సాక్షి, హైదరాబాద్: షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకు చెల్లింపులు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి కోర్టు వాయిదా వేసింది.


