సాక్షి హైదరాబాద్: మల్లాపూర్లో తప్పుడు ప్రచారంతో తమను బురిడీ కొట్టిద్దామని చూసిన నిర్వాహకులకు ప్రజలు దేహశుద్ధి చేశారు. మల్లాపూర్లో రూ.26 వేలకే కారు అందిస్తామని కొద్దిరోజుల ఇన్స్టాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నమ్మిన ప్రజలు ఈ రోజు ( సోమవారం) పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది. దీంతో ఆగ్రహాం చెందిన ప్రజలు కర్రలతో నిర్వాహాకులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతిపజేశారు. అనంతరం నిర్వాహకులను అదుపులోకి తీసుకొని నాచారం పీఎస్కు తరలించారు.



