మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో యూజీ విద్యార్థులు డయేరియా బారిన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్లోని హాస్టల్లో ఉంటున్న 25–30 మంది యూజీ విద్యార్థులు 4 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వీరు చికిత్స పొందినట్లు సమాచారం.
ఇందులో 20 మంది విద్యార్థుల్లో కొద్దిపాటి డయేరియా లక్షణాలున్నాయని, వారు ఒక్కరోజు చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా, మరో 9 మంది విద్యార్థులకు ఎక్కువ లక్షణాలు కనబడడంతో వారు 2 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి టెస్ట్లకు పంపారు. అలాగే, నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం గుంటూరులోని ల్యాబ్కు పంపినట్లు సమాచారం.


