Guntur District News
-
యోగాపై ప్రజలకు అవగాహన
నెహ్రూ నగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు అవగాహన కల్పించనుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు చేపట్టిన యోగాంధ్రలో గుంటూరు జిల్లా, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటక ప్రాంతాలైన ఉండవల్లి గుహలు, మంగళగిరి ఎకో పార్క్లలో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనేలా చేయడమే కార్యక్రమాల ఉద్దేశం అన్నారు. గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బుధవారం నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైజాగ్, గుంటూరులో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారు యోగాంధ్ర వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీపీఓ డా.సైమన్, డీపీఎం(ఇన్చార్జి) డా.జయరామ్ కృష్ణ, డెమో జయ ప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్.వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి గుహల వద్ద బుధవారం యోగాపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరు ఇన్చార్జి జిల్లా కలెక్టర్ భార్గవ్ తేజ పలువురు అధికారులతో కలిసి గుహలను పరిశీలించారు. -
యువకులపై టీడీపీ నాయకుడి దాడి
అనుచరులతోనూ దాడి చేయించి గాయపరిచినవైనం సాక్షి టాస్క్ఫోర్స్: యువకులపై టీడీపీ నేత దాడి చేసి, అనంతరం అనుచరులతో కూడా తీవ్రంగా కొట్టించి గాయపరిచిన సంఘటన గుంటూరు నగరంలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్కు సంబంధించి సెవెన్ హిల్స్ మెడికల్ షాపు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్సు వద్ద ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు కొన్ని నెలల కిందట అక్కడ మానేసి వేరే షాపులో చేరాడు. హోల్సేల్ మెడికల్ షాపు నుంచి అతడు సరకు తీసుకొస్తున్న సమయంలో వాటికి సంబంధించిన బిల్లులను సెవెన్హిల్స్ షాపునకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ పంపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆ యువకుడిని షాపు వద్దకు పిలిపించారు. డేగల ప్రభాకర్తోపాటు కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతోపాటు కొట్టినట్లు సమాచారం. దాడికి గురైన యువకుడు తన బంధువులు తదితరులతో కలిసి మంగళవారం ఉదయం షాపు వద్దకు వెళ్లారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ డేగల ప్రభాకర్, అతని అనుచరులు మరోమారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిసింది. టీడీపీ నేత కొత్తపేట పోలీసులకు ఫోన్ చేయగా, గాయపడిన యువకుడిని పోలీసులు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. యువకుడిని బెదిరించి కేసు రాజీ చేసినట్లు తెలిసింది. గాయపడిన యువకుల పేర్లు, వివరాలు తెలియరాలేదు. దీనిపై కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.వీరయ్యచౌదరిని వివరణ కోరగా గొడవ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో క్రీడాకారులు ఈ ఘన విజయం సాధించారని తెలిపారు. -
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజరు
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షకు 21,590 మందికిగాను 20,765; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
సహకార సంఘాల అభివృద్ధికి కృషి ముఖ్యం
జిల్లా సహకార అధికారి వెంకటరమణ నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థులకు మంగళవారం స్కాలర్షిప్పులు పంపిణీ చేశారు. కళాశాల 1972 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి రూ. 15 వేల చొప్పున ఏడుగురికి స్కాలర్షిప్పుగా అందించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి వాటిని అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మరొకరికి చదువుకునేందుకు సాయం చేయాలని సూచించారు. దాతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు, డాక్టర్ కె.ఎల్.ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు
తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల తీరుకు బీఎస్పీ ఖండన తెనాలి: ఒక కేసులోని ముద్దాయిలను తెనాలి పోలీసులు అత్యుత్సాహంతో బహిరంగంగా హింసించటాన్ని బీఎస్పీ నాయకులు ఖండించారు. స్థానిక అయితానగర్లోని పొట్టి శ్రీరాములు పార్కులో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్చార్జి తెనాలి ప్రకాష్, జిల్లా నాయకులు గూడవల్లి. మణికుమారి, చిరుతనగండ్ల వాసు, తెనాలి బాధ్యుడు కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడారు. నిందితులను చిత్రహింసలకు గురిచేయడం దారుణం కానిస్టేబుల్ చిరంజీవిపైనా ఇప్పటికే పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ బాధిత కుటుంబానికి పార్టీ జిల్లా కమిటీ నేతల పరామర్శ -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి భేష్
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీలు -
నేడూ పొగాకు రైతుల నిరసన
చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.నేడు కోటప్పకొండలో యోగాంధ్రనరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.విజయకీలాద్రిపై సుదర్శన హోమంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుపట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు.శని జయంతి పూజలుమంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.ఎంపీహెచ్ఏలకు బదిలీగుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు. -
మళ్లీ కరోనా కలవరం
జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదు కరోనా పేరు చెబితేనే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మళ్లీ ఇటీవల దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూడా మూడు కరోనా కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నూతనంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రదేశాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ గుంటూరు మెడికల్ కరోనా వ్యాప్తి చెందకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొవిడ్–19 నాటి నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నూతన కరోనా వైరస్ సైతం ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెనాలిలో ఫీవర్ సర్వే జిల్లాలో తెనాలికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తెనాలిలో ఫీవర్ సర్వే చేయిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఏలూరుకు చెందిన మరో ఇరువురు సైతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. లక్షణాలు ఇవీ... చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. తుమ్ములు, దగ్గుతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు, ఆయాసం, ఛాతీ పట్టివేయడం వంటివి కరోనా వ్యాధి బాధితుల్లో కనిపిస్తున్నాయి. వారం దాటితే వైద్యులను సంప్రదించాలి నార్మల్ ఫ్లూ మాదిరిగానే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వారానికి మించి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తమా, డయాలసిస్, షుగర్, బీపీ, కిడ్నీ, గుండె జబ్బు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మాస్క్లు ధరించడం, తగినంత నీటిని తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు ఆదేశాలు ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల సూచన వ్యాధి బాధితులకు గుంటూరు జీజీహెచ్లో నిర్ధారణ పరీక్షలు జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. దగ్గినా, తుమ్మినా తప్పనిసరిగా ముఖానికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. చేతులను తరచుగా సబ్బుతో, శానిటైజర్తో మంచిగా శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. సరిపడా నీరు తాగాలి. కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నిత్యం తాగడం మంచిది. తగినంత నిద్రించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా ఔషధాలు వేసుకోవద్దు. -
జంట హత్యలపై కట్టు కథలు
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై ప్రభుత్వం, పోలీసులు కట్టు కథ అల్లారు. కేసు ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలను ఎలాగైనా వైఎస్సార్ సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై నెట్టాలన్న దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసుగా స్పష్టమవుతోంది. హత్యలపై మృతుల అల్లుడు, టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో హత్యకు గల కారణం గ్రామ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతోనే జరిగిందని తన తొలి మాటల్లోనే తెలిపాడు. మృతుడు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్యను హతమారిస్తే టీడీపీలో నాకు ఎదురు ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో ఓ కట్టుకథకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హత్యలో పాల్గొన్న నిందితులు జెవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజులు హత్య చేసిన అనంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును చూసి కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజంగా కారులో కత్తులే ఉంటే బండరాళ్లతో ఎందుకు మోది చంపుతారు, కత్తులే వాడే వారు కదా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. పోతూ పోతూ ‘‘ నా కొ..రా వచ్చేది మా వైఎస్సార్ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం, మాతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు.’’ అంటూ కత్తులు చూపి బెదిరిస్తూ పోయారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరు లు కుట్ర పన్ని ఉంటే ఎవరైనా ఇలా చెబుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా చేర్చడానికి ప్రభుత్వం, పోలీసుల కుట్రగా అర్థమవుతోంది. మరోవైపు హత్య జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయులు మీడియాతో మాట్లాడిన వీడియోలో మేము రావడం చూసి పారిపోయారని చెప్పాడు తప్ప నిలబడి బెదిరించారని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్యే ఒత్తిడితో మరుసటి రోజు ఫిర్యాదు సమయానికి మాట మార్చాడని అర్థమవుతోంది. నిందితులు పోతూపోతూ అన్నారని చెబుతున్న కట్టుకథలు తప్ప పన్నెల్లి సోదరుల పాత్రపై ఆధారాలు దొరకలేదు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ అని పసుపు పచ్చ రంగులో స్టిక్కర్ ఉన్న టీడీపీ నేత తోట వెంక్రటామయ్య కారు దొరికింది. ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షి హత్యలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే అని స్పష్టం చేశాడు. ఇన్ని ప్రాథమిక ఆధారాలున్నా రాజకీయ కక్షతోనే పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసినట్టు అర్థమవుతోంది. ఎస్పీపై ఆగ్రహం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుపై పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ తెలిపారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో ఎస్పీపై వ్యతిరేక కథనాలు రాయించి బెదిరించే ధోరణిని ఎమ్మెల్యే జూలకంటి అవలంబించాడు. వైఎస్సార్ సీపీ నేతలపై తాను చెప్పినట్టు కేసులు నమోదు చేయకపోవడం వల్లే హత్యలు జరిగాయంటూ ఆరోపించారు. ఎస్పీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాలో లీక్లు ఇచ్చి బెదిరించి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తోంది. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అంటూ తేల్చిన పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడితో మాట మార్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూలకంటి అసమర్థతే కారణం మా వెంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడంటూ హంతకుల బెదిరింపు మేము రావడం చూసి హంతకులు పారిపోయారంటూ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరుసటి రోజు మాట మార్చి తప్పుడు ఫిర్యాదు టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెవిశెట్టి సోదరుల హత్య అంటూ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన జెవిశెట్టి వెంకటేశ్వర్లుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరగొట్టినా పట్టించుకోని ఎమ్మెల్యే దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన తోట వెంకట్రామయ్య ఇరువర్గాల మధ్య రాజీ చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిన్నెల్లి సోదరులపై కుట్ర గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యకు స్థానిక ఎమ్మెల్యే అసమర్థతే కారణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కొంత కాలంగా గుండ్లపాడు పార్టీలో తారస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు నెలలుగా అది ముదిరి దాడుల వరకు దారి తీసింది. అందులో భాగంగా గత నెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుపై హత్యకు గురైన జెవిశెట్టి మొద్దయ్య వర్గీయులు దాడి చేసి రెండు కాళ్లు విరిగగొట్టారు. అయినా మొద్దయ్యను ఎమ్మెల్యే ఏమనకపోవడం, పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నాడన్న బాధ తోట వెంకట్రామయ్య వర్గంలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు తాను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం లేదని, మొద్దయ్య మాటకే విలువిస్తున్నాడని వెంకట్రామయ్య ఒకరిద్దరు టీడీపీ స్థానిక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేసుకున్న తర్వాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తమను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలు అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు(బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తర్వాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి నకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, డీఏఓ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. ధ్రువీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకువస్తారు. పోలీసులు, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు -
ప్రారంభం కాకుండానే పగుళ్లు
● నాసిరకంగా ప్రత్తిపాడు పీహెచ్సీ నిర్మాణ పనులు ● రూ.6కోట్లతో నిర్మాణం ● నెర్రెలిచ్చిన గోడలు, పిల్లర్లు.. పగిలిన ప్రహరీ ● చెమ్మగిల్లుతున్న గోడలు ప్రత్తిపాడు: ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టరు ఇష్టారాజ్యం.. వెరసి రూ.6 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆస్పత్రి భవనం పగుళ్లిస్తుంది. 2022లో ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణకు రూ.6కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. శిథిల భవనం స్థానంలో పెద్ద నూతన భవనం నిర్మించడంతో పాటు పక్కనే ఉన్న మరో భవనంపై రెండవ అంతస్తును కూడా నిర్మించారు. ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. చివరి దశలో ఉన్న ఈ నిర్మాణ పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల వైఫల్యం బయట పడుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు భవనాలను జాయింట్ చేసిన చోట నుంచి వాటర్ లీక్ అవుతుంది. వాననీరు ఆస్పత్రి గదుల్లోకి చేరుతుంది. అంతేకాకుండా అనేక గదుల్లో గోడలు పగిలిపోయి, చెమ్మగిల్లి పెయింట్లు పెచ్చులూడి కనిపిస్తుంది. కాగా ఓ చోట ఏకంగా పిల్లరు పగుళ్లిచ్చింది. మరో చోట పిట్టగోడ పగిలిపోయి దర్శనమిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వలనే పగుళ్లు, చెమ్మలు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా భవనం ప్రారంభం కాకముందే ఇన్ని లోపాలు బయటపడుతుండటంతో భవనం నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్ స్టేట్.. అవర్ లీడర్ సభ్యుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్ రెడ్డి సోమవారం డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్ఏలోని అవర్ స్టేట్ – అవర్ లీడర్ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్ స్టేట్ – అవర్ లీడర్, ఇంటలెక్చువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, ప్రసాద్ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసు కోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతు లు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు వైఎస్ జగన్ పొదిలి రాను న్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తా రని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు జి.రఘురామగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
లక్ష్మీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సత్వరం పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి కేంద్ర మంత్రి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 222 అర్జీలు వచ్చాయి. అర్జీల స్వీకరణ అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందన్నారు. ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇకపై గోల్డెన్ డే గా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని కొందరు దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రముని, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు ఇవ్వాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నా, జిల్లాలో ఇప్పటికీ విత్తనాల పంపిణీ, కౌలురైతుల గుర్తింపు, గ్రామసభల నిర్వహణ వంటి ప్రక్రియలు చేపట్టలేదు. రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వెంటనే 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు రైతులకు అందజేయాలి. – కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీయానిమేటర్ పై చర్యలు తీసుకోవాలి డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రతి నెల బ్యాంక్లో జమ చేయాల్సిన నగదును, శ్రీనిధి, ఉన్నతి వంటి బ్యాంక్ రుణాలకు సంబంధించి కొన్ని నెలలుగా కట్టాల్సిన రూ.15లక్షలను మా గ్రూపు నుంచి వసూలు చేసుకున్న యానిమేటర్ బి.శ్యామల వాటిని బ్యాంకులో జమచేయలేదు. బ్యాంక్లో మళ్లీ రుణం పొందేందుకు వెళ్లిన మాకు బ్యాంకు వారు విషయం చెప్పడంతో ఆమెను నిలదీస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు పరారీలో ఉంది. కాకుమాను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు యానిమేటర్ ఎక్కడుందో మమ్మల్నే వెతికి సమాచారం చెప్పాలని బదులు చెబుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లితే కేసు పెట్టుకోమని చెబుతున్నారు. యానిమేటర్ను పట్టుకుని, మాకు న్యాయం చేయాలి. – ప్రశాంతి డ్వాక్రా గ్రూపు, శ్రీ సత్యన్నారాయణ గ్రూపు సభ్యులు, గరికపాడు, కాకుమాను మండలం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్తో కలిసి అర్జీలు స్వీకరణదివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి స్థానిక బృందావన్ గార్డెన్స్లో వున్న దివ్యాంగుల వసతి గృహాన్ని తనిఖీ చేయాలి. అంధులు, దివ్యాంగులను వసతి గృహాంలోకి రానివ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారు. విచారించి, వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా లో 2016 వికలాంగుల చట్టం అమలు కావడం లేదు. చట్టం అమలు అయ్యేలా చూడాలి. విభిన్న ప్రతిభావంతులకు అన్ని కార్యాలయాల్లో స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. – విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులు -
స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయండి
లక్ష్మీపురం: జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి వైకుంఠపురం వరకు నావిగేషన్ ఛానల్–4లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సర్వే పూర్తి అయిన వెంటనే పెనుమాక, రాయపూడి, వెంకటాయపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెంలో ఇసుక పూడికతీతకు బోట్స్మెన్ సొసైటీకి కేటాయింపుపై సాంకేతిక నివేదికను వారంలో అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. లింగాయపాలెం స్టాక్ పాయింట్ను నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు పెండింగ్లో ఉన్న ఇసుక లిఫ్టింగ్ చార్జీలను తహసీల్దారు నుంచి నివేదిక అందించిన వెంటనే మంజూరు చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల సర్వే పూర్తి చేయాలి రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్లు పథకం సర్వేపై సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరైన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డులపై వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు, అన్నదాత సుఖీభవ పథకంపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఏఓ నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏపీఆర్జేసీ సెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులకు సంస్థ కార్యదర్శి బీఎన్ మస్తానయ్య ఆదేశాల మేరకు ఆంధ్ర రీజియన్లోని ఏపీఆర్ జూనియర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను ఏపీఆర్జేసీ సెట్ కన్వీనర్ హెచ్ఎండీ ఉబేదుల్లా పర్యవేక్షించారు. ఆంధ్ర రీజియన్ పరిధిలోని తాటిపూడి బాలికల కళాశాల, నిమ్మకూరులోని కో–ఎడ్యుకేషన్, నాగార్జునసాగర్లోని బాలుర కళాశాల, గుంటూరు, వెంకటగిరిలోని బాలుర జూనియర్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 299 సీట్లకు 1:5 నిష్పత్తిలో 1,328 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలువగా, వారిలో మొదటి రోజు ఎంపీసీ, ఐఐటీ కోర్సులకు 131 బాలురు, 33 మంది బాలికలు హాజరై ఆయా కళాశాలల్లో సీట్లను కోరుకున్నారు. కాగా మంగళవారం బైపీసీ, బుధవారం ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజన, తాగునీటి వసతులు కల్పించారు. తుళ్లూరులో 28.8 మి.మీ వర్షం కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 28.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లిలో 0.6 మి.మీ వర్షం పడింది. సగటున 3.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం మండలంలో 17.4 మి.మీ., తాడికొండ 8.2, ప్రత్తిపాడు 5.8, గుంటూరు తూర్పు 1.2, గుంటూరు పశ్చిమలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70 శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. బ్లైండ్, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింద కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం ఇచ్చి.. కఠిన నిబంధనలతో మోకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీతో పాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినది పోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దారుణం. – కె.బసవలింగారావు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడువైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధనలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
మాచవరం: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లుట్ల గ్రామానికి చెందిన కాండ్రకుంట ఐశ్వర్య (33), కామినేటి సుజాతలతో పాటు మరి కొంత మహిళలు పొలం పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో నర్రా బాలు పిడుగురాళ్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా కాండ్రకుంట ఐశ్వర్య (33) మృతి చెందింది. తీవ్ర గాయాలైన సుజాతను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రోశయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతు.. పోలీసుల ముమ్మర గాలింపుఅచ్చంపేట: కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని గింజుపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపరి సైదారావు(43) మరికొంత మందితో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మ తల్లి దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుని, కానుకలు సమర్పించి అక్కడే భోజనాలు వండుకుని తిన్నారు. సుమారు మూడు గంటల సమయంలో సమీపంలోని గింజపల్లి వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టేందుకు మరో 10మందితో దిగాడు. సైదారావు నది లోతుల్లోకి వెళ్లిపోగా దగ్గరలో ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో చేపల పడవల ద్వారా ఆదివారం రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మృతుడు కూలి పనే వృత్తిగా జీవిస్తుంటాడు. సైదారావుకు భార్య, బీటెక్ చదివే కుమారైలు ఇద్దరు ఉన్నారు.సంపులో పడి బాలుడి మృతిలక్ష్మీపురం: సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గుంటూరు కొత్తకాలనీకి చెందిన ఒడిశా వాసుల కుమారుడు రాఘవకుమార్ (5) ఆడుకుంటూ ఓ సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి కోసం తవ్విన సంపుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులుకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు ప్రారంభించారు. తీరా సంపులో పరిశీలించగా రాఘవకుమార్ అందులో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులు చేయబోమని, పోస్ట్మార్టం అవసరం లేదని చెప్పి బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
తిరునాళ్లలో మైక్ అనుమతికి నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబును, ఎస్ఐ అనిల్ కుమార్ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వెఎస్సార్సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి -
విశ్రాంత జడ్జిని బెదిరించిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: విశ్రాంత జడ్జి స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంపాలెం స్టార్ గరల్స్ హైస్కూల్లో నివాసం ఉంటున్న విశ్రాంత జడ్జి జోసఫ్ స్థలాన్ని నగరంపాలెం ప్రాంతానికి చెందిన అంబేడ్కర్ ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో జోసఫ్ నగరంపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షం ●ప్రత్తిపాడులో 27.4 మి.మీ. వర్షం ●సగటున 17.9 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 27.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో 9.6 మి.మీ . కురిసింది. సగటున 17.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మే నెల 25వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 184.7 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. గుంటూరు తూర్పు 26.4 మి.మీ., ఫిరంగిపురం 25.2, గుంటూరు పశ్చిమ 24.2, దుగ్గిరాల 22.6, తెనాలి 22.4, పెదకాకాని 21.4, పొన్నూరు 20.6, కొల్లిపర 17.4, పెదనందిపాడు 15.6, చేబ్రోలు 15.4, వట్టిచెరుకూరు 14, కాకుమాను 13.8, తాడికొండ 12.6, మేడికొండూరు 11.4, తాడేపల్లి 11.4, తుళ్లూరు మండలంలో 10.8 మి.మీ. చొప్పున కురిసింది. సందడిగా మీరక్ వసంతం నగరంపాలెం: స్థానిక రింగ్రోడ్డు శుభం కల్యాణ మండపంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ఆధ్వర్యంలో మీరాక్ వసంతం వైభవంగా నిర్వహించారు. తంబోలా, టేబుల్గేమ్స్, ఫ్యాషన్ షో, పాటలు పోటీలు, కుర్చీలాట, అభరణాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదర్శ అధ్యక్షురాలు పోలిశెట్టి రత్నప్రియ, కార్యదర్శి వల్లూరి హిమబిందు, కన్వీనర్ మట్ట ప్రియ, మట్టుపల్లి సునీత పాల్గొన్నారు. మీరక్ వసంతం ద్వారా సేకరించిన నిధులు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ ఆరు, ఏడు తరాల్లో ఆ కళకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు కళల తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్చంద్ అన్నారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుంచి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు చెప్పారు. బీఎఫ్ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. సభకు ముందు ‘ఆపరేషన్ సిందూర’ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ సాంస్కృతిక కార్యక్రమం ప్రశంసలను అందుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. సత్కార సభలో ప్రముఖుల అభినందన -
మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు -
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా‘ కారుమూరు’
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. నియోజకవర్గంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, పెద్ద సంఖ్యలో వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తులు రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు. టికెటు ఉంటేనే అంతరాలయ దర్శనం రూ. 500 టికెటు ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు. దుర్గగుడిలో ఉదయం 11.30 నుంచి వీఐపీ దర్శనాలు నిలిపివేత -
మాటల్లోనే ఇంపు.. ఊరంతా కంపు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా పారిశుద్ధ్యం నెహ్రూనగర్: నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు ఉండటానికి వీల్లేదని.. అవి కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలే బాధ్యత వహించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ నగరంలోని పలు చోట్ల గార్బేజ్ పాయింట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం ఉంది. ఎక్కడ చూసినా వ్యర్థాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చెత్తను రోడ్లపై వేయకుండా గ్రీన్ పట్టాలు కట్టించారు. దీనివల్ల కూడా ఉపయోగం కనిపించడం లేదు. ఫిర్యాదులు రావడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను మాత్రం తొలగించే మార్గాలు అన్వేషించడం లేదు. నామమాత్రంగా పర్యవేక్షణ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు కోసం ప్రత్యేకంగా అధికారులను కేటాయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలతోపాటు ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇంత చేసినా ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు. పర్యవేక్షణ నామమాత్రంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వయస్సు 60 ఏళ్లు దాటిందనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో మిగిలిన వారిపై పని భారం పడుతోంది. దీంతో పారిశుద్ధ్యం ఆశించిన స్థాయిలో లేదు. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో నగరానికి మెరుగైన స్థానం సాధించేందుకు డంపర్ బిన్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో చెత్తను సకాలంలో తరలించేందుకు నగర పరిధిలో 39 ట్రాక్టర్లు, 18 కంప్యాక్టర్ బిన్లను వినియోగిస్తున్నారు. అవసరం పేరుతో అదనంగా కొన్ని ట్రాక్టర్లు అద్దెకు కూడా తీసుకున్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను రోడ్ల మీద వేయకుండా ఎప్పటికప్పుడు తరలించాలని కమిషనర్ ఆదేశాలకే పరిమితం అయ్యారు. చెత్త మాత్రం రోడ్డు మీద కనిపిస్తూనే ఉంది. దీనిపై ప్రజారోగ్యధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శాశ్వత చర్యలు తీసుకుంటేనే.. 2011 లెక్కల ప్రకారం నగరంలోని 7.50 లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం కార్మికులు పనిచేస్తున్నారు. 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ఇప్పుడు నగరంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇళ్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకు ఉంది. 2011 జనాభాకు తగ్గట్లుగా 2 వేల మంది మాత్రమే కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఇంత చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు కార్మికులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజల నుంచి చెత్త సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు అదనంగా 225 మంది కార్మికులను నిత్యం రూ.500 చొప్పున ఇచ్చేలా నియమించారు. వీరిలో ఎక్కువమంది నామమాత్రంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధానమైన ప్రాంతాల్లోనే పారిశుద్ధ్యం మెరుగ్గా చూపించి, ఇతర కాలనీల్లో గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా చూడకుండా ౖపైపెన అధికారుల స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం కనిపించదని నగరవాసులు పేర్కొంటున్నారు. తగినంతమంది సిబ్బందిని నియమించి, పర్యవేక్షణ సక్రమంగా చేస్తేనే చెత్త సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.గృహాల సంఖ్య : సుమారు 3 లక్షలు శానిటరీ డివిజన్లు : 32 మైక్రో ప్యాకెట్లు : 802 నిత్యం వచ్చే చెత్త : 470 మెట్రిక్ టన్నులు వార్డు సచివాలయాలు : 207 పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య : 2,000 ట్రాక్టర్లు : 39 చెత్త తొలగింపులో మున్సిపల్ యంత్రాంగం దారుణంగా విఫలం అదనంగా కార్మికులను పెట్టామని చెబుతున్నా ఫలితం అంతంతే ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ప్రజలకు నానా కష్టాలు రోజుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా మెరుగుపడని పరిస్థితి ప్రజారోగ్యంపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల మాటలు చూస్తే ఎంతో ఇంపుగా ఉంటున్నాయి. ఆచరణలో చూస్తే మాత్రం నగరమంతా దుర్వాసన వచ్చేలా ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా కనిపిస్తోంది. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచన నిజంగానే ఉంటే శాశ్వత చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం అయ్యే వీలుంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ సమాచారం -
నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్
మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అందజేశారు. ముగిసిన హనుమాన్ దీక్షలు నగరంపాలెం: స్థానిక మారుతీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్ హవనము మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషేకం, కల్యాణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుక అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గేట్ మేన్పై సస్పెన్షన్ వేటు నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్మేన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్మేన్ నిర్లక్ష్యంపై లోకో పైలట్ గుంటూరు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్మేన్ ఆర్. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు. తిరుపతమ్మ ఆలయంలో రద్దీ పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు వండుకొని భోజనాలు తిన్నారు. -
ఏటా నష్టాలు.. అప్పులే..
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు రూరల్ మండలానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే రైతు 2021లో బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.80 వేలు రుణం తీసుకున్నారు. మూడు రోజుల క్రితం రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లగా మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అప్పు చేసి రూ.1.20 లక్షలు చెల్లించారు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో తీసుకున్న రుణాలకు రెన్యూవల్ కష్టాలు తప్పడం లేదు. రుణాల చెల్లింపు విషయంలోనైనా కూటమి ప్రభుత్వం స్పందించి మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. బ్యాంకర్లు అనేక కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. బ్యాంకుల్లో తీసుకొన్న అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెడుతున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 529 బ్రాంచ్లు ఉంటే.. వీటిలో 16 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఐదు లక్షల ఖాతాలు పంట రుణాలు తీసుకునే రైతులవి. వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్ పేరుతో రైతులను వేధిస్తున్నారు.మొత్తం చెల్లిస్తేనే ...పది శాతం బ్యాంకులు మినహా.. మిగిలినవి రెన్యూవల్ విషయంలో రుణగ్రహీతలను ముప్పుతిప్పలు పెట్టి వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్లు రావడంతో బ్యాంకులకు రుణగ్రహీతలు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక రెన్యూవల్ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లించాలని చావు కబురు చల్లగా చెబుతున్నారు. అప్పుడే రెన్యూవల్ చేస్తామని మెలిక పెడుతున్నారు. చాలా మంది అష్టకష్టాలు పడి మొత్తం చెల్లించి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ తిరిగి రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణగ్రహీతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడెళ్లినా రేపు రమ్మని చెప్పి తప్పించుకుంటున్నాయి. సీ–బిల్, ఈకేవైసీ, ఇతర వివరాలను సాకు చూపి జాప్యం చేస్తున్నాయి.వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకునే వారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 శాతం మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకుతెరువు కోసం పట్టాదారు పాసుపుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయం వృద్ధి చేసుకుంటున్నారు. బోర్లు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, వివిధ రకాల పంటల సాగుకు అవసరమయ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి.. మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు.. కన్నీళ్లు తప్పడం లేదు. అటు కూటమి ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ తీవ్ర వైఫల్యం చెందింది. ఇకనైనా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.గతంలో రెన్యూవల్ ఇలా..గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారం విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు.మినహాయింపు ఇవ్వాలిఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది గుంటూరు నగరంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్కు సంబంధించి మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ మొత్తం చెల్లించాలన్నారు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి, 15వ తేదీన రెన్యూవల్ చేయించా. ఈ నిబంధన నుంచి మినహాయించాలి. –ఎం.నరేంద్ర, గుంటూరువ్యవసాయ రుణ వివరాలు ఇలా..వ్యవసాయ, బంగారు నగలపై రుణాలకు రెన్యూవల్ కష్టాలు పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక పెడుతున్న బ్యాంకు సిబ్బంది గతంలో వడ్డీ చెల్లిస్తే చాలు రెన్యూవల్ పెట్టుబడి సాయం అందక, గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే రైతులకు కష్టాలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుకొత్త విధానం అమల్లో ఉందికొత్త విధానం గతేడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాలి. ప్రస్తుతం వడ్డీ మాత్రమే చెల్లించి రెన్యూవల్ చేయించుకునే పద్ధతి లేదు. దీనికి సంబంధించి పలు సమస్యలు వస్తున్నాయి.– గూడెం మహిపాల్రెడ్డి, ఎల్డీఎం, గుంటూరు జిల్లా -
ప్రసన్నాంజనేయునికి విశేష పూజలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేక పూజ చేశారు. అనంతరం 1,008 అరటి పండ్లతో విశేష పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రికి గుంటూరు శ్రీ స్రవంతి సంగీత కళాశాల వారి శ్రీరామాంజనే యుధ్ధం, శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటికలను ప్రదర్శించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 1,008 అరటిపండ్లతో విశేష పూజా కార్యక్రమం -
27వ రోజుకు సీహెచ్ఓల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): వైద్య ఆరోగ్య శాఖ ఎన్హెచ్ఎంలో ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నామని, రెండేళ్లుగా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు, జిల్లా ఉపాధక్షరాలు జి.వనజ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద డీఎంఅండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలన్నారు. అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షరాలు టీ ప్రవళిక, జిల్లా నాయకురాలు జోత్స్న మాట్లాడుతూ ఇన్ని రోజులుగా తీవ్రమైన ఎండలలో కూడా నిరవధిక సమ్మె చేస్తున్న సీహెచ్ఓలను పట్టించుకోకుండా, జీతాలు వేయకుండా, ఇన్సెంటివ్లు వేయకుండా తీవ్ర మనోవేదనకు కూటమి ప్రభుత్వ అధికారులను గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షరాలు జి.వనజ, జిల్లా నాయకులు సంధ్య, దీక్షిత, రవితేజ, జీవనజ్యోతి, కె లక్ష్మి, రత్నకుమారి, క్వీన్, స్వప్న, కె.లక్ష్మి, శివ నాగేంద్రమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. స్పందించని కూటమి ప్రభుత్వం -
నాటికల పోటీలు ప్రారంభం
నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలను జీబీఆర్ హ్యాచరీస్ చైర్మన్ గడ్డం బుచ్చారావు, ఈదర పెద్దబ్బాయి ప్రారంభించారు. తొలిరోజు విశాఖపట్నం కళాభినయ బృందం ఆధ్వర్యంలో ‘ఓ కాశీవాస రావయ్య’ నాటిక ప్రదర్శించారు. రచయితగా పీటీ మాధవ్, దర్శకుడిగా శ్రీకవి ప్రసాద్ వ్యవహరించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శించారు. రచయితగా ఆకురాతి భాస్కర్చంద్ర, దర్శకుడిగా నడింపల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సామాజిక దృక్పథానికి అద్దం పట్టేలా రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు వ్యవహరించారు. కార్యక్రమాలను మువ్వా సురేష్, బండారుపల్లి సత్యనారాయణ, ఆలోకం పెద్దబ్బాయి, బండ్ల రాంచంద్, చెరుకూరి ఫణికుమార్, శాఖమూరి బాజిబాబు, బొల్లు వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం ఈతరం ఉన్నత పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నలుగురు సెల్ఫోన్ దొంగలు అరెస్టు గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గవర్నర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పూసుగూడేనికి చెందిన బత్తుల రాజు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజకు చెందిన బండారి లక్ష్మీనారాయణ, నరసరావుపేట సంజీవయ్య కాలనీకి చెందిన ఉప్పు ఎల్లయ్య, గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన తిరుపతి వెంకట దుర్గారావులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. వీరంతా పోలీసు కంట్రోల్ రూం సమీపంలో నడిచి వెళ్లే ప్రయాణికులను బెదిరించి సెల్ఫోన్లు లాక్కుని వెళ్లి పోతుంటారని సీఐ అడపా నాగమురళి తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
పట్నంబజారు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ చెప్పారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా పరిశీలకులుగా నియమితులై తొలిసారి గుంటూరు వచ్చిన పోతిన మహేష్కు నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణు గోపాలరెడ్డి, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లా పరిధిలోని పలు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా జిల్లా, నగర, నియోజకవర్గాల కమిటీల నియామకం త్వరితగతిన పూర్తి చేసేలా చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పరిశీలకులుగా తనపై నమ్మకంతో నియమించిన వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి మంగళగిరిలోని నియోజకవర్గంలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి సర్కార్ సంవత్సర పాలనలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని మండి పడ్డారు. ఈ ఏడాది కాలంలో కేవలం రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో పాలన కొనసాగించారని పేర్కొన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 3వ తేదీ వరకు గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు– 1 , 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తిరిగి హామీ ఇచ్చిన ఏకై క సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. మిర్చి, పొగాకు, పత్తి రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, సీడీ భగవాన్, ఈమని రాఘవరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, తాడిబోయిన వేణు, విజయ్, నందేటి రాజేష్, మామిడి రాము, శేషగిరి పవన్కుమార్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కొరిటెపాటి ప్రేమ్కుమార్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే
గుంటూరు లీగల్: పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనని, సమాజంలో పౌరులుగా మనందరి బాధ్యత కూడా అని న్యాయ సేవా సదన్ సెక్రెటరీ సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. పిల్లలు జాగ్రత్తగా ఉండేందుకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు చేశారు. క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు జియావుద్దీన్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. పిల్లలు తప్పిపోవడం అనేది తల్లిదండ్రులు, సమాజానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కనిపించకుండా పోతున్నారని, వారిలో కొంతమంది తిరిగి వచ్చినా చాలా మంది జాడ తెలియయరాలేదని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం మూడు సంవత్సరాలలో 10వేలకుపైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2022లో 83,350 మంది చిన్నారులలో 62,946 మంది బాలికలు ఉన్నారని, ప్రతి నలుగురు పిల్లలలో ముగ్గురు బాలికలున్నారని వెల్లడించారు. ప్యానల్ అడ్వకేట్ కె.కాళిదాసు మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసిజర్ పోలీస్ యూనిట్ ఎలా పనిచేస్తుంది, పిల్లలు తప్పిపోతే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి, పిల్లలు ట్రేస్ కాకపోతే ఆ కేసును సీఐడీకి ఎలా బదిలీ చేయాలో వివరించారు. జిల్లా పంచాయత్ ఆఫీసర్ సాయికుమార్, డీపీఓ, శిశు సంక్షేమ శాఖ విజయ్కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమాన్ సాయి మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను కాలయాపన లేకుండా ఎలా ట్రేస్ చేయగలమో వివరించారు. బాల కార్మికులుగా పనిచేసే పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించి, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దవచ్చునో వివరించారు. కార్యక్రమలో అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ప్యానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. న్యాయ సేవా సదన్ సెక్రెటరీ సయ్యద్ జియావుద్దీన్ -
దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం
– సగటున 25.3 మి.మీ. వర్షపాతం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పొన్నూరు మండలంలో 8.6 మి.మీ. పడింది. సగటున 25.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 24వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 166.8 మి.మీ. పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 52.2, తుళ్ళూరు 40.6, మేడికొండూరు 38.4, ప్రత్తిపాడు 35.2, కాకుమాను 30.2, కొల్లిపర 27.4, తాడికొండ 26.8, మంగళగిరి 23.6, తాడేపల్లి 21.6, ఫిరంగిపురం 19.8, వట్టిచెరుకూరు 19, పెదకాకాని 17.2, గుంటూరు తూర్పు 14.2, గుంటూరు పశ్చిమ 12.2, తెనాలి మండలంలో 9.8 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య నరసరావుపేటటౌన్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ శనివారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు క్రింద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రైల్వే ఎస్ఐ కోరారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నాదెండ్ల: కారు, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గొరిజవోలు గ్రామ పరిధిలోని నుదురుపాడు పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తరిమెళ్ళ బోయేసు (30) తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. నుదురుపాడు పైవంతెన సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. బోయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా బొమ్ము
తాడేపల్లి రూరల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి నూతన ఉపాధ్యక్షులను నియమించారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాజ గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వంతెన పనులు వేగవంతం చేయాలి
లక్ష్మీపురం: శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ చాంబర్లో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్తో కలిసి వంతెన పనులపై వివిధ శాఖలు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ఎ.భార్గవ్ తేజ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనులకు సంబంధించి పిల్లర్ల నిర్మాణం రెండు వారాల్లో ప్రారంభించేలా నిర్మాణ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు సాగాలని సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి హిందూ కళాశాల వైపు, లాడ్జి సెంటర్ వైపు ఫ్రీ కాస్ట్ మెటీరియల్ సిద్ధం చేసుకోవడానికి గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించి మంగళవారం నాటికి వివరాలు తెలపాలని పేర్కొన్నారు. ఆర్ఓబీ నిర్మాణ ప్రాంతంలోని విద్యుత్ స్తంభాల తరలింపునకు విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి మున్సిపల్ శాఖకు అంచనాలు అందించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని ఓఎస్డీ రూప్కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ బాబు, నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ సమర్పణ రావు, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు , రైల్వే డీఈ భరత్, బీఎస్ఎన్ఎల్ డీఈలు రఘురాం, నాగరాజు, ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్, సింగయ్య, నిర్మాణ ఏజెన్సీ లక్ష్మణ్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి’పై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంబంధిత శాఖలు సమన్వయంతో సాగాలని ఆదేశం -
దేశంలో నరహంతక పాలన
లక్ష్మీపురం: దేశంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళా రూపాల శిక్షణ శిబిరం శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు అన్నీ అప్పగిస్తోందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను దారుణంగా హతమార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కేంద్రం వారిని చంపే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త నాటకానికి ప్రధాని నరేంద్ర మోదీ తెర తీశారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భయపడి మోదీ పాక్పై యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామన్నారు. మహాసభలకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, మావోయిస్టులను హతమార్చుతున్న కేంద్రం విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
‘ఫ్రీ’గా పట్టేసి.. రూ.కోట్ల భూమి కాజేసిన ఉన్నతోద్యోగి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, లేమల్లె గ్రామ శివారు అయిన కర్లపూడి గ్రామంలో సర్వే నెంబర్ 290లోని సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమంది పేదలకు గతంలో అసైన్ చేయగా, మరికొంత భూమిని ఇంకొందరు స్వాధీనంలో ఉంచుకున్నారు. కొంత మందికే పట్టాలు ఉన్నాయి. మిగిలిన వారిలో మరికొందరికి పాత తేదీలు వేసి నకిలీ పట్టాలు సృష్టించారు. పాత తేదీలతో పక్కాగా నకిలీలు.. ఈ భూమి గుంటూరు నుంచి అమరావతి మెయిన్ రోడ్డు పక్కనే కర్లపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉంటుంది. రాజధాని రావడంతో ఈ భూముల ధరలు కూడా పెరిగాయి. దీనిపై కన్నేసిన ఒక డెప్యూటీ కలెక్టర్ పల్నాడు జిల్లాలో పోస్టింగ్లో ఉన్న సమయంలో చక్రం తిప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్రీ హోల్డ్ చేయించారు. అసైన్ భూములకు ఫ్రీ హోల్డ్ చేయాలంటే జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీ (డీఎల్ఆర్సీ)లో ఆమోదం పొందాలి. ఇవేమీ లేకుండానే తహసీల్దార్, ఆర్డీవో రిమార్కులతో ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇచ్చిన ఆదేశాలలో కూడా చెరువు పోరంబోకును ఎందుకు ఫ్రీ హోల్డ్ చేస్తున్నారనే అంశాన్ని కూడా పొందుపరచలేదు. దీనికి సంబంధించిన నోట్ ఫైల్ కూడా లేదని చెబుతున్నారు. ఈ భూమిలో 19 మంది హక్కుదారులు ఉన్నట్లు చూపించారు. వీరిలో కొందరు రైతుల వద్ద పట్టాలు ఉన్నాయి. మరికొందరి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో గతంలో రెవెన్యూ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన కొంతమంది అధికారులతో సంతకాలు పెట్టించి పాత స్టాంప్ పేపర్లపై సదరు సర్వే నెంబర్లోని రైతులకు పూర్వకాలంలోనే పట్టాలు వచ్చినట్లుగా నకిలీవి సృష్టించారని సమాచారం. వీటి ఆధారంగా సర్వేనెంబర్ 290లోని 15 ఎకరాలకు పూర్వకాలంలోనే పట్టాలు మంజూరు అయినట్లుగా రికార్డ్ తయారు చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్ జీవో ప్రకారం ఆదేశాలు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రణాళిక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 7వ తేదీన ఫ్రీ హోల్డ్ అయిన భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై రాష్ట్ర స్థాయిలో కమిటీని సర్కారు నియమించింది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా, ఆ పార్టీ కోసం ఎంతో చేశానని చెప్పే సదరు డెప్యూటీ కలెక్టర్ తన పలుకుబడిని ఉపయోగించారు. ఆగస్టు 19వ తేదీన ఆ భూములకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం విశేషం. అసలు లబ్ధిదారులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ సంస్థలో సదరు డెప్యూటీ కలెక్టర్కు వాటాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ భూమిలో వెంచర్లు వేసి రూ.కోట్లు సంపాదించేందుకు సీఆర్డీఏ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండానే ఫ్రీ హోల్డ్ అమరావతిలో చెరువు భూమికి రెక్కలు చక్రం తిప్పిన డెప్యూటీ కలెక్టర్ డీఎల్ఆర్సీ మీటింగ్ జరగకుండానే ఆదేశాలు ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత రిజిస్ట్రేషన్లు రూ.కోట్ల విలువైన 15 ఎకరాలు బినామీ పేర్లతో హస్తగతం -
పేదరికం, అసమానతల మధ్య యువకుల జీవితాలు
ఏఎన్యూ: పేదరికం, అసమానతల మధ్య యువకుల జీవితాలు కొనసాగుతున్నాయని సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సంస్థ నిర్వహించిన ‘మంగ్ లైవ్స్ స్టడీ’ అంశాలు బహిర్గతం చేశాయి. హైదరాబాద్ సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యంగ్ లైవ్స్ స్టడీ అంశాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ఏపీ మహిళ, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘యంగ్ లైవ్స్ స్టడీ’ ద్వారా 2001–02 నుంచి హైదరాబాద్ సెస్ దీర్ఘకాలిక అంతర్జాతీయ పరిశోధన అధ్యయనాన్ని నిర్వహించడం అభినందనీయమని సూర్యకుమారి పేర్కొన్నారు. సెస్ డైరెక్టర్ ఈ రేవతి మాట్లాడుతూ బాల, బాలికల జీవితాల్లో మార్పులను అధ్యయనం చేసేందుకు ఈ స్టడీ దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎన్యూ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య వై అశోక్ కుమార్, పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ గ్రామీణ బ్యాంకుకు భూమి కేటాయించాలి కొరిటెపాడు (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర రాజధాని అమరావతిలో బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని స్థాపించేందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించినట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైనాన్షియల్ ఇంక్లూషన్, గ్రామీణాభివృద్ధిని విస్తరించాలన్న బ్యాంకు దృష్టిని ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని స్థాపించటం వల్ల బ్యాంకు పరిపాలనా సామర్ధ్యాలు బలపడతాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని విన్నవించినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వీరితోపాటు హరీష్ బేతా తదితరులు ఉన్నారు. -
చాలా ప్రయత్నాలు చేస్తున్నాం
నేను భారత హాకీ జట్టు క్యాంపులో సాధన చేశాను. అంతర్జాతీయ రిఫరీగా పనిచేస్తున్నాను. జిల్లాలో హాకీకి గ్రహణం పట్టిందా అనిపిస్తుంది. ఎవర్ని అడిగినా చేద్దామంటారేగాని ముందుకు రారు. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్రీడలపట్ల చొరవ చూపిస్తున్నారు. ఆయనను కలిసి వివరిస్తాను. జాతీయ క్రీడలకు కనీసం మైదానం లేకపోవడమంటే ఇది అవమానమే. గ్రౌండ్ ఇస్తే చాలు మా అసోసియేషన్ నుంచి క్రీడాకారులను, కిట్స్ను ఇతర అంశాలకు పూర్తి సహకారమందిస్తాం. మైదానం ఏర్పాటు చేసి, ఒక శాప్ హాకీ కోచ్ను ఇవ్వండి. కేవలం రెండు సంవత్సరాలు చూడండి ఎన్ని రిజల్ట్స్ గుంటూరు జిల్లాకు వస్తాయో. హాకీలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే వీలుంటుంది. – జి.హర్షవర్ధన్, ప్రధాన కార్యదర్శి హాకీ, -
జాతీయ క్రీడకు గ్రహణం
ఒలింపిక్స్లో వరుసగా బంగారు పతకాలు సాధించిన క్రీడ. ప్రపంచం మెచ్చిన ధ్యాన్చంద్లాంటి అద్భుత క్రీడాకారులను అందించిన క్రీడ. ఘన చరిత్రను సొంతం చేసుకోవడంతోపాటు జాతీయ క్రీడ హోదాను దక్కించుకున్న హాకీకి జిల్లాలో చోటులేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ (క్రీడలు): దశాబ్దకాలం నుంచి జిల్లాలో హాకీకి క్రీడా మైదానం లేదు. గుంటూరు నగరంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీఆర్ స్టేడియంలో కూడా హాకీకి చోటుక ల్పించకపోవడం దారుణమని సీనియర్ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరాలు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నాయి. దాదాపు 20 క్రీడల్లో చిన్నారులు ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇందులో హాకీ లేకపోవడం గమనార్హం. హాకీ సీనియర్ క్రీడాకారులు పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్లను కలిసినా ఫలితం శూన్యం. ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తమ పిల్లలకు సొంతంగా హాకీ టర్ప్ను ఏర్పాటు చేసుకుంది. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారులు కనీసం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోకపోవడం ఏంటని కొందరు క్రీడా సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన క్రీడా పాలసీ ఏమయ్యిందో ఎవరికీ తెలీయదు. 3 ఎకరాలు సరిపోతుంది హాకీ మైదానం కావాలంటే కనీసం మూడు ఎకరాలుంటే సరిపోయేది. పాలకులు మాత్రం కనీస చొరవ చూపడంలేదు. ప్రస్తుతం నగరంలో క్రీడాకారులు బాక్స్ క్రికెట్ గ్రౌండ్లో గంటకు రూ.1000 చెల్లించి సాధన చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని కళాశాలల్లో ఖాళీ స్థలాలను తీసుకుని వారే బాగుచేసుకుని సాధన చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులున్నారు. ప్రస్తుతం కొందరు జాతీయ సీనియర్ నేషనల్స్ ఆడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీనిలో ఒక ఎంపీ, జిల్లా కలెక్టర్ కలిసి కొంచెం పనిచేస్తే హాకీ టర్ఫ్ వికెట్కు రూ.8 కోట్లు కేటాయిస్తుంది. వేసవి శిక్షణలో కూడా లేని హాకీ కనీస మైదానం లేక అవస్థలు పట్టించుకోని నాయకులు, అధికారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న క్రీడాకారులు -
లారీ ఢీకొని బాలుడి మృతి
తాడికొండ: లారీ ఢీకొని 12 సంవత్సరాల బాబు మృతి చెందిన ఘటన తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తుళ్లూరు గ్రామానికి చెందిన అంకం అభి (12) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టి బాలుడిని ఈడ్చుకు వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మైనర్ బాలుడు ద్విచక్ర వాహనం నడుపుకొని వెళుతుండటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైటాయించి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. రాత్రి 10 గంటల వరకు కూడా నిరసన ముగించక పోవడంతో పోలీసులు సర్థి చెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, రాజధానిలో కూలీ పనులు లేకపోవడంతో గేదెలు మేపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె కాగా కుమారుడి అకాల మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు అందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. -
కదం తొక్కిన ఎండీయూ వాహనదారులు
గుంటూరు వెస్ట్: ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తమకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మోసం చేయడం దారుణమని ఎండీయూ వాహనదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక స్థంభాలగరువు నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్ధనగ్నంగా ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాషా మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ను సంఘం రాష్ట్ర నాయకులు కలిసినప్పుడు ఉపాధికి ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇంతలోనే ఆ మాట తప్పారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. వాస్తవానికి తమ కాంట్రాక్ట్ 2027 జనవరి వరకు ఉందని, అప్పటి వరకు తమను కొనసాగించాలన్నారు. ప్రజాదరణ పొందిన ఎండీయూ వాహనాల వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీని తొలగించడానికి ఎటువంటి కారణాలు లేవన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యంగా భావిస్తామని చెప్పారు. ఉపాధి మార్గాలు చూపించాల్సిన ప్రభుత్వం ఇలా తమ నోటి దగ్గర కూడు లాగేయడం అన్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు మరే పని చేతకాదని, కనీసం రెండేళ్లు సమయం ఇస్తే ఇతర మార్గాలు అన్వేషించుకుంటామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కె.డానీ, బి.తిరుపతి రామయ్య పాల్గొన్నారు. వాహనదారులకు ఆదిలోనే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 20 మంది పోలీసులు వచ్చి కదలనీయలేదు. స్థంబాలగరువులోనే అసోసియేషన్ నాయకులు ప్రసంగించి, కార్యక్రమాన్ని ముగించారు. తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వాపోయారు. కూటమి ప్రభుత్వ కుట్రపై పోరుబాట సర్కారు నమ్మించి మోసం చేసిందని ఆవేదన తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ -
మద్యం దుకాణాలు సమయపాలన పాటించాల్సిందే
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందేనని ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మద్యం షాపులు రాత్రి 10 గంటలకు కచ్చితంగా మూసేయాల్సిందేనన్నారు. 10 గంటలకు వైన్ షాపులను మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. పర్మిట్ రూములు నిర్వహణకు అనుమతి లేదని, ఎవరైనా పర్మిట్ రూములల్లో మద్యం తాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా రాత్రి 11 గంటల వరకు లిక్కర్ సరఫరా, ఆ తరువాత గంట వరకు ఫుడ్ సరఫరాకు అనుమతి ఉందని చెప్పారు. అనంతరం తప్పనిసరిగా మూసివేయాల్సిందేనన్నారు. సమయ పాలనపై ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. వీరిపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే షాపుల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,900 కేసులు నమోదు చేసి 1,201 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందులో మద్యం 2,297 లీటర్లు, బీరు 119 లీటర్లు, నాటు సారా 444 లీటర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి 2.89 గ్రాములు, కొకై న్ 8.5 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి మొత్తం 21 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు. వైన్ షాపులు రాత్రి 10 గంటలకు మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షణ అనధికార పర్మిట్ రూమ్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు విలేకరుల సమావేశంలో ఎకై ్సజ్ శాఖడెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ -
రేషన్ కార్డ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
నెహ్రూనగర్: జిల్లాలో రైస్ కార్డులకు సంబంధించి నూతన కార్డుల మంజూరు, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పు, విభజన, తొలగింపు, సరెండర్, అప్డేషన్ వంటి సర్వీసుల దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల 183వ వార్డు సచివాలయంలో రైస్ కార్డు దరఖాస్తుల సర్వీసులను పరిష్కరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. రైస్ కార్డు మాడ్యూవల్లో నమోదు చేసే విధానాన్ని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కంప్యూటరులో పరిశీలించారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుల ఈకేవైసీ చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రముని, తూర్పు మండల తహసీల్దారు సుభాని, సివిల్ సప్లయిస్ డీటీ భాస్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించండి గుంటూరు వెస్ట్: ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటు అవసరమని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారిని ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
పవర్ లిఫ్టింగ్లో క్రీడా రత్నం
తెనాలి: పట్టణాలు, నగరాల్లో జిమ్లు, క్రీడా అకాడమీలు క్రీడాభిరుచి కలిగిన యువతకు అందుబాటులో ఉంటున్నాయి. ఎందరో యువతీ యువకులు వాటిని అందిపుచ్చుకుని క్రీడారంగంలో పోటీ పడుతున్నారు. పతకాలను సాధిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతున్నారు. గ్రామాల్లోనూ ఆ సౌకర్యాలు ఏర్పాటైతే అక్కడ నుంచి కూడా క్రీడారత్నాలు వెలుగులోకి వస్తాయి. పట్టణ యువతతో పోటీపడి విజయాలు సాధిస్తారు. ఇటీవల ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, యూనివర్శిటీ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్–2025లో మొత్తం 8 పతకాలను సాధించిన పవర్లిఫ్టర్ నాగం జ్ఞానదివ్య ఇందుకో నిదర్శనం. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో జరిగిన ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్లో రెండు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకున్న జ్ఞానదివ్య, యూనివర్శిటీ క్లాసిక్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఆసియా సెకండ్ బెస్ట్ లిఫ్టర్ అవార్డును స్వీకరించింది. 2021లో పవర్లిఫ్టింగ్లో సాధన ఆరంభించిన జ్ఞానదివ్య రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వరుసగా పాల్గొంటూ అవలీలగా పతకాలను సాధిస్తోంది. కామన్వెల్త్. వరల్డ్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్లోనూ పాల్గొని విజయాలను అందుకుంటున్న జ్ఞానదివ్య గ్రామీణ ప్రాంత క్రీడారత్నం. ప్రస్తుతం కేఎల్ యూనివర్శిటీలో బీసీఏ సెకండియర్ పూర్తిచేసింది. కాకతాళీయంగా సాధన తెనాలి రూరల్ మండలం గ్రామం కఠెవరం ఆమె సొంతూరు. సుధారాణి, వెంకటేశ్వరావు తల్లిదండ్రులు. పవర్లిఫ్టింగ్లో సాధన కాకతాళీయంగా జరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతుండగా గ్రామంలో మాతృశ్రీ అకాడెమీ ఏర్పాటైంది. వాస్తవానికి కఠెవరం గ్రామం ఒకప్పుడు అథ్లెటిక్స్కు కేంద్రం, ఇక్కడ్నుంచి తయారైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తలపడ్డారు. గ్రామం నుంచి వెయిట్లిఫ్టర్లను తయారు చేయాలనే సంకల్పంతో ఇక్కడ అకాడమీ ఏర్పాటైంది. క్రీడాభిలాష కలిగిన వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో జ్ఞానదివ్య అకాడమీలో చేరింది. వెంకటేశ్వరరావు, వలి, సుధాకర్, రామిరెడ్డి, వీరారెడ్డి శిక్షణతో వెయిట్లిఫ్టింగ్ శిక్షణ ఆరంభించింది. కొద్దిరోజుల తర్వాత పవర్లిఫ్టింగ్కు మారింది. నందివెలుగు జడ్పీ హైస్కూలు పీఈటీ కొల్లిపర నాగశిరీష శిక్షణలో క్రమం తప్పక సాధన చేస్తూ, 2021 ఆఖర్నుంచి పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. సబ్జూనియర్స్లో 84 పైగా కిలోల కేటగిరీలో తలపడుతున్న జ్ఞానదివ్య, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర, జాతీయస్థాయిలో మూడేసి స్వర్ణాలు, దక్షిణభారత పోటీల్లో రజత పతకాన్ని గెలిచింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న నాగం జ్ఞానదివ్య సొంతూరు కఠెవరంలో సాధన ప్రభుత్వ పాఠశాల పీఈటీచే శిక్షణ కామన్వెల్త్ పోటీల్లోనూ ఆరు పతకాలు అంతులేని ఆత్మవిశ్వాసంతో 2022లో కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో జ్ఞానదివ్య, మూడు బంగారు పతకాలను సాధించటమే కాకుండా, స్క్వాట్, డెడ్లిఫ్ట్లో అంతకుముందున్న రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించింది. ఆ పోటీల్లో రెండు కాంస్య పతకాలను దక్కించుకుంది. 2022లో న్యూజిలాండ్లో జరిగిన కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గింది. 2023లో కేరళలో జరిగిన ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు రజత పతకాలను అందుకుంది. గతేడాది సౌతాఫ్రికాలోని సన్సిటీలో నిర్వహించిన కామన్వెల్త్ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోనూ నాలుగు కాంస్యాలను కై వసం చేసుకుంది. ఏ పోటీలో తలపడినా పతకం మాత్రం ఖాయమంటున్న జ్ఞానదివ్య, లక్ష్యం మాత్రం అంతర్జాతీయంగా మరింత గుర్తింపును తెచ్చుకోవటం, క్రీడల కోటాలో రైల్వేశాఖలో ఉద్యోగం సాధించటమేనంటుంది. -
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
మరింత రెచ్చిపోతున్నాడు...
దాచేపల్లి సీఐ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పోలీసుస్టేషన్కు బేడీలు వేసి అప్రతిష్టపాలైనా ప్రభుత్వం సీఐపై చర్యలు తీసుకోకపోవడం వల్ల మరింత రెచ్చిపోతున్నాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్ సీపీ తరపున రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎస్పీ ఆదేశాలతోనే కొట్టానని చెబుతున్నాడు. అది నిజం కాకపోతే సీఐపై చర్యలు తీసుకోవాలి. –డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి -
మమ అనిపించారు
సమావేశాలతో పట్నంబజారు: గుంటూరు నగరంలో అర్ధరాత్రి పూట మద్యం విక్రయాలపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘నిశీధిలోనూ అదే నిషా’ కథనానికి అధికారులు స్పందించారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలపై చర్చించారు. అయితే ఇప్పటి వరకు అర్ధరాత్రి పూట మద్యం అమ్మకాలు చేపట్టిన దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాలక్షేపంగా సమావేశం నిర్వహించి, జాగ్రత్త పడాలంటూ అధికారులే సూచనలు చేశారని విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా సాక్ష్యాధారాలతో ‘సాక్షి’తో కథనం ప్రచురితమైనప్పటికీ అధికారులు నోటి మాటలతోనే సరిపెట్టారు. అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరిగినా బార్ అండ్ రెస్టారెంట్లపై కనీస నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు పోలీసులు సైతం సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ తీసుకుంటామని ‘యాక్షన్’ చేశారు తప్ప, ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆచరణలోకి రాని మాటలు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారుగానీ, ఏడాది కాలంలో ఏ ఒక్కరోజూ ఇది అమలు కాలేదు. గతంలో సైతం బహిరంగ మద్యపానం, ఎమ్మార్పీ ధరలు, అర్ధరాత్రి అమ్మకాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపడతామని చెప్పారేగానీ, చేతల్లో మాత్రం ఆ విషయం చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం మాట అటుంచితే.. అధికారులకు వారే కొన్ని వినతులు ఇచ్చినట్లు తెలిసింది. తమకు మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, అధికారులకు అన్ని విధాలా సహాయంగానే ఉంటున్నామని నిర్వాహకులు గుర్తుచేశారు. ప్రతినెలా మామూళ్లు చెల్లిస్తున్నామని, చూసీచూడనట్లు పోవాలని కూడా ఎకై ్సజ్, పోలీసు అధికారులకు వ్యాపారులు విన్నవించినట్లు సమాచారం. దీంతో వారికి అధికారులు ఉపాయాలు కూడా చెప్పారు. కొద్దిరోజులపాటు పేరుకు తాము తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రభుత్వం విధించిన నియమాలు పాటించాలని, తర్వాత ఇవేమీ ఉండబోవని వ్యాపారులకు పోలీసు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ● అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై చర్యలు శూన్యం ● ప్రజారోగ్యం దెబ్బతింటున్నా యంత్రాంగంలో అదే నిర్లక్ష్యం -
5న ‘చలో విజయవాడ’ కార్యక్రమం
మంగళగిరి: జూన్ 5వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, మంగళగిరి తాలూకా యూనిట్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి మాధవరావు, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.అందరూ మొక్కలు నాటి సంరక్షించాలికాజ (మంగళగిరి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని కాజలో గురువారం ఉమెన్ ఫర్ ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు సభ్యులు తొలుత కనీసం ఒక్క మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళలకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, మెప్మా పి.డి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.తొలిరోజే విద్యామిత్ర కిట్లు అందిస్తాంప్రత్తిపాడు: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఐ. పద్మావతి అన్నారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల స్థాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను గురువారం ఏపీసీ పరిశీలించారు. క్వాలిటీ వాల్తోపాటు బ్యాగుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించడం జరుగుతుందన్నారు. వెంట ఎంఈవో–2 జి. లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు.ఇకపై వజ్ర కిరీటంతో దుర్గమ్మ దర్శనంప్రతి పౌర్ణమి రోజున అలంకరించాలన్న ఈవో శీనానాయక్ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రతి పౌర్ణమిన అమ్మవారికి స్వర్ణకవచంతో పాటు వజ్ర కిరీటాన్ని అలంకరించాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆలయ వైదిక కమిటీకి సూచించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ముఖ్య అర్చకులతో ఈవో శీనానాయక్ గురువారం సమావేశమయ్యారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈవో చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వైదిక కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, మల్లేశ్వర శాస్త్రి, సుందరంబాబులతో పాటు ఇతర అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శీనానాయక్ మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వైదిక కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించాలని, నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. దేవతామూర్తుల అలంకరణ, వస్త్రాలు వైభవంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, కోట రవికుమార్, ముఖ్య అర్చకులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఏఈవోలు పాల్గొన్నారు. -
భాస్కరా...తీరు మారదా!
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కూటమి నేతల వద్ద మెప్పు కోసం పోలీసులమన్న భావనను పక్కన పెట్టి విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. వరుస వెంబడి జరుగుతున్న అక్రమ అరెస్ట్లతో రాష్ట్రం అట్టుడుకిపోతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలను ప్రశ్నిస్తే గొంతులను నులిమేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కొందరు వ్యవస్థపై ప్రజలకు గౌరవం లేకుండా చేస్తోంది. దాచేపల్లి పోలీసుల తీరు రోజురోజుకు వివాదస్పదమౌతున్నది. ప్రధానంగా దాచేపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పి.భాస్కర్ రెడ్బుక్ కోసమే ఉద్యోగం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భాస్కర్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఘనుడు. అక్రమ అరెస్ట్లపై ప్రశ్నించే వారిని పోలీస్స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్న ఈ బేడీల భాస్కర్ ఆగడాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. బీసీ యువకుడిపై ప్రతాపం టీడీపీ అధికారంలోకి రావడంతో తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జరిగే పండుగకు వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాషా తన అనునయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం కేసు కట్టారని హరికృష్ణ కుటుంబసభ్యులు వాపోతున్నారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో వచ్చి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. దాని ఆధారంగానే హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని వాపోతున్నారు. ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వారికి రూ.40లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40లక్షలు ఇస్తేనే కేసులు రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలను ప్రతి రోజూ స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్ సీపీ నేతలు విసుగు చెంది కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరుని తప్పుపట్టింది. తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డితో పాటుగా మరికొందరిపై రకరకాలుగా కేసులతో సీఐ వేధించాడని వారు వాపోతున్నారు. నేను, నా కుమారుడు హరికృష్ణ టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తెలంగాణలో ఉంటున్నాం. పండక్కి ఇంటికి వస్తే పోలీసులు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏ కారణం లేకుండా నా బిడ్డని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని తప్పుడు కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు రాజ్యాంగం అమలు చేయకుండా టీడీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు. –ఉప్పుతోళ్ల యల్లయ్య, హరికృష్ణ తండ్రి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా అక్రమ కేసులు, వేధింపులు ఇప్పటికే సీఐ తీరుపై కోర్టును ఆశ్రయించిన బాధితులు టీడీపీ నేతల ఆదేశాలతో బీసీ యువకుడు హరికృష్ణపై అక్రమ కేసు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో నడవలేని స్థితిలో ఉన్న కుమారుడిని చూసి చలించిన తల్లిదండ్రులు సీఐ భాస్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి – ఉప్పుతోళ్ల హరికృష్ణ గురజాల: దాచేపల్లి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు జడ్జి ముందు ఉప్పుతోళ్ల హరికృష్ణ వాగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరుపు న్యాయవాది కిరణ్ దాసు తెలిపారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణను దాచేపల్లి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని, రాత్రి 6 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. ఉప్పుతోళ్ల హరికృష్ణ మాట్లాడుతూ దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కాళ్లపై, చేతులపై కర్రలతో కొట్టారని, సీఐ భాస్కరరావు చిత్రహింసలకు గురిచేశారని న్యాయమూర్తి ముందు వాపోయాడు. హరికృష్ణ ఇచ్చిన వాగ్మూలం రికార్డు చేసిన న్యాయమూర్తి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవాది తెలిపారు. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. -
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో డీఎస్డబ్ల్యూ ఆర్ఐ సురేష్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో భాగంగా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది తమవద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు తనిఖీలు నిర్వహించారు. కచ్చితత్వాన్ని పరీక్షించి జాగిలాల పనితీరును అంచనా వేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో ఓ చోట పేలుడు పదార్థం గోప్యంగా పెట్టారు. బాంబు డిస్పోజల్ విభాగానికి చెందిన జాగిలం దాన్ని కనిపెట్టింది. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ.. వీవీఐపీలు ప్రయాణించే సీడ్ యాక్సిస్ రోడ్డులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుళ్ళూరు సీఐ కొంకా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ విభాగం శ్రీహరి, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ సురేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హనుమా.. దయతో కనుమా...
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడికి పరమ భక్తుడైన ఆంజనేయుడు ధైర్యం, బలం, భక్తి, జ్ఞానం, వినయం వంటి సుగుణాల సాక్షాత్కారంగా భావిస్తారు. భయాలు తొలగించడంతోపాటు శక్తి, ధైర్యం పెంచాలని కాంక్షిస్తూ భక్తులు ఉపవాసం ఉండి, హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు విశేషంగా సాగాయి. –నెట్వర్క్బీసీ వర్గానికి చెందిన హరికృష్ణను టీడపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాచేపల్లి సీఐ భాస్కర్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఉద్రిక్తతలు నెలకొనేలా చేస్తున్నాడు. సీఐ తీరుపై కోర్టులో న్యాయపోరాటం చేసి చట్టం ముందు నిలబెడతాం. హరికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తాం. –కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే చట్టం ముందు నిలబెడతాం... -
గుంటూరు
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది. కొనసాగిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునః పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కూడా కొనసాగింది.సుఖీభవ లబ్ధిదారుల నమోదు నూజెండ్ల: రైతుసేవా కేంద్రంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు చేపట్టారు. ఇప్పటివరకు 13,175 మంది వివరాలు నమోదు చేశారు. 9 -
పట్టపగలే రూ.6.25 లక్షలు చోరీ
సుద్దపల్లి (చేబ్రోలు): చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో పట్టపగలే ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు భారీగా నగదు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనుకు చెందిన ఇంటిలో మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోని బీరువా తాళాలు పగలకొట్టారు. అందులోని రూ.6.25 లక్షల నగదును చోరీ చేశారు. వీటితో పాటు బంగారు వస్తువులు కూడా చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వడ్లమూడిలో జరిగే శుభకార్యానికి అందరూ వెళ్లటంతో గమనించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై డి. వెంకట కృష్ణ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నడవలేని స్థితిలో హరికృష్ణ
వైఎస్సార్ సీపీ కార్యకర్త హరికృష్ణని దాచేపల్లి పోలీస్స్టేషన్లోని సీఐ క్వార్టర్లో ఉంచారు. హరికృష్ణపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తెలుస్తోంది. తంగెడ నుంచి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కి చేరుకోగా నడవలేని స్థితిలో సీఐ క్వార్టర్లో పడి ఉన్న కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కుటుంబసభ్యులు స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్వార్టర్లో ఉన్న తమ కుమారుడిని చూపించాలని అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలతోపాటుగా హరికృష్ణ తల్లిదండ్రులు కోరారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. క్వార్టర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 82 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల నాక్ నుంచి తాజాగా నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల తాజాగా పొందిన నాక్ ఏ గ్రేడ్ గుర్తింపుతో మరో పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళుతుందని చెప్పారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు తీసిపోని విధంగా వాటికి సమాంతరంగా బీఎస్సీలో డేటాసైన్స్, ఏఐ, బయోకెమిస్ట్రీ వంటి ఆధునిక కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి. మధుసూదనరావు, అధ్యాపకులు ఎం. సంతోషికుమారి, కె. అపర్ణ సీతారామ్, కె. సుబ్బరత్నమ్మ, జి.శేషు పాల్గొన్నారు. -
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గుంటూరు మెడికల్: పీజీ వైద్య విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాలతోపాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో పీజీ వైద్య విద్యార్థుల కోసం రెండురోజుల పరిశోధన శిక్షణ శిబిరం గురువారం మొదలైంది. తొలి ఏడాది పీజీ వైద్య విద్యార్థులకు ‘రీసెర్చ్ మెథడాలజీ – థీసిస్ ప్రిపరేషన్’పై కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. వివిధ వైద్య విభాగాల నుంచి 180 మందికిపైగా పీజీ వైద్యులు పాల్గొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ మాట్లాడుతూ, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, గుణాత్మక థీసిస్ రూపొందించేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు పరిశోధన పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి, డాక్టర్ పి.అనిల్, పలువురు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు నిర్వహించి, పీజీ విద్యార్థుల థీసిస్ ప్రోటోకాల్ను వివరించారు. -
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీ వరకు జరుగనున్న యోగాంధ్ర క్యాంపెయిన్ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి మండల, డివిజనల్ స్థాయి కేంద్రాల్లోనూ యోగా మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ, డివిజనల్ స్థాయిలో ట్రైనర్ల ద్వారా యోగా సాధన వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామ, మండలాల్లో వంద నుంచి 150 మంది యోగా చేసేందుకు వీలున్న విద్యాసంస్థలు, గోదాములు, గుర్తించాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శుల ద్వారా యోగా సాధనకు పేర్లు నమోదు చేయించాలన్నారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక బృందాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కల్చరల్ టీం ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మామూళ్లు ఇచ్చి మరీ జేబులు నింపుకొంటున్న టీడీపీ నేతలు
కాయ్ రాజా కాయ్... అంటూ జిల్లాలో మళ్లీ పేకాట శిబిరాలు తెరుచుకున్నాయి. గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న ఎల్వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్లు కేంద్రాలుగా మారిపోయాయి. వీటితోపాటు పలు లాడ్జీలలో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. తమ్ముళ్లు తమ జేబులు నింపుకొంటూనే ఆయా అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. ఆ మత్తులో అధికారులు కనీసం తనిఖీల ఊసు కూడా ఎత్తడం లేదు. – సాక్షి ప్రతినిధి, గుంటూరు నగరం మధ్యలో ఉన్న ఎల్వీఆర్ క్లబ్లో రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలతో పేకాట నడుస్తోంది. రూ.లక్షకు 500 పాయింట్లు ఇస్తారు. ఒక్కో పాయింట్ విలువ రూ.200 ఉంటుంది. డ్రాప్నకు రూ.5 వేలు, కౌంట్కు రూ.40 వేల వరకు ఆడుతున్నారు. నెల క్రితం వరకు సభ్యులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరొచ్చినా తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తూ వారితోనూ ఆడిస్తున్నారు. 100 నుంచి 200 మంది వరకు తాత్కాలిక సభ్యత్వాలు తీసుకున్నట్లు సమాచారం. రూ.లక్ష, రూ.50 వేలు, రూ.20 వేల టేబుళ్లు ఐదు చొప్పున ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. రూ.10 వేలవి 10 వరకు క్లబ్లో నడుస్తున్నాయి. ● పలకలూరు రోడ్లో ఉన్న గుంటూరు క్లబ్లో ఏకంగా రూ.2 లక్షల ఆటలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరు వచ్చినా తాత్కాలిక సభ్యత్వం ఇచ్చి ఆడిస్తున్నారు. ● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలో ఉన్న విజయవాడ క్లబ్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆటలు నడుస్తున్నాయి. అనుబంధ సభ్యుల పేరుతో ఇతరులను కూడా ఆడిస్తున్నారు. ● చిలకలూరిపేట క్లబ్లో కూడా రూ.50 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల ఆటలు ఆడిస్తున్నారు. ఇతర జూదాలు కూడా నడుస్తున్నాయి. ● ఇవన్నీ అధికార టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. దీనికి అగ్ర నాయకత్వం ఆమోదం ఉందని బయటకు చెబుతుండటంతో పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. లాడ్జీలలోనూ యథేచ్ఛగా... నగరంలో సుమారుగా 80 నుంచి 100 వరకు లాడ్జీలు ఉన్నాయి. వీటిలో కూటమి నేతల అండదండలతో పేకాట మాత్రమే కాదు... వ్యభిచారం కూడా జోరుగా జరుగుతోంది. రెండు గదులున్న చోట ఒక గదికి బయట వైపు తాళం వేసి రెండో గదిలో పేకాట ఆడిస్తున్నారు. రోజుకు రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు బంకిని తీస్తున్నారని తెలుస్తోంది. రాజా గారి తోట, గుంటూరు వారి తోట, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలతోపాటు అరండల్ పేట ఒకటో లైను, పట్టాభిపురంలోని పలు గెస్ట్ హౌస్లలో కూడా పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. నెలవారీగా రూ.లక్షలు లాడ్జీల నుంచి స్టేషన్లకు కేవలం తూర్పు నియోజకవర్గ పరిధిలోనే నెలకు రూ. ఐదు లక్షలపైగా అందుతోందని సమాచారం. పశ్చిమ పరిధిలో కూడా సుమారు రూ. నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు. ఈ వసూళ్లలో ఐడీ పార్టీ (మఫ్టీ పార్టీ) కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం నేతలు చెప్పిన విధంగా అక్కడక్కడ దాడులు నిర్వహించి లాడ్జి యజమానులను బెదిరింపులు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల వసూళ్ల పర్వం ఎల్వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్లలో మళ్లీ షురూ తాత్కాలిక సభ్యత్వాలు.. రూ. లక్షల్లో పందేలు పేకాట స్థావరాలుగా మారిన నగరంలోని లాడ్జీలు తూతూ మంత్రంగా పోలీసుల దాడులు క్లబ్బుల వైపు కన్నెత్తి చూడని అధికారులు లాడ్జీల అసోసియేషన్కి సంబంధించి పలు వివాదాలు కూడా నడుస్తున్నాయి. కూటమికి సంబంధించిన ఒక నేత అసోసియేషన్ను తానే నడిపిస్తానని, నెలకి రూ.15, 000 చొప్పున ప్రతి లాడ్జి వారు ఇవ్వాలని నిర్వాహకులను ఇబ్బందులు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లకు రూ.9 వేల చొప్పున కేటాయించినట్లు సమాచారం. మిగతా రూ.6 వేలను కూటమి నేతలు తీసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ప్రజా ప్రతినిధులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. -
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... దరఖాస్తు ప్రక్రియతో ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులు గతంలో టీఐఎస్లో స్వయంగా అప్లోడ్ చేసిన సమాచారమే ఆన్లైన్ పోర్టల్లో ఉంటుందని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తులో ప్రత్యేక పాయింట్లు, రేషనలైజేషన్, ప్రిఫరెన్షియల్ పాయింట్లు ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సబ్మిట్ చేసే ముందుగా పరిశీలన చేసుకోవాలని, దరఖాస్తు ప్రింటవుట్ రెండు కాపీలను డీడీవోకు సమర్పించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత అదనంగా గంట బోధించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల చట్టం, ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు, పాఠశాలల స్ట్రక్చర్ వెనుక యూటీఎఫ్ పోరాటం ఉందని తెలిపారు. సదస్సులో సంఘ నాయకులు జి.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, బి. రంగారావు, ఎం.గోవిందు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, ఎం. చిన్నయ్య, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అర్హులైన వైద్యులనే గర్భిణులు సంప్రదించాలి
పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ రవి నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని గర్భిణులు, బాలింతలు వైద్య సేవలకు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని, నాటు వైద్యులను సంప్రదించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్యుల సలహాల మీరకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం పొందటం వలన మాతాశిశు మరణాలు నియంత్రించవచ్చని అన్నారు. తొమ్మిది నెలల గర్భకాలంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పని సరిగా చేయించాలని సూచించారు. దీని వలన గర్భస్థ శిశువు పెరుగుదల తెలుసుకునేందుకు, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యాలు నిర్ధారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్లలో ఉచితంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ గురించి ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చేయరాదని తెలిపారు. ఈ పరీక్షలు చేసిన వారికి, దానిని ప్రోత్సహించిన వారికీ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలో రిజిస్టర్ కాకుండా ఏ హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. ఇటువంటి వారి గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబరు 18004253365 ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు. -
నంబాల ఎన్కౌంటర్ నాటకమే
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సత్తెనపల్లి: మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారనేది నాటకమేనని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంబాల కేశవరావు మృతి చెందారనే వార్తను తాము నమ్మడం లేదన్నారు. ఎన్కౌంటర్ జరిగిన తరువాత రోజుల తరబడి మృతదేహాలను మార్చురీలో పెట్టుకుని, అవి కుళ్లిపోయిన తరువాత ప్రధాన నాయకుడు చనిపోయాడని అంటున్నారని పేర్కొన్నారు. కానీ అవి ఆదివాసీలు, మిలీషియా సభ్యుల మృతదేహాలని వార్తలు వస్తున్నాయన్నారు. నంబాల చనిపోయారని చెబితే కేడర్ నిరాశ, నిస్పృహలతో ఉంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నామన్నారు. ఇలా ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రజాయుద్ధ నేతగా సజ్జా నాగేశ్వరరావు
చీరాల: మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ నారాయణపూర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట. జాండ్రపేటలో సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి బాలగంగాధరరావు ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా పలు ప్రాంతాలలో పనిచేశారు. రెండవ సంతానంగా నాగేశ్వరరావు జాండ్రపేట హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి గుంటూరు జిల్లా నల్లపాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో చదివారు. 17 ఏళ్ల వయస్సులోనే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యంలోకి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్పై విడుదలైన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఉద్యమంలో నాగేశ్వరరావుకు ఏసన్నగా పేరుంది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ పోరాటాలకు నాయకత్వం వహించారు. అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విస్తరించిన విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ మిలటరీ విభాగంలో అవామ్–ఇ–జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నాగేశ్వరరావు మరణించారని మీడియాలో రావడంతో ఆయన సోదరుడు సజ్జా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తమ్ముడి మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం కోరారు. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
● కారు ఢీకొని కూలీ మృతి ● మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు
పొట్టకూటి కోసం వచ్చి అనంత లోకాలకు... సత్తెనపల్లి: పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని గడియారస్తంభం వద్ద బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు (48), బి.జోసెఫ్ అలియాస్ శ్రీనివాసరావు ఇరువురు కూలి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో దామచర్లకు చెందిన ఓ వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో గడియార స్తంభం వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉప్పుతల శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా జోసెఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన ఉప్పుతల శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చి ప్రమాదవ శాత్తు రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
గుంటూరు వెస్ట్: తుది ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసుకోవడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.ఎన్.శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితాపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహించే ఈ సమావేశంలో స్వీకరించే సూచనలు, సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాలసీలకు సంబంధించిన అంశాలపై వారికే ఫిర్యాదులు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన వారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోపు ఓటరు, ఆధార్ కార్డుల అనుసంధానం చేయించాలని తెలిపారు. పోలింగ్ బూత్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్వోలు క్లయిమ్స్ వెరిఫికేషన్కు వెళ్లేటప్పుడు వారితోపాటు బీఎల్ఏలను కూడా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. పై సమస్యలపై స్పందించిన ఇన్చార్జి కలెక్టర్.. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం గురించి ఏ నిర్ణయమైనా ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితా 2026 జనవరి 5న రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
రేషను బండి పైనా కూటమి కక్ష!
గుంటూరు వెస్ట్: గత ప్రభుత్వ హయాంలో ప్రజాదరణ పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నాశనం చేయడమే కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఎంత మంది సిబ్బంది రోడ్డున పడుతున్నా పాలకులకు ఏమాత్రం పట్టడం లేదు. నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపాల్సిన ప్రభుత్వం ఉన్న వాటిని కూడా దూరం చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే అద్భుత వ్యవస్థ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) వాహనాలను రద్దు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రేషన్ మాఫియా దందాకు అధిక శాతం కూటమి నేతలే నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసి కూడా నిందలన్నీ ఎండీయూ వాహనదారులపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు పరిగణనలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నాయకులు వాపోతున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎండీయూ వాహనాల కాంట్రాక్ట్ 2027 వరకు ఉందని, ఇంతలోనే ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో వెయ్యి మంది... రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహన వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు. రేషన్ దుకాణం నుంచి సరకులు తీసుకుని ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన ఈ వ్యవస్థ.. సిబ్బంది పనితీరుతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. జిల్లాలో 972 రేషన్ దుకాణాల నుంచి 353 వాహనాల ద్వారా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరకులను 5,99,511 మంది రేషన్ కార్డుదారులకు నెల ప్రారంభం నుంచి సుమారు 17వ తేదీ వరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క ఎండీయూ వాహనానికి మూడు రేషన్ దుకాణాలు కేటాయించారు. ఈ మూడింటి పరిధిలో 6 వేల నుంచి 9 వేల వరకు రేషన్ కార్డులు ఉంటాయి. ఈ క్రమంలో కొందరు ఎండీయూ వాహనదారులు తప్పులు కూడా చేసేవారు. పౌరసరఫరాల శాఖాధికారులు తనిఖీలు చేసి వారిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి రూ.21 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిలో వాహన కిస్తీకి రూ.3 వేలు కట్ చేసి రూ.18 వేలు ఇచ్చేది. ఇందులోనూ ఇంధనం ఖర్చు, రిపేర్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ జీతం, ముఠా కూలీల ఖర్చు, బండి ఇన్సూరెన్స్ వంటి వాటిని ఆ వాహనదారుడే చూసుకోవాలి. ఉపాధితోపాటు సేవ కూడా మిళితం కావడంతో చాలామంది ఎండీయూ వాహనదారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు. కుంటి సాకులతో సిబ్బంది, పేదలపై కక్ష తీర్చుకుంటున్న సర్కారు కూలీనాలీ చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడిన వ్యవస్థ ఎండీయూ వాహనాల రద్దుతో తప్పని అవస్థ పాలకుల తీరుతో రోడ్డున పడ్డ సిబ్బంది రేషన్ బియ్యం అక్రమ దందా కూటమి నేతలది కాదా? అసలైన వారిని వదిలిపెట్టి అమాయకులపై కుట్రతో నిర్ణయం సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్న కూటమి సర్కార్ప్రాణాలకు సైతం తెగించి... కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ రేషన్ డెలివరీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో కృష్ణా జిల్లాలో వచ్చిన వరదలకు సుమారు 10 రోజులపాటు అక్కడే ఉండి వాహనాల ద్వారా బాధితులకు ఆహారం తదితరాలు అందించారు. వరద నిధికి తమ జీతంలో 10 శాతం మొత్తం విరాళంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 100 ఎండీయూ వాహనాల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. అంగన్వాడీ, ఐసీడీఎస్లకు బియ్యం సరఫరా కార్యక్రమం కూడా వీళ్లే అదనంగా చేస్తున్నారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి శోభాయాత్ర
తెనాలి: హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక షరాఫ్బజార్లోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీహనుమజ్జయంతి మహోత్సవాలు ప్రారంభం కానున్నందున బుధవారం పట్టణంలో స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి, పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం, శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22 నుండి జూన్ ఒకటో తేదీ వరకు వార్షిక శ్రీ హనుమజ్జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీహనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు విశేష పూజలు, హోమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కల్యాణం, 31న శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం ఉంటాయన్నారు. జూన్ ఒకటో తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనూరాధ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్రప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ క్షణం కావాలన్నా ఎంతైనా రెడీ...
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.39 గంటలకు కూడా మద్యం విక్రయిస్తున్నారు. ప్రధాన షట్టర్కు చిన్న షట్టర్ అమర్చి అమ్మకాలు చేస్తున్నారు. పక్కనే మరో బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటాక 2.53 గంటలకు కూడా పక్కన ఉన్న సన్న సందులో నుంచి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. ఈ బార్కు పక్కనే ఉండే మరొక బార్లో ఏకంగా ఒక వాచ్మెన్ను పెట్టి 3.05 గంటలకు కూడా విక్రయాలు జరుపుతున్నారు. వీటికి కొద్దిగా దూరంలో ఓల్డ్క్లబ్ రోడ్డు మూలన ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అసలు టైంతో పనే లేదు. ఎప్పుడు కావాలన్నా మందుబాబులకు సొంత ఇంటికి వచ్చి వెళ్లినట్టే ఉంది పరిస్థితి. పట్నంబజారు: అర్ధరాత్రి సమయాల్లో సైతం షట్టర్ కొడితే చాలు తలుపులు నిస్సంకోచంగా తెరుచుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా సాగుతున్నా... అనధికారిక పర్మిట్ రూమ్లు ఏర్పాటు అవుతున్నా.. పట్టించుకునే నాథుడు కాదు కదా.. కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుంటూరు నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మొత్తం 37 వైన్స్ దుకాణాలు, 64 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అన్నిచోట్లా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం విక్రయాలు 24/7గా మారాయి. మద్యం మత్తులో గొడవలు అరండల్పేట ఒకటో లైనులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కూడా మందుబాబులకు 24 గంటలూ సేవలను అందిస్తున్నారు. వెస్ట్ పరిధిలోని జేకేసీ కళాశాల రోడ్డులో ఉన్న పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు కస్టమర్లను బార్ వెనుక గార్డెన్లో కూర్చొబెట్టి మరీ తాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మణిపురం ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బార్లో సైతం నిత్యం మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో అనేక వివాదాలు చెలరేగి అర్ధరాత్రి పూట దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. నందివెలుగు రోడ్డులోని ఉన్న రెండు బార్ల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనే లేదు. మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లు.. అనే చందంగా సాగుతున్నాయి. వైన్స్ దుకాణాలలో కంటే బార్లలో క్వార్టర్కు రూ.60 అధికంగా తీసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రూ.100కుపైగానే అధికంగా తీసుకుంటున్నారు. ఇలా అందినకాడికి దండుకుంటున్నారు. నిర్లక్ష్యంగా అధికారులు అర్ధరాత్రి వేళ బార్లు, వైన్స్ల్లో మద్యం అమ్మకాలు బహిరంగ రహస్యమే అన్నట్లు పరిస్థితి మారింది. ఈ విషయం పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటికీ తమకేమీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మద్యం షాపులకు సంబంధించి కొంత మంది కూటమి నేతలు సిండికేట్గా ఏర్పడి వైన్స్ దుకాణాల వారి నుంచి రూ.12 వేలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్ద నుంచి రూ.15 వేలు చొప్పున వసూలు చేసి ఆయా పోలీసుస్టేషన్ అధికారులు, ఎకై ్సజ్ సిబ్బందికి నెలవారీగా యారక్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల్లో ఆయా స్టేషన్ల మఫ్టీ పార్టీ కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్లో కొత్తగా అనధికారిక పర్మిట్ రూమ్కు రిబ్బన్ కట్ చేశారు. కొద్ది కాలం క్రితం వరకు పక్కనే ఉన్న బడ్డీకొట్లలో యథేచ్ఛగా తాగేవారు. ఇప్పుడు బహిరంగ మద్యపానం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేరుగా గోడ పగులకొట్టి మరీ పర్మిట్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ పక్కనే ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంది. అదే క్రమంలో బైపాస్ పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ మేరీస్, పలు కళాశాలల విద్యార్థినులు ఇటుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వైన్స్ నిర్వాహకులు పక్కనే ఉన్న ఫుట్పాత్కు తెరలను అడ్డుకట్టి మరీ తాగించేస్తున్నారు. పట్టపగలు మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో సైతం మందుబాబులు ఇక్కడి రోడ్డుపై దర్జాగా తాగేస్తున్నారు. దీంతోపాటు వైన్స్ వెనుక భాగంలో, వైన్స్ ఉన్న డాబా పైభాగంలో అడ్డూ అదుపు లేకుండా పర్మిట్ రూములు పెట్టారు. ఇక నందివెలుగు రోడ్డులో అనేక వివాదాల మధ్యన ఏర్పాటు చేసిన వైన్స్ నిర్వాహకులు కూడా పర్మిట్ రూమ్ ఓపెన్ చేశారని, మద్యం అడ్డగోలుగా విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పొన్నూరు రోడ్డులోని ఓ వైన్స్ లోపల అనుమతి లేని పర్మిట్ రూమ్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో క్వార్టర్ మద్యానికి ఫోన్పేలో పంపిన నగదు రశీదు బహిరంగ మద్యపానంపై చర్యలు బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రోన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతున్నాం. బహిరంగంగా మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు కోర్టుకు హాజరు పరుస్తున్నాం. పూర్తి స్థాయిలో కట్టడిపై దృష్టి సారిస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ డివిజన్ న్యూస్రీల్కూటమి ‘మత్తు’కు చిత్తు 24/7 మద్యం అమ్మకాలు కాసుల కక్కుర్తిలో పాలకులు వంత పాడుతున్న అధికారులు గోడలు పగులగొట్టి...సమయపాలన పాటించేలా చూస్తాంబార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ దుకాణాలు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలి. లేకుంటే తనిఖీలు నిర్వహించి, తగిన చర్యలు చేపడతాం. – అరుణకుమారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
జర్నలిస్టులపై దాడులు గర్హనీయం
చిలకలూరిపేట: జర్నలిస్టులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్వర్దన్పై కారెంపూడిలో టీడీపీ వర్గీయులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే అనుబంధ చిలకలూరిపేట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభంగా పరిగణించే మీడియా స్వేచ్ఛపై దాడులు జరగడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులు వ్యక్తిగత అభిప్రాయంతో పనిచేయరని, వారు ఏ పార్టీకి అనుకూలం, లేదా వ్యతిరేకం కాదని వెల్లడించారు. కేవలం నిజాలు మాత్రమే వెలికితీసే పనిని జర్నలిస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తప్పులు చేయకుంటే జర్నలిస్టులు వారి గురించి తప్పుగా రాయాల్సిన అవసరం ఉండదని, తప్పు చేసిన వారే దాడులకు పాల్పడటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. ప్రభుత్వం, పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ షేక్ జిలాని, చిలకలూరిపేట ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అన్నలదాసు శేషగిరి, షేక్ అబ్దుల్ సత్తార్, సభ్యులు షేక్ అల్లాబక్షు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్వలి, షేక్ కరిముల్లా, దార్ల బుజ్జిబాబు, మలాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భక్తవత్సలరావు -
కిల్కారి కాల్ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలి
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని బుధవారం ఆర్మ్ సెంట్రల్ బృందం విజిట్ చేసింది. ఈ సందర్భంగా కిల్కారి కార్యక్రమం అమలు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. పనితీరును అభినందించింది. అనంతరం సంగం జాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించారు. ఆరోగ్యకేంద్రం స్థాయిలో కిల్కారి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తల పని తీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలతో ముచ్చటించారు. కిల్కారి కాల్ సర్వీస్ను కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రవేశం పెట్టినట్లు వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించటానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని, 01244451660 అనే నంబర్ నుంచి కాల్ రావడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ఇన్చార్జి డీపీహెచ్ఎన్ఓ డాక్టర్ ప్రియాంక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజు, డీసీఎం సురేష్ పాల్గొన్నారు. -
ఎండీయూ వాహనదారులను కాపాడాలని వినతి
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని రద్దు చేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సిబ్బంది రోడ్డున పడ్డామని ఎండీయూ వాహనాల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్ల్లను ఎదుర్కొని ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీకి తప్ప దేనికీ పనికిరావని తెలిపారు. తమకు ఉపాధి చూపించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.తిరుపతి రామయ్య, కోశాధికారి కె.డాని, నాయకులు పాల్గొన్నారు.డీఆర్ఎం కార్యాలయంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సిబ్బందితో డీఆర్ఎం కార్యాలయ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్ఎం సుధేష్ఠసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తారన్నారు. అహింస, శాంతి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ప్రతిజ్ఞ చేశామన్నారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం పెదకాకాని: స్థానిక భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి పెదకాకాని గ్రామానికి చెందిన గరికపాటి వరుణ్దేవ్ రూ.1,00,116 అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ బుధవారం తెలిపారు. గరికపాటి లక్ష్మీకాంతం, వుయ్యూరు మాసమ్మ జ్ఞాపకార్థం వరుణ్ దేవ్ ఈ మొత్తంతోపాటు వెండి బిందె, గిన్నెలు విరాళంగా అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. దాతకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు. అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు దుర్గి: శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. అమ్మవారికి హుండీ కానుకల ద్వారా రూ. 31,30,423 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి సైదమ్మ తెలిపారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన లెక్కింపులో పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణ అధికారి శివనాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారి కల్యాణం మాచర్ల: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం ఘనంగా జరిపారు. అమ్మవారి జన్మదినమైన శ్రవణా నక్షత్రాని పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, బి.రఘురామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాధ, రమణారెడ్డి, కమిటీ నిర్వాహకులు కె.బ్రహ్మారావు, కె.గురవయ్య, పిచ్చయ్యల ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదం అందించారు. -
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025లో భాగంగా ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 కేంద్రాల పరిధిలో ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ)లకు దరఖాస్తు చేసిన 6,845 మంది విద్యార్థుల్లో 6,603 మంది హాజరయ్యారు. గుంటూరు జిల్లా పరిధిలోని 15 కేంద్రాల్లో 4,317 మందికిగాను 4,144, బాపట్ల జిల్లాలోని రెండు కేంద్రాల్లో 684 మందికిగాను 662, పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 1,844 మందికిగాను 1,797 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,603 మంది హాజరు -
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎం వర్సిటీలో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు
మంగళగిరి: నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో స్పోర్ట్స్’ కోటా అడిషన్లు ప్రారంభమయినట్లు మంగళవారం డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. బీటెక్ ఇంజినీరింగ్తో పాటు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డిగ్రీ కోర్సులలో అడిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు నూరు శాతం స్కాలర్షిప్ కల్పించామన్నారు. టెన్త్ , ఇంటర్ పాసై క్రీడారంగంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులు బీటెక్, బీఎస్సీ, బీఏ, బీబీఏ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. బీటెక్లో చేరే విద్యార్థులు టెన్త్, ఇంటర్లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి వుండాలని, అదే విధంగా బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులలో విద్యార్థులు 45 శాతం మార్కులు వచ్చి వుండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒలింపిక్ గేమ్స్, సౌత్ ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్నవారు డైరెక్ట్గా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పేరున్న క్రీడాకారులకు స్పోర్ట్ప్ ట్రయల్ రన్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 18 వరకు స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ఎగుమతిదారుల సమావేశం కొరిటెపాడు(గుంటూరు): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఓ హోటల్లో మంగళవారం ఎగుమతిదారుల సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి.ప్రభు అధ్యక్షత వహించారు. ఎగుమతిదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల రుణాలు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల పద్ధతులు, అంతర్జాతీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఎస్బీఐ ఏజీఎంలు రామ్ప్రసాద్, రమేష్బాబు, విజయ రాఘవయ్య, సూర్యశేఖర్, మేనేజర్ శ్రీను నాయక్, ఈసీజీసీ అధికారులు, పలువురు ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
పాత్రికేయులపై దాడులు సిగ్గుచేటు
పట్నంబజారు: పాత్రికేయులపై కూటమి నేతలు దాడులు చేయటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా కారంపూడిలో కూటమినేతల చేతిలో దాడికి గురైన సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో ఇన్చార్జ్ అశోక్ వర్ధన్ను మంగళవారం ఏటీ అగ్రహారంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా తెలియజేసే పత్రికలు, పాత్రికేయులపై ఇటువంటి దాడులు హేయమైన చర్య అని అన్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగా ‘సాక్షి’పై కావాలనే కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు చాటి చెబుతుందన్న అక్కస్సుతోనే పాత్రికేయులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అశోక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సాక్షి టీవీ ప్రతినిధిపై దాడి గర్హనీయం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్పై సర్పంచి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారే దాడులకు పాల్పడడం గర్హనీయమని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం అశోక్ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే పత్రికలు, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులపై దాడులు సహేతకం కాదని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అన్ని వర్గాల వారు ఖండించాలని.. బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బడేపురంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
తాడికొండ: తాడికొండ మండలం బడేపురం గ్రామంలో కూటమి నేతల కనుసన్నల్లో అక్రమంగా మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అర్ధర్రాతిళ్లు పొక్లెయిన్ల సాయంతో మట్టి తవ్వి ఇష్టానుసారంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమ మైనింగ్ జరుగుతుండగా గుర్తించిన మణికంఠ అనే యువకుడు ఇదేమని ప్రశ్నించాడు. దీంతో యువకుడిపై కూటమి నేతలు బెదిరింపుల పర్వానికి దిగారు. మాకు అడ్డువచ్చేంత మాత్రపు వాడివా, నీ అంతు చూస్తా.. పోలీసు స్టేషన్లో పెట్టి కొట్టిస్తా అంటూ బూతు పదజాలంలో బెదిరించారు. దీనిపై సదరు యువకుడు సోమవారం తాడికొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు మీడియాకు సైతం సమాచారం ఇచ్చి, సోమవారం అర్ధరాత్రి సమయంలో మైనింగ్ ప్రాంతానికి తీసుకెళ్లగా మీడియా ప్రతినిధులను చూసిన కూటమి నేతలు మైనింగ్ వాహనాలు తీసుకుని పరుగులు పెట్టారు. దీనిపై ఇప్పటికే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, విచారించి తగు చర్యలు తీసుకుంటామని సీఐ కె.వాసు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రశ్నించిన యువకుడికి బెదిరింపులు తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు -
మాతృ మరణాలపై సమీక్ష
లక్ష్మీపురం: జిల్లాలో మాతృమరణాలు సంభవించకుండా క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళిక ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో గత సంవత్సరం చివరి త్రైమాసికం, ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగిన ఐదు మాతృ మరణాలపై సంబంధిత వైద్య అధికారులు, వైద్యనిపుణులు, బాధితుల బంధువులతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, డీఐఓ శ్రావణ బాబు, డీసీహెచ్ఎస్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్లను రెగ్యులర్గా తనిఖీ చేయాలి లక్ష్మీపురం: ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యే కొత్త స్కానింగ్ సెంటర్స్ మరియు రెన్యువల్ స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి తనిఖీ చేయాలని, చట్టాన్ని ఉల్లఘించిన కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధ్యక్షతన గర్భస్థ లింగ నిర్ధారణ చట్టంపై డిస్ట్రిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. స్కానింగ్ కోసం కేంద్రాలకు వచ్చే గర్భిణుల నుంచి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, ప్రోగ్రామ్ నోడల్ అధికారి డా. శ్రావణ్ బాబు మాట్లాడుతూ తెనాలిలో డెప్యూటీ డీఎంహెచ్ఓ , మిగిలిన చోట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు స్కానింగ్ ఆఫీసర్లుగా తనిఖీ చేస్తారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్కు తెలిపారు. జిల్లాలో మొత్తం 298 గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షా కేంద్రాలు వున్నాయని, వాటిలో రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం ఐదు, మాడిఫికేషన్ కోసం 25 , క్యాన్సిలేషన్ కొరకు ఆరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే కొత్తగా 11 స్కానింగ్ సెంటర్లు రిజిష్ట్రేషన్ చేసుకొన్నారని వాటిని కమిటీ సభ్యులు, ప్రోగ్రాం ఆఫీసర్లు తనిఖీ చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కమిటీ కొత్త స్కానింగ్ సెంటర్లు, రెన్యువల్, మాడిఫికేషన్, క్యాన్సిలేషన్ను ఆమోదం తెలపడం జరిగింది. కమిటీ సభ్యులు డాక్టర్ రాజ్యలక్ష్మి , డాక్టర్ అనిత , డీఎస్పీ శ్రీనివాసులు, ఎన్జీఓ సీడ్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.రోషన్ కుమార్ డా. రవీంధ్ర నాయక్ , డీఏడబ్ల్యూ ఎన్.నిర్మల మేరీ , డెమో జయప్రసాద్ , లీగల్ కన్సల్టెంట్ బి.వాణి , హెల్త్ ఎడ్యుకేటర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు -
● వజ్రోత్సవ జూబిలీ ముగింపు వేడుకల్లో విశ్రాంత బిషప్ గాలిబాలి ● 8 జిల్లాలనుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు ● తరలి వచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా తేరు ఊరేగింపు
క్రీస్తు చూపిన మార్గంలో నడుద్దాం అచ్చంపేట: ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందాలని, ఏసు క్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలిబాలి అన్నారు. మండలంలోని తాళ్లచెరువులో బాలఏసు దేవాలయం నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న జూబిలి వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాసీ్త్రలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. వైభవంగా తేరు ప్రదక్షిణ విశాఖపట్నం అగ్రిపీఠాధిపతులు ఉడముల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవిందుజోజి, ఏలురు పీఠాధిపతి పొలిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన కోఆజ్యుటర్ పీఠాధిపతులు పిల్లి అంథోనిదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలాధికారి విజయపాలేరెడ్డిలతో పాటు అనేమంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి అంతోనిరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్యరీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాలనుంచి క్రైస్తవులు తండోప తండాలుగా తరలి వచ్చారు. రాత్రి 10 గంటలకు నిర్వహించిన తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో తేరు (రథం)పై బాలఏసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి, గ్రామాలనుంచి తరలి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే
గుంటూరు వెస్ట్: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారి సంఖ్య 3.5 లక్షలు ఉందన్నారు. ఈ ఉద్యోగుల భవిష్యత్తును నూతన పెన్షన్ స్కీం ద్వారా ప్రభుత్వాలు కొలిమిలోకి నెట్టేసినట్లు అయ్యిందన్నారు. తమ పోరాటాల ఫలితంగా 2017లో గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్లు సాధించామని చెప్పారు. ఏపీఈఏఈ జిల్లా అద్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కనీస సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అనంతంర జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుబ్బారావు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీపీఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ -
సువర్ణ భారతి మహాద్వారం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేటలోని శ్రీశృంగేరీ శంకరమఠం మార్గంలో నూతనంగా నిర్మించిన సువర్ణ భారతి మహాద్వారాన్ని మంగళవారం శ్రీశృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ మహాస్వామి ప్రారంభించారు. అనంతరం శంకరమఠంలోని శ్రీశంకర చంద్రమౌళీశ్వరస్వామి, శ్రీశారదాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాద్వారం నిర్మాణానికి సహకరించిన వేదాంతం సీతారామ అవధాని, కపలవాయి విజయకుమార్లకు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి రాకతో మఠంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా బృందాలు కోలాటాలు, భక్తి గీతాలాపనలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
జర్నలిస్టుపై దాడి హేయం
గుంటూరు మెడికల్: మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైఎస్ ఎంపీపీ ఉప ఎన్నిక న్యూస్ కవరేజ్కు వెళ్లిన సాక్షి టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అశోక్వర్ధన్పై కొందరు స్థానిక వ్యక్తులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈమేరకు మంగళవారం బాధితుడు అశోక్వర్ధన్తో పాటు పలువురు జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు యూనియన్ నగర అధ్యక్షుడు వి.కిరణ్కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వార్తల సేకరణకు వెళ్లిన అశోక్వర్ధన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనియన్ నగర కార్యదర్శి కె.ఫణీంద్ర మాట్లాడుతూ కూటమి నేతలు జర్నలిస్టులపై దాడులు జరగకుండా నిలువరించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘సాక్షి’ మీడియాపై మూడు సార్లు దాడులు జరిగాయయని వెల్లడించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి డి.రమేష్బాబు, ఫొటోగ్రాఫర్ రామ్గోపాలరెడ్డి, సుభాని, మొండితోక శ్రీనివాసరావు, పి.ప్రశాంత్(నాని), డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, సీహెచ్ కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సురేంద్రనాథ్, రాఘవ, జయపాల్, శ్రీనివాస్, తుమ్మలకిరణ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేత -
హనుమత్ జయంత్యుత్సవాలు
తెనాలి: స్థానిక మారీసుపేటలోని శ్రీకోదండ రామస్వామివారి దేవస్థానం (రామభక్త అప్పలస్వామిగుడి)లో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామికి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజున స్వామివారికి ఆకు పూజ, ప్రాతఃకాల అర్చన, వడమాల, అప్పలమాల సమర్పించారు. హనుమత్ జయంతి రోజు స్వామివారికి విశేష కార్యక్రమాల్లో భాగంగా భక్తుల చేత పంచామృత అభిషేకం, డ్రై ఫ్రూట్స్ పళ్లరసాలతో అభిషేకం, తమలపాకులతో సహస్రనామావళి పూజ, మామిడి పండ్లతో అష్టోత్తరం, ఎంతో విశేషమైన మన్య సూక్తం హోమం జరిపిస్తున్నట్లు ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలియజేశారు. ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను జరిపించారు. వీరాంజనేయుడుకి తులసి దళార్చన తెనాలి: పట్టణ మారీసుపేటలోని శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో గల వీరాంజనేయస్వామికి ఈనెల 22వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని లక్ష ప్రదక్షిణముల మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈనెల 12వ తేదీనుంచి ఆరంభమైన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణంలోనూ సామూహికంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వామివారికి తులసి దళార్చన చేశారు. తదుపరి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. లలితా గోష్టి వారిచే హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సామూహిక సిందూరార్చన జరిపించారు. 22న హనుమజ్జంతి వేడుకను నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంధి సేతుమాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధరరావు, కోశాధికారి వరదా వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమ్మరాజు, తాడిపర్తి హరిప్రసాద్ పర్యవేక్షించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025చీరాల: తీరం వద్ద ఘోరం జరిగింది. వాడరేవు సాగర తీరంలో స్నేహితులందరూ సరదాగా సేద తీరేందుకు ఉత్సాహంగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ కారులో వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తిరిగి ఏమైనా అల్పాహారం తినేందుకు చీరాల వస్తున్న వారి కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఏమైందో తెలియదు. ప్రమాదం నుంచి తేరుకుని ఏమైందో తెలుసుకునే సరికి అప్పటి వరకు సరదాగా గడిపిన స్నేహితులు రక్తగాయాలతో చెల్లాచెదురుగా పడిపోయారు. హహాకారాలు, రోదనలతో వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు అంబులెన్స్లో క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఇద్దరు మృతిచెందగా మరొకరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...చీరాల మండలం వాడరేవు–పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజికి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఇన్నోవా కారులో గుంటూరు నుంచి చీరాల మండలం వాడరేవు బీచ్కు వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపిన వీరు తిరిగి అల్పాహారం తీసుకునేందుకు చీరాల వస్తున్నారు. జాతీయ రహదారిపై వాడరేవు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రోహిత్ నాయక్ (19), అజయ్ (18) సంఘటనా స్థలంలో మృతిచెందారు. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్ (24) మృతిచెందాడు. మరో ఐదుగురు యవకులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల వచ్చిన వారిలో ఒకరిది తెనాలి కాగా మిగిలిన వారందరు గుంటూరుకు చెందిన వారే. గుంటూరుకు చెందిన వారిలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. ప్రమాద ఘటనపై రూరల్ సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషాదం నింపిన విహారయాత్ర... సరదాగా గడిపేందుకు స్నేహితులుతో విహార యాత్రకు వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. అందరూ చిన్న వయస్సు వారే. పాలిటెక్నిక్ సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసి సరదాగా గడుపుదామని కారులో చీరాల వాడరేవు బీచ్కు వచ్చారు. గుంటూరు నుంచి బాపట్ల వచ్చి అనంతరం చీరాల వచ్చారు. మధ్యాహ్నం తర్వాత చీరాల వచ్చిన వీరు సాయంత్రం వరకు బీచ్లో ఆనందంగా గడిపారు. ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారు యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో రెప్పపాటులో స్నేహితులు విగతజీవులయ్యారు. కళ్లముందే స్నేహితులు రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తీవ్రగాయాలైన వారు రోదనలతో వైద్యశాల నిండిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అందరూ చిన్న వయస్సు వారు. తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉంటారని అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. న్యూస్రీల్ టైరు పేలి పల్టీ కొట్టిన కారు గుంటూరు నుంచి వాడరేవుకు కారులో వచ్చిన 9 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు సంఘటనా స్థలంలో ఇద్దరు, వైద్యశాలలో ఒకరు మృతి క్షతగాత్రులకు ఏరియా వైద్యశాలలో చికిత్స -
వైఎస్ జగన్ ఫొటో ఉందని సెక్రటరీ సస్పెన్షన్
నెహ్రూనగర్: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో ఫ్లెక్సీలో ఉందనే కారణంతో గుంటూరు నగరంలోని 91వ వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీ పూర్ణిమను సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలు ప్రత్యేకంగా సచివాలయం కనిపించే ఉద్దేశంతో బోర్డులను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు. అయితే గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోర్డుల్లోని మాజీ సీఎం ఫొటోలు కనిపించకుండా స్టిక్కర్లు, అంటించుకోవాలని సిబ్బందికి అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు. కొత్త బోర్డులు రాకపోవడంతో సచివాలయాల వద్ద పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఏటీ అగ్రహారం జీరో లైన్ 91వ సచివాలయం బయట బోర్డుకు ఉన్న స్టిక్కర్ వర్షానికి తడిచి ఊడిపోయింది. దీంతో అటుగా వెళ్లే కొంత మంది మాజీ సీఎం ఉన్న ఫొటోను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని అదునుగా తీసుకున్న నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ ఎన్.పూర్ణిమను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు సకాలంలో బోర్డులు తొలగించి ఉంటే ఈ సస్పెన్షన్ ఉండేది కాదు కాదా.. అధికారులు చేసిన తప్పిదానికి మమ్మల్ని బలిని చేస్తారా అంటూ సచివాలయ సెక్రటరీల యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. -
శ్రీవారికి వైభవంగా శ్రీచక్రస్నానం
తెనాలి: పట్టణంలో చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ అనంతరం స్వామివారికి వసంతోత్సవం, శ్రీచక్రస్నానం సంప్రదాయబద్ధంగా జరిపించారు. రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణం, పూర్ణాహుతి జరిపించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.మహంకాళీ దేవస్థానంలో చండీ హోమందుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 48వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం చండీ హోమం నిర్వహించారు. పోసాని నాగేశ్వరరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ కె.సునీల్ కుమార్ పర్యవేక్షించారు.వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలంకొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యవసాయ శాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. జూన్ 2వ తేదీ లోపు వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాల్లో బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. మిగిలిన వారు కూడా రిక్వస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ), మండల వ్యవసాయ అధికారులు(ఏఓ), ఏడీఏ, డీడీఏ, మినిస్టీరియల్ స్టాఫ్, వాచ్మెన్, అటెండర్స్ తదితర అన్ని విభాగాల్లోనూ బదిలీల ప్రక్రియ ఉండటంతో ఎవరికి వారు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సిఫారసుల కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. కొన్ని స్థానాలకు ఉద్యోగుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో డబ్బు ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని చెబుతున్నారు.సమగ్రశిక్ష ఏపీసీగా పద్మావతి బాధ్యతలు స్వీకరణగుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ)గా ఐ.పద్మావతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.సాయుధ దళాల నిధికి రూ.లక్ష విరాళంగుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు తరఫున రూ.లక్ష చెక్కును జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతులమీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణషీలాకు బ్యాంకు అధికారులు అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ దేశం కోసం పాటుపడే సైనికుల సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా పంచుకోవాలన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు క్లస్టర్ హెడ్ జె.హరిప్రసాద్, ఎస్కె గౌస్బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐసెట్లో సత్తా చాటిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన రావూరి మాధుర్య రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా నుంచి ఐసెట్కు హాజరైన 1,528 మంది విద్యార్థుల్లో 1,485 మంది ఉత్తీర్ణులయ్యారు. బాపట్ల, చీరాల నుంచి పరీక్షలు రాసిన 354 మంది విద్యార్థుల్లో 338 మంది ఉత్తీర్ణత సాధించారు. పల్నాడు జిల్లాలో పరీక్షకు హాజరైన 725 మంది విద్యార్థుల్లో 678 మంది ఉత్తీర్ణులయ్యారు. కోచింగ్ లేకుండానే 5వ ర్యాంకు ఐసెట్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించిన విద్యార్థిని రావూరి మాధుర్య ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఆమె తండ్రి నాగేశ్వరరావు గతంలో వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం ఆర్కెస్ట్రా గ్రూప్లో తబలా వాయిద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ఇద్దకు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి స్రవంతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతోంది. రెండో కుమార్తె మాధుర్య 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ప్రామాణిక పుస్తకాలను చదువుతూ సొంతంగా ప్రిపేర్ అవుతోంది. ఎస్సెస్సీ పరీక్షలకు వ్యవధి ఉండటంతో ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసి, ఎటువంటి కోచింగ్ లేకుండా నేరుగా పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు కై వసం చేసుకుంది. ఆమెతో పాటు ఐసెట్ రాసిన ఆమె అక్క స్రవంతి 1,233వ ర్యాంకు సాధించింది. ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఆంధ్ర విశ్వ విద్యాలయంతో పాటు ఏదైనా ప్రముఖ వర్శిటీలో ఎంబీఏలో చేరి, తన లక్ష్యమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎస్సెస్సీకి సన్నద్ధమవుతానని చెబుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 96 శాతం ఉత్తీర్ణత లాం విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు -
పశ్చిమ డెల్టా మరమ్మతులకు రూ.25 కోట్లు మంజూరు
జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరత్నం తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలోని పంట, మురుగు కాల్వల మరమ్మతులను జూన్ పదో తేదీలోగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ పులిపాటి వెంకటరత్నం సూచించారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం స్థానిక జలవనరుల శాఖ డివిజన్ కార్యాలయం హాలులో నిర్వహించారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. ఇంజినీర్ వెంకటరత్నం మాట్లాడుతూ ఖరీఫ్ సీజను ఆరంభానికి మరమ్మతుల పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. నారుమడులకు సాగునీటిని జూన్ పదో తేదీ నాటికి పంట కాల్వలకు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆలోగా కాల్వలు, డ్రెయిన్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు మాట్లాడుతూ పశ్చిమ డెల్టాలో పంట, మురుగు కాల్వలకు మరమ్మతుల్లో మొత్తం 746 పనులను గుర్తించినట్టు తెలిపారు. -
దుగ్గిరాల మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక సోమవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ శంకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ నుంచి ఎనిమిది మంది, జనసేన నుంచి ఒకరు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ప్రిసైండింగ్ అధికారి ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ సభ్యులంతా గైర్హాజర్ అయ్యారు. తుమ్మపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి మంచికలపూడి ఎంపీటీసీ సభ్యుడు మరీదు రాము పేరును ప్రతిపాదించారు. ఈమని–1 ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య బలపరిచారు. దీంతో మరీదు రాము ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రిసైడింగ్ అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించి ప్రమాణం చేయించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు.ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశంపట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.గరుడ వాహనంపై గ్రామోత్సవంతెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.ఈఏపీ సెట్ ప్రారంభంగుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) సోమవారం ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 3,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 22 కేంద్రాల పరిధిలో సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,588 మంది విద్యార్థుల్లో 3,347 మంది హాజరయ్యారు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఆయా కేంద్రాల పరిధిలో ఆన్లైన్ సీబీటీ పరీక్షలు సజావుగా జరిగాయి. -
ఏదీ.. ఆనీటి వైభవం !
తాడేపల్లి రూరల్: రెండు రాష్ట్రాల మధ్య ప్రముఖ జల రవాణా మార్గమైన బకింగ్ హామ్ కెనాల్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణల చెరలో ఉండటంతో రూపురేఖలను కోల్పోయింది. కెనాల్ మొత్తం పొడవు 427 కిలోమీటర్లు. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల సముద్రానికి మూడు మైళ్లు, ఎక్కువ భాగం అర కిలోమీటరు దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్ సరస్సు పరిధిలో ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ బకింగ్ హామ్ కెనాల్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. 1806లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కో క్రైన్స్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంతకాలం ఆయన పేరు మీదే కోక్రైన్స్ కెనాల్ అని పిలిచేవారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి గవర్నర్ డ్యూక్ బకింగ్హామ్ పర్యవేక్షణలో కాలువ పనులు జరగడంతో ఆ పేరు వచ్చింది. బంగాళాఖాతం తీరానికి కిలోమీటరు దూరంలో, ఆంధ్రాలోని కాకినాడ నుంచి, చైన్నెలోని విల్లుపురం వరకు కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్రప్రదేశ్లో 262 కి.మీ., తమిళనాడులో 165 కి.మీ. పొడవు ఉంది. ప్రధాన జల రవాణా మార్గం బకింగ్ హామ్ కాలువ బ్రిటిష్ వారి హయాంలో ఒక వెలుగు వెలిగింది. ఈ మార్గంలో రైల్వేలైన్ ఏర్పాటు చేయక ముందు ఇదే ప్రధాన జల రవాణాగా ఉంది. కాకినాడ నుంచి చైన్నె వరకు ఉన్న కాలువల్లో ఇది ఒకటి. గోదావరి జిల్లాలో కాకినాడ కాలువ, కృష్ణా జిల్లాలో ఏలూరు కాలువ, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల నుంచి బాపట్ల జిల్లా పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువగా దీన్ని పిలుస్తారు. పెదగంజాం నుంచి ఒంగోలు, కొత్తపట్నం మీదుగా చైన్నె వరకు బకింగ్హామ్ కెనాల్గా పిలుస్తారు. దుగ్గిరాల లాకుల వద్ద చీలిక 1855లో కృష్ణా బ్యారేజ్ని నిర్మించిన తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తయింది. విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజ్ వద్ద నుంచి కుడి ప్రధాన కాలువ దుగ్గిరాల లాకుల వద్ద రెండుగా చీలుతుంది. వాటిలో ఒక కొమ్మమూరు కాలువ కాగా, రెండవది నిజాంపట్నం కాలువ. దుగ్గిరాల లాకుల వద్ద మొదలైన కొమ్మమూరు కాలువ సంగం జాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల, నర్సాయపాలెం, కారంచేడు, సంతరావూరుల మీదుగా పెదగంజాంవద్ద వరకు ఉంది. పెదగంజాం వద్ద ఇది బకింగ్హామ్ కాలువతో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ మంచినీటితో కూడిన పంట కాలువ కాగా, బకింగ్ హామ్ కాలువ ఉప్పునీటి కాలువ. అప్పట్లో కాలువపై రవాణాకు అనుగుణంగా కాకినాడ నుంచి చైన్నె వరకు పలు చోట్ల లాకులను నిర్మించారు. వీటిని 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల చాంబర్లతో ఏర్పాటు చేశారు. జాతీయ జలమార్గం–4గా కేంద్రం ప్రతిపాదన జల రవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వజీరాబాదు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న కృష్ణానది, భద్రాచలం వద్ద నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న గోదావరి, కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కృష్ణా కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్హామ్ కాలువలన్నింటినీ కలిపి జాతీయ జలమార్గం–4గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను కలిపే 1,095 కిలోమీటర్ల పొడవైన దీన్ని జాతీయ జలమార్గం–4గా ప్రకటించారు. జాతీయ జలమార్గాల బిల్లు ద్వారా 2008 నవంబర్లో దీన్ని జాతీయ జలమార్గంగా ప్రకటించారు. అప్పట్లో 2013 నాటికి పూర్తి చేయాలని తలపెట్టారు. కానీ నేటికీ జాతీయ జలమార్గం–4 ఊసే లేకపోయింది. పలుచోట్ల ఆక్రమణల చెరలో కాలువ భూములు అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో జల రవాణా మార్గం ప్రతిపాదనలను పక్కన పెట్టిన కేంద్రం పూడికతీతకు నోచుకోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిటిష్ వారి హయాంలో బకింగ్హామ్ కెనాల్ ఒక వెలుగు వెలిగింది. ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఉపయోగంలో లేకుండా పోయింది. దక్షిణ భారతావని 1876, 1878లో కరువు కోరల్లో చిక్కుకున్న సమయంలో ఆహార ధాన్యాల తరలింపులో కీలకపాత్ర పోషించింది. 1880 నుంచి 1940 వరకు అతి తక్కువ ఖర్చులో ప్రజల, సరుకుల రవాణా సౌకర్యానికి ఉపయోగపడింది. స్వాతంత్య్రానంతరం 1947 నుంచి దీన్ని ఉపయోగించడం తగ్గింది. అప్పటికి రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈ కాలువ ద్వారా రవాణా నిలిచిపోయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న కొమ్మమూరు కాలువ ద్వారా పడవల రవాణా నిలిచిపోయినప్పటకీ సాగు, తాగునీటి కాలువగా ఉంది. పెదగంజాం నుంచి పిలువబడే బకింగ్హామ్ కాలువ ఉప్పునీటితో ఉంటుంది. జల రవాణా నిలిచిపోవడంతో భారీగా ఆక్రమణలకు గురైంది. కొన్ని చోట్ల రూపురేఖలను కోల్పోయింది. వేల ఎకరాల కాలువ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీన్ని జల రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంలో సరుకులు రవాణా చెయ్యవచ్చు. పర్యాటకంగా కూడా కాలువ ఆకర్షణీయ మార్గంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బకింగ్హామ్ కెనాల్ను జల రవాణా మార్గంగా అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాల్సి ఉంది. కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన గేట్లు సైతం తుప్పు పట్టి శిథిలావస్థ కు చేరుకుంటున్నాయి. -
పూజల్లో సామాన్య భక్తులకు అవకాశం
పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఐదు రోజులపాటు జరిగే పూజల్లో సామాన్య భక్తులకు రిక్త హస్తం చూపుతున్నారని ‘సాక్షి’లో సోమవారం ‘పెద్దలకే పెద్దపీట’ పేరుతో కథనం వెలువడింది. దీనిపై హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు, ఆలయ అధికారులు స్పందించారు. ఐదు రోజులపాటు జరిగే సేవా కార్యక్రమాల్లో సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా సోమవారం జరిగిన లక్ష తులసి మొక్కల పూజల్లో మహిళలు, సామాన్య భక్తులు పాల్గొన్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై హర్షం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న రశీదుల పరంపర గతంలోనే ‘సాక్షి’లో నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న పూజలకు రశీదు ఇవ్వడం లేదని కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన లక్ష తులసి దళం పూజకు హాజరైన దాతలు రూ. 5,116, ప్రత్యేక హోమానికి రూ. 5,116, క్షీరాభిషేకానికి రూ. 1,116లు రుసుం చెల్లించారు. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన తరువాత అసిస్టెంట్ కమిషనర్ సుభద్ర ఆలయాన్ని సందర్శించారు. రుసుం చెల్లించకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజలు నిర్వహించేందుకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. దీంతో దీక్ష సమాజం సభ్యులు ప్రతి పూజకు రశీదులు అందిస్తున్నారు. -
అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దు
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను అధికారులు పదే పదే తమ కార్యాలయాలకు తిప్పుకోవద్దని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలు వినాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పారు. ప్రజలు కూడా అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని, దీంతో ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని, సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని అధికారులకు తెలిపారు. అనంతరం వచ్చిన 190 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ -
ప్రత్యేక అవసరాలు గల బిడ్డలు ఎందరికో తల్లిగా మారింది
మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్ఎంజెల్స్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్కు ఎంపికై నా, అనివార్య కారణాలతో సైక్లింగ్లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం. -
అదే.. ఆ తల్లి ప్రత్యేకత
● మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక ● కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ● ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు ● బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ● ఇష్టమైన సైక్లింగ్లోనూ శిక్షణనిచ్చింది ● స్పెషల్ ఒలింపిక్స్లో పతకాలు నెగ్గేలా చూశారు ● ఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లి తెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కై వసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.’’ మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే...డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేర్పించారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది. -
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి. –జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరు -
ప్రజారవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్ర
నరసరావుపేట: శిక్షణ తీసుకున్న డ్రైవర్లు ప్రమాదరహితంగా వాహనాలను నడుపుతూ ఇంధన పొదుపు డ్రైవర్లుగా మెలగాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.మధు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఉన్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న 19వ బ్యాచ్ డ్రైవర్లకు సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాలో డ్రైవర్లది ముఖ్యపాత్రని, శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు స్వస్తి పలికి సేవా దృక్పఽథం అలవర్చుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించి ప్రమాదాలు నివారించాలని వెల్లడించారు. డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలోడ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు పి.బొల్లయ్య, షేక్ సుభాని పాల్గొన్నారు. పీటీడీ జిల్లా అధికారి మధు శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు ప్రదానం -
ఉద్యోగాల పేరిట మోసం
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో మోసగించారని కొందరు, కంపెనీలో వచ్చే లాభాల్లో పర్సంటేజీలు ఇస్తామని మోసగించారని ఓ మహిళ వాపోయింది. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు– పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఏఎస్పీలు (పరిపాలన) రమణమూర్తి, కె.సుప్రజ (క్రైం) స్వీకరించారు. వారి మొరను అలకించారు. ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించిన వారిలో డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళ పీఎస్) ఉన్నారు. బాధితుల గగ్గోలు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో మొర -
సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య రంగంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకుని సమాజంలో ఉత్తమ వైద్యులుగా సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. చంద్రమౌళీనగర్లోని భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ నుంచి వందలాది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఎయిమ్స్, జిప్మర్ వంటి సంస్థల్లో సీట్లు సాధించి వైద్యవిద్యనభ్యసించడం అభినందనీయమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. వైద్యవృత్తిలో నైపుణ్యం సాధించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం మెడెక్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు సీట్లు సాధించి ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల ద్వారా వైద్యవిద్యనభ్యసించి దేశ, విదేశాల్లో ఉత్తమ వైద్యులుగా రాణించడం ఒక గురువుగా తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భాష్యం విద్యార్థులు ప్రపంచం నలుమూలలా భాష్యం ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.చంద్రశేఖర్ను భాష్యం రామకృష్ణ దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం మెడెక్స్లో విద్యనభ్యసించిన 300 మంది వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ -
ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు
గుంటూరు లీగల్: ఈనెల 19 నుంచి జులై 5 వరకు జరగనున్న లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ ప్రమాదాల కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కరించడానికి కృషి చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్బాబు చెప్పారు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రతినిధులు, న్యాయవాదులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. మోటార్ వెహికల్ ప్రమాదాల కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కంపెనీ మెంబర్స్, కౌన్సెల్స్ పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పిటిషనర్ను, అతడి కౌన్సెల్ను కూడా పిలిపించి ప్రీ సిట్టింగ్ ద్వారా కేసును రాజీ చేయాలని ఆయన సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్కు పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో బార్ కౌన్సెల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కౌన్సెల్స్ పాల్గొన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు -
వ్యాపారంలో వాటా ఇస్తానని..
గుంటూరు లక్ష్మీపురంలోని ఓ ట్రేడింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేశా. వచ్చే లాభాల్లో పర్సంటేజీ ఇస్తానని యజమాని నమ్మించాడు. నేను రూ.20 లక్షలు, మరో ఇద్దరు రూ.10 లక్షలు చెల్లించారు. ఏళ్లు గడిచినా తిరిగి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆ ఏరియాలో కార్యాలయం లేదు. తెలిసిన వారి వద్ద అప్పులు, బ్యాంక్లో రుణం తీసుకుని అతనికి చెల్లించాను. ఈ క్రమంలో యజమాని భార్య మాతో అమర్యాదగా మాట్లాడుతోంది. వ్యాపారం లాభాల్లో పర్సంటేజ్ ఇస్తానని మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలి. – సబ్బినేని రోజ, వైష్ణవినగర్, పొన్నూరు టౌన్. పాప చికిత్సపై విచారణ చేపట్టాలి గత నెల 9న మా కుమార్తె లాస్య(16)కు జ్వరంలో మూర్ఛలు వచ్చాయి. కొత్తపేట గౌరీశంకర్ థియేటర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అక్కడ నుంచి వారి ఆసుపత్రికి తరలించారు. మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉండాలని అక్కడి వైద్యులు సూచించారు. అదే రోజు రాత్రి వైద్యులు పిలిచి, పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో డిశ్చార్జ్ చేయాలని కోరాం. డిశ్చార్జ్ చేయడంలో అలస్యమైంది. రాత్రి తొమ్మిది తర్వాత చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించే క్రమంలో 11వ తేదీ ఉదయం పాప మృతి చెందింది. డిశ్చార్జ్ విషయంలో నిర్లక్ష్యం, పాపకు అందించిన చికిత్సపై విచారించాలని కోరుతున్నాం. – లాస్య తల్లిదండ్రులు కల్యాణ్, ఉమాదేవీ, మారుతీనగర్ బాధితుల సమస్య వింటున్న జిల్లా ఏఎస్పీ రమణమూర్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఉద్యోగాల నిమిత్తం నలుగురు విద్యార్థులం కలిసి అతడి వద్దకు వెళ్లాం. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ఒక్కొక్కరూ రూ.1.85 లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో మొత్తమ్మీద రూ.7.40 లక్షలు అతనికి చెల్లించాం. ఈ క్రమంలో చిరునామా లేని ఓ కంపెనీలో ఆఫర్ లెటర్లు ఇచ్చారు. ఆ కంపెనీ ఫేక్ అని, గతంలోనూ పలువురిని మోసగించినట్లు తెలిసింది. ఉద్యోగాల పేర్లతో మోసగించిన వ్యక్తిని విచారించి తమకు న్యాయం చేయాలి. – సయ్యాద్ఖాజా, ఆర్టీసీ కాలనీ ఆర్మీలో ఉద్యోగమని రూ.34 లక్షలు ... ఆర్మీ ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా తెలిసిన బంధువు పరిచమయ్యారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పి స్తానని నన్ను, కుటుంబ సభ్యులను నమ్మించారు. నెల్లో ఉద్యోగం వస్తోందని, అందులో వారికి డబ్బులు చెల్లించాలని చెప్పి దఫాల వారీగా రూ.34 లక్షలు తీసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో వైజాగ్లోని ఓ రూంలో బస చేయించాడు. తర్వాత అక్కడ నుంచి పంపించేశాడు. దీంతో మోసగించినట్లు తెలిసి డబ్బులు అడిగితే వాయిదాలు వేస్తున్నాడు. పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. పొలం, ఇంటి స్థలం విక్రయించగా వచ్చిన సొమ్ము, అప్పులు చేసిన డబ్బులు అతనికి చెల్లించాను. న్యాయం చేయాలి. – బాధితుడు, పొన్నూరు ● -
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
పట్నంబజారు: మహిళపై లైంగిక దాడితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 12న మధ్యాహ్నం సుద్దపల్లి డొంక ప్రగతీ నగర్ 7వ లైనుకు చెందిన మహిళ తల్లి ఇంటికి వెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి అమ్మమ్మ రాహెలమ్మ రావడంతో ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి షాబాజ్ పరారయ్యాడు. మరుసటిరోజు 13వ తేదీన నిందితుడు షాబాజ్, ఆయన మేనమామ నాగూల్ మీరా, బంధువులు నాసర్ హుసేన్, హనీఫ్లు మహిళ ఇంటి వద్దకు వెళ్లి, జరిగిన విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. దీంతోపాటు కులం పేరుతో దూషించి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షేక్షాబాజ్ను సోమవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ షేక్ అబ్దుల్ రహమాన్, సిబ్బందిని అభినందించారు. నిందితుడు షాబాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
పేదల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గుంటూరు వెస్ట్: పేదల ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం ఒక ప్రభుత్వ శాఖతో వీలుపడదని, అన్ని శాఖల మండల, జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక కూడా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని తెలిపారు. గృహ నిర్మాణాలకు గానూ లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. పొలాల్లో నీటి కుంటల తవ్వకాల టార్గెట్ పూర్తి చేయాలని జేసీ చెప్పారు. రైస్ కార్డును ఏడురకాల సర్వీసు ప్రొవైడర్లు ఇస్తున్నారని, కొన్ని కేటగిరిల్లో వచ్చిన 11,446 సర్వీసు రిక్వెస్టులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పురోగతిలో ఉండాలని, దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని జేసీ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, హౌసింగ్ పీడీ ప్రసాద్, స్టెప్ సీఈఓ ఆర్.చంద్రమణి, డ్వామా పీడీ శంకర్, సీపీఓ శేషశ్రీ , అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
విద్యుత్ షాక్తో రైతు దుర్మరణం
నాదెండ్ల: విద్యుత్ షాక్కు గురై రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చేకూరి హనుమంతరావు (70) తూబాడు రోడ్డులో తనకున్న వ్యవసాయ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో పొలానికి వెళ్లి ఇనుప గేటు తీసే క్రమంలో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చుట్టూ రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైరు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. దీంతో గేటు తీసే క్రమంలో షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న చంటి అనే వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లగా, విగతజీవిగా పడిఉన్న హనుమంతరావును చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.నగలు చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టుచిలకలూరిపేట: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని డైక్మెన్ కాలనీకి చెందిన పేదాల రాముడు, మదర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న బీరా సిద్దు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన యలగాల హనుమాయమ్మ ఈ నెల ఆరోతేదీన ఇంటికి తాళం వేసి సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 11వ తేదీ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. పరిశీలించగా 42 సవర్ల బంగారు నగలు, 59.40 గ్రాముల వెండి వస్తువులు, రాగి బిందెలు, చెంబులు, ఇత్తడి సామగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ. 34లక్షలు ఉంటుంది. రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు, ఎస్ఐ జి.అనిల్కుమార్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నిందితులను చిన పసుమర్రు గొర్రెల మండి వద్ద అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకోవడంపై పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐలు డి.రోసిరాబు, జి.సుబ్బారావు, హెచ్సీలు కె.దేవరాజు, జె.శ్రీధర్, పీసీలు ఎం.ఇర్మియా, బి.అశోక్, ఎం.రత్నకిశోర్ పాల్గొన్నారు.ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతిసంతమాగులూరు (అద్దంకి రూరల్): క్వారీలో పనికి వెళ్తూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఇలుమలై నాగరాజ్ (44) సజ్జాపురం గ్రామంలో ఉన్న తిరుమల సాయిచంద్ర గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి ట్రాక్టర్ కొండ ఎక్కుతుండగా తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్ఐసీ పాలసీలపై జీఎస్టీ తొలగించాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తొలగించాలని పాలసీదారులకు బోనస్ను పెంచాలని ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్లో గల మాడా విశ్వేశ్వరరావు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన లియాఫీ ఏజెంట్ల యూనియన్ మచిలీపట్నం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలసీదారులకు లోన్పై వడ్డీ రేటు తగ్గించాలని, ఏజెంట్లు అందరికీ మెడి క్లైమ్ను కుటుంబ సమేతంగా కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్స్యూరెనన్స్ ఏజెంట్గా పని చేస్తున్నంత కాలం కలిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో దిగువ తరగతి వారికి రూ. లక్ష పాలసీ ప్రవేశ పెట్టాలని మేనేన్మెంట్ను ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సత్తెనపల్లి బ్రాంచి అధ్యక్షుడు మంచాల రమేష్ మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు అని, ఎల్ఐసీని బలోపేతం చేయడంలో కీలకమని తెలిపారు. ఏజెంట్లు అభివృద్ధికి సంస్థ కృషి చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ నాయకులు రవీంద్రరెడ్డి, అలిమియా, జగన్నాథం, రఘు, శ్రీనివాసరెడ్డి, మారుతి, సత్తెనపల్లి బ్రాంచి ఎల్ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ పాలసీదారులకు బోనస్ పెంచాలి -
మద్యం మత్తులో డ్రైవింగ్
తాడేపల్లి రూరల్: ఫూటుగా మద్యం తాగి కారును విచక్షణారహితంగా నడపడంతో వృద్ధుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో పెనుమాక–ఉండవల్లి మధ్య ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నరేష్ అనే వ్యక్తి బొలేరో వాహనంలో పెనుమాక నుంచి ఉండవల్లి వెళుతున్నాడు. ఈక్రమంలో ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక వెళ్తున్న బ్రహ్మయ్య (60) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బ్రహ్మయ్యతో పాటు వాహనంపై వున్న మరో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. వీరి వెనుక వున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అతనికీ గాయాలయ్యాయి. బొలెరో వాహనం రెండు వాహనాలను ఢీకొట్టడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు గాలిలోకి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అనంతరం బొలెరో వాహనం రోడ్డు పక్కన వున్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యతో పాటు గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రహ్మయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మద్యం మత్తులో వున్న నరేష్ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభంక్రోసూరు: స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను కంచేటి సాయిబాబు ఆదివారం ప్రారంభించారు. మొత్తం 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు. సాయిబాబు మాట్లాడుతూ క్రీడల వల్ల యువతకు ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.50,116, ద్వితీయ బహుమతిగా రూ.25,116, మూడో బహుమతిగా రూ.10,116, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రూ.5,116 అందించనున్నట్లు వెల్లడించారు. బెస్ట్ బ్యాట్స్మన్కు రూ.2,116, బెస్ట్ బౌలర్కు రూ.2,116 అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దిగుమర్తి అప్పారావు, మన్నెం శ్రీను, వెంకటరామిరెడ్డి, బండారు రాము, కంభంపాటి రాము, బాబు పాల్గొన్నారు. -
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెనన్స్ టెక్నికల్ పర్సనన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నెంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నాయకులు కే శ్రీనివాసరావు, బీ ముత్యాలు, పి దీవెనరావు, బాబురావు, డి కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విద్యుత్ పోల్ పైనుంచి పడి షిఫ్ట్ ఆపరేటర్ మృతినరసరావుపేట రూరల్: మండలంలోని ఉప్పలపాడు కరెంట్ ఆఫీస్లో షిఫ్ట్ ఆపరేటర్ పనిచేస్తున్న రఫీ కరెంట్ షాక్తో మృతిచెందాడు. విద్యుత్ పోల్ మీద పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పోల్పై నుంచి కింద రాయిమీద పడటంతో తీవ్రగాయాలకు లోనై మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి అదృశ్యం మూడు రోజులుగా లభించని ఆచూకీ కారంచేడు: కారంచేడు పాలేటివారి బజారుకు చెందిన ఒక విద్యార్థి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలని విద్యార్థి అదృశ్యం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మీనిగ జయప్రకాష్కు ఇద్దరు కుమారులు.. రెండో కుమారుడు మీనిగ సామ్యేల్ ప్రణీత్ చీరాలలోని ఒక ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి ఇంటి వద్ద నుంచి కనిపించడం లేదని బంధువులు తెలిపారు. మూడు రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద విచారించామని వారు చెబుతున్నారు. ఆదివారం తాను వాడుతున్న సైకిల్ పర్చూరు గ్రామంలోని ఉప్పుటూరు వంతెన వద్ద స్టాండ్ వేసి ఉండటం గమనించామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆచూకీ తెలిసిన వారు 9515640934, 9542618260 నంబర్లకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం బాపట్ల: హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్హెచ్ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కొల్లూరు : రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు మండలంలోని క్రాపలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జూనియర్ విభాగంలో 10 నిమిషాల వ్యవధిలో పోటీలను నిర్వహించారు. సోమవారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలోని ఐదు మండలాలలో ఇప్పటి వరకు బండ, బండి లాగుడు పోటీల్లో పాల్గొనని టైరు బండి ఎద్దులకు మాత్రం మంగళవారం పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రథమ బహుమతి నుంచి 8వ స్థానం వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయి టైరు బండి విభాగంలో ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లాడ్జీలు, వాహనాలు, నగర శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్లు కూడా పాల్గొన్నాయి. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తులను ప్రశ్నించి, వివరాలు ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీచేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. ఖాళీ ప్రదేశాలు, శివారు నగర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై దాడులు నిర్వహించారు. అనంతరం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్ను దళితుడని ఇబ్బందులకు గురిచేసిన యశ్వంత్ నాయుడుతోపాటు అతనిపై దాడికి పాల్పడిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్, జగ్గా కిరణ్లను కఠినంగా శిక్షించాలని కోరారు. తిరుపతి విద్యానికేతన్ కాలేజీలో చివరిస సంవత్సరం చదువుతున్న జేమ్స్ను అతని కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన యశ్వంత్ నాయుడు హేళన చేశాడన్నారు. దళితుడని, ఒరేయ్ అంబేడ్కర్ అని రకరకాలుగా మాటలతో హింసిస్తుండగా. జేమ్స్ ఖండించాడని తెలిపారు. మరొక సారి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించాడన్నారు. దీనినిపై పగ పెంచుకున్న యశ్వంత్ నాయుడు అతనిపై దాడి చేసి హింసించి నానా విధాలుగా పరుష పదజాలంతో తిట్టడంతో పాటు, కాళ్ళు చేతులు కట్టి వేసి కత్తితో హత్యాయత్నం చేశారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీస్స్టేషన్కు వెళితే కేసును తీసుకోకుండా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవస్థలను పాడు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీల కోసం పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వ్యక్తుల భరతం పడతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు, కిడ్నాప్కేసు, పరువు నష్టం కేసు సెక్షన్లు అమలు చేస్తూ కేసు నమోదు చేసి జేమ్స్కు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ -
తెలుగు పలుకుబడులకు చిరునామా చేరెడ్డి
అద్దంకి: తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం చేరెడ్డి మస్తాన్రెడ్డి కవిత్వంలో కనిపిస్తాయమని సాహిత్యవేత్త గాడేపల్లి దివాకరదత్తు అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ చేరెడ్డి మస్తాన్రెడ్డికి పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు కళాక్షేత్రంలో 2025 సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు గాడేపల్లి దివాకరదత్తు అధ్యక్షత వహించారు. దేవపాలన మాట్లాడుతూ చేరెడ్డి రచనలు ప్రాచీన కావ్యాలను తలపిస్తుంటాయని అభినందించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ పద్య సాహిత్యానికి చేరెడ్డి గౌరవాన్ని చేకూర్చారని చెప్పారు. పద్య కవులను ప్రోత్సహించడంలో చేరెడ్డి పాత్ర గొప్పదని వివరించారు. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ‘మహాభారతం.. కవిత్రయ శైలి’ అనేది గొప్ప పరిశోధన అని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం చేరెడ్డి మస్తాన్రెడ్డికి సాహిత్య పురాస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.5వేలు, పట్టుబట్టలు, సన్మాన పత్రం, జ్ఞాపకను అందజేశారు. కార్యక్రమంలో వారణాశి రఘురామశర్మ, చుండూరి మురళీ సుధాకర్రావు, కడియం పాపారావు, కె. సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్. రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. పుట్టంరాజు సాహిత్య పురస్కారం అందజేత -
అబద్ధమే..
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘రీ సర్వేలో కూటమి ప్రభుత్వం, పరిపాలనా యంత్రాంగం ఎంతో అద్భుతమైన పనిని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి, ప్రోత్సాహక నిధుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నారు. మొదటి దశలో 15 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రణాళికలో మూడు లక్షల భూ భాగాన్ని కవర్ చేశాం.’’ .. ఇదీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో రెండురోజులపాటు జరిగిన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, రీసర్వేపై జరిగిన జాతీయ సదస్సులో చెప్పిన మాటలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీ సర్వేకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను ఎంపిక చేశారు. మూడునెలల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే జనవరి తొమ్మిదిన ఈ కార్యక్రమం చేపట్టినా ఇప్పటివరకూ ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తి కాలేదు. ఈ 14 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తికాగా రెండు గ్రామాల్లో తర్వాత దశ పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. 27,302.91 ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించగా తహసీల్దార్ లాగిన్కు వచ్చిన మ్యుటేషన్ల దశకు కేవలం మూడు గ్రామాలే వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలలు పడుతుంది. రెండవ దశ కింద జిల్లాలోని కొప్పురావూరు, అంకిరెడ్డిపాలెం, బేతపూడి, హరిశ్చంద్రపురం, వంగిపురం, రావెల, గొడవర్రు, దుగ్గిరాల, కాకుమాను, సిరిపురం, దంతలూరు గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం తొమ్మిది గ్రామాల్లో సరిహద్దులు గుర్తించగా, మరో రెండు గ్రామాల్లో గుర్తించే పని నత్తనడకన కొనసాగుతోంది. ఇదే వేగంతో కనుక సర్వే పనులు జరిగితే మరో అయిదేళ్లకు కూడా రీసర్వే పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. యడ్లపాడు మండలంలో భూ రీ సర్వేకు డ్రోన్ను సిద్ధం చేస్తున్న సిబ్బంది (ఫైల్)న్యూస్రీల్ నేడు రీ సర్వేను ముందుకు తీసుకెళుతున్న కూటమి ప్రభుత్వం గుంటూరులో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ ఐదు నెలల క్రితం గుంటూరు జిల్లాలో 14 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పూర్తికాని వైనం మళ్లీ 11 గ్రామాల్లో రెండో దశ సర్వే ప్రారంభం మరో ఐదేళ్లకు కూడా జిల్లా పూర్తి కాదంటున్న అధికారులు నాడు విప్లవాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా అడుగులు గత ప్రభుత్వంలో రీసర్వే చేస్తుంటే తప్పు జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఇదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద జిల్లాలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీసర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూములను కూడా రీ–సర్వే పూర్తి చేశారు. ఎప్పుడో 1905లో బ్రిటీషర్లు చేపట్టిన తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అంతానాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రీసర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమిని మ్యాపింగ్లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఈ ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్లో ప్రారంభమయ్యింది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద దుగ్గిరాల మండలంలోని దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, వేమూరు మండలంలోని పులిచింతలపాలెం, యడ్లపాడు మండలంలోని మర్రిపాలెం, దాచేపల్లి మండలంలోని అలుగుమల్లిపాడులను ఎంపిక చేశారు. అక్కడ విజయవంతంగా పూర్తి చేశారు. సర్వే అనంతరం సంబంధిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్ పాస్బుక్ ఉచితంగా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మొత్తం 223 గ్రామాలు ఉండగా గుంటూరు డివిజన్లో 119, తెనాలి డివిజన్లో 104 గ్రామాలు ఉన్నాయి. 47 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియాకు, 121 గ్రామాల్లో యుక్రా అనే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించారు. సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించిన 47 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసింది. యుక్రా సంస్థ 46 గ్రామాల్లో డ్రోన్ను తిప్పింది. మొత్తం 93 గ్రామాల్లో డ్రోన్ను తిప్పి ఏరియల్ వ్యూ మ్యాపింగ్ పూర్తి చేశారు. 23 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లను జారీ చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్ధారణ(గ్రౌండ్ ట్రూతింగ్) చేసే ప్రక్రియ 22 గ్రామాల్లో పూర్తి అయ్యింది. అయితే రికార్డులలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడం వల్ల సర్వే పూర్తి చేయడంలో కొంతమేర ఇబ్బందులు వచ్చాయి. భూయజమానులు అందుబాటులో లేకపోవడం సర్వేలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో మరింత జాప్యం జరుగుతోంది. -
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జిల్లా స్టీరింగ్ కమిటీ బాధ్యుడు కె.బసవలింగారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యారంగానికి గొడ్డలి పెట్టువంటి 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అంత కంటే ప్రమాదకరమైన జీవోలు 19, 21 ద్వారా తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను రూపొందించాలని పూనుకోవడం ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేయడమేనని అన్నారు. తక్షణమే 19, 21 జీవోల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఉండాలని ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన ఉండాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖామంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడతామని, ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకు వచ్చి పూర్వ స్థితికి పాఠశాల వ్యవస్థ ను నెలకొల్పుతామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకుడు ఎం.కళాధర్, డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఐక్యంగా తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు బదిలీల్లో ఒక్కొక్కరికి ఒక్కో సమస్యను సృష్టించిన ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు కుట్రను ఉపాధ్యాయులు చైతన్యంతో ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసి ఉద్యమ శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20గా ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 1:43 గా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఉండాలన్నారు. బేసిక్, మోడల్ ప్రాథమిక పాఠశాలలు తప్ప ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మొండిగా ముందుకెళితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్ విధానంలోనే నిర్వహించాలని, రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఈనెల 21న డీఈఓ కార్యాలయం ముట్టడి తరువాత 23న విద్యాభవన్ను ముట్టడించి స్తంభింపచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా నాయకులు జీవీరాజు, యు.రాజశేఖరరావు, మహమ్మద్ ఖాలీద్, కె.శ్రీనివాసరావు, కొండయ్య, రెహమాన్, పల్నాడు జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, బాపట్ల జిల్లా ప్రతినిధులు ఎ. శ్రీనివాసరావు, జ్ఞానేశ్వరరావు, మూర్తి, లక్ష్మీనారాయణ, జి.వెంకటేశ్వరరావు, దాస్, శివన్నారాయణ, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీపతి, బాలచంద్రారెడ్డి, కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
తెనాలిటౌన్: శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహారణ, ఎదురుకోలోత్సవం వంటి కార్యక్రమాలను దేవస్థాన అర్చకులు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం వైభోవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైకుంఠవాసుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీయ బహూత్తమ సంఘం సభ్యులు స్థానిక షరాఫ్బజార్లోని శ్రీ భావాన్నాఋషి స్వామి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని వేడుకగా తరలివచ్చి వైకుంఠపురంలో స్వామివారికి సమర్పించారు. ముత్తయిదువులు, పద్మశాలీయ సంఘీయులు వేడుకలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ మంతెన అనుపమ పర్యవేక్షించారు. కల్యాణ మహోత్సవంలో డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల శ్యామ్ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. -
పేదల ఆస్పత్రిలో ఫీజులు!
ఉచిత సేవలు అందించలేరా..? గుంటూరు మెడికల్: క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆధునిక చికిత్సలతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఏ దశలో ఉంది... శరీరంలో ఏ భాగంలో ఉంది.. ఎంతమేరకు వ్యాప్తి చెందింది.. క్యాన్సర్కు సంబంధించిన పూర్తి వివరాలు పెట్ సీటీ స్కానింగ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షను ప్రైవేటు క్యాన్సర్ సెంటర్లో చేసినందుకు సుమారు రూ.25 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పెట్సీటీ పరీక్షను ఉచితంగా అందించాలనే ఆశయంతో ప్రభుత్వం సుమారు రూ.18 కోట్ల ఖరీదు చేసే పెట్సీటీ మెషిన్ను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు మంజూరు చేసింది. త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చేలా వేగవంతంగా సివిల్, ఎలక్రిక్టల్, ఇతర పనులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్సీటీస్కాన్ వైద్య పరికరం అందుబాటులోకి రావటంతో క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా పేద, మధ్య తరగతివారు ఎంతో సంతోషపడ్డారు. గతంలో ఈ పరీక్ష కోసం రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బందులు పడేవారు. వైద్య పరికరం రాకతో సంతోషపడుతున్న తరుణంలో పిడుగులాంటి వార్త చెవిని పడింది. శనివారం గుంటూరు జీజీహెచ్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం( హెచ్డీఎస్) జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, హెచ్డీఎస్ సభ్యుల సమక్షంలో పెట్ సీటీ పరీక్షకు సుమారు రూ.7వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై రోగులు, సహాయకులు మండిపడుతున్నారు. రోగులు, సహాయకుల ఆగ్రహం నాట్కో ట్రస్ట్ వారు ప్రతి ఏడాది సుమారు రూ.కోటి వ్యయం చేసే మందులు ఉచితంగా క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో నేడు ఆస్పత్రిలో ఎందరో దాతలు ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య పరీక్ష పేరుతో రూ.7వేలు ఫీజు తీసుకోవటం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ప్రాణాలు తీసే క్యాన్సర్తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు ఆర్థిక ఇబ్బంది పడేలా ఫీజులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు క్యాన్సర్ రోగుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరీక్షకు ఫీజు తీసుకోవాలనే విషయమై పునరాలోచించాలని పలువురు రోగులు కోరుతున్నారు. పెట్ సీటీ స్కానింగ్కు యూజర్ చార్జీలు ఒక్కో రోగి వద్ద రూ.7వేలు వసూలుకు రంగం సిద్ధం హెచ్డీఎస్ సమావేశంలో యూజర్ చార్జీలకు ఆమోదం క్యాన్సర్ రోగులపై తీవ్ర భారం జీజీహెచ్ వర్గాలపై విమర్శలు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని వీసీ సుమారు రూ.45 కోట్లతో క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్ను నిర్మించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020 జూలై 1న నాట్కో క్యాన్సర్ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. గతంలో కేవలం రేడియేషన్ ఆంకాలజీ వైద్యసేవలు మాత్రమే గుంటూరు జీజీహెచ్లో లభించేవి. నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్మించాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య విభాగాలు రావటంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. సుమారు రూ.15 కోట్లు ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ.2కోట్లు ఖరీదు చేసే బ్రాకీథెరపీ, రూ.5 కోట్లు ఖరీదు చేసే సీటీ స్టిమ్యూలేటర్ వంటి వైద్య పరికరాలను ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్కు ఇచ్చింది. దాంటోపాటుగా పెట్ సీటీ పరికరాన్ని సైతం మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగి ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత పెట్ సీటీ వైద్య పరికరం నేడు నాట్కో క్యాన్సర్ సెంటర్కు వచ్చింది. వైద్య పరికరం వచ్చిందన్న ఆనందం కన్నా వైద్య పరీక్ష చేయించుకునేందుకు రూ.7వేలు చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకున్నారనే బాధే నేడు ఎక్కువ మంది రోగుల్లో నెలకొంది. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కొలువై ఉన్న ఆదిదంపతుల దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద జరిగిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, గణపతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. సర్వ దర్శనం, రూ.100, రూ. 300, రూ.500 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానంతనం భక్తులకు దేవస్థానం ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించడానికి అరగంట అన్ని దర్శనాలు నిలిపివేశారు. వీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు సైతం క్యూలైన్లోనే దర్శనానికి అనుమతించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్నెస్లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్పీ ఆనంద్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి 2 జూన్ వరకు రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ – బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఏక్విపైడ్ పోటీలు జరుగుతాయి.కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, జి.రమేష్, కత్తి పవన్కుమార్, ఎం.రాహుల్గౌతమ్, సయ్యద్ మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, శాంతయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సురేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పథకాలను సాధించి పల్నాడు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపికై న జట్ల వివరాలు ఇలా.. సబ్ జూనియర్: 43 కేజీలు కత్తి పల్లవి (గురజాల), 53 కేజీలు కె.కార్తిక్ (గురజాల), 66 కేజీలు ఎం.వినయ్ వెంకట శివ(సత్తెనపల్లి) జూనియర్ విభాగం: 53 కేజీలు ఎం.సాయి గగన్ (సత్తెనపల్లి),74 కేజీలు ఎన్. శరత్(కంకణాలపల్లి), 74 కేజీలు పి.శ్రీహర్ష రమేష్ చౌదరి (కంకణాలపల్లి), 83 కేజీలు పసుపులేటి వంశీ కృష్ణ (సత్తెనపల్లి),120 కేజీలు ఎల్. శివనాగేశ్వరరావు(గుడిపుడి) ఎంపికయ్యారు. -
జెడ్పీలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీట్ ది హీట్ నినాదంతో పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. వేసవిలో ఎండల తీవ్రత, వడగాలలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీ తెనాలి అర్బన్: స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ మార్కెట్లో శనివారం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసి ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో జనసేన పార్టీ నాయకులు కమిషనర్ బండి శేషన్నను ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ ఆయన్ను హెచ్చరించారు. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ● గుంటూరు, పల్నాడు జిల్లాలో ఎనిమిది పరీక్ష కేంద్రాలు ● ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఆన్లైన్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. గత జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో జరిగిన మెయిన్స్లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం జరగనున్న అడ్వాన్స్డ్కు హాజరు కానున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్ష కేంద్రాల పరిధిలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లు జరగనున్నాయి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులో పొందుపర్చిన నియమ, నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. జులై 5న జాతీయ లోక్ అదాలత్ నరసరావుపేట టౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్, రెవెన్యూ, మోటర్ వాహన ప్రమాదాలు, చెల్లని చెక్కు, మనోవర్తి, కుటుంబ తగాదాలు, ముందస్తు వ్యాజ్యపు కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరారు. సివిల్ కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఫీజు వాపస్ చేస్తారని తెలిపారు. పలు రైళ్లు రద్దు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్ పరిధిలో గ్రూప్–డీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ–గుంటూరు (57201), గుంటూరు–మాచర్ల(57203), మాచర్ల–నడికుడి(57206), నడికుడి–మాచర్ల(57205), మాచర్ల–గుంటూరు(57204), గుంటూరు– విజయ వాడ(57202) రైళ్లు ఈనెల 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. కాచిగూడా–నడికుడి(67779), నడికుడి–కాచిగూడా(67780) రైలు ఈనెల 18, 19 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
తెనాలి అర్బన్: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంటే బ్యానర్లు పెట్టుకుని రోడ్లపై తిరగడం కాదని, ఉద్యోగులంతా ప్రజలకు మెరుగైన సేవలందించడమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం శివాజీ చౌక్ నుంచి మార్కెట్ వరకు నిర్వహించారు. పలువురు సచివాలయ ఉద్యోగులు తమకు నూతన పింఛన్లు, రేషన్కార్డులపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ ఎందుకు రావడం లేదంటూ మంత్రి ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తప్పనిసరిగా వారానికి ఒకసారి ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండటంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పలువురు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, ఆరోగ్యాధికారిణి డాక్టర్ కె.హెలెన్ నిర్మల, హౌసింగ్ ఈఈ భాస్కర్, పెద్దసంఖ్యలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కార్డులు మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు జారీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెనాలిలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్తగా పెళ్లయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని సూచించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాము ఇచ్చిన నూతన జీవోలో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు. ఒకే డోర్ నంబర్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి రేషన్ కార్డుల జారీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 20న జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులు, 80 సంవత్సరాలు దాటిని వారు రాష్ట్రంలో 6.74 లక్షల మంది ఉన్నారని, వీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ -
పోటీల్లో షానూన్ పతకాల పంట
డెహ్రాడూన్లో జరిగిన ఆసియన్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన మరో యువతి మదిర షానూన్ రాణించింది. జూనియర్స్లో 47 కిలోల కేటగిరీలో తలపడిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే రజత పతకం, మూడు కాంస్య పతకాలను సాధించింది. స్క్వాట్లో 100 కిలోలు, బెంచ్ప్రెస్లో 42.5 కిలోలు, డెడ్లిఫ్ట్లో 110 కిలోల బరువులనెత్తిన షానూన్ డెడ్లిఫ్ట్లో రజతం, స్క్వాట్, బెంచ్ప్రెస్, ఓవరాల్ ప్రదర్శనలో మూడు కాంస్య పతకాలను అందుకుంది. ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లో పాల్గొన్న షానూన్ తన అద్భుత ప్రదర్శనతో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. రెండు ఈవెంట్లలో నాలుగు బంగారు పతకాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలను గెలుచుకుంది. -
సోషల్ మీడియా, సైబర్ నేరాల పర్యవేక్షణ కేంద్రం ప్రారంభం
నగరంపాలెం: సోషల్ మీడియా, సైబర్ నేరాలను నియంత్రించేందుకు కేంద్రం నెలకొల్పినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని ఉమేష్ చంద్ర బ్లాక్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిపుణులైన పోలీస్ సిబ్బంది ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు, సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహ శక్తులను గుర్తిస్తారన్నారు. తద్వారా వారి చర్యలను అణచివేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. సామాజిక మాధ్యమాల వాడకం, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లేళ్లమూడి వెంకట్, కొల్లా అశోక్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), నిస్సార్ బాషా, ఎస్పీ సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మంగళగిరి: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరిగే పవర్ లిఫ్టింగ్ నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ మెన్, ఉమెన్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ టీమ్ను ఎంపిక చేసినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. పట్టణంలోని కార్యాలయంలో శనివారం వివరాలను వెల్లడించారు.ఉమెన్ సబ్ జూనియర్ టీమ్ 76 కేజీల విభాగంలో బి. లాలిత్య, 84 కేజీల విభాగంలో ఈ.ఎల్. వినయశ్రీ , జూనియర్ టీమ్ 47 కేజీల విభాగంలో ఎం. షానూన్, 76 కేజీల విభాగంలో ఎల్. చాతుర్య, 84 కేజీల విభాగంలో ఎన్. జ్ఞాన దివ్యలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పురుషుల సబ్ జూనియర్ 53 కేజీల విభాగంలో టి. శివకార్తిక్, 83 కేజీల విభాగంలో ఎస్. మునీశ్వర్ రామ్, జూనియర్ 93 కేజీల విభాగంలో ఎస్. కౌశిక్, 105 కేజీల విభాగంలో డి. పృథ్వీకుమార్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న పవర్ లిఫ్టర్లను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు. -
ఘనంగా జానపద కళాపీఠం రజతోత్సవం
అద్దంకి రూరల్: జానపద కళాపీఠం రజతోత్సవం శనివారం రాత్రి స్థానిక బంగ్లారోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడు దేవపాలన మాట్లాడుతూ పల్లె ప్రజల గుండె చప్పుడు జాన పదమదన్నారు. జానపద కళలు ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలని తెలిపారు. దీనిలో భాగంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందం చేపట్టిన కోలాట ప్రదర్శన, జానపద రూపాలైన డప్పువాయిద్య కళాకారులు ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారాన్ని కొండా శ్రీనివాసులు, వీరవల్లి రంగయ్య, యశోదమ్మ స్మారక కళాపురస్కారాన్ని కారుమూరి సీతారామయ్యకు, గుర్రం జాఫువా స్మారక సాహితీ పురస్కారాన్ని పిన్నాబత్తిన వెంకట రమణయ్యకు, మారెడ్డి స్మారక కళాపురస్కారాన్ని బత్తుల ఆంజనేయులుకు, జానపద కళాపీఠం ఆత్మీయ సన్మానాన్ని ప్రముఖ రంగస్థల కళాకారుడు ఆర్జేటి సుబ్బారావుకు అందజేశారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు , జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి దివాకరదత్తు, జ్యోతి శ్రీమన్నారాయణ, మల్లాది శ్రీనివాసరావు, ధర్మవరపు శ్రావణ్కుమార్, తాళ్లూరి సుబ్బారావు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ ‘మెడి’కిల్
తెనాలి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. అద్దె భవనాల్లో నడుస్తున్న సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మిస్తూ వచ్చింది. పనులు చాలా వరకు పూర్తికాగా, అక్కడక్కడా తుది దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల్ని ఆపేసింది. అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవడం లేదు. ప్రజల చెంతకు వైద్య సేవలు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజలు నివసించే ప్రాంతంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అప్పటికే పట్టణ ముత్యంశెట్టిపాలెంలో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్కు అదనంగా అయితానగర్, సుల్తానాబాద్, కొత్తపేట, మారీసుపేట, పాండురంగపేటలో ఏర్పాటుచేసింది. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంది, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి, సత్వరమే రోగుల సేవల్ని ఆరంభించింది. ప్రత్యేకంగా లేబరేటరీని కూడా సమకూర్చింది. ప్రతి పట్టణ ఆరోగ్యకేంద్రంలో 60 రకాల వైద్య పరీక్షలకు అవకాశం కల్పించింది. వివిధ వ్యాధులకు మొత్తం 178 రకాల మందులను అందుబాటులో ఉంచింది. దీనితో తెనాలి ప్రజలకు ప్రతి చిన్న అనారోగ్యానికి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. సమయం ఆదా కావడం, రవాణా చార్జీల భారం తగ్గడంతో ప్రజలు సంతోషించారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు నాంది అర్బన్ హెల్త్ సెంటర్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంకట్టింది. ఒక్కో సెంటర్కు రూ.1.10 కోట్లు చొప్పున పట్టణంలోని ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లకు రూ.5.50 కోట్లను కేటాయించింది. పట్టణంలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం, అయితానగర్–నేలపాడు రోడ్డు, సుల్తానాబాద్లో నిర్మాణం పూర్తయింది. ప్రైవేటు భవనాల్లోంచి ఆయా కేంద్రాలను శాశ్వత భవనాల్లోకి మార్చారు. నాటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా వైద్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలపై ప్రజల కూడా సంతృప్తిని వ్యక్తంచేశారు. పనులు పెండింగ్ పట్టణంలో ఏర్పాటైన అయిదు అర్బన్ హెల్త్ సెంటర్లలో మూడింటికి శాశ్వత భవనాలు నిర్మాణం పూర్తయింది. చంద్రబాబునాయుడు కాలనీ, ఆలపాటినగర్లో తుదిదశలో ఉన్నాయి. అప్పట్లో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటంతో ఆ పనులు పెండింగులో ఉండిపోయాయి. ● చెంచుపేట పరిధిలోని ఆలపాటినగర్లోని ఆరోగ్య కేంద్రం భవనం పనులు దాదాపు 90 శాతం పూర్తయింది. ఫ్లోరింగ్, ర్యాంప్, ఇతర చిన్న, చిన్న పనులు మాత్రమే నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.10లక్షల ఉంటుందని అధికారుల అంచనా. ● చంద్రబాబునాయుడు కాలనీలో గ్రౌండ్ ఫ్లోరింగ్, రంగులు, టాయిలెట్స్ నిర్మాణం వంటి రూ.20లక్షల పనులు పెండింగులో ఉండిపోయాయి. ప్రైవేటు భవనాల్లో అవస్థలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు. భవనాలకు తాళాలు వేసి అధికారులు అలాగే ఉంచారు. వైద్య కేంద్రాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో అరకొర వసతులోనే కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తిచేసి ప్రజలకు సెంటర్లను అందుబాటులోకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. అర్బన్ హెల్త్ కేంద్రాల నిర్మాణం పూర్తికి చొరవ చూపని పాలకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.5.50 కోట్లతో ఐదు సెంటర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మూడు కేంద్రాలు మిగిలిన రెండు కేంద్రాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ ఆరంభించని చివరి దశ పనులు పెండింగ్ పనుల పూర్తికి సన్నాహాలు పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీ, ఆలపాటి నగర్లోని ఆర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటి గురించి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక అడిగారు. మంత్రి ఆదేశాలతో నిర్మాణ పనులను పూర్తిచేసి, ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లను వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగిస్తాం. – ఆకుల శ్రీనివాసరావు, ఇన్చార్జి మున్సిపల్ ఇంజనీర్, తెనాలి -
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
● పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమై గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ●బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు మెడికల్ :ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్పా పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మిరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారకాలు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్ ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు. బాధితుల్లో యువతే అధికం రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు రేపు వరల్డ్ ఐబీడీ డే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతోంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. -
నవతరానికి పుస్తక పఠనం అవసరం
నగరంపాలెం: నవతరానికి పుస్తక పఠనం అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఐదో వీధిలోని గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీసు ఆర్గనైజేషన్ ప్రాంగణంలో శనివారం ఏపీ అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సంబరాల్లో భాగంగా కవితా స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాలు గు పుస్తకాలను ఆవిష్కరించారు. సభకు సాహితీవేత్త భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను నవతరం చదవడం అవసరమని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ సమితి అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఛాయారాజ్, ఎండ్లూరి సుధాకర్, నూతలపాటి గంగాధరం, పఠాభీల కవిత్వాన్ని ఈ తరం సులభంగా చదువుకునేలా అందిస్తున్న అరసం కృషి మరువలేనిదని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పుస్తకాలు కవి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఉన్నాయని తెలిపారు. అనంతరం యుద్ధం– శాంతి అంశంపై కవితా గోష్టి నిర్వహించారు. బండికల్లు జమదగ్ని, మేడిశెట్టి సుభద్ర, హేమలత, ఎం.లలితకుమారి హజరయ్యారు. కార్యక్రమంలో దివికుమార్, రచయిత్రి మందరపు హైమావతి, అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
పవర్ఫుల్ ఉమెన్
పవర్ లిఫ్టింగ్...బరువులెత్తే ఈ క్రీడలో ఇప్పుడు పేదింటి యువతులు రాణిస్తున్నారు. చదువుతో పాటు బరువులు ఎత్తుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నారు. ఆ క్రీడలో ‘స్టామినా’ను చాటుతున్నారు. అలవోకగా బంగారు పతకాలను సాధిస్తున్నారు. తెనాలికి చెందిన షేక్ షబీనా , మదిర షానూన్ ఇందుకు నిదర్శనం. షబీనా అంతర్జాతీయ పోటీల్లో పతకాల వేటలో జైత్రయాత్ర కొనసాగిస్తుంటే, మదిర షానూన్ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పతకాలను సాధించడం మరో విశేషం. తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఈనెల 12న ముగిసిన ఆసియా సబ్ జూనియర్, జూనియర్ ఎక్విప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జూనియర్స్ 84 కిలోల విభాగంలో తలపడిన షేక్ షబీనా నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్లో 190 కిలోలు, బెంచ్ ప్రెస్లో 85 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 180 కిలోలు, ఓవరాల్గా 455 కిలోల బరువులనెత్తి నాలుగింటిలోనూ బంగారు పతకాలను కై వసం చేసుకోవడం విశేషం. ఇదే వేదికపై ఆసియన్ యూనివర్సిటీ కప్–2025లోనూ కేఎల్ యూనివర్సిటీ తరఫున పాల్గొన్న షబీనా మరో నాలుగు బంగారు పతకాలను సాధించింది. స్ట్రాంగ్ ఉమెన్ పోటీలో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం రెండు ఈవెంట్లలో కలిపి ఎనిమిది బంగారు పతకాలను షబీనా సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట షబీనాకు అంతర్జాతీయ పోటీల్లో పతకాల సాధన కొత్త కాదు. 2024 మేలో హాంకాంగ్లో జరిగిన ఆసియన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ కమ్ ఆసియన్ యూనివర్సిటీ కప్–2024 పోటీల్లోనూ మెరిసింది. జూనియర్ విభాగంలో పోటీ పడిన షబీనా స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్లిఫ్ట్లో బంగారు పతకాలను సాధించింది. మూడు విభాగాల్లోనూ కలిపి టోటల్లోనూ మరో పతకంతో మొత్తం నాలుగు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. గత మూడేళ్లుగా పవర్లిఫ్టింగ్లో నిలకడగా విజయాలను సాధిస్తున్న షబీనా, 2023 మేలో కేరళలో జరిగిన ఆసియా పవర్లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. ఆ వెంటనే తమిళనాడులో జరిగిన జాతీయ పోటీల్లో ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించిన చరిత్ర ఉంది. అంతకుముందు హైదరాబాద్లో జరిగిన నేషనల్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లోనూ మూడు బంగారు పతకాలు, రజత పతకం సాధించింది. ఆసియా పోటీల్లో వరుసగా మూడేళ్లు నాలుగేసి బంగారు పతకాలను గెలుచుకోవడం విశేషం. కేవీఐకే అకాడమీలో సాధన 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయిరేవతి, పూసపాటి శివరామకిరణ్రాజు శిక్షణలో స్థానిక కేవీఐకే అకాడమీలో షానూన్ సాధన చేస్తోంది. పట్టణానికి చెందిన మదిర ప్రభుదాస్, మదిర నయోమి కుమార్తె షానూన్. కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కోవిడ్ సమయంలో ఫిట్నెస్ కోసం ఆమెను కేవీఐకే అకాడెమీలో చేర్పించారు. తనలోని టాలెంట్ను గుర్తించిన కోచ్ ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ నుండే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలను సాధిస్తోంది. ఇప్పటివరకు 13 జిల్లాస్థాయి, 12 రాష్ట్రస్థాయి పతకాలు, నాలుగుసార్లు రాష్ట స్ట్రాంగ్ విమెన్ టైటిల్స్ను సాధించింది. ‘కాలేజీకి వెళుతూ రోజుకు మూడు గంటల చొప్పున.. పోటీలకు నెల రోజుల ముందు ఉదయం సాయంత్రం మూడేసి గంటల చొప్పున సాధన చేస్తా’ అని షానూన్ వెల్లడించింది. తల్లి ప్రోత్సాహంతో సాధన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి యువతుల సత్తా ఆసియా పోటీల్లో మెరిసిన బంగారాలు షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణ పతకాలు మదిర షానూన్కు నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు పట్టణ ఆర్ఆర్ నగర్కు చెందిన ఆటో ఎలక్ట్రీషియన్ మెకానిక్ బుజ్జి, షంషద్ల ఏకై క కుమార్తె షబీనా ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ఫస్టియర్ చదువుతోంది. పదో తరగతిలో పవర్ లిఫ్టింగ్పై ఆసక్తి చూపిన కుమార్తెను తల్లి ప్రోత్సహించింది. కామన్వెల్త్ పోటీల్లో బంగారు పతకాలను సాధించిన తెనాలి యువతి జి.సాయిరేవతి శిష్యరికంలో కొంతకాలం సాధన చేసింది. రాష్ట్ర పోటీల్లో పాల్గొని బహుమతులను గెలవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడ నుంచి సాధన మంగళగిరికి మారింది. కోచ్ సంధాని శిక్షణలో సాధన చేస్తోంది. అటు చదువు, ఇటు సాధన మినహా షబీనాకు మరో వ్యాపకం లేకుండాపోయింది. జాతీయస్థాయి పోటీల్లో అప్రతిహతంగా రాణిస్తూ ఇప్పుడు ఆంతర్జాతీయస్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పతకాలు నెగ్గి, రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది షబీనా లక్ష్యం. -
మేరా భారత్ మహాన్
గుంటూరు మెడికల్: ఉగ్ర దాడులతో భారత్ను భయపెట్టాలని పాకిస్థాన్ చూసింది కానీ చివరకు తోక ముడిచిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడంతో పాటు కాల్పులను దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ నుంచి బయలుదేరి ఏసీ కాలేజీ, శంకర విలాస్ బ్రిడ్జి మీదుగా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదంపై తిరుగులేని విజయం సాధించామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయం భారత సైన్యం, ఎన్డీఏ విజయంగా పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ షజీల పాల్గొన్నారు. తెనాలిలో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ ఆంధ్రా ప్యారిస్లో తిరంగా ర్యాలీ తెనాలి: పాకిస్థాన్పై యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా ర్యాలీని శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని సత్యనారాయణ పార్కు నుంచి బోసు రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 300 మీటర్ల భారత జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అమర వీరులకు సంఘీభావంగా తిరంగా యాత్ర -
గుంటూరు
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025రేపటి నుంచిఆక్రమణల తొలగింపు వినుకొండ: స్థానిక శివయ్య స్తూపం సెంటరులో ఆక్రమణలను ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు పొన్నూరు: స్థానిక గాంధీ బొమ్మ సెంటర్, గుంటూరు బస్టాప్ల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలను శనివారం జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ప్రారంభించారు. శంకరమ్మ తల్లి తిరునాళ్ల చెరుకుపల్లి: మండల పరిధిలోని బలుసులపాలెం గ్రామంలో వేంచేసియున్న శంకరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2025ను నిర్వహిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 41,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 34,148, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 7,106, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 65 మంది ఉన్నారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలను కలుపుకుని మొత్తం 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షల జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 41,319 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 41,319 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 25,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 21,551, అగ్రి కల్చర్, ఫార్మసీ 4,100, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 41 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 11,126 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 9,198, అగ్రికల్చర్, ఫార్మసీ 1,912, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 16 మంది ఉన్నారు. ●బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల పరిధిలో మొత్తం 4,501 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 3,399, అగ్రికల్చర్, ఫార్మసీ 1,094, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్పోర్ట్ సైజు ఫొటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్ట్, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి. 7న్యూస్రీల్మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కార్డులు మ్యారేజ్ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు జారీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెనాలిలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్తగా పెళ్లయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని సూచించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాము ఇచ్చిన నూతన జీవోలో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు చెప్పారు. ఒకే డోర్ నంబర్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి రేషన్ కార్డుల జారీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. 20న జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులు, 80 సంవత్సరాలు దాటిని వారు రాష్ట్రంలో 6.74 లక్షల మంది ఉన్నారని, వీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు ఏపీ ఈఏపీ సెట్కు హాజరు కానున్న విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అనుమతిస్తారు. ఉదయం 9.00 గంటలు, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్ష జరిగే రోజున కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 41,319 మంది విద్యార్థులు మూడు జిల్లాల్లో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ -
క్యాన్సర్ రోగులకు శుభవార్త
● జీజీహెచ్లో రూ. 18 కోట్లతో పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ● తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్లో అందించేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్కు అత్యాధునిక చికిత్సలను ఉచితంగా అందించేందుకు నాట్కో ట్రస్టు చైర్మన్ సుమారు రూ. 50 కోట్లతో గుంటూరు జీజీహెచ్లో వంద పడకలతో ఐదంతస్తుల క్యాన్సర్ వార్డు నిర్మించారు. తాజాగా రూ. 20 కోట్లతో మరో క్యాన్సర్ భవన నిర్మాణం చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.కోట్లాది విలువైన క్యాన్సర్ మందులను సైతం ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు క్యాన్సర్ రోగులకు చేస్తున్న సేవలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా సుమారు రూ. 18 కోట్లతో ప్రభుత్వం వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు అందజేసింది. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో ఉంది, ఇతర భాగాలకు క్యాన్సర్ సోకుతుందా, లేక అక్కడే ఉందా, అనే పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పెట్ సీటీ స్కాన్ వైద్య పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష చేయించేందుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్లో వైద్య పరికరం అందుబాటులోకి రావడం వల్ల పేద రోగులకు మేలు చేకూరనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నాట్కో ట్రస్టు వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్టు కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్కుమార్లు తెలిపారు. -
ప్రభుత్వానికి నివేదించాం
ఇంటి ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవటంపై ప్రభుత్వానికి నివేదించాం. నూతన జీవోలో రెండు సవరణలు చేశారు. ప్రస్తుతమున్న ప్లానర్లు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించారు. భవన నిర్మాణం చేయదలచినవారు పట్టణ ప్లానింగ్ అధికారులు లేదా హెల్ప్ డెస్క్ను సంప్రదిస్తే ప్లాను ఇస్తారు. కొత్తగా అర్హత కలిగిన ప్లానర్లు ఎవరైనా ముందుకొస్తే లైసెన్సులు ఇస్తాం. వారి చేత ప్లాన్లు తీసుకోవచ్చు. – మధుకుమార్, రీజినల్ డెప్యూటీ డైరెక్టర్, టౌన్ప్లానింగ్ విభాగం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం
తెనాలి: స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 11 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసియున్న వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యా, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని లెక్కింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఈవో ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈవో కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంకటపాలెం యూపీ పాఠశాలలో చోరీ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం యూపీ స్కూల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం జానకీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఇటీవల ప్రధానమంత్రి రాక నేపధ్యంలో వసతి కోసం పోలీసులకు పాఠశాలను ఇచ్చామని, కార్యక్రమం అనంతరం ఆఫీసు గదిలో ఉన్న రూ.20 వేల విలువైన పెద్ద సౌండ్ బార్, రూ.3 వేల విలువైన చిన్న సౌండ్ బాక్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్ అడ్డగింత
ప్రత్తిపాడు: కేంద్ర మంత్రి పెమ్మసానికి నీటి ఎద్దడి సెగ తగిలింది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండంటూ గ్రామస్తులు, మహిళలు రోడ్డెక్కి కేంద్ర మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం తిమ్మాపురంలో గిడ్డంగి ప్రారంభోత్సవానికి గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు భారీ కాన్వాయ్తో బయల్దేరారు. మార్గ మధ్యలో కోయవారిపాలెంలో గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై కాన్వాయ్ను స్థానిక మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, చెరువు కూడా అడుగంటిందని, కొద్ది రోజులుగా సురక్షిత మంచి నీటికి దిక్కులేకుండా పోయిందంటూ గ్రామస్తులు సమస్యను ఏకరువు పెట్టారు. అడుగంటిన రక్షిత మంచినీటి చెరువు నీటిని తీసుకువచ్చి మంత్రికి చూపించారు. అంతేకాకుండా చెరువులు నింపుకొనేందుకు కాలువల్లో నీళ్లు రావడం లేదని తెలిపారు. ఒక వేళ నీళ్లు వదిలినా కాలువలు పూడిపోయి ఉన్నాయని చెప్పారు. నీళ్లు చెరువు వరకు వచ్చే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ఇలా అయితే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోనికి ఒక్కసారి వచ్చి అడుగంటిన మా చెరువు దుస్థితిని చూడాలని మహిళలు, స్థానికులు పట్టుబట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని వెంటనే గ్రామంలోనికి ఐదు పెద్ద వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలువ మరమ్మతులకు తన నిధుల నుండి రూ.రెండు లక్షలు కేటాయిస్తానని చెప్పారు. రేపటి నుంచే పనులు ప్రారంభించుకోవాలని, కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారని స్థానికులు వివరించారు. ఇంతలో స్థానిక పెద్దలు, పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పడంతో కాన్వాయ్ ముందుకు సాగింది. కొద్దిరోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన గ్రామంలోనికి వచ్చి చెరువు చూస్తే సమస్య అర్థమవుతుందని మహిళల వినతి వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగిన మంత్రి -
గుంటూరు
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025అడ్డదిడ్డంగాసాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.300 టీఎంసీలకు సమానం. దుర్గమ్మకు వెండి పంచపాత్ర ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్ర సమర్పించారు.సదరం క్యాంప్ తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కొనసాగింది. 50 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. తెనాలి: భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో జీవో జారీ చేసింది. సాంకేతిక కారణాలతో మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదన్నారు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ), లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్లో అప్లోడ్ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని చెప్పారు. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను కూడా పొందవచ్చని తెలిపారు. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు అయిదు అంతస్తుల్లో నిర్మాణాలకు సులభతరం చేస్తూ ప్రభుత్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ తీసుకొచ్చింది. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను అందుబాటులో ఉంచింది. బాధ్యతంతా వారిదే.. దరఖాస్తులు, వాటికి అనుబంధ పత్రాలు అప్లోడ్ చేసిన నాటి నుంచి నిర్మాణ పనులు పూర్తి చేసే వరకు అన్ని దశల్లోనూ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంటి యజమానులు, నిర్మించిన కట్టడాల్లో ఏవైనా సాంకేతికపరంగా తప్పులు చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ లైసెన్సును అయిదేళ్లపాటు రద్దు చేస్తామని పేర్కొంది. తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని తెలిపింది. ఆమోదిత లే అవుట్లలోని ప్లాట్లలోనే నిర్మాణాలు చేయాలని షరతు విధించింది. యాజమాన్య హక్కులు కలిగి ఉండాలని తెలిపింది. సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ వంటివి తప్పనిసరి చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా ఉల్లంఘిస్తే తమదెలా బాధ్యత అవుతుందని ఎల్టీపీలు, లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ నిర్మాణం చేసినపుడు మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట... ఇదేం న్యాయం...’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంటి ప్లాను కోసం వచ్చిన వారికి ఇదే చెప్పడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లలో ఇళ్ల నిర్మాణాన్ని మానుకొని, ఉంటున్న నగరంలోనే అద్దె ఇళ్లలో కొనసాగటమో.. అక్కడే ఏదైనా ప్లాటు కొనుక్కోవటమో చేస్తున్నారు. మరోవైపు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, వారి దగ్గర పనిచేసేవారు ఉపాధి కోల్పోతున్నారు. 7న్యూస్రీల్అధికారులందరూ ఏం చేస్తారో?తెనాలి మున్సిపాలిటీ వరకు చూసుకుంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు 22 మంది ఉంటారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్లాన్లు గీసి ఉపాధిని పొందుతుంటారు. పట్టణంలో నెలకు 40–45 వరకు ప్లాన్లు ఇస్తుంటారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పథకంలో ప్లాను గీసే బాధ్యతతోపాటు కచ్చితంగా ఆ ప్రకారం ఇల్లు/ భవనాన్ని నిర్మించేలా చూడాల్సిన బాధ్యతనూ వీరిపై ఉంచింది. పట్టణ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు. అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. అయినా కేవలం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లపైనే భారం మోపటం విమర్శలకు దారితీస్తోంది. నూతన విధానం కింద 60, 100, 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే గ్రామాల్లో ప్లాన్లు లేకుండానే ఇళ్ల నిర్మాణం చాలాకాలంగా జరుగుతోంది. సగటున పది ఇళ్లు నిర్మిస్తుంటే, ఒక ఇంటికి మాత్రమే ప్లాను గీయిస్తున్నారని, ఇప్పటివరకు జరిగిన ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవనం నిర్మించాలనుకునే వారితోపాటు ప్లాను తయారు చేసే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు, సర్వేయర్లు... ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వీయ ధ్రువీకరణతో నిర్మాణ దరఖాస్తుకు గంటల వ్యవధిలోనే అనుమతిస్తున్నామనే పేరుతో ప్రభుత్వం తమ మెడపై కత్తి పెట్టిందని వాపోతున్నారు. అపోహలు వద్దంటూ అధికారులు సర్దిచెప్పేందుకు ఆపసోపాలు పడుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల నూతన జీవోపై తీవ్ర వ్యతిరేకత ఎల్టీపీలు, సర్వేయర్లను బాధ్యులను చేసేలా నిబంధనలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా నిలిచిన ఇంటి ప్లాన్ల తయారీ అడ్డగోలు నిబంధనలతో ఆమోదం కోసం రాని దరఖాస్తులు అవగాహన ప్రచారం పేరిట ఆపసోపాలు పడుతున్న అధికారులు -
డొంకరోడ్లో అస్తిపంజరం కలకలం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులు గుట్టుచప్పుడు వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఘటనలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతూ కేసులను నీరు గారుస్తున్నారనే విమర్శలు తరచు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా ఇలాంటి ఘటనే గురువారం వెలుగులోకి వచ్చింది. వడ్డేశ్వరం – ఇప్పటం బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున ముళ్లపొదల్లో గుర్తుతెలియని అస్తిపంజరం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఎముకల గూడును అక్కడి నుంచి తరలించారు. జనసంచారం లేని ఆ ప్రాంతంలో ముళ్లపొదల్లో మూడు నాలుగు నెలల క్రితం మృతదేహాన్ని పడవేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం పోలీసులు బయటకు తీసిన అస్తిపంజరం పురుషునిదా? లేదా మహిళదా? అనేది నిర్ధారించడానికి కూడా వీలులేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మృతదేహంపై దుస్తులు ఉంటే వాటికి సంబంధించి మగవారు అయితే షర్ట్ బటన్లు, ప్యాంట్ బకిల్స్, జిప్ లాంటివి లభించేవి. ఆడవారు అయితే హెయిర్ పిన్స్ కానీ, జాకెట్ హుక్స్ కానీ ఉండేవి. ఎవరైనా చంపి ఆధారాలు లభించకుండా దుస్తులను తీసివేసి ఆ మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సబ్ డివిజన్లో పెరిగిన హత్యలు మహిళదా, పురుషుడిదా అని నిర్ధారించలేని పరిస్థితి గుట్టుచప్పుడు కాకుండా ఎముకలను తొలగించిన పోలీసులు హత్య కేసులు పెరుగుతున్నా ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం ఈ మధ్యకాలంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో వేశ్యలు, ట్రాన్స్జెండర్స్ ఎటువంటి జన సంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గొడవలు ఏర్పడినపుడు, ఆధిపత్య పోరు వచ్చినప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి రూరల్లోని కొలనుకొండలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో గుంటూరు చానల్ ఒడ్డున ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పెదవడ్లపూడి – కాజ మధ్య పొలాల్లోని బీటీ రోడ్లో ఓ ట్రాన్స్జెండర్ తన ప్రియుడి కోసం మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంఘటనలు జరిగినా తాడేపల్లి పోలీసులు మాత్రం అస్తిపంజరం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎటువంటి విచారణ చేయకుండా ఆ అస్తిపంజరాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చురీకి తరలించారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల గూడుకు పోస్ట్మార్టం చేయలేమని చెప్పడంతో పోలీసులు గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. -
నల్లబర్లీ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
నరసరావుపేట: పొగాకు కొనుగోలు కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి నల్లబర్లీ పొగాకు సాగుచేసిన రైతులు నిలువునా మునిగిపోతున్నారని, ప్రభుత్వం సైతం వారి గోడు పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులతో ధర్నా నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నల్లబర్లీ పొగాకును కనీస మద్దతు ధర రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ధర కాస్త ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి రైతులను సంప్రదించి ఇతర పంటలు సాగు చేయొద్దని, నల్లబర్లీ సాగుచేస్తే మంచి ధర చెల్లిస్తామని నమ్మించారన్నారు. తీరా పంటచేతికి వచ్చాక కంపెనీలు మొత్తం సిండికేట్గా ఏర్పడి రైతులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మోసాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో పొగాకు సాగుచేపట్టిన రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యాన పంటలపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు రూ. లక్ష ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెబుతున్న వ్యాఖ్యలు గారడీ మాటలను తలపిస్తున్నాయన్నారు. స్పందించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో వందేళ్ల చరిత్రలో పండించిన పొగాకులో 30శాతం మాత్రమే భారతదేశంలో వినియోగిస్తున్నారని 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే పొగాకును కంపెనీలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. పొగాకు కొనుగోలుకు ఇప్పటికై నా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈనెల చివరిలో రైతులను ఏకంచేసి ఛలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి కలెక్టరేట్ వద్ద ధర్నాలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం
పర్చూరు(చినగంజాం): విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం పర్చూరు నెహ్రూనగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నెహ్రూనగర్ కాలనీకి చెందిన నల్లబోతుల రాజాకు చెందిన పూరింటిలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుంది. దాంతో పూరిల్లు పూర్తిగా తగులబడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఇంటిలోని నగదు, వెండి ఆభరణాలు, విలువైన కాగితాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి, సకాలంలో అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి అదుపులోనికి తీసుకొని వచ్చారు. సుమారు రూ.లక్షపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రూ.లక్షకుపైగా ఆస్తి నష్టం -
చేయి తిరిగేలా క్రీడా శిక్షణ
తెనాలి: పట్టణ పరిధి చెంచుపేటలోని అమరావతి కాలనీలో డీఎస్ఏ స్టేడియానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో సకల వసతులు సమకూరిన విషయం తెలిసిందే. చేపట్టిన నిర్మాణాలు, దాతల సహకారంతో అందిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో క్రీడలకు సంసిద్ధం చేశారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘శాప్’ ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ అకాడమీ నడిచింది. తెనాలి డబుల్హార్స్ మినపగుళ్లు సంస్థ యాజమాన్యం ఇందుకు సహకరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అకాడమీని పక్కన పెట్టారు. ఉదయం, సాయంత్ర వేళల్లో... ప్రస్తుతం వేసవిలో శాప్ ఆధ్వర్యంలో హ్యాండ్బాల్లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో తెనాలికి గల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శిబిరం నడుస్తోంది. 23 మంది ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు అండర్–14, అండర్–17, సబ్జూనియర్ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ఆడినవారూ ఉన్నారు. కొత్తగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారూ వస్తున్నారు. రోజూ ఉదయం 6–8 గంటలు, సాయంత్రం 4–7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియం హ్యాండ్బాల్ కోచ్ నాగరాజు సెలవులో ఉండటంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్), పాటియాలలో శిక్షణ పొందుతున్న హ్యాండ్బాల్ క్రీడాకారుడు పి.కాలేబును కోచ్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఫిట్నెస్, క్రీడలో టెక్నిక్స్, స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ నెలాఖరు వరకు జరిగే శిబిరాన్ని అవసరమైతే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) ఆధ్వర్యంలోని తెనాలి స్టేడియంలో హ్యాండ్బాల్ కోచ్గా నన్ను నియమించారు. నా పర్యవేక్షణలో వేసవి క్రీడాశిబిరం నడుస్తోంది. గతంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాను. ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకుంటూ నాకున్న అనుభవంతో వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నా. క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. – పి.కాలేబు, కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో తెనాలిలో గల క్రీడాస్టేడియం ఇప్పుడు శిక్షణకు వేదికగా నిలిచింది. వేసవి సెలవుల్లో ఇండోర్, ఔట్డోర్ ఆటల్లో చిన్నారులు సాధన చేస్తున్నారు. హ్యాండ్బాల్ అకాడమీ నడిచిన ఈ స్టేడియంలో ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఎన్ఐఎస్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. హ్యాండ్బాల్ క్రీడలో ఉచితంగా తర్ఫీదు ‘శాప్’, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ