కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్‌ కలకలం.. | Missing Children In Kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్‌ కలకలం..

Mar 7 2026 7:25 PM | Updated on Mar 7 2026 8:58 PM

Missing Children In Kamareddy

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మిస్సింగ్‌ అయిన వాళ్ళంతా 10ఏళ్ల లోపు పిల్లలే. సింహాద్రి(10), కోదండ విజయ్(3) నిన్నటి నుంచి మిస్సింగ్ కాగా, ఇవాళ ఉదయం ముగ్గురు ఆడ పిల్లలు సీపల్‌(8), మరియం(5), ఆయాత్‌(7) అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన చిన్నారులు తిరిగి రాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement