Guntur District News
-
సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటరులో కవి డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘సావిత్రీబాయి పూలే’ పుస్తకాన్ని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్ పిల్లి సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవిత కథను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియ చేసిన డాక్టర్ కత్తి పద్మారావును అభినందించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం సావిత్రీబాయి పూలే అని పేర్కొన్నారు. ఆ మహనీయురాలి పుస్తకాన్ని ప్రతి మహిళ చెంతకు చేరుస్తానని తెలిపారు. అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతను పద్మారావు సత్కరించారు. -
అభివృద్ధి, సాంకేతికతను రైతుల చెంతకు చేర్చాలి
చేబ్రోలు: పరిశోధనల్లో అభివృద్ధి, సాంకేతికతను రైతుల వద్దకు తీసుకెళ్లాలని న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) డైరెక్టర్, వైస్ చాన్స్లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘అకడమియా ఇండస్ట్రీ ఫార్మర్ పార్టనర్షిప్స్ కాన్క్లేవ్’’ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ– ఐఐఓపీఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సంబంధిత పత్రాలను వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్ పెదవేగిలోని ఐఐఓపీఆర్ డైరెక్టర్ డాక్టర్ కె.సురేష్కు అందజేశారు. కార్యక్రమానికి అనేక విద్యా సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన చెరుకుమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని తెలిపారు. అకడెమియా–ఇండస్ట్రీ–ఫార్మర్ మధ్య సహకారాన్ని బలపరచాలని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సాంకేతికత, పరిశోధన, పరిశ్రమలతో పాటు రైతుల మధ్య భాగస్వామ్యం కీలకమని చెప్పారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయంలో ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంగం సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆలపాటి సత్యనారాయణ, హైదరాబాద్లోని ఐఐఎంఆర్ డైరెక్టర్ సి.తారా సత్యవతి, రాజమండ్రిలోని సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్ఐ డైరెక్టర్, వైస్ చాన్స్లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు విజ్ఞాన్– ఐఐఓపీఆర్ మధ్య అవగాహన ఒప్పందం -
వైభవంగా నృసింహుడి వసంతోత్సవం
మంగళగిరి: మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులతో సాగిన స్వామి దివ్య రథోత్సవంతో ఉత్సవాలు చివర దశకు చేరాయి. శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. రాత్రి స్వామికి ధ్వజావరోహణం, కేళీ గుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకుంటూ పురవీధుల్లో విహరించారు. కోనేరు వద్ద చక్రస్నానం చేశారు. స్వామితో పాటు కోనేరులో స్నానం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అనంతరం పూర్ణాహుతి, ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ ఉత్సవంలో గరుత్మంతుడు మొదట పిలిచిన దేవతలందరినీ తిరిగి వారి స్థానాలకు పంపుతాడు. అనంతరం స్వామి కేళీ గుర్రంపై పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ. రామ కోటిరెడ్డి పర్యవేక్షించారు. నృసింహుని సేవలో ఉప లోకాయుక్త రిజిస్ట్రార్ రజిని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ రజిని దంపతులు దర్శించుకున్నారు. ఎగువ దిగువ సన్నిధులలో స్వామిని దర్శించుకున్న దంపతులకు ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏ. రామకోటిరెడ్డి, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర ఘనంగా స్వాగతం పలికారు. రజిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజారోహణం, కేళీ గుర్రంపై విహారం దొంగల దోపిడీతో ముగిసిన బ్రహ్మోత్సవాలు -
మల్లేశ్వరస్వామి సేవలో ఉప లోకాయుక్త జస్టిస్ రజిని
పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్త జస్టిస్ పి. రజిని దంపతులు సందర్శించారు. ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్తో పాటు అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. తొలుత రజిని దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ఉప కమిషనర్ లీలాకుమార్ న్యాయమూర్తి దంపతులకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ముగిసిన సీనియర్ ఇంటర్ పరీక్షలుగుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు శనివారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 పరీక్ష కేంద్రాల పరిధిలో 29,405 మందికి గానూ 28,901 మంది హాజరయ్యారు. ఆర్ఐవో జీకే జుబేర్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల మొత్తానికి గానూ జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. వైభవంగా శ్రీవారి కల్యాణంనగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ప్రాతః కాల ఆరాధన, స్వామికి తిరుమంజన స్నపన, అలంకార పూజ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో చేపట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. అనంతరం, స్వామివారి రథోత్సవం భక్తుల గోవింద నామస్మరణతో ఆర్.అగ్రహారం ప్రధాన వీధుల్లో కొనసాగింది. మంగళవాయిద్యాలు, డప్పులు, దేవతామూర్తుల వేషధారణలతో రథోత్సవం ఆకట్టుకుంది. ఆలయ వ్యవస్థాపకులు కన్నా లక్ష్మీనారాయణ, కార్యదర్శులు పాతకోట బ్రాహ్మణయ్యనాయుడు, దాసరి భాస్కరరావు పాల్గొన్నారు. రేపు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి శనివారం తెలిపారు. టోర్నమెంట్ సోమవారం 8:30గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి హాజరై టోర్నమెంట్ను ప్రారంభిస్తారని చెప్పారు. స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, ఈసీ మెంబర్స్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
మువ్వా చిన బాపిరెడ్డి ట్రస్టుకు ‘వాలాగ్రో’ విరాళం
పెదపరిమి(తాడికొండ): ఆశ్రమం పేరిట వృద్ధులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ పేరిట మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ గొప్ప సహాయ సహకారాలు అందిస్తోందని వాలాగ్రో బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ హెడ్ రామకృష్ణ ప్రశంసించారు. శనివారం హైదరాబాదుకు చెందిన ఆ సంస్థ సభ్యులు తుళ్లూరు మండలం పెదపరిమిలోని మువ్వా ట్రస్టు క్యాంపస్ను సందర్శించారు. సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.8.70 లక్షల చెక్కును ట్రస్టు సభ్యులు వంగా సాంబిరెడ్డి, మున్నంగి శ్రీనివాసరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పాతికేళ్లకు పైగా ట్రస్టు నిబద్ధతతో పని చేయడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా విద్య, వైద్యం, మహిళా సాధికారత అంశాలపై తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1000 మంది శిక్షణ పొందగా, 700 మందికి పైగా ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. వృద్ధులకు అధునాతన సదుపాయాల ద్వారా సొంతింటి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాలాగ్రో కంపెనీ హెచ్ఆర్ హెడ్ తుమ్మూరు రఘురామిరెడ్డి, కంపెనీ ఉద్యోగులు నరేంంద్ర, శ్యామ్, సురేంద్ర, పలువురు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. -
మేయర్కు అవమానాలు
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఆటల పోటీల విషయంలో గానీ, తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి మేయర్కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా అవమానిస్తూ వచ్చారు. పైగా మేయర్ వద్ద ఉన్న సిబ్బందిని కుదించి వేశారు. కారును, డ్రై వర్ను, అటెండర్ను, ఆఫీస్ స్టాఫ్ను, అఖరి బిళ్ల బంట్రోతును కూడా తీసేశారు. చాంబర్కు వస్తే తాళాలు వేసి పావుగంట సేపు బయట నిలబడేలా చేశారు. మరోవైపు మేయర్ను దింపివేసి తమ అభ్యర్థిని బరిలోకి నిలబెడుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర పేరును ప్రకటించారు. మేయర్ పదవిని దక్కించుకునేందుకు మిగిలిన కార్పొరేటర్లతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అవమానాలను నిరసిస్తూ మేయర్ కావటి మనోహర్నాయుడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
జెడ్పీటీసీలకు సముచిత గౌరవం లేదు
● జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా నిధులు మంజూరు చేయడం తగదు ● కమీషన్లు, పర్సంటేజ్లు దండుకుంటున్నారు ● చైర్పర్సన్ పదవిని కట్టబెట్టిన వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పనిచేయడం సహించలేకున్నాం ● మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రజల ఓట్లతో గెలిచిన తమకు కనీస గౌరవం, సముచిత స్థానం కరువయ్యాయని వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన జెడ్పీటీసీలు బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత జెడ్పీ ఎన్నికల్లో కత్తెర హెనీ క్రిస్టినాకు జెడ్పీటీసీగా గెలిపించడంతోపాటు చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన క్రిస్టినా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో ఆవేదనకు గురి చేశాయని చెప్పారు. ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు గౌరవం ఇవ్వకపోగా, ముందస్తు అనుమతుల పేరుతో జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు మంజూరు చేస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా, సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురాకుండా పనులు మంజూరు చేస్తున్నప్పుడు ఇక తమకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తూ, వాటిలో కమీషన్లు, పర్సంటేజీలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరగాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులను చైర్పర్సన్ ఇచ్చేశారని చెప్పారు. తామందరం సమావేశానికి వెళ్లి ఉంటే తమ అంగీకారం లేకున్నా, కోరం ఉందనే సాకుతో బడ్జెట్ను ఆమోదించడంతోపాటు సంబంధిత రూ.12 కోట్ల పనులను తమ అంగీకారం లేకుండా ఆమోదించుకునే వారని చెప్పారు. ప్రజాధనం వృథా కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది సభ్యులు సమావేశాన్ని బహిష్కరించినట్లు పేర్కొన్నారు. అసలు ముందస్తు అనుమతులు అనే మాట పంచాయతీరాజ్ చట్టంలోనే లేదన్నారు. ఏకపక్షంగా కేటాయింపులు ప్రత్తిపాడు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు తెలియకుండా ఏకపక్షంగా నిధులు మంజూరు చేస్తూ, జెడ్పీని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అత్యవసర పనుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా పనులు ఆమోదిస్తూ, కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. జెడ్పీటీసీలకు ప్రాధాన్యమెక్కడ? కాకుమాను జెడ్పీటీసీ గుల్జాన్బేగం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంలో చైర్పర్సన్ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 56 మంది సభ్యులుగా తాము పార్టీని నమ్ముకుని ఉండగా, కొంత మంది రాజకీయ ప్రయోజనాలతో పార్టీని వీడారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా తమ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉందని, జెడ్పీలో జరుగుతున్న కార్యకలాపాలు, నిధుల మంజూరుపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చైర్పర్సన్కు ఉందన్నారు. పార్టీని వీడే ముందు జెడ్పీటీసీలుగా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మినహా, ప్రజాప్రయోజనాలు లేవని తెలిపారు. సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
కోనేటి రాయుడికి నీరాజనాలు
రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన నేతి వెంకన్నస్వామి మూడవ శనివారం తిరుణాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే సమయంలో గోవింద నామస్మరణతో కొండ మారుమోగింది. కోనేటి రాయుడికి కోటి దండాలంటు నీరాజనాలు అందించారు. భక్తులు స్వామివారికి పొంగళ్లుచేసి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించారు. పశుసంపద ను కాపాడాలని నెయ్యిని సమర్పించి మొక్కుకున్నా రు. తిరునాళ్లలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ గణసతి సురేష్ ఏర్పాట్లు పరిశీలించారు. హుండీలు, విరాళాలు, స్పెషల్, సీఘ్ర దర్శ నాలు, తల నీలాలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ 13,47,259లు ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. -
కుట్ర రాజకీయాలపై ఉగ్రరూపం
అధికారం అండ చూసుకుని కాల‘కూటమి’ విషం చిమ్ముతూనే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థపై పెత్తనం చలాయించడానికి మాయోపాయాలు పన్నుతూనే ఉంది. నిస్సిగ్గుగా సంతలో పశువులను కొన్నట్లు కార్పొరేటర్లను కొన్న కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. కమిషనర్ను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. అడుగడుగునా మేయర్ కావటిని అవమానపరున్నారు. నగరపాలక సంస్థపై కూటమి పెత్తనంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇటు జిల్లా పరిషత్లోనూ చైర్పర్సన్ అరాచకాలకు అడ్డూఅదుపూ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు బడ్జెట్ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ● వేడెక్కిన గుంటూరు జిల్లా రాజకీయం ● ఒకే రోజు రెండు పరిణామాలు ● మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా ● జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు ● కోరం లేక వాయిదా ● రెడ్బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిర్ణయాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన స్థానిక సంస్థలను అపహాస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవికి శనివారం రాజీనామా చేశారు. మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడ్జెట్ ఆమోదించకుండానే రూ. 12 కోట్ల విలువైన పనులను ముందుగానే ఆమోదించుకోవడానికి జెడ్పీ చైర్పర్సన్ పేరుతో కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుకున్నారు. సమావేశానికి వారు రాకపోవడంతో కోరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది. సంతలో పశువుల్లా కార్పొరేటర్ల కొనుగోలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ పాలక వర్గం పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. ఎలాగైనా దొడ్డిదారిలో స్థాయీ సంఘాన్ని దక్కించుకునేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు కుట్ర పన్నారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులను కొన్నట్లు కొనుగోళ్లకు తెరలేపారు. వారే స్వయంగా కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి మరీ కండువాలు కప్పి వచ్చారు. వంత పాడుతున్న కమిషనర్ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా రాజకీయ నాయకుడిలా టీడీపీ నేతల వంత పాడారు. చిన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని కౌన్సిల్ను బాయ్కాట్ చేసిన ఆయన తర్వాత మేయర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా కౌన్సిల్ సమావేశం పెట్టకుండా అడ్డం పడ్డారు. దొడ్డిదారిన స్థాయీ సంఘాన్ని అందిపుచ్చుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోడ్ ముగియడంతో తాజాగా మేయర్ ప్రమేయం లేకుండానే స్థాయీ సంఘం సమావేశం తేదీని నిర్ణయించి ప్రకటించేశారు. అజెండా విషయంలో కూడా మేయర్ను సంప్రదించలేదు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ మంగళగిరి’ సాధ్యం
మంగళగిరి టౌన్: స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం మంత్రి పాల్గొన్నారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్ను పరిశీలించారు. డ్రాయింగ్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పాత్రాలు అందజేశారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్ను, బ్రోచర్ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు, విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఇంట్లోని చెత్తను బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయకుండా ప్రతిరోజు ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేయాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని చెప్పారు. కోరిన వెంటనే ఎస్ఏఈఎల్, దివిస్ సంస్థలు సీఎస్ఆర్ కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్ఛ మంగళగిరికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఏఈఎల్ సంస్థ రూ. 1.25కోట్లతో అన్ని సచివాలయాలకు శానిటేషన్ కిట్స్ అందజేయగా, దివిస్ సంస్థ స్వచ్ఛ అంబాసిడర్స్కి జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛ మంగళగిరి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 365 రోజుల్లో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను దేశంలోనే చెత్త రహిత కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. త్వరలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్ అలీమ్బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
లక్ష్మీపురం: కర్నూలుకు చెందిన కడారుకొండ ఓంకార్ సీనియర్ న్యాయవాది. ఆయన భార్య రేవతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు కె.సాయి తేజ డాక్టర్. రెండో కుమారుడు కె. అరవింద్ ప్రస్తుతం గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా పని చేస్తున్నారు. భార్య సామా శ్వేత సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉన్నారు. వీరికి రణ్విత్ అనే కుమారుడు ఉన్నాడు. సివిల్స్లో అపజయం అరవింద్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈగల్ ఐజీగా ఉన్న ఆకే రవికృష్ణ కర్నూల్ ఎస్పీగా ఉండేవారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తరచూ కలిసేవారు. సివిల్ సర్వీసెస్కు కావాల్సిన మెళకువలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్స్లో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదు. సివిల్ సర్వీసెస్ అధికారి కావాలన్న అరవింద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నారు. 2016లో మెయిన్స్ వరకు వెళ్లి వెనుదిరిగారు. మరలా శిక్షణ కొనసాగతున్న సమయంలో 2016–17 హైదరాబాద్లో యాక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగ అవకాశం దక్కింది. సివిల్స్ శిక్షణ పొందుతూనే కుటుంబానికి భారం కాకూడదని ఏడాదిన్నరపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన సామా శ్వేత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేస్తున్నారు. ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2020 అక్టోబర్ 29న ఇద్దరు వివాహం చేసుకున్నారు. మరలా 2017లో గ్రూప్–1 పరీక్షలకు హాజరై మెయిన్స్ వరకు వెళ్లి అరవింద్ వెనుదిరిగారు. మరలా 2018, 2019, 2020లో సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లి చివరి దశలో నెగ్గలేక పోయారు. అయితే, భార్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2020లో పూర్తిగా గ్రూప్–1కు శిక్షణ పొందడం ప్రారంభించారు. ఆ సమయంలో 2019–2022 వరకు కర్నూల్ నగరంలో పంచాయితీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 2018లో గ్రూప్– 1 మరలా రాశారు. 2022 జులైలో వచ్చిన ఫలితాల్లో గ్రూప్– 1 ఆఫీసర్గా అత్యధిక ఉత్తీర్ణతతో సాధించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా శిక్షణ పొందారు. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ వరకు వెస్ట్ గోదావరి భీమవరంలో ట్రైనీ డీఎస్పీగా పని చేశారు. 2024–2025 జనవరి వరకు వైజాగ్ గ్రే హౌండ్స్లో బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 20న లా అండ్ ఆర్డర్ విభాగంలో గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. సివిల్స్లో నిరాశ ఎదురైనా ఆగిపోలేదు. ఆత్మ విశ్వాసంతో తన గమ్యాన్ని, ప్రయాణాన్ని మార్చుకుని గ్రూప్–1 ఆఫీసర్గా అరవింద్ ఎంపికయ్యారు. పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసినా ఆ ఉద్యోగాలతో సంతృప్తి లేదు. జీవన సమరంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రూప్–1 ఆఫీసర్గా అరవింద్ ఎంపిక నాలుగు సార్లు సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లినా నిరాశ పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సిద్ధం ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతల నిర్వహణ సివిల్ సర్వెంట్ కావాలని కలలు చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉండేది. సివిల్స్లో అపజయం ఎదురైనా నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో ప్రోత్సహించారు. వివాహం అయిన తరువాత నా భార్య శ్వేత కూడా ప్రోత్సహించేది. ఎన్నసార్లు పడినా, లేచి నిలబడగలగం అనే మనో ధైర్యం ఉండాలి. ఎలాగైనా సాధించి తీరాలన్న దృఢసంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొగలం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి – అరవింద్ -
స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి పాటుపడాలి
జిల్లా పంచాయతీ అధికారి బి.వి.సాయికుమార్ పొన్నెకల్లు(తాడికొండ): స్వచ్ఛాంధ్ర నిర్మాణం కోసం అందరూ పాటు పడాలని గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి బీవీ సాయికుమార్ తెలిపారు. తాడికొండ మండలం పొన్నెకల్లు పంచాయతీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ ప్రకృతి కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. స్వచ్ఛతను పాటించడం ద్వారా స్వచ్ఛ గ్రామాలను నిర్మించుకోవచ్చని చెప్పారు. అనంతరం చెరువు గట్టుపై మొక్కలు నాటారు. ర్యాలీ నిర్వహించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తులకు తడిచెత్త, పొడిచెత్త డబ్బాలు, మిత్రాలకు ఆఫ్రాన్, గ్లౌజులు అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి కె. శ్రీనివాసరావు, తహసీల్దార్ పి. మెహర్ కుమార్, ఈవోపీఆర్డీ కె. సాయిలీల, కార్యదర్శి షేక్ మహమ్మద్ జాని, సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
నేడు వైభవంగా శ్రీనివాస కల్యాణం
● 2,700 మంది తిలకించేలా ఏర్పాట్లు ● భక్తుల రాక కోసం 300 బస్సులు ● టీటీడీ ఈవో శ్యామలరావు తాడికొండ: వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,700 మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా 300 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ పనులు వేగంగా చేస్తున్నారు. దాదాపు నాలుగు టన్నుల పూలు, 30 వేల క్లట్ ఫ్లవర్స్తో అలంకరణ పనులు చేస్తున్నారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరిస్తున్నారు. తొలుత సంగీత కార్యక్రమాలు హింధూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చైన్నెకి చెందిన నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6:15 గంటల వరకు చైన్నెకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తలను ఆలపించనున్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కీర్తనలు ఆలపించనున్నారు. శ్రీనివాస కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్లో పంపిణీ చేయనున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణ ప్రాంతంలో ఐదు వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్లు, 18 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకరణల్లో దేవతామూర్తులను, ఆలయాన్ని తీర్చిదిద్దారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, కలెక్టర్ నాగలక్ష్మి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సతీష్ కుమార్, సీఈ సత్యనారాయణ పలువురు జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్ కాటాల సెట్టింగ్స్ మార్పు
ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా ఇప్పటికీ తూకాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వ్యాపారులు పాత రాళ్ల కాటాలనే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు పెట్టుకున్నా.. 200 గ్రాములు తక్కువ తూగేలా సెట్టింగ్స్ చేసుకుంటున్నారు. ప్రముఖ మాల్స్, మార్లుల్లో లభ్యమైన ప్యాకేజీ వస్తువులూ తూకం తక్కువ ఉంటున్నాయి. నాణ్యత ప్రమాణాలు లేకుండా.. తూకంలో తేడాలు చేయడంపై తూనికలు కొలతలు శాఖ 2024–25 ఆర్థ్ధిక సంవత్సరంలో జిల్లాలో 576 కేసులు, ప్యాకేజ్డ్ కమోడిటీ మోసాలపై 426 కేసులు మొత్తం 1,002 కేసులు నమోదు చేసింది. -
భక్తజన సంద్రంగా శింగరకొండ
అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి శింగరకొండ భక్తజన సంద్రంగా మారింది. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, భక్తుల రద్దీతో క్షేత్ర పరిసరాలు ఇరుకుగా మారాయి. 650 మంది పోలీసు బలగాలతో పర్యవేక్షణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలు, 587 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్చార్జిగా చీరాల డీఎస్పీ మెయిన్ వ్యవహరించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలాన్ వద్ద, రేణింగవరం జాతీయ రహదారి నుంచి అద్దంకి వైపు భారీ వాహనాలను దారి మళ్లించారు. 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ సమీపంలో 10 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
గుంటూరు
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025నిద్రావస్థలో అధికార యంత్రాంగం ప్రస్తుతం మోసాలు పెరిగాయి. ఆహార కల్తీ జరుగుతోంది. తూకాల మోసాలు జరుగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిద్రపోతోంది. దీంతో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఏదైనా సమస్యకు సంబంధించి ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదు. ఇది చాలా దారుణం. – టీవీ కృష్ణామూర్తి, జనరల్ సెక్రటరీ, జిల్లా వినియోగదారుల సంఘం వ్యాపార సంస్థల స్వార్థం.. వినియోగదారును నిత్యం బలిపీఠం ఎక్కిస్తోంది. తూకం, నాణ్యత, ధర, వస్తు సేవల్లో దగా రాజ్యమేలుతోంది. పారదర్శకతకు పాతరేస్తోంది. చట్టాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం శాపంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్ల వ్యాపారులు మరింత పేట్రేగిపోతున్నారు. వజ్రాయుధంలాంటి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై విస్తృత అవగాహన కల్పించడం వల్ల మోసాలకు చెక్ పెట్టవచ్చని వినియోగదారు హక్కుల సంఘాల నాయకులు చెబుతున్నారు. నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యం చేసే చిరుప్రయత్నమిది.. ఇఫ్తార్ సహర్ (శని) (ఆది) గుంటూరు 6.23 4.59 నరసరావుపేట 6.25 5.01 బాపట్ల 6.23 4.59 నెహ్రూనగర్, పట్నంబజార్ (గుంటూరు ఈస్ట్): ప్రస్తుతం సమాజంలో మోసాలు ఎక్కువయ్యాయి. తూకాల్లో ఘాతుకాలు పెరిగాయి. కల్తీ ఆహార పదార్థాలు భయపెడుతున్నాయి. పాలు, నీళ్లూ నాణ్యత లేకుండా పోతున్నాయి. వీటిని అరికట్టాలంటే వినియోగదారులు మేల్కోవాలి. హక్కులపై అవగాహన పెంచుకోవాలి. వినియోగదారు హక్కు ల పరిరక్షణ చట్టం, వినియోగదారుల ఫోరమ్, ఫిర్యాదులు ఎలా చేయాలి.. న్యాయం ఎలా పొందాలి వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. 1986 నుంచి ప్రత్యేక చట్టం భారతదేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం రూపొందింది. అనంతర కాలంలో వాణిజ్య విధానాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. మోసాలు విభిన్న రూపాలు సంతరించుకున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల హక్కుల చట్టానికి మరింత పదును పెట్టి 2019లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చారు. 2020 జూలైలో ఇది అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో వినియోగదారుల రక్షణ మండళ్ల ఏర్పాటు, మధ్యవర్తిత్వ ప్యానెళ్లు, అన్యాయ వాణిజ్య పద్ధతులపై కఠిన చర్యలు వంటివి పొందుపరిచారు. విలువను బట్టి స్థాయి.. జిల్లా స్థాయిలో కన్జూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. దీనినే వినియోగదారుల ఫోరమ్ అని కూడా పిలుస్తారు. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్(జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న కన్జూమర్ కోర్టు)లో లాయర్తో సంబంధం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆన్లైన్లో అయినా 1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమస్య చెబతే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారు. 2024లో 365 కేసులు ఫైల్ అయ్యాయి, 2025 ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా పరిష్కారం కాక పెండింగ్లో ఉన్న కేసులు 580 ఉన్నాయి. రూ.50 లక్షల విలువైన వస్తుసేవల కేసులను జిల్లా స్థాయిలో విచారణ చేస్తారు. ఆ తర్వాత రూ.2 కోట్ల వరకు విలువైన కేసులను రాష్ట్ర కమిషన్లో విచారణ చేస్తారు. ఆౖపైన విలువ ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలి. కన్జూమర్ కోర్టులో ఎక్కువగా రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్ కొనుగోలు, ఆన్లైన్ మోసాలు, ఇన్సూరెన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. పాటించాల్సిన జాగ్రత్తలు ● వస్తువు కొనేటప్పుడు నాణ్యత చూసుకోవాలి. ● గ్యారెంటీ, తూకం, ధర తనిఖీ చేసుకోవాలి. ● వ్యాపారి వద్ద కచ్చితంగా రశీదు తీసుకోవాలి. ఇన్వాయిస్లు, ఐడీలను భద్రపరుచుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియంత్రణేది? ఆహారపదార్థాలనూ వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. పండ్లలోనూ నాణ్యత ఉండడం లేదు. పండ్లను రసాయనాలతో పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. కూల్ డ్రింక్స్, చిన్నారుల తినుబండారాల్లో కెమికల్స్ వినియోగిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కనిపించడం లేదు. ఇప్పటికీ వాడుతున్న రాళ్ల కాటా 7న్యూస్రీల్చట్టంపై అవగాహన పెంచుకోవాలి బీమా పాలసీల క్లెయిముల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చాలా కేసుల్లో క్లెయిమ్లు పరిష్కారమయ్యేలా చూశాం. తూకాలు, వస్తు సేవల మోసాలపై న్యాయం చేసేందుకు వినియోగదారుల ఫోరమ్ ఉంది. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. – పి.రామాంజనేయులు, వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు, అడ్వకేట్ దగా పడుతున్న వినియోగదారులు వ్యాపార సంస్థల స్వార్థమే శాపం పట్టించుకోని అధికారయంత్రాంగం జిల్లా వినియోగదారుల ఫోరమ్లో 580 కేసులు పెండింగ్ రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్ నిర్వహణ కేసులే ఎక్కువ నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వినియోగదారుల ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్లు 1915, 800114000 -
16 నెలల్లో నిడమర్రు రైల్వే గేటుపై వంతెన నిర్మాణం పూర్తి
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరి: మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం యర్రబాలెంలో ఆధునికీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, కొత్త భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నిడమర్రు రైల్వే గేటు వంతెన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 16 నెలల్లోపు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దుగ్గిరాల కోల్డ్స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు మరో రెండు వారాలలో పరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులుడీఈఓ సీవీ రేణుక గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం నుంచి విద్యార్థులకు ఒక్కపూట తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. టెన్త్ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా, గ్రామ పంచాయతీ, వైద్యారోగ్య శాఖ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాట్లను పాఠశాలల్లో అందుబాటు ఉంచుకోవాలని, బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో సేవా సంస్థలు, స్థానికుల సహకారంతో మజ్జిగ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విజయకీలాద్రిపై ఫాల్గుణ పౌర్ణమి వేడుక తాడేపల్లిరూరల్: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళశాసనాలతో ఉదయం 9 గంటలకు లక్ష్మి అమ్మవారికి అభిషేకం, అనంతరం 9.30 గంటలకు లక్ష్మి హయగ్రీవ హోమం అత్యంత వైభవంగా నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలియజేశారు. కానిస్టేబుల్పై కేసు నమోదు చీరాల: వివాహేతర సంబంధం పెట్టుకుని ఘర్షణకు దిగిన కానిస్టేబుల్పై వివాహితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చీరాల డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాలకృష్ణ కొంతకాలంగా పేరాలకు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహిత బంధువులు ఈ విషయాన్ని ప్రశ్నించి ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు ఘర్షణ పడడంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భక్తజన సంద్రంగా శింగరకొండ
అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి శింగరకొండ భక్తజన సంద్రంగా మారింది. ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, భక్తుల రద్దీతో క్షేత్ర పరిసరాలు ఇరుకుగా మారాయి. 650 మంది పోలీసు బలగాలతో పర్యవేక్షణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలు, 587 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరునాళ్ల ఇన్చార్జిగా చీరాల డీఎస్పీ మెయిన్ వ్యవహరించారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలాన్ వద్ద, రేణింగవరం జాతీయ రహదారి నుంచి అద్దంకి వైపు భారీ వాహనాలను దారి మళ్లించారు. 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ సమీపంలో 10 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
నృసింహునికి బ్రహ్మరథం
మంగళగిరి/మంగళగిరి టౌన్: జై నారసింహా.. జైజై నారసింహా నినాదాలతో మంగళగిరి శుక్రవారం మార్మోగింది. శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామి కల్యాణమహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉభయదేవేరులతో స్వామి దివ్యరథాన్ని అధిరోహించారు. మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. గాలిగోపురం నుంచి దక్షిణాభిముఖంగా ప్రారంభమైన రథం మెయిన్బజార్ మిద్దె సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు కదలింది. అక్కడ ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రథోత్సవం గాలిగోపురం వద్దకు చేరుకుంది. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాఢభూషి వేదాంతచార్యులు వ్యవహరించారు. పద్మశాలీయ శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథ చప్పాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో ఎ.రామకోటిరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి రథాన్ని కొద్దిసేపు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాగారు. బంగారు గరుడోత్సవం గురువార రాత్రి స్వామి కల్యాణోత్సవం అనంతరం స్వామికి బంగారు గరుడోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సమారాధన నిర్వహించారు. గరుడోత్సవం శాశ్వత కల్యాణ కై ంకర్యపరులుగా వాసిరెడ్డి సీతారామయ్య కుమారులు జయదత్తు, ప్రభునాథ్లు వ్యవహరించారు. బ్రాహ్మణ సమారాధన శాశ్వత కై ంకర్యపరులుగా అరిపిరాల చిన్నఅప్పయ్య శాస్త్రి, మొక్కపాటి ఆనందయ్యలు వ్యవహించారు. ఈ ఉత్సవంలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళాద్రిపై కొలువుదీరిన ఉగ్ర నారసింహుడు ఆనంద గర్జన చేస్తూ రథారూఢుడైనట్టు.. చెంతనున్న కృష్ణమ్మ జనప్రవాహమై పురవీధుల్లో పోటెత్తినట్టు.. అష్టదిక్పాలకుల జయజయధ్వానాలతో దక్షిణాభిముఖంగా కదిలినట్టు.. మంగళగిరి నగరం ఆధ్యాత్మికోత్సాహంలో ఓలలాడింది. లక్ష్మీ నరసింహుని రథోత్సవానికి బ్రహ్మరథం పట్టింది. నమో నారసింహా మంగళాద్రి.. ‘జన’దాద్రి అంగరంగ వైభవంగా నృసింహుని దివ్యరథోత్సవం -
ఎలక్ట్రానిక్ కాటాల సెట్టింగ్స్ మార్పు
ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినా ఇప్పటికీ తూకాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వ్యాపారులు పాత రాళ్ల కాటాలనే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు పెట్టుకున్నా.. 200 గ్రాములు తక్కువ తూగేలా సెట్టింగ్స్ చేసుకుంటున్నారు. ప్రముఖ మాల్స్, మార్లుల్లో లభ్యమైన ప్యాకేజీ వస్తువులూ తూకం తక్కువ ఉంటున్నాయి. నాణ్యత ప్రమాణాలు లేకుండా.. తూకంలో తేడాలు చేయడంపై తూనికలు కొలతలు శాఖ 2024–25 ఆర్థ్ధిక సంవత్సరంలో జిల్లాలో 576 కేసులు, ప్యాకేజ్డ్ కమోడిటీ మోసాలపై 426 కేసులు మొత్తం 1,002 కేసులు నమోదు చేసింది. -
నేడు వైభవంగా శ్రీనివాస కల్యాణం
● 2,700 మంది తిలకించేలా ఏర్పాట్లు ● భక్తుల రాక కోసం 300 బస్సులు ● టీటీడీ ఈవో శ్యామలరావు తాడికొండ: వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,700 మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా 300 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ పనులు వేగంగా చేస్తున్నారు. దాదాపు నాలుగు టన్నుల పూలు, 30 వేల క్లట్ ఫ్లవర్స్తో అలంకరణ పనులు చేస్తున్నారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరిస్తున్నారు. తొలుత సంగీత కార్యక్రమాలు హింధూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చైన్నెకి చెందిన నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6:15 గంటల వరకు చైన్నెకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తలను ఆలపించనున్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కీర్తనలు ఆలపించనున్నారు. శ్రీనివాస కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్లో పంపిణీ చేయనున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణ ప్రాంతంలో ఐదు వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్లు, 18 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విద్యుద్దీప అలంకరణల్లో దేవతామూర్తులను, ఆలయాన్ని తీర్చిదిద్దారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, కలెక్టర్ నాగలక్ష్మి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సతీష్ కుమార్, సీఈ సత్యనారాయణ పలువురు జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
మాణిక్యవేల్కు నివాళి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత డాక్టర్ అరుణాచలం మాణిక్యవేల్ (77) అంతిక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. అరండల్పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్.నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్అహ్మాద్ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలువురు ప్రముఖులు మాణిక్యవేల్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంతిక్రియలు కొరిటెపాడులోని శశ్మాన వాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్ ఎక్స్ సోప్ ఉద్యోగులు, సిబ్బంది పెద్దఎత్తున తరలివెళ్లారు. -
గొలుసు చోరీలతో జల్సా
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గొలుసు చోరీలతో జల్సాలు చేస్తున్న ఏడుగురు దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.16.12 లక్షల విలువైన సుమారు 162 గ్రాముల బంగారు గొలుసులు, ఐదు మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), తెనాలి డీఎస్పీ జనార్దనరావుతో కలిసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 27న తెనాలికి చెందిన ఓ మహిళ చెంచు పేట బ్రిడ్జి వైపు నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకెళ్లి మోటారుసైకిల్పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో తెనాలి మూడో పట్టణ సీఐ రమేష్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెనాలి చినరావూరుతోట వాసి పోతర్లంక సాయిమాధవ్ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతను జల్సాల కోసం తెనాలి చినరావూరుతోటకు చెందిన ఆరుగురితో ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. ద్విచక్ర వాహనాలనూ దొంగిలించినట్టు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో మహమ్మద్ సమీర్, ధనావత్ హనుమంత్నాయక్, సయ్యద్ కరిముల్లా, షేక్ బారావలి అలియాస్ బారా, గీతాంజలి స్కూల్ రోడ్డులో ఉంటున్న షేక్మాగ్బుల్, కొల్లిపర మండలం అన్నవరం గ్రామ వాసి అమర్తలూరి నానీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు దొంగల ముఠా అరెస్టు రూ.16.12 లక్షల విలువైన 162 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం ఐదు మోటార్ సైకిళ్లు కూడా సీజ్ వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్కుమార్ వయసు 19.. గొలుసులు తెంచడంలో నేర్పరి 19 ఏళ్ల సాయిమాధవ్ గొలుసులు తెంచడంలో నేర్పరి. ఇతనే సూత్రధారి. గొలుసులు తెంచేవాడు. మిగతావారు మోటార్సైకిళ్లతో సిద్ధంగా ఉండి ఇతడిని తీసుకుని పరారయ్యేవారు. దొంగిలించిన గొలుసులను తెనాలి గీతాంజలి స్కూల్ రోడ్డులో ఉంటున్న షేక్ మక్బూల్కు ఇచ్చి అతనికి తెలిసిన వారికి మాత్రమే అమ్మేవారు. ఆ నగదుతో అందరూ జల్సాలు చేసేవారు. ధనావత్ హనుమంతునాయక్పై గతంలో మోటారుసైకిల్ చోరీ కేసు, సస్పెక్ట్ షీట్ ఉంది. మిగిలిన వారిపై కేసులు లేవు. ఇటీవల తెనాలి మూడో పట్టణ పీఎస్తోపాటు బాపట్ల జిల్లా వేమూరు పీఎస్ పరిధిలోని చావలి గ్రామంలోనూ ఈ ముఠా గొలుసు చోరీలకు పాల్పడింది. చేబ్రోలులోనూ మోటారుసైకిల్, బంగారు గొలుసు దొంగిలించింది. దొంగలను పట్టుకున్న తెనాలి మూడో పట్టణ పీఎస్ సీఐ రమేష్బాబు, ఎస్ఐలు ప్రకాష్రావు, కరీముల్లా, కానిస్టేబుళ్లు పి.మురళీ, కె.బాబురావు, ఎస్.జైకర్, ఎన్.శ్రీనివాసరావు, డి.సురేష్బాబు, ఎ.అనిల్కు ఎస్పీ రివార్డులు అందించారు. -
నంది అవార్డులకు 2014లో గ్రహణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఏపీలోని నందు (నంది అవార్డులు)లు అస్వస్థతకు గురైనట్లు మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్రాజా వ్యాఖ్యానించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రదానం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం 2013 నుంచి నిలిపివేసిన నంది అవార్డుల ప్రదానంపై విధి విధానాలను ప్రభుత్వం రూపొందించాలని అన్నారు. నంది అవార్డులకు 2014 నుంచి గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపిక విధానంలో ప్రతిభను మాత్రమే గుర్తించాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమను, సినిమా కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దర్శకులు నరేష్ దోనె, మణివరన్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ ఏడీ డాక్టర్ కె.ఎల్.ఎస్.రెడ్డి
నూతన పారిశ్రామిక చట్టంపై అవగాహన పెంచుకోవాలి బాపట్ల: నూతన పారిశ్రామిక విధానాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను, సహకారాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చని ఎంఎస్ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెఎల్ఎస్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులు, వాటిపై అవలంబించాల్సిన విధానాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన వనరులపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి తెలుసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు తక్కువ పెట్టుబడి వ్యయంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని నాణ్యతతో కూడిన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో సబ్సిడీలను కూడా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో–ఆర్టినేటర్ పి.వీరయ్య, బాపట్ల జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిశెట్టి రత్నగుప్తా, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠ మిన్నంటెన్
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి చదువు కీలకదశకు చేరింది. సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులు చదువులో తలమునకలై ఉండగా, వారిని సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. బిడ్డల చదువులపై తల్లిదండ్రులూ ఉద్విగ్నక్షణాలు అనుభవిస్తున్నారు. ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 30,410 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 150 కేంద్రాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ●హాల్టికెట్లు పొందిన విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలను సందర్శించి రోజూ పరీక్షకు ఎలా వెళ్లాలి.. ఎంత సమయం ముందు ఇంటి నుంచి బయలుదేరాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ●పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకల్లా కచ్చితంగా పరీక్ష కేంద్రాల వద్ద ఉండేలా చూసుకోవాలి. ●ఉదయం 8.45 నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 9.30 తరువాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని గుర్తుంచుకోవాలి. ●హాల్ టికెట్లపై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ముందుగానే తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి, సరి చేయించుకోవాలి. ●హాల్ టికెట్పై ఉన్న ఎన్రోల్ నంబరు ఆధారంగా కేటాయించిన గదులకు చేరుకోవాలి. ●పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రంపై ఏడు అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్ ఉంటుంది. అది ఉందో లేదో చూసుకోవాలి. ●పరీక్ష గదిలోకి ప్రవేశించగానే బార్ కోడింగ్తో కూడిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఇన్విజిలేటర్ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ పూరించాలి. దానిపై అనవసరమైన గీతలు గీయరాదు. వ్యర్థ రాతలు రాయరాదు. ● ఓఎంఆర్ షీట్పై విద్యార్థి పేరు, రాయబోవు పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి. ●9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగుస్తుంది. ఈ మధ్య సమయంలో విద్యార్థులను బయటకు అనుమతించరు. ●గుర్తింపు కార్డు కలిగిన పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్ బృందాలనే పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. ●పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుశాఖ 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ●ప్రశ్నపత్రం లీక్ అయిందని, పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ్ల ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీకేజీకి గురైతే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ●పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయాలనే ఆలోచన వీడాలి. కాపీయింగ్కు పాల్పడినా, జేబులో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో ఏ విద్యార్థ్ధి వద్ద అయినా స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ●ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బుక్లెట్లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్ప్రాక్టిసుగా పరిగణిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం చదువులో తలమునకలైన విద్యార్థులు సంసిద్ధంలో ఉపాధ్యాయులు నిమగ్నం తల్లిదండ్రుల్లోనూ ఉద్విగ్నం 17 నుంచి పరీక్షలు ప్రారంభం పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ మార్గదర్శకాలు విస్తృత ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశాం. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. పరీక్ష కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. – సీవీ రేణుక, డీఈవో -
వైభవంగా శత చండీ మహా యాగం
సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవీ ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య శ్రీ హనుమత్ స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురు వందనం, ప్రధాన దేవతా ఆర్చణ, శత చండీ హోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్ర పుష్పం, అమ్మవార్లకు దశ విధ అభిషేకాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. బగలాముఖి, రాజశ్యామల, వారాహి హోమాలు, యోగిని మండప హోమాలు నిర్వహించారు.గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 6న ప్రారంభమైన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారంతో ముగియనుంది. ఆఖరి రోజు శనివారం సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేదఆశీర్వచనం, పండితుల సత్కారాలు, అన్నదానం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హజరుకానున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. -
అట్టడుగువర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి
ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కాశీం ఏఎన్యూ: అట్టడుగు వర్గాల అభ్యున్నతితోనే దేశాభివృద్ధి సాధ్యమని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబూ జగ్జీవన్రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘రోల్ ఆఫ్ బాబూ జగ్జీవన్రామ్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సభలో ఆచార్య కాశీం కీలకోసన్యాసం చేశారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ లక్ష్యం ఒక్కటేనన్నారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కోటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్.సరళా వందనం, విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి ఎ.భరత్భూషణ్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆలోచనా విధానాలను వివరించారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కావలి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ కళాశాల కామర్స్ విభాగాధిపతి ఆచార్య సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ నివేదిక సమర్పించారు. అనంతరం సదస్సు పరిశోధనా పత్రాల సావనీర్ను, బాబూ జగ్జీవన్రామ్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.ఆనందబాబు రాసిన కర్మయోగి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
రైతులను భాగస్వాములను చేయాలి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో రైతులను భాగస్వాములను చేయాలని రైతు సాధికారిత సంస్ధ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి వార్షిక కార్యచరణ ప్రణాళికపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జూమ్ కాల్ ద్వారా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతుందని తెలిపారు. వాతావరణం కూడా అత్యవసరస్థితిని ఎదుర్కుంటుందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో వ్యవసాయ విధానాలు, రైతులు పండిస్తున్న ఏ గ్రేడ్, ఏటీఎం మోడల్లో పండిస్తున్న పంటలు, రైతుల విజయ గాథలను వివరించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, డీఆర్డీఏ, ఉపాధి హామీ, సెరీకల్చర్, హార్టీకల్చర్ తదితర శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నవధాన్యాలు సాగుభూమికి ఎంత మేలు చేస్తాయో వివరించారు. రైతులంతా పీఎండీఎస్ పద్ధతిని అవలంబించి సాగు చేయాలని సూచించారు. 30 రకాల విత్తన పద్ధతిని పాటిస్తే భూములు సారవంతమవుతాయని తెలిపారు. భూమి సంవత్సరమంతా పచ్చగా ఉంటే జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతమై, చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజు, రాష్ట్ర శిక్షకురాలు శాంతి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, సౌజన్య, మేరి, స్వాతి పాల్గొన్నారు. -
సారా రహిత రాష్ట్రం కోసమే నవోదయం–2
తెనాలిరూరల్: సారా రహిత రాష్ట్రమే ధ్యేయంగా నవోదయం–2 కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలో బార్ షాపులు, వైన్ షాపుల లైసెన్సుదారులతో తెనాలి కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీ, విధివిధానాలను వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. గుంటూరు, పల్నాడు పరిధిలో మాచర్ల, నరసరావుపేట, క్రోసూరు, ఈపూరు, పిడుగురాళ్ల, గురజాల గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో 28 సారా కేంద్రాలను నిర్వీర్యం చేశామన్నారు. నవోదయం –2 కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ద్వారా సారా నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిణి కె.అరుణకుమారి, జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మారయ్యబాబు, తెనాలి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటాచలం పాల్గొన్నారు. -
కవయిత్రి మొల్లమాంబకు పుష్పాంజలి
గుంటూరు వెస్ట్: వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని అందరికీ అర్ధమయ్యేలా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ అని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కొనియాడారు. మొల్లమాంబ సాఽహిత్య సేవలను తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటారని వివరించారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, బీసీ వెల్ఫేర్ అధికారి భవానీ, కుమ్మరి, శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.నాగేశ్వరి, కుమ్మరి, శాలివాహన సమన్వయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యు.వెంకటేశ్వర్లు, అధికారులు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు పుష్పాంజలి ఘటించారు. కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్లో వాక్థాన్ మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంతా సింగ్ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్లో వైద్యులు, మెడికల్ విద్యార్థులతో వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శాంతా సింగ్ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమంత కుమార్ దాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెచ్వోడి డాక్టర్ ఉత్తర దాస్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలిలో ముగిసిన ప్రత్యేక సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారంతో ముగిసింది. ఈఎన్టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్, సైక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. క్యాంప్ను వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు. మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురావాలి మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ ఊపందుకుందని, రోజుకు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యార్డుకు రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు ఎండు మిర్చిని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందుతున్నారని వెల్లడించారు. గత ఐదు రోజులుగా వస్తున్న మిర్చిలో తేమ శాతం, దుమ్ము, ధూళి ఉండటం వల్ల దాని ప్రభావం ధరలపై పడుతోందని తెలిపారు. రైతులు కల్లాల్లోనే మిర్చిని ఆరబెట్టుకు రావాలని విజ్ఞప్తి చేశారు. -
జన జాతరకు వేళాయె
నేటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు కొనసాగనున్న ఈ తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలు ఇలా.. మార్చి14న ఉదయం 6.02 గంటలకు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిన అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవనున్నాయి. 15న సాయంత్రం 6.56 గంటలకు గ్రామంలో ఉత్సవమూర్తుల రథోత్సవం, 16న రాత్రి 9.05గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, 17న సాయంత్రం 4.53గంటలకు చిన్న తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన తిరుపతమ్మ పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. 18న ఉదయం 5.30 గంటల నుంచి భక్తుల బోనాల సమర్పణతో తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి. జల్లు స్నానాలు.. తిరునాళ్ల ఐదు రోజుల ఉత్సవాలకు మునేరు నీరు లేనందున షవర్ బాత్లు 300 ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక టాయిలెట్లు 50, వాటర్ ట్యాంక్లు, చేతి పంపులు, మునేరులో తాత్కాలిక కేశఖండన శాల, ఆలయం చుట్టూ చలివేంద్రాలు, వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025దళిత రైతులపై7వైభవంగా బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులో కొలు వైన భూనీలా సమేత వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రథోత్సవం జరగనుంది. సాక్షి, ప్రత్యేక ప్రతినిఽధి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అమరావతి రాజధాని గ్రామాల్లో దమనకాండకు మళ్లీ తెరలేచింది. దళిత, పేద రైతులపై దౌర్జన్యాలు ఇదివరకటిలాగే పెచ్చురిల్లుతున్నాయి. పచ్చ గూండాలు, దళారులు, అధికారుల అండతో టీడీపీ నాయకులు బెదిరింపులకు తెగబడుతున్నారు. దళిత రైతులకు కేటాయించిన రిటర్న్బుల్ ప్లాట్లను తక్కువ ధరకు కొట్టేయాలని ఎక్కడికక్కడ కుట్రలు పన్నుతున్నారు. తమపై ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా దాడులకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలు పేద, దళిత రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఫలితంగా పలువురు బాధిత రైతులు లోలోన కుమిలిపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దళితులు దైన్యంలో కొట్టుమిట్టాడుతున్నారని రాజధాని గ్రామాల రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దయిన జీపీలతో బెదిరింపుల పర్వం ... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో కొందరు టీడీపీ నేతలు ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని, అసైన్డ్ భూములను సర్కారు లాగేసుకుంటుందని విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వచ్చినంత ధరకు ముందుగానే అమ్మేసుకోవాలని, లేదంటే పూర్తిగా నష్టపోతారని పేద రైతులను మభ్యపెట్టారు. బెదిరింపులతోనూ ఎంతో కొంత ముట్టజెప్పి ఏవో పత్రాలపై సంతకాలు సైతం చేయించుకున్నదీ విదితమే. అప్పటి పత్రాలను ఇప్పుడు తీసుకొచ్చి 2015లోనే జీపీలు చేయించుకున్నామని, భూములను ఎకరం రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు చూపిస్తూ రిటర్న్బుల్ ప్లాట్లను తమకే ఇచ్చేయాలని బెదిరిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ మూకలు చూపిస్తున్న జీపీలు ఎప్పుడో రద్దయ్యాయి. గత ప్రభుత్వం పేద దళిత రైతులకు అండగా నిలిచింది. పాత పత్రాలను ఇప్పుడు పట్టుకొచ్చి రైతులు తమ మాట వినాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. కాదు కూడదన్న వారిని మందడంలోని డీఎస్పీ ఆఫీసుకు పిలిపించి సెటిల్మెంట్లకు కూర్చోపెడుతున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పోలీసుల సాయంతో వేధింపులకు దిగుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏబీ వియ్యంకుడిని అంటూ హల్చల్ గుమ్మడి సురేష్ అనే వ్యక్తి తనకు సీఎంఓలో పలుకుబడి ఉందని, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు స్వయానా వియ్యంకుడినని చెబుతూ రైతులను బెదిరిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. రద్దయిన జీపీలు, అగ్రిమెంట్లను తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసుల సమక్షంలోనే సెటిల్మెంట్లకు రైతులను కూర్చోపెడుతున్నాడనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని గ్రామాల్లో టీడీపీ రౌడీ మూకల దౌర్జన్యం రైతుల అవసరాలే ఆసరాగా.. ధైర్యంగా పోరాడదాం రాజధాని గ్రామాల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యాలపై రైతులందరం సమైక్యంగా పోరాడదాం. అధికార పార్టీ అన్యాయాలకు పోలీసులు, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు వంతపాడుతున్నారు. ఇది సరికాదు. పేదల పక్షాన నిలబడాలి. నాపై టీడీపీ మాఫియా కక్ష కట్టింది. నన్ను అంతమొందించేందుకు యత్నిస్తోంది. అన్నిటికీ సిద్ధపడే పోరాటానికి పూనుకున్నా. బాధిత అసైన్డ్ రైతులతో కలిసి సమైక్యంగా పోరాడతాం. అప్పుడే మాఫియాను దీటుగా ఎదుర్కోగలం. ధైర్యంగా ముందడుగు వేయగలం. – శృంగారపాటి సందీప్, అసైన్డ్ రైతు, ఉద్దండరాయునిపాలెంమందడంలో నూతక్కి నాగకిషోర్ అనే వ్యక్తి రైతుల అవసరాల కోసం రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు ఇచ్చి గతంలో ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నాడని, వాటిపై తన ఇష్టమైన రాతలు, రేట్లు రాసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వాటిని చూపి రైతులను బెదిరిస్తూ, డీఎస్పీ ఆఫీసులోనే సెటిల్మెంట్లుకు దిగుతున్నాడు. ఆలూరు సుబ్రమణ్యం, ఆలూరు బ్రహ్మం, బెజవాడ రమేష్ వంటి వారంతా గ్రూపుగా ఏర్పడి రిటర్న్బుల్ ప్లాట్లను కొల్లగొట్టే లక్ష్యంతో రైతులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాదాపు మూడు వేల రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో నానా రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఎవరికై నా చెప్పినా, ఫిర్యాదులు చేసినా రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ అధికారులు తమకు అండగా ఉంటారని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారనేది రాజధాని గ్రామాల్లోని పేద దళిత రైతుల మాట. -
అలరించిన వీవీఐటీ రంగస్థల వేడుక
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో నిర్వహించిన థియేటర్స్ డే వేడుక వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ వినోదం, విజ్ఞానం మేళవింపుతో వీవీఐటీ విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అలరించాయి. ఈ వేడుకలో విభాగాల వారీగా ప్రదర్శించిన ఎనిమిది నాటికలను విద్యార్థులు వారి వేషధారణ, హావభావాలతో రక్తికట్టించారు. కార్యక్రమానికి వర్ధమాన నటుడు, రంగస్థల యువ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నందీపురస్కార గ్రహీత రౌతు వాసుదేవరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా విజేతలకు వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బహుమతులు అందజేశారు. కలలు, ఆశయాలు అందుకునే క్రమంలో ఓ కుటుంబంలో తండ్రీకొడుకుల మధ్య ఏర్పడే అపోహల నేపథ్యంలో ఈఈఈ విద్యార్థులు రూపొందించిన కుటుంబ కథ ‘అవును మా నాన్న రైతే‘ ప్రథమ బహుమతి అందుకోగా, రియల్ఎస్టేట్ రంగంలో వినూత్న పోకడలను తెలుపుతూ హాస్య రూపంలో మెకానికల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘పుష్పవల్లి నిలయం ద్వితీయ బహుమతి అందుకుంది. కార్యక్రములో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్స్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిన్ డీన్ డాక్టర్ ఎన్.కుమారస్వామి, థియేటర్స్ డే సమన్వయకర్త షేక్ రసూల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
6 కోట్ల జనాభాకు ఆహార ప్రయోగశాల ఏదీ?
గుంటూరు మెడికల్: దేశంలోని చిన్న రాష్ట్రాల్లోనూ ఆహార ప్రయోగశాలలు ఉన్నాయని, మన రాష్ట్రంలో ప్రయోగశాల నిర్మాణం 15 ఏళ్ల క్రితం ప్రారంభమైనా, పూర్తికాలేదని, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరిందని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు పేర్కొన్నారు. ధర్మపురి కన్జూమర్స్, జిల్లా వినియోగదారుల సంఘాల సమావేశం గుంటూరులో గురువారం జరిగింది. సమావేశంలో ఆహార కల్తీ నియంత్రణపై డాక్టర్ చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకొకసారి భవనానికి మరమ్మతులు చేయడానికి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి ఆహార ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని త్వరగా సమకూర్చి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆహార ప్రయోగశాలలో మైక్రోబయాలజీ, కెమికల్ ల్యాబ్స్ ఉన్నాయని, కేవలం 50 శాతం పరికరాలు, నలుగురు సిబ్బంది ఉన్నారని ఆవేదన చెందారు. రసాయనాలు లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు జరగడం లేదన్నారు. పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ గత ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఆహార ప్రయోగశాలలను వర్చువల్గా ప్రారంభించారని, కానీ రాష్ట్రంలో ప్రయోగశాల అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. కనీసం వాచ్మెన్ను కూడా నియమించకపోవడం దారుణమన్నారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు చేకూరి రాజశేఖర్ మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన భద్రతా సూచిక గత ఐదు ఏళ్లుగా అట్టడుగు స్థానంలో ఉందని పేర్కొన్నారు. వినియోగదారుల సంఘాలు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు -
శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహిస్తాం
తాడికొండ: గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో జె.శ్యామలరావుతో కలిసిఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ, అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాకలక్ష్మీ, ఎం.శాంతారామ్, ఎం.ఎస్.రాజు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, సీపీఆర్ఓ డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు -
లైంగిక దాడుల నివారణపై అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం సమావేశ మందిరంలో పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై డీఈవోలు, ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం ఆఫీసర్స్, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ, ఆర్బీఎస్కే సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదిగే వయసులో ఉన్న పిల్లలతో కొంత సమయం కేటాయించాలన్నారు. స్నేహపూరితమైన వాతావరణంలో వారితో అన్ని సమస్యలు చర్చించాలన్నారు. పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారని, తద్వారా , వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కార మార్గాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ టి.ఓ.టి, ఆర్. సుప్రజ, సైకాలజిస్ట్ విజయకుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మీ, పిడి ఐసిడిఎస్, తెనాలి, గుంటూరు డెప్యూటీ డీఈవోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, పీడియాట్రిస్ట్ పి.నాగ శిరీష పాల్గొన్నారు. -
వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తెనాలి: చెంచుపేట అమరావతి కాలనీలోని శ్రీగోదా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఈనెల 17 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, వేదవిన్నపాలు, ప్రధాన కలశస్థాపన, చతుస్థానార్చనలు, నిత్యపూర్ణాహుతి చేశారు. ఉదయం 10 గంటలకు ‘ధ్వజారోహణం’, గరుడ ప్రసాదగోష్టి తదుపరి తీర్థప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణ, నిత్యహోమం, భేరిపూజ, దేవతాహ్వానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈనె 15వ తేదీన శ్రీస్వామివారి కళాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. వార్షికోత్సవాలకు ముందుగా ఈనెల 9వ తేదీనుండి 11వ తేదీవరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. -
నో..‘ఇంటర్’వెల్
గుంటూరు ఎడ్యుకేషన్: జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వకుండా వెంటనే ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఏడాది పొడవునా మార్కులు, ర్యాంకుల పేరుతో సెలవుల ఊసే లేకుండా కళాశాలకే పరిమితమైన విద్యార్థులకు వెంటనే తదుపరి తరగతులు ప్రారంభించడం తగదనే వాదన సర్వత్రా వినిపిస్తున్నా..ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. గురువారం జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగియడంతోనే పలు కాలేజీల యాజమాన్యాలు మధ్యాహ్నం నుంచే సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించాయి. ఈ మేరకు విద్యార్థులను మధ్యాహ్నం నుంచి కళాశాలకు పంపాలని తల్లిదండ్రులకు ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపాయి. లేకుంటే ఎంపీసీ విద్యార్థులను జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ తదితర ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలతోపాటు బైపీసీ విద్యార్థులను నీట్కు సన్నద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సందేశాల్లో పేర్కొన్నాయి. ఏప్రిల్ 7 నుంచి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని, ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలని అకడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్న కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులే లేకుండా యథావిధిగా తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలలు తిరిగి జూన్ 2న పున: ప్రారంభం కావాల్సి ఉన్నాయి. జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగిసిన రోజే ద్వితీయ సంవత్సర తరగతులను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముగిసిన జూనియర్ ఇంటర్ పరీక్షలు ఈనెల 1న ప్రారంభమైన జూనియర్ ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం జరిగిన కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో కేటాయించిన 34,874 మంది విద్యార్థుల్లో 33,972 మంది హాజరయ్యారు. అలాగే సీనియర్ ఇంటర్ ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు శనివారం ముగియనున్నాయి. వేసవి సెలవుల్లేవు.. ఏకధాటిగా చదువులే జూనియర్ ఇంటర్ పరీక్షలు ముగిసిన రోజునే సీనియర్ ఇంటర్ తరగతులు ప్రారంభం ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల వింత వైఖరి ఏప్రిల్ 7 నుంచి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అనుకూలంగా మలచుకున్న వైనం నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు చేస్తాం జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 7 వరకు సీనియర్ ఇంటర్ తరగతులు నిర్వహించేందుకు వీల్లేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దుకు ఇంటర్మీడియెట్ బోర్డుకు సిఫార్సు చేస్తాం. ద్వితీయ సంవత్సర విద్యార్థులకూ పోటీ పరీక్షల శిక్షణ పేరుతో సెలవులను హరించడం తగదు. – జీకే జుబేర్, ఆర్ఐవో, గుంటూరు -
బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్కు సన్మానం
గుంటూరు మెడికల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో గుండె పనితీరు పరీక్షలు చేస్తున్న 14 ఏళ్ల బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ సుమారు 14వేల మంది అమెరికా పౌరులపై రీసెర్చ్ చేశారని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. సిద్దార్థ్ తాను కనుగొన్న యాప్ ద్వారా జీజీహెచ్లో రెండు రోజులుగా పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ను డాక్టర్ యశశ్వి రమణ గురువారం సత్కరించారు. సిద్ధార్థ్కు మంచి భవిత ఉందని చెప్పారు. సిద్ధార్థ్ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తాను చేసిన పరీక్షల సందర్భంగా గుర్తించిన అంశాలను వివరించారు. ఐదుగురికి గుండె చప్పుడు ఆధారంగా హుద్రోగం ఉన్నట్టు గుర్తించానని వెల్లడించారు. వీరిలో నలుగురు కార్డియాలజీ విభాగంలో ఓపీకి వెళ్ళగా, వారికి గుండె జబ్బు ఉన్నమాట నిజమేనని నిర్ధారణైందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణకు కృతజ్ఞతలు తెలిపారు. -
కవయిత్రి మొల్లమాంబ చిరస్మరణీయురాలు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మొల్లమాంబ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విగ్రహానికి అంబటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన కులంలో జన్మించి వాల్మీకి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా సరళంగా తెలుగులోకి అనువదించిన మొల్లమాంబ శ్రీరాముడిని భక్తి శ్రద్దలతో కొలిచేవారని చెప్పారు. ఆమె జయంతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కుమ్మరి వర్గాన్ని గుర్తించి అధికారికంగా మొల్ల జయంతిని నిర్వహించాలని జీఓ తీసుకురావడం అభినందనీయమన్నారు. వైఎస్ జగన్ కుమ్మరి శాలివాహనులకు శీశైలంలో సత్రం కోసం 50 సెంట్లు, నరసరావుపేట కోటప్పకొండ వద్ద 50 సెంట్లు కేటాయించారని గుర్తుచేశారు. తిరుపల, తిరుపతి దేవస్థానంలో మొల్ల తెలుగులోకి అనువదించిన వాల్మీకి రామాయణాన్ని బ్రహోత్సవాల సందర్భంగా అక్కడ ప్రదర్శించడం గర్వించదగ్గ విషయామన్నారు. కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు) పాల్గొన్నారు. -
గుత్తికొండ బిలంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
పిడుగురాళ్ల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుత్తికొండ బిలాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి టి.సుజాత బుధవారం సందర్శించారు. గుత్తికొండ బిలంలోని పుణ్యక్షేత్రంలో ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హైకోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో పరామర్శించారు. ఆమె వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన ఆర్డీఓ అచ్చంపేట: మండలంలోని మాదిపాడులో ప్రభుత్వ భూములను ఆర్డీఓ జి.రమాకాంత్రెడ్డి బుధవారం పరిశీలించారు. మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అంతరాయం కలుగచేస్తున్న వారి భూములను పరిశీలించి, రోడ్డు నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని సూచించారు. అనంతరం కృష్ణానదిపై మంజూరైన వంతెన నిర్మాణానికి కావలసిన అనుమతులు, భూసేకరణ తదితర వివరాలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములుండగా వాటిని ఏవిధంగా వినియోగంచుకోవాలనే విషయంపై తహసీల్దార్తో చర్చించారు. వారి వెంట వీఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఉన్నారు.యార్డులో 1,40,254 మిర్చి బస్తాలు విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,39,436 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,40,254 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు సగటున ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,733 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. కబ్జాపై కదిలిన యంత్రాంగం అక్రమాలకు పాల్పడిన అధికారులకు నోటీసులు గురజాల రూరల్: గురజాల జగనన్న కాలనీలో మొత్తం 70 సెంట్ల స్థలాన్ని కూటమి నేతలు కబ్జా చేసిన వైనంపై రా‘జాగా’ కబ్జా అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వి.మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో రీ సర్వే సరిగ్గా చేయని ఇద్దరు సర్వేయర్లకు, జగనన్న కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్వోకు షోకాజ్ నోటీసులు అందించామన్నారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. సర్వే చేయించి పూర్తిగా విచారణ జరిపిస్తామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విచారణలో తేలితే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామన్నారు. -
సూర్యుడు భగభగలకు దీటుగా యువతరం నిప్పులుచెరిగింది. పదంపదం కలిపి కదంతొక్కింది. కాలకూటమి తొమ్మిది నెలల నయవంచక పాలనపై నిరసన గళమెత్తింది. ఫీజులివ్వని బాబు ఫ్యూజులు మాడిపోయేలా విద్యార్థిలోకం రగిలింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ తియ్యని హామీలతో గొంతుకోసి
● కదంతొక్కిన విద్యార్థులు, యువకులు ● తరలివచ్చిన వేలాది మంది ● హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక ● ఆమరణ నిరాహార దీక్షలకూ సిద్ధమని ప్రతిన ● భారీ ప్రదర్శనతో కూటమి నేతల వెన్నులో వణుకు సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం: వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం గుంటూరు నగరంలో చేపట్టిన ‘యువత పోరు’కు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. తొలుత స్వామి థియేటర్ సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, గుంటూరు, పల్నాడు పార్లమెంటరీ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), బాలవజ్రబాబు(తాడికొండ), దొంతి రెడ్డి వేమారెడ్డి(మంగళగిరి), బలసాని కిరణ్కుమార్ (ప్రత్తిపాడు) స్టూడెంట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తరలివచ్చిన యువతతో కలిసి జూట్మిల్, కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అడుగడుగునా అడ్డంకులు యువత పోరు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ర్యాలీ ప్రారంభంలో ద్విచక్రవాహనాల తాళాలు లాక్కుని పట్టాభిపురం సీఐ వీరేంద్ర హడావుడి చేశారు. కలెక్టరేట్ మీదుగా ర్యాలీలో కలిసేందుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు నూనె ఊమామహేశ్వరరెడ్డి వెళ్తుండగా కంకరగుట్ట ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యువకులపై దాడి చేశారు. దీంతో తోపులాట జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ టోపీ పడిపోయింది. దీన్ని కానిస్టేబుల్పై దాడి అంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారానికి పూనుకుంది. మరోవైపు కలెక్టరేట్కు సమీపంలో రెండంచెల్లో బారికేడ్లు పెట్టి ర్యాలీని కలెక్టరేట్ వరకూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, యువతకు మధ్య తోపులాట జరిగింది. యువత బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినదించారు. అనంతరం డీఆర్వోకు వైఎస్సార్ సీపీ నేతలు వినతిపత్రం అందించారు. స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఏ ఒక్క హామీనీ చంద్రబాబు అమలుచేయలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు కలిపి సుమారు రూ.4,600 కోట్లు పెండింగ్ ఉన్నాయని అంబటి వివరించారు. బకాయిలు ఇవ్వకపోగా కేవలం రూ.2 వేల కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నట్టు బడ్జెట్లో చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ద్వారా రూ.3 వేలు ఇస్తానని, ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన బాబు వాటి ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని అంబటి గుర్తుచేశారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను వైఎస్ జగన్ మంజూరు చేయగా, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తోందని అంబటి మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కేసులకు భయపడం -
కల్ప వృక్ష వాహనంపై నృసింహుడు
మంగళగిరి టౌన్ /మంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి తరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. కైంకర్యపరులుగా గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న శేష వాహన ఉత్సవం జరిగింది. పొన్న శేష వాహన సేవ కై ంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, అన్నమాచార్య కీర్తనల ఆలాపన భక్తులను ఆధ్యాత్మికోత్సాహంలో ఓలలాడించాయి. నేడు స్వామి దివ్య కల్యాణ మహోత్సవం ప్రధాన ఘట్టమైన స్వామి దివ్య కల్యాణ మహోత్సవం గురువారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం స్వామి అశ్వ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. రాత్రి ఎదురుకోలు ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అనంతరం దివ్య కల్యాణోత్సవం జరుగుతుందని వివరించారు. పొన్న శేష వాహనంపై చిన్నికృష్ణుడిగా గోపికలతో.. -
తిరుగుబాటు మొదలైంది
గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కడుపు మంటతో విప్లవం మొదలైందని అన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భృతి హామీ అమలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ● వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్.నూరిఫాతిమా మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సర్కారు యత్నిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏపీ అంతటా 17 వైద్య కళాశాలలను ఏర్పాటుచేయగా అందులో ఐదు కళాశాలలను ప్రారంభించారని పేర్కొన్నారు. వీటిని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. -
సంక్షేమ జెండాదే నైతిక విజయం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): పేద ప్రజల పక్షాన నిలబడేందుకు, వారి కన్నీటిని తుడిచేందుకు 14 ఏళ్ల కిత్రం వైఎస్సార్ సీపీని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో గుంటూరు, పల్నాడు పార్లమెంటరీ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, ఇతర ముఖ్య నేతలతో కలిసి పార్టీ జెండాను అంబటి ఆవిష్కరించారు. ● అంబటి రాంబాబు మాట్లాడుతూ అసత్యాలతో అధికారంలోకి వచ్చిన అధికార కూటమిపై వైఎస్సార్ సీపీ సంక్షేమ జెండాదే నైతిక విజయమని పేర్కొన్నారు. పార్టీ ప్రస్తుతం బలంగా ఉందని, శ్రేణులు ఉత్సాహంగా ప్రజాపోరాటాలకు పునరంకితమవుతున్నారని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కంకణబద్ధులమవుదామని పిలుపు ఇచ్చారు. ● మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడూ గర్వపడేలా వైఎస్సార్ సీపీ పుట్టిందన్నారు. ఈ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను అవస్థలకు గురిచేస్తోందన్నారు. మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. రానున్న కాలంలో పార్టీ శ్రేణులంతా మరింత కష్టపడి ఏకతాటిపై నిలబడి పార్టీ గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ● నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అధికారం చేపట్టి పేదల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. ● వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతోందని, ప్రజల పక్షాన పోరాడుతోందని చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ వజ్రబాబు, పార్టీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వైభవంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తిన నవోత్సాహం పార్టీ జెండాల ఆవిష్కరణతో ప్రజాపోరాటాలకు పునరంకితం -
ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికా ప్రొఫెసర్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆమెరికా వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎంఎస్ రెడ్డి బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ మన భవిష్యత్తును కాపాడుకునేందుకు మొక్కలు, నేలల ఆరోగ్యం కాపాడుకోవటంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సమస్యలను, ఎలా అధిగమించాలి అనే అంశాలపై ఆయనతో చర్చించారు. విదేశాల్లో చేసిన వ్యవసాయ పరిశోధనలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి వివరించారు. వ్యవసాయ విద్యార్థులకు వ్యవసాయం, వాటి మెలకువలను వివరించారు. అనంతనం విశ్వవిద్యాలయం అధికారులు ఎంఎస్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సుఖ జీవనానికి నూతన ఆవిష్కరణలు దోహదం
నగరం: శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన అవిష్కరణలు మానవాళి సుఖ జీవనానికి దోహదపడుతున్నాయని అచార్య నాగార్జున విశ్వవిదాలయం ప్రొఫెసర్ డాక్టర్ పీవీ కృష్ణ చెప్పారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో బుధవారం ‘జీవ శాస్త్రంలో నూతన పోకడలు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు.నేడు అన్ని రంగాల్లో పరిశోధనలు విజయవంతం కావడంతో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయని వివరించారు. ఆక్వా రంగంలో నూతన పోకడలతో రొయ్యలు, చేపలు పెంపకంలో దిగుబడులు పెరిగాయని, ఎగుమతులు కూడా అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎన్యూ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ కె. కస్తూర్, డాక్టర్ గిరిధర్లు నూతన అవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చియ్య చౌదరి, ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ, అకడమిక్ డైరెక్టర్ వి. వెంకటస్త్రశ్వరావు, బోటనీ హెచ్వోడీ పి. వెంకటనారాయణ, జువాలజీ హెచ్వోడీ కె.సురేష్బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీవారి తిరు కల్యాణం.. రమణీయం రేపల్లె రూరల్: పట్టణంలోని ఉప్పూడి రోడ్డులో గల శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా లక్ష్మి, గోదా సమేత వేంకటేశ్వరులకు మంగళస్నానాలు చేయించి, వధూవరులుగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడమ కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తిరు కల్యాణ వేడుకలను తిలకించి, స్వామికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. రాత్రి శ్రీలక్ష్మి, గోదా, వెంకటేశ్వరుడి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. -
ఉద్యోగులు సమర్థంగా పనిచేయాలి
గుంటూరు వెస్ట్: ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు చర్యలు ఉంటాయని వివరించారు. అన్ని శాఖల్లో రాష్ట్ర స్థాయి కార్యాలయం జారీ చేసిన ఫార్మెట్లను సిద్ధం చేయాలన్నారు. స్వచ్చాంధ్ర కార్యక్రమాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యా శాఖ, సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆసుపత్రులు తదితర శాఖలు నిర్ధేశించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలో జరుగుతున్న ప్రజలు, దాతలు, ప్రభుత్వం భాగస్వామ్యం (పీ–4) సర్వే వేగవంతం చేసి సత్వరమే పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం పీ–4 కార్యక్రమాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించడానికి క్యూ ఆర్ కోడ్తో రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్, జీఎంసీ కమిషనర్ పులిశ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు ఆవిష్కరించారు. కలెక్టర్ నాగలక్ష్మి -
సంబంధం లేని వ్యక్తులపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు
కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమంలో తనపై దాడి చేశారంటూ సంబంధం లేని వ్యక్తులపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. యువత పోరు కార్యక్రమంలో భాగంగా భారీగా తరలివచ్చిన యువత కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైక్ ర్యాలీగా వస్తున్న సమయంలో వెస్ట్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ సుభానిబాబు అత్యుత్సాహం చూపించారు. యువకులను అడ్డుకునే యత్నం చేశారు. అయినా యువకులు ముందుకు కదిలారు. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ నాయకుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, మరికొందరు తనపై దాడి చేశారంటూ హెడ్ కానిస్టేబుల్ సుభాని నగరంపాలెం పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి హెడ్కానిస్టేబుల్ యువకులను అడ్డుకున్న సమయంలో ఉమామహేశ్వరరెడ్డి అక్కడ లేరు. అయినా అతనిపై, అతని అనుచరులపై ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం విస్మయం కలిగించింది. పత్తి మిల్లు సీజ్.. లోపల చిక్కుకున్న ఇద్దరు బిహార్ కూలీలు నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రుణం చెల్లించలేదని ఓ బ్యాంక్ నిర్వాహాకులు పత్తి మిల్లుకు తాళాలు వేశారు. అయితే అందులో చిక్కుకున్న ఇద్దరు కూలీలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలను లాలాపేట పోలీసులు చేశారు. ఏటుకూర్ రోడ్లోని ఓ పత్తిమిల్లు నిర్వాహకులు గతంలో కొత్తపేటలోని ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు. అయితే మిల్లు నిర్వాహకులు సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు బుధవారం మధ్యాహ్నం మిల్లుకు తాళాలు వేసి సీజ్ చేశారు. మిల్లు లోపల బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు దినేష్, ఉమేష్ ఉండిపోయారు. ఈ విషయమై లాలాపేట పోలీసుల దృష్టికి తోటి కూలీలు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపి కూలీలను బయటకు తీసుకొచ్చారు. సిమెంట్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తూ నిద్ర మత్తులోకి జారుకొని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని రేణింగవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. రేణింగవరం ఎస్ఐ వినోద్బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాపట్నం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున రేణింగవరం సమీపంలోకి వచ్చింది. ఆదే సమయంలో డ్రైవర్ కె. శేఖర్ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొట్టాడు. వెంటనే తేరుకొని ఎడమవైపు బస్సును తిప్పడంతో పొలాల్లోకి వెళ్లింది. బస్సు ముందువైపు భాగంగా బాగా దెబ్బతింది. బస్సు డ్రైవర్ శేఖర్ కాళ్లకు బాగా గాయాలయ్యాయి. సీటు వద్ద ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీశారు. డ్రైవర్ది చిత్తూరు జిలా నెమలికుంట గ్రామం. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారిని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ వినోద్బాబు తెలిపారు. డ్రైవర్ శేఖర్ను అద్దంకి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అద్భుతం.. అజరామరం
తెనాలి: స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈనెల 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. సీతారాముల కల్యాణం విశిష్టతను బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథశర్మ తన ప్రవచనంలో వివరించారు. శ్రీరామనామ మహిమను భక్తులకు తెలియజేశారు. వైఖానస ఆగమ పండితులు నారాయణం గోవర్ధన్ లక్ష్మీ రఘురాం, వేదాంతం నాగమారుతి, రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్, సురేష్ బృందం వైదిక క్రతువును నిర్వహించింది. సాయంత్రం గాయని, ‘పాడుతా తీయగా’ మహాసంగ్రామం విజేత సాయి వేదవాగ్దేవి చేసిన భక్తి గీతాలాపన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలకు ములుకుట్ల విశ్వనాథ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భగవద్ రామానుజ దాసుడు జంధ్యం రామారావు దంపతులు కార్యక్రమాల నిర్వహణకు భక్తిపూర్వక సహకారం అందించారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ జరిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవాసమితి, శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి అనురాధ, వెంకటేశ్వరరావు ,గుడివాడ బాలకృష్ణ , మడుపల్లి చంద్రశేఖర్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శ్రీవారి కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు
● టీటీడీ , జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశం తాడికొండ: వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వెంకటపాలెంలోని ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలిసి ఆయన గుంటూరు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణంపై సమీప గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాల్లో అవసరమైన గ్యాలరీలు, క్యూలైన్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కల్యాణ వేదిక పరిసరాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. భక్తులు సులభతరంగా స్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్యాణానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వామి కల్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కోసం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో కలసి కల్యాణ వేదిక, తదితర పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం సాక్షి, అమరావతి: శ్రీనివాస కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డితోపాటు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి.నారాయణ, కందుల దుర్గేష్తో కూడిన బృందం ఏర్పాట్ల పర్యవేక్షణకు గురువారం ఆలయాన్ని సందర్శిస్తారని, టీటీడీ ఈఓ కూడా అందుబాటులో ఉండాలని సూచిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ బుధవారం మెమో జారీ చేశారు. -
నిమిషంలో గుండె గుట్టు విప్పేస్తాడు
● 14 ఏళ్లకే గుండె పరీక్షలు చేస్తున్న ఎన్ఆర్ఐ బుడతడు ● ఏఐ ద్వారా ప్రత్యేక యాప్కు రూపకల్పన ● గుంటూరు జీజీహెచ్లో పరీక్షలు చేసి అబ్బురపరుస్తున్న సిద్ధార్థగుంటూరు మెడికల్: నిమిషంలో గుండె పనితీరు ఎలా ఉందో గుర్తించి లోగుట్టు విప్పేస్తున్నాడు 14ఏళ్ల ఈ ఎన్ఆర్ఐ బుడతడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. గుంటూరు జీజీహెచ్కు ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా అమెరికా నుంచి వచ్చిన ఈ చిన్నోడు రోగులను పరీక్షిస్తున్నాడు. అమెరికాలో స్థిరపడిన ఏపీలోని అనంతపురానికి చెందిన నంద్యాల మహేష్, శ్రీలత దంపతుల తనయుడు సిద్ధార్థ 14 ఏళ్లకే కృత్రిమ మేధస్సుతో అమెరికా డల్లాస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్నాడు. గుండె పనితీరును తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ను కనిపెట్టాడు. అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్, పలువురి గవర్నర్ల నుంచి అవార్డులు, సన్మానాలు అందుకున్నాడు. అమెరికాలో ప్రయోగాత్మకంగా యాప్ పనితీరు నిరూపించి భారత దేశంలోనూ పేద రోగులకు గుండె పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చాడు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయంతో అమెరికాలో ఉంటున్న సిద్ధార్థ తల్లిదండ్రులు అతడిని మంగళవారం గుంటూరు జీజీహెచ్కు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు గుంటూరు జీజీహెచ్లో పేద రోగులకు పరీక్షలు చేసేందుకు సిద్ధార్థకు అనుమతిచ్చారు. బుధవారం ఉదయం అతను సుమారు 150 మందికి గుండె పరీక్షలు చేశాడు. సెల్ ఫోన్ను ఛాతి దగ్గర నిమిషంపాటు ఉంచితే క్షణాల్లోనే ప్రత్యేక యాప్ ద్వారా ఈసీజీ నివేదిక ప్రత్యక్షమవుతోంది. సిద్ధార్థ తాను పరీక్షించిన వారిలో ఇద్దరికి గుండె పనితీరు సరిగా లేదని గుర్తించాడు. వారిని తక్షణమే వైద్యులు గుండె జబ్బుల వార్డుకు రిఫర్ చేశారు. పరీక్షల తీరును పర్యవేక్షించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సిద్ధార్థను అభినందించారు. -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
● హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ● విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి ● సందేహాల నివృత్తికి ప్రత్యేక కంట్రోల్ రూం నంబర్లు ● జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గుంటూరు ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 470 పాఠశాలల నుంచి 29,459 మంది రెగ్యులర్ విద్యార్థులతో గతంలో తప్పిన, ప్రైవేటుగా రాస్తున్న మరో 961 మందిని కలుపుకుని మొత్తం 30,410 మంది విద్యార్థుల కోసం 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న 1,133 మంది అభ్యర్థుల కోసం టెన్త్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాల్లోనే 21 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు వీలుగా హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. పేపర్ లీకేజీకి ఆస్కారం లేని విధంగా ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. విద్యార్థులకు బార్ కోడింగ్ నంబరు కలిగిన ఓఎంఆర్ షీట్తోపాటు ప్రశ్నపత్రంపై ప్రత్యేక సీరియల్ నంబరు ఉంటుందని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, 99513 97109, 90523 43447 నంబర్లకు విద్యార్థులు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. టెన్త్ పరీక్షల జిల్లా పరిశీలకురాలు పి.పార్వతి మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల వెలుపల హాల్ టికెట్పై ఉన్న సెంటర్ కోడ్తో పరీక్ష కేంద్రం పేరును స్పష్టంగా తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె. వెంకట్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. -
సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలి
అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథి తాడికొండ: అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలని అమరావతి అభివృద్ది సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్–9 రోడ్డుపై బఫర్ జోన్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమె వెంట ఏడీసీ జనరల్ మేనేజర్ కె శ్రీ హరిరావు, చీఫ్ ఇంజినీర్ ఎం ప్రభాకరరావు, ఉద్యాన విభాగాధిపతి విఎస్ ధర్మజ పాల్గొన్నారు. -
‘రైల్వే సేవా పురస్కార్’ అందజేత
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 69వ రైల్వే సేవా పురస్కార్ వేడుకలను ప్రతి ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డివిజన్ డీఆర్ఎం ఎం.రామకృష్ణ అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని రైల్వే డివిజన్ కార్యాలయంలో మంగళవారం 69వ రైల్వే వీక్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డులను 2024లో ప్రతిభ కనబరిచినందుకు అధికారి, ఉద్యోగులకు ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలోని 14 మంది అవార్డు గ్రహీతలుగా గుర్తించడం జరిగిందన్నారు. డివిజన్ అధికారి జి.రత్నం, గుంటూరు ఏడీఈఈ, ఎలక్ట్రిక్, మెయిన్ అధికారితో పాటు మరో 13 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం స్థాయిలో మూడు అవార్డులు, రైల్వే బోర్డు స్థాయిలో ఒక అవార్డును సాధించడంలో ప్రతి శాఖ అధికారి సిబ్బంది కృషి ఉందని వారందరిని అభినందించారు. అనంతరం రైల్వే సేవా పురస్కారాలను అందజేశారు. ఏడీఆర్ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ అనుషా, సీనియర్ డీఎంఈ మద్దాళి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డీసీఎం కమలాకర్బాబు పాల్గొన్నారు. -
కారం మిల్లులపై విజిలెన్స్ దాడులు
నగరంపాలెం: గుంటూరు నగరంలోని పలు కారం మిల్లుల్లో విజిలెన్స్, ఇతర ప్రభుత్వశాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.21లక్షలకు పైగా విలువ చేసే కారం పొడి, మిరప కాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎస్పీ డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేటరోడ్డు శ్రీలక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ (కారం మిల్లు)లో విజిలెన్స్, తూనికలు–కొలతల శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార నియంత్రణ, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. ఎటువంటి రశీదులు, రికార్డుల్లేకుండా మిల్లు యాజమాని బండారు రవీంద్రకుమార్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మిర్చియార్డు దగ్గర్లోని మోహన్లాల్ మహేంద్ర కుమార్ – కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో మిర్చికి బిల్లుల్లేకుండా తీసుకొచ్చి కారం పొడి తయారీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. కొన్ని ట్రేడర్స్కు చెందిన స్టాక్స్ బిల్లులు లేకపోవడంతో, రూ.17.43 లక్షల విలువ చేసే 13,915 కిలోల కారం పొడి, రూ.3.14 లక్షల ఖరీదైన 1,815 కిలోల మిరపకాయలు, రూ.12 వేల విలువైన 75 కిలోల పసుపు, రూ.1.06 లక్షల ఖరీదు చేసే 1,320 కిలోల దనియాలకు స్టాక్ రిజిస్టర్, బిల్లులు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. తదుపరి చర్యలకై కారం, మిరపకాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలకు స్టాంపింగ్ లేకపోవడంతోపాటు ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేయడంపై యాజమానిపై కేసు నమోదు చేశారు. కార్మికశాఖ కూడా కార్మికుల హాజరు పట్టిక, ఇతరత్రా వివరాలు సేకరించి చర్యలకు ఉపక్రమించారు. విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్,ఏఓ ఆదినారాయణ, తూనికలు, కొలతల శాఖ ఏసీ కొండారెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి, కార్మిక అధికారి సాయి పాల్గొన్నారు. సుమారు రూ.21 లక్షలకు పైగా విలువచేసే కారం పొడి, పసుపు, ధనియాలు సీజ్ -
యూత్ పార్లమెంట్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు పోటీలను టీజేపీఎస్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు టీజేపీఎస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు చైర్పర్సన్ డాక్టర్ ఎస్.అనితాదేవి తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూత్ పార్లమెంటు నమోదుకు ఈనెల 16వ తేదీవరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్కుమార్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని విద్యార్థులకు గుంటూరు కేంద్రంగా పోటీలు జరగనున్నాయని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల యువత పోటీల్లో పాల్గొనవచ్చునని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ‘మై భారత్ పోర్టల్’ లో రిజిస్టర్ చేసుకుని, ఒక నిముషం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టు యూ‘ అనే అంశంపై వీడియో చేసి, మై భారత్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్లో ఎంపికై న వారికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని అన్నారు. ఈనెల 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు చైర్పర్సన్ అనితాదేవి -
క్యారమ్స్కు కేరాఫ్ జలీల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొందరికి క్రీడలు సాధనం కాగా మరికొందరు దానినే జీవితంగా భావిస్తారు. అటువంటి వారికి సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుంది. ఈ కోవలోకే వస్తారు గుంటూరుకు చెందిన ప్రఖ్యాత క్యారమ్స్ ప్లేయర్, శిక్షకుడు షేక్ అబ్దుల్ జలీల్. తొలినాళ్లలో జీవనోపాధి కోసం క్యారమ్స్ క్రీడను సాధనంగా ఎంచుకున్నారు. ప్లేయర్ గా రాణించినా అవగాహనా లోపంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని త్రుటిలో కోల్పోయారు. అయితే క్యారమ్స్ను మాత్రం ఆయన జీవితంలో ఒక భాగంగా చేసుకుని దానికి ఐపీఎల్ స్థాయి హోదా తీసుకొచ్చేందుకు రాజీలేని పోరాటం చేశారు. తొలిసారి రాష్ట్రంలో పేరొందిన క్రీడాకారులను రూ.లక్షలు వెచ్చించి కొన్ని జట్లు కొనుగోలు చేశాయి. క్యారమ్స్లో అంతర్జాతీయ క్రీడాకారుడిగా, శిక్షకుడిగా, మెంటార్గా, ప్రమోటర్గా విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న జలీల్ ఈ నెల 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనున్న 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్షిప్కు చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందాయి. రాష్ట్రంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జలీలే కావడం గమనార్హం. క్రీడాకారునిగా ... 1991లో క్యారమ్స్ క్రీడలో సాధన ప్రారంభించిన జలీల్ 1995లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు. అదే ఏడాది స్థానిక ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్షిప్లో చక్కని ప్రతిభ కనబరిచారు. తన కెరీర్లో సుమారు 15 జాతీయ స్థాయి టోర్నమెంట్స్తోపాటు పలు అంతర్జాతీయ మ్యాచ్ల ను ఆడి ప్రపంచ ప్రఖాత క్రీడాకారులతో తలపడ్డారు. ప్రస్తుతం జాతీయ క్రీడాకారిణిగా కొనసాగుతున్న షేక్ హుస్నా సమీరాకు కోచ్ జలీలే. హుస్నా సమీరా ఇటీవల గిన్నిస్ బుక్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. రిఫరీగా... 1995 నుంచి జలీల్ క్యారమ్స్ ప్లేయర్గా కొనసాగుతూనే రిఫరీగా చేస్తున్నాడు. ఈ క్రమంలో 2012లో ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్షిప్తోపాటు 2013లో ఏడు దేశాలు పాల్గొన్న 17వ సార్క్ చాంపియన్షిప్, 5వ ఏషియన్ చాంపియన్షిప్కు నిర్వహణా కార్యదర్శిగా పనిచేశారు. భారత క్యారమ్స్ జట్టుకు కోచ్గానూ వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన డెక్కన్ ప్రీమియర్ క్యారమ్స్ లీగ్ (డీఏపీసీఎల్)లో ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్తో కలసి పోటీలను అద్భుతంగా విజయవంతం చేశారు. ప్రస్తుతం జలీల్ ఇంటర్నేషనల్ రిఫరీ హోదా కలిగి ఉన్నారు. అతని శిష్యులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.క్యారమ్స్ ప్రతి ఇంట్లోకి వెళ్లాలి క్యారమ్స్ అందరికీ చక్కని ఆటవిడుపు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సాధన చేయొచ్చు. ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. అనేక పేరొందిన టోర్నమెంట్స్ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాం. ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్తోపాటు, స్థానిక క్లబ్లు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయి. 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్షిప్కు చీఫ్ రిఫరీగా ఎంపికకావడం సంతోషంగా ఉంది. – షేక్ అబ్దుల్ జలీల్, ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్షిప్కు చీఫ్ రిఫరీగా ఎంపిక రిఫరీగా, శిక్షకుడిగా, పర్యవేక్షకునిగా రాణింపు -
11 మందికి ఎస్ఐలుగా, నలుగురికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: ప్రతిఒక్కరూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపా ఠి అన్నారు. రేంజ్ పరిధిలోని పలు జిల్లాలకు చెందిన 11 మంది ఏఎస్ఐ (సివిల్)లకు ఎస్ఐ (సివిల్)లుగా, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ల (ఏఆర్)కు ఏఎస్ఐ (ఏఆర్)లుగా ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లాలు కేటాయించారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన ఎస్ఐలు, ఏఎస్ఐలు మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ● ఎస్ఐలు ఎన్.శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లాకు, వీఎన్ మల్లేశ్వరరావు, పి.ప్రమీల, ఆర్.కొండయ్య, డి.రాజ్యం, డి.శ్రీనివాసరావు, పి.సుబ్బారావు, బీ.శ్రీనివాసరావు, వై.రాజులు, ఎండి.అబ్దుల్హఫీజ్, షేక్.ఎన్.రసూల్ను గుంటూరు జిల్లాకు, ఏఆర్ ఏఎస్ఐలు పి.మోహన్రావు శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, షేక్.మస్తాన్, కె.శీను తిరుపతి జిల్లాకు, కె.శివకుమార్ను పల్నాడు జిల్లాకు కేటాయించారు. -
శ్రీధరం.. సంతృప్తికరం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పొగాకుకు ఎన్నడూ రానంత ధరలు రావడం, రైతులందరూ సంతోషంగా ఉండటం తనకెంతో తృప్తినిచ్చిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్బాబు తెలిపారు. ఏడున్నరేళ్ల సుదీర్ఘకాలం పొగాకు బోర్డులో సేవలు అందించిన శ్రీధర్బాబు తన సొంత క్యాడర్ ఉత్తరాఖండ్కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు బోర్డులో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను వచ్చేసరికి పొగాకు బోర్డు ఏటా రూ.27 కోట్ల నష్టాల్లో ఉండగా ప్రస్తుతం ఫిబ్రవరి నాటికే రూ.95 కోట్ల ఆదాయంతో అన్ని వ్యవసాయ బోర్డులలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. చిరస్మరణీయంగా 2023–24 సీజన్ 2023–24 పొగాకు అమ్మకాల సీజన్ రైతులకు చిరస్మరణీయంగా నిలిచిందని శ్రీధర్ పేర్కొన్నారు. గతంలో రైతులకు 15 రోజులకు చెల్లింపులు జరిగేవని, ఇప్పుడు వాటిని తొమ్మిది రోజులకు తగ్గించి త్వరగా రైతులకు నగదు అందేలా చూస్తున్నామని వెల్లడించారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు జమయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరుసగా రెండేళ్లపాటు రైతులకు సహాయ నిధి నుంచి పది వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించామని పేర్కొన్నారు. గతంలో అధిక ఉత్పత్తి పై జరిమానాలు ఉండేవని, దీని వల్ల రైతులు అనధికారిక పంటలు వేయకుండా చూడటంతోపాటు పొగాకు బోర్డుకు ఆదాయం వచ్చేదన్నారు. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తగ్గిన నేపథ్యంలో అక్కడ ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఇక్కడ ఎక్కువ పంటకు అనుమతి వచ్చేలా చూడంతోపాటు అధిక ఉత్పత్తి చేసిన రైతులపై విధించిన జరిమానాలను ఎత్తివేసి, 76.84 మిలియన్ కిలోల అదనపు పొగాకును విక్రయించే అవకాశం కల్పించామని వివరించారు. దీని ద్వారా రైతులకు రూ.184 కోట్ల మేర ప్రయోజనం దక్కిందన్నారు. ఎన్నడూ లేనంత ధర 2023–24లో 215.35 మిలియన్ కిలోల పొగాకు విక్రయం జరగగా, రెండు దశాబ్దాలలో ఎప్పుడూ రానంత అత్యధిక ధర పలికిందని శ్రీధర్ పేర్కొన్నారు. గత ఏడాది సగటు ధర రూ. 288.65 పలికిందని, అంతకుముందు ఏడాది రూ. 225.73తో పోలిస్తే రూ.62.92 పెరుగుదల నమోదైందన్నారు. ఎన్నడూ లేనివిధంగా గరిష్ట ధర రూ. 411 పలకడం ఇదే మొదటిసారి అన్నారు. కర్ణాటకలో తాజాగా మొదలైన పొగాకు అమ్మకాలలో కూడా సగటున 288 రూపాయలకు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. 2023–24 సీజన్లో పొగాకు ఎగుమతుల విలువ రూ. 12,005.89 కోట్లు చేరిందని, 2024–25లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సీజన్లో మరింత మెరుగైన ధర 2024–25 సీజన్లో మరింత మెరుగైన ధరలు వస్తాయని శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు తన పట్ల చూపించిన ఆదరణ మరువలేనిదని పేర్కొన్నారు. ఉత్తర కాశీ కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయినప్పుడు అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి తనను బదిలీ చేయవద్దని ఆందోళనలు చేశారని, ఇక్కడ రైతులు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ చూపించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పొగాకు బోర్డులో రికార్డు స్థాయి ధరలు ఉత్పత్తిలో అత్యున్నతం నష్టాల నుంచి లాభాల్లోకి నడిపిన ఈడీ శ్రీధర్బాబు సొంత క్యాడర్ ఉత్తరాఖండ్కు వెళ్తున్న సందర్భంగా ‘సాక్షి’తో మాటామంతీ మౌలిక సదుపాయాలకు పెద్దపీట తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేలం కేంద్రాలలో మౌలిక సదుపాయాల కోసం రూ. 38.92 కోట్లు ఖర్చుచేసినట్టు శ్రీధర్ చెప్పారు. ఎన్నడూ లేని విధంగా విడి పొగాకు, స్క్రాప్ అమ్మకాలకు కూడా అధిక ధరలు వచ్చాయని పేర్కొన్నారు. టుబాకో బోర్డును ఆధునికీకరించి పరిశ్రమగా అభివృద్ది చేసేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. విదేశాలలో పొగాకు మార్కెట్ను పరిశీలించి వచ్చిన తర్వాత తాను చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించి రైతుల పక్షాన తీసుకున్న నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడ్డాయన్నారు. పొగాకు డిమండ్ పెరిగి రైతులకు ఆదాయంతోపాటు ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగిందన్నారు. -
విద్యార్థుల భవిత కోసం నేడు పోరుబాట
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం విద్యార్థుల భవిష్యత్ కోసం, వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం జరగనున్న యువత పోరులో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజనులు భాగస్వాములవ్వాలని, కూటమి సర్కారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలో యువత పోరు ఏర్పాట్లను మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి థియేటర్ వద్ద వారు మాట్లాడుతూ బుధవారం ఉదయం 9.30 గంటలకు పట్టాభిపురంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి ర్యాలీ మొదలవుతుందని, కలెక్టరేట్ వరకు జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, మాజీ మిర్చి యార్డ్ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొరిటెపాటి ప్రేమ్కుమార్, పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు యువత పోరుకు ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు -
ధర్మవరం వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా ధర్మవరం రైల్వేస్టేషన్కు వెళ్లాల్సిన రైళ్లు ధర్మవరం స్టేషన్ ప్లాట్ ఫారం 5లో పలు అభివృధ్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అనంతరపురం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ తెలిపారు. రైలు నంబర్ 17215 మచిలీపట్నం–ధర్మవరం రైలు ఈనెల 12 నుంచి 30వ తేదీ వరకు మచలిపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి అనంతపురం స్టేషన్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని తెలిపారు. రైలు నంబర్ 17216 ధర్మవరం–మచిలీపట్నం రైలు ఈనెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనంతపురం నుంచి మచిలీపట్నం వరకు మాత్రమే నడుస్తుందన్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించతలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు మంగళవారం తమ తమ బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వి.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లోని అన్ని విభాగాల్లో తగిన రిక్రూట్మెంట్ చేపట్టాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వర్క్మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి కూడా యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు పీఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం, పి.కిషోర్, సయ్యద్ బాషా, సునీత, కళ్యాణ్, రాంబాబు, సాంబశివరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో గేటు వద్ద మృతదేహం ఉన్నట్లు మంగళవారం తాడేపల్లి పోలీసులకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కృష్ణానది దిగువ ప్రాంతంలోని 4వ నెంబరు గేటు వద్ద మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35–40 మధ్య ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఎర్రచొక్క నల్లగీతలు, బ్లాక్ జీన్స్ఫాంట్ ధరించి ఉన్నాడని, కుడిచేతికి కాశీదారం ఉందని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, మృతదేహాన్ని గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. -
హంస వాహనంపై నారసింహుడు
లక్ష్మీనృసింహస్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతుడైన నారసింహుడు మంగళవారం ఉదయం హంస వాహంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కై ంకర్యపరులుగా వేదాంత వెంకట రమణాచార్యులు భార్య గోపాల సత్యవతి, కుమారులు వేణుగోపాల వాసుదేవభట్టర్,అరుణప్రియ, సోదరులు వ్యవహరించారు. మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీ పద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. అత్యంత విశిష్టత కలిగిన పొన్నవాహన సేవ బుధవారం రాత్రి జరుగుతుందని ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. – మంగళగిరి/మంగళగిరి టౌన్ -
ఏపీకి చేరుకున్న మయన్మార్లో చిక్కుకుపోయిన వ్యక్తులు
గన్నవరం: మయన్మార్ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ చొరవతో మంగళవారం సురక్షితంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, ప్రొద్దుటూరుకు చెందిన మరో నలుగురు వివిధ ఏజెన్సీలు ద్వారా వర్క్ వీసాపై ఉద్యోగాలు నిమిత్తం మయన్మార్ వెళ్లారు. వర్కింగ్ వీసాల గడువు తీరినప్పటికీ వెనక్కి రాకుండా వీరంతా మయన్మార్లోనే స్థిరపడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన మయన్మార్ అధికారులు సదరు ఏడుగురు పాస్పోర్ట్లు, వీసాలను స్వాధీనం చేసుకుని భారత ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే మయన్మార్ అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ చిక్కుకుపోయిన ఏడుగురిని న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ వీరిని సమగ్ర విచారణ అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారులు మంగళవారం రాత్రి ఎయిరిండియా విమానంలో గన్నవరం పంపించారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో వీరిని గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్, ఎస్ఐ శ్రీధర్లు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం ఏడుగురిలో ఐదుగురిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి, ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురిని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. మయన్మాన్ నుంచి వచ్చిన వారి పేర్లు ఎస్కె. ఖాహప్, షేక్ గౌస్మస్తాన్, సిహెచ్. త్రిదేవ్, అఫ్రిది, రాజేష్కుమార్, షాంషేర్ బాషా, జోయల్ సన్నిగా పేర్కొన్నారు. -
రేపు ఎయిమ్స్లో వాక్థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. సాగర్ నీరు సాగు, తాగుకే వాడుకోవాలి నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన నీటిలో మిగిలిన నీరు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోయే అవకాశం ఉన్నందున వృథా చేయకుండా పంట పొలాలు, తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మే నెలలో తాగునీటి చెరువుల కోసం నీరు విడుదల చేసేంత వరకు కాలువలు మూసివేయనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖల అధికారులు తాగునీటి చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. రేపు సత్రశాలలో 16 రోజుల పండుగ సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో గురువారం 16 రోజుల పండగ నిర్వహించనున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి మంగళవారం తెలిపారు. మహాశివరాత్రి పండగ వెళ్లిన 16 రోజుల తరువాత దేవస్థానంలో స్వామివార్ల కల్యాణం నిర్వహించి అనంతరం కనులపండువగా వసంతోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. వలస పక్షుల రాక పెదకూరపాడు : కొల్లేరు ప్రాంతానికి విదేశీ పక్షులు రావడం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు జిల్లాలోనూ తక్కెళ్లపాడు చెరువుకు వలస పక్షులు రావడం సహజం. ఈ కోవలోనే పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలోని చెరువు కూడా వలస పక్షులకు ఆవాసంగా మారడంతో ప్రజలు పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్లపైన పండ్ల మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆవాసాలుగా మారతాయని, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. -
సంక్షేమం ఫ్రీజ్
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొలువుల జాతర అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యో గం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సుమారు ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరో ఐదు వందల మందికి ఉపాధి దొరికింది. చాలా మంది తమ సొంత గ్రామాలు, సొంత మండలాల్లో ఉపాధి పొందారు. అప్పట్లో హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్ పేరిట వేలాది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు వలంటీర్ వ్యవస్థ ద్వారా భారీగా ఉపాధి కల్పించడం విశేషం. జిల్లాలో సుమారు పది వేల మందికిపైగా మంది వలంటీర్లుగా సొంత గ్రామంలో ఉపాధి పొందారు. ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం.. గత ప్రభుత్వంలో జగనన్న విద్య దీవెన, వసతి దీవెనకు సంబంధించిన నిధులను ప్రతి మూడు నెలలకొకసారి క్యాలెండర్ ప్రకారం విడుదల చేసేవారు. దీంతో ఫీజు బకాయిలు లేకుండా సకాలంలో కాలేజీలకు చెల్లించేవాళ్లం. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేయకుండా ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ విధంగా చెల్లింపులు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – రామసాయి, విద్యార్థి, బీటెక్ థర్డ్ ఇయర్ ఫీజుల కోసం అప్పు గతంలో ఇంటర్ చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి ద్వారా రూ.15వేలు చెల్లించేవారు. ఆ నగదుతో ఫీజులు కట్టుకునే వాళ్లం. గత ఏడాదికి సంబంధించి అమ్మఒడి నిధులను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఫీజులను సొంతంగా అప్పు చేసుకుని కట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. – డి.సురేంద్ర ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ●సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజినీరింగ్, పీజీ ఇలా ఏదో ఒకటి పూర్తి చేసిన నిరుద్యోగులు ఐదు లక్షల 58 వేల మంది ఉన్నారని అంచనా. వీరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అయితే ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్లోనూ కేటాయింపులు చేయలేదు. అసలు భృతికి అర్హత ఏమిటన్న మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, తొలి సంతకం అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు దానికీ పాతరేశారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్లూ ఇవ్వడం లేదు. ఫలితంగా యువత నిరసన గళమెత్తుతోంది. బాబు వల్ల విద్యారంగం నిర్వీర్యం బాబు పాలనలో విద్యారంగం నిర్వీర్యమైపోతోంది. గత ప్రభుత్వంలో అమలైన ఫీజు రీయింబర్స్మెంట్(విద్యాదీవెన), వసతి దీవెన పథకాలు అటకెక్కాయి. ఫలితంగా విద్యార్థుల బంగారు భవిత అంధకారమైపోతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారు విడుదల చేయకపోవడంతో కళాశాలల నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో తెలీక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారు అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా.. సర్కారులో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, ఫీజులు చెల్లిస్తేనే ఈ ఏడాది పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఉద్యమబాట కూటమి ప్రభుత్వ వంచనను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట పట్టింది. నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన పోరుబాటకు నాంది పలికింది. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ‘యువత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పథకాల లబ్ధి ఇలా.. పథకం లబ్ధిదారులు ఆర్థిక ప్రయోజనం (రూ.కోట్లలో) జగనన్న అమ్మఒడి 1,59,594 239.39 జగనన్న విద్యాదీవెన 38,252 80.35 జగనన్న వసతి దీవెన 37,894 33.31 భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెనకు మంగళం నిరుద్యోగ భృతి అడ్రస్ గల్లంతు ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. యువత తరఫున నేడు వైఎస్సార్ సీపీ పోరుబావుటా ప్రతిపక్షానికి అన్నివర్గాల నుంచి విశేష మద్దతు తల్లికి వందనం ఎక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో నాలుగేళ్లపాటు నిరాటంకంగా అమలైన జగనన్న అమ్మ ఒడి ఆర్థిక ప్రోత్సాహం ఆగిపోయింది. ఏటా తల్లుల ఖాతాల్లో జమైన రూ.15 వేలు పిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా సంక్షోభంలోనూ అమ్మఒడి ఆగలేదు. కూటమి సర్కారు వచ్చాక తల్లికి వందనం అని చెప్పి మొత్తంగా ఎగ్గొట్టారు. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
-
ప్రకృతి సాగుకు ఫ్రాన్స్ బృందం ప్రశంసలు
గుంటూరు రూరల్: ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేసిన పెరటి తోటలను పరిశీలించడానికి ఫ్రాన్స్ బృందం సోమవారం కొల్లిపర మండలంలోని అత్తోట, దావులూరు పాలెం గ్రామాలను సందర్శించింది. రైతు సాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఆధ్వర్వంలో ఈ తోటలు సాగు అవుతున్నాయి. ముందుగా గుంటూరులోని కృషి భవనంలో ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) కే రాజకుమారితో ఫ్రాన్స్ బృందం సభ్యులు సమావేశమయ్యారు. డీపీఎం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం బృంద సభ్యులు అత్తోట, దావులూరిపాలెం గ్రామాలలో 365 రోజుల కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, ఏ గ్రేడ్, ఏటీఎం, సూర్య మండలంలోని పలు మోడల్స్ను పరిశీలించారు. బీజామృతం, ఘన జీవామృతం తయారీ తెలుసుకున్నారు. అభ్యుదయ గ్రామ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నారని బృందం ప్రశంసించింది. కార్యక్రమంలో నాగలక్ష్మి, ఎంటీఎల్ మాధవి, ఎంటీ పాండురంగారావు, ఎన్ఎఫ్ఎఫ్ రజిని, అవినాష్, ఆర్వైఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరిట మోసాలు
చిట్టీల పేరుతో.. సంగడిగుంట కిడాంబినగర్ ఐదో వీధిలో ఉంటున్న తల్లి, కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహించేవారు. రెండేళ్ల నుంచి చిట్టీ పాటలు నడుపుతున్నారు. గతేడాది తల్లి హఠాన్మరణం చెందారు. కుమారుడు చిట్టీ పాటల నగదు చెల్లిస్తానని నమ్మబలికాడు. ప్రస్తుతం ఆర్టీసీకాలనీలో ఉంటున్న అద్దె గృహాన్ని ఖాళీ చేశాడు. ఎవరైనా మొబైల్కు కాల్ చేసి డబ్బులు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దాదాపు రూ.25 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంది. న్యాయం చేయగలరు. – బాణాల లక్ష్మి, శివపార్వతి,బాధితులు , సంగడిగుంట నగరంపాలెం: ఉద్యోగాల పేరిట మోసగించారని పలువురు బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు, పరిష్కారాల వ్యవస్థ ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు (క్రైం) కె.సుప్రజ, హనుమంతు, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కూడా అర్జీలు స్వీకరించారు. ● -
బాబోయ్.. ఇవేం స్పీడ్ బ్రేకర్లు?
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలు వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. బైక్ రేసర్ల ఆట కట్టించేందుకు ప్రధాన రహదారులైన లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్, పట్టాభిపురం, స్తంభాలగరువు వంటి ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను అడ్డగోలుగా నిర్మించారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ● నగరంలోని స్పీడ్ బ్రేకర్లతో వాహన చోదకులకు నిత్యం నరకం ● నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మాణం ● బ్యాలెన్స్ తప్పుతుండటంతో ప్రమాదాల బారిన బైకు చోదకులు తీవ్ర ఇబ్బందులు లక్ష్మీపురం: పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గుజ్జనగుండ్ల నుంచి విద్యానగర్, రింగ్రోడ్డు, కొరిటెపాడు వరకు ఒక్కో ప్రదేశంలో మూడు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ఈ విషయం గ్రహించిన అధికారులు మూడు స్పీడ్ బ్రేకర్లకు బదులు కొన్నిచోట్ల నామమాత్రంగా రెండు స్పీడ్ బ్రేకర్లుగా సరి చేశారు. ఇంకా చాలాచోట్ల అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రోడ్డులోని నగరాలు వెళ్లే మార్గంలో ఇరువైపులా మూడు స్పీడ్బ్రేకర్లు అడ్డగోలుగా వేయడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యూటర్న్లలో ప్రమాదకరంగా.. ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ప్రతి చోట దాదాపు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో యూటర్న్ తీసుకునే సమయంలో వాహనదారుల సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. భారీ వాహనాలు అటుగా ప్రయాణించే సమయంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లను సరిచేసి వాహనదారులు స్పీడ్ తగ్గించి ఎలాంటి ప్రమాదాలబారిన పడకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నగరవాసులు కోరుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం పట్టాభిపురం, స్తంభాలగరువు మీదుగా పలు ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్లను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేశారు. పైగా వాటిపై కనీసం నిర్దేశిత రంగులు కానీ, రేడియం లైట్లు, కలర్లుగానీ వేయక పోవడంతో రాత్రి వేళ వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకు రేసర్ల కట్టడికి సిబ్బందితో నిఘా పెట్టడం, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలేగానీ ఇలా అడ్డగోలుగా స్పీడ్ బ్రేకర్లు వేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెబుతారని జనం మండిపడుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం యువత బైక్ రేసుల్లో పాల్గొనకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులకు సూచించాం. వారి నిబంధనల ప్రకారం స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. రేడియం పెయింట్ వేయించాల్సిందిగా వెస్ట్ ట్రాఫిక్ సీఐ ద్వారా లేఖ కూడా పంపాం. రింగ్ రోడ్డు వైపు ఉన్న రెండు స్పీడ్ బ్రేకర్లు యూటర్న్ వద్ద ఉన్నందున పరిశీలించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. స్పీడ్ బ్రేకర్లు పెట్టినా బైక్ రేసర్ల స్పీడ్ తగ్గడం లేదు. బ్రేకర్లతో పాటు జిగ్జాగ్ స్టాప్ బోర్డులను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రమాణాలు పాటించని స్పీడ్ బ్రేకర్ల దెబ్బకు నగరవాసుల నడుం విరిగినంత పనవుతోంది. చాలాసార్లు బైకు బ్యాలెన్స్ కుదరక అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బైకుపై వెనుక భాగంలో కూర్చున్నవారు జారి కింద పడుతున్నారు. ఇక వృద్ధులు బైకు నడపాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పేషెంట్లు అటుగా వెళ్లాలన్నా, వారిని బైకుపై తీసుకెళ్లాలన్నా బైకు నడిపేవారికి నరకమే. గర్భిణుల పరిస్థితి చెప్పే పనే లేదు. విద్యాసంస్థలకు పిల్లలను తీసుకుని బ్యాగులతో వచ్చీపోయే తల్లులు స్కూటీలను ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అదుపు చేయలేక బెంబేలెత్తుతున్నారు. పురుషులు కూడా చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పలువురి జేబుల్లోని సెల్ఫోన్లు కింద పడటం, వాటిని తీసుకోవడానికి వాహనాలు పక్కకు ఆపి మళ్లీ వెనక్కి రావాల్సిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కాస్త ఖరీదైన కార్లు కింది భాగం స్పీడ్ బ్రేకర్లకు తగులుతుండటంతో ట్రాఫిక్కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. పైగా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులు వితరణ
మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు. మాల్ ప్రాక్టీసు కేసు నమోదు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సోమవారం తొలి మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్ఐవో జీకే జుబేర్ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్ బ్లాక్, ప్రసంగించనున్న అబ్దుల్ కలామ్ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ప్లానింగ్ ఈడీ వీఆర్ అలపర్తి, సెక్రటరీ అనంత్ సింగ్, రిజిస్ట్రార్ ఆర్. ప్రేమ్కుమార్, సీఎల్ఎం డైరెక్టర్ అనూప్సింగ్, జీఎం రమేష్బాబు పాల్గొన్నారు. బీఈడీ పరీక్ష రద్దు ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 7న జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పర్సెక్టీవ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షను వీసీ ఆచార్య కె.గంగాధర్రావు ఆదేశాల మేరకు రద్దు చేశామని సీఈ ఏ శివప్రసాద్రావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 12వ తేదీన తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. యార్డుకు 1,61,169 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,61,169 బస్తాల మిర్చి రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,30,718 బస్తాలు విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. -
బ్రహ్మాండ నాయకుడు
సింహ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు మంగళగిరి / మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారు సింహవాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గల వారిని హింసించేవాడు నారసింహుడు, నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి వారి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవం సందర్భంగా రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు కళావేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు. సోమవారం ఉదయం చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కైంకర్యపరులుగా దేవతి భగవన్నా రాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు హంస, గజ వాహన సేవలు మంగళవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. -
అర్జీలను వేగంగా పరిష్కరించండి
గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రజలు ప్రతి వారం అర్జీలను ఇవ్వొచ్చన్నారు. ఇచ్చిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని తెలిపారు. అనంతరం వచ్చిన 290 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
వసూలు.. ఉసూరు..!
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరినా మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు ఉసూరుమనిపిస్తున్నాయి. జిల్లాలోని ఎనిమిది యార్డులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.133.69 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలైంది. ● జిల్లాలోని మార్కెట్ యార్డుల లక్ష్యం రూ.133.69 కోట్లు ● ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలు ● సీజన్ ముగుస్తున్నా లక్ష్య సాధనలో వెనుకబాటు ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) గుంటూరు 6.22 5.02 నరసరావుపేట 6.24 5.04 బాపట్ల 6.22 5.02 గుంటూరు మార్కెట్ యార్డ్ న్యూస్రీల్ -
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
కూటమి పాలనపై నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న యువత పోరుకు సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. గుంతలు పూడ్చి రోడ్లు వేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 9 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లలో భారీగా కోతలు పెడుతున్నారని విమర్శించారు. 9 నెలల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, సమయం వచ్చినప్పుడు ఓట్లతో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. కూటమి ఎమ్మెల్యేల అక్రమాలు అనంతం కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. రోజు రోజుకు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో, యువత పోరు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాలుపంచుకుని దిగ్విజయం చేయాలన్నారు. తద్వారా ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదనే సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులే పేదవారి గొంతుగా మాట్లాడాలని సూచించారు. పార్టీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ స్థానాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆనాడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక ఎత్తు అయితే.. తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ సారథిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు. మోసం చేయడంలో నంబర్ వన్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివన్నారు. నేడు విద్యకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఏపీలో 28 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. ఇంటికే వచ్చి వైద్యం చేసే పరిస్థితి ఉందన్నారు. ఆ మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణలు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నీ పరిపూర్ణంగా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం సమయం వచ్చినప్పుడు ఓట్లతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు యువత పోరు సన్నాహాక సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రేపటి వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు జయప్రదానికి విజ్ఞప్తి -
రౌడీషీటర్ల ఆగడాలు సహించేదే లేదు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఈ పక్రియ చేపట్టారు. నగరంపాలెం పీఎస్, పట్టాభిపురం పీఎస్, అరండల్పేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లకు పశ్చిమ డీఎస్పీ అరవింద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. వివాదాలు, పంచాయితీలు, దందాలు, బెదిరింపులు, కిడ్నాపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక నుంచి కుటుంబ సభ్యులతో రౌడీషీటర్లు కౌన్సెలింగ్కు హాజరవాల్సి ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదుట కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న నేరాల్లోనైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పథకాల నిలిపివేతకు సిఫారసు చేస్తామని చెప్పారు. ఫోన్, ఆధార్ కార్డుల నంబర్లు, ఇళ్ల చిరునామాలు పోలీస్ డేటాబేస్లో ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంటుందని అన్నారు. తీరు మారని రౌడీషీటర్లపై నమోదైన పాత కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేస్తున్నామని వెల్లడించారు. నిత్యం నేరాలు, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి, జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారులకు సిఫారసు చేసి, రౌడీషీట్లను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలకు పాల్పడితే పీడీ చట్టం, బహిష్కరణ తప్పదని డీఎస్పీ హెచ్చరిక జిల్లావ్యాప్తంగా అన్ని పీఎస్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ -
యాలివాహనంపై నరసింహుడు
మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారు యాలివాహనంపై దర్శనమిచ్చారు. ఇలా స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వలన కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముత్యాల పందిరి వాహనంపై.... స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు. నేడు సింహ వాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి సోమవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సవంలో విహరించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు. -
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవన్నారు. వీటిని నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని గుర్తుచేశారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుపోను మిగిలిన స్థలంలో పీపీపీ పద్ధతిలో లీజులకు ఆర్టీసీ స్థలాలను ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ 3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన వెంకటపాలెం (తాడికొండ): తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పరిశీలించారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్, రాకపోకలకు అనువుగా కేటాయించిన మార్గాలు, వీవీఐపీ, వీఐపీ భక్తులకు ప్రత్యేక మార్గాల కేటాయింపు తదితర అంశాలపై సిబ్బందితో ఎస్పీ చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, తుళ్ళూరు సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు. అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. వివరాలు.. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు దానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు ఊపిరితిత్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీ, లివర్లను ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు అందించారు. ఊపిరితిత్తులను గ్రీన్ చానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్కు తరలించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, క్లస్టర్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
12న ‘యువత పోరు’కు తరలిరండి
నగరంపాలెం: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ‘యువత పోరు’కు విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలిరావాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను మాజీ మంత్రి అంబటి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా (తూర్పు). బాలవజ్రబాబు (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజ నారాయణ, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద రూ.4,600 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు కళాశాలల నుంచి బయటకు పంపుతున్నాయని ఆరోపించారు. చదువుకోవాల్సిన వారు కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లే విషమ పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చి విద్యార్థులకు, యాజమాన్యాలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు రూ.4,600 కోట్లు ఉండగా, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అతి తక్కువగా చూపించారని ఆరోపించారు. ప్రస్తుతం బకాయిలను తీర్చే పరిస్థితులు కనిపించడంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కుంగదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద ప్రజానీకానికి విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘సూపర్ సిక్స్’ ఊసే లేదు ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదని, సెవన్ కూడా లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా దాన్ని విస్మరించారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, దాని ఊసు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో గవర్నర్తో పచ్చి అబద్ధాలను మాట్లాడించారని విమర్శించారు. ఏపీలో వైద్య కళాశాలల తీరు మరింత దారుణంగా మారిందని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యంపై ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉండరాదనే ఉద్దేశంతో వైద్యులు మొదలుకుని ఇతరత్రా పోస్టులన్నింటినీ భర్తీ చేయించారని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. కూటమిలోని పెద్ద భూస్వాములకు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు జయప్రదం చేయాలి రూ.4,600 కోట్ల ఫీజు బకాయిలను సర్కారు విడుదల చేయాలి పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన శూన్యం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు పాలకుల కుటిల యత్నాలు వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి -
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండి ఉందని, మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే అంతగా అనుగ్రహిస్తాడని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్ జాన్వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని చెప్పారు. ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. లోకమంతా దేవుని కృపతో నిండి ఉందని, దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆయన్ను నిరంతరం స్తుతించాలని తెలిపారు. ప్రపంచంలో అందరిపైనా ఆయన వర్షం కురిపించినా ఆత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. మానవుడిని ఆశ్రయించే దురాత్మలను దేవుడు దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకుపోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలి సంవత్సర అనుభవాలతో వచ్చే ఏడాది ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 వ తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పండుగ ఘనంగా జరగడానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. ఆదివారం కావడంతో లక్షలాది మంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు. ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్స్ జాన్వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు -
గుంటూరు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025పోలీసుల అదుపులో కీలక సూత్రధారులు అంగట్లో విద్య..విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ వేదిక కావాలి. విలువలు పెంచేలా వ్యవహరించాలి. కానీ ఆచార్య నాగార్జున వర్సిటీ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చోటు చేసుకుంటున్న అక్రమాల దందాను పరిశీలిస్తుంటే ఇది విద్యాలయమా, మాఫియా నిలయమా అనే సందేహం నెలకొంటోంది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గంలోని ఈ ఉన్నత విద్యాసంస్థలో రోజుకో అక్రమం చోటుచేసుకుంటున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇఫ్తార్ సహర్ (సోమ) (మంగళ) గుంటూరు 6.22 5.03 నరసరావుపేట 6.24 5.05 బాపట్ల 6.22 5.03 పెదకాకాని: పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా అసలు సూత్రధారులపై చర్యలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలలో ఇది సర్వసాధారణమని, నగదు కోసం పలు సెంటర్ల నిర్వాహకులు సిఫార్సులు చేసి మరీ పరీక్షల నిర్వహణకు అనుమతులు తెచ్చుకుంటున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ తరువాత నిబంధనలకు నీళ్లు వదలడం సర్వసాధారణంగా మారుతోందని వెల్లడైంది. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్తోపాటు పరీక్ష హాలులోకి పుస్తకాలను కూడా అనుమతిస్తారని పోలీసులు గుర్తించారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని నిజాయతీగా పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో వీరు చెలగాటం ఆడుతున్నారు. బీఈడీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం తెల్లవారుజామున తెనాలిలో ఒడిశాకు చెందిన ధీరేన్ కుమార్ సాహు, గణేష్ సీహెచ్ సాహు, మిలాన్ ప్రుస్తీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి విదితమే. వారు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం రాత్రి పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తమ సిబ్బందితో వినుకొండ చేరుకున్నారు. వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ ఎస్ రఫీ, ప్రిన్సిపల్ సురేష్కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ దారా స్వర్ణరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఒడిశాకు చెందిన ఏజెంట్లు సంతోష్ సాహు, బిష్ణుపాత్రో, పురుషోత్తమ్ ప్రధాన్, సుదాన్ష్ శేఖర్ రాణా, బదాల్ ప్రధాన్ తదితరులను అదుపులోకి తీసుకుని ఆదివారం స్టేషన్కు తరలించారు. కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.7 బీఈడీ పరీక్ష పత్రం లీకేజీలో తీగ లాగితే కదులుతున్న డొంక రెండు రోజుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వినుకొండ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, కంప్యూటర్ ఆపరేటర్లది కీలక పాత్రగా గుర్తింపు న్యూస్రీల్ -
15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’
తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైతు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
తెనాలి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు, డీఏ ఇవ్వాలని, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఎస్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఉమ్మడి తెనాలి ఏరియా (తెనాలి అర్బన్, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండల శాఖలు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్జీవో కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్టీయూ తెనాలి ఏరియా కార్యదర్శి డీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏకే జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏవీ ప్రసాద్ బాబు, వేమూరు ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్, డాక్టర్ శారద మాట్లాడారు. దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయిని శోభాదేవి, కవయిత్రిగా గుర్తింపును తెచ్చుకున్న కొలకలూరు ఉపాధ్యాయిని దేవికరాణి, వివిధ మండల శాఖల మహిళా కన్వీనర్లు సహా 23 మందిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తెనాలి ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్తోపాటు ఏరియాలోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ గోపాలరావు, ఎం.రవి, జి.మిథున్ చక్రవర్తి, ఎస్.నాగేశ్వరరావు, ఉన్నం ప్రసాద్, మునిపల్లి మోహన కృష్ణ, ఖాన్, ఆరోన్, వినోద్, ప్రసాద్, నాగరాజు, చంద్రశేఖర్, కిరణ్, నాగరాజు, శ్రీనివాస్, రామకృష్ణ, సీనియర్ నాయకులు ఈ.అంబరీషుడు, పట్టణ శాఖ నాయకులు పూషాడపు శ్రీనివాసరావు, ఉమ్మడి తెనాలి ఏరియాలోని రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్య నిర్వాహక సభ్యులు, మండల కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: 220 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
నాలుగు పళ్ల విభాగంలో విజేత బాపట్ల జిల్లా
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమవారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పందేలు చూడటానికి వచ్చే రైతులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
అంగన్వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
ఎంఎల్హెచ్పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. ● ఈ విషయమై డీఎంహెచ్ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. ఈ విచారణలో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు. ● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్సీ కేంద్రం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
రుణాల ఊబిలో టిడ్కో గృహ లబ్ధిదారులు
లక్ష్మీపురం: టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వం రుణాల ఊబిలోకి నెట్టిందని, గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాలూ కల్పించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు విమర్శించారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరు నగరంలోని అడవితక్కెళ్లపాడులో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను బాబురావు, నగర కార్యదర్శి కె. నళిని కాంత్, ఇతర నగర నాయకులు సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. లబ్ధిదారులు బ్యాంకుల నుంచి రూ.3.50 లక్షల రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ.10.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. అసలు కంటే వడ్డీ అధికంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీ నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీ సహా భరించాలని కోరారు. కనీస వసతులు కల్పించాలి గృహ సముదాయాల వద్ద వసతులు లేవని బాబురావు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆరు కుటుంబాలకు సరిపోయే నీళ్ల ట్యాంక్ నిర్మించి, 16 కుటుంబాలకు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. అది కూడా రోజు మార్చి రోజున గంటసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. చాలాసార్లు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. తాగటానికి ఉపయోగపడట్లేదని నాయకులకు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముళ్ల చెట్లను తొలగింపజేయాలని కోరారు. డిపాజిట్ చెల్లించినా ఇల్లు కేటాయించలేదని, రిజిస్ట్రేషన్ చేయలేదని, కానీ వడ్డీ కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాత్రలను జయప్రదం చేయండిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు లక్ష్మీపురం: ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ప్రజాచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని, సమస్యలను యాత్ర బృందానికి తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు కోరారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాయలంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేయునున్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎ్.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినీకాంత్, బూరగ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డి.శ్రీనివాసకుమారి, ఎల్.అరుణ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చీరాల: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు. వేటపాలెం మండలం రామాపురంలోని బీచ్ రోడ్లోని వాయల రాంబాబు కూల్డ్రింక్ షాపులో రైడ్ చేయగా విస్కీ7 సీసాలు, ఇంపీరియల్ బ్లూ 4, ఎంసీ డోవేల్స్ 3 మొత్తం 14 బాటిల్స్ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మడం నేరమన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక చీరాలటౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్ యూసుఫ్ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్.కృపాచార్యులు, జనరల్ సెక్రటరీగా సాయి మహేష్, ఉపాద్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై రెడ్డిగూడెం రైస్మిల్లు వద్ద శనివారం రాత్రి జరిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ (26)అనే యువకుడు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళుతుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ కె.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ధైర్యం, స్వేచ్ఛతో మహిళా సాధికారత సాధ్యం
నగరంపాలెం: మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా ఏఎస్పీ(ఏఆర్) హనుమంతు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ మైదానం వద్ద మహిళా సాధికారత ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మూడు బొమ్మల సెంటర్ మీదగా తిరిగి పోలీస్ పరేడ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ మహిళలు సమాజంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఉండాలని అన్నారు. లింగ సమానత్వాన్ని, హక్కులను స్వేచ్ఛగా అనుభవించినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అని పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘మహిళా...మీ కోసం‘ ఇటీవల ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉంటుందని అన్నారు. మహిళల రక్షణకు సంబంధించి భద్రతా చర్యలను తీసుకున్నామని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. మహి ళా పీఎస్ డీఎస్పీ సుబ్బారావు, సీఐ నారాయణ, ఆర్ఐలు శివరామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలి
శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ నరసరావుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అతివలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం యూటీఎఫ్, సీఐటీయూ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఎ.భాగేశ్వరిదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి పాలకుల ఉపన్యాసాల్లో తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. కనీస రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో మహిళా సాధికారత వెనుకబడిందన్నారు. సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, స్థిరమైన ఉపాధి లభించడం లేదన్నారు. సమాన అవకాశాలు మహిళలకు దూరంగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, భవన నిర్మాణ, ఇతర రంగాలలో వేలాదిమంది మహిళలు మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని, సంఘం సీనియర్ నాయకులు గద్దె ఉమశ్రీ, నాయకులు ఎస్.దుర్గా బాయి, నాగమ్మ బాయి, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ నిఘాతో మందు బాబులపై కేసులు
పెదకాకాని: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టీపీ నారాయణస్వామి శనివారం తెలిపారు. వివరాలు.. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘా ఉంచారు. గ్రామ శివారులోని పొలాల్లో, చెట్ల కింద మద్యం తాగుతున్న వారు సులువుగా దొరికిపోతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ఏ ప్రాంతంలో ఓపెన్గా మద్యం తాగుతున్నారో ఆ ప్రాంతానికి పోలీసు సిబ్బంది చేరుకుని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ తాడికొండ: విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి చదవాలని, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని అర్జున అవార్డు గ్రహీత(షూటింగ్) ఇషా సింగ్ అన్నారు. విటోపియా– 2025 వార్షిక క్రీడల, సాంస్కృతిక ఉత్సవం రెండోరోజు శనివారం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్జున అవార్డు గ్రహీత ఇషాసింగ్ పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ మహిళలకు తమ వర్సిటీ అడ్మిషన్లలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2017లో వీఐటీ– ఏపీ క్యాంపస్లో కేవలం 8 శాతం మహిళా విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని త్వరలో అది 50 శాతానికి చేరుకుంటుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండో రోజు వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ప్రో షోలో ప్రముఖ నేపథ్య గాయని షల్మాలి ఖోల్గాడే, ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్ల డీజేల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. వీఐటీ– ఏపీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, విటోపియా కన్వీనర్ డాక్టర్ కృష్ణ స్వామి, స్టూడెంట్ వెల్ఫేర్ డీడీ డాక్టర్ ఖాదీర్ బాషా పాల్గొన్నారు. మారథాన్ను ప్రారంభించిన గుంటూరు ఎస్పీ విటోపియాలో భాగంగా డ్రగ్స్ రహిత ఇండియా కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. వీఐటీ– ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వంతో కలసి డ్రగ్స్ రహిత ఇండియా కోసం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డ్రగ్ నిర్మూలనా ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ షమ సుల్తానాకు ఉత్తమ మహిళ అవార్డు గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, హోప్ విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమ సుల్తానాకు ముంబాయికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ ఉత్తమ మహిళ అవార్డు అందజేశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబాయిలోని యూనియన్ కార్యాలయంలో ఎం పవర్ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో డాక్టర్ షమ సుల్తానా పాల్గొని తన జీవిత కథ వివరించారు. అత్యున్నత స్థాయికి ఎదగడంలో తాను అనుభవించిన సమస్యలను వివరించారు. ఈసందర్భంగా డాక్టర్ షమ సుల్తానాకు ఉత్తమ మహిళఅవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. హోప్ విన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల కోసం చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. రైల్వే డివిజన్ ఆస్పత్రిలో.. లక్ష్మీపురం:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజనేషన్ అధ్యక్షురాలు, డీఆర్ఎం సతీమణి ఎం.ఆశాలత అన్నారు. స్థానిక గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మహిళా రైల్వే ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ఇలాంటి శిబిరాల వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. డాక్టర్ ఎ.ప్రియాంక, పి.షర్మిల, డాక్టర్ వి.సింధు, సౌమ్య పాల్గొన్నారు. మహిళా భాగస్వామ్యం పెరగాలి.. గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయ వ్యవస్థలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలని మహిళా, శిశు సంక్షేమశాఖ న్యాయవాది ఎ.విజయలక్ష్మి పేర్కొన్నారు. శ్యామలానగర్లోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ వైద్యురాలు కె. శ్రీవిద్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎంతో మంది మహిళలు మన దేశానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ మన దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తూ, తమ శక్తి, సామర్ాధ్యలను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విషయమన్నారు. మహిళల విజయగాథలు సాధారణ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని చెప్పారు. ఈసందర్భంగా మంజు సెబాస్టియన్తో పాటు అతిథులుగా పాల్గొన్న మహిళా ప్రముఖులనుసత్కరించారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి: మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజలు ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను, ఎస్ఆర్ఎం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, డీఎస్పీ మురళి, రూరల్ సీఐ, ఎస్ఐలు వై.శ్రీనివాసరావు, సీహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కూసాలు కదిలేలా ఫీజు పోరు
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నగరంపాలెం: కూటమి ప్రభుత్వ కూసాలు కదిలేలా ఫీజు పోరుకు తరలిరావాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపునిచ్చారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఫీజు పోరుని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిన వినోద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులను విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు నిలిపివేయాలని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యంకావడంతో చదువులు అర్ధాంతంగా నిలిపివేయాల్సి వస్తోందని వాపోయారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పిల్లల ఫీజులకు డబ్బులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కళాశాలల కమిటీ అధ్యక్షులు మణిచౌదరి, సుభానీ, శ్రీకాంత్, ప్రవీణ్, మస్తాన్రెడ్డి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బడే జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గురిశెట్టి రవి, గంటి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మస్తాన్, కరీం, రాజేష్, అజయ్, జిల్లా కార్యదర్శులు సన్ని, రామకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు. -
ఎస్టీపీ ప్లాంట్ పరిశీలన
తెనాలిఅర్బన్: తెనాలి పూలే కాలనీలో ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ మరియన్న పేర్కొన్నారు. శనివారం ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల పరిధిలోని ఇమ్యూనిటీ సెక్రటరీలకు ఎస్టీపీ పనితీరుపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పూలే కాలనీలో సుమారు రూ.30 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజులుగా ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, డీఈలు సుబ్బారావులు, శ్రీనివాసరావు, ఏఈలు ఫణీ, సూరిబాబు, సునీల్ ఉన్నారు. జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం న్యాయ సేవా సదన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.నీలిమ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో సీ్త్ర శక్తి ఎంతో విలువైనదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్ సెక్రెటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియా ఉద్దీన్ మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. స్వేచ్ఛ భద్రతను కల్పించి ముందుకు నడిపించాలన్నారు. చెట్టుకు వేలాడిన కళేబరం ●కొంత కాలం కిందట వ్యక్తి ఆత్మహత్య ●అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపుబల్లికురవ:గుర్తు తెలియని వ్యక్తి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామం నుంచి సోమవరప్పాడు వెళ్లే దారిలో ఉన్న కొండ సమీపంలో వేపచెట్టుకు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు కావటంతో శవం.. కళేబరంగా మారింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో ఆడుకునేందుకు అటువైపు వెళ్లిన విద్యార్థులు చెట్టుకు వేళ్లాడుతున్న కళేబరం గుర్తించగా.. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవీ చౌదరి, రైటర్ ఆంజనేయులు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కష్టాలన్నీ దాటే మహాశక్తి అతివ
నెహ్రూనగర్: కష్టాలను దాటి ముందుకు వెళ్లగల మహాశక్తి అతివ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న మహిళామణులకు అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళా నాయకత్వం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వంటి ఎందరో ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. అతివలు ఆర్థిక అక్షరాస్యత పెంచుకుంటే కుటుంబాలు ప్రగతి పథాన పయనిస్తాయని చెప్పారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళల సాధికారిత, ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉంటే 90 శాతం లైంగిక వేధింపులు ముందుగానే అరికట్టవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలోనూ పరిమితులు పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయరాదన్నారు. మహిళల భద్రత కోసం మీ కోసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా సాధికారిత వైపు అందరూ ప్రయాణించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిలు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీఐటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజా వలి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, సీపీఓ శేషశ్రీ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, మెప్మా పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు సజీలా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసులు, వెంకట కృష్ణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
లోక్ అదాలత్లో 3,027 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్లో వివిధ న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉన్న, రాజీ పడదగిన కేసులు పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. సివిల్ 388, క్రిమినల్ 2531, ప్రీ లిటిగేషన్ 108 కేసులు కలిపి మొత్తం 3,027 కేసులు పరిష్కరించామని వెల్లడించారు. మొత్తం రూ. 11.49 కోట్ల విలువైన పరిహారం ఇప్పించామని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ను ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. సహకరించిన న్యాయవాదులకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయస్థాన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనంఇచ్చారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా.. కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామి ఆదివారం రాత్రి యాలివాహనంపై దర్శనమివ్వనున్నారు. – మంగళగిరి/ మంగళగిరి టౌన్ -
గుంటూరు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నేడే ఆంజనేయస్వామి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రసన్నాంజనేయస్వామి జయంతి రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం లక్ష తమలపాకుల పూజ చేశారు. ఇఫ్తార్ సహర్ (ఆది) (సోమ) గుంటూరు 6.22 5.04 నరసరావుపేట 6.24 5.06 బాపట్ల 6.22 5.04 సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా రబీ సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 1,59,275 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న సాగు జరుగుతోంది. పలుచోట్ల కూరగాయలు, అరటి కూడా సాగు చేస్తున్నారు. పది రోజులుగా నీటి విడుదల పూర్తిగా తగ్గిపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో నీటి అవసరం పెరిగింది. అయితే అదే సమయంలో ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల తగ్గింది. పశ్చిమ డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, గుంటూరు చానల్కు 200 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల తగ్గిపోవడంతో రైతులు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంకో తడికి నీరు అందించాలని లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల ప్రణాళిక లోపం! ఖరీఫ్లో తుఫాన్లు, భారీ వర్షాలకు పంట దెబ్బతింది. మరోవైపు రంగుమారిన, తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, గిట్టుబాట ధర లేకపోవడంతో ఇప్పటికే డెల్టా రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఈ సమయంలో రబీకి కూడా నీటి కష్టాలు ఎదురవుతుండటం వారిని కలవరపరుస్తోంది. అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. డెల్టా పరిధిలో తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటి వరకూ 67,92 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. వచ్చే నెలాఖరు వరకూ డెల్టాకు 2.29 టీఎంసీ, గుంటూరు ఛానల్కు 0.21 టీఎంసీ మాత్రమే వాడుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. పులిచింతలలో ఉన్న నీటిని ఇప్పుడు వాడేస్తే భవిష్యత్లో తాగు, సాగునీటి సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎండిపోతున్న పంటల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 7న్యూస్రీల్పలు మండలాల్లో తీవ్రంగా.. పశ్చిమ డెల్టాకు నీటి కష్టాలు ఎండుతున్న పంటలు పట్టించుకోని అధికారులు కాల్వలకు చేరని సాగునీరు ఆయిల్ ఇంజిన్లతో తోడుకుంటున్న రైతులు ఎకరానికి రూ.నాలుగైదు వేల అదనపు ఖర్చు నీటి విడుదల పెంచాలని రైతుల డిమాండ్ దుగ్గిరాల, పొన్నూరు, వేమూరు, అమర్తలూరు, రేపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటివిడుదల తగ్గిపోవడంతో పంట కాల్వల్లో నీటి మట్టాలు బాగా పడిపోయాయి. దీంతో పొలాల్లోకి నీరు రావాలంటే ఆయిల్ ఇంజన్లు పెట్టి తోడుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో నంబర్ బ్రాంచ్ కెనాల్కు నాలుగు నెలల నుంచి నీరు ఇవ్వడం లేదని ఈమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కాలువ పరిధిలో ఈమని, చింతలపూడి, కుంచారం, అత్తొట గ్రామాల్లో వెయ్యి ఎకరాలకుపైగా సాగు ఉంది. -
అందుబాటులోకి మూడు వంతెనలు
నెహ్రూనగర్: ఎట్టకేలకు మూడు వంతెనల మీదుగా రాకపోకలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు లైన్లుగా ఉన్న మూడు వంతెనలను నాలుగు లైన్లుగా ఆధునికీకరిస్తూ పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు మొదలు పెడతామని వెల్లడించారు. గతంలో వర్షం పడితే మూడు వంతెనలు మునిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య రాకుండా డ్రైయిన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలను తప్పించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అవమానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన శనివారమే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి అవమానం జరిగింది. ఆమె రాకుండానే కేంద్ర మంత్రి పెమ్మసాని మూడు వంతెనలను ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం వైపు ప్రారంభ వేడుక ఏర్పాటు చేసినప్పటికీ కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేవరకు కూడా వేచి చూడలేదు. హడావిడిగా ఆయన ప్రారంభించేశారు. కొంత మంది టీడీపీ శ్రేణులు దీనిపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇలా చేయడం ఏంటని మంత్రి తీరుపై మండిపడుతున్నారు. -
మహిళ కిడ్నాప్ కలకలం
లక్ష్మీపురం: మహిళను కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరాలు ప్రాంతానికి చెందిన యక్కల బాలశేఖర్, వాసవి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. నగరాలులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2019లో ముత్యాలరెడ్డినగర్ ప్రాంతానికి చెందిన నరసారెడ్డి అనే వ్యక్తి వద్ద బాలశేఖర్ రూ.2 లక్షల చీటీలు రెండు వేశాడు. రెండూ పాడుకున్నాడు. 2020లో కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని విజయవాడ ప్రకాష్నగర్కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం శారదాకాలనీకి చెందిన వాసవి సోదరుడు రాజేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు వాసవి వచ్చింది. సమాచారం తెలుసుకున్న నరసారెడ్డి ఆటోలో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు వెళదామంటూ ముత్యాలరెడ్డి నగర్లోని నరసారెడ్డి తల్లి ఇంట్లో నిర్బంధించాడు. భార్యను వదిలి పెట్టాలంటే బాకీ డబ్బు చెల్లించాలంటూ బాలశేఖర్ను నరసారెడ్డి బెదిరించాడు. దిక్కుతోచక విషయాన్ని బాధితుడు తన మరదలికి తెలియజేశాడు. అంత డబ్బు లేదని నరసారెడ్డిని ప్రాధేయపడ్డాడు. కనీసం రూ.లక్ష చెల్లించనదే వదిలి పెట్టనని నరసారెడ్డి చెప్పాడు. లక్ష్మి రూ.లక్ష నగదును నరసారెడ్డికి ఆన్లైన్ ద్వారా జమ చేసింది. వాసవిని వదిలి పెట్టాల్సిందిగా కోరితే.. మిగిలిన నగదు చెల్లించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి బెదిరించాడు. దీంతో బాధితుడు బాలశేఖర్ శనివారం సాయంత్రం అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్టేషన్ ఎస్హెచ్ఓ వీరాస్వామి, సిబ్బందితో వెళ్లి నరసారెడ్డిని, వాసవిని స్టేషన్కు తీసుకొచ్చారు. సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు రాక చీటీల డబ్బులు చెల్లించాలంటూ బలవంతంగా తరలింపు -
కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపుయార్డు సమీపంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో రెండో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయంలో సుప్రభాతసేవ, నవనీత హరతి, నిత్య కై ంకర్యాలు, నవకుంభారాధన, నరసింహ హోమం, సాయంత్రం నిత్య హోమం, ఆలయ బలిహరణ జరిగాయి. భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు సాకేత్ శర్మ, రామచంద్రలు పర్యవేక్షించారు. బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల గుంటూరు లీగల్ : బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 27వ తేదీన జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్కు ఎన్నికలు జరుగుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి వెల్లడించారు. 2025–26 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినట్లు శనివారం ఆయన తెలిపారు. 12న ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 – సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 27న ప్రకటిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శతచండీ మహాయాగం సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవి ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య హనుమత్స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురువందనం, ప్రధాన దేవతా అర్చన, శత చండీహోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, వాస్తు హోమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వెంకన్న ఆలయంలో గోవింద నామస్మరణ రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన శ్రీనేతి వెంకన్నస్వామి రెండవ శనివారం తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొండపై స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు కన్నులారా తిలకించారు. అనంతరం స్వామివార్లను పల్లకీలో ఊరేగించారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో గణసతి సురేష్ తెలిపారు. -
వీఐటీలో విటోపియా క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
తాడికొండ: విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అన్నారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా–2025 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా తాడికొండ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీఐటి–ఏపి విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతిని వివరించారు. మూడేళ్లుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో వీఐటీ ఉందని వెల్లడించారు. సాయంత్రం జరిగిన ప్రొ–షోలో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డీజే పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణసామి (విటోపియా కన్వీనర్), డాక్టర్ ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్) పాల్గొన్నారు. -
కిమ్స్ శిఖర హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలోనే తొలిసారిగా మినిమల్లి ఇన్విజివ్ (చిన్న గాటుతో) యూని పోర్టల్ వాట్స్ విధానంలో గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్బేగ్ తెలిపారు. కిమ్స్ శిఖర హాస్పటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. బీపీ, షుగర్ ఉన్న గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అత్యవసరస్థితిలో మూడు రోజుల క్రితం కిమ్స్ శిఖర ఆస్పత్రిలో చేరారు. చీఫ్ కన్సల్టెంట్ థొరాసిక్, మినిమల్ యాక్సిస్ సర్జన్ డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ నేతృత్వంలో వెంటనే రోగిని పరీక్షించగా కుడివైపు ఊపిరితిత్తిలో గాలిబుడగ ఏర్పడి అది పగిలిపోయి లంగ్ పూర్తిగా కుంచించుకుపోయినట్లు గుర్తించారు. యూని పోర్టల్ వాట్స్ విధానంలో చిన్న గాటుతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అలాగే విజయవాడకు చెందిన 38 ఏళ్ల గృహిణి తరచూ లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. ఆమె లంగ్ ఎడమవైపు కింది భాగంలో నీటి గడ్డ లాంటిది ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. ఈమెకు కూడా యూని పోర్టల్ వాట్స్ విధానంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు రోజుల్లోనే రోగులిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పటల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు మాట్లాడుతూ ఊపిరితిత్తుల సమస్యలకు తమ వైద్యశాలలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యులను కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అద్విక్ బొల్లినేని, కిమ్స్ శిఖర హాస్పిటల్ సీఈఓ సుధాకర్ జాదవులు అభినందించారు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్కు దేహశుద్ధి
● ఎంబీఏ చదువుతున్న వ్యక్తికి ఇన్విజిలేటర్ బాధ్యతలు ● సంజాయిషీ కోరిన ఆర్ఐఓ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్షా కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతోంది. విద్యార్థిని పరీక్ష రాస్తున్న గది ఇన్విజిలేటర్గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో మనస్ధాపం చెందిన విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు తీవ్రంగా మందలించారు. అదే రోజు అతన్ని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్తోపాటు కళాశాల ప్రిన్సిపాల్తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్ను సంజాయిషీ కోరారు. -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. మంగళగిరి మండలంలో గోల్డ్ స్మిత్, హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందజేయని ఎంఎస్ఎంఈ దరఖాస్తుదారులకు మరోసారి గుర్తు చేయాలన్నారు. జిల్లాలోని 49 ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రస్ట్ సబ్సిడీ, కాస్ట్ సబ్సిడీకి సంబంధించి రూ.2,12,79,045 మంజూరు చేస్తూ కమిటీ ఆమోదించిందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ డీసీబీహెచ్ మనోరమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మూడు వంతెనల మీదుగా రాకపోకలు
గుంటూరు విద్యానగర్లోని రెండిళ్లలో గురువారం భారీ చోరీలు జరిగాయి. ఈ ఘటనలు నగరంలో కలకలం రేపాయి. గుంటూరు విద్యానగర్లోని సాయినివాస్ అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్లో సాయంత్రం.. అదే వీధిలోని అక్షయ లీలా హోమ్స్లోని మరో ఫ్లాట్లో అర్ధరాత్రి చోరీలు జరిగాయి. సుమారు రూ.2.50 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షలు చోరీకి గురయ్యాయి. ఘటనాస్థలాలను డీఎస్పీ అరవింద్, ఎస్ఐ నరహరి పరిశీలించారు. –లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) డీఎస్సీకి ఉచిత ఆన్లైన్ శిక్షణ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మెగా డీఎస్సీకి ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు 10వ తరగతి, టీటీసీ/బీఎడ్ మార్కుల లిస్ట్, టెట్ మార్కుల లిస్ట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరిచి రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్, గుంటూరు కార్యాలయంలో ఈనెల 10వ తేది నుంచి అందించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0863–2358071 నంబర్ను సంప్రదించాలని వివరించారు.నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనుల నిమిత్తం గంటూరు మూడు వంతెనల మీదుగా నవంబర్ 25 నుంచి రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. 60 రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే వంద రోజులు పూర్తయినా ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవస్థలను గుర్తించిన సాక్షి దినపత్రిక పలుమార్లు కథనాలు ప్రచురించింది. శుక్రవారం కూడా ‘రైల్వే ట్రాక్ విస్తరణతో నరకయాతన’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు హడావుడిగా పెండింగ్ పనులు పూర్తిచేయకుండానే వంతెనలపై నుంచి రాకపోకల పునరుద్ధరణకు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మూడు వంతెనలను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. -
15న వెంకటపాలెం టీటీడీలో శ్రీనివాస కల్యాణోత్సవం
వెంకటపాలెం(తాడికొండ): లోక కల్యాణార్థం శ్రీనివాస కల్యాణోత్సవం ఈ నెల 15న గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. శుక్రవారం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ తేజతో కలిసి శ్యామలరావు ఏర్పాట్లు పరిశీలించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసేలా లోక కల్యాణార్థం స్వామివారి కల్యాణత్సోవాలను అనేక ప్రాంతాల్లో టీటీడీ నిర్వహిస్తోందన్నారు. ఇక్కడ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తులు రావటంతో ఈనెల 15న జరిపేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. కల్యాణోత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కల్యాణాన్ని తిలకించేందకు 20 వేల మది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు. 15న సాయంత్రం కల్యాణం జరుగుతందని వివరించారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. వివరాలు వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలరావు -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: జీవితంలో ఎటువంటి విపత్కరస్థితి ఎదురైనామహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని గుంటూరు జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ కె.సుప్రజ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మహిళా విభాగ, రోటరీ క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏస్పీ సుప్రజను సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు పి.రత్నప్రియ, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎం.స్వర్ణలతాదేవి, డాక్టర్ ఆర్.సిందూజ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, మహిళా విభాగ కన్వీనర్ కవిత, సభ్యులు ఆర్.జయ శైలజ, డాక్టర్ నాగ నిర్మలా రాణి, డాక్టర్ ఆర్.శిరీష, కె.సునీత, బి.జ్యోతి, జమృద్ బేగం, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళల పాత్ర కీలకం సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండటం గర్వకారణమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మహిళా ఉద్యోగినుల ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో.. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని గుంటూరు రైల్వే డీఆర్ఎం ఎం.రామకృష్ణ ఆకాంక్షించారు. స్ధానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం డివిజన్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు పలు క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. విశేష కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.సైమన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఎం.ఆశాలత, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ షేక్.షాహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఇంజజనీర్ కో ఆర్డినేషన్ జె.అనూష, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యరాజ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ , కో ఆర్డినేషన్ ప్రదీప్, ఆయా విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్యూ బీఈడీ ప్రశ్నపత్రం లీక్
పెదకాకాని : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష పత్రం లీకై న ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. సీడీ ద్వారా ఆన్లైన్లో అరగంట ముందుగా ప్రశ్నపత్రాన్ని రిలీజ్ చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ మొబైల్ ద్వారా అరగంట ముందే లీకై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సబంధించిన కొందరు అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల వ్యవహర శైలిపై ఉదాసీనంగా ఉండడమే లీకేజీకి కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా పరీక్షకు అరగంట ముందుగా సీడీ ద్వారా విడుదల చేసే విధానం కూడా ప్రశ్నపత్రం సులభంగా లీక్ కావడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం పరీక్ష పేపర్ లీక్ అయిందని ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ గురువారం కూడా ప్రశ్నపత్రం అరగంట ముందుగానే లీక్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసినా బయటకు రానియకుండా చూడటం వల్లే పరిస్థితులు శ్రుతి మించుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీఈడీ పరీక్షలకు సబంధించిన పరీక్ష కేంద్రాల ఖరారు, పరీక్షలను పర్యవేక్షించే అధికారుల నియామకం వంటి కీలక అంశాలు కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వాహకుల కనుసన్నల్లో జరుగుతుండటం ఇలాంటి ఘటనలకు కారణమవుతోందనే విమర్శలూ వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీపై ఉన్నత విద్యాశాఖామంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు. పరీక్షకు అరగంట ముందే లీకై న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం పరీక్షల నిర్వహణలో ఏఎన్యూ అధికారులు నిర్లక్ష్యం -
హనుమంత వాహనంపై నృసింహుడు
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శుక్రవారం రాత్రి స్వామిని హనుమంత వాహనంపై ఊరేగించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు. శనివారం రాత్రి రాజాధిరాజ వాహనంపై స్వామి గ్రామోత్సవం జరగనుంది. హనుమంత వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత నృసింహుడు ఉత్సవానికి హాజరైన భక్తులు -
మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన
57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్కుమార్ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి గుంటూరు వెస్ట్: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు. మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జనరిక్ ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించాలి నరసరావుపేట: జనరిక్ మందుల ఔషధాల వినియోగం పెరిగేలా డాక్టర్లు శ్రద్ధ చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శుక్రవారం జన ఔషది దివస్ను పురస్కరించుకొని పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధానమంత్రి జనరిక్ షాపు వద్ద డీఎంహెచ్ఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జనరిక్ షాపుల ద్వారా చాలా తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించటం జరుగుతుందని చెప్పారు. -
సాంకేతికతతో కొత్త అవకాశాలు
ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ చేబ్రోలు: సాంకేతికతతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు బ్లెండెడ్ మోడ్లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కవథేకర్ మాట్లాడుతూ ఆటోమేషన్, ఏఐ, డేటా ఎనలిటిక్స్ తదితర అంశాల గురించి వివరించారు. -
1,22,426 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,470 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో శుక్రవారం 229 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 140 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.8,000 గరిష్ట ధర రూ.9,800 మోడల్ ధర రూ.9,400, కాయలు 89 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠి ధర రూ.8,000, గరిష్ఠ ధర రూ.9,800, మోడల్ ధర రూ.9,400, మొత్తం 171.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన వివరించారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్లోని కెనరా బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ బాషా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూబీఐ ఉద్యోగ నేత రాంబాబు, యూఎఫ్బీయూ సలహాదారుడు పి.కిషోర్ కుమార్ పాల్గొన్నారు. -
మహిళలు ధైర్యంగా మెలగాలి
నగరంపాలెం(గంటూరు వెస్ట్): అన్ని వేళల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్హౌస్ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను చేధించాలని అన్నారు. తద్వారా నలుగురికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సీ్త్రలు లేనిదే జననం లేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్ధినీలకు ఆయుధాల పనితీరుపై మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది అవగాహన కల్పించారు. కొత్తపేట పీఎస్ పరిధిలోని శ్రీజలగం రామా రావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారత ర్యాలీ, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని యాదవ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎస్ఐలు రమేష్ (కొత్తపేట పీఎస్), వెంకటేశ్వర్లు (పాతగుంటూరు పీఎస్) పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) -
జీవితం ‘అమృత’మయం
తెనాలి: కష్టాల గరళాన్ని దిగమింగి జీవితాన్ని అమృతమయం చేసుకున్నారామె.. తెనాలిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమెపేరు గోలి అమృతరాణి. గ్రూప్–1 సాధించి ఈ మధ్యనే తొలి పోస్టింగ్ తెనాలిలో పొందారు. ఆమె సొంతూరు ఫిరంగిపురం. ఆమె ఎంవీఐ స్థాయికి ఎదిగిన తీరు ఆమె మాటల్లోనే.. అమ్మమ్మ ప్రోత్సాహంతో.. మా అమ్మ సింగిల్ పేరెంట్. చిన్నతనంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మా అమ్మమ్మ ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాలలో చదివా. పదో తరగతిలో 537 మార్కులు సాధించా. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు లభించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. 2015లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్గా బయటకొచ్చా. కొంతకాలం ప్రైవేటు కాలేజీలో జూనియర్ అధ్యాపకురాలిగా పనిచేశా. సివిల్ ఇంజినీరు సత్యనారాయణతో 2016లో ఏడడుగులు వేశా. అయినా ఉన్నతోద్యోగం సాధించాలనే నా లక్ష్యాన్ని వదలలేదు. భర్త ప్రోద్బలంతో సివిల్స్, గ్రూప్స్ రాశా. తొలిసారి నిరాశే మిగిలింది. 2023లో ఏపీపీఎస్సీకి ఎంపికయ్యా. 2024లో ఎంవీఐ ఉద్యోగం వచ్చింది. శిక్షణ తర్వాత తొలి పోస్టింగ్ తెనాలి వచ్చింది. ప్రస్తుతం మాకో బాబు ఉన్నాడు. ఎంవీఐగా పనిచేస్తున్నా. మరింత ఉన్నత స్థానం చేరుకోవడానికి గ్రూప్–1, సివిల్స్కు ప్రిపేరవుతున్నా. -
మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
తెనాలిరూరల్: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని సబ్కలెక్టర్ సంజనా సింహా అన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీవో అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వెలుగు ఏపీఎం జయశ్రీ వందన సమర్పణ చేశారు. ఎంపీడీవో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెనాలి డీఎల్డీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ ఏఈ పార్వతి, ఆర్డబ్యెస్ ఏఈ అనూష, సీడీపీఓ సునీత పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను సబ్ కలెక్టర్ సందర్శించారు.కాంట్రాక్టు స్టాఫ్నర్సు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ కె.సుచిత్ర తెలిపారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ఆర్డీ కార్యాలయంలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. నోటిఫికేషన్లో 44 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలు ఉన్నాయని, 5,888 మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర పోస్టర్ల ఆవిష్కరణ గుంటూరు రూరల్: స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, నగర కమిషనర్ శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహా, డీఆర్ఓ షేక్ ఖాజావలి, డీపీఓ సాయికుమార్, రూరల్ మండలం ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, విస్తరణ అధికారి కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగఅమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ ప్రసంగించారు. -
వైద్యదేవత అనూష
మంగళగిరి: వైకల్యాన్ని అధిగమించి మెడికల్ ఆఫీసర్గా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందిరానగర్ ఆరోగ్యం కేంద్రం అధికారిణి అనూష. ఆమె సొంతూరు గుంటూరు. ఏలూరు ఆశ్రంలో మెడికల్ సైన్సెస్ చదివారు. బ్రెస్ట్ క్యాన్సర్పై జరిపిన పరిశోధనల్లో 2,790 మందితో పోటీపడి జీనియస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2022లో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. 2024లో బెస్ట్ మెడికల్ ఆఫీసర్గా కలెక్టర్ నుంచి అవార్డు అందుకున్నారు. రోగులకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె సేవల వల్ల పీహెచ్సీకి దేశంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికెట్, క్వాలిటీ ఎస్యూరెన్స్ అవార్డు లభించాయి. -
అకుంఠిత ‘దీక్ష’తో ఐపీఎస్గా
నగరంపాలెం: అకుంఠిత దీక్షతో ఐపీఎస్గా ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆమె. ఆమె పేరు దీక్ష. సొంతూరు ఢిల్లీ. హైదరాబాద్లో సివిల్స్ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 208వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిణిగా గుంటూరులో పనిచేస్తున్నారు. దీక్ష తల్లిదండ్రులు అసోసియేట్ ప్రొఫెసర్లు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. భర్త ముఖేష్ ఆదాయపుపన్ను శాఖ అధికారి. దీక్ష 2016లో యూపీఎస్సీ రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణిగా ఎంపికై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో విధులు నిర్వర్తించారు. మళ్లీ పోటీ పరీక్షలు రాశారు. 2018లో డీఎస్పీ ర్యాంకు ఆఫీసర్గా ఎంపికై ఢిల్లీలో పనిచేశారు. ఐపీఎస్ లక్ష్యంగా ప్రయత్నించారు. 2021లో 208వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐపీఎస్ కోసం నాలుగేళ్లు కష్టపడ్డా ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో నాలుగేళ్లు కష్టపడ్డా. నా లక్ష్యాన్ని చేరుకున్నా. సమాజంలో మహిళలు ముందుండాలి. పట్టుదలతో యత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంటా. – దీక్ష, ట్రైనీ ఐపీఎస్ -
క్రీడా ‘చంద్రిక’
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కుమిలిపోలేదు ఆమె. తాతమ్మ దగ్గర ఉంటూనే పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుని సత్తాచాటుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళగిరికి చెందిన ఆమె పేరు బొల్లినేని చంద్రిక. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు, రజిత, కాంస్య పతకాలను ఆమె సాధించారు. కామన్వెల్త్లో నాలుగు బంగారు పతకాలు, ఏషియన్ చాంపియన్ షిప్లో మూడు బ్రాంజ్ మెడల్స్, ఏషియన్ పసిఫిక్లో నాలుగు గోల్డ్ మెడల్స్, సుబ్రత ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్లో నాలుగు గోల్డ్ మెడల్స్, స్ట్రాంగెస్ట్ విమెన్ ఇన్ సౌత్ ఇండియా సీనియర్ కేటగిరిలో పతకం సాఽధించారు. ఫెడరేషన్ పవర్లిఫ్టింగ్ గేమ్స్ స్టేట్ చాంపియన్గా 15 ఏళ్లుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రిక -
అవనితలాన అద్భుతం
అజేయం.. అమేయం ఆమె.. అకుంఠిత దీక్ష, పోరాటపటిమ ఆమె సొంతం.. ఓర్పు, నేర్పు వంటి పదాలు ఆమెను చూసే పుట్టాయేమో.. భగభగమండే బడబాగ్నిని సైతం చిరునవ్వుతో చల్లార్చగల నేర్పరి.. గుండెలను పిండేసే బాధనైనా సంకల్పబలంతో దిగమింగగల ఓర్పరి.. అనితరసాధ్యమైన లక్ష్యాలనూ అవలీలగా ఛేదించగల ధీశాలి. ఆమె సహచర్యం దివ్యౌషధం.. ఆమె మార్గదర్శకం అనన్యసామాన్యం.. ఒక్క మాటలో చెప్పాలంటే అవనితలాన అద్భుతం ఆమె. అందుకే ఆమె ఆదిశక్తి అయింది. అన్ని రంగాల్లో రాణిస్తూ నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామూర్తుల విజయగాధలతోపాటు అంతరంగాన్ని ఆవిష్కరించే యత్నమిదీ.. – సాక్షి, నెట్వర్క్మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ స్కేటింగ్లో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారు. ఆమె 13 ఏళ్ళ వయస్సులోనే దేశంలోనే నంబవర్ వన్ స్కేటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జెస్సీ 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో రాణించి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ 2021 నుంచి స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆమె జాతీయ పోటీలలో ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర పోటీలలో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీలలో నాలుగు గోల్డ్,ఎనిమిది సిల్వర్ మెడల్స్ సాధించారు. అథ్లెటిక్స్, నృత్యం, పెయింటింగ్లోనూ జెస్సీ రాణిస్తుండడం విశేషం. ఆకాశంలో సగం అన్ని రంగాల్లో ఆమెదేపైచేయి రాణిస్తున్న సీ్త్రమూర్తులు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంస్కేటింగ్ జెస్సీ -
వైభవం.. ధ్వజారోహణం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసినయున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం రాత్రి 8 గంటలకు ఋత్వికరణ, అంకురారోపణాధి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతల ఆహ్వానానికి భక్తాగ్రేసరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ధ్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. నేడు హనుమంత వాహనంపై.. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.నృసింహుడి కల్యాణానికి దేవతలకు ఆహ్వానం -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రములతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభు ఏసును కీర్తిస్తూ, స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి 48వ గుడారాల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలోని సువిశాలమైన మైదానంలో గుడారాల పండుగ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ఏసుక్రీస్తు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిపిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు. స్తుతి గీతాల ఆల్బమ్ విడుదల.. దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రాలు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయపతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం నూతన స్తుతిగీతాల పుస్తకమైన దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్పాల్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. అలాగే హోసన్నా స్తుతిగీతాల అల్బమ్ను మదనపల్లెకు చెందిన దైవజనులు పాస్టర్ రాజశేఖర్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ప్రార్థనల్లో చైన్నెకి చెందిన దైవజనులు మోహన్. సి. లాజరస్తో పాటుగా పాస్టర్లు రమేష్, ఫ్రెడ్డీపాల్, అనీల్, రాజు పాల్గొని స్తుతి గీతాలను ఆలపించారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా విశ్వాసులు తరలివచ్చారు. పల్నాడు జిల్లా లేమల్లెలో ఘనంగా ప్రారంభమైన 48వ గుడారాల పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ లక్షలాదిగా తరలివచ్చిన విశ్వాసులు 32 ఏళ్ల తర్వాత మళ్లీ లేమల్లెలో.. హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ ఫాస్టర్ జాన్వెస్లీ మాట్లాడుతూ గుడారాల పండుగ 1977 నుంచి 1992 వరకు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో జరిగాయన్నారు. అయితే 1993 నుంచి 2024 వరకు 32సంవత్సరాలపాటు గుంటూరు సమీపంలో గోరంట్లలో నిర్వహించుకున్నామన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఇదే లేమల్లె గ్రామంలో మార్చి 5వ తేదీన హోసన్నా దయాక్షేత్ర ఆవరణలో నూతన చర్చి ప్రారంభించు కున్నామన్నారు. -
సమష్టిగా శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ పనులు
గుంటూరు వెస్ట్: స్థానిక శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పునర్నిర్మాణ పనులు అధికారులందరూ సమష్టిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జికి సంబంధించి భూ సేకరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ను ఫైనలైజ్ చేయాలని, మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు. నిర్మాణ సమయంలో అండర్ గ్రౌండ్ వాటర్పైపులు, టెలిఫోన్ కనెక్షన్లు, ఎలక్ట్రికల్ కేబుల్స్, డ్రెయినేజీ వంటి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్కు అటు, ఇటువైపు ఉన్న బ్రాడీపేట, అరండల్పేట ప్రాంతాల్లో పైపులైన్ క్లియరెన్స్కు చర్యలు చేపట్టాలన్నారు. పునర్నిర్మానిర్మాణ పనులతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని పేర్కొన్నారు . జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు. 15న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలో ఏడుస్థాయీ సంఘ సమావేశాలు జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గౌడ, గౌడ్ సామాజిక వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ షాపుల కేటాయింపు సంబంధించి గురువారం లాటరీ ప్రక్రియ కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎ.అరుణకుమారి తదితరుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 13 షాపులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా తన చేతుల మీదుగా లాటరీ నిర్వహించి షాపులకు సంబంధించి లైసెన్సు దారులను ఎంపిక చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి అరగంటలోనే ముగించారు. జిల్లాలో 13 షాపులకు సంబంధించి దరఖాస్తుదారుల సమక్షంలోనే ప్రక్రియను బహిరంగంగా నిర్వహించారు. ఏఈఎస్ ఇ.మారయ్య బాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ ఏపీ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.జోజారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్సైట్ ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఘనంగా చంద్రమౌళేశ్వరస్వామి దివ్య రథోత్సవం చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని గంగాపార్వతి సమేత చంద్రమౌళేశ్వరస్వామి వారి రథోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణోత్సవం అర్చకస్వాముల బృందం వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించింది. కల్యాణోత్సవం అనంతరం కల్యాణమూర్తులు చంద్రమౌళేశ్వరస్వామి, గంగాదేవి, పార్వతి దేవి అమ్మవార్లు రథంపై పురవీధుల్లో విహరించారు. కల్యాణమూర్తులను దర్శించుకోవటం కోసం వడ్లమూడి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రథం తాడును లాగటానికి ఉత్సాహం చూపారు. దేవదాయశాఖాధికారి నరసింహారావు రథోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తలు జి అమర్చంద్, గణపతిరావు భక్తులు పాల్గొన్నారు. 17న వేణుగోపాల ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట ఫిరంగిపురం: మండలంలోని 113 తాళ్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ట ఈనెల 17న నిర్వహించనున్నట్లు దేవదాయ ధర్మాదాయ శాఖాధికారి జె.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10.25 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదపండితులు దీవి పవన్కుమార్, దీవి ప్రసన్నమూర్తిలు నిర్వహిస్తారన్నారు. పూజా కార్యక్రమంలో దాత డేగల ప్రభాకర్, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామన్నారు. -
విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడామండలంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. -
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహర్ (శుక్ర ) (శని) గుంటూరు 6.22 5.05 నరసరావుపేట 6.24 5.07 బాపట్ల 6.22 5.04 సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత నెలలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చియార్డును సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని రోజులపాటు హడావిడి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, తర్వాత మంత్రులతో చర్చించడం జరిగింది. రూ.11,781 కంటే క్వింటాలుకు తక్కువ వస్తే ఆ మొత్తాన్ని భరిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు పడలేదు. చేస్తానన్న సాయంపై మార్గదర్శకాలు రాలేదు. మరోవైపు రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా గురువారం వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో మిర్చి రైతు చీపాటి మోషే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మిర్చి పంటను గుంటూరుకు తీసుకురాగా నాసిరకమని పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నష్టం ప్రభుత్వమే భరించాలి.. రూ. 11,781 కంటే తక్కువకు కొంటే ఆ నష్టం భరించడం కాకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది సాగు వ్యయం పెరిగినందున మిర్చి రైతులందరికీ ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది రూ. 27వేల వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం రూ.10 వేల కూడా పలకడం లేదు. మరోవైపు వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తేజా మిర్చి ధర క్వింటాల్కు రూ. 15 వేలు పలికితే ఇప్పుడు రూ.13 నుంచి 11 వేల మధ్య కొంటున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.22వేల నుంచి రూ.27 వేల వరకు అమ్మితే, ఇప్పుడు కనీసం రూ.10 వేలు కూడా పలకడం లేదు. మార్కెట్లో పంటల ధరలు పతనమైతే, రైతులను ఆదుకోవడం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధిగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ప్రభుత్వం ప్రకటించిన దానిలో మూడో వంతు అయినా మిర్చి రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేస్తే రైతులకు కొంతైనా ఊరట లభించేది. మూడు రోజులుగా పడిగాపులు.. నేను రెండు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. సొంత పొలం కావడంతో ఎకరానికి రూ.2 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. గుంటూరు మిర్చి యార్డుకు 30 బస్తాలు ఎండు మిరప కాయలు తీసుకువచ్చి మూడు రోజులైంది. కొనే నాథుడు లేక పడిగాపులు కాయాల్సి వచ్చింది. తొలిరోజు(మంగళవారం) క్వింటా రూ.12 వేలు పడుతుందిని చెప్పారు. కనీసం రూ.13 వేలు ధర అయినా పలికితే అమ్ముకుందామని ఇవ్వలేదు. గురువారం అవే కాయలకు రూ.11 వేలు చెల్లిస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఇవే కాయలు క్వింటా రూ.25 వేలు చొప్పున విక్రయించాను. ఎకరాకు సుమారు రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. –సూరా రాజగోపాల్రెడ్డి, రైతు, అంకభూపాలెం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా వ్యాపారుల మాయాజాలం.. మిర్చికి మంచి ధర చెల్లించడం.. తక్కువ ధర చెల్లించడం అనేది మిర్చి వ్యాపారుల చేతుల్లోనే ఉంది. నేను 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. గురువారం 15 బస్తాలు తేజ రకం కాయలు యార్డుకు తీసుకువచ్చాను. ఉదయం మచ్చుకాయలు తీసుకుని క్వింటా రూ.13 వేలు అన్నారు. 11 గంటలకు రూ.11 వేలు చెల్లిస్తాం ఇస్తే ఇవ్వండి లేదంటే మీ ఇష్టం అంటున్నారు. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. –జె.శంకర్, రైతు, ఇబ్రహీంపురం, నందవరం మండలం, కర్నూలు జిల్లా రైతులను ఆదుకునే దిశగా పడని అడుగులు ఇప్పటివరకు సాయంపై మార్గదర్శకాలు రాని వైనం మొక్కుబడి సమావేశాలతో సరిపెడుతున్న అధికారులు నోటిఫైడ్ మార్కెట్ యార్డుల్లోనే అమ్మాలనే నిబంధన తొలగించాలని మిర్చి రైతుల డిమాండ్ కుమ్మకై ్క ధర మరింత తగ్గిస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు న్యూస్రీల్ఏమార్చేందుకు.. కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం మిర్చి ధర క్వింటాకు రూ.11,781 ప్రకటించిన తర్వాత మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం మద్దతు ధర రూ.11,781 ప్రకటించక ముందు తేజ రకం మిర్చి క్వింటా రూ.13,500 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.12 వేలకు కూడా కొనే నాథుడు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. వ్యాపారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నా.. అధికారులు ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. క్వింటాకు రూ.20 వేలు చెల్లిస్తే పెట్టిన ఖర్చులు వస్తాయి. లేదంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. –రమావత్ అఖిల్, రైతు, యండ్రపల్లి, యరగ్రొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా మరోవైపు అధికారులు గత డిసెంబర్ నుంచి రోజువారీగా ఎంత మిర్చి కొనుగోలు చేసింది. ఎవరి వద్ద కొన్నారు. వారి ఆధార్ వివరాలు కావాలంటూ వ్యాపారులను అడిగారు. ఇది కేవలం కాలయాపన చేసి.. సీజన్ అయ్యేవరకూ నడిపే కుట్ర అని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలన్నీ ఉంటాయని, తమ దగ్గర లేనట్టు మార్కెటింగ్ అధికారులు వ్యాపారులను వివరాలు అడగడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి మిర్చి సీజన్ ప్రారంభమై రోజూ లక్షన్నరకు పైగా బస్తాలు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటుంటే రెండు నెలల తర్వాత లెక్కలు అడగడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
బాపట్లటౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తొలుత డ్రోన్ ఎగురవేసి అది పనిచేసే విధానం, పోలీస్ శాఖకు ఏవిధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన చైల్డ్ హెల్ప్లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 గురించి, విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీసు డాగ్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలపై క్షుణ్ణంగా వివరించారు. నేర స్థల పరిశీలనలో క్లూస్ టీం ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, మహిళా పోలీస్స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్బీ సీఐ నారాయణ, బాపట్ల పట్టణ, రూరల్, రూరల్ సర్కిల్ సీఐలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ -
విద్యుత్ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా
గుంటూరు లీగల్: విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు. -
విద్యా బోధన.. సాగు ఒకటే !
ఏఎన్యూ: విద్యా బోధన, సాగు ఒకటేనని, అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. గంగాధర రావు అన్నారు. బోధనలో అధునాతన పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని అందించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య కె. రత్న షీలామణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని విద్యావేత్తలను ఆచార్య పి. బ్రహ్మాజీరావు ఉపన్యాసకులుగా ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ఆచార్యులు ఎం. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా బోధన విధానాలను రూపొందించుకోవాలని, వృత్తిపరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యా విభాగ పీఠాధిపతి ఆచార్య ఎం. వనజ విద్యా విధానంలో వివిధ దశలను గురించి వివరించారు. అమర్ కంటక్కు చెందిన ఆచార్య ఎం.టి.వి నాగరాజు, ఒరిస్సాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఈ.అశోక్ కుమార్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య వంగూరి రవి, కేరళ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన ఆచార్య ఇస్మాయిల్ తమ్మరేసరి, మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పుచ్చ చిట్టిబాబు, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆచార్య టి. షరోన్ రాజు, బిహార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి. ఆడమ్ పాల్, ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ ఆచార్య కె. సుమలత,సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ సూరజ్ మోహన్, ఆర్వీఆర్ఆర్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సీనియర్ ఆచార్యులు గద్దె మంగయ్య ఉపన్యసించారు. విద్యా విభాగంపై డాక్టర్ టి. సందీప్ రచించిన పుస్తకావిష్కరణ చేశారు. ఈ సదస్సుకు డాక్టర్ ఎం. వసంతరావు, డాక్టర్ ఆర్. శివరామిరెడ్డి, కన్వీనర్లుగా వ్యవహరించారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలి -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బబ్బేపల్లి కొండపై మంటల కలకలం మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావాలని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు. మూడు పూరిళ్లు దగ్ధం రూ.11లక్షల ఆస్తి నష్టం నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్సర్క్యూట్తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు హాస్పిటళ్లకు జరిమానాలు నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నారీ వివక్ష లేని సమాజంతోనే అభ్యున్నతి
గుంటూరు రూరల్: నారీ వివక్షత లేని సమాజంతో అభ్యున్నతి సాధ్యమని, మహిళలకు విద్య, ఉపాధి, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలలో సమాన అవకావాలు ఇవ్వాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని కొనియాడారు. మహిళా రక్షణ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ ఎ. మణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని కమిటీలతో, పలు స్కీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ అగ్రికల్చర్ కమిషనర్ బి. రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురని తెలిపారు. సమాజంలో మార్పుకోసం, లింగవివక్షత, అసమానతలను అధిగమించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ అధికారులకు సత్కారాలు అందించారు. ఉత్తమ మహిళా రైతులుగా మన్యం జిల్లా పార్వతీపురం మండలం వంజరపుగూడాకు చెందిన మర్రి నవ్య, తూర్పుగోదావరి జిల్లా నిడిగల్లుకు చెందిన వేమగిరి అన్నపూర్ణ, పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన కిలారి జయమ్మ, ఒంగోలు జిల్లా సంతపేటకు చెందిన గుల్లపల్లి సుజాత, తిరుపతికి చెందిన కె. యువరాణి, శ్రీ సత్యసాయి జిల్లా ఉప్పునేసినపల్లికి చెందిన నారా నాగలక్ష్మిలకు ఉత్తమ మహిళా రైతు పురస్కారాలు అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దాతపై పచ్చ నేతల దౌర్జన్యం
నాదెండ్ల: సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన దాతను కూటమి నేతలు తీవ్ర వేధింపులకు గురిచేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన 75 ఏళ్ల పచ్చవ కోటేశ్వరరావు రెండు పర్యాయాలు గ్రామ ఉపసర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2020 ఆగస్టు 28న పచ్చవ వెంకటేశ్వర్లు కుమారుడు అనిల్కుమార్ వద్ద 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలంలో 10 సెంట్లు సచివాలయ నిర్మాణానికి, 5 సెంట్లు రైతు భరోసా కేంద్రానికి దానపత్రం రాసి రిజిస్టర్ జరిపింపారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి భార్గవ్కు దస్తావేజులను అందించారు. 20 సెంట్లలో 15 సెంట్లు దానమివ్వగా మిగిలిన 5 సెంట్లలో సెంటున్నరను రైతు భరోసా కేంద్రానికి దారి నిమిత్తం వదిలిపెట్టారు. రెండు రోజుల క్రితం ఆ మూడున్నర సెంట్లలో తన గేదెలకు షెడ్డు వేసేందుకు గుంతలు తీయించారు. ఇక్కడ ఆయనకు స్థలం లేదని గ్రామ టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. షెడ్డు కోసం తీసిన గుంతలను పూడ్చివేయటమే కాక ఇదేమని అడిగినందుకు కోటేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. దీంతో కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఇంతటితో వదలక కోటేశ్వరరావుపై నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ నిమిత్తం గత రెండు రోజులుగా పోలీస్స్టేషన్కు పిలిపించి ఉదయం నుండి రాత్రి వరకూ అక్కడే ఉంచుతున్నారు. గ్రామంలోకి వెళ్తే గొడవ అవుతుందని, టీడీపీ నాయకులు ఒప్పుకోవటం లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీనిపై బాధిత మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గతంలో సచివాలయం, ఆర్బీకే భవనాలపై దాతలు పచ్చవ కోటేశ్వరరావు, పెద్దబ్రహ్మమ్మ దంపతుల పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ఆర్బీకే నిర్మాణానికి రూ.21.80 లక్షల వ్యయంతో పనులు చేశామన్నారు. సంబంధిత బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, నేటి వరకూ రూ.47 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. మరో రూ.14 లక్షలు రావాల్సి ఉందన్నారు. గ్రామంలోని టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులతో ఇబ్బందులకు గురిచేయించటం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి రాఘవయ్య ప్రోద్బలంతోనే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎం.ప్రసాద్, పి. శౌరిరాజులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సచివాలయం, ఆర్బీకే భవనాలకు 15 సెంట్లు దానమిచ్చిన కోటేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్, 75 ఏళ్ల వృద్ధుడిపై టీడీపీ నేతల దాడి -
పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
నిజాంపట్నం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్ అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలకు 100 మీటర్ల వరకు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఆర్.శోభాచంద్, జీ.శేషుగోపాలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో సురేష్ -
సీనియార్టీ జాబితాలో లోపాలు సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విడుదల చేసిన మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో లోపాలను సవరించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.హైమారావు విజ్ఞప్తి చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో రేణుకను కలసిన ఎన్టీఏ నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు ఇతర మేనేజ్మెంట్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను జూనియర్లుగా చూపలేదని డీఈవో దృష్టికి తెచ్చారు. జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఉపాధ్యాయులు తగు ఆధారాలతో ఈనెల 10లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఈవోను కలసిన వారిలో ఎన్టీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖలీల్, గుంటూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి విశ్వనాఽథ్, పి. లలితబాబు, గౌరవాధ్యక్షుడు ఏవీ కృష్ణారావు ఉన్నారు. -
పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదం దుర్ఘటనకు సంబంధించి, మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సంజనా సింహ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే పరిహారం ఇప్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, గద్దె శ్రీహరి, పోతురాజు కోటేశ్వరరావు, పేర్ని రవి, గుళ్లపల్లి సుబ్బారావు, యర్రు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ను కోరిన రైతు సంఘం బృందం -
పర్యవేక్షణ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నరసరావుపేట రూరల్: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పోస్ట్కు ఫారిన్ సర్వీస్పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్లో పనిచేస్తున్న అర్హులైన స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని గుంటూరు జిల్లా కన్వీనర్ టి. జయప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడికొండలోని ఏపీఆర్ స్కూల్ (జనరల్) బాలురు, గుంటూరులోని మైనార్టీ బాలికలు, బాలుర పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని ఏపీఆర్జేసీ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు వెబ్సైట్తో పాటు 87126 25038 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
భవనాశి కాలువలో కొండచిలువ
అద్దంకి: భవనాశి కాలువలో కొండ చిలువ కలకలం రేపింది. అయితే కొందరికి మొసలి కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణానికి చెందిన సుద్దపల్లి కోటయ్య వాగులో కొండచిలువ ఉందని ఫారెస్ట్ అధికారులకు అందిన సమాచారం మేరకు.. నరసింహపురం సమీపంలోని భవనాశి కాలువను పరిశీలించారు. అలాగే ముగ్గు వాగులో మొసలి సంచిరిస్తుందని నంగవరపు సుధీర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడా పరిశీలించారు. ఈ క్రమంలో భవనాశి కాలువలో కొండచిలువను గుర్తించామని అధికారి తెలిపారు. ముగ్గు వాగులో మొసలి జాడలు కనిపించలేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరలా మొసలి సంచారం కనిపిస్తే తమకు తెలియజేయాలని స్థానిక రైతులకు చెప్పారు. ముగ్గు వాగులో మొసలి? జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక -
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు. నేడు మద్యం దుకాణాలకు లాటరీ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాలులో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు మద్యం దుకాణానికి సంబంధించిన దరఖాస్తు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్కార్డు, పాన్ కార్డ్లను తీసుకురావాలని సూచించారు. ప్రపంచబ్యాంక్ బృందం పర్యటన తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు. వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.10.10 లక్షల విరాళం నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అవసరాల నిమిత్తం ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు కుమారులు డాక్టర్ వెంకటేష్, కమలేష్ రూ.10,10,116 చెక్కును బుధవారం కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్యకు అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి వ్యక్తి మృతి నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతి శుద్ధిపూసలు
తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘంలోని ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు గైర్హాజరైన పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు అటెండెన్స్ వేసి వారి నుంచి నెలకు కొంత నగదు లంచంగా తీసుకుంటున్నారు. ఫలితంగా తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తెనాలి పట్టణ జనాభా సుమారు రెండు లక్షలు. 40 వార్డులు ఉన్నాయి. వీటిని తొమ్మిది పారిశుద్ధ్య డివిజన్లుగా అధికారులు విభజించారు. వీటిలో రెండు డివిజన్లలో ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తుండగా, మిగిలిన ఏడు డివిజన్లలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. రోజూ పట్టణంలో 80 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అటెండెన్స్ వేయించుకుని ఇళ్లకు.. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణను నలుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెల్త్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తారు. 82 మంది పర్మినెంట్, 320 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు, 40 మంది నగర దీపికలు పారిశుద్ధ్య పనులు చేస్తారు. శానిటరీ డివిజన్ కార్యాలయానికి ఉదయం 5 గంటలకు కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చి అటెండెన్స్ వేయించుకున్న తర్వాత కేటాయించిన ప్రాంతాలకు వెళ్తారు. పట్టణంలో మొత్తం 402 మంది కార్మికులు ఉంటే రోజూ పనికి వచ్చేది మాత్రం 350 మందే. ఉదయం అటెండెన్స్ కాగానే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోతారు. రోజుకు రూ.వెయ్యి వసూలు పర్మినెంట్ వర్కర్లలో సగం మంది రోజూ పనికి రారు. వీరికి శానిటరీ ఇన్స్పెక్టర్లు అటెండెన్స్ వేసి రోజుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తారనే ఆరోపణ ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరైతే వారి నుంచి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తారని సమాచారం. మున్సిపల్ కమిషనర్ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి అటెండెన్స్లో తేడాలు గమనించారు. ఇన్స్పెక్టర్లను మందలించారు. బదిలీ వర్కర్ల(కార్మికుడు తన స్థానంలో మరొకరితో పని చేయించడం) పద్ధతీ పట్టణంలో పరిపాటిగా మారింది. మామూళ్లు మామూలే శానిటరీ ఇన్స్పెక్టర్లు వీధి దుకాణదారుల వద్ద, కబేళా వద్ద మాంసం విక్రేతల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గ్యాంగ్ వర్కులోనూ దోపిడేనే... తెనాలిలో ఏదోఒక ప్రాంతంలో రోజూ గ్యాంగ్ వర్కు జరుగుతుంటుంది. సగటున 30 నుంచి 40 మందితో మురుగు కాలువలు బాగు చేయిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ముప్పావు మందీ పని చేయరు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తవించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై న ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే హెల్త్ సెక్షన్ను ప్రక్షాళన చేయాలి. తెనాలి మున్సిపల్ హెల్త్ విభాగంలో అక్రమాలు అరకొర సిబ్బందితోనే పారిశుద్ధ్య పనులు 402 మందికి పనిచేసేది 350 మందిలోపే విధులకు రాకుండానే కార్మికులకు హాజరు శానిటరీ ఇన్స్పెక్టర్ల చేతివాటం ప్రక్షాళన చేస్తున్నాం హెల్త్ సెక్షన్లో లోపాలున్న మాట వాస్తవం. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో సమీక్షలు జరిపి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించాం. కొద్ది రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపడతాం. –బండి శేషన్న, కమిషనర్, తెనాలి పురపాలక సంఘం -
పందికొక్కుల దాడిలో పసికందు మృతి!
నూజెండ్ల: ఊయలలో నిద్రిస్తున్న మూడు నెలల పసికందును పంది కొక్కులు కొరికి చంపిన ఘటన నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో బుధవారం జరిగింది. రవ్వారం గ్రామానికి చెందిన నాయిని కొండ గురవయ్య, దుర్గమ్మలు గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుని జీవనం సాగిస్తుటారు. వీరికి ఒక పాప ఉంది. సమీపంలోని ఓ తండా నుంచి మూడునెలల బాబు కౌషిక్ను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎప్పటిలానే కొండ గురవయ్య గాజుల విక్రయానికి వెళ్లాడు. అదే సమయంలో పాప ఏడుస్తూ ఉండడంతో ఏదైనా కొని తెద్దామని తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఊయలలో ఒంటరిగా ఉన్న కౌషిక్పై పందికొక్కులు దాడి చేశాయి. తల వెనుక భాగాన, ముఖం, కాలివేళ్లను కొరికివేశాయి. దుకాణం నుంచి వచ్చిన తల్లి పరిస్థితిని గమనించి వైద్యశాలకు తరలించేలోపు చిన్నారి మృతి చెందింది. ముక్కుపచ్చలారని చిన్నారికి జరిగిన దారుణం చూపరులను కంటతడి పెట్టించింది. -
దివ్యోత్సవం.. నేత్రోత్సవం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే శ్రీవారిని, అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించారు. అనంతరం స్వామిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెళ్లికుమారుడి ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాన్ని ఆలయ ఈఓ రామకోట్టిరెడ్డి పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13న స్వామి దివ్య కల్యాణం, 14న రథోత్సవం జరుగుతాయని వివరించారు. లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెళ్లి కుమారుడిగా శ్రీవారు 13న కల్యాణ మహోత్సవం 14న స్వామి రథోత్సవం -
టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. ఆమె ‘‘సాక్షి’’తో మాట్లాడుతూ జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 30,410 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో 150 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 17 నుంచే జరగనున్న దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ కేంద్రాల్లోనే ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్తోపాటు వేసవి దృష్ట్యా ఫ్యాన్ల ఏర్పాటు, చల్లని తాగునీరు, టాయిలెట్లు మౌలిక వసతుల కల్పనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు వివరించారు. జిల్లా జైలులో తొలిసారిగా పరీక్ష కేంద్రం ప్రస్తుత ఏడాది దూరవిద్య టెన్త్ పరీక్షల కోసం జిల్లా జైలులోని ఖైదీలకు తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ చెప్పారు. అక్కడ పరీక్ష రాసే ఖైదీల కోసం చీఫ్ సూపరింటెండెంట్, డీవోను నియమిస్తున్నట్లు వివరించారు. హాల్ టికెట్తో నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు ● పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికీ ప్రభుత్వ పరీక్షల విభాగం హాల్ టికెట్ జారీ చేసిందని, హాల్ టికెట్లను పాఠశాలల హెచ్ఎం లాగిన్లో ఉంచినట్లు డీఈఓ చెప్పారు. ● ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 నంబరుకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చునని వివరించారు. ● డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు నేరుగా పరీక్షలు రాసేందుకు వెళ్లవచ్చునని, ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ● ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈనెల 17 నుంచి ప్రారంభం ఫీజు చెల్లించిన అందరికీ హాల్టికెట్లు జారీ డీఈఓ సీవీ రేణుక -
గరుడ వాహనంపై శ్రీవారి నగరోత్సవం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అష్టబంధన మహా సంప్రోక్షణ సమేత మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయదేవి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేషధారణలు, గుర్రాలు, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగింపు కొనసాగింది. అనంతరం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో తపోవనం, శ్రీమాతా శివచైతన్య మాతాజీ (నులకపేట) పర్యవేక్షణలో చండీ హోమం, పూర్ణాహుతి, డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి నిర్వహణలో లలిత పారాయణ, సువాసిని సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం సాహితీవేత్తలు ముప్పవరపు సింహాచలశాస్త్రి, నారాయణం శేషుబాబు, మహా కుంభాభిషేక విశేషాలు, బ్రహ్మోత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, బీజేపీ నేతలు చెరుకూరి తిరుపతిరావు, యడ్లపాటి స్వరూపారాణి, పీవీ శంకరరావు (వికాస్ విద్యా సంస్థలు), ప్రముఖ వ్యాపారవేత్త మందలపు బంగారుబాబు ప్రసంగించారు. టీటీడీ ఆగమశాస్త్ర పండితులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీవేత్త నోరి నారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, బండారు సాంబశివరావు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు కృషి చేయాలి
గుంటూరు వెస్ట్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించిన వర్చువల్ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్తోపాటు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. అనంతరం జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సాధికారత జీవనోపాధి, మెరుగు దలకు ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళ దినోత్సవ వేడుకలు ఈనెల 8న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తల అమ్మకాలకు రూపొందించి ఈ– కామర్స్ యాప్ ద్వారా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి మెరుగు పరిచేందుకు ఈ–బైక్, ఈ–ఆటో, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు, మహిళ దినోత్సవం నాటికి గ్రౌండింగ్ జరిగేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల ద్వారా మహిళ సంక్షేమం, ఆర్ధికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళ రక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై పోలీసు శాఖ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించిన మహిళలకు సన్మానం కార్యక్రమం చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, మహిళ అభివృద్ధి సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి, మెప్మా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి