breaking news
Guntur District News
-
మైక్రో ఆర్టిస్ట్ మహితకు బాపట్ల కలెక్టర్ సాయం
బాపట్ల : చీరాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తన అద్భుతమైన కళా ప్రతిభతో మహిత 93 ఫెన్సిల్స్పై నెల్సన్ మండేలా జీవిత చరిత్రను, మరో 810 ఫెన్సిల్స్పై మహాభారతంలోని 700 శ్లోకాలను అత్యంత సూక్ష్మంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నారు. మహిత అసాధారణ ప్రతిభను కలెక్టర్ మురళి అభినందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తన వంతు సహాయంగా రూ.15వేలు చెక్కు రూపంలో మహితకు అందజేశారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టర్ తీసుకున్న ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు. -
కసిదీరా హతమార్చి..
నగరంపాలెం: జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై మంది దారుణ హత్యకు గురయ్యారు. వివాదాలు, పాతకక్షలు, నగలు, నగదు దోపిడీ కోసం దుండగులు ఇలా తెగబడుతున్నారు. దీంతో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. మద్యం మత్తు కూడా ఈ హత్యలకు కారణంగా నిలుస్తోంది. ఎందుకీ క్రూరత్వం? నిందితుల్లో ఎక్కువగా సుమారు 30– 40 ఏళ్లలోపు వారే. ప్రత్యర్థులను కిరాతకంగా హతమార్చారు. తాడేపల్లి సీతానగరం పట్టాభిరామయ్యకాలనీలో ఓ వ్యక్తిని క్రూరంగా చంపేశారు. క్రైం సినిమాల్లో మాదిరి అతని మెడలో కత్తి దించి అలజడి స్పష్టించారు. ఇక మంగళగిరి ఎంఎస్నగర్ వాసి కోటేశ్వరరావు చేతి మణికట్టులను కత్తులతో నరికారు. ఆనందపేటలో జరిగిన పఠాన్ ఖాజాబి హత్యతో కొద్ది రోజులు స్థానికులు రాకపోకలకు హడలిపోయారు. పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామ వాసి శ్రీనివాసరావును హత్య చేసి పంట కాల్వల్లో పడేశారు. వంద గొర్రెలను ఎత్తుకెళ్లారు. తెనాలిలో వియ్యపురాళ్లు ప్రాణాలతో బయటపడేందుకు ప్రత్యర్థులతో పెద్ద పెనుగులాటే జరిగింది. చివరికి ప్రాణాలు వదిలారు. ఓ వృద్ధురాలిపై లైంగిక దాడి చేసి, హత్య చేశారు. మేడికొండూరు మండల పరిధిలో ముగ్గురు మందుబాబులు ఒకర్ని బీరు సీసాలతో అత్యంత పాశవికంగా హత్య చేశారు. హతమార్చే దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నియంత్రణకు చర్యలు అంతంతే జిల్లాలో ఇలాంటి కేసుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు అంతంత మాత్రమేనని చెప్పాలి. గుంటూరు సమాచార సేకరణలో స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ వెనుకంజలో ఉండటమే దీనికి కారణమనే అనుమానాలు లేకపోలేదు. మంగళగిరి, తెనాలి, దక్షిణ సబ్ డివిజన్ల పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. సబ్ డివిజన్కు ఐదారుకుపైగా హత్యలు జరిగాయి. రాజధాని ప్రాంతమైన జిల్లా, గుంటూరు నగరంలో ప్రోటోకాల్, బందోబస్త్లతో పోలీసులకు ఊపిరాడటం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సిబ్బంది లేరు. ప్రత్యర్థులను అతి క్రూరంగాచంపేస్తున్న దుండగులు నగలు, నగదు లక్ష్యంగా ప్రాణాలు బలి తీసుకుంటున్న చోరులు మంగళగిరి, తెనాలి, దక్షిణ సబ్ డివిజన్లలోనే ఎక్కువ దారుణాలు ఇవిగో నిదర్శనాలు ఏప్రిల్ 1న అరండల్పేటలో భిక్షాటన చేసుకునే కేవీపీ కాలనీ వాసి గణేష్ (35)ను ముగ్గురు స్నేహితులు హతమార్చారు. గణేష్పై నగరంపాలెం పీఎస్లో సస్పెక్ట్ రౌడీషీట్ ఉంది. ప్లాస్టిక్ సీసాలు ఏరుకునే శారదాకాలనీ వాసి దారావతు రాము (60), రెడ్డిపాలెం వాసి బట్టు రాజులు కలిసి మద్యం తాగి గొడవ పడ్డారు. రాజు మద్యం సీసాతో రాముపై దాడి చేసి హతమార్చాడు. ఆనందపేట రెండో వీధిలో ఉంటున్న వంట మాస్టర్ పఠాన్ హర్షద్ ఓ యువతి తనను ప్రేమిస్తున్నట్లు చెబుతుండగా ఏప్రిల్ 3న గొడవ జరిగింది. హర్షద్ను హతమార్చేందుకు యువతి తరఫు వారు మారణాయుధాలతో వెంటపడ్డారు. క్షతగాత్రులను చూసేందుకు వెళ్లిన పఠాన్ ఖాజాబి (70)ని ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 28న పేరేచర్ల నరసరావుపేట రోడ్డులోని రైల్వేట్రాక్ పక్కనున్న తోటలో మంగళగిరికి చెందిన బాలకృష్ణ (40)ను బీరు సీసాలతో తలపై మోది ముగ్గురు హత్య చేశారు. 2019లో జరిగిన ఓ హత్య కేసులో వీరు నిందితులు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మే 2న దుగ్గిరాల మోరంపూడి గ్రామంలో రఘునాథరావు (35), గోపీలు మద్యం తాగి గొడవ పడ్డారు. రఘునాథరావు తలపై రోకలి బండతో గోపీ మోదడంతో మృతి చెందాడు. మే 7న మంగళగిరి ఎంఎస్ఎస్గర్కు చెందిన కోటేశ్వరరావు (47)ను పెదవడ్లపూడి సమీపంలో దారుణంగా హత్యచేశారు. పీక కోయవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జూన్ 3న తెనాలి అయ్యప్పస్వామి గుడి వద్ద ఒంటరిగా ఉంటున్న తాడిపత్రి మల్లీశ్వరి (60)పై హత్యాచారం జరిగింది. ఆమెకు చెందిన బంగారు నగలతో దుండగులు పారిపోయారు. జూన్ 19న తెనాలిలో వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పి.అంజమ్మ (70)లను దారుణంగా హత్య చేసిన దుండగులు, బంగారు నగలు దోచుకెళ్లారు. -
పాత పింఛను విధానం అమలుకు డిమాండ్
గుంటూరు వెస్ట్: పాత పెన్షన్ విధానాన్ని 2003 డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని అమలు చేయాలని డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మోపిదేవి శివశంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తమకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఓపీఎస్ విధానం అమలు కాలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టెక్నికల్ తప్పుల వలన తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 57 ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సకాలంలో స్పందించకపోతే తమ న్యాయ పోరాటం ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సలగల ప్రసన్న కుమార్, ఘంటసాల శ్రీనివాసరావు, నరసింహారావు, శ్రీలం యలమంద, మారెళ్ళ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆధునిక సెన్సార్లతో విద్యుత్తు హెచ్చుతగ్గుల నియంత్రణ
పెదకాకాని: ఎలక్ట్రికల్ స్మార్ట్ గ్రిడ్లలో అధునాతన సెన్సార్లను వినియోగించడం ద్వారా విద్యుత్ హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చని ఏపీ ట్రాన్స్కో అండ్ ఏపీఎస్ఎల్డీసీ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ శ్రీనివాస్ కవటూరి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా’ ఆధ్వర్యంలో అధునాతన సెన్సార్లను వినియోగించి స్మార్ట్ గ్రిడ్ శక్తి, ఉత్పత్తి, పంపిణీ, వినియోగాన్ని విశ్లేషించడంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీనివాస్ కవటూరి, డెప్యూటీ ఈఈ ఆర్వీఆర్ సంతోష్, ఐఈఐ ఏసీ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎల్ఎస్ దేవకుమార్ హాజరయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పరికరాలు కాలపరిమితిని కూడా పెంచవచ్చని తెలిపారు. ఏఐ ఆధారిత బిగ్ డేటా ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించి భవిష్యత్ అవసరాలు గుర్తించేదుకు వీలవుతుందని వివరించారు. డాక్టర్ శ్రీనివాస్ కవటూరి, ఆర్వీఆర్ సంతోష్లను వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబులు సత్కరించారు. కార్యక్రమంలో వీవీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్బాబు, ఐఈఐ విద్యార్థి విభాగం సంధానకర్త డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏ‘మార్చి’ విధుల్లో వైద్యులు
పేద రోగులకు సేవలందించాల్సిన వైద్యులు వారు.. కానీ, సేవ మాట దేవుడెరుగు.. కనీసం అధికారికంగా విధులు నిర్వర్తించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిన వారు.. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సంబంధం లేని విధుల్లో ఉంటున్నారు. ఇక ఉన్న సిబ్బందిలో మరికొందరు ఎక్కడంటే అక్కడకు వెళ్లినా హాజరు సైతం నమోదు అయ్యేలా మేనేజ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గుంటూరు మెడికల్: గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్లను నియమించింది. గతంలో ఒక్కొక్కరు ఆరోగ్య కేంద్రాల్లో ఉండేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇద్దరు చొప్పున నియమించింది. ఆరోగ్య కేంద్రాల పనివేళలు పెంచి స్టాఫ్ నర్సులను అదనంగా ఏర్పాటు చేసింది. పీహెచ్సీలో కీలకమైన పలువురు మెడికల్ ఆఫీసర్లపై ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం లేదని, రోగులకు సేవలు చేయడం లేదని డీఎంహెచ్ఓకు, జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయి. వారిపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు. పనితీరు పర్యవేక్షించి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు సేవలు అందించేలా చూడాల్సిన ప్రోగ్రాం ఆఫీసర్లు అసలు ఆ విషయమే మరిచిపోయారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలోనే తిష్ట వేసిన ఆరోగ్య కేంద్రాల సిబ్బందిపై ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాజరు నమోదు చూస్తారట.. పీహెచ్సీల్లో రోగులకు సేవలందించాల్సిన ఓ డాక్టర్ ఇలా డీఎంహెచ్ఓ కార్యాలయంలో తిష్ట వేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది హాజరును పర్యవేక్షించే పనులు నిర్వహిస్తున్నారు. పరిపాలనా అధికారులు, మినిస్టీరియల్ ఉద్యోగులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. దీంతో వీరు డమ్మీలుగా మారారు. వాస్తవానికి ఆరోగ్య కేంద్రాల్లో ఉండి వైద్యులు, వైద్య సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ మొబైల్ ద్వారా వేయాలి. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంతో గుంటూరులో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా హాజరు నమోదవుతోంది. ఈ మేరకు డేటా మార్చారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. అర్బన్ పీహెచ్సీ, పీహెచ్సీల్లో పనిచేయాల్సిన వైద్యులు కొంత మంది దొడ్డి దారిలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులను మంచి చేసుకుని, గుంటూరులోనే తిష్ట వేస్తున్నారు. కొందరికై తే ఏ పనీ ఉండటం లేదు. హాజరు వేసి ఇళ్లకు వెళ్లిపోయి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరికొందరు సంబంధం లేని పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు సదరు వైద్యుల నుంచి లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చర్యలకు వెనకడుగు ఇటీవల జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి చికిత్స కోసం వచ్చిన సమయంలో ఓ మెడికల్ ఆఫీసర్ రెండు కాళ్లు లేబుల్ మీద పెట్టి సెల్ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ అతడిపై డీఎంహెచ్ఓ కార్యాలయం చర్యలు తీసుకోలేదు. మరో వైద్య అధికారి మద్యం తాగి విధులకు హాజరవుతూ దుర్భాషలాడుతున్నారని పలువురు వైద్య సిబ్బంది డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఆరోగ్య కేంద్రాలకు రాని కొందరు వైద్య అధికారులను మార్చాలని ప్రజలు, రోగులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా డీఎంహెచ్ఓ కార్యాలయంలో తిష్ట అసలు విధులు మర్చిపోయి కార్యాలయ ఉద్యోగుల పనుల్లో నిమగ్నం వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు -
‘స్వచ్ఛ’ అవార్డు రావడం అభినందనీయం
గుంటూరు వెస్ట్ / నెహ్రూనగర్: స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లాకు అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు నగరానికి వచ్చిన అవార్డును జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్కు చూపారు. ఇది సమష్టి కృషి ఫలితం అని కలెక్టర్ అన్నారు. కేంద్రం నుంచి ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25’ పోటీల్లో గుంటూరుకు లభించిన అవార్డు నగర ప్రజలు, ప్రజారోగ్య కార్మికులకు అంకితమని మేయర్ కె.రవీంద్ర చెప్పారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవార్డు అందించిన స్ఫూర్తితో సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అందరి కృషితోనే గుర్తింపు లభించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ముగిసిన పవిత్రోత్సవాలు పెదకాకాని: శివాలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకల చివరిరోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, 20వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు చేయనున్నారు. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, దాతలు నేలవెల్లి కోటేశ్వరి, కర్నే శివ సందీప్ నాగశిరీష, రెడ్డి నవీన్ కుమార్ విజయలక్ష్మి, నేలివెల్లి నాగప్రత్యూష, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్ విజయపురి సౌత్: మేకల గొంది నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రూ.1,200 కోట్లతో మాచర్ల నియోజకవర్గంతోపాటు పల్నాడు ప్రాంతానికి కూడా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత స్థలాన్ని అధికారులు పరిశీలించారు. మేకల గొందిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసే స్థలంలో సర్వే మ్యాపులను పరిశీలించారు. అన్ని అనుమతులు మంజూరయితే నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, డీఎఫ్ఓ సందీప్ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ రమేష్ పాల్గొన్నారు. చౌడేశ్వరి అమ్మవారికి సారె సమర్పణ రెంటచింతల: స్థానిక చౌడేశ్వరి అమ్మవారికి శుక్రవారం ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను సమర్పించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు పి.అనిల్కుమార్శర్మ నేతృత్వంలో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం పెద్దశెట్టి పల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రాములవారి ఆలయం వద్ద నుంచి మేళతాళాలతో ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను భక్తులతో కలిసి తీసుకువచ్చి అమ్మ వారికి సమర్పించారు. -
కుండపోత
గుంటూరుశనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025ఆదర్శ న్యాయ‘జ్యోతి’ శాకంబరిగా భవానీ అమ్మవారు సత్తెనపల్లి: ఆషాఢ మాసం పురస్కరించుకొని స్థానిక అమ్మిశెట్టివారివీధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి గుడిలో భవానీ అమ్మవారు శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 563.10 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బొల్లాపల్లి: వినుకొండ నుంచి 20 మందితో మర్రివేముల వెళుతున్న ఆర్టీసీ బస్సు వెల్లటూరు వద్ద ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవరూ గాయపడలేదు.ప్రత్తిపాడు: మండలంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం నుంచి కూడా విడతలవారీగా 40.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం మొదలు ప్రత్తిపాడు బస్టాండు వరకు గుంటూరు–పర్చూరు పాత మద్రాసు రోడ్డు చెరువును తలపించింది. మోకాలి లోతులో నీరు రోడ్లపై ప్రవహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాగులు, లోలెవల్ చప్టాలు ఉప్పొంగాయి. గొట్టిపాడు– ప్రత్తిపాడు, గనికపూడి– గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టాలపై వర్షపు నీరు ఉప్పొంగింది. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు కొన్ని గంటలపాటు స్తంభించిపోయాయి. ప్రత్తిపాడు, పాతమల్లాయపాలెం, ఏబీపాలెం, వంగిపురం ప్రాంతాల్లో సాగు భూములు సైతం వర్షపు నీటితో చెరువులను తలపించాయి. గుంటూరు – పర్చూరు పాత మద్రాసు రోడ్డుపై ప్రత్తిపాడులో ఎస్ఎంఎస్ అండ్ ఎన్ఎల్ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న లోలెవల్ చప్టాపై పెద్ద ఎత్తున నీరు ఉప్పొంగడంతో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నివాసాల్లోకి మురుగునీరు.. ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో పాతమల్లాయ పాలెం కూడలి వద్దనున్న చిన్న తూముల వలన రెడ్ల రామాలయం నుంచి ఇందిరాగాంధీ బొమ్మ సెంటరు వరకు వర్షపు నీరు, మురుగు ఎగదన్ని ఇళ్లలోనికి, అంతర్గత వీధుల్లోకి వచ్చింది. ఇంటి సామగ్రి దెబ్బతింది. రోడ్లపై నీరు మోకాలి లోతులో ప్రవహించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తూముల సమస్యను అధికార యంత్రాంగం పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో అధిక వర్షాలకు సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై ప్రత్తిపాడు పంచాయతీ అధికారులకు కూడా శుక్రవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విదేశాల్లోనూ శిక్షణ 7న్యూస్రీల్చర్యలకు వెనకడుగు ఇటీవల జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి చికిత్స కోసం వచ్చిన సమయంలో ఓ మెడికల్ ఆఫీసర్ రెండు కాళ్లు లేబుల్ మీద పెట్టి సెల్ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ అతడిపై డీఎంహెచ్ఓ కార్యాలయం చర్యలు తీసుకోలేదు. మరో వైద్య అధికారి మద్యం తాగి విధులకు హాజరవుతూ దుర్భాషలాడుతున్నారని పలువురు వైద్య సిబ్బంది డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఆరోగ్య కేంద్రాలకు రాని కొందరు వైద్య అధికారులను మార్చాలని ప్రజలు, రోగులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, సాగు భూములు జలమయం గుంటూరు–పర్చూరు పాత మద్రాసు రోడ్డులో మునిగిన లోలెవల్ చప్టా మూడు జిల్లాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు ప్రత్తిపాడులో తూముల సమస్యతో ఇళ్లలోకి చేరిన మురుగునీరు -
నానో ఎరువుల వినియోగం పెంచాలి
కొరిటెపాడు(గుంటూరు): నానో ఎరువుల వినియోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇఫ్కో ఆధ్వర్యంలో కృషీభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన నానో ఎరువుల విక్రయదారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నానో యూరియా, డీఏపీ, జింక్, కాపర్ వాడటం వల్ల కాలుష్యం తగ్గుతుందని స్పష్టం చేశారు. ధరల భారం ఉండదన్నారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి సారం కోల్పోతుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి వీరాచారి మాట్లాడుతూ నానో ఎరువులను రైతులు వాడాలని సూచించారు. ఒక బాటిల్ నానో యూరియా పిచికారి చేస్తే ఒక బస్తా యూరియా చల్లినట్టేనని తెలిపారు. ఇఫ్కో నానో డీఏపీ అన్ని పంటల్లో నత్రజని, భాస్వరం లోపాలను సరిచేయడంలో సహాయ పడుతుందని వివరించారు. సమావేశంలో నాబార్డు డీడీఎం శరత్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు సురేంద్ర, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు -
వైఎస్సార్ సీపీ నేతల విచారణ
సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన అక్రమ కేసులో ఇద్దరు వైఎస్సార్ సీపీ నేతలను గురువారం సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్లో సీఐలు నాగమల్లేశ్వరరావు, ఎం.వి.సుబ్బారావులు విచారించారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణలను వేర్వేరుగా పోలీస్టేషన్లలో విచారించి, వారి నుంచి సమాధానాలు రాబట్టి నమోదు చేసుకున్నారు. వీరి వెంట స్టేషన్కు వచ్చిన వారిలో వైఎస్సార్ సీపీ బెల్లంకొండ మండల నాయకుడు చెన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా లీగల్సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, సీనియర్ న్యాయవాది మర్రి వెంకట సుబ్బారెడ్డి, క్రోసూరు, అమరావతి మండల నాయకులు నర్రా వాసు, మంగిశెట్టి కోటేశ్వరరావు ఉన్నారు. విజ్ఞాన్ వర్సిటీకి రూ.58.27 లక్షల ప్రాజెక్ట్ చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.ఆర్. చరణ్ రాజకు ఢిల్లీలోని ఏఎన్ఆర్ఎఫ్– పీఎంఈసీఆర్జీ (అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ – ప్రైమ్ మినిస్టర్స్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్) నుంచి రూ.58.27 లక్షల విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ గురువారం తెలిపారు. పరిశోధనకుగాను రాబోయే 3 సంవత్సరాలకు ప్రాజెక్ట్ గ్రాంటు మంజూరైందన్నారు. ఎం.ఆర్. చరణ్ రాజను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు అభినందించారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ
నెహ్రూనగర్: సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25 పోటీల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆనందంగా ఉందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరాం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రలు అవార్డును స్వీకరించారు. 23 నగరాలను సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలుగా కేంద్రం ప్రకటించిందని చెప్పారు. వాటిలో గుంటూరు నిలవడం గర్వకారణం అని అన్నారు. సీఎస్సీ సేవల్లో గుర్తింపు యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో గల శ్రీ సాయిగణేష్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్)కు సేవల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానం లభించింది. 16వ సీఎస్సీ దివస్ వేడుకలు ఢిల్లీలోని యశ్భూమి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిగణేష్ కేంద్రం నిర్వాహకులు, వంకాయలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు అవార్డును సీఎస్సీ సీఈవో సంజయ్కుమార్, రాకేష్ నుంచి అందుకున్నారు. పలువురు అభినందనలు తెలిపారు. -
ముక్తేశ్వరుని సాక్షిగా ఇసుక అక్రమ తవ్వకాలు
రేపల్లె: సాక్షాత్తూ ముక్కంటి కనులు కప్పి కూటమి నేతలు అక్రమ ఇసుక తవ్వకాలకు బరితెగించారు. దక్షిణకాశీగా పేర్గాంచిన రేపల్లె మండలం మోర్తోట గ్రామంలో పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో కూటమి నేతల కనుసన్నలలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి కేవలం 300 మీటర్ల దూరంలో కృష్ణమ్మ ఒడ్డున జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రసిద్ధిగాంచిన ముక్తేశ్వరస్వామి ఆలయానికి సాధారణ రోజులతో పాటు కార్తికమాసంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుని కృష్ణానదిలో పుణ్యస్నానమాచరిస్తుంటారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో ఇదే అదునుగా భావించిన కూటమినేత కన్నుసన్నలలో ఇసుకాసురులు జేసీబీల ద్వారా గుంతలు తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రకృతి సంపద తరలిపోవటంతోపాటు భవిష్యత్లో తవ్విన ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. -
వైభవంగా పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజుల పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం అర్చకులు, వేదపండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో ఇవి జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం అన్నదానం, సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. పూజా కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, అర్చకులు, దాతలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గిరిజా కల్యాణం పోస్టర్ ఆవిష్కరణ నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం గిరిజా కల్యాణ పోస్టర్ను వైశ్యకుల గురువు వామనాశ్రమ మహా స్వామీజీ ఆవిష్కరించారు. ఈ నెల పది నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు చాతుర్మాస దీక్షలో భాగంగా 27న గిరిజా కల్యాణం నిర్వహిస్తున్నట్లు చాతుర్మాస సేవా సమితి కన్వీనర్ తటవర్తి రాంబాబు తెలిపారు. కల్యాణంలో పాల్గొనేందుకు 94406 05773 ఫోను నంబర్లో సంప్రదించాలని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో గుడివాడ రవి, జుజ్జూరు శ్రీనివాసరావు, బాపారావు, కోటా శేషగిరి, మహంకాళి శ్రీనివాసరావు, సునీత, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886 కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886 వచ్చినట్లు ఆలయ ఈవో జి.నరసింహమూర్తి తెలిపారు. గురువారం బాపట్ల డివిజన్ దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం.గోపి, చందోలు ఎస్ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ పర్యవేక్షణలో పొన్నూరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ నాగరాజు ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బందితోపాటు అమ్మవారి భక్తులు హుండీ నగదు లెక్కించారు. ప్రతి మూడు నెలలకు అమ్మవారి హుండీ నగదు లెక్కిస్తున్నామని ఈవో తెలిపారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి భట్టిప్రోలు: పిడుగుపాటుకు గురై బాపట్ల జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం ఓలేరు శివారు వెంకటరాజు నగర్కు చెందిన గుంటూరు లూదు మరియన్న (70) పొలంలో పని చేస్తుండగా గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం ఆరంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో సమీపంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. అత్యంత సమీపంలో పిడుగు పడింది. దీంతో మృతి చెందాడు. గమనించిన స్థానికులు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. మహిళ కూడా...సంతమాగులూరు(అద్దంకి): పిడుగు పాటుకు మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండలంలోని ఏల్చూరు గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన వారు పొలాల్లో గేదెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు ధాటికి పద్మ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయడిన వ్యక్తిని వైద్యశాలకు తరలించారు. -
‘సాక్షి’ చానల్ ప్రసారాల నిలిపివేతపై వైఎస్సార్సీపీ నిరసన
తెనాలి: సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాలతో ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక కేబుల్ చానళ్లలో సాక్షి చానల్తోపాటు టీవీ9, ఎన్టీవీ తదితర చానళ్ల ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించటమే కాకుండా, ప్రజలకు వాస్తవాలను తెలియకుండా అడ్డుకోవాలని చూడటమేనని పార్టీ నాయకులు ఆరోపించారు. సూపర్సిక్స్ హామీలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన వందల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించటం, పాలనలో వైఫల్యాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించటం వంటి వాస్తవాలను ప్రజాపక్షం వహించి ప్రసారం చేస్తున్న సాక్షి గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఒత్తిడి తెచ్చి మరీ... పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాయ్తో సంబంధం లేకుండా బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకొచ్చి సాక్షి ప్రసారాలను నిలిపివేయటం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనుకూల చానళ్లపైనా ఇదే చర్య తీసుకోవాలని సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ లీగల్ సెల్ న్యాయవాది చింకా సురేష్చంద్రయాదవ్ మాట్లాడుతూ కేబుల్ టీవీ ఖాతాదారులకు సాక్షి, మరికొన్ని చానళ్ల ప్రసారాలను అందించకపోవడంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. అంతవరకు వెళ్లాలని తాము అనుకోవటం లేదని, ఎంఎస్ఓలు, బ్రాడ్కాస్టర్లను సంప్రదించి అన్ని చానళ్లను ప్రసారం చేయాలని చెప్పారు. అప్రజాస్వామిక వైఖరి పార్టీ మహిళా నేత, మున్సిపల్ కౌన్సిలరు కొర్రపాటి యశోద మాట్లాడుతూ భజన చేసే చానళ్లను మాత్రమే ప్రసారం చేస్తూ, విమర్శించే వాటి ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని విమర్శించారు. సూపర్సిక్స్ హామీల మోసం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, న్యాయవాది మైలా విజయ్నాయుడు కూడా మాట్లాడారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, గోల్డ్ రహిమా, తాడిబోయిన రమేష్, బొంతు నరేంద్రరెడ్డి, మన్నవ ప్రభాకర్, కాకి దేవసహాయం, కొడాలి క్రాంతి, ఆవుల కోటయ్య, పెదలంక వెంకటేశ్వరరావు, కటెవరపు దేవానంద్, బండ్లమూడి నాగేశ్వరరావు, అక్కిదాసు కిరణ్, మల్లెబోయిన రాము, అమర్తలూరి సీమోను, పినపాటి రవికిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, న్యాయవాదులు గుమ్మడి రవిరాజ్, దాట్ల మోహన్రెడ్డి, డి.మల్లికార్జునరెడ్డి, గుంటూరు కృష్ణ, మహిళా నేతలు తమ్మా సుజాతరెడ్డి, షేక్ జకిరా, షేక్ ఇస్రత్, ఇందిర, రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025విద్య దూరం.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏడాదిగా ఇన్చార్జి పాలనలో వివాదాలకు, అక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. బీఈడీ పరీక్ష పత్రాల లీకేజీ.. దూర విద్య పరీక్షల్లో అక్రమాలు వర్సిటీని అపహాస్యం చేశాయి. వందల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం, తమ వర్గం వారికి భారీ జీతాలు ఇచ్చి మళ్లీ ఉద్యోగాలు కల్పించడం వంటివి గాడి తప్పిన పాలనకు నిదర్శనంగా నిలిచాయి. నూటా ఎన్నికల్లో న్యాయ స్థానం జోక్యం చేసుకోవాల్సి రావడం అధ్వాన పరిస్థితిని కళ్లకు కట్టింది. న్యూస్రీల్ -
ఎక్కడో హత్య .. ఇక్కడే దహనం!
యడ్లపాడు: మండలంలో వరుసగా నమోదవుతున్న అజ్ఞాత శవాల దహనం ఘటనలు పోలీసులు సవాలుగా మారాయి. తాజాగా జూన్ 25న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 16వ జాతీయ రహదారి పక్కన పట్టపగలే శవ దహనం స్థానికులను కలవరపెట్టింది. 20 రోజులకు పైగా గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కేసు మిస్టరీగానే ఉంది. హత్య చేసిన తర్వాత మృతదేహాలను యడ్లపాడు మండలంలో దహనం చేయడం హంతకుల వ్యూహంలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడేళ్లలో నాలుగు ఘటనలు గత మూడేళ్లలో మండలంలో మొత్తం నాలుగు శవ దహనాల ఘటనలు నమోదయ్యాయి. బోయపాలెం– వంకాయలపాడు గ్రామాల మధ్యలో హైవే సర్వీసు రోడ్డు పక్కన చెత్తకుప్పలో ఒకరిని, యడ్లపాడు నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన అండర్పాస్ వంతెన సమీపంలో సుబాబుల్తోట పక్కనే ఒకరు, సొలస గ్రామంలోని శ్మశానవాటికలో ఒకరిని కాల్చివేసిన సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా గతనెల 25న జరిగిన ఘటన వీటి జాబితాలోకి వచ్చి చేరింది. ఆ ఒక్కటే ఆధారం ! చివరగా జరిగిన ఘటనలో మాత్రం ఒక ఆధారం లభించింది. హంతకులు పట్టపగలే ప్లెక్సీ షీట్లో చుట్టిన శవాన్ని హైవే పక్కనున్న కాల్వలో పడేసి నిప్పంటించి పరారయ్యారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ ఆవైపు వెళ్లిన పోలీసులు మంటలు గమనించి, వాహనంలోని నీటితో మంటలను ఆర్పారు. అయితే, అప్పటికే శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. ముఖ భాగం మాత్రమే కొంతమేర మిగిలింది. ఆ ఒక్క ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి గురించి ఏ పోలీస్ స్టేషన్న్లోనూ మిస్సింగ్ కేసు రిజిస్టర్ కాకపోవడం పోలీసులకు ట్విస్ట్గా మారింది. హంతకులు శవాన్ని ెఫ్లెక్సీ షీట్తో చుట్టి నిప్పు పెట్టిన విషయం తప్పా హత్యకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఏదీ లభించలేదు. పెట్రోల్ పోసి పూర్తిగా దహనం చేయడంతో ఆధారాలు మిగలకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు శవం ముఖం ఫోటోనే కీలక ఆధారంగా చేసుకుని కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్టీం, డాగ్ సాస్క్యాడ్ సహకారంతో డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేపట్టారు. ఘటన జరిగిన తేదీన అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ ఒక్క హత్యకేసు ఛేదించగలిగితే మిగిలిన వాటిలో ఏదన్న ఆధారం లభిస్తుందేమోనని పోలీసులు భావిస్తున్నారు. మిస్టరీగా మారుతున్న శవ దహనాలు ఒకే తీరున మూడేళ్లలో నాలుగో ఘటన పోలీసులకు సవాల్గా మారిన కేసులు -
‘కూటమి’ ఒత్తిడితోనే పోలీసులు వేధిస్తున్నారు
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు గురిజవోలు బాధితుల ఫిర్యాదు నరసరావుపేట రూరల్: పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాధితులమైన తమపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలతో నరసరావుపేట రూరల్ పోలీసులు వేధింపుల నుంచి కాపాడాలని నాదెండ్ల మండలం గురిజవోలుకు చెందిన కొండెబోయిన శ్రీనివాసరావు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కోరారు. విజయవాడకు వచ్చిన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహీర్ను గురువారం శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. మైనర్ అయిన తన కుమార్తెను అనుసరిస్తూ గ్రామానికి చెందిన పుల్లపు విజయ్ కుమార్ కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. బాలికను హతమార్చే ఉద్దేశంతో కిడ్నాప్ కూడా పాల్పడ్డారని వాపోయారు. పోలీ సులు బాలికను గుర్తించి తమకు అప్పగించారని తెలిపారు. కుటుంబ గౌరవం గురించి ఆలోచించి నిందితుడిపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. విజయకుమార్ బెదరింపుల కారణంగా బాలికను తన అమ్మమ్మ గ్రామమైన నరసరావుపేట మండలం దొండపాడులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఆ గ్రామానికి వెళ్లి బాలికను బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని, ఈ సమయంలో మోటర్ సైకిల్, ఫోన్లు వదిలి పారిపోయాడని తెలిపారు. విజయకుమార్ వేధింపులతో బాలిక మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో 11 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. బాలిక ఫిర్యాదుతో విజయకుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయకుమార్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు గ్రామీణ పోలీస్స్టేషన్లో ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలతో అప్పటి నుంచి రూరల్ పోలీసులు తమను వేధిస్తున్నారని తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. ఈనెల 12వ తేదీన తన కుమారుడు పవన్కుమార్ స్టేషన్కు పిలిపించి కేసును ఒప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కొట్టారని పేర్కొన్నారు. కేసును అంగీకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పనిచేస్తున్న పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వెంగళరావు యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్ల శివగోపి పాల్గొన్నారు. -
ఇవిగో నిదర్శనాలు...
● మార్చి నెలలో బీఈడీ మొదటి సెమిస్టర్ పేపర్ –2 ప్రశ్నపత్రం లీకేజీ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చింది. మంత్రి జోక్యం చేసుకున్నా వర్సిటీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● మహిళా వసతి గృహ విద్యార్థులు తమకు భోజనం, సౌకర్యాల కోసం అర్ధరాత్రి చేసిన ఆందోళన వర్సిటీ స్థాయిని ప్రశ్నార్థకంగా మార్చింది. ● పాముకాటుతో క్యాంపస్లో విదేశీ విద్యార్థి దుర్మరణం చెందాడు. ● క్యాంపస్లో ఒక ఆచార్యుడు ఉద్దేశపూర్వకంగా తనను కారుతో ఢీకొట్టారని ఒక పరిశోధక విద్యార్థిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ● 2024, 2025 సంవత్సరాల్లో ఇన్చార్జి పాలనలో దూర విద్య పరీక్షల్లో రూ.కోట్లు చేతులు మారాయని, వర్సిటీ పరిశీలకులకు దేహశుద్ధి జరిగినా ఉన్నతాధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించారు. ● న్యాయ విభాగంలో గత ఏడాదిలో విద్యార్థులు అనేక సార్లు ఆందోళనలు చేశారు. ఆర్కిటెక్చర్ కోర్సు గాడి తప్పింది. -
సాయిరామ్ కాదు.. ‘సాయం’రామ్
గుంటూరు రూరల్: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. అక్షర సత్యం వంటి ఈ మాటలకు అసలు సిసలు నిర్వచనం యేరువ సాయిరామ్ అని కితాబిచ్చారు. ఏటా పెద్దసంఖ్యలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్న సాయిరామ్ పేరు ‘సాయం’రామ్గా సార్థకమవుతుందని ఎంపీ అభినందించారు. పెద పలకలూరులోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో యేరువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏటా తరహాలోనే ఈ సంవత్సరం కూడా 50 విద్యా సంస్థల నుంచి అన్ని తరగతులకు చెందిన 1,525 మందికి రూ.50 లక్షల ఉపకార వేతనాలు అందించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పోలూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎంపీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, స్కాలర్షిప్ ద్వారా చదువుకుని ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడిన సాయిరామ్ తన గతాన్ని మర్చిపోకుండా సమాజానికి తిరిగి తన చేతనైన సాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన తన తండ్రి కోటిరెడ్డి పేరిట ఏటా రూ.లక్షలను ఉపకార వేతనాలు రూపంలో అందిస్తున్న ఔదార్యాన్ని ప్రశంసించారు. కోటిరెడ్డి భౌతికంగా లేకున్నా... సాయిరామ్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటారని పేర్కొన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపకార వేతనాలతో నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఊతం లభిస్తుందన్నారు. ట్రస్ట్ సేవలు నిరుపమానమని ప్రశంసించారు. సాయిరామ్ తన తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అన్నారు. ట్రస్ట్ స్థాపించడమే కాకుండా తన సొంత ఊరైన పెద పలకలూరులో జెడ్పీ హైస్కూలుకు సొంత స్థలాన్ని ఇచ్చి, భవనాన్ని సైతం నిర్మించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు యేరువ జగదీశ్వరి, యేరువ శ్రీవేణి, యేరువ రమణి, యేరువ అభిరాం, పాల సత్యకళ్యాణి, కావ్య, శ్వేత, శ్రీనివాసరెడ్డి, అభినందన్రెడ్డి, శ్రీలలిత, మల్లీశ్వరి, మసూద ఫేం బాంధవి శ్రీధర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, సోమసాని ఝాన్సీ, మెట్టు అంజిరెడ్డి, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, ఉడుముల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, నూనె వెంకట కోటిరెడ్డి, నూనె గంగాధర్రెడ్డి, శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శనగల సాంబిరెడ్డి, కొండలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉపకార వేతనాలతో పేద విద్యార్థులకు ఊతం లీగల్ సెల్ రాష్ట్ర నేత పోలూరి వెంకటరెడ్డి చదువుకు పేదరికం ఆటంకం కాకూడదు అందుకే కోటిరెడ్డి ట్రస్టు ద్వారా సేవలు ట్రస్టు వ్యవస్థాపకుడు యేరువ సాయిరామ్ 1,525 మంది విద్యార్థులకు రూ.50 లక్షలు పంపిణీ సేవలు మరింత విస్తరిస్తాం యేరువ సాయిరామ్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో చదువుకునేందుకు పడిన కష్టం మరే విద్యార్థి పడకూడదన్న సంకల్పంతోనే తండ్రి పేరిట ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తాను విదేశాల్లో పొందిన ఆదాయంలో సింహభాగం పేద విద్యార్థుల ఉన్నతికి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకు పేదరికం ఆటంకం కారాదన్న ఏకై క లక్ష్యంతో ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని ఆయన ప్రకటించారు. -
ఇంటిపై ‘షార్ట్’ పిడుగు
తెనాలి సీబీఎన్ కాలనీలో ఓ కుటుంబం 2020లో ఇంటి నిర్మాణానికి పూనుకుంది. ఇల్లాలి పేరిట మున్సిపాలిటీకి ప్లాను ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. డీపీఎంఎస్ ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతిని మంజూరు చేశారు. ఆ కుటుంబం సంతోషంగా ఇల్లు నిర్మించుకుంది. ప్రస్తుతం ఆ ఇంటికి 14 శాతం ఖాళీ స్థలం చార్జీగా రూ.3.04 లక్షలు చెల్లించాలంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసు జారీ చేశారు. తెనాలి: 2016–17 నుంచి నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు 2025లో మున్సిపాలిటీ ‘షార్ట్ ఫాల్స్’ నోటీసులనిస్తోంది. ఇప్పటికే తెనాలిలో 350కి పైగా ఇంటి యజమానులకు నోటీసులు అందాయి. భవన నిర్మాణ అనుమతికి సంబంధించి దరఖాస్తు చేసినపుడు తగిన పూర్తి సమాచారం సమర్పించక పోయినా, అవసరమైన అన్ని ఫీజులు చెల్లించకపోయినా ఆ దరఖాస్తు చెల్లుబాటు కాదనీ, పూర్తి అనుమతిని పొందకుండా ఎలాంటి నిర్మాణం చేసినా, అది అక్రమ నిర్మాణంగా పరిగణిస్తామని స్పష్టంగా జీఓలో ప్రభుత్వ పేర్కొంది. ఆన్లైన్లో జారీచేసిన భవన నిర్మాణ అనుమతిని రద్దుచేస్తామని, చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం అనధికార నిర్మాణాల తొలగింపునకు తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఇంటి యజమానికి నోటీసు ఇవ్వటంతోపాటు అప్పట్లో ఇంటి ప్లానును రూపొందించిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ)/ లైసెన్స్డ్ ఇంజినీరుకు కాపీని పెడుతున్నారు. నోటీసు అందిన తేదీనుంచి ఏడు రోజులలోపు షార్ట్ ఫాల్స్ను పూర్తిచేసి ఫైలును రీసబ్మిట్ చేయాలంటూ వచ్చిన మున్సిపాలిటీ నోటీసులు సదరు ఇంటి యజమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దానపత్రాలనూ రిజిస్టర్ చేయాలట..! ఇంటి నిర్మాణ సమయంలో భవిష్యత్లో అవసరమైతే రోడ్డు వెడల్పు కోసమని నిర్ణీత విస్తీర్ణంలోని స్థలాన్ని రూ.100 స్టాంపు పేపరుపై దానపత్రం రాసి, నోటరీ చేసిస్తే అప్రూవల్ ఇచ్చేవారు. ఇప్పుడా దానపత్రాలను బయటకు తీసి రిజిస్టరు చేసి ఇమ్మంటున్నారని ఒక గృహ యజమాని వాపోయారు. రైల్వేశాఖ స్థలానికి 100 మీటర్ల లోపు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే రైల్వేశాఖ నుంచి ఎన్ఓసీ తెచ్చుకునేవారు. కొత్త జీఓ ప్రకారం ఎన్ఓసీ రద్దుచేశారు. అప్పట్లో ఎన్ఓసీతో దరఖాస్తు చేసినవారిని, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయమంటున్నారని తెలిసింది. దరఖాస్తులో ఫోన్, ఆధార్ నంబర్లలో ఏదైనా అంకె తప్పు పడితే రద్దుచేసి, మళ్లీ రూ.3 వేల దరఖాస్తు ఫీజుతో రీసబ్మిట్ చేయాలంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులు షార్ట్ ఫాల్స్కు డబ్బులు చెల్లించాలని డిమాండ్ లేకుంటే చట్టప్రకారం చర్యలంటూ హెచ్చరిక దిక్కుతోచని స్థితిలో ఇళ్ల యజమానులు, ఎల్టీపీలు ఏడెనిమిదేళ్ల క్రితం వాటికి ఇప్పుడు నోటీసులా? ఏడెనిమిదేళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు నోటీసులు ఏంటని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఏవైనా షార్ట్ఫాల్స్ ఉంటే, అప్పుడే సంబంధిత మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి, తగిన చర్యలు తీసుకోకుండా ఇన్నేళ్ల తర్వాత నోటీసులు ఇవ్వటం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఇళ్లు అమ్మేసుకున్నారు... ఆయా ఇళ్లు చేతులు మారాయి. కుటుంబ సభ్యులు/వారసులకు బదలాయించినవి మరికొన్ని ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతుల దరఖాస్తుల్లో తమను బాధ్యులను చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ఎల్టీపీ/లైసెన్సుడ్ ఇంజినీర్లు ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అన్నిశాఖల అధికారులు చెక్ చేసుకుని, నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతులు ఇస్తారని, ఇంతకాలం తర్వాత ‘షార్ట్ఫాల్స్’ నోటీసులివ్వటం సమంజసం కాదంటున్నారు. -
చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం
క్రోసూరు: వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దూర విద్య వరం అని జిల్లా కో–ఆర్డినేటర్ ఎంఏ.హుస్సేన్ తెలిపారు. క్రోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం దూరవిద్య అడ్మిషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కో–ఆర్డినేటర్ చిల్కా సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్థులు పొందే సర్టిఫికెట్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెగ్యులర్ విద్యార్థులతో పాటు సమానమైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 24 సంవత్సరాలు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. చదవడం, రాయడంతో పాటు ఏదొక తరగతి టీసీ, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. ఇంటర్కు 10వ తరగతి మార్క్స్ సర్టిఫికెట్, టీసీ, బ్యాంకు అకౌంట్ కాపీ అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులు అయితే వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా ఈనెల 30 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని తెలియజేశారు. వివరాలకు పని వేళల్లో మండల రిసోర్సు కేంద్రంలో, సచివాలయాల్లో , మండల కో–ఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మీసేవ, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం రామాంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
19 నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20వ తేదీల్లో 52వ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్–11 నుంచి అన్ని విభాగాలతోపాటు మాస్టర్స్ విభాగంలో 35 + నుంచి 70 + వరకు పోటీలు ఉంటాయన్నారు. విజయాలు సాధించిన వారిని విభాగాలుగా రాష్ట్ర పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్ను శ్రీనివాసరావుతోపాటు రమేష్, వెంకటేశ్వరరావు, సతీష్ చంద్ర, రాము, రమేష్. కోచ్ బాషా ఆవిష్కరించారు. -
నా భార్య కారణంగానే చనిపోతున్నా..
సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది. -
బదిలీ అయిన ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు ముగిసిన 45 రోజుల తరువాత సైతం కొంత మంది ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని, వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల్లోని అసంబద్ధ అంశాలు తొలగించి, సవరణ ఉత్తర్వులు కోరుతూ అనేక మంది ఉపాధ్యాయులు పెట్టుకున్న గ్రీవెన్స్ను త్వరగా పరిష్కరించాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ మెగా పీటీఎం విట్నెస్పై ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి మరీ విద్యాశాఖాధికారులు సమాచారాన్ని సేకరించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎండీ షకీలా బేగం, టి.ఆంజనేయులు, కె.కేదార్నాథ్, కె.ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్తో భేటీ
కొరిటెపాడు: ‘లఘు ఉద్యోగ భారతి – ఆంధ్రప్రదేశ్’కు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కమిటీ ప్రతినిధులు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావును మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తులసి యోగీష్ చంద్ర, కోశాధికారి ధరణీష్, ఉపాధ్యక్షుడు కమల్ నయన్ భాంగ్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శి తోట రామకృష్ణ, ఈసీ సభ్యులు విఠల్ ప్రసాద్ కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరిస్తూ కమిటీ వినతిపత్రాన్ని సమర్పించింది. అధిక పారిశ్రామిక విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ శాఖల నుంచి ఆలస్యంగా చెల్లింపులు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, ఆర్థిక సహాయం పొందడంలో ఇబ్బందులు, మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్పై అధిక చార్జీలు ఉన్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు.. నూతన రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎం ఎస్ఎంఈల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం లఘు ఉద్యోగ భారతితో కలిసి పని చేయడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. -
భయంతోనే సర్పంచ్ హత్యకు ధూళిపాళ్ల కుట్ర
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని చూసి పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భయపడ్డారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. అందుకే మినీ మహానాడులో అంతమొందించాలని వ్యాఖ్యలు చేసి, ఆ మేరకు అమలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో అతి కిరాతకంగా సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగ మల్లేశ్వరరావును బుధవారం స్థానిక సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ పొన్నూరులో అంబటి మురళీకృష్ణకు ఓటింగ్ శాతం పెరగడాన్ని ధూళిపాళ్ల జీర్ణించుకోలేక పోయారన్నారు. నాగ మల్లేశ్వరరావుపై హత్యాయత్నం ఘటనలో గత్యంతరం లేక పోలీసులు కేసు పెట్టినట్లు ఉందని, రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి కాకుండానే కేసులో నిందితులుగా ఉన్న ఏ–4, ఏ–5 లను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో చార్జిషీట్ దాఖలు చేయకుండానే, ఎంకై ్వరీ జరగకుండానే పేర్లు తొలగించడం ఎక్కడా జరగలేదన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం... రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన బెట్టి.. నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగ మల్లేశ్వరరావుకు ప్రాణం మిగిలింది కాబట్టి హత్యాయత్నం అయిందని, అదే ప్రాణం పోయి ఉంటే హత్య అయ్యేదన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాటం చేయాలిగానీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని క్రూరమైన పాలన చూస్తున్నామని పేర్కొన్నారు. మినీ మహానాడులో వ్యాఖ్యలు అమలులో భాగంగానే సర్పంచ్పై పాశవిక దాడి వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపాటు మానవత్వం లేని వ్యక్తి నరేంద్ర కనీస మానవత్వం, దయ లేని వ్యక్తి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ధూళిపాళ్లేనని స్పష్టం చేశారు. హింసా రాజకీయాలకు బదులు చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. -
రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు శివసాకేత్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి 10వ జూనియర్స్ స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి కె.శివసాకేత్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు బుధవారం తెలిపారు. గుంటూరు శ్యామలానగర్లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఉమ్మడి గుంటూరుజిల్లా స్విమ్మింగ్ టీమ్ ఎంపిక పోటీల్లో శివసాకేత్ పాల్గొని 50, 100, 200 మీటర్లు బటర్ ఫ్లయి, 200, 400 మీటర్లు ఫ్రీ స్టయిల్ విభాగాలకు ఎంపికై నట్టు వివరించారు. విశాఖపట్నంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో శివసాకేత్ ఉమ్మడి గుంటూరుజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, కోచ్ జి.సురేష్, అధ్యాపకులు శివసాకేత్ను అభినందించారు. -
నకిలీ ధ్రువీకరణ పత్రంతో మోసం
పోలీసు కేసు నమోదు పెదకాకాని: ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రం తయారు చేసినట్లు మండలం పరిధి వెంగళరావునగర్కి చెందిన కూరాకుల వాసుదేవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూరాకుల సత్యనారాయణ, అనూష దంపతులపై మోసం, నకిలీ పత్రాల తయారీ కేసు నమోదు చేశారు. తమ ఇంటిని విక్రయిస్తామని సత్యనారాయణ దంపతులు చెప్పడంతో 2023లో రూ.15 లక్షలు వారికి ఇచ్చినట్లు వాసుదేవ్ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.18 లక్షల మొత్తాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించేందుకు ఒప్పందం జరిగింది. బ్యాంకు లోన్ కోసం సదరు ఇంటి సంబంధిత పత్రాలతో వాసుదేవ్ దరఖాస్తు చేసుకున్నప్పుడు సర్వే సర్టిఫికెట్ అవసరమైంది. సత్యనారాయణ ఇచ్చిన సర్టిఫికెట్ను నకిలీదిగా పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ తేల్చారు. సహదేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నల్ల బర్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి రైతూ పండించిన నల్లబర్లీ ఆకు మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్గా తేలప్రోలు రమేశ్, మరికొంతమంది సభ్యులుగా ప్రమాణీ స్వీకారం చేశారు. కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, ఎరిక్షన్బాబు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ, విజిలెన్స్ అధికారుల తనిఖీలు రేపల్లె: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైలవరం వ్యవసాయ సహాయ సంచాలకులు టి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల ఎదుట తప్పనిసరిగా స్టాక్ బోర్డును, ధరల పట్టిక వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. విత్తనాల నాణ్యతలో రాజీపడరాదని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదన్నారు. దుకాణాలలో స్టాక్కు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ సమాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి మోహన్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మహేష్బాబు, విస్తరణ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 90 రోజుల మధ్యవర్తిత్వ డ్రైవ్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్లో బుధవారం క్షక్షిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్యానెల్ అడ్వకేట్లు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు. మెడికల్ కాలేజీ రోడ్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ మీదుగా తిరిగి జిల్లా కోర్ట్ ప్రాంగణం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవగాహన సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రాజీపడదగిన అన్ని సివిల్, క్రిమినల్, భార్యాభర్తల వివాదాలు, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకొని కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఇన్సూరెనన్సు కంపెనీస్, చిట్ఫండ్ కంపెనీస్, ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్, ఇతర స్టేక్ హోల్డర్లకు మధ్యవర్తిత్వం వల్ల ఉపయోగాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై వారం రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.చక్రపాణి,.ఆర్.శరత్ బాబు, ఎ.వి.ఎల్.సత్యవతి, సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, వై.నాగరాజా, షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం, కె.నీలిమ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మీడియేషన్ అడ్వొకేట్లు, పారా లీగల్ వలంటీర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, చిట్ఫండ్ కంపెనీస్, ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషనన్స్, స్టేక్ హోల్డర్స్, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పర్వీన్
గుంటూరు ఎడ్యుకేషన్: బిహార్లో జరగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు టీజేపీఎస్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థిని కె. పర్వీన్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి తెలిపారు. పట్టాభిపురంలోని కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ నెల 12న నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీల్లో భాగంగా అండర్–17 విభాగంలో తృతీయ స్థానంలో నిలిచిన పర్వీన్.. 15న ఏఎన్యూలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, 100 మీటర్ల హార్డిల్స్లో ద్వితీయ స్థానం పొందినట్లు వివరించారు. త్వరలో బిహార్లో జరగనున్న జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణం అన్నారు. విద్యార్థినిని కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం అభినందించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, వ్యాయామ అధ్యాపకులు టి. వాసుదేవరావు, కోచ్ ఆర్.శివాజీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
తాడికొండ: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. నలుగురు మహిళలు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి అమరావతికి మ్యారేజ్ బ్యూరోకు సంబంధించిన నలుగురు మహిళలతో కారు వెళుతోంది. అమరావతి నుంచి గుంటూరు మరో కారు వస్తోంది. కళాజ్యోతి కార్యాలయం వద్దకు రాగానే ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొదటి కారు డ్రైవర్ విజయవాడ యనమలకుదురుకు చెందిన పి.నాగేశ్వరరావు (38) మృతి చెందాడు. నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో జీజీహెచ్కు తరలించారు. సీఐ వాసు, సిబ్బంది సహకారంతో నాగేశ్వరరావును మృతదేహాన్ని బయటకు తీశారు. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారంతా పెదకూరపాడు ఎమ్మెల్యేకు చెందిన బంధువులుగా సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.ఒకరు మృతి, నలుగురు మహిళలకు గాయాలు -
చరిత్రకు చిరునామా బాపట్ల వ్యవసాయ కళాశాల
బాపట్ల: చరిత్రకు చిరునామాగా బాపట్ల వ్యవసాయ కళాశాల నిలిచిపోయిందని నకాసా క్రాప్ సైన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగర్లమూడి చంద్రశేఖర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 80వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం కళాశాలలో నిర్వహించారు. జాగర్లమూడి మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాలుగా విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్న బాపట్ల వ్యవసాయ కళాశాల ఆదర్శనీయమైన పాత్రను నిర్వహిస్తుందన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఉభయ రాష్ట్రాలలో అనేక ఇతర వ్యవసాయ కళాశాలల ఆవిర్భావానికి స్ఫూర్తిదాయకమైందని అన్నారు. ఇక్కడ వ్యవసాయ విద్యార్థులకు బోధనా సిబ్బంది నేర్పించే నైపుణ్యాల ప్రభావమే ఇందుకు దోహద పడిందన్నారు. పట్టభద్రులైన అనంతరం కేవలం ఉద్యోగ సముపార్జనే దృష్టిగా భావించకుండా పలు వ్యవసాయ పరిశ్రమలను స్థాపించే దిశగా పట్టభద్రులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉద్యోగతను కల్పించేందుకు సరికొత్త వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి మాట్లాడుతూ ప్రపంచ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే బీజం పడిందని, దేశ దేశాలలో తమ వ్యవసాయ సాంకేతిక ప్రతిభను చాటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులుగా ఇక్కడి విద్యార్థులు నిలిచారని పేర్కొన్నారు. జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తుషారకు ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు బంగారు పతకాన్ని బహూకరించారు. డాక్టర్ బాలినేని వెంకటేశ్వర్లు, బాలినేని స్వరూపరాణిలు డి.మంజూషకు వెండి పతకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో పలువురు పూర్వ అసోసియేట్ డీన్లను సత్కరించారు. -
కన్న కొడుకునే కడతేర్చాడు
● ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన వైనం ● కుమారుడి అదృశ్యంపై మృతుడి పిన్ని ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన ● విచారణలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు ● 2014లో తల్లిని, తండ్రిని చంపిన దుర్మార్గుడు ● విషయం తెలిసి తీవ్ర కోపోద్రిక్తులైన క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామస్తులు క్రోసూరు: తాను సొంతంగా జీవించేందుకు, మేపుకొనేందుకు జీవాల్లో వాటా అడిగిన కుమారుడిని కన్న తండ్రే కడతేర్చిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన బూక్యా వెంకటేశ్వర్లు నాయక్, కుమారుడు మంగ్యానాయక్(19)లు జీవాలు మేపుతూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో మూడు నెలల క్రితం క్రోసూరు మండలంలోని యర్రబాలెం గ్రామానికి జీవాలు మేపుకొంటూ వలస వచ్చారు. అయితే ఈనెల 3వ తేదీ నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని నిందితుడి రెండో భార్య, మృతుడి పిన్ని ప్రమీలాభాయి ఈనెల 12వ తేదీన క్రోసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తపైనే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తన కుమారుడిని తానే చంపినట్లు వెంకటేశ్వర్లు నాయక్ అంగీకరించాడు. ఈనెల 3వ తేదీ రాత్రి జీవాల్లో వాటా అడిగినందుకు కొట్టి చంపి, ముక్కలు చేసి, పూడ్చిపెట్టినట్లు ఒప్పుకొన్నాడు. మృతదేహం పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. కోపోద్రిక్తులైన స్థానికులు సీఐ పి.సురేష్, తహసీల్దార్ వీవీ నాగరాజు సమక్షంలో మంగ్యానాయక్ మృతదేహాన్ని పంచానామా చేసేందుకు వెలికి తీశారు. అన్నెంపున్నెం ఎరుగని కుమారుడిని చంపడంపై క్రోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు, పుట్లగూడెం నుంచి వచ్చిన బంధువులు నిందితుడ్ని వదిలిపెట్టకూడదని తమకు అప్పగిస్తే తామే శిక్ష వేస్తామని నిందితుడిని పోలీసుల దగర్గనుంచి లాక్కునే యత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజల్ని తరిమివేసి నిందితుడిని పోలీసుస్టేషన్ తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జీవాల్లో వాటా అడిగినందుకు కొడుకును చంపిన తండ్రి కన్న తల్లిదండ్రులను చంపిన కసాయి విచారిస్తున్న క్రమంలో క్రోసూరు పోలీసులకు మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వెంకటేశ్వర్లు నాయక్ క్రూర నేర చరిత్ర బయల్పడింది. 2014 సంవత్సరంలో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపిన కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడని తేలింది. అనంతరం తన తండ్రిని సైతం హతమార్చడని, కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడని.. తన 3 నెలల కుమారుడిని సైతం చంపివేసిన కేసులో కూడా ఉన్నప్పటికీ సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని నిందితుడి మొదటిభార్య, మృతుడి తల్లి కోటేశ్వరీభాయి, గ్రామస్తులు సంఘటనా స్థలంలో మీడియాకు వివరించారు. అచ్చంపేట సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్ఐ రవిబాబు కేసును విచారిస్తున్నారు. -
పసుపు విత్తనం నాటడం ఇక తేలిక
కొల్లిపర: మండలంలో తొలిసారిగా బొమ్ము వేణుగోపాలరెడ్డి అనే యువ రైతు పసుపు విత్తనం నాటే యంత్రం(టర్మరిక్ ప్లాంటర్) కొనుగోలు చేసి దాని ద్వారా ముగ్గురు కూలీలతో అతి తక్కువ ఖర్చుతో పసుపు విత్తనం నాటటం ప్రారంభించాడు. యంత్రాన్ని ముందుగా ట్రాక్టర్కు అనుసంధానం చేయాలి. పై భాగాన ఉన్న కంటైనర్లో 300 కేజీలు దాకా పసుపు కొమ్ములు వేయాలి. యంత్రానికి ఇరువైపులా ఇద్దరు కూలీలను ఉంచాలి. ట్రాక్టర్ కదలగానే దానికి అనుగుణంగా చైన్ తిరుగుతుంది. ఈ క్రమంలో బాక్స్లో ఉన్న పసుపు కొమ్ములను కూలీలు యంత్రానికి అమర్చిన చిన్న చిన్న కప్పుల్లోకి ఒకటి రెండు ఉంచటం వల్ల అవి కిందకు వెళుతుంటాయి. అక్కడ రెండువైపులా ఉండే గొట్టాలు మట్టిలో నాలుగు అంగుళాల లోతులో బెజ్జం పెడతాయి. వెంటనే గిన్నెలోంచి దిగువకు వచ్చే విత్తనం గొట్టంలో నుంచి నేరుగా అదే బెజ్జంలోకి పడిపోతుంది. ఆ తర్వాత అడుగున ఉండే రేకు విత్తనంపై మట్టిని కప్పేస్తుంది. ఆ విధంగా ట్రాక్టర్కు అనుసంధానం చేసిన టర్మరిక్ ప్లాంటర్ సహాయంతో ఎత్తు మడులపై పసుపు విత్తనాన్ని నాటవచ్చు. కొమ్ములను నిర్ణీత దూరంలో క్రమపద్ధతిలో విత్తటం వల్ల పైరుకు ఎదిగిన తరువాత గాలీ, వెలుతురు ధారాళంగా అందుతుంది. దీంతో వర్షాలు ఎక్కువ కురిసినా, నీరు నిలబడినా పంటకు ఇబ్బంది ఉండదు. యంత్రం ద్వారా తక్కువ సమయంలో తక్కువ కూలీలతో పసుపును నాటవచ్చు. ఎకరానికి రూ.7వేలు వసూలు యంత్రం ద్వారా ఎకరానికి నాలుగు పుట్టు (పుట్టు విత్తనం 225 కేజీలు) విత్తనం కొనుగోలు చేయాలి. తరువాత ఒక కొమ్మును రెండుగా చేసుకోవాలి. ఆ తర్వాత ముగ్గురు కూలీలతో రెండు గంటల్లోపు ఎకరంలో పసుపు విత్తనం నాటవచ్చు. దీంతో రైతుకు విత్తనం కొనుగోలులో మూడు పుట్టు తగ్గటంతో పాటు కూలీల వ్యయం కూడా తగ్గుతుంది. రోజుకు నాలుగు ఎకరాలల్లో విత్తనం నాటొచ్చు. ప్రస్తుతం ఎకరానికి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అందుబాటులోకి యంత్రం ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40వేల వరకు తగ్గుతున్న ఖర్చు -
జీడీసీఏ జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ చౌదరి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(జీడీసీఏ) నూతన అధ్యక్షుడిగా చుక్కపల్లి రాకేష్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జీడీసీఏ ఉపాధ్యక్షుడు తోట వెంకట శివ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా వెంకటరత్నం వ్యవహరించారన్నారు. కార్యదర్శిగా ఎనుముల శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కొంగర రాహుల్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా తోట వెంకట శివరామకృష్ణ, కోశాధికారిగా సింగరాజు లక్ష్మీకాంత్, కౌన్సిలర్గా నందిరాజు శివ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల భిక్షాటన
బాపట్ల: మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో కార్మికులు పట్టణంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె నిర్మించేది లేదని సీఐటీయూ నాయకులు మజుందార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాత్కాలికంగా ప్రైవేటు వర్కర్లతో పనులు చేయించుకున్నప్పటికీ అది శాశ్వత పరిష్కారం కాదన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు సమ్మెబాట వీడేది లేదన్నారు. -
కార్పొరేట్ హాస్టళ్లలో తనిఖీలు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేట్ జూనియర్ కళాశాలలు నడుపుతున్న హాస్టల్ క్యాంపస్లలో అధ్వాన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు శివారు రెడ్డిపాలెంలోని శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్ జూనియర్ కళాశాలలకు చెందిన హాస్టళ్లను ఆమె విద్యాశాఖాధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. రెడ్డిపాలెంలోని శ్రీచైతన్య పాఠశాలలో డైనింగ్హాలు, టాయిలెట్లు, హాజరు పట్టికలను పరిశీలించారు. అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ, గాలి, వెలుతురు లేకపోవడం, తగిన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో బోధన, టాయిలెట్ల అపరిశుభ్రత, ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించకపోవడం చూసి పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ● నాలుగు అంతస్తుల భవనంలో వందలాది మంది విద్యార్థులను ఉంచడంతో పాటు సెల్లార్లో స్టడీ అవర్స్ నిర్వహించడంపై పాఠశాల ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందించడంతో పాటు అనేక లోపాలను గుర్తించారు. బాలల రక్షణ, సంరక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాల్లో పేర్కొన్న నిబంధనలేవీ పాటించకపోవడాన్ని గుర్తించిన పద్మావతి, తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని, లేని పక్షంలో కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ● కళాశాల, పాఠశాల హాస్టల్ క్యాంపస్లలో ఫిర్యాదుల బాక్సులు లేకపోవడం, విద్యార్థినులు నివశిస్తున్న గదుల్లోనే వస్త్రాలను ఆరబెట్టుకోవడం, ఒక్కో గదిలో 20 మంది విద్యార్థినులు ఉండటాన్ని గమనించారు. రన్నింగ్ వాటర్ లేకపోవడంతో పాటు కళాశాలలో హెల్ప్లైన్ నంబరు సైతం లేకపోవడం, ఆయా కళాశాలల హాస్టళ్లకు అనుమతులు ఏ విధంగా ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆమె వెంట ఆర్ఐఓ జి.సునీత, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి.ప్రసన్న, అర్బన్ సీడీపీఓ జి.అరుణ, న్యాయ, పర్యవేక్షణాధికారి బి.వాసంతి, డీవైఈఓ జి.ఏసురత్నం, ఎంఈఓలు అబ్దుల్ ఖుద్దూస్, జ్యోతి కిరణ్, నాగేంద్రమ్మ, పి.నీలిమ పాల్గొన్నారు. బహుళ అంతస్తుల భవనాలు, సెల్లార్లలో తరగతులు, మురికి టాయిలెట్లు, అధ్వాన డైనింగ్ హాళ్లు నిర్వాహకులపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి ఆగ్రహం కనీస వసతులు లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంపై మండిపాటు -
23 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
గుంటూరు వెస్ట్: గృహావసరాలకు వాడుకోవాల్సిన గ్యాస్ సిలిండర్లను వ్యాపారం కోసం వాడుకుంటున్నారన్న వచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ అధికారులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించి 23 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కళ్యాణి టిఫిన్స్, వినాయక టిఫిన్స్, సత్య నాగా టిఫిన్స్ నుంచి ఈ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేశామని సివిల్ సప్లయీస్ డీటీ బేగ్ తెలిపారు. 22న మెగా జాబ్మేళా గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న బ్రాడీపేట 3వ లైనులోని మాస్టర్మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సంజీవరావు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఈనెల 22న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. 20కి పైగా కంపెనీలు పాల్గొంటున్న జాబ్మేళాలో 679 ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. వివరాలకు తమ ప్రతినిధులు వెంకట్ అల్లూరి (89195 08017), షేక్ ఎండీ రఫీ (88860 65546), ఎ.రామకృష్ణారెడ్డి (77319 82861) నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
23,24 తేదీల్లో భవన నిర్మాణ సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఈనెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. గత ఏడు సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పనిచేయకపోవడం వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని చర్చించి భవిష్యత్ ప్రణాళికను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వారిని అవమానించడమేనన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.కోటేశ్వరరావు, నగర తూర్పు, పశ్చిమ కమిటీల కార్యదర్శులు దీవెనరావు, ఎస్.కె.ఖాసీం వలి, దూదేకుల మస్తాన్ వలి, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు సీతారామయ్య, బోయపాటి అక్కారావు, నికల్సన్, విమల్, తదితరులు పాల్గొన్నారు. -
556.60 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 556.60 అడుగులకు చేరింది. ఇది 224.5548 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,650 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 64,789 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ‘స్థానిక’ పరిపాలనలో మహిళా భాగస్వామ్యం పెరగాలి జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్ : స్థానిక సంస్థల పరిపాలనలో మహిళా భాగస్వామ్యం పెరగాలని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ‘‘మహిళా నాయకత్వంలో మార్పు–స్థానిక స్వపరిపాలనలో సాధికారత’’ అనే అంశంపై మహిళా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) వార్షిక ప్రణాళిక 2025–26లో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ మహిళా నాయకత్వంలో మార్పు ద్వారా స్థానిక పాలనలో స్వపరిపాలన సాధ్యపడుతుందని అన్నారు. గ్రామస్థాయిలో మహిళా ప్రజా ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సూచించారు. అమృత భారత్ పనుల పరిశీలన నరసరావుపేట: గుంటూరు–హుబ్లీ మార్గంలోని నరసరావుపేట, వినుకొండ, దొనకొండ రైల్వే స్టేషన్లను మంగళవారం డీఆర్ఎం సుథేష్ట సేన్ తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో అమృత భారత్ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.రమేష్కుమార్, డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎంఏ నోయల్, గుంటూరు సీనియర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, గుంటూరు సీనియర్ డీసీఎం డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. ఈద్గా స్థలం కోసం క్షేత్రస్థాయి పరిశీలన యడ్లపాడు: ఈద్గా స్థలం కేటాయింపునకు సంబంధించి ముస్లిం ప్రతినిధులు చేసిన వినతిని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆర్డీఓ మధులత కోట గ్రామాన్ని సందర్శించారు. మంగళవారం స్థానికంగా ఉన్న ప్రతిపాదిత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈద్గా కోసం అభ్యర్థించిన స్థలం మొత్తం 51 సెంట్లు ఉందని, ఇది రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో, మూడు సర్వే నంబర్లలో విస్తరించి ఉందన్నారు. అందులో కొంత భాగం స్మశానం, కాలువ, ఖాళీ భూమిగా ఉందన్నారు. స్థానికుల వినతిని దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, సర్వేయర్ సురేంద్రనాథ్, ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో బాబురావు ఉన్నారు. ఢిల్లీ వెళ్లిన మేయర్, కమిషనర్ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డ్ను ఈ నెల 17న ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అవార్డును అందుకునేందుకు మంగళవారం రాత్రి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఢిల్లీ పయనమయ్యారు. -
తాగునీటికి కటకట
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్తో ఈ నెల 13వ తేదీ నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాపై స్పష్టంగా కనిపిస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలో హెడ్ వాటర్ వర్క్(తక్కెళ్లపాడు), ఉండవల్లిలో పనిచేసే ఇంజినీరింగ్ విభాగం అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు గైర్హాజరవడంతో నగరంలో తీవ్ర తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. గుంటూరు నగరానికి కృష్ణా నది నుంచి రా వాటర్ ఉండవల్లి పంపింగ్ హౌస్ నుంచి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్కు వస్తుంటుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన తరువాత గుంటూరు నగరంలో 64 వాటర్ ట్యాంకులకు సరఫరా అవుతాయి. దీంతో పాటు సంగం జాగర్లమూడి నుంచి గుంటూరుకు తాగునీరు సరఫరా అవుతుంది. ప్రధానంగా కృష్ణా నది నుంచి గుంటూరుకు 135 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే), సంగం జాగర్లమూడి నుంచి సుమారు 20 ఎంఎల్డీ నగరానికి సరఫరా అవుతుంది. కృష్ణా నది నుంచి వచ్చిన రా వాటర్ను తక్కెళ్లపాడులో కార్మికులు ఫిల్టరైజేషన్ ద్వారా శుద్ధీకరిస్తుంటారు. అయితే కార్మికుల గైర్హాజరీతో లేక ఫిల్టరైజేషన్కు, సరఫరాకు గండిపడింది. ప్రైవేట్ వ్యక్తులతో విధులు.. కాలిపోయిన మోటార్లు కార్మికుల సమ్మె కారణంగా నగరపాలక సంస్థ అధికారులు రూ.వెయ్యి నుంచి 1500 చొప్పున ఇచ్చి ప్రైవేట్ వర్కర్లను విధుల్లోకి తీసుకుని వాటర్ పంపింగ్ జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీరికి సరైన అవగాహన లేకపోవడంతో పంపింగ్ సమయంలో వేయాల్సిన మోటార్లు కాకుండా వేరే మోటార్లును ఆన్ చేయడం ద్వారా మోటార్లు కాలిపోయే పరిస్థితి నెలకొంది. సగమే సరఫరా దీంతో పాటు నగరానికి రావాల్సిన 150 ఎంఎల్డీలో కేవలం 70 నుంచి 80 ఎంఎల్డీ మాత్రమే తాగునీరు వస్తోంది. నెహ్రూనగర్ వాటర్ ట్యాంకుల వద్ద 24 గంటలు మోటార్లు రన్ అయితేనే పశ్చిమ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నెహ్రూనగర్ వాటర్ ట్యాంకులకు ఆశించిన స్థాయిలో తాగునీరు రాకపోవడంతో 24 గంటలు రన్ అవ్వాల్సిన మోటార్లు..ఆగి ఆగి 10 గంటలు కూడా రన్కాని పరిస్థితి నెలకొంది. దీంతో పశ్చిమ ప్రజల గొంతు ఎండుతోంది. పరిష్కారం చూపాలి మాకు గత రెండు రోజులుగా తాగునీరు సక్రమంగా రావడం లేదు. దీంతో చేసేదేమి లేక మినరల్ వాటర్ కొనుక్కొని ఇంటిలో అవసరాలను తీర్చుకుంటున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి. – సాయి కిరణ్, రాజీవ్గాంధీనగర్ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కార్మికుల సమ్మె వలన నగరంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవ్వకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ని పరిశీలించారు. కార్మికుల సమ్మె వలన తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఇంజినీరింగ్ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలన్నారు. ఉండవల్లి నుంచి నీటి సరఫరాకు, ఫిల్టరైజేషన్కు సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. సమ్మె పభ్రావం.. నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం -
భూ మాయ చేశాడు!
● తాడికొండలో ఖాళీ స్థలాలు, సామాజిక స్థలాలకు తప్పడు బీ ఫారాలు సృష్టించి అక్రమ అమ్మకాలు ● తమ కుటుంబ సభ్యుల పేరిట కూడా నకిలీ పత్రాలు సృష్టించి గృహ నిర్మాణ పథకానికి దరఖాస్తు ● విషయం బయటకు పొక్కడంతో నకిలీ పత్రాలను బయటకు రాకుండా చూసేందుకు యత్నాలు ● రూ.5.50 లక్షలు ఒకే కుటుంబంలో టోపీ పెట్టడంతో నగదు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ ● స్టాంపులు, వీఆర్వో రిపోర్టు, అధికారుల సంతకాలు, తహసీల్దార్ సంతకం సహా అన్నీ ఫోర్జరీ ● తమకు సంబంధం లేదని చేతులెత్తేసిన రెవెన్యూ అధికారులు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ తాడికొండ: రాజధానిలో భూముల ధరలకు రెక్కలొచ్చి పడ్డాయి. ఎకరం రూ.కోట్లు పలుకుతుంటే సెంటు భూమి దొరికితే చాలు జీవితాంతం చిన్నపాటి రేకుల షెడ్డు అయినా వేసుకొని బతికేద్దామని ఆశపడుతున్న పేదవాడి కష్టాన్ని దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేసి దానిని అమలు చేశాడు ఓ ప్రధాన పత్రిక విలేకరి (సాక్షి కాదు). అనుకున్నదే తడవుగా తనకు రెవెన్యూ శాఖలో అంతా గుప్పెట్లో ఉందని, మీకు భూమి ఇప్పించే బాధ్యత తనదే అంటూ ప్రగల్భాలు పలికాడు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న ఓ పేద కుటుంబానికి వల విసిరి తీరా నిజం బయటకు పొక్కే సరికి తనకేం సంబంధం లేదంటూ చేతులెత్తేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ తంతు తాడికొండలో జరిగింది. నకిలీ బీఫారాలు అంటగట్టి.. ఆ విలేకరి తనదైన శైలిలో భూ దందాకు తెరలేపి ప్రభుత్వం కేటాయించిన లే అవుట్లలో మిగిలిన ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో ఆరా తీసి రెవెన్యూ అధికారుల నుంచి మీకు స్థలం ఇప్పిస్తానంటూ ముందుగా ఆ స్థలాలను బాధితులకు చూపించాడు. రాజధాని ప్రాంతంలో తమకూ జాగా వస్తుందంటూ ఆశపడిన పలువురు ఇతని వలలో పడ్డారు. పేరు బయటకు చెప్పేందుకు ఇష్టపడని ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలకు రెండు నకిలీ బీ ఫారాలు సృష్టించి అంటగట్టి ఇదే మీ స్థలమంటూ ప్రైవేటు సర్వేయర్తో కొలతలు వేయించి అప్పజెప్పి రూ.5.50 లక్షల నగదు తీసుకున్నాడు. ● ఇదేదో బాగుందనుకున్న ఆ రిపోర్టర్ చెంచు కాలనీలో సైతం సామాజిక స్థలాలను ఆక్రమించేందుకు తనదైన శైలిలో పథకం వేసి నకిలీ బీ ఫారాలను సృష్టించి రెవెన్యూ స్టాంపులను సైతం వేసి గ్రీన్ కలర్ ఇంకుతో సంతకాలు చేసి మరీ బేరసారాలు మొదలు పెట్టాడు. అయితే అది సామాజిక స్థలాలు కావడంతో కొలతలు వేసేందుకు వెళ్లిన ప్రైవేటు సర్వేయర్లను స్థానికులు నిలదీయడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. ● తన కుటుంబ సభ్యులకు సైతం సామాజిక స్థలాల్లో నకిలీ బీ ఫారాలు సృష్టించి గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేశాడు. అయితే అప్పటికే ఈ వ్యవహారం గుట్టు రట్టవడంతో సదరు కాగితాలు బయటకు రాకుండా చూసుకున్నాడు. ఈ వ్యవహారం గ్రామంలో ఆ నోటా ఈ నోటా రావడంతో నకిలీ బీ ఫారాలతో స్థలాలు అమ్మకాలు జరిపిన వ్యవహారం బయటకు పొక్కి బాధితులు తమ నగదు తమకు తిరిగిచ్చేయాలని కోరడంతో తనకేం సంబంధం లేదు.. నాకేం తెలియదు అంటూ బుకాయించడం మొదలు పెట్టాడు. ఫిర్యాదుకు రంగం సిద్ధం పేద కుటుంబాలకు ఏదో న్యాయం చేస్తాడని మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులకు ఇది తలనొప్పిగా మారడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో తాను అన్ని పనులు చేయిస్తానని కొంతమంది అధికారులతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో తాము నమ్మామని ఇలా మా కొంప ముంచుతాడని బాధితులు వాపోతున్నారు. తమపేరు బయటకు వస్తే ఎక్కడ బెదిరింపులకు గురిచేస్తారో అనే ఆందోళనతో బాధితులు సొమ్ము పోయి శనిపట్టిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధిత పత్రికా యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. నకిలీ పత్రాల వ్యవహారం ఇంతటితోనే ఆగిందా లేక ఇంకా ఏదైనా తప్పుడు పత్రాలు సృష్టించి మాఫియా చేశాడా అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత రెవెన్యూ అధికారులు ఇకనైనా దృష్టి సారించి నకిలీ పత్రాలతో పేదలను మోసం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నకిలీ బీ ఫారాలతో ఓ పత్రికా విలేకరి భూ దందా తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. దీనిపై తహసీల్దార్ మెహర్ కుమార్ను వివరణ కోరగా బయటి వ్యక్తులు మోసం చేసేందుకు రకరకాల తప్పులు చేస్తుంటారని, వాటితో మాకు సంబంధం లేదన్నారు. రికార్డుల్లో లేకుండా ఎవరైనా తప్పులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరి విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని, వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఇద్దరికి తీవ్రగాయాలు గుంటూరు రూరల్: అధికార దాహం ఒక పక్క, అందినకాడికి దోచుకోవాలనే కాంక్ష మరో పక్క.. వెరసి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చౌడవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చౌడవరం గ్రామంలో టీడీపీ రాష్ట్ర మీడియా కో–ఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జరిగాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం తాగి పాత కక్షలను గుర్తు చేసుకుని ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. గ్రామానికి చెందిన యడ్లపల్లి మణికంఠ, అతని స్నేహితుడు తూర్పుగోదావరి జిల్లా వాసి కాట్రగడ్డ ధర్మతేజ అలియాస్ టింకు అనే వ్యక్తి వారి అనుచరులతో ఈదులపాలెంకు చెందిన ఇమ్మెల శరత్ బాబును, అతని సోదరుడు ఎమ్మెల్యే రామస్వామిని కుర్చీలతో, రాళ్లతో తీవ్రంగా గాయపరిచారు. గతంలో శరత్బాబుకు, మణికంఠకు అక్రమ మైనింగ్ విషయంలో గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు. పాత కక్షలు మనసులో పెట్టుకొని తమను చంపటానికి ప్రయత్నం చేశారని శరత్బాబు తమ బంధువులకు తెలిపారని తెలిసింది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితుడు శరత్బాబు కోరుతున్నారు. -
హోం మంత్రి ఏం చేస్తున్నారు?
దళితులపై వరుస దాడులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): దళిత వర్గాలపై మూకుమ్మడి దాడులు జరుగుతుంటే... దళిత హోంశాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడులపై హోం మంత్రి స్పందించాలని, వాటిని ఖండించకపోతే దళిత జాతి క్షమించదన్నారు. దాడులకు గురైన దళితులను పరామర్శించే సమయం కూడా లేదా అని ధ్వజమెత్తారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరావును చూసేందుకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి గుంటూ రు వచ్చారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి, నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దళితులంటే టీడీపీ నేతలకు చిన్నచూపు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గతంలోనూ... ఇప్పుడు రౌడీ రాజకీయాలు మానుకోలేదని ధ్వజమెత్తారు. అసలు దళితులంటేనే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిన్నచూపని, దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక పొన్నూరు నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న నాగమల్లేశ్వరరావును ధైర్యంగా ఎదుర్కోలేక అంతం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. గత 13 రోజులుగా నాగమల్లేశ్వరరావు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. కూటమి ప్రభుత్వంలోని ఏ మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించకపోవటం సిగ్గుచేటన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని తెలిపారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు పరామర్శ నరేంద్రను ఏ1గా చేర్చాలి వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, నాగమల్లేశ్వరావుపై దాడిని చేయించటమే కాకుండా, ఆయన ప్రాణాల కోసం పోరాడుతుంటే.. ఏదో చిన్న ఘటనను పట్టుకుని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనలో నరేంద్రను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు. -
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
తాడేపల్లి రూరల్: రాజధానిలో మట్టి మాఫియా చెలరేగుతోంది. అర్ధరాత్రి దొరికిన చోటల్లా తవ్వకాలు చేస్తున్నారు. బహిరంగా మార్కెట్లో అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, మందడంలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి మాఫియా చెలరేగిపోయింది. ఒక్కో ప్రాంతంలో లోడింగ్ చేయడానికి రెండు నుంచి ఐదు జేసీబీలు, మట్టి తవ్వేందుకు భారీ పొక్లయిన్లు వినియోగించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు యథేచ్ఛగా తవ్వకాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి నెలా మామూళ్లు మంత్రి అండదండలు ఉన్న మాజీ ప్రజాప్రతినిధి భర్త ప్రతి నెలా పోలీసులకు, సీఆర్డీఏ అధికారులకు లక్షలాది రూపాయలు ఇస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిని కాపాడాల్సిన వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎవరైనా మట్టి తవ్వుకుంటే రాజధానికి భూములిస్తే గుంతల మయం చేస్తారా ? అంటూ విలేకరుల సమావేశం పెట్టిన మాట్లాడిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సీఆర్డీఏ అధికారులు, పోలీసులు మట్టి మాఫియాపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో రాజధాని గుంతలమయం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణాయపాలెం వద్ద మట్టి మాఫియా పార్కింగ్ చేసిన పొక్లయిన్ న్యూస్రీల్ రాజధానిలో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు 50 నుంచి 100 లారీల్లో తరలింపు లారీ రూ.15 వేలకు అమ్మకం పలు ప్రాంతాల్లో పొక్లెయిన్ల పార్కింగ్ పట్టించుకోని సీఆర్డీఎ అధికారులు గతంలో రాజధానిలో గుంతలు పెడుతున్నారని ఆరోపించిన వారే సూత్రధారులు పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామంటూ బహిరంగ వ్యాఖ్యలు మంగళగిరి చుట్టుపక్కల జరుగుతున్న మట్టి మాఫియాకు మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరి అనుచరుడు, యర్రబాలేనికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులను, సీఆర్డీఏ అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నాడు. ఒక్క రాత్రిలోనే పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 జేసీబీలు, ఐదు పొక్లెయిన్లు, 50 నుంచి 100 వరకు టెన్ టైర్లు టిప్పర్లను ఉపయోగిస్తున్నాడు. పగటిపూట ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటుంటే వారికి ఏ రకమైన మట్టి కావాలో అడిగి, రాజధాని ప్రాంతంలో దాన్ని తవ్వి అందజేస్తున్నారు. ఒక లారీకి రూ. 10వేల నుంచి రూ. 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు ఐదు ప్రాంతాల్లో జరిగే ఈ తవ్వకాల్లో ఒక్కొక్క లారీతో 5 నుంచి 10 ట్రిప్పుల వరకు మట్టిని బయటకు తరలిస్తున్నట్లు కొంతమంది లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. -
బదిలీల్లో బేరసారాలు
● గాలిలో సచివాలయ మహిళా పోలీసుల బదిలీలు ● 107 మందికి ఇంకా దక్కని పోస్టింగ్లు ● ముడుపులు, పలుకుబడి ఉన్న వారికే అర్బన్ పోస్టింగ్లు ● సిఫార్సు లేఖలు తెచ్చుకోవాలంటూ అధికారుల ఉచిత సలహాలు ● ఆగమ్యగోచరంగా మహిళా పోలీసుల భవితవ్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళలకు ఏదైనా సమస్య వస్తే ముందు పోలీస్ శాఖ రక్షణగా ఉంటుంది. అటువంటిది తన శాఖలోనే పని చేస్తున్న సచివాలయ మహిళా పోలీసులకే అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ నిలుస్తుంది. అయిదేళ్లు పూర్తయిన వారికి సాధారణ బదిలీల్లో భాగంగా సచివాలయ ఉద్యోగులకు కూడా గత నెలలో నిర్వహించారు. అయితే, మహిళా పోలీసులకు మాత్రం గత నెల 27, 29వ తేదీల్లో దరఖాస్తు మీద ఐదు ఆప్షన్లు తీసుకుని పంపించేశారు. దీనికి సంబంధించి ఈ నెల 7వ తేదీ రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 107 మందికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఉత్తర్వులు చూసి కంగుతిన్న మహిళా పోలీసులు గుంటూరు ఎస్పీ, పల్నాడు ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ను కలిసి సమస్యను విన్నవించినప్పటికి ఫలితం శూన్యం. జాబితాలో 107 మంది పేర్లు గల్లంతు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,100 మంది మహిళా పోలీసులు పని చేస్తున్నారు. 2019లో వచ్చిన మార్కులు, ర్యాంక్, టెక్నికల్ విద్యార్హతలను బట్టి అందరికీ ఆమోదయోగ్యంగా సచివాలయంలో పోస్టింగ్ కల్పించారు. ప్రస్తుతం ఐదేళ్లు పూర్తి కావడంతో సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎక్కడికై నా బదిలీలు చేపట్టారు పోలీస్ అధికారులు. అయితే, ఇందులో రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలకు, ముడుపులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సచివాలయం కేటాయింపు జరిగిందని పలువురు మహిళా పోలీసులు ఆరోపిస్తున్నారు. 1100 మంది ఆప్షన్స్ ఇచ్చారని..ఇందులో 120 మంది మహిళా పోలీసులు రిక్వస్ట్ ట్రాన్స్ఫర్స్(స్పౌజ్, మెడికల్) కింద దరఖాస్తు చేసుకున్నారని, నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు 107 మందికి పోస్టింగ్ ఎందుకు కల్పించలేదని నిలదీస్తున్నారు. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయ సిబ్బందిని కలిస్తే బదిలీల లిస్ట్లో పేర్లు కనిపించడం లేదని తీరికగా సమాధానం చెప్పడంతో మౌనంగా వెనుతిరిగారు. పల్నాడు ఎస్పీ సీసీ, కంప్యూటర్ ఆపరేటర్దే హవా? ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ అంతా కూడా గుంటూరు జిల్లా నుంచే జరుగుతుంది. కానీ మహిళా పోలీసు బదిలీ ప్రక్రియ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పల్నాడు ఎస్పీ కార్యాలయానికి అప్పగించారు. ఇందులో కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయ సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు హవా కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకులు సిఫార్సు లేఖలు తెచ్చిన వారికి, ముడుపులు సమర్పించుకున్న వారికి ఎక్సెల్ షీట్లో సచివాలయాలను బ్లాక్ చేసుకుని పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముడుపులు, రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలు ఇవ్వని వారిని దూరంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయాలకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్ కావాలంటే లక్ష సమర్పించుకోవాల్సిందే? 107 మందికి పోస్టింగ్ రాకపోవడంతో గత నాలుగు రోజులుగా పల్నాడు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘‘మీకు పోస్ట్ రాకపోతే మాకు సంబంధం లేదు..రెండు నెలలైనా జీతాలు రాకపోవచ్చు..మీ పోస్ట్ హోల్డ్లో పడింద’’ని చెప్పడంతో కంగుతిన్నారు. ఒక్కొక్కరిని కార్యాలయం లోపలికి పిలిచి, ఫోన్లు తీసుకుని మరీ మహిళా పోలీసులతో పోస్టింగ్లపై పల్నాడు ఎస్పీ కార్యాలయ సిబ్బంది బేరసారాలు నడిపారని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలంటే రూ.60వేలు సమర్పించుకోవాలని..అదే అర్బన్ లిమిట్స్లో అయితే రూ.లక్ష వరకు సమర్పించుకోవాలని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అంత డబ్బులు ఉంటే మొదటి లిస్ట్లో పోస్టింగ్ తెప్పించుకునే వారమని వారు వాపోయారు. తమకు అన్యాయం చేస్తే కోర్టును ఆశ్రయించేందుకు మహిళా పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. -
పోలీసుల ‘పచ్చ’పాతంపై నిరసన
నగరంపాలెం: వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు ఏ చిన్న ఫిర్యాదు చేసినా కేసులు నమోదు, అరెస్ట్లు చేయడం, జైళ్లకు పంపించడం వెంటనే జరుగుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. టీడీపీ మూకలపై వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తే కూటమి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గాంధీ మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్లకార్డులతో నిరసనకు దిగారు. నల్ల దుస్తులు ధరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన’ అనే ప్లకార్డు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి ‘సత్యమేవ జయతే’ అనే ప్లకార్డుతో గంటసేపు నిలువు కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నేతలు సైతం అదే బాట పట్టారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ పట్టాభిపురం పీఎస్లో గతేడాది డిసెంబర్ 12న సీమరాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్, తనపై, పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అనరాని మాటలు అన్నాడని, పచ్చి బూతులు తిడుతున్నాడని ఆధారాల సహా ఫిర్యాదు చేశానని తెలిపారు. కేసులు నమోదులో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మే ఐదో తేదీన అదే పట్టాభిపురం పీఎస్లో మరోసారి ఫిర్యాదు చేశానని తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మళ్లీ కిరాక్ ఆర్పీ అనే పెద్ద మనిషి పచ్చి బూతులతో సోషల్ మీడియాలో మాజీ సీఎం వైఎస్ జగన్, తనపై, మాజీ మంత్రి ఆర్కే రోజాపై, నాయకులు, కార్యకర్తలను ఇష్టానుసారంగా తిడుతున్నాడని లింక్ల సహా పెన్డ్రైవ్లో ఎక్కించి పోలీసులకు అందజేశానని తెలిపారు. పట్టాభిపురం పీఎస్లో ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదని, ఈ ఏడాది మే పదిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్కు మరో ఫిర్యాదు అందించినట్లు చెప్పారు. పోలీసులు మేలుకోవాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి, వైఎస్సార్ సీపీ నేతలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో, వారికి ఇష్టమైన చానెళ్లల్లో సీమరాజు అలియాస్ చంద్రకాంత్చౌదరి, కిరాక్ ఆర్పీలు తమ వ్యక్తిగత జీవితాల జోలికి వస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం, పోలీసులు మేలుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు సీమరాజు, కిరాక్ ఆర్పీలపై కేసులు నమోదు కాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి, వైఎస్సార్ సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే వెంటనే కేసులు నమోదు గాంధేయ మార్గంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన గంట సేపు నిలబడి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి, మాజీ ఎంపీ మోదుగుల, నేతలు -
విత్తన చట్టంతో నకిలీలకు కళ్లెం
● ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్స్ ప్రదర్శించాలి ● కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరి కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో ప్రైవేటు దుకాణాల్లో విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే, రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఉంది. దాని గురించి రైతులకు తెలియదు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అన్యాయం జరిగితే డీలర్లపై కఠినతరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన చట్టం– 1966, విత్తన నిబంధనలు– 1968, విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 తదితర చట్టాలు రైతులకు అండగా నిలుస్తాయి. విత్తనపరమైన అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించే విధంగా వీటిని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారిపై నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు– 3 అతిక్రమించినందుకు జప్తు చేయవచ్చు. అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్–ఏ ప్రకారం జరిమానాకు గురవుతారు. విత్తన లైసెన్సు ప్రదర్శన తప్పనిసరి ప్రైవేటు విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్సును ప్రదర్శించాలి. లేనిపక్షంలో అధికారులు అమ్మకాలను నిలిపివేయవచ్చు. అంతేకాకుండా నోటీసు ఇస్తూ దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు–5 ప్రకారం డీలర్ లైసెన్సు సస్పెండ్ లేదా రద్దు చేయవచ్చు. ధరలు, స్టాకు బోర్డు ఏర్పాటు తప్పనిసరి విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధరలు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1083 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అధికారులు వచ్చి ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే ! విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ముందుగా నోటీసు జారీ చేయవచ్చు. దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే డీలర్ లైసెన్సు రద్దు చేయవచ్చు. విత్తనాల బస్తాలపై లేబుల్ లేకపోతే చర్యలు డీలర్ దగ్గర కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం, విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8ను అనుసరిస్తూ డీలర్ లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. జిల్లాలో ఇలా.. గుంటూరు జిల్లాలో 600 ప్రైవేటు డీలర్ల దుకాణాలు ఉన్నాయి. ఇందులో 400 మంది విత్తనాల డీలర్లు, 100 మంది ఎరువుల డీలర్లు, మరో 100 మంది పురుగు మందుల డీలర్లు ఉన్నారు. నిబంధనలు పాటించాలి విత్తన చట్టానికి అనుగుణంగా డీలర్లు విక్రయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలతో పాటు దుకాణాల లైసెన్సును రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, గుంటూరు -
ఓడీఓపీ అవార్డు అందుకున్న కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: ఒకే జిల్లా–ఒకే ఉత్పత్తి కింద గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి దక్కడం చాలా గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బంగారు కేటగిరి అవార్డును కలెక్టర్ అందుకున్నారు. కలెక్టర్ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సహాయ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి జిటిఎన్ ప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ, ,చేనేత పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.సునీతలు అభినందించారు. రైతులకు సరిపడా ఎరువుల సరఫరాకు ప్రణాళిక జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు కొరిటెపాడు (గుంటూరు): పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి అన్ని రకాల ఎరువులు కావాల్సిన మేరకు అంచనా వేసి, దానికి అనుగుణంగా నెలవారీ సరఫరా ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో వివిధ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,14,725 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు వరి 6,433 హెక్టార్లు, పత్తి 1,632 హెక్టార్లలో సాగైనట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 166.3 సెంటీ మీటర్లకు గానూ 75.2 సెంటీ మీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు పేర్కొన్నారు. జిల్లాలో టోకు వర్తకులు, రిటైల్ డీలర్ల వద్ద యూరియా 15,021 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,252, కాంప్లెక్స్ ఎరువులు 13,797, ఎంఓపీ 946 మొత్తం కలిపి 34,016 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎరువుల సరఫరాలో సమస్యలుంటే సంబంధిత రైతు సేవా కేంద్రం ద్వారా మండల వ్యవసాయ అధికారికి గానీ, సహాయ వ్యవసాయ సంచాలకులకు గానీ, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబరు–8074994631కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో సోమవారం సంకటహరచతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేపటి నుంచి శివాలయంలో పవిత్రోత్సవాలు పెదకాకాని: శివాలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి రాహుకేతువు పూజలు, నవగ్రహపూజలు, రుద్ర, చండీ హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, శాంతి కల్యాణాలతో పాటు అన్ని సేవలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. 19వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కై ంకర్యాలు, అన్ని ఆర్ణీత సేవలు, రాహుకేతు పూజలు, యథావిధిగా జరుగుతాయన్నారు. దేవస్థానంలో వాహనపూజలు, అన్నప్రాసనలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో అలసత్వానికి తావివ్వొద్దని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని అర్జీలు వివిధ శాఖలు సమన్వయంతో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. వీటిపట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి ఆన్సర్లు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలన్నారు. అధికారులు అవసరమైన మేరకు లీగల్ టీమ్ సహాయం తీసుకోవాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లక ముందే పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం వచ్చిన 302 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ -
డాక్టర్ హేమంత్కు అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్కు అరుదైన గౌరవం లభించింది. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఆర్సీఎస్) ఆధ్వర్యంలో ఈనెల 9న జరిగిన ఇంటర్నేషనల్ సర్జికల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్లో (ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్) ఫెలోషిప్, ఐఎస్టీపీ డిగ్రీని ఒకేసారి అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ ఉప్పుటూరి హేమంత్ చైన్నె రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్కాలేజ్లో న్యూరో సర్జరీ పీజీ పూర్తి చేశారు. బ్రిటిష్ న్యూరో సొసైటీ ఆంకాలజీ 2022లో డాక్టర్ హేమంత్ను ప్రోడీజీగా గుర్తించారు. ఫెలోషిప్ అందుకుని గుంటూరు విచ్చేసిన డాక్టర్ ఉప్పుటూరి హేమంత్ను సోమవారం గుంటూరు కొత్తపేటలోని అమృత హాస్పిటల్, యాంజివోకేర్ హాస్పిటల్, న్యూరో కేర్ హాస్పిటల్ వైద్యులు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్కుమార్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్, డాక్టర్ మన్నె సింధూర, పలువురు వైద్య సిబ్బంది అభినందించారు. గుంటూరు ప్రాంత ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు డాక్టర్ హేమంత్ వెల్లడించారు. వైద్య రంగంలో తనకు లభించిన అరుదైన గౌరవంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని వెల్లడించారు. -
కట్టుబాట్ల పేరుతో కుల పెద్దల ఆంక్షలు
నగరంపాలెం: కట్టుబాట్ల పేర్లతో కుల పెద్దలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పరిశీలించారు. బాధితుల మొరను అలకించారు. సంబంధిత ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్), మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదులు స్వీకరించారు. ఓ కుటుంబ సభ్యుల ఆవేదన న్యాయం చేయాలని వినతి -
కత్తితో దాడి: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
చేబ్రోలు: పొలంలోని బొంగులు తగలబడటానికి కారణంపై జరిగిన వివాదంలో కత్తితో జరిగిన దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరులో సోమవారం జరిగింది. చేబ్రోలు మండలం నారాకోడూరు దళితవాడ ప్రాంతానికి చెందిన తూమాటి సుమన్కు వేజండ్ల గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. అక్కడ పొలంలో కూరగాయల తోటకు ఉపయోగించే బొంగులను నిల్వ చేసి ఉంచారు. ఆదివారం రాత్రి సమయంలో వారి పొలంలోని బొంగులు తగలబడుతున్నాయి అని తెలిసి సుమన్ బంధువులను తీసుకొని వేజండ్ల గ్రామంలో గల పొలానికి వెళ్లి పరిశీలించి చూడగా బొంగులు తగలబడుతున్నట్లు గమనించారు. వీరి పొలం సమీపంలోనే ఉన్న ఎద్దు యలమందయ్య పొలంలో కూడా కొన్ని బొంగులు తగలబడుతున్నట్లు గుర్తించారు. ఇంటికి తిరిగి వచ్చి సోమవారం ఉదయం కమ్యూనిటీ హాల్ వద్ద కుర్చొని బొంగులు తగలబడిన విషయంపై మాట్లాడుతున్నారు. గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ వచ్చి ‘పొలంలో బొంగులు తగలబడటానికి కారణం నేను అని ప్రచారం చేస్తున్నారని వారితో వివాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తూమాటి సుమన్పై దాడి చేసి పొడవటంతో చేతికి, నడుమ బాగంలో గాయాలయ్యాయి. వరుసకు తమ్ముడు అయిన తూమాటి పృఽథ్వీరాజ్ అడ్డుకోవటానికి ప్రయత్నించగా అతనిపై కూడా దుర్గాప్రసాద్ దాడి చేసి కత్తితో ఛాతీ, వీపు భాగంలో పొడవటంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇరువురిని స్థానికులు ఆటోలో వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్ఐ డి. వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దాడికి యత్నం
గత నలభై ఏళ్లుగా కాకానితోట వద్ద ఉంటున్నాం. చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటాం. స్థానికంగా ఉండే నాలుగు కుటుంబాల సభ్యులు పెద్దలుగా చలామణి చేస్తున్నారు. ఏ చిన్న వివాదం జరిగినా వారి సమక్షంలో రాజీ చేసుకోవాలి. పోలీసుల వద్దకెళ్తే జరిమానాలు విధించడం, కుల బహిష్కరణకు పాల్పడుతున్నారు. ఐదేళ్ల కిందట మమ్ములను ఆరు నెలలు కులం నుంచి బహిష్కరించారు. మళ్లీ వచ్చేందుకు రూ.3 లక్షల జరిమానా చెల్లించాం. ప్రస్తుత రోజుల్లోనూ మూఢ నమ్మకాలు ఏంటని ప్రశ్నించినందుకు నా కుమారులతో అమర్యాదగా మాట్లాడారు. ఈనెల 13 రాత్రి కుటుంబంపై దాడికి యత్నించారు. కులం నుంచి బహిష్కరిస్తున్నామని, లక్ష రూపాయాలు జరిమానా చెల్లించాలని బెదిరించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. వారి ముందు చెప్పు లేసుకుని తిరిగినా సహించరు. తమకు న్యాయం చేయగలరు. – శ్రీపాటి ఆదెమ్మ, కుమారులు నాగరాజు, రమేష్, వెనిగండ్ల, పెదకాకాని -
టీడీపీ కార్యకర్తల రాక్షసానందం
గుంటూరు వెస్ట్: దళితుల సమస్యలు వినేందుకు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకర్ సమావేశ మందిరానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ను తప్పుదోవ పట్టించేందుకు పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనుచరులు నానా హంగామా సృష్టించారు. హత్యాయత్నానికి గురై ప్రాణాలతో పోరాడుతున్న మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావును, వైఎస్సార్ సీపీ నాయకులను నానా దుర్భాషలాడారు. ఒక సందర్భంలో అరడజను మంది డీఎస్సీలు, సిబ్బంది వచ్చినా వారిని ఆపలేకపోయారు. ఒక పక్క మీటింగ్ జరుగుతుండగానే తమను లోపలికి పంపాలని, లేకపోతే ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామని రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తారు. దీంతో పోలీసులు చేసేది లేక 10 మందిని లోపలికి తీసుకెళ్లి వినతిపత్రం ఇప్పించారు. నెంబర్ ప్లేట్పై జై తెలుగు దేశం పెద్దఎత్తున వచ్చిన టీడీపీ కార్యకర్తలు కార్లకు నంబర్లు కూడా తీసేశారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నంబర్కు బదులు జై తెలుగుదేశం అని రాసుకున్నారు. కొందరు దళిత సంఘాల నాయకులు దీన్ని వ్యతిరేకించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు యథావిధిగా టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరించారు. -
విత్తన దుకాణాలలో తనిఖీలు
రూ.60.17లక్షల మిరప, సోయాబిన్స్ విత్తనాల విక్రయాల నిలుపుదల కొరిటెపాడు: గుంటూరు నగరంలో వ్యవసాయ శాఖ, విజిలెన్న్స్/ఎన్ఫోర్స్మెంట్ శాఖ సంయుక్తంగా విత్తనాలు, ఎరువులు/ పురుగుమందుల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైల్ డీలర్ల దుకాణాల్లో రెండు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మూడు విత్తన దుకాణాల్లో రూ.60.17లక్షల విలువైన మిరప, సోయాబిన్స్ విత్తనాలకు సంబంధించి రికార్డులు లేనట్లుగా గుర్తించారు. దీంతో వాటి విక్రయాలు నిలుపుదలచేశారు. నాలుగు ఎరువుల దుకాణాల్లో రూ.1.66 లక్షల విలువైన 5.35 టన్నుల ఎరువులు, మూడు పురుగు మందుల దుకాణాల్లో రూ.14.13 లక్షల విలువైన 3,460 లీటర్ల పురుగు మందుల విక్రయాలు కూడా నిలుపుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏడీఏ పి.మురళీకృష్ణ, గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, విజిలెన్స్ అధికారులు కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.రవిబాబు, ఏఓలు సునీల్ కుమార్, బి.కిషోర్కుమార్ పాల్గొన్నారు. -
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగి కస్తూరి కృష్ణవేణి మాట్లాడుతూ జెడ్పీ కార్యాలయంతో పాటు చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. తనతో పాటు తేళ్ల హరీష్, వాసిమళ్ల అరుణ, కొల్లిపర రాహుల్, కె.ఆనంద్, వరికూటి నందినిలకుగత 22 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పేదవారిపై జాలి చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద ప్రేమానందం మాదిగ మాట్లాడుడూ జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో నిర్లక్ష్య వైఖరితోనే వేతనాలు చెల్లింపులకు నోచుకోవడం లేదని ఆరోపించారు. వాచ్మేన్గా పని చేస్తున్న పిడపర్తి కృష్ణవేణి భర్త అనారోగ్యంతో మరణించగా, కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోకపోగా ఆమెకు 22 నెలల జీతం కూడా ఆపేశారని ఆరోపించారు. నిరుపేద కార్మికులపై అధికారులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జెడ్పీ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన -
భక్తులతో కిటకిటలాడిన నృసింహుని ఆలయం
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దిగువ సన్నిధిలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగువ సన్నిధి నుంచి ఆటోలో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులను మధ్యలోనే పోలీసులు ఆపేశారు. చేసేది లేక అక్కడి నుంచి నడిచి వెళ్లి స్వామి ని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి రెండు నుంచి మూడు గంటల వరకు సమయం పట్టింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని వివరించారు. రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర
ప్రత్తిపాడు: అక్రకటిత విద్యుత్ కోతలపై మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. ప్రత్తిపాడు ఒకటో వార్డులోని పూల బజారులో కొద్ది నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్య నెలకొంది. లో వోల్టేజీ సమస్యతో పాటు ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు కోత విధించడంతో స్థానిక మహిళలు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోండని చులకన చేసి మాట్లాడుతున్నారు. దీంతో మహిళలు, స్థానికులు ఆదివారం రాత్రి గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? అందరిలానే తాము నెల నెలా వేలకు వేలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదా? అంటూ మండిపడ్డారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయారు. ఇంట్లో వృద్ధులు, పసి పిల్లల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతమద్రాసు రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగేంద్ర రోడ్డు మీద ఆందోళన విరమించాలని కోరారు. ఏఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని మహిళలు పట్టుబట్టారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడతామని పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వేలకు వేలు బిల్లులు కట్టించుకోవడం లేదా అంటూ మండిపాటు విద్యుత్శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం -
రాజ్యాంగంపై దాడి చేస్తారా?
చీరాల రూరల్: దేశంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలు పొందుపరచారని వాటిని తొలగిస్తే రాజ్యాంగంపై దాడిచేసినట్టేనని విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్ అన్నారు. ఏపీ ఊరూరా జనవిజ్ఞానం, వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్, ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన దేశభక్తి, ప్రజాస్వామ్యం, సామాజిక స్పృహ, లౌకిక భావాలు, సమసమాజ నిర్మాణం, శాసీ్త్రయ ఆలోచన, గణతంత్ర రాజ్యం, సామాజానికి న్యాయం, సామాజిక సంస్కరణ అనే ఈ పది అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో కూడా ఆటోచనా ధోరణి పెంపొందించుటకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అనంతరం వినయ్ రాజ్కుమార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాదె హరిహరరావు, వై.రవికుమార్, టి.అంకయ్య, నాగమనోహర్ లోహియ, ఎం.మణిబాబు, ఎస్కే సుభాని, జి.జోజిబాబు, జిలాని పాల్గొన్నారు. -
ఆశీలు పేరుతో దోపిడీ
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆశీలు వసూలు దందా నడుస్తోంది. వసూలు చేసేవారు వ్యాపారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన నగదుకు బిల్లు అడుగుతుంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఒకవేళ ఇచ్చినా ఎంత చెల్లించామన్నది రాయడం లేదని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ, రూరల్ పరిధిలో పలుచోట్ల వసూలు చేసేవారు చిరు వ్యాపారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాయిదా పడిన ఆశీల రద్దు గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఆశీలును రద్దు చేస్తామని ప్రకటించారు. ఈలోపు ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. అనంతరం ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ఎన్నికై విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత మంగళగిరిలో వ్యాపారులకు శుభవార్త అంటూ ఆశీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టి కార్పొరేషన్ అధికారులు టెండర్లను పిలిచారు. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు పాటను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నాడని, ఇదేమని అడిగితే తన మనుషులతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడనే విమర్శలు వ్యాపారుల నుంచి వినిపిస్తున్నాయి. బిల్లు ఇవ్వడం తప్పనిసరి ఆశీల వసూలుకు టెండర్లు పిలిచిన మాట వాస్తవమే. నిబంధనలకు విరుద్ధంగా నగదు వసూలు చేస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ నిర్ణయించిన మేరకే వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసి బిల్లు తప్పకుండా ఇవ్వాలి. –మురళి, ఆర్వో బిల్లు అడిగిన వారిపై దౌర్జన్యం మంత్రి మాటలను పెడచెవిన పెట్టిన అధికారులు చిరు వ్యాపారులపై ప్రతాపం దుగ్గిరాల మండల చిలువూరు నుంచి ఓ వృద్ధురాలు వేరుశనగ కాయలు, గుగ్గిళ్లు అమ్ముకునేందుకు చిలువూరు దగ్గర రైలు ఎక్కి తాడేపల్లి వద్ద దిగి పలు ప్రాంతాల్లో అమ్ముకుంటుంది. వ్యాపారం జరగకుండానే డబ్బులు కట్టాలని ఆమె ఆశీలు వసూలు చేసేవారు డిమాండ్ చేశారు. గంట తరువాత కడతామని చెప్పినా వినలేదు. ఆమె నుంచి 30 రూపాయలు వసూలు చేసి, బిల్లు మాత్రం ఇవ్వలేదు. ప్రతి రోజూ ఇదే మాదిరి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ, పాతూరు, వడ్డేశ్వరం, మెల్లెంపూడి, ఇప్పటం, చిర్రావూరు ప్రాంతాల్లో మాంసం, చేపలు అమ్మేవారి వద్ద నగదు అయితే వసూలు చేస్తున్నారు గానీ దానికి సంబంధించి బిల్లు మాత్రం ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్నారు. ఒకే రసీదుపై ధర వేయకుండా వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారు. -
మల్లేశ్వరస్వామి దేవస్థానానికి తులాభారం బహూకరణ
పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు. దేవస్థానంలో స్వామివారికి భక్తులు మొక్కు బడులు తీర్చుకొనడానికి తులాభారం ఉపయోగంగా ఉంటుందని ఆయన చెప్పారు. దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వివాదాస్పద పీఈటీపై విచారణకు ఆదేశం పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్సీసీ విద్యార్థులు ఏసర్టిఫికెట్ పొందేందుకు యూనిఫాం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీశారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ఎన్సీసీ విద్యార్థుల నగదు స్వాహా పేరుతో కథనం వెలువడింది. దీనిపై జిల్లా ఉప విద్యాశాకాధికారి రత్నంను విచారణాధికారిగా నియమించినట్లు డీఈఓ సీవీ రేణుక వెల్లడించారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నారాయణస్వామికి లక్ష తులసీ దళార్చన నగరంపాలెం: గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులో వేంచేసిన శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలు ఆదివారం కొనసాగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనారాయణస్వామికి సుదర్శన, అష్టాక్షరీ మంత్ర హోమాలు, భక్తులతో నారాయణ సూక్తులతో హోమాలు జరిగాయి. సాయంత్రం నారాయణస్వామికి లక్ష తులసీ దళార్చన, నీరాజన మంత్ర పుష్పాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 15 మందికి షోకాజ్ నోటీసులు నెహ్రూ నగర్ : ప్రజలకు అందించే అత్యవసర సేవలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బంది నగరంలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఆప్కాస్ కార్మికులకు ఆదివారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆప్కాస్ కార్మికుల్లో కొందరు అత్యవసర తాగునీటి సరఫరాకు అంతరాయం కల్గిస్తూ ఆదివారం విధులకు గైర్హాజరయ్యారు. కార్మికుల గైర్హాజరు వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగింది. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించిన వారిలో 15 మందికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు ఉంటాయని నగర కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. -
రాజకీయ నేపథ్యంలోనే హత్యాయత్నం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి రాజకీయపరంగా జరిగిన హత్యాయత్నం అని, దాడి జరిగినప్పటి వీడియో చూస్తే ఎవరికై నా ఇది స్పష్టంగా అర్థమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ పది రోజుల కిందట టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావు దేవుడి దయతో కోలుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయనది సంస్కారవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన విద్యావంతుల కుటుంబమని, వాళ్ల మీద దాడి జరగడం రెండోసారని వివరించారు. వీరి కుటుంబం అట్టడుగు వర్గం నుంచి వచ్చినా ప్రజల పక్షాన నిలబడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఆయనపై దుర్మార్గంగా జరిగిన దాడిపై కుటుంబసభ్యులతోపాటు పార్టీ కూడా తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు. తనపై కూడా దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే అది తీసుకోకుండా..అధికార పార్టీ వాళ్లు ఇచ్చిన ప్యాబ్రికెటెడ్ కంఫ్లైంట్తో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో స్పష్టంగా వీడియో సాక్ష్యం ఉన్న నేపథ్యంలో నెల, రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలని, నిందితులకు శిక్ష పడాలని ఆయన వివరించారు. అది వదిలేసి నిందితులను ఎలా తప్పించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని ఆరోపించారు. కుట్రకు రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నరేంద్ర వైపు చూడకుండా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో ఉన్న దుస్థితికి, పోలీస్ రాజ్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్టినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుకు పరామర్శ ఏడాది కిందట పెదకూరపాడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ ఈదా సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు, చేతులు నరికితే ఇంత వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేయమని ప్రభుత్వ పెద్దలే బాహాటంగా చెబుతున్నారని, దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తే కేసులు కూడా పెట్టడం లేదని విమర్శించారు. చర్యలు అసలు లేకుండా పోతున్నాయన్నారు. గుంటూరులో లక్ష్మీనారాయణను సాక్షాత్తూ డీఎస్పీ ఈ కులంలో ఎలా పుట్టావు అంటూ వేధించడంతో అవి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడని సజ్జల పేర్కొన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, అందుకు కారణమైన డీఎస్పీ హనుమంతరావు మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెనాలిలో బహిరంగంగా రోడ్డు మీద యువకులను చితకబాదిన వ్యవహారంలో కూడా ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్కు చెందిన మెరుగుమాల ప్రశాంత్కిరణ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు దాచేపల్లి : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అమానుషం చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నిక
లక్ష్మీపురం: ఉమ్మడి గుంటూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా ఓలేటి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. విజయలక్ష్మి, ఎం.షణ్ముఖ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కార్తిక్, కార్యాలయ కార్యదర్శిగా వి.కల్యాణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్. సరళబాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు నియమితులైనట్లు ఎన్నికల అధికారి బాపట్ల గోపాల కృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారి దేవరపల్లి జగన్నాథం ప్రకటించారు. గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్లో ఉన్న వసుంధర కాంప్లెక్స్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావులపాటి శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఉమ్మడి గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా ఓలేటి రమేష్కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం -
మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు
లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యాసిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు. అందుకే సమ్మెలోకి వెళ్లాం కక్ష సాధింపు చర్యలకు దిగితే పారిశుధ్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి.. సమ్మెలో తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
మృతురాలి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
తెనాలి: స్థానిక నాజర్పేటకకు చెందిన తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్, భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ నాయకుడు టీవీ రమణ మాతృమూర్తి సీతాదేవి (80) ఆదివారం మృతిచెందారు. ఆమె కోరిక ప్రకారం నేత్రదానానికి సమాచారం పంపారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు అరవింద, కృష్ణమోహన్ వచ్చి, ఆమె నేత్రాలను సేకరించి పంపారు. చీకటి ప్రపంచం నుంచి ఇద్దరు రేపటి వెలుగులను చూస్తారనే విషయం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీవీ రమణ అన్నారు. హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీతాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేత్రదానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ధూర్జటిది విశిష్ట స్థానం వారణాశి రఘురామ శర్మ అద్దంకి: అష్ట దిగ్గజాల్లో ధూర్జటిది విశిష్ట స్థానమని వారణాశి రఘురామశర్మ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కమఠ్వేర స్వామి దేవస్థానంలో సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన వహించారు. మలాది శ్రీనివాసరావు జ్యోతిప్రజ్వలన చేశారు. ‘ధూర్జటి మహాకవి భక్తితత్త్వం’ అనే అంశంపైన వారణాశి రఘురామశర్మ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నాటి రాజులను ఈసడిరచుకున్న కవిరాజు ధూర్జటి అని చెప్పారు. సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు.. శివుని సేవించి మోక్షం పొందిన కథలను రసరమ్యంగా శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్య కావ్యంలో ధూర్జటి ఆవిష్కరించారన్నారు. ఆ పద్యాలన్నీ ధూర్జటి హృదయాన్ని ఆవిష్కరిస్తాయని, అతని ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని శర్మ పేర్కొన్నారు. రోటరీ తాజా మాజీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి సుధాకరరావు, మలాది శ్రీనివాసరావులను, అసిస్టెంట్ గవర్నర్గా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన షేక్ మహమ్మద్ రఫీని సత్కరించారు. 2025 – 26 సంవత్సరానికి రోటరీక్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కార్యవర్గంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గాన్ని సత్కరించారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ సభాహ్వానం చేయగా అద్దంకి లేవిప్రసాద్ వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో యు.దేవపాలన, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గాడేపల్లి దివాకరదత్, కె.అనిలకుమారసూరి, సంకా సుబ్రహ్మణ్యం(బాబు), అనంతు నాగేశ్వరరావు, అద్దంకి లేవిప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా కళలతోనే సమాజ చైతన్యం
తెనాలి: కళలు జనజీవన స్రవంతిలో భాగమని ప్రజాకళలతోనే దోపిడీ వ్యవస్థను ఎదరించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావొచ్చని, అలాంటి కళారూపాలను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్నాయని తెలిపారు. తొలిరోజున జరిగే ప్రదర్శనలో వెయ్యిమంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో కళారూపాలతో కళాకారులు పాల్గొనాలని అన్నారు. సభాధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ ప్రజానాట్యమండలికి, కళాకారులకు తెనాలి పుట్టినిల్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా నుండి 100 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు. సీనియర్ కళాకారుడు, సమన్వయకర్త కనపర్తి బెన్హర్ మాట్లాడుతూ తెనాలి నుండి ‘పోస్టర్’ నాటికతో ఒంగోలులో జరిగే కళాప్రదర్శనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ జిల్లా నుండి నాటిక, అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర, కోలాటం చెక్కభజన కళాకారులు పాల్గొంటారని తెలిపారు. నీలాంబరం, మల్లికార్జునరావు, రచయిత దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ -
క్రీడా గాయాలకు ఆర్థోస్కోపీతో పరిష్కారం
గుంటూరుమెడికల్: ఆటలు ఆడే సమయంలో పలువురు గాయపడుతుంటారని, గాయాల ద్వారా క్రీడాలకు దూరంగా కాకుండా ఆర్థోస్కోపీతో వారికి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అన్నారు. గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్, గుంటూరు ఆర్థోస్కోపీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో ఆర్థోస్కోపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ స్పోర్ట్స్ పర్సన్కు గాయాలు ఎక్కువగా అవుతాయని చెప్పారు. కీడ్రల్లో యువత ఎక్కువగా భాగస్వాములుగా ఉంటారన్నారు. ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా గాయాల నుంచి కోలుకుని ఉద్యోగాలు చేసుకోవటానికి, తిరిగి ఆటలు ఆడటానికి ఆర్థోస్కోపీ సర్జరీలు ఎంతో ఉపయోగపతాయని వివరించారు. ఈ సర్జరీతో క్రీడాగాయాలైన వారు త్వరగా కోలుకుంటారని, త్వరగా నడుస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థోస్కోపీ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందాలని కోరారు. గుంటూరు మెడికల్ హబ్ అవుతుందని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సంకల్ప హాస్పిటల్లో యువ వైద్యులకు, జూనియర్ వైద్యులకు, ప్రాక్టీస్లో ఆసక్తి ఉన్నవారికి షోల్డర్ అండ్ నీ లైవ్ సర్జరీలు లైవ్లో నాలుగు చేసి చూపించారు. షోల్డర్ అండ్ నీ సంకల్ప హాస్పిటల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోస్కోపీ సర్జన్స్ నాలుగు లైవ్ సర్జరీలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది యువవైద్యులు హాజరైనట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివ కుమార్ మామిళ్ళపల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చైతన్య ఘంటా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్థోస్కోపీ నిపుణులు లైవ్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా వర్క్ షాప్ కూడా నిర్వహించారని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ -
వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ ధ్యేయం
తెనాలి టౌన్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు. డ్రోన్లు, కల్టివేటర్లు, తైవాన్ స్పెయిర్స్, సీడ్ డ్రీల్ వంటి పరికరాలను అందించారు. మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందించే సమాచారాన్ని రైతు సేవా కేంద్రాల సిబ్బంది తెలియజేయాలని సూచించారు. ఈ ఏడాది తెనాలి నియోజకవర్గంలో 289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.80 కోట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. యార్డు ప్రాంగణాన్ని రైతు సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ విధానాన్ని అందిపుచ్చుకుని సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యంత్ర పరికరాలను వినియోగించుకోవాలని కోరారు. రైతు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రూ.30లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను రూ.10 లక్షల రైతుల భాగస్వామ్యంతో రూ.20 లక్షల సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వలన మనిషి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. డ్రోన్ పరికరాలపై 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు రైతుమిత్ర గ్రూపుల ద్వారా రుణాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఆర్జెడి కె.శ్రీనివాసరావు, యార్డు సెక్రటరీ సుబ్బారావు, ఇన్చార్జి ఏడీఏ డి.రాజకుమారి, మండల వ్యవసాయశాఖ అధికారి కె.సుధీర్బాబు, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. సబ్సిడీపై రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలు పంపిణీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -
ఉద్యోగ నియామక పత్రాల అందజేత
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రోజ్గార్ మేళాలో ఉద్యోగావకాశాలు పొందిన 76 మందికి ఆర్ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. అరండల్పేటలోని రైల్ మహల్లో శనివారం 16వ రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు, సికింద్రాబాద్, గుంతకల్ సహా 47 ప్రదేశాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేళాను ప్రారంభించారు. ఇందులో భాగంగా 76 మందికి డీఆర్ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎస్టీఈ రత్నాకర్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. గుంటూరు రైల్వే డివిజన్లో 76 మందికి పంపిణీ -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు. -
డ్రైవర్లను అటెండర్లుగా మార్చడం అన్యాయం
కొరిటెపాడు(గుంటూరు): వాణిజ్య పన్నుల శాఖలోని డ్రైవర్లను రివర్షన్ చేసి అటెండర్లుగా మార్చడం తీవ్ర అన్యాయమని, వారిని తిరిగి డ్రైవర్లుగా కొనసాగించాలని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం గుంటూరులోని జిల్లా సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమానికి సంఘం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు పదవీ కాలం ముగిసినా చట్ట విరుద్ధంగా కొనసాగుతున్నారని, సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఆయన ఇక సంఘంలో సభ్యుడు కాదని స్పష్టం చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీఎస్. కొండయ్య, ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, రాష్ట్ర కోశాధికారి వి.పాపారావు, నాయకులు వై.నాగరాజు, అబ్దుల్ హమీద్, ప్రసన్నాంజనేయకుమార్, అప్పలనాయుడు, ఈశ్వరరావు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు -
దళితులపై పెరిగిన దాడులు, దౌర్జన్యాలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. కూటమి ప్రభుత్వంలో దళిత హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. కనీసం నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారని విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో టీడీపీ గూండాలు దాడి చేయడంతో ప్రాణాపాయస్థితిలో గుంటూరు రమేష్ హాస్పటల్స్లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరరావును శనివారం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ మన్నవ గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్లాన్ చేశాడని ఆరోపించారు. టీడీపీ నేత బండ్లమూడి బాబూరావుతో హత్యాయత్నం చేయించింది నూటికి నూరుపాళ్లు ఆయనేనని ఆరోపించారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో ధూళిపాళ్ల వాళ్ల పార్టీ నేత బాబూరాబును రెచ్చగొట్టారని తెలిపారు. నాగమల్లేశ్వరరావును అంతం చేయకపోతే పక్కకు తప్పుకోండి.. సన్మానం చేసి మరి బయటకు పంపిస్తానని ధూళిపాళ్ల అనటంతోనే హత్యాయత్నం జరిగిందని వివరించారు. హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారు ? నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ప్లాన్ వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ధ్వజం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న నరేంద్ర : అంబటి మురళీకృష్ణ పొన్నూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను ధూళిపాళ్ళ నరేంద్ర తొలి నుంచి పోత్రహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. దళితులంటే అసలు నరేంద్రకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నో హత్యాకాండలు, ఆత్మహత్యలకు నరేంద్ర నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని మండిపడ్డారు. దాడి కేసులో ఆయన్ను ఏ–1గా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
సుపరిపాలన కాదు.. అబద్ధాల పాలన
తాడికొండ: చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్నది సుపరిపాలన కాదు.. అబద్ధాలు, మోసాల పాలన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడికొండలోని షిర్డీసాయి పర్తిసాయి మందిర కల్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, సూపర్ సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేసి నేతలంతా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇది సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని ప్రజలకు చెప్పడమే బాబు ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమమని వివరించారు. ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ‘‘రాజధానికి రెండో విడత 45 వేల ఎకరాలు కావాలంట.. అప్పట్లో 55 వేల ఎకరాలు సేకరించారు.. దుబాయ్, మలేషియా, సింగపూర్ అంటూ గొప్పలు చెప్పారు.. ఐదేళ్లు ఏమీ చేయలేదు.. అమరావతిలో ఇప్పుడు భూమి కొనేవాడు లేదు.. ముందు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల’’ని రాంబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, తాడికొండ, తుళ్ళూరు మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, మైనేని శేషగిరిరావు, తాళ్ళూరు వంశీ, పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు దాసరి రాజు, తాడికొండ గ్రామపార్టీ అధ్యక్షుడు వంగా పోలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కల్లం హరికృష్ణారెడ్డి, చిట్టా అంజిరెడ్డి, మల్లంపాటి రాఘవరెడ్డి, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, షేక్ అజీస్, షేక్ బాబావలి, పులి రమేష్, వడ్లమూడి రాజేంద్ర, నిమ్మగడ్డ ప్రసాద్, దెబోరా, కొప్పుల శేషగిరిరావు, చిన్నప్పరెడ్డి, అప్పిరెడ్డి, చేవూరి రామ్మోహనరెడ్డి, గుంటి రఘువరన్, షేక్ అబ్బాస్, అల్లు శ్రీనివాసరెడ్డి, షేక్ రబ్బాని, వలపర్ల కల్పన, కొదమల బుజ్జి, కోలేటి అనీల్, కొప్పుల శేషగిరిరావు, ఆళ్ల చిన్న హనుమంతరావు, చుండు వెంకటరెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యం పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రథమ ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. కష్ట కాలంలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని పట్టిష్టపరిచే కార్యక్రమం భుజస్కంధాలపై వేసుకున్న దమ్మున్న నాయుడు వనమా బాల వజ్రబాబు అని అభినందించారు. పార్టీ కష్టకాలంలో ముందుకొచ్చి కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్న కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. భవిష్యత్తులో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయని సూపర్ సిక్స్ మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఏడాది పూర్తయ్యాక తల్లికి వందనం -
కార్మెల్ మాత ఉత్సవాలు
రేపటి నుంచి ఫిరంగిపురం: స్థానిక కార్మెల్ కొండపై కొలువైఉన్న కార్మెల్ మాత ఉత్సవాలు ఈనెల 14,15,16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి శనివారం తెలిపారు. ఉత్సవాలకు గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరై, సమష్టి దివ్య పూజాబలి పూజల్లో పాల్గొంటారని చెప్పారు. ● 14న ఉదయం 5.30 గంటలకు బాల ఏసు దేవాలయంలో దివ్యపూజాబలి నిర్వహిస్తామన్నారు. సాయంత్రం కార్మెల్ మాత కొండ వద్ద ఫాదర్లు వై. అంథోనిరాజు, పి.జోజిరాజుల ఆధ్వర్యంలో దివ్య పూజా బలి కార్యక్రమాలు ఉంటాయి. ● 15న ఉదయం 8 గంటలకు, 12 గంటలకు ఫాదర్లు ఫాతిమా మర్రెడ్డి, బి.మరియ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కొండపై దివ్య పూజాబలి ఉంటుంది. మధ్యాహ్నం సెయింట్పాల్స్ హైస్కూల్లో అన్నదానం, సాయంత్రం 5గంటలకు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, ఆరాధన ఉంటుంది. దివ్య సత్ప్రసాదం, కార్మెల్మాత స్వరూపంతో బాల ఏసు దేవాలయం నుంచి కార్మెల్ మాత కొండ వరకు ప్రదక్షిణ నిర్వహిస్తారు. అఖండ జపమాలను మరియ దళ సభ్యులు పఠిస్తారు. ● 16న ఉదయం 6 గంటలకు దివ్య పూజాబలి పూజలు, అనంతరం తేరు ప్రదక్షిణ ఉంటుంది. భక్తులకు సకల సదుపాయాలు కార్మెల్ మాత ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. నీటి సదుపాయం, రెండురోజుల పాటు అన్నదానం, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాలకు భారీ బందోబస్తు భక్తులకు అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ శివరామకృష్ణ తెలిపారు. సమీప స్టేషన్ల నుంచి 130 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. వాహనాలు పార్కింగ్ కోసం సెయింట్ పాల్స్ ప్లే గ్రౌండ్, మార్నింగ్ స్టార్ కళాశాల గ్రౌండు, అల్లంవారిపాలెం రైల్వేగేటు సమీపంలో స్థలాలను ఎంపిక చేశామని చెప్పారు. పెద్దఎత్తున భక్తుల రాక ఏర్పాట్లు పూర్తి -
గుంటూరు
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025చేబ్రోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చేబ్రోలులోని పరిమి సత్యనారాయణ కల్యాణ మండపంలో శనివారం వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించిన సమావేశానికి పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి మోసగించిందని ఆరోపించారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అంటూ మొదలు పెట్టారని, అది మోసపూరిత పాలను తొలి అడుగు అని విమర్శించారు. కార్యక్రమంలో చేబ్రోలు, పొన్నూరు ఎంపీపీలు కొక్కిలగడ్డ సాహితి, భవనం పద్మలీల, పెదకాకాని జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు పార్టీ మండల అధ్యక్షులు ఆళ్ల శ్రీరామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నాయకులు ఎన్. రూత్రాణి, ఆకుల వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ నాజర్, యందేటి వెంకటసుబ్బయ్య, తాటిబోయిన వేణుగోపాల్, చందు సాంబశివరావు, బీమవరపు విజయలక్ష్మి, పోలేశ్వరరావు, చేబ్రోలు నాగేశ్వరరావు, అల్లం వెంకట్రామయ్య, దంతాల శ్రీనివాసరావు, వెలగా కృష్ణ, కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. 7న్యూస్రీల్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజం చేబ్రోలులో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ సీట్ల వివరాలు గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు. -
ఎన్సీసీ విద్యార్థుల నగదు స్వాహా
పెదకాకాని: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యకు గ్రహణం పట్టింది. కంచే చేను మేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బదిలీపై వెళ్లిన వ్యాయాయ ఉపాధ్యాయుడు (పీఈటీ)ఎన్సీసీ విద్యార్థుల యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. అంతా తెలిసినా ఉన్నతాధికారులు గానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ చర్యలు తీసుకోక పోవడం శోచనీయం. స్కూల్కు జిల్లాలోనే ప్రత్యేక స్థానం మండలంలోని వెనిగండ్ల జెడ్పీ స్కూల్కు చదువుతో పాటు ఆటపాటలకు జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొంతకాలంగా చదువులోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవల పీఈటీ ఉదంతంతో చెడ్డ పేరు కూడా వచ్చింది. వెనిగండ్ల స్కూల్ నుంచి నంబూరుకు బదిలీపై వెళ్లిన వ్యాయామోపాధ్యాయుడు మస్తాన్రెడ్డి యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. ఎన్సీసీ విద్యార్థుల తల్లిదండ్రులు నంబూరు వెళ్లి నిలదీయడంతో ఆయన దిగజారుడుతనం వెలుగుచూసింది. పథకం ప్రకారం నగదు డ్రా బదిలీపై వెళుతున్న మస్తాన్రెడ్డి పథకం ప్రకారం ఎన్సీసీ శిక్షణ పొందుతున్న జూనియర్లు 25 మంది, సీనియర్లు 25 మందిని బ్యాంక్ వద్దకు తీసుకు వెళ్లాడు. ప్రభుత్వం మంజూరు చేసిన నగదు వారి ఎకౌంట్ల నుంచి డ్రా చేయించి తీసేసుకున్నాడు. జూనియర్ల నుంచి రూ. 3,800, సీనియర్ల నుంచి రూ. 4400 చొప్పున మొత్తం 2 లక్షల రుపాయలకు పైగా స్వాహా చేశాడు. అంతే కాకుండా యూనిఫాం, బెల్ట్, టోపీ, షూ మొత్తం పట్టుకుపోయాడు. అంతటితో ఆగకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధులు 16 మంది నుంచి రూ. 500 చొప్పున వసూలు చేసుకున్నాడు. త్వరలో ఏ సర్టిఫికెట్స్ పొందే విద్యార్థులు ఫుల్ యూనిఫాంతో హాజరు కావాల్సి ఉంది.దాన్ని పీఈటీ తీసుకు వెళ్లాడని తెలుసుకున్న తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. స్కూల్కు సంబంధించిన ఆట వస్తువులు కూడా మాయమైనట్లు సమాచారం. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరణ కోరగా ఎన్సీసీ విద్యార్థుల వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, అయితే విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్న్సీసీ సర్టిఫికెట్లు మంజూరుకు ఆటంకం కలుగకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కోరుతున్నారు. వ్యాయాయ ఉపాధ్యాయుడి నిర్వాకం స్కూలుకు వెళ్లి నిలదీసిన తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయుడు -
గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్
నెహ్రూనగర్ : కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో శనివారం ప్రకటించిన సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు నగరం స్థానం సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నగరం స్థానం దక్కించుకుందని వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని విద్యా భవన్లో ఈ నెల 17న రాష్ట్రపతి అవార్డ్లను అందిస్తారని, తనతో పాటు మేయర్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో నగరం నిలవడానికి కృషి చేసిన ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ (జీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంఎం షరీఫ్, డి. యల్లమందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జీటీఏ ఉమ్మడి గుంటూరుజిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా రమాదేవి, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా చలపతిరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ.విజయకుమార్, సంయుక్త కార్యదర్శిగా పి. రమేష్బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ. దశరఽథ్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్బాబు నియమితులయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలను సహించం మంత్రి మనోహర్ కొల్లిపర: ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదని, సొంత పార్టీ వాళ్లయినా అక్రమానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రారంభంలో ఇసుక నిల్వ.. ప్రస్తుతం అనే అంశాలపై రేపటిలోగా తనకు నివేదికను అందించాలని ఆదేశించారు. నదిలో అర్ధరాత్రి మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నారని తనకి సమాచారం వచ్చిందని, దీనిపై సమాధానం చెప్పాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోయేసరికి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు విషయం తేలే వరకు డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను తరలించవద్దని అధికారులను ఆదేశించారు. పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రమణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 2 క్రస్ట్గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. -
ఇంటింటికీ వస్తే నిలదీయండి !
నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ లేనిపోని మాటలు చెప్పి ఇంటింటికీ తిరిగి అబద్ధపు హామీలిచ్చి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు సుపరిపాలన తొలి ఏడాది పేరుతో వస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను నిలదీసి ఎగ్గొట్టిన పథకాలను ఎందుకివ్వలేదో ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఉన్నా సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసి మరీ ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి అందించిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. -
వెబ్–ఆప్షన్ల నమోదుకు వేళాయె !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ఆదివారం ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మేలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులంతా దీనికి సిద్ధం కావాలి. ఈఏపీసెట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన జాబితాలో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు సన్నద్ధం కావాలి. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులకు ఈనెల 16 వరకు ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్ల నమోదులో అప్రమత్తత అవసరం ● వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు విద్యార్థులు ఇంట్లోని సొంత కంప్యూటర్తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవచ్చు. ● ఆప్షన్ల నమోదు ప్రక్రియలో విద్యార్థులు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి. ● హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర కాన్ఫిడెన్షియల్ వివరాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలి. ● విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సర్టిఫికెట్లు తీసుకుని, తమ కళాశాలకు వస్తే గ్యారంటీగా సీటు వచ్చే విధంగా చూస్తామని సిబ్బంది ద్వారా ఫోన్లు చేయిస్తున్నాయి. ఇటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. ● ర్యాంకు ఆధారంగా, నచ్చిన కళాశాలలతో పాటు బ్రాంచ్లకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమో దు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది కటాఫ్ వివరాలు ఏపీ ఈఏపీసెట్ సైట్లో అధికారులు గతేడాది కళాశాలల వారీగా ర్యాంకు, కటాఫ్ వివరాల జాబితా అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాంకులు, రిజర్వేషన్లు అనుసరించి 2024లో భర్తీ చేసిన సీట్ల వివరాలను పొందుపర్చారు. వీటి ద్వారా విద్యార్థులు ఒక అవగాహన వస్తుంది. ఏపీ ఈఏపీసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో పలువురు జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్లోనూ జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వీరంతా ఐఐటీ, ఎన్ఐటీలకు వెళ్లిపోవడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ప్రారంభం రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు అవకాశం 18వ తేదీ వరకు కొనసాగనున్న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 36 కళాశాలల్లో 30,240 సీట్లు సీట్ల వివరాలు గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు. -
శృతి మించిన నరేంద్ర అరాచకాలు
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరాచకాలు శృతి మించి హత్యారాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. పోలీసుల సహకారంతో నియోజకవర్గంలో అకృత్యాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు ప్రధాన రహదారి పక్కన పాశవికంగా ఇనుపరాడ్లుతో దాడి చేయడం వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాత్ర ఉందని ఆరోపించారు. మినీ మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. టీడీపీ హత్యా రాజకీయాలు, అరాచకాలను నిరసిస్తూ అవసరమైతే గ్రామగ్రామాన పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారిని కాపాడుకుంటానని చెప్పారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ ద్వారా పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ మోసాలను గుర్తు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
కొనుగోలు చేయాలి
రైతుల నుంచి మొత్తం పొగాకులక్ష్మీపురం: జిల్లాలో రైతుల నుంచి మొత్తం నల్లబర్లీ పొగాకును గిట్టుబాటు ధరకు కొనగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్ చేశారు. నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని తెలిపారు. గుంటూరు చుట్టగుంట సెంటర్లోని మార్కెట్ యార్డులో శుక్రవారం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్లపాడు, కండ్రిక, మేరికపూడి గ్రామాల రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకులో తేమ శాతం ఎక్కువగా, నాసిరకంగా ఉందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీ గ్రేడ్ కింద 80 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, క్వింటాకు ఆరు వేల రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలిపారు. కండ్రిక గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతు 16 చెక్కులు తీసుకు రాగా, నాసిరకంగా ఉందని 10 తిప్పి పంపేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో రైతు రామయ్య నాలుగు చెక్కులు కొనగోలు కేంద్రానికి తీసుకురాగా రెండు తిప్పి పంపారని చెప్పారు. ఫిరంగిపురం మండలం మేరిక పూడి గ్రామానికి చెందిన రైతు ముక్కంటి 55 చెక్కులు తీసుకు రాగా మొత్తం తెచ్చిన ట్రాక్టర్లోనే అధికారులు వెనక్కి పంపారని వివరించారు. ఈ స్థితిలో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదని పేర్క్ననారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 30వేల టన్నులు ఉత్పత్తి కాగా ఇప్పటికి నాలుగు వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ స్థితిని గమనించి ప్రైవేటు కంపెనీలు గ్రామాలలోనే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు వేగం పెంచాలని, లేనిపక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కృష్ణ పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘ నాయకులు -
సుపరిపాలన కాదు.. రుబాబు పాలన
పక్కా ప్లాన్ ప్రకారం దాడి పీఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి సూర్య ఘర్పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవనం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాలులో ఇంజినీరింగ్ సిబ్బంది, ఉద్యోగులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ లోవోల్టేజ్ సమస్యలను అధిగమించి, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలని ఆయన సూచించారు. బకాయిలపై దృష్టి పెట్టాలని, ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, రైతులకు త్వరితగతిన ఇవ్వాలని సూచించారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహించినా, ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సీజీఎం రాందాస్, గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్. రమేష్, డివిజనల్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. రేపటిలోగా ఫిర్యాదులుపరిష్కరించుకోవాలి డీఏఓ అయితా నాగేశ్వరరావు కొరిటెపాడు(గుంటూరు): అన్నదాత సుఖీభవ ఫిర్యాదులను రైతులు ఈనెల 13వ తేదీలోపు పరిష్కరించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)అయితా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి సెలవు రోజుల్లో (12, 13వ తేదీల్లో) కూడా అందుబాటులో ఉండాలని ఆర్ఎస్కేల సిబ్బందిని ఆయన ఆదేశించారు. నేడు నృసింహస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ మంగళగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నట్లు ఈవో సునీల్కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కొప్పురావూరి లక్ష్మీశ్రీనివాసరావు దంపతులు వ్యవహరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. సమన్వయంతో ఫ్లై ఓవర్ పనులు కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: గుంటూరు నగరంలోని శంకర్విలాస్ నూతన ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సమన్వయంతో వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించుకోవాలన్నారు. ఇప్పటికి ఆక్రమణలు తొలగించిన వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు తదితర వ్యాపారులు సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్లే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులను ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన స్థానిక పెద్దలతో, వ్యాపారస్తులతో నిరంతరం చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, జీఎంసీ ఎస్ఈ శివనాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ పాల్గొన్నారు. పారిశుద్ధ్య సర్వేలోగుంటూరుకు ప్రథమ స్థానం నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) పారిశుద్ధ్య సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలో తొలి స్థానంలో నిలవడం అభినందయనీయమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ బృందం పారిశుద్ధ్య పనులకు సంబంధించి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ప్రజాభిప్రాయ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ 67 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటి నుండి చెత్త సేకరిస్తున్నారా, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలను 24 గంటల్లోగా తొలగిస్తున్నారా, లేదా, మీ మునిసిపాలిటీలో డ్రైన్లను శుభ్రం చేస్తున్నారా లేదా అనే మూడు అంశాలపై ఐవీఆర్ఎస్ బృందం చేసిన సర్వేలో గుంటూరు నగర ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపిన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో గుంటూరు నగరపాలక సంస్థ ప్రథమ స్థానంలో నిలవడం అనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరానికి మంచి పేరు తెచ్చిన ప్రజారోగ్య కార్మికులు, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. గురజాల తహసీల్దార్ సస్పెన్షన్ గురజాల: మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వైవీ కుటుంబ రావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ రావు గతంలో దాచేపల్లి మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన సమయంలో కేసానుపల్లి, పెదగార్లపాడు, భట్రుపాలెం, గామాలపాడు గ్రామాల్లో ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ మాసంలో దాచేపల్లి మండలం నుంచి ఆయన గురజాలకు బదిలీపై వచ్చారు. పట్నంబజారు: రాష్ట్రంలో దుష్టపాలన సాగిస్తూ ... సుపరిపాలన అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో శుక్రవారం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాలు స్కానర్లకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని విమర్శించారు. మిత్రపక్షమైన బీజేపీ కనీసం మేనిఫెస్టో కూడా పట్టుకోని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 11 సీట్లు రావడంపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లల్లోకి వెళ్లి దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడిన పరిస్థితులు దారుణమని ఖండించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం కేసులు పెట్టి జైలుకు పంపారని మండి పడ్డారు. 1989 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి నీచ పాలన ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటున్నారని, అసలు ఏం అఘోరించావు చంద్రబాబు ? అని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్ సీపీ పోరాటంతోనే తల్లికి వందనం పడిందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఆఖరికి అమ్మ ఒడి సైతం తన కుమారుడు ఆలోచనేనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డిని మోసం చేశామని బాధపడుతున్నారని తెలిపారు. సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేసి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై ప్రతి ఒక్క కార్యకర్త కచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నిజమైన వైఎస్సార్ సీపీ కార్యకర్త టీవీ ప్రసారాలు ఎందుకు రావడం లేదంటూ కేబుల్ ఆపరేటర్ను నిలదీయాలని చెప్పారు. సాక్షి వీక్షకుల సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కూటమి పాలనపై వ్యతిరేకత ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయాన అబద్ధాలు చెప్పి గెలుపు తరువాత కనీసం గడప వైపు కూడా కూటమి ప్రభుత్వం చూడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ఒకే ఒక్క పేజీలో ప్రజలకు అందుబాటులో కనిపించేలా ఉంచిందని, దాన్ని పవిత్ర గ్రంథంలా చూసిందని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూటమిపై స్పష్టమైన వ్యతిరేకత కనబడుతోందని పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు అందని పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు. ఏడాదిలో విఫలమైన ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటని, అక్కడ ఓడిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పార్టీని అఖండ మెజా ర్టీతో గెలిపించుకోవాలని, నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాను అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, అనుబంధ విభాగాల అధ్యక్షులు వాసిమళ్ల విజయ్, గనిక ఝాన్సీరాణి, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే నాగమల్లేశ్వరరావును హత్య చేసేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. గతంలో సైతం ఆయన సోదరుడిపై వెంటపడి మరి దాడి చేసి గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అసలు పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన పట్టు కోసం హత్యా రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఖండించారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో నరేంద్రపై కేసు నమోదు చేయాలని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి అని మండిపడ్డారు. బాధితుడికి అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర నీచ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, షేక్ మస్తాన్ వలి, నూనె ఉమామహేశ్వర్రెడ్డి, న్యాయవాది బ్రహ్మారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: ప్రియునితో కలిసి భర్తను హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితురాలు వినుకొండకు చెందిన శ్రీగిరి స్వాతి, ఆమె ప్రియుడు పట్టేపురం మారుతీబాబులకు జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు.. శ్రీగిరి కుమార్ (38)తో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామానికి చెందిన స్వాతికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కుమార్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. స్వాతికి వినుకొండకు చెందిన పట్టేపురం అలియాస్ రాజారపు మారుతీబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 11వ తేదీన కుమార్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా స్వాతి, మారుతీబాబు కలిసి కుమార్ మెడకు తాడు బిగించి హతమార్చారు. కుమార్ తల్లి మేరీ రోజ్లిన్ దీనిపై వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూస్రీల్వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు భర్తను హతమార్చిన భార్యకు జీవిత ఖైదు ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఎండీ పుల్లారెడ్డి మోసానికి నిలువెత్తు రూపం బాబు గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ నిజమనే మాటకు నిలువెత్తు రూపం ఉందంటే అది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని, అబద్ధానికి అద్దం పడితే అది చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజలకు చంద్రబాబు ఊసరవెల్లి మాటలను తెలియజెప్పాలని, అందుకే ఇటువంటి గొప్ప కార్యక్రమానికి జగనన్న శ్రీకారం చుట్టారని వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని ప్రజల గడప వద్దకు చేరిస్తే, జగనన్న నేరుగా ఇంటి లోపలకు తీసుకెళ్లారని చెప్పారు. పొదిలిలో పొగాకు రైతులు, బంగారుపాళెంలో మామిడి రైతులు, గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వస్తే వందలాది మంది పోలీసులతో ఆంక్షలు పెట్టి ఆపుదామనుకుంటే అది అసంభవం అనే విషయం గుర్తించాలని హితవు పలికారు. నిజం వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల పక్షాన గొంతుకై నిలిచిన సాక్షి పక్షాన అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూటమి నేతలు వెళ్లలేని దుస్థితి దాపురించిందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
అనుగురాజు కాంస్య విగ్రహానికి రూపకల్పన
తెనాలి: పన్నెండో శతాబ్దంలో పల్నాడును పరిపాలించిన అనుగురాజు విగ్రహాన్ని తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు రూపొందించారు. ఆయన చరిత్రకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విగ్రహ కమిటీ సూచనతో శిల్పకారులు పలు డ్రాయింగులు, కంప్యూటర్ డిజైన్లను తయారుచేశారు. ఆ ప్రకారం తొమ్మిది అడుగుల నమూనాను తయారుచేసి కమిటీ సంతృప్తిని వ్యక్తంచేశాక 700 కిలోల కాంస్యాన్ని వినియోగించి అనుగురాజు విగ్రహాన్ని సిద్ధం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం అనుగురాజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతం నుంచి వచ్చి పల్నాడును పరిపాలించారు. ఆయన శరీరాకృతి, వస్త్రధారణను ఊహించి విగ్రహాన్ని రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు. ఈ విగ్రహాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో గంగమ్మతల్లి గుడి ఎదురుగా ప్రతిష్టించనున్నారు. విగ్రహ కమిటీ సభ్యులు, అనుగురాజు యాదవ్ అభిమానులతో గురువారం ఆ విగ్రహాన్ని పల్నాడుకు తీసుకువెళ్లారు. పిడుగురాళ్లలో ప్రతిష్ట నిమిత్తం రూపొందించిన తెనాలి శిల్పులు 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు 700 కిలోల కంచుతో తొమ్మిది అడుగుల నిలువెత్తు విగ్రహం -
భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
నకరికల్లు: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డెప్యూటీ డీఈఓ ఏసుబాబు హెచ్చరించారు. నకరికల్లులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని గురువారం తల్లిదండ్రులు ఆందోళన చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి చూశారు. నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముందుగా బియ్యం, కూరగాయలు నాణ్యతను పరిశీలించుకున్నాక వండాలని సూచించారు. వంట గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోసారి నాణ్యత లోపించినా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.పుల్లారావు, జాలాది శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
తిరువూరు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
తిరువూరు: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ బాణోతు జగన్ సస్పెన్షన్కు గురయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు సమాచారం బయటికి పొక్కకుండా గుట్టుగా ఉంచారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నానీకి తుళ్లూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఆయన ప్రమేయం లేకుండా శివశంకర్రెడ్డి అనే వ్యక్తి మరొకరికి విక్రయించినట్లుగా తిరువూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానంలో సబ్ రిజిస్ట్రార్ జగన్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కోవెలమూడి నాని రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం తిరువూరు సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీచేశారు. తొమ్మిది నెలల క్రితం తిరువూరు సబ్ రిజిస్ట్రారుగా వచ్చిన జగన్ ఇదే తరహాలో కొందరు దస్తావేజు లేఖరులు, దళారులు, ప్రైవేటు వ్యక్తులు తెచ్చిన దస్తావేజులను ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలో ఏ పనికై నా బహిరంగంగానే అదనపు డబ్బు వసూలు చేసినట్లు కక్షిదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే తిరువూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో అక్రమాలు వెలికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్ఐ 9121102168 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. 20న స్వర్ణలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ బాపట్ల: కారంచేడు మండలం స్వర్ణలో ఈ నెల 20న ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు పి.కొండయ్య చెప్పారు. శుక్రవారం బాపట్లలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ఏ పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు కౌలు రేట్లు పెంచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కౌలు రైతుకు ఇచ్చే రాయితీలు అందడం లేదని అన్నారు. ఈ సమస్యలపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. సభలకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు సిహెచ్.గంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామారావు హాజరవుతారని తెలిపారు. -
రాష్ట్రం రావణ కాష్టం
కూటమి పాలనలో పట్నంబజారు: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రావణ కాష్టంగా మారుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపేనని, వారు ఎదుగుతుంటే ఆయన ఓర్చుకోలేరని విమర్శించారు.టీడీపీ గూండాల చేతిలో దాడికి గురై, గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షించారు. శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ నేతలతో కలిసి రమేష్ ఆస్పత్రికి వచ్చారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన్ని స్వయంగా చూసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు కోలుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నరేంద్ర ప్రోద్బలంతోనే దాడి మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిందని మండిపడ్డారు. గీటు దాటితే భూస్థాపితం చేయాలని మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని తెలిపారు. దశాబ్దాలు తరబడి ప్రజలకు సేవలందిస్తున్న ఒక దళిత కుటుంబంపై ఘోరమైన దాడులు చేయడం సిగ్గుచేటని ఖండించారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని, హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదని ధ్వజమెత్తారు. కచ్చితంగా ఎమ్మెల్యే నరేంద్రను ఏ–1గా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెరిగిన హత్యలు ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు. కూటమి ఏడాది పాలన మొత్తం కేవలం వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా కొనసాగిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటని ఖండించారు. హింసావాద రాజకీయాలను కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగానే ప్రోత్సహి స్తోందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి మేరుగ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసిన నేతలు -
తిరగబడ్డ రైతుబిడ్డ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. పొంతన లేని లెక్కలు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తలాతోక లేని అభిప్రాయ సేకరణ తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878 ఎకరాలు, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504 ఎకరాలు, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 ఎకరాలు కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది.అయితే గెజిట్తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వమని స్పష్టంగా తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు. అడ్డం తిరిగిన రైతులు నోటిఫికేషన్కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగారు. ఎదురు తిరిగిన పార్టీ నేత మొదటి దశలో భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేసిన తరువాతే రెండోదశ పూలింగ్కు వెళ్లాలంటూ సీఆర్డీయే సిటిజన్ కమిటీ సమావేశంలో సభ్యుడిగా ఉన్న రాజధాని ప్రాంత టీడీపీ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. అసలు సొంత పార్టీ నేతలే ఎదురుతిరగడంతో చంద్రబాబు మాట మార్చారు. రెండో దఫా భూసమీకరణను కుదించారు. తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాలు, అమరావతి మండలంలో కొన్ని గ్రామాలకే పరిమితం చేశారు. అయినప్పటికీ పెదపరిమి గ్రామ రైతులు బహిరంగంగా మైకులు పెట్టి మరీ భూములివ్వం అంటూ ఎదరుతిరగడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సేకరణ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు యత్నిస్తోందని, తాము తిరగబడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కనుమరుగు చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నట్టేట ముంచుతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బాబు తాత్కాలికంగా ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినెట్ నిర్ణయం వాయిదా అడ్డం తిరిగిన పొన్నెకల్లు, నిడుముక్కల రైతులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత భూ సమీకరణలో లేని గ్రామాల్లో కూడా సభలు మొదటికే మోసం వస్తుందన్న భయంతో తాత్కాలికంగా వాయిదా భూములు ఇవ్వమని గ్రామాల్లో మైక్ ప్రచారం సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూసమీకరణకు తాము భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్ ప్రచారం కూడా చేయడం సంచలనంగా మారింది. -
బావమరిది దాడిలో బావ మృతి
చేబ్రోలు: అక్కాబావల మధ్య జరుగుతున్న వివాద విషయం తెలుసుకున్న బావమరిది అక్కడకు వెళ్లి బావతో గొడవ పడి క్షణికావేశంలో కర్రతో తలపై దాడి చేసి గాయపరచటంతో మరణించిన సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండవరం గ్రామానికి చెందిన నన్నపనేని కృష్ణబాబు (35)కు అదే గ్రామానికి చెందిన మక్కే భువనేశ్వరితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణబాబు, భువనేశ్వరిల మధ్య వివాదం జరుగుతుండటంతో భువనేశ్వరి తమ్ముడు గోపీకి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలియజేసింది. గోపి అక్కాబావల ఇంటికి వచ్చి గొడవ విషయం గురించి మాట్లాడుతుండగా బావ బావమరిదిల మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశంలో గోపి బావను సమీపంలో ఉన్న పెద్ద కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. బంధువులు తీవ్ర గాయాలైన కృష్ణబాబును వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుని తల్లి నన్నపనేని వీరకుమారి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్ఐ డి వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రితో జరిగిన ఒప్పందాన్ని అమలుచేయాలి
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వ ఒప్పందం ప్రకారం క్వింటాలుకు రూ.7,000 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకరరావు డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు గడిచిందని, ప్రభుత్వంతో ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఇప్పటికీ న్యాయం జరక్క రైతాంగం ఆందోళన చెందుతోందని తెలిపారు. బాధిత రైతులు శుక్రవారం తెనాలిలో సబ్కలెక్టర్ వి.సంజనా సింహాను కలిసి సమస్యపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు రూ.20 కోట్ల బీమా పరిహారం వచ్చిందని సబ్ కలెక్టర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రకారంగా చూస్తే బాధిత రైతులకు క్వింటాలుకు రూ.3–4 వేలు మాత్రమే వస్తుందని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడుతో గతేడాది జులై 10న విజయవాడలోని మార్క్ఫెడ్ కార్యాలయంలో జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాకు రూ.7,000 ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు మార్కెట్లో క్వింటాలు రూ.13–14 వేలు ఉందని, మార్కెట్ యార్డులో రూ.10,900 ధర పలికిందని గుర్తు చేశారు. తాము నష్టపోతున్నామని తెలిసినా పసుపు రైతులు క్వింటాలుకు రూ.7,000 చెల్లింపునకు అంగీకరించారని శివశంకరరావు చెప్పారు. అప్పులతో రైతుల అవస్థలు అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు వ్యవసాయం చేసేందుకు చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. 14 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ను కలిసినపుడు మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యత అప్పగించినట్టు చెప్పారని తెలిపారు. బీమా పరిహారం నగదు జాయింట్ అకౌంటులో పడిందని సబ్ కలెక్టర్ చెప్పారని, మిగతా పరిహారం కూడా త్వరగా జమ చేసేలా చూడాలని కోరారు. పసుపు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం మళ్లీ రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కార్యక్రమంలో సత్తెనపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్రెడ్డి, గద్దె శ్రీహరి బసవయ్య, చందు సత్యనారాయణ, ఆళ్ల గోవిందరెడ్డి, యర్రా వెంకటేశ్వరరావు, గొల్లపల్లి వెంకటసుబ్బారావు, శివారెడ్డి, చందు సత్యనారాయణ, నాదెళ్ల చంద్రశేఖర్, పోతరాజు కోటేశ్వరరావు పాల్గొన్నారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకరరావు డిమాండ్ -
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాపట్ల టౌన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎంప్లాయీస్ యూనియన్ లక్ష్యమని ఆ యూనియన్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు, వారికి రావలసిన రాయితీలు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాపట్ల డిపో కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్ ఇప్పించడం, వైద్య సౌకర్యాలు అందించడంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాపట్ల డిపో అధ్యక్షులు టి.చంద్రశేఖర్, టి.యస్.నారాయణ, ఎం.కోటేశ్వరరావు గ్యారేజ్ సెక్రటరీ చలపతి, సి.సి.ఎస్. డెలిగేట్ ఎం.పి.కుమార్, సీనియర్ సభ్యుడు ఐ.యస్.రావు, బాపట్ల జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా చైర్ పర్సన్ పి.రజిని పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వై.ఎస్.రావు -
పొగాకు బేళ్లకు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తులు
కాకుమాను: గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు బేళ్లకు నిప్పంటించిన సంఘటన పెదనందిపాడు మండలంలోని నాగభైరవారిపాలెంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది.సేకరించిన సమాచారం మేరకు.. పరిటాలవారిపాలేనికి చెందిన ఓ రైతు బేళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగ కమ్మేయడంతో స్థానికులు యజమానికి సమాచారం అందించారు. మంటలను అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇంకా కేసు నమాదు కాలేదు. పట్టపగలే నివాసంలో చోరీ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): పట్టపగలు నివాసంలో చోరీ జరిగిన ఘటనపై ఫిర్యాదు అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఉప్పలపాటి అంకమ్మరావు తన కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో పలు పనుల నిమిత్తం వెళ్లారు. ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా, పెట్టెలో ఉన్న రూ.8 లక్షల నగదు, రెండున్నర సవర్ల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పాతగుంటూరు పీఎస్ ఎస్హెచ్వో వెంకటప్రసాద్ను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు. అయితే పలు వాస్తవాలు తెలియాల్సి ఉందని, బాధితుల నుంచి పలు అనుమా నాలు నివృత్తి చేసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: తెనాలి వన్ టౌన్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వేము నవీన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన చిరంజీవిపై వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, బాబులాల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇన్నళ్లు తప్పించుకు తిరుగుతున్న నవీన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను ఉన్నత చదువుకున్న దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు నగరంలో వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించి, డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తానని చెప్పిన లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర గరల్స్ కన్వీనర్ బాల నవ్యశ్రీ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తయి మూడు నెలలు కావస్తున్నా నేటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ, సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర కార్యదర్శి అజయ్, రాహుల్, ఆనంద్, డేవిడ్, సాగర్, తేజ, కిరణ్, పవన్, ప్రణీత్ తపాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం -
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆదిగురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో... పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ షిర్డీసాయి – పర్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామునే బాబావారికి సుప్రభాతసేవ, నగర సంకీర్తన, షిర్డీ హారతి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత బాబా విగ్రహానికి పంచామృతాలతో మహా భిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, షిర్డీబాబా, సత్యసాయిబాబా చిత్రపటాలకు, బాబావారి పాదుకలకు భక్తులతో పూజలు చేయించారు. చివరగా అన్నదానం నిర్వహించారు,. వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో ఘనంగా గురుపూర్ణమి -
ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దళిత సర్పంచ్పై టీడీపీ గూండాలతో దాడి చేయించిన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావును గురువారం పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ఆయన పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నరేంద్రను ఏ–1గా చేర్చాలి సుధాకర్బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు. మన్నవ గ్రామ సర్పంచ్పై దాడి ఘటనలో నరేంద్రను ఏ–1గా చేర్చాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పెద్ద నాయకుడైన నాగమల్లేశ్వరరావు ఆధిపత్యాన్ని సహించలేక అతనికి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నాయకుడిని ఉసికొల్పి, ఇద్దరు దళితుల మధ్య హత్యాకాండకు నరేంద్ర తెరతీశాడని ఆరోపించారు. ఆయన చేసిన పాపం ఊరికే పోదని తెలిపారు. వారం రోజులు గడిచినా నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యా రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్తను నడిరోడ్డుపై నరికి చంపితే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్బుక్ పేరుతో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్లు ఎల్లకాలం అధికారంలో ఉండరని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైఎస్ జగన్ అని, వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు దళిత ఎమ్మెల్యులు ఉన్నా దాడులను ఖండించక పోవడం సిగ్గుచేటని ఖండించారు. వారు తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సుధాకర్బాబు డిమాండ్ చేశారు. చైతన్యవంతులైన మాల, మాదిగ ప్రజలు, విద్యావంతులు దళిత వ్యతిరేకిగా ఎమ్మెల్యే నరేంద్ర సాగిస్తున్న అరాచకాలపై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కారు కింద పడి మరణించిన గోవతోటి రాంబాబు మృతి విషయాన్ని బయటకు పొక్కకుండా రూ.10 లక్షలతో రాజీ కుదుర్చుకున్నారని వెల్లడించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు శీలం పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నాయకులు సురేంద్ర, బూదాల శ్రీనివాసరావు, ఎండీ గోరేబాబు, డేవిడ్రాజు, ముగ్గు గవాస్కర్, శామ్యూల్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ ఆస్పత్రిలో నాగమల్లేశ్వరరావుకు పరామర్శ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా -
హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పీఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ పాల్గొన్నారు. -
జిల్లా నెత్తిన అధిక జనాభా కత్తి
గుంటూరు మెడికల్: దేశాభివృద్ధి జనాభాపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే మరికొన్ని లేక ఇబ్బంది పడుతున్నారు. జనాభా పెరుగుదల కోసం ప్రజలకు ఆయా దేశాలు పలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. అయితే, మన దేశంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. జిల్లాలోనూ పెరుగుదల రేటు గణనీయంగా ఉంది. 2001లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 44,65,144 ఉండగా 2011లో 48,87,813 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2021లో జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 2024 నాటికి 52,04,289 మంది ఉండొచ్చని వైద్య అధికారులు అంచనా వేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లా జనాభా 22,26,467 మంది ఉన్నారు. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. గతంలో జనాభా నియంత్రణకు ఆరుసార్లు రాష్ట్ర అవార్డులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరుసార్లు వరుసగా రాష్ట్ర అవార్డులు అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆధ్వర్యంలో 2009–10లో తొలిసారిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఈ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడిన 50 ఏళ్లలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవార్డు రావడం ఇదే ప్రథమం. నాటి నుంచి వరుసగా 2010–11లో, 2011–12లో, 2012–13లో, 2013–14లో, 2015–16లో వరుసగా అవార్డు పొందింది. ఇప్పటివరకు ఏ జిల్లా కూడా సాధించని డబుల్ హ్యాట్రిక్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృస్టించింది. తర్వాత ప్రభుత్వం అవార్డులను నిలిపివేసింది. ఆరోగ్య కార్యక్రమాల అమలుకు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నేడు చిట్టచివరన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిలిచింది. నేడు ప్రపంచ జనాభా దినోత్సం 52లక్షలకు చేరిన జిల్లా జనాభా ఉచితంగా ఆపరేషన్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. పైళ్ళెన వెంటనే గర్భం రాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజలు పాటించేలా వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే సీ్త్రలకు, పురుషులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీజీహెచ్లో అధికంగా ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ప్రతినెలా అధిక మొత్తంలో ఆపరేషన్లు చేస్తున్నాం. జిల్లాలో అత్యధికంగా కు.ని. ఆపరేషన్లు చేస్తున్నందుకు ప్రతి ఏడాది జీజీహెచ్ కుటుంబ నియంత్రణ వైద్య విభాగానికి అవార్డును ఇస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చేసిన రోజే ఇంటికి వెళ్లి పోవచ్చు. – డాక్టర్ యశస్వి రమణ, సూపరింటెండెంట్ గ్రామాల్లోనే జనాభా అధికం సంవత్సరం గ్రామీణం పట్టణం 2011 32,35,075 16,52,738 2024 34,44,539 17,59,750 -
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని సత్తెనపల్లి: 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్పై పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురు వారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభు త్వం చేయమన్న పనులు, ఇవ్వమన్న రిపోర్టులు క్షణాల మీద నిద్రాహారాలు మానేసి సమాయానికి ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావలసిన 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్ పట్ల మాత్రం మౌనంగా ఉంటున్నారని, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను నిరాస నిస్ప్రహలకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు. నెలాఖారులోగా పనులు పూర్తిచేస్తాం ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో జరుగుతున్న మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. గురువారం పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వటం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారు ల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న ట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలో ఉన్ననటువంటి మేజరు కాల్వలు రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు. బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ నెహ్రూనగర్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ప్రతిభావంతులైన పిల్లల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాధారణమైన ధైర్యసాహసాలతో, సామర్థ్యాలు , అత్యుత్తమ విజయాలు కలిగిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు తగిన గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు 2026 ప్రకటించిందన్నారు. ఇతరులకు ఆదర్శంగా, క్రీడలు, సామాజిక సేవ, సైన్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి, నూతన ఆవిష్కరణలు మొదలగు వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్న చిన్నారులు ఈ నెల 31వ తేదీలోగా హెచ్టీటీపీఎస్://అవార్డ్స్.జీఓవీ.ఇన్ వైబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నీటిగుంటలో పడి వ్యక్తి మృతి వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద వెల్ఫేర్ సెక్రటరీల పడిగాపులు ● సుదూర సచివాలయాలకు బదిలీ
కొలిక్కిరాని బది‘లీలలు’ నెహ్రూనగర్: ఉమ్మడి జిల్లా రూరల్ పరిధిలో పనిచేసే గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సొంత మండలంలో పని చేయకూడదనే ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారం చేసుకుని అధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. ఈ నెల 7న వెలువడిన ఉత్తర్వులు చూసి సెక్రటరీలు కంగుతిన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ ఉమ్మడి గుంటూరులో 874 మంది వెల్ఫేర్ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే వెబ్ ఆప్షన్స్(గూగుల్ ఫాం) ఇచ్చి బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు. చాలా మందిని ప్రస్తుత సచివాలయం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి బదిలీ చేశారు. దీంతో ప్రతిరోజూ వందల మంది సచివాలయ సెక్రటరీలు గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి వస్తున్నారు. తమను అంత దూరానికి బదిలీ చేస్తే ఏ విధంగా వెళతామంటూ అధికారులను వేడుకొంటున్నారు. ముడుపులకే ప్రాధాన్యం నిబంధనల ప్రకారం స్పౌజ్ కేటగిరికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, అధికారులు ముడుపులు తీసుకుని కొందరికి నచ్చిన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పనిచేసే సెక్రటరీలకు బదిలీల ప్రక్రియ భారంగా మారింది. ప్రతి రోజు అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, న్యాయబద్ధంగా బదిలీల ప్రక్రియ జరపాలని కోరుతున్నారు. -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసీనాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటిష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢీ చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జగదీష్ గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నానుతాడు అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించామని చెప్పారు. అతడిని విచారించగా చైన్ స్నాచింగ్ను ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాగరాజు డీజే ఆపరేటర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్పై భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెళ్లి పోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రేపు వాటర్ పోలో జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా వాటర్ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
అప్పు చేసి పప్పు కూడు
●సంవత్సరం నుంచి అందని డైట్ బిల్లులు ●రూ.50లక్షలు దాకా బకాయిలు ●ఇబ్బంది పడుతున్న హాస్టల్ వార్డెన్స్ నెహ్రూనగర్: ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో గుంటూరు అర్బన్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లకు అప్పుల బాధ ఎక్కువైంది. డైట్ చార్జీలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో వ్యాపారుల నుంచి సరుకుల అప్పులకు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సుమారు సంవత్సరం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. అప్పులు పెరిగిపోతుండటంతో వ్యాపారుల నుంచి వార్డెన్స్కు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. గుంటూరు అర్బన్లో 13 హాస్టల్స్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 34 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 2,372 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు నెలకు రూ.1600, ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు నెలకు రూ.1400 ప్రభుత్వం చెల్లిస్తోంది. గుంటూరు అర్బన్ పరిధిలో 13 హాస్టల్స్ ఉన్నాయి. అయితే, అర్బన్ పరిధిలోనే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండటంతో విద్యార్థులు ఎక్కువగా గుంటూరు అర్బన్ పరిధిలో ఉండే హాస్టల్స్లో ఉండేందుకు మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం అర్బన్ పరిధిలో 1,800 మంది దాకా ఉన్నారు. భారీగా విద్యార్థులు ఉన్నా సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. కొంత మంది వార్డెన్స్కు గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు, మరి కొంత మందికి ఫిబ్రవరి నుంచి పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.50లక్షలు దాకా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా గత ఏడాది కూడా రూ.60లక్షలకు సంబంధించిన బిల్లులు సకాలంలో ప్రాసెస్ చేయకపోవడంతో అవి మురిగిపోయాయి. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. జిల్లా పర్చేజ్ కమిటీ ఏర్పాటు చేయాలి గతంలో జిల్లా పర్చేజ్ కమిటీ ద్వారా హాస్టల్స్కు కోడిగుడ్లు, కూరగాయలు, చికెన్, పాలు, పెరుగు మినహా మిగిలిన అవసరమైన సరుకులు సరఫరా అవుతుండేవి. అయితే, రెండేళ్ల నుంచి ఈ ప్రక్రియ ఆగిపోవడంతో సమస్య మొదలైంది. వార్డెన్స్ వ్యాపారుల నుంచి అప్పు మీద సరుకులు తెచ్చుకుని విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో బిల్లులు ప్రాసెస్ కాకపోవడంతో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కొంత మంది వార్డెన్లు వాపోతున్నారు. జిల్లా, డివిజనల్ పర్చేజ్ కమిటీలు ఉంటే తమకు నెల నెలా సరుకులు కొనే అవస్థలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు సకాలంలో చెల్లించేందుకు చొరవ చూపాలని వార్డెన్లు కోరుతున్నారు. డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్న అంశాన్ని ఎస్సీ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. -
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలు తాడేపల్లి రూరల్ : మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా వీఆర్వోతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వైద్యం నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పాత జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. తొలుత పెదకాకాని నుంచి బదిలీ అయి ఇప్పటం వీఆర్వోగా విధులకు హాజరయ్యేందుకు నులకపేటలోని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న జయంతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఐదు అడుగులు పైకి లేచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకు కుడి కాలు మోకాలి వద్ద విరిగిపోయింది. వీఆర్వో ద్విచక్ర వాహనం అనంతరం కారు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఇందులో ఇద్దరు పురుషులు, మహిళ, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వీఆర్వోను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు అతి వేగంగా ఉండవల్లి సెంటర్ వైపు వెళ్లడంతో యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వారి వాహనాలను సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, ఆర్ఐ వేదాంతం వివరాలు సేకరిస్తున్నారు. -
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ్ చక్రవర్తి గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో గల కార్యాలయంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మీడియేషన్(మధ్యవర్తిత్వం)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా 90 రోజుల ఇంటెన్సివ్ డ్రైవ్ను నిర్వహించి కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులందరూ మీడియేషన్పై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ద్వారా నియమించబడిన అడ్వకేట్లు, సీనియర్ ట్రైనర్లు సుదర్శన సుందర్, విజయ కమల మీడియేషన్పై అవగాహన కల్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన తాడికొండ: తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో శుక్రవారం జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ఫైనాన్స్ – ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవికుమార్, రమణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డీపీఓ నాగ సాయికుమార్, సీఆర్డీఏ ఈఈ శ్రీనివాసరావు, డీఎస్డబ్ల్యూఆర్ఐ సురేష్, తుళ్లూరు, గుంటూరు తూర్పు తహసీల్దారులు సుజాత, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో దాడి కేసు ప్రథమ నిందితుడు? తెనాలి రూరల్: తెనాలిలో కానిస్టేబుల్పై నలుగురు యువకులు ఏప్రిల్లో దాడి చేయడం, అందులో ముగ్గురికి పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెనాలి వన్టౌన్ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కన్నా చిరంజీవి విధులకు వెళుతుండగా ఏప్రిల్ 24వ తేదీ రాత్రి ఐతానగర్లో నలుగురు యువకులు అతడిపై దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐతానగర్కు చెందిన వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నవీన్ పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని పోలీసులు ఏప్రిల్ 27న అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివాదం జరిగిన రోజున కానిస్టేబుల్ చిరంజీవికి, నవీన్కు మధ్య ఘర్షణ జరిగిందని, జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్ అక్కడే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పొరుగున ఉన్న బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్న నవీన్ గురువారం బయటకు రావడంతో నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. శాకంబరిగా బాల చాముండేశ్వరి అమరావతి: అమరావతి బాల చా ముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. -
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి అర్బన్: వచ్చే ఏడాది మార్చి నాటికి తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఏడాది రోడ్ల మరమ్మతులు, విస్తరణపై దృష్టి సారించినట్లు చెప్పారు. రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలను గుర్తించి, వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్స్ను కూడా డెవలెప్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.36వేల కోట్లు వెచ్చిస్తోందని, ఆ స్థాయిలో ఫలితాలు రావడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందంగా, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో సీవీ రేణుక, ఈగల్ విభాగ ఎస్పీ కె.నగేష్బాబు, మున్సిపల్ వైస్చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వీఎం.లక్ష్మీపతిరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈవో–2 వి.జయంతిబాబు, డెప్యూటీ డీఈవో శాంతకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి.శాంతి, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐకమత్యంతోనే శత్రువుపై విజయం
● జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపు ● మోసానికి బ్రాండ్ అంబాసి‘డర్’ బాబు ● అధికారం కోసమే తప్పుడు హామీలు ● మోసం చేసి ఎన్నికల్లో గెలుపు పట్నంబజారు: రాష్ట్రంలో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది మోసమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సుపరిపాలన కాదు.. మోసాల పాలన అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఏడాదిలో సుపరిపాలన అందించామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ప్రజలు సంతోషంగా ఉంటేనే సుపరిపాలన అవుతుంది తప్పా, సంక్షోభం ఉంటే కాదని తెలిపారు. 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 40 సీట్లు రాలేదని, అందులో కచ్చితంగా సాంకేతిక లోటుపాట్లు, మోసాలున్నాయని ఆరోపించారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో తాము పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. స్కానర్లను చూపించి చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు పరిచిన పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి, తీరా కొంత మందికి మాత్రమే రూ. 13వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. రెండో బిడ్డ ఉంటే కేవలం రూ. 10వేలు పడుతుందని పలువురు చెబుతున్నారన్నారు. సూపర్ –6 అన్ని ఇచ్చేశామని, అడిగిన వారి నాలుక మందమనే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అంబటి ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే 30 నుంచి 40 మందికి దీపం పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో సాగిందంతా కేసులు పెట్టడం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందని తెలిపారు. విభేదాలను పక్కనబెట్టి భవిష్యత్తులపై శత్రువుపై విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే ఓనర్లు వైఎస్సార్సీపీకి కార్యకర్తలే ఓనర్లు అని పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. కష్టకాలంలో పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయాక నేతలు పక్క పార్టీలోకి వెళ్లారు తప్పా, కార్యకర్తలు ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదని పేర్కొన్నారు. అంబేడ్కర్ను చూస్తే రాజ్యాంగం గుర్తుకు వస్తుందని, మహాత్మాగాంధీని చూస్తే స్వాతంత్య్రం గురించి తెలుస్తుందని, భవిష్యత్తు తరాలు పక్కవారిని మోసం చేయాలంటే చంద్రబాబు విగ్రహానికి దండం పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ మరణం తరువాత ఆయన విలువ తెలిసిందని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి తరువాత ప్రజలకు విలువ తెలిసొచ్చిందని తెలిపారు. చంద్రబాబు అబద్ధాలతోనే వైఎస్సార్ సీపీ ఓటమి పాలైందని, కచ్చితంగా అందుకు బదులు తీర్చుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే అంటే ఎం అంటే మోదుగుల, ఎల్ అంటే లేళ్ల అప్పిరెడ్డి, ఏ అంటే అంబటి రాంబాబు అని, తామంతా ఐకమత్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఎన్నికల తరువాత హామీలపై చంద్రబాబును నిలదీయలేకపోతున్న పవన్ కల్యాణ్కు సిగ్గు లేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకుడని చెప్పుకుంటున్నాడని, అతను చేసే అన్యాయాల్లో సగ భాగం కూడా పంచుకుంటున్నావా ? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా శ్రేణులు ముందుకు సాగాలని చెప్పారు. ‘బాబు షూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు సి.డి.భగవాన్, కొరిటెపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, దానం వినోద్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సురసాని శ్రీనివాసరెడ్డి, పార్టీ మహిళ విభాగం నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అధికారం కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుదోవ పట్టించిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే దిశగా ప్రతి ఇంటికి వెళ్లే ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానాలను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వై.ఎస్.జగన్ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా చూస్తే, బాబు దాన్ని బుట్టదాఖలు చేశారని మండి పడ్డారు. ఏడాదిలోపే అనేక ఉద్యమాలతో ప్రజలకు, రైతన్నలకు, విద్యార్థి యువజనులకు, మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచిందని తెలిపారు. కూటమి పాలన ప్రారంభించిన నాటి నుంచి అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో కాలం వెళ్లదీస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క భయానికి తలవంచకుండా ఎత్తిన జెండాను భుజాన దించకుండా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. -
లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడిగా యోగిష్ చంద్ర
కొరిటెపాడు(గుంటూరు): లఘు ఉద్యోగ భారతి సర్వసభ్య సమావేశాన్ని అరండల్పేటలోని యోగి భవన్లో గురువారం నిర్వహించారు. ఇందులో గత రెండు సంవత్సరాల సంస్థ ప్రగతి, ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంఘటన్ కార్యదర్శి ప్రకాష్ చంద్ర హాజరయ్యారు. రాష్ట్ర లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించి, మార్గనిర్దేశం చేశారు. ప్రకాష్ చంద్ర మాట్లాడుతూ దేశాభివృద్ధికి చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ‘లఘు ఉద్యోగ భారతి’ జాతీయ స్థాయిలో పోరాడుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా తులసి యోగిష్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి రమేష్, కోశాధికారిగా ధరణీష్ ధనికుల, ఉపాధ్యక్షులుగా కమల నయన్ బంగ్, రామలింగ, నల్లమోతు శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా గుత్తా సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శులుగా అట్లూరి సునీతా నారాయణ, హరిదాసుల చంద్రశేఖర్, తోట రామకృష్ణ, దాట్ల తిరుపతి రాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీధర్ చిట్టిప్రోలు, విఠల్ ప్రసాద్, మార్పు వెంకటేశం, పందిళ్లపల్లి ప్రవీణ్, రాజులపాటి వెంకట రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకాష్ చంద్ర ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తులసి యోగిష్ చంద్రను పలువురు సభ్యులు అభినందించారు. తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి అరుణ్ కుమార్, రామచంద్ర బ్రదర్స్ అధినేత పుప్పాల సుబ్బారావు, ఆక్వా వాటర్ కంపెనీ అధినేత సాయి, సత్యా ఇంపెక్స్ అధినేత తోట రామకృష్ణలు వివిధ చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి శాయశక్తులా పనిచేస్తానని, అయితే సభ్యుల సంఖ్య పెరిగినప్పుడే మన వాణి గట్టిగా వినిపించటానికి అవకాశం ఉంటుందని ప్రకాష్ చంద్ర తెలిపారు. సభ్యుల సంఖ్య 150 నుంచి 1,000 వరకు పెరగడానికి కృషి చేస్తానని తులసి యోగిష్ చెప్పారు. -
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో క్రోసూరు: కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచి పోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని.. దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టారని తెలిపాడు. గతంలో సాగు నీరు విషయమై కూడా దౌర్జన్యం చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కలిసి డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులతో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు. -
నేటి నుంచి టౌన్చర్చి శతవార్షికోత్సవాలు
తెనాలి: పట్టణంలో టౌన్చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి (తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్రోచర్ను బుధవారం టౌన్చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్బాబు, రెవరెండ్ డి.సాల్మన్రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్బాబు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్ధన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్లు హాజరవుతారని తెలిపారు. ● రెవ.వై.లెనిన్బాబు మాట్లాడుతూ మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్జాన్స్ విద్యాసంస్థ పక్కనగల లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని సభ్యుడు జి.వేమయ్య చెప్పారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం -
ధూళిపాళ్లను టీడీపీలో ఎలా ఉంచుతారు?
ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రేరేపణతోనే పాశవిక దాడి ● దళితుడైన నాగమల్లేశ్వరరావుపై దాడిని ఖండిచేవారే టీడీపీలో లేరా? ● ఏ–4, ఏ–5 నిందితులు టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడమా? ● టీడీపీ అధినాయకత్వం సూచనల మేరకే వైఎస్సార్, వైఎస్ జగన్ను అభిమానించే వారిపై పథకం ప్రకారం దాడులు ● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ప్రజల రక్షణ బాధ్యత అధికారులదే.. ఎన్నికల సమయంలో రాంబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కారు కింద నలిగి మృతి చెందాడని గుర్తు చేస్తూ, మృతుడు రాంబాబు చిత్రపటాన్ని జూపూడి విలేకరులకు చూపించారు. ఎమ్మెల్యే నరేంద్రకు చెందిన డీవీసీ ఆసుపత్రిలో బాధితుడు చనిపోతే రూ.10 లక్షలు పరిహారం ఇచ్చి కేసు నమోదు కాకుండా చేసుకున్నారని ఆరోపించారు. ఇంత వరకు ఈ కేసును బయటకు రానివ్వలేదని మండిపడ్డారు. గుంటూరులో పోలీసులు హోల్సేల్గా అమ్ముడుపోయారా అని విమర్శించారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు భజనలు చేసేందుకు కాదన్నారు. దళితులపై ఏకపక్షంగా దాడులు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసరి రాజు, నీలాంబరం, స్టాలిన్, గనిక ఝాన్సీ, సునీత పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్భలంతోనే మన్నవ సర్పంచి నాగమల్లేశ్వరరావుపై భీకరమైన దాడికి ఒడిగట్టారని, ఇంతటి క్రూర మనస్థత్వం కలిగిన వారిని టీడీపీలో ఎలా ఉంచుతారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెచ్చరిల్లాయన్నారు. పొన్నూరు మండలం మన్నవ సర్పంచి నాగమల్లేశ్వరరావుపై మరణాయుధాలతో క్రూరంగా హత్యాయత్నం జరిగితే, అయ్యో పాపం అనే వారు టీడీపీలో లేరా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో దళితులు ఓట్లేయలేదని, టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారనే దుగ్ధతో పాశవిక దాడులతోపాటు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్రది ఫ్యూడల్ మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానించే వారిపై ప్రత్యక్ష దాడులకు పాల్పడాలని టీడీపీ అధినాయకత్వం నుంచి సందేశాలు వస్తున్నాయని, అందులో భాగంగానే నాగమల్లేశ్వరరావుపై పాశవికంగా హత్యాయత్నానికి తెగ బడ్డారన్నారు. కిందపడిపోయిన నాగమల్లేశ్వరరావు మెడ, తలపై మరణాయుధాలతో అత్యంత కర్కశకంగా హత్యాయత్నం చేశారని వాపోయారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు నిందితుడు బాబురావు కుటుంబం ముఖ్యమైనదన్నారు. నరేంద్రకు ఫ్యూడల్ మనస్తత్వం ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఒక డైరక్టర్ పదవికి బాబురావు ఆశపడ్డాడని విమర్శించారు. ఎమ్మెల్యే నరేంద్ర పరోక్షంగా ప్రేరేపించాడనే బాబురావు పాశవిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఏ–4గా బాబురావు, ఏ–5గా ఉన్న చింపిరయ్యలు టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం విడ్డూరన్నారు. సమావేశం నిర్వహించే ధైర్యం వారికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. -
సమన్వయంతో సైబర్ నేరాలకు చెక్
నగరంపాలెం: పోలీస్ శాఖ, బ్యాంక్లు సమన్వయంతో సైబర్ నేరాలను అరికడదామని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం జిల్లాలోని బ్యాంక్ల మేనేజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దృష్ట్యా సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పిద్దామన్నారు. వినియోగదారులు పోర్టల్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎఫ్ఐఆర్ లేకుండా సహాయమందుతుందన్నారు. ఖాతాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగదు లావాదేవీలు నిర్వర్తించే వేళల్లో బ్యాంక్లను సంప్రదించి నిజనిజాలను పరిశీలించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఖాతాదారులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), యూనియన్ బ్యాంక్ డీజీఎం జవహర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్రెడ్డి, బ్యాంక్ల మేనేజర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు పతకాలు గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్క్రాస్కు అవార్డులు వరించాయి. వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు తెనాలిరూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీల లెక్కింపు జరిగింది. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా రూ.46,76,204 నగదు స్వామి వారికి సమకూరింది. అలానే 19.50 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. అలానే రద్దయిన పాత రూ. వెయ్యి నోట్లు ఆరు, రూ. 500 నోట్లు పది గుర్తు తెలియని భక్తులు హుండీలో వేశారు. లెక్కింపులో భక్తులు, వలంటీర్లు, చెంచుపేట ఆప్కాబ్ బ్యాంక్ సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాచీన ఆలయంలో చోరీ
తెనాలిరూరల్: రూరల్ గ్రామం కొలకలూరులో అతి ప్రాచీన దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం(శివాలయం)లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయం ఆలయంలో పూజల నిమిత్తం వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండడం, హుండీ తాళాలు పగలగొట్టి ఉండటానికి గమనించి ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం ను పిలిపించి ఆధారాలు సేకరించారు. హుండీలో సుమారు రూ.20 వేలు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి నుంచి ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో చరిత్ర కలిగిన పురాతన ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది. -
కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా ముందుకు వెళ్లాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ● ప్రత్తిపాడులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ ● ‘రీ కాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పోస్టర్ల ఆవిష్కరణ ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) పోస్టర్లును ఆవిష్కరించారు. చంద్రబాబు మోసం అందరికీ తెలిసింది అంబటి రాంబాబు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టారని, వైఎస్ జగన్ కన్నా ఎక్కువ సంక్షమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేశారన్నారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత సూపర్సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలి.. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ను ప్రతి ఇక్కరికీ గుర్తు చేసేందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెట్టు వెంకటప్పారెడ్డి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మాజీ ప్రెసిడెంట్ పురుషోత్తం, జిల్లా అధికార ప్రతినిధి నాదెండ్ల రామచంద్రయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు, యువజన విభాగం నాయకుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు మన్నవ వీరనారాయణ, ఖాశింపీరా, చల్లా హనుమంత్యాదవ్, ఆయా అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసే ఏకై క వ్యక్తి చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారన్నారు. మొన్న రైతులను పరమర్శించేందుకు గుంటూరు మిర్చియార్డుకు వచ్చిన సందర్భంలో, పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఈ రోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు న్యాయం చేయమని వెళుతున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి సృష్టిస్తున్న అవరోధాలు, అడ్డంకులు, నిర్భంధాలు చూస్తుంటే ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన గుర్తుకువస్తుందన్నారు. మాజీ ఎంపీ, పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలిచాడని, కానీ ప్రజలు ఓడిపోయారన్నారు. గెలిపించిన ప్రజలనే మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలోనే ఏకై క వ్యక్తి చంద్రబాబన్నారు. ఓడిపోయిన తరువాతనే మాజీ సీఎం వైఎస్ జగన్ విలువ జనానికి తెలుస్తుందన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న విషయాన్ని ప్రజలు, మహిళల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊర్లల్లో తిరిగే ప్రసక్తి ఉండదన్నారు. -
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి పోలీస్ నోటీసులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్లో విచారణకు హాజరుకావాలంటూ.. సత్తెననపల్లి పట్టణ పోలీసులు బుధవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. క్రైం నెంబర్ 156/2025 అండర్ సెక్షన్ 189(2), 189(3), 189(4), 298, 351 (2), 352, 126(2), 61(2) రెడ్విత్ 190 బీఎన్ఎస్ అండ్ సెక్షన్ 3ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు అంశంలో జరిగిన నేరానికి సంబంధించి మీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా రూఢీ అయిన నేపధ్యంలో, దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్కు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. -
శరణు శాకంబరి
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరీ ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. – ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ) -
మనోళ్లే.. వదిలేయ్ !
తాజాగా ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులోని ఒక మిల్లులో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇదే మిల్లుపై స్వయంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ దాడిచేసి పెద్దఎత్తున బియ్యం పట్టుకున్నారు. అయినా ఆ మిల్లులో రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. సుమారు ఇరవై రోజుల కిందట ప్రత్తిపాడులో సుమారు వందకు పైగా రేషన్ బస్తాల లోడుతో వెళుతున్న ఒక పెద్ద ఆటోను స్థానికులు ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. అక్కడకు వచ్చిన పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించే లోపే స్థానిక ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే ఒక నాయకుడు పోలీసులకు ఫోన్ చెయ్యడంతో వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించకుండానే వదిలేశారు. తర్వాత విషయం సోషల్ మీడియాలో రావడంతో అర్ధరాత్రి దాటిన తరువాత వాహనాన్ని స్టేషన్ వద్దకు రప్పించారు. అయితే అప్పటికే వాహనంలో ఉన్న బియ్యం బస్తాలు ముప్పావు వంతు మాయమయ్యాయి. -
వారధిపై అలుముకున్న అంధకారం
● నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ● విద్యుద్దీపాలు వెలగకపోవటంతో తప్పని తిప్పలు రేపల్లె: పెనుమూడి – పులిగడ్డ వారధి అంధకారంలో మగ్గిపోతోంది. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అనుసంధానంగా ఉన్న ఈ వారధి రాష్ట్రంలో రెండో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీధి దీపాలు మరమ్మతులకు గురవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వంతెనపై రాత్రివేళ ప్రయాణం చేయడం కత్తిమీద సాములా మారింది. రోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. పులిగడ్డ – పెనుమూడి మధ్య ప్రయాణించాల్సిన వారికిదే ప్రధాన మార్గం. గతంలో పలు ప్రమాదాలు ఇటీవల రేపల్లె మండలం ఆరవపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నం బీచ్కి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన కుటుంబం మోపిదేవి గుడికి కారులో వెళ్తూ వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రుద్రవరానికి చెందిన యువకుడు, పేటేరుకు చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదం గురై మృత్యువాత పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాత దీపస్తంభాలు ఉన్నా కరెంట్ సరఫరా లేదు. ఈ వంతెనపై విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయడమేకాకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సకాలంలో మంజూరు చేయాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా ఇంతవరకు 9,424 కార్డులు మాత్రమే పంపిణీ చేయడం బాధాకరం. ఈ కార్యక్రమం ముమ్మరం కావాలంటే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ ముమ్మరం చేయాలి. కౌలు కార్డులను సకాలంలో ఇవ్వకపోతే అన్నదాత సుఖీభవ, పంట రుణాలు, పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు వంటివి అందే పరిస్థితి ఉండదు. – కంచుమాటి అజయ్కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ● -
నేటి నుంచి గౌరీ విశ్వేశ్వరాలయ శతాబ్ది ఉత్సవాలు
నగరంపాలెం: గుంటూరు బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులోని గౌరీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో పురాతనమైన వంద ఏళ్లకు పైబడిన శివాలయాలు ఆరుకు పైగా వెలిశాయి. అందులో శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి. 1925 జూన్ 12న ప్రతిష్టించినట్లు ప్రధాన అర్చకుడు జంధ్యాల సుబ్రమణ్యశాస్త్రి బుధవారం తెలిపారు. ఈనెల పదిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి 14వ తేదీ వరకు పాంచాహ్నికంగా నిర్వహిస్తారు. ఈనెల పదిన లక్ష బిల్వార్చన, 11న గౌరీదేవికి లక్ష కుంకుమార్చన నీరాజన మంత్ర పుష్ప, 12న ఆంజనేయస్వామికి లక్ష నాగవల్లీ దళార్చన నీరాజన మంత్ర పుష్పాలు, 13న లక్ష్మీనారాయణ స్వామికి లక్ష తులసీ దళార్చన, 14న స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
రోడ్డెక్కిన రేషన్
గుంటూరు టీడీపీ నేతల కనుసన్నల్లో రేషన్ మాఫియా శాకంబరిగా పార్వతీ అమ్మవారు దుగ్గిరాల: దుగ్గిరాల గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు బుధవారం శాకంబరిగా దర్శనం ఇచ్చారు. అలరించిన భక్తి సంకీర్తన నగరంపాలెం: స్థానిక ఆదిత్యనగర్లోని సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి సంకీర్తన అలరించింది. సాయినాథుని గ్రామోత్సవం ముప్పాళ్ళ: గురుపౌర్ణమి సందర్భంగా చాగంటివారిపాలెంలోని ప్రసన్న షిరిడీసాయిబాబా ఆలయంలో బుధవారం గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. డీలర్లే అక్రమంగా బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారు. రేషన్ డిపోలో బియ్యం ఇవ్వకుండా డీలరే ఇళ్ల వద్దకు వెళ్లి వారికి కిలోకు రూ.10 చొప్పున లెక్కగట్టి డబ్బులు చేతిలో పెట్టి వేలిముద్రలు వేయించుకుంటున్నారు. గతంలో ఎండీఎంయూ వాహనాలు ఉన్న సమయంలో ఇంటి ముందుకే వచ్చి రేషన్ ఇచ్చేవారు. ఆ సమయంలో ఎక్కువమంది బియ్యం తీసుకునేవారు. అయితే ఆ వ్యవస్థను రద్దు చేయడంతో వివిధ సాకులు చూపుతూ డీలర్లు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడం ద్వారా డిపోల నుంచే రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించేస్తున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రిళ్లు రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిపోతోంది. గత వారం రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుబడుతోంది. రేషన్ మాఫియాలో వచ్చిన విబేధాల కారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండటంతో రేషన్ బియ్యం దొరుకుతోంది. గుంటూరు నగరంలో ఆర్టీసీ కాలనీకి చెందిన మిల్లర్ ఈ దందాలో చురుగ్గా ఉన్నాడు. ఇతనికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో అతనిపై కేసులు నమోదు కావడం లేదు. ● పాత గుంటూరు బుచ్చయ్య తోట రెండవ లైన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను ఆదివారం పాత గుంటూరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆటోలో 60 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ● మూడు రోజుల క్రితం గుంటూరు సంజీవయ్య నగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ● నాలుగురోజుల క్రితం దుగ్గిరాల నుంచి గుంటూరుకు తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకుని 85 రేషన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువుకి చెందిన వారు ఈ రేషన్ మాఫియాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ● మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరులో ఉన్న రైస్ మిల్లుకు ఇప్పటం జనసేన పార్టీకి చెందిన నేత ఒకరు రేషన్ బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి. ● దుగ్గిరాల మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ, దుగ్గిరాలకు చెందిన మరో వ్యక్తి ఆధ్వర్యంలో రేషన్ మాఫియా నడుస్తుంది. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, పొన్నూరు మండలాల నుంచి చుండూరులోని ఓ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల వట్టిచెరుకూరు మండలం నుంచి చుండూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను నారాకోడూరు వద్ద అధికారులు పట్టుకున్నారు. కొల్లూరు మండలం నుంచి వట్టిచెరుకూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోలను నారాకోడూరు వద్ద అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పొన్నూరు పట్టణం, మండలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. పట్టణంలోని ఇటికంపాడు రోడ్డులో ఓ ఇంటిలో నిలువజేసిన సుమారు 40 బస్తాల రేషన్ బియ్యం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మాచవరం గ్రామంలో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. 3న్యూస్రీల్రేషన్ మాఫియా కేరాఫ్ చుండూరు కూటమి నేతల కనుసన్నల్లోనే.. తూతూమంత్రంగా పోలీసు కేసులు భారీగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యం ఇంటికి వచ్చి డబ్బులిచ్చి మరీ వేలిముద్రలు తీసుకుంటున్న డీలర్లు వాటాలలో గొడవలతో గత వారం రోజులుగా భారీగా పట్టుబడుతున్న బియ్యం -
సార్వత్రిక సమ్మె విజయవంతం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం గుంటూరులో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టాఫీసు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ బ్యాంకుల్లో సైతం అధికారులు సమ్మెకు పిలుపు ఇవ్వటంతో పూర్తిగా మూతపడ్డాయి. జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనటంతో లావాదేవీలు స్థంభించాయి. ఎస్ఐసీలోనూ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. అదే విధంగా కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనటంతో మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గోడౌన్లలో కార్యకలాలు పూర్తిస్థాయిలో స్థంభించాయి. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బీఆర్ స్టేడియం వరకూ వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ వర్కర్లు, ఆటో కార్మికులు, ఎన్జిరంగా యూనివర్సిటీ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, పనిగంటల వంటి దాదాపు 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చారని విమర్శించారు. రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తూ, కార్మికులను రోడ్డున పడేశాయన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎ.అరుణ్కుమార్ అధ్యక్షత వహించగా ఎఐఎఫ్టీయూ న్యూ నాయకులు యు.నాగేశ్వరరావు, రైతుకూలీ సంఘం నాయకులు విష్ణు, ఏరువాక రైతు సంఘం పి.కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పి.సాయికుమార్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.సువర్ణబాబు సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, సీపీఎం నేత నళినీకాంత్ పాల్గొన్నారు. గుంటూరులో వామపక్షాల భారీ ర్యాలీ -
గుర్తింపు ఏదీ..?
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందేనా!కొరిటెపాడు(గుంటూరు): అన్నదాతలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర అలసత్వం చూపిస్తోంది. ఫలితంగా కార్డులు అందక.. బ్యాంక్ రుణాలు దక్కక కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సీజన్కు గానూ జిల్లాలో 46,400 కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 9,424 మందికి మాత్రమే సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేశారు. నిజానికి గుంటూరు జిల్లావ్యాప్తంగా అధికారికంగా సుమారు 50 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా జిల్లాలో 60 వేల మందికి పైగానే కౌలు రైతులు ఉన్నారు. కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించలేదు. గ్రామ సభలు ఏవీ? సాధారణంగా పంటల సీజన్ మొదలవ్వగానే కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేస్తారు. కానీ అలాంటి ప్రక్రియ జరగడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగుకు బయట వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 46,400 కౌలు కార్డులు మంజూరు లక్ష్యంగా ఉండగా ఇప్పటికి 9,424 కార్డులు మాత్రమే మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌలు రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్.. కౌలు రైతులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది, ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఒక సారి జారీ చేసిన కార్డును మళ్లీ భూ యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారులు జారీ గణనీయంగా పెరిగాయి. అసలు రైతుల మాదిగా కౌలు రైతులకు పంట రుణాలు అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా పరిహారం అందించి అండగా నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా అరకొర కార్డులే.. బ్యాంక్ రుణాల కోసం కౌలు రైతుల ఎదురు చూపులు జిల్లా లక్ష్యం 46,400 సీసీఆర్సీ కార్డులు ఇప్పటివరకు మంజూరు చేసింది 9,424 మందికి మాత్రమే -
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు. శాకంబరి ఉత్సవాలు ప్రారంభం నగరంపాలెం: స్థానిక అమరావతిరోడ్డు హిందూ ఫార్మసీ కళాశాల ఎదురు వీధిలోని శాకంబరి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంతశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈనెల 11 వరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్కో క్వార్టర్స్ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్ను జెన్కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అమరేశ్వరుని ఆదాయం రూ.27.09లక్షలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499లు, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596లు, మొత్తం రూ.27,09,095లు ఆదాయం వచ్చిందన్నారు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన -
స్థల ఆక్రమణపై విచారణకు హాజరైన కిలారి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): జీటీ రోడ్డు (మిర్చి యార్డు ప్రాంతం)లో ఉన్న 1,548 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య (జనసేన) ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని గుంటూరు నగరానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గుమ్మడి రాజారావు భార్య గుమ్మడి భారతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రోశయ్య, గుమ్మడి భారతిలు మంగళవారం కమిషనర్ సమక్షంలో విచారణకు హాజరయ్యారు. దీనిపై భారతి తెలిపిన వివరాల ప్రకారం .. 1,548 గజాల స్థలాన్ని 1980లో ఓ వ్యక్తి నుంచి వద్ద నుంచి గుమ్మడి భారతి భర్త రాజారావుతో పాటు మరో ఇద్దరు కలిసి స్వాధీన అగ్రిమెంట్ కింద కొనుగోలు చేశారు. అయితే స్థలం అమ్మిన వ్యక్తి 1981లో స్థలాన్ని అప్పు కింద అటాచ్ చేయాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలోనే స్థలం అమ్మిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే తాలుకా వ్యక్తులకు జీపీఏ చేశారు. రాజారావుతో కలిసి ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. దీంతో 2015లో ఆ స్థలం ముందు భాగంలో ఒక థియేటర్, వెనుక భాగంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. మధ్యలో ఉన్న రాజారావు స్థలాన్ని అలాగే ఖాళీగా వదిలేశారు. సదరు స్థలాన్ని రాసివ్వాలని పలుమార్లు బెదిరించినప్పటికీ రాజారావు స్పందించకపోవడంతో కారుతో ఢీకొట్టే యత్నం చేశారని ఆమె ఆరోపించారు. రాజారావు గత సంవత్సరం మృతి చెందడంతో తమ స్థలంలో కూడా నిర్మాణం ప్రారంభించారని భారతి తెలిపారు. గొడవను కోర్టులో తేల్చుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారని ఆమె పేర్కొన్నారు. రోశయ్యను అరెస్టు చేయాలి అధికారం అడ్డుపెట్టుకుని దళితుల స్థలాలను ఆక్రమిస్తున్న కిలారి రోశయ్యను వెంటనే అరెస్టు చేయాలని దళిత, బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన కిలారి రోశయ్యను వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు జీఆర్ భగత్ సింగ్, నల్లపు నీలాంబరం, చిన్నం డేవిడ్ విలియమ్స్, జూపూడి శ్రీనివాసరావు, బండ్లమూడి స్టాలిన్, తాటికొండ నరసింహారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
పట్టుకోండి చూద్దాం
● పోలీసులకే సవాల్ విసురుతున్న మన్నవ సర్పంచిపై హత్యాయత్నం కేసు ● నిందితులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం ● జిల్లా టీడీపీ కార్యాలయంలో నిందితుల ప్రెస్మీట్ ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మండిపాటుసాక్షి టాస్క్ఫోర్స్ ప్రభుత్వం మనది.. అధికారం మనది.. ఏం చేసినా అడిగే వారుండరు.. ఎవరైనా అడిగితే మన బాస్ చూసుకుంటారులే.. ఇదీ ప్రస్తుతం టీడీపీ నాయకుల ఆలోచన తీరు. ఎంతటి ఘోరం చేసినా, నేరం చేసినా మనల్నెవడ్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పొన్నూరు టీడీపీ నాయకులు. హత్యాయత్నం కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నాయకులు ఏకంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడననట్లుగా ఉండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో ఎంతటి నేరం చేసిన వారైనా.. హత్యాయత్నం కేసులో ఉన్న ఏ4, ఏ5 నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఏకంగా టీడీపీ కార్యాలయంలోనే పార్టీ ప్రతినిధులుగా నిందితులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చిన్న చిన్న నేరాల్లో ఉన్న వారి కోసం వెతుకులాడే పోలీసులు అత్యంత ఘోరంగా దాడి చేసి హత్నాయత్నానికి పాల్పడిన వారిపట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 3వ తేదీన గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మన్నవ దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ4, ఏ5లుగా ఉన్న బండ్లమూడి చింపిరయ్య, బండ్లమూడి బాబూరావులను టీడీపీ జిల్లా కార్యాలయంలో కూర్చొపెట్టి ప్రెస్ మీట్ పెట్టించడం చూస్తుంటే.... కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారికి కొమ్ముకాస్తుందో అర్థమవుతోందని అన్నారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలౌతుందో చెప్పడానికి, ఈ ప్రెస్ మీటే ఒక ఉదాహరణ అని దుయ్యబట్టారు. ఈ జిల్లాలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులంటే నిందితులకు లెక్క లేదా అని నిలదీశారు. హత్యాయత్నం కేసులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏ1 గా చేర్చాలని, రెండు రోజుల క్రితం వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీని కలిసి ఇచ్చిన ఫిర్యాదు చేసినప్పటికీ ఏ4,ఏ5 నిందితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తమ ఎమ్మెల్యేకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిందితులు దర్జాగా తిరుగుతూ, మా టార్గెట్లో ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని చంపేస్తామని హెచ్చరించడం చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అండగా ఉందో తెలుస్తుందని మురళీకృష్ణ అన్నారు. నాగమల్లేశ్వరరావుపై కట్టుకథలు అల్లి, అతని క్యారెక్టర్ దిగజార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. బండ్లమూడి బాబూరావు దౌర్జన్యాలు,అక్రమాలు ఆధారాలతో త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
సమావేశంలో కొరవడిన సమన్వయం
మంత్రి దుర్గేష్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశంగుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్లు రాలేదు. -
గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితులు అరెస్టు నెహ్రూనగర్: అడవి తక్కెళ్లపాడు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ ఎం యశోధర దేవి తెలిపిన వివరాల మేరకు.. అడవి తక్కెళ్లపాడుకు వెళ్లే రోడ్డులో చెరువు కట్ట వద్ద ఆటో నిలిపి గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న గుంటూరు వారితోటకు చెందిన షేక్ జాఫర్ అహ్మద్, కాకుమానువారితోటకు చెందిన పెట్లూరి సాహిద్, బొంగరాలబీడుకు చెందిన దాసరి సుమంత్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 456 గ్రాముల గంజాయిని, ఒక ఆటో. 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నగరానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి వద్ద నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సీహెచ్ మాధవి, పీఆర్కె మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వినియోగిస్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ స్టేషన్కు అధికారులు పిలిపించారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి మరీ సీఐ యశోధరదేవి కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి వినియోగించినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని వీవీవీ హెల్త్ క్లబ్లో ఎన్నుకున్నారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహారెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్గా టి.అరుణ్ కుమార్, చైర్మన్గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్ర బాబు, ఎన్వీ కమలాకాంత్, ఎస్వీ రామ కోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
చీరాల టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్ఆర్ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. వారిని కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
సాగు చేయనీకుండా అడ్డుకుంటున్నారు
నగరంపాలెం: జనసేన పార్టీ నేత తమ పొలం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని కౌలు రైతు వాపోయాడు. షేర్ ట్రేడింగ్ మార్కెట్లో దాదాపు రూ.27 లక్షలు పొగోట్టుకున్నట్లు మరో బాధిత ఉపాధ్యాయురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో బాధితులు పలు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జనసేన నేత అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఇటీవల జొన్నలగడ్డ గ్రామ పరిధిలోని సుగాలికాలనీ సమీపాన రెండు ఎకరాల పొలం కౌలుగా తీసుకున్నాను. ఫైనాన్స్ కింద ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేస్తున్నా. అయితే పొలం సాగు చేసుకునే క్రమంలో జనసేన పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచి అడ్డంకిగా మారాడు. ఈ క్రమంలో పొలానికి వెళ్లే దారిలో అడ్డగించడం, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించడం చేస్తున్నాడు. గత మంగళవారం ట్రాక్టర్పై పొలం వెళ్తుండగా అడ్డగించి ధూషించాడు. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడని, ఊరు వదిలి వెళ్లకపోతే సహించేదిలేదని బెదిరించాడు. ఉప సర్పంచిపై చర్యలు తీసుకుని, మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నా. – కె.రామునాయక్, శ్రీనునాయక్, బాలునాయక్, సుగాలి తండా, జొన్నలగడ్డ గ్రామం, గుంటూరు రూరల్ మండలం. జిల్లా ఎస్పీకి కౌలు రైతు ఫిర్యాదు పోలీసు పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరణ -
సక్రంగా మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం
గుంటూరు వెస్ట్: ఈనెల 10న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరుగనున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0 నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ ఎ.భార్గవ్తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంపై గ్రామ, మండల, పట్టణాల్లో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార అంశాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు, పూర్వ విద్యార్థులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలను ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశం జరిగే రోజు ఏర్పాటు చేయనున్న భోజనానికి సరుకులు ముందే సిద్ధపరుచుకోవాలని పేర్కొన్నారు. ●జేసీ భార్గవ్తేజ మాట్లాడుతూ హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులు పీసీఆర్డీ కార్డులు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు అందించాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ టి.వి.రేణుక పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ సుందరాచారి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్టు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులో అసోసియేషన్ 32వ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సుందరాచారిని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాదిపాటు డాక్టర్ సుందరాచారి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కాగా, ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థులు డాక్టర్ పి.సాయిలక్ష్మి ఫ్రీ పేపర్ ప్రజంటేషన్ పోటీల్లో రాష్ట్రంలో మొదటి బహుమతి గెలుపొందారు. డాక్టర్ పి.వల్లికృష్ణప్రియ పోస్టర్ ప్రజంటేషన్ పేపర్లో మొదటి బహుమతి గెలుపొందారు. సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు న్యూరాలజిస్టులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్సుందరాచారిని అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ గెలుపొందిన వైద్య విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఉప్పుటూరి అరుణకుమారి, డాక్టర్ గొట్టి పాటి బిందు నర్మద, తదితరులు పాల్గొన్నారు. -
చదరంగంలో చిచ్చర పిడుగులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): మేధావుల క్రీడగా పేరుగాంచిన చదరంగానికి ఘన చరిత్రే ఉంది. మన దేశంలో పుట్టి ఖండాంతరాలు విస్తరించిన ఈ క్రీడలో రాణించాలంటే అంత సులభం కాదు. ఏకాగ్రతతోపాటు అకుంఠిత దీక్ష ఎంతో ముఖ్యం. ఈక్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికతోపాటు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ మెహర్, మౌనిక, అక్షయలాంటి వారు గుంటూరుకు చెందిన వారే. చక్కని క్రీడాకారులతోపాటు ప్రతిభగల కోచ్లు కూడా జిల్లాలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా చిన్నారులు చెస్ సాధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా చెస్ శిక్షణలో పేరుతెచ్చుకున్న జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్లో జరగనున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్కు చల్లా నిహారిక ఎంపికయ్యింది. ప్రస్తుతం ఆమె 2072 ఫిడే రేటింగ్స్తో ఉంది. ఈ సీజన్ అనుకున్నట్లు జరిగితే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించే అవకాశముందని కోచ్ చల్లా రవీంద్ర రాజు అంటున్నారు. ఫిడే రేటింగ్స్తో దూసుకుపోతున్నగుంటూరు క్రీడాకారులు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ రేసులో నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ రేటింగ్ సాధిస్తా ఈ నెలలో ఫ్రాన్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ పోటీల్లో నా ఫిడే రేటింగ్ మెరుగు పరచుకునే అవకాశముంది. ప్రస్తుతం 2072 పాయింట్లతో ఉన్నాను. 2200 పాయింట్లు వస్తే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కుతుంది. గత ఏడాది ఇటలీలో జరిగిన బెల్లా ఇటాలియన్ 2100 పాయింట్ల లోపు టోర్నమెంట్లో ప్రథమ స్థానం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఇప్పటివరకు 20 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఈ ఏడాది గుజరాత్లో జరిగిన జాతీయ మహిళల చెస్ పోటీల్లో టీమ్ విభాగంలో తృతీయ స్థానం లభించింది. ఏంబీఏ చేస్తున్నాను. చదువును, చెస్ను సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే ఉన్న సమయాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా సులభం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంత వరకు వచ్చాను. దీంతోపాటు కోచ్ రవీంద్ర రాజు శిక్షణ ఎంతో నేర్పింది. – చల్లా నిహారిక, గుంటూరు -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఐ యేట్ ఇండియా’
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ యేట్ ఇండియా’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. మరో నాలుగు బహుమతులను అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం (డాక్టర్ ఎం.ఎస్.చౌదరి), ఉత్తమ ఆహార్యం (దినేష్), ఉత్తమ రంగాలంకరణ (దివాకర ఫణీంద్ర), జ్యూరీ బహుమతి (లోహిత్) సహా మొత్తం ఐదు బహుమతులు లభించాయి. ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, విశాఖపట్నం వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటిక ఉత్తమ నటి (శోభారాణి), ఉత్తమ క్యారెక్టర్ నటి (నాగరాణి), బహుమతులను అందుకుంది. తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన (పీటీ మాధవ్), ఈ నాటికలో నటించిన పి.వరప్రసాద్ ఉత్తమ నటుడు బహుమతిని, డి.హేమ ఉత్తమ ప్రతినాయకురాలు బహమతులను గెలుచుకున్నారు. ● ఇతర ప్రదర్శనల్లో ‘అ సత్యం’ నాటికకు ఉత్తమ సంగీతం (పి.లీలామోహన్), ఆ నాటికలో నటించిన పి.రామారావుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతి లభించాయి. ‘వీడేం మగాడండీ బాబూ’ నాటికలో నటించిన జీఎస్ చలపతికి ఉత్తమ హాస్యనటుడు బహుమతి లభించాయి. ‘అనుకున్నదొకటి అయినదొకటి’నాటికలో పిల్ల బిచ్చగాడు పాత్రధారి రుత్విక్కు జ్యూరీ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేతలుగా చెరుకుమల్లి సింగారావు, వి.హైమావతి, గోపరాజు విజయ్ వ్యవహరించారు. పోటీల అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజేతలకు బహుమతులను అందజేశారు. సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, డీఎల్ కాంతారావు పాల్గొన్నారు. తొలుత పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలతో చివరిరోజు కార్యక్రమాలను ఆరంభించారు. తెలుగు కళాసమితి, విశాఖపట్నంవారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు చలసాని కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. చివరగా చైతన్య కళాభారతి, కరీంనగర్వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. పి.వెంకటేశ్వరరావు మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరించగా, మంచాల రమేష్ దర్శకత్వం వహించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు -
శిక్షణ తీరు మారింది.
గత ఐదేళ్లలో చెస్లో శిక్షణ విధానం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ చెస్కు చాలా ఉపయోగపడుతుంది. సరదాగా చెస్ ఆడుదామనుకునే వారు దీన్లోకి రావద్దని చెబుతాను. నా వద్ద ప్రస్తుతం 40 మంది శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో కొందరు త్వరలోనే ఇంటర్నేషనల్ హోదా సాధిస్తారు. ఆ స్థాయిలో రాణించాలంటే రోజుకు కనీసం 6 గంటల సాధన చేయాలి. నేర్చుకునే దానికంటే నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుంది. నా శిక్షణ విధానం రిజల్ట్స్ కోసమే ఉంటుంది. దీని కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తాను. – రవీంద్ర రాజు చల్లా, ఫిడే ఇన్స్ట్రక్టర్, ఇంటర్నేషనల్ చెస్ కోచ్, జీనియస్ చెస్ అకాడమీ -
చాలా నేర్చుకోవాలి
ప్రస్తుతం నా వయస్సు 12 సంవత్సరాలు. నాకు 1459 ఫిడే రేటింగ్ ఉంది. ఇప్పటికే 10 నేషనల్స్లో పాల్గొన్నాను. 7వ తరగతి చదువుతున్నాను. చెస్పై ఎంతో మక్కువ. అందుకే నిత్యం రెండు మూడు గంటల సాధన చేస్తున్నాను. గ్రాండ్ మాస్టర్ అవ్వడమే లక్ష్యం. రానున్న కాలంలో మరిన్ని ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొంటాను. కోచ్తోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ క్రీడలో రాణించాలంటే సాధనతోపాటు ఇష్టం కూడా ఎంతో ఉండాలి. చెస్ కారణంగా నాకు చదువులోనూ మంచి ఏకాగ్రత లభిస్తుంది. సమయాన్ని ఎక్కువగా చెస్ మీదే గడపడం వలన సెల్ ఫోన్ చూడను. – కె.సాన్విక, గుంటూరు -
ఎమ్మెల్యే నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ధూళిపాళ్ల నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో.. మన్నవ గ్రామంలో బొనిగల నాగమల్లేశ్వరరావుపై దారుణంగా దా డి చేయించి, నాగమల్లేశ్వరరావు కుటుంబీకులను గూండాలు, రౌడీషీటర్లని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక దళిత కుటుంబంపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుంటూరు నగరం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం తాను, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కలిసి ఆస్పత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావును చూసి రావటం జరిగిందన్నారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావుపై టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు దాడి చేయడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన అమరేంద్రపై కూడా దాడి చేశారని, ఆ కుటుంబాన్ని మట్టుబట్టేందుకు ధూళిపాళ్ల, ఇతర టీడీపీ నేతలు సిద్ధమయ్యారన్నారు. గీత దాటిస్తే భూస్థాపితం చేయండని చెప్పటం.. చంపండి అని చెప్పడం ఒకటేనన్నారు. కచ్చితంగా ధూళిపాళ్ల శిక్షార్హులని, ఆయనపై 307 ఐపీసీ కేసు నమోదు చేయాలని, ఏ1గా పెట్టాలని డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల ఆదేశాలతోనే దాడి: అంబటి మురళీ కృష్ణ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదేశాలతోనే నాగేమల్లేశ్వరరావుపై దాడికి తెగబడ్డారని అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి వాకబు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొంతన లేని మాటాలు మాట్లాడుతున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు సోదరుడిపై కూడా దాడి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. కూటమి నేతలకు పోలీసులు, దాసోహమై వ్యవహరిస్తున్నారన్నారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను స్టేషన్కు పిలిపించి, గోడ కుర్చీలు వేయించి, ఒక మేడమ్కు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారన్నారు. హోం మంత్రి అనిత, ఒక దళితురాలై ఉండి, నాగమల్లేశ్వరరావు విషయంలో హింసాయుతమైన వాతావరణం ఏర్పడితే, హత్యాయత్నం చేయించింది మీ ఎమ్మెల్యే అని స్పందించటం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి -
తెప్ప తగలేసే రకం చంద్రబాబు
ఏరుదాటాక తెనాలి: ఏరుదాటాక తెప్ప తగలేసే చరిత్ర చంద్రబాబుది.. గతంలో రైతు రుణమాఫీని ఏవిధంగా చేసిందీ చూశాం. జనసేన, టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీలనూ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పై తెనాలి నియోజకవర్గ సమావేశం సోమవారం సాయంత్రం ఇక్కడి గంగానమ్మపేటలోని ఎం.కన్వెన్షను హాలులో జరిగింది. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చంద్రబాబు సూపర్సిక్స్ హామీలను నిలబెట్టుకోకపోగా బుకాయిస్తున్నాడని, పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిర్బంధించటం మినహా పరిపాలనపై దృష్టిలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలకు తండోపతండాలుగా జనం వస్తుండటాన్ని చూసి, ఎక్కడ తనపై వ్యతిరేకత వస్తుందోనని చంద్రబాబు కక్షగట్టారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు చేసిన మోసాన్ని చాటుతారని హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో ప్రజలు సభాధ్యక్షుడు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను అమలుచేయని కారణంగా ఒక్కో కుటుంబం ఏడాదిలో ఆర్థికంగా ఎంత నష్టపోయిందీ అవగాహన కల్పించాలని చెప్పారు. తెనాలిలో మూడు పార్టీల జెండాలు మెడలో వేసుకుని ఓట్లు అడిగిన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒకరికి సమస్యలు చెబితే పరిష్కారం కావనీ, ఇంకొకరికి చెబుదామంటే అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను కలిసి ఏమేరకు నష్టపోయిందీ తెలియజెప్పాలన్నారు. క్యూఆర్ కోడ్ షీట్ ఆవిష్కరణ తొలుత చంద్రముఖి సూపర్ఫ్లాప్–6 డీజే మిక్స్ ఆడియోను పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెచ్చే క్యూఆర్ కోడ్ షీట్ను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కళ్లం వెంకటప్పారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రహిమా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, పార్టీ ఇతర నాయకులు మాట్లాడారు. నియోజకవర్గం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరయ్యారు. గతంలో రైతురుణమాఫీని ఏవిధంగా చేశారో చూశాం ఇప్పుడు సూపర్సిక్స్ హామీలపైనా మోసం అదేమంటే నాలుక మందం అంటున్నాడు కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కృషి జరగాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
చదరంగం ఏకాగ్రతను పెంచింది
నా తండ్రి చెస్ కోచ్. ఆయనతోనే ఉండడం వలన చెస్పై ఆసక్తి పెరిగింది. చెస్లో ప్రతి రోజూ నేర్చుకునేందుకు ఎంతో ఉంటుంది. దీంతో ఏకాగ్రత పెరిగింది. అది నా చదువుకు ఉపయోగపడింది. ఇటీవలే ఐఐటీలో ఎంటెక్ సీటు వచ్చింది. నాకు ప్రస్తుతం 1589 ఫిడే రేటింగ్ ఉంది. అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ టోర్నమెంట్లో 5వ స్థానం సాధించడంతోపాటు పలు జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాను. చదువుతోపాటు ఫిడే రేటింగ్ పెంచుకోవడమే లక్ష్యం. గ్రాండ్ మాస్టర్ హోదా కోసం కృషి చేస్తాను. – చల్లా చైతన్య రాజు, గుంటూరు -
అర్జీల పరిష్కారం మరింత వేగవంతం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సులభంగా పరిష్కరించగలిగే వాటి కోసం అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దన్నారు. అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. 259 అర్జీలను కలెక్టర్తోపాటు జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
మాదకద్రవ్యాలతో యువత నిర్వీర్యం
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారని ఏపీ పోలీస్ ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నివారణపై ఆదివారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యా లు, మత్తు పదార్థాల వలన నేరాలు అధికంగా ఉన్నాయని, అరికట్టేందుకు ప్రభుత్వం తమ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మత్తుకు బానిసలు కావడం దురదృష్టకరమని తెలిపారు. కళాశాలల్లో అవగాహన సదస్సుల ద్వారా దుష్పరిణామాలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ యువతలో బాధ్యత పెంచేలా ఈగల్ వింగ్ తో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను పురుషుల కంటే మహిళలు అధికంగా వాడటం దురదృష్టకరమని, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలని తెలిపారు. మాస్టర్మైండ్స్ విద్యార్థులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆకే రవికష్ణ ప్రారంభించారు. ఈగల్ పోలీస్ వింగ్ ఎస్పీ నగేష్ బాబు, డీఎస్పీ అరవింద్, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ జయపాలరెడ్డికి అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జయపాలరెడ్డి వెలగల ఎంపికయ్యారు. ప్రపంచ వైద్య రంగంలో ముఖ్యంగా సర్జికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే బిరుదు ఆయనకు లభించింది. ఈ విషయాన్ని ఏసీఎస్ డైరెక్టర్ మైఖేల్ ఇ–మెయిల్ ద్వారా డాక్టర్ జయపాలరెడ్డికి తెలిపారు. చికాగోలో అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు క్లీనికల్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. 10 వేల మందికిపైగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ జయపాలరెడ్డి ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన ఆయన విశాఖపట్నంలో 2004లో ఎంబీబీస్ చదివారు. పాండిచ్చేరి జిప్మర్లో 2012లో జనరల్ సర్జరీలో పీజీ చేశారు. కేరళ కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జపాన్లో ఫెలోషిప్ చేశారు. కొచ్చిలో ఐదేళ్లపాటు, ముంబయి కోకిలా బెన్ హాస్పిటల్లో ఏడాదిపాటు పనిచేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పెద్దపేగు క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, ప్యాంక్రియాస్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు చేశారు. ఎన్నారై మెడికల్ కాలేజ్లో 2021 నవంబర్ నుంచి సంబంధిత వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. 1500కుపైగా ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. ఈ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ జయపాలరెడ్డి తెలిపారు. వైద్య కళాశాల, హాస్పిటల్ యాజమాన్యం, సర్జన్లు ఆయన్ను అభినందించారు. -
తెలుగు తమ్ముళ్ల అరాచకపర్వం
మేడికొండూరు: తొలి ఏకాదశి పర్వదినాన పేరేచర్ల సింగరయ్య స్వామి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరుగుతాయి. మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో పేరేచర్ల గ్రామంలో వరదరాజస్వామి దేవస్థానం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ ఊరేగింపుగా వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరేగింపును అడ్డగించారు. టీడీపీ జెండాలతో, పాటలతో ప్రభను అడ్డగించి గొడవకు ది గారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సర్ది చెప్పినా మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అరాచకాలు అంతా ఇంతా కాదని ప్రజలు మండిపడుతున్నారు. -
హక్కుల కోసం పోరాటానికి సిద్ధంకండి
నెహ్రూనగర్: హక్కుల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ ఏకమై పోరాడేందుకు రాష్ట్రస్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ డీజీపీ, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం గుంటూరులోని శ్రీనగర్లో మండల్ స్టడీ సర్కిల్లో ఆగస్టు నెలలో నిర్వహించే భారీ రాష్ట్ర మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడంపై నిలదీసి అడగాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలన్నదే ఏకై క లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పోరాటానికి సన్న ద్ధం కావాలన్నారు. తమిళనాడు తరహాలో ఇక్కడా బ్లాక్ షర్ట్ ఉద్యమం మొదలవ్వాలని పేర్కొన్నారు. జనాభాలో అత్యధిక వాటా ఉన్నా బీసీలకు రాజ్యాధికారం తదితర విషయాల్లో న్యాయం జరగడం లేదన్నారు. వారికి రిజర్వేషన్లు కూడా అదే దామాషాలో ఉండాలన్నా రు. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షె డ్యూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నా, అధికారం నామమాత్రంగానే ఉంటోందని చెప్పారు. నిజమైన అధికారం ఎప్పుడూ కొన్ని వర్గాల చేతు ల్లోనే ఉంటోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం రావాలన్నారు. అందుకోసం పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకం కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యం మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు -
సెల్ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేటి కాలంలో పిల్లల విద్యాభివృద్ధికి సెల్ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్ఫోన్తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్లోడ్, డౌన్లోడ్తో, ఆన్లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలని, అతిగా ఆధారపడి, దానికి బానిసగా మారితే కర్తవ్యం మరుగునపడి వ్యవస్థ పతనం అవుతుందని అన్నారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్లు ధరించి హార్డ్వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలగొట్టి లోపలకు దూరారు. అక్కడి నుంచి 2.45 గంటల వరకు షాపులో ఉండి పలు వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లో వున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్లు ధరించి ఉండడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేల నగదు చోరీ అయినట్లు యజమాని తెలిపారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం రూ.3 లక్షల సామగ్రి దొంగతనం