్మాయైనా తమ తల్లిదండ్రులను, విలువలను పణంగా పెట్టడం పచ్చి అవివేకం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత దూరమైనా వెళతాయి అనేందుకు ఈ ఘటనే నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానించారు ఇద్దరూ చట్టపరంగా వయోజనులే, కాబట్టి వారి వివాహం చట్టబద్ధమే. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా వారే భరిస్తారు. కానీ వీరి సంబంధం కలకాలం నిలబడాలంటే అధిక భావోద్వేగ పరిపక్వత, బలమైన విశ్వాసం అవసరమని నిపుణులు చెబుతున్న మాట.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?
ఆదిలాబాద్టౌన్: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.‘లైక్’ల కోసం..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ వైద్యులు, వారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్చల్ కావడంతో రిమ్స్లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఫోన్లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
పోలీస్ కేసు.. విష్ణుప్రియకే కలిసొచ్చింది!
సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, ఇన్ స్టాలో తన అర్థనగ్న వీడియోలు, అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తుందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయడం లాంటి అంశాలతో ఈమె గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. అయితే తనపై వస్తున్న నెగిటివ్ పబ్లిసిటీని కూడా అనుకూలంగా వాడేస్తుండటం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది.(ఇదీ చదవండి: అంతా రెండో భాగంలోనే.. 'రామాయణ'పై యష్ కామెంట్స్)షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ.. తర్వాత టీవీ షోలకు యాంకర్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్ షోకి వెళ్లొచ్చింది గానీ అదేమంత ఈమెకు కలిసి రాలేదు. అయితే ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట నెలకు రూ.399కు అసభ్యకర ఫొటోలని పోస్ట్ చేస్తుందనే ఆరోపణలు ఈమెపై వచ్చాయి. ఈ వివాదం జరిగే సమయానికి ఈమెని 1892 మంది అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండగా.. పోలీసు కేసు హడావుడి మూలంగా ఇప్పుడు ఆ సబ్స్కైబర్స్ సంఖ్య దాదాపు 5 వేలకు చేరింది.చూస్తుంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ, పోలీసు కేసు లాంటివి విష్ణుప్రియకే ప్లస్ అయిందేమో అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానని బాధపడాలో, తనకు ఆదాయం తెచ్చే సబ్స్క్రైబర్స్ పెరిగారని ఆనందపడాలో తెలియని అయోమయ స్థితిలో ఈమె ఇప్పుడు ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఈమెకు ఇన్ స్టా ద్వారా రూ.7 లక్షల ఆదాయం వస్తుండగా.. ఇప్పుడు అది ఏకంగా రూ.17 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు) -
టీచర్.. మీ స్టూడెంట్ని నా చివరి కోరిక తీరుస్తారా..!
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): ఇన్స్టాలో పరిచయమైన యువకుడు, మహిళ (40) చేత బలవంతంగా న్యూడ్ కాల్ చేయించి, ఆపై బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఈ సంఘటన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగింది. వివరాలు.. ఎల్రక్టానిక్ సిటీల టీచర్గా పని చేస్తున్న ఆమెకి, ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి చెందిన యువకుడు అర్షద్ (37) ఇన్స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని కొంతకాలం మంచివాడిగా చాటింగ్ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్ వచ్చిందని, చివరి కోరికగా నీతో గడపాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్గా వీడియో కాల్ అయినా చేయాలని కోరాడు. వీడియో సేవ్ చేసుకుని.. అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్ చేసింది. అయితే కాల్ను రికార్డు చేసుకున్న దుండగుడు.. నీ న్యూడ్ వీడియో నా వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు తరచుగా అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే కొన్నిరోజులుగా వేధింపులు పతాకస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది, వెంటనే పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. తన అవయవాలను కోసుకుంటానని పోకిరీ కొంతసేపు హల్చల్ చేశాడు. -
ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు
తెలుగు యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై ఫిర్యాదు రావడంతోనే ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)అసలేం జరిగిందంటే?ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పలు షోలతో అలరించే విష్ణుప్రియ, కాసులకు కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
ట్రంప్పై మీమ్ల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్తో ట్రంప్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్’ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇప్పుడీ మీమ్స్ తెగ షేర్ అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్. అంతా తగలబడినా మీరే గెలిచారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ కొద్దిసేపు పోస్ట్లుపెట్టకపోతే ‘‘సార్. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్ చేయండి. లేదంటే మాకు మహా బోర్ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్తో నవ్వించింది. -
వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి.. పింక్ శారీలో మెగా కోడలు..!
రిసార్ట్లో చిల్ అవుతోన్న శాన్వీ మేఘన..పింక్ శారీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి పోజులు..నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్స్..పల్లిచట్టంబి ప్రమోషన్స్లో బిజీగా కయాదు లోహర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
రిషబ్ శెట్టి అన్ ఫాలో వివాదం.. మంచిపని చేశాడు..!
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే రిలీజైన హనుమాన్ పోస్టర్ చూస్తే రిషబ్ శెట్టి లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి చేసిన ఓ పని వివాదానికి దారి తీసింది. ఆయన పని చేసిన కాంతార టీమ్ నటీనటులను ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రెండు రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. హీరోయిన్ రుక్మిణి వసంత్తో పాటు రాజ్ .బి.శెట్టిని కూడా అన్ ఫాలో చేశాడు. దీంతో రిషబ్కు.. నిర్మాణ సంస్థతో ఏమైనా విభేదాలు వచ్చాయా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.ఈ వివాదం నేపథ్యంలో రిషబ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను కూడా అన్ ఫాలో చేసేశారు. తాను ఫోలో అవుతున్న ఇన్స్టా లిస్ట్లో ఉన్న అందరినీ అన్ ఫాలో చేసి క్లియర్ చేశారు. రిషబ్ ఇప్పుడు కేవలం మూడు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. అందులో ఒకటి తన భార్య ప్రగతి శెట్టి.. మరొకటి తన ప్రొడక్షన్ హౌస్తో పాటు రిషబ్ శెట్టి ఫౌండేషన్ను ఫాలో చేస్తున్నారు. ఈ చర్యతో రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్వుడ్లో మరోసారి చర్చకు దారితీసింది. అయితే దీనిపై రిషబ్ శెట్టి గానీ.. హోంబలే ఫిల్మ్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలేం జరిగిందన్ననది తెలియాలంటే నిర్మాణ సంస్థ కానీ.. రిషబ్ శెట్టినో క్లారిటీ ఇవ్వాల్సిందే. కాగా.. కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి) View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
నైట్కి ఎంత తీసుకుంటావు!
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు రోజురోజుకూ మరింత బరితెగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దానిని మరువకముందే తాజాగా బిగ్బాస్–8 మహిళా కంటెస్టెంట్ను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో ఐటీడీపీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఓ అసభ్యకర పోస్టు పెట్టారు. గత ఆదివారం రాత్రి 11.21 గంటల సమయంలో ‘నైట్కి ఎంత తీసుకుంటావు? సుఖంతోపాటు డబ్బులు కూడా ఇస్తా’ అంటూ బిజ్జవరపు ప్రవీణ్కుమార్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే బావమరిదినని చెప్పుకొంటున్న ఐటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్ తీరుపట్ల ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే కింది స్థాయి నాయకులు కూడా మరింత బరితెగించి రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. -
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హెబ్బాపటేల్ గ్లామరస్ లుక్.. వేకేషన్లో ధనశ్రీ వర్మ చిల్..!
బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతి బేబీ బంప్ లుక్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ పునర్నవి..హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ పిక్స్..వేకేషన్లో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..హీరోయిన్ సమంత స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే
-
ఆమెకు 35, అతనికి 25 .. భర్తను వదిలేసి!
ఏలూరు జిల్లా: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చిరునవ్వులు.. డ్యాన్సులు..
‘‘పెళ్లి వేడుకల తర్వాత మేం కొన్నాళ్లు తీరికగా గడపాలనుకున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, గుడికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, అభిమానులతో విందు, మీడియాని ప్రత్యేకంగా కలవడం... ఇలా వివాహ వేడుకలతో బిజీ బిజీగా గడిపిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. అందుకే థాయ్ల్యాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు. అయితే ఈ నూతన జంటతో పాటు వీరి స్నేహితులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రశాంతమైన ఉదయాలు, ఈతతో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ మరియు పూల్ గేమ్స్తో సాయంత్రాలు, సినిమాలతో రాత్రిళ్లు... ఇలా చిరునవ్వులతో సమయం గడిచి΄ోయింది. కో సామ్యూయ్ మాకు ఇల్లులానే అనిపించింది. ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఆ ఆనంద క్షణాలు’’ అని పేర్కొని, ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక కొన్ని ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ‘మై హజ్బెండ్’ అని విజయ్ని రష్మిక పిలవడం, విజయ్ నవ్వుతూ చూడడం, ఇంకా రష్మిక కోసం విజయ్ పిజ్జా తయారు చేయించి, ఇవ్వడం, ఇద్దరూ డ్యాన్స్ చేయడం, చిరునవ్వులు చిందించడం, మాట్లాడుకోవడం వంటి విజువల్స్ ఉన్నాయి. -
మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
అనసూయ ఉగాది వైబ్స్..థాయ్లాండ్ వేకేషన్లో అభినయ..!
టాలీవుడ్ నటి అనసూయ ఉగాది వైబ్స్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉగాది లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఉగాది పోజులు..టాలీవుడ్ నటి హంసానందని ఉగాది సెలబ్రేషన్స్..థాయ్లాండ్ వేకేషన్లో టాలీవుడ్ నటి అభినయ.. View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)


