Guntur District News
-
వాహనదారులపై సెస్ పిడుగు
పట్నంబజారు: ప్రభుత్వం దోచుకుంటోంది. ఏడాపెడా పన్నులు వేస్తోంది. ఏ వర్గాన్ని వదలడం లేదు. తాజాగా వాహనదారులపై అదనంగా ట్యాక్స్ వేసింది. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు, బీమా ప్రీమియం, రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్లు, ఫిటినెస్ చార్జీలతో వాహనదారులు సతమతమవుతున్నారు., రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతోంది. వాహనాలపై లైఫ్ ట్యాక్స్కు అదనంగా 10 శాతం సెస్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్లో ఈ నిర్ణయం తీసుకోగా, ఈ జనవరి 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం దీనిని ‘రోడ్ సేఫ్టీ సెస్’గా చెబుతున్నప్పటీకీ... వాహనదారుల దృష్టిలో ఇది మరో రూపంలో పన్నుల పెంపుగానే కనిపిస్తోంది. వడ్డింపు ఎలా అంటే.. ఈ నిర్ణయం ప్రభావం నేరుగా అర్థమయ్యేలా లెక్కలు చూస్తే రూ.లక్ష విలువైన వాహనాన్ని తీసుకుంటే, సాధారణంగా లైఫ్ ట్యాక్స్ సగటున 12 శాతం ఉంటే దానికి రూ.12,000 చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే లైఫ్ ట్యాక్స్పై 10 శాతం సెస్ విధించడంతో అదనంగా రూ.1,200 చెల్లించాల్సి వస్తోంది. ఒక లక్ష వాహనానికే వాహనదారుడి జేబు నుంచి అదనంగా వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది కేవలం సెస్ మాత్రమే. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు, బీమా, నంబర్ ప్లేట్ ఖర్చులు కలిపితే మొత్తం వ్యయం మరింత పెరుగుతోంది. ఇదే లెక్కను మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే ఐదు లక్షల రూపాయల వాహనానికి వర్తింపజేస్తే, లైఫ్ టాక్స్ సుమారు రూ.60 వేలు ఉంటే, దానిని 10 శాతం సెస్ కలుపుకుని రూ.6 వేలు అదనంగా సుంకం చెల్లించాల్సి ఉంది. రూ.10 లక్షల వాహనానికి అయితే లైఫ్ ట్యాక్స్, సెస్ కలిపి రూ.లక్ష 32 వేలు వరకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాపై ప్రభావం రవాణా శాఖ గణాంకాల ప్రకారం గుంటూరు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 28 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో ఉండగా, కార్లు, జీపులు, ఆటోలు, లారీలు, బస్సులు, స్కూల్ వాహనాలు కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి నెలా గుంటూరు జిల్లాలో వేల సంఖ్యలో కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ కొత్త వాహనాలన్నింటిపై ఇకపై 10 శాతం సెస్ తప్పనిసరిగా వర్తించనుంది. జనవరి 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 15 వేలకుపైగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, కార్లు అధికంగా ఉన్నాయి. సుమారుగా రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు వచ్చింది. సుంకం లెక్కలేదు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెస్ రూపంలో వచ్చిన సుంకాన్ని రహదారి భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెబుతూ.. వాహనదారులపై పెనుభారాన్ని మోపుతోంది. సేకరించిన సెస్ మొత్తాన్ని రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్స్, భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నుల పరిస్ధితి ఏంటనీ వాహనదారుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
డీజిల్పై ఆందోళన వద్దు
గుంటూరు వెస్ట్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతూ పెట్రోల్ బంకుల వద్ద అధిక సంఖ్యలో చేరుతున్నారన్నారు. అవసరం లేకపోయినా డీజిల్ నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 195 బంకులు ఉండగా 12 బంకులలో పెట్రోలు స్టాక్, 70 బంకులలో డిజిల్ స్టాక్ కొరత ఉందని, మిగిలిన బంకులలో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. వదంతులు నమ్మి ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం కారణంగా బంకులలో కొంతమేర కొరత ఏర్పడిందని, పెట్రోల్ కంపెనీల వారితో మాట్లాడి, సదరు బంకులలో ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో డీజిల్ అందుబాటులో ఉండేలా చర్యలుతీసుకుంటున్నామన్నారు. కొండపల్లి స్టాక్ పాయింట్ నుంచి ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ బంక్లకు ఆదివారం కారణంగా సరఫరా కాకపోవడం ఒక కారణం అన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొంత మంది క్యానులు, డ్రమ్ములలో డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్ల యజమానులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అవాస్తవాలతో ఆందోళన చెంది ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సరాసరి 450 కిలోలీటర్ల విక్రయాలు ఉండగా, శనివారం ఒక్క రోజు ఏడు వందల కిలోలీటర్ల విక్రయాలు జరిగాయని తెలిపారు. శనివారం 810 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశారని చెప్పారు. ఇంధన కంపెనీలతో ప్రతి రోజూ రెండు సార్లు సంప్రదిస్తున్నామని, ప్రతి బంక్ వద్ద ఒక ఉద్యోగిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనాల రీఛార్జింగ్కు అధికంగా మొత్తాలను వసూలు చేస్తే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 50 వేల ఎల్.పి.జి సిలిండర్ల డెలివరీ పెండింగ్లో ఉందని, కొద్ది రోజులలో సరఫరా చేస్తామని చెప్పారు. అవాస్తవాలు వ్యాప్తి చేస్తే కేసు జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడనున్నదని అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేసి, ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ కొరతపై సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ – 7780675354 కు తెలియజేయవచ్చని జేసీ వివరించారు. -
ఇంధన సెగలు!
గుంటూరు వెస్ట్: ఇంధనం మంట పుట్టిస్తోంది. ఇన్నాళ్లు గ్యాస్ దడ పుట్టించగా.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ గుబులు రేకెస్తోంది. తగినంతగా డీజిల్, పెట్రోల్ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోనని ఆందోళనతో వాహన చోదకులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఆయిల్ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల సమీక్షలో ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అధికారులను మందదలించారు. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఇలా.. గుంటూరు పట్టణంలోనే డీజిల్తో నడిపే ఆటోలు సుమారు 20 వేల వరకు ఉన్నాయి. దీంతోపాటు బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటికి డీజిల్తోపాటు పెట్రోల్ ఎంతో కీలకం. గల్ఫ్ వార్ ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్, ఆయిల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాల్సింది పోయి కొంత నిర్లిప్త భావన కూడా కొరతకు ఒక కారణమనే చెప్పాలి. బంకులకు తగ్గిన ఇంధన సరఫరా హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ బంకులకు క్రెడిట్ సౌలభ్యం ఒక్కసారిగా నిలిపివేయడంతో బంకులకు ఇంధన సరఫరా మందగించింది. వినియోగదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వాహన చోదకులు ముందస్తు జాగ్రత్తగా అధిక మొత్తంలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం 34 శాతం, ఆదివారం 22 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగింది. హైవేకు ఇరువైపులా ఉన్న పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వాహనాలు జాతీయ రహదారులకు ఇరువైపులా నిలిచిపోతున్నాయి. అధికారుల తనిఖీలు.. ఇంధన సెగలు నేపథ్యంలో ఆదివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంధన సమస్య లేదని చెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ బంకుల తనిఖీ చేశారు. ఇక పౌరసరఫరాల శాఖ అధికారులు మూడు రోజుల నుంచి పరిస్థితి సమీక్షించాల్సిన అధికారులు, సిబ్బంది పట్టనట్లు ఉన్నారు. -
పాఠశాల హెచ్ఎంకు షోకాజ్ నోటీసు
ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు కథనానికి స్పందన గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకుండా హాజరు నమోదు చేయడంతోపాటు విద్యార్థుల బోధనకు ఆటంకం కలిగించిన పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్ఈ)లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్ నుంచి పాఠశాలకు రావడం లేదు. దీంతో పాఠశాలలో విద్యార్థులకు బోధన చేయడంలో ఇద్దరు టీచర్లకు సాధ్యం కావడం లేదు. ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తూ ఈనెల 24న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందించిన గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ పాఠశాల హెచ్ఎంకు నోటీసు ఇచ్చారు. -
విద్యాభివృద్ధికి దాతల సాయం మరువలేనిది
నెహ్రూనగర్: విద్యాభివృద్ధికి దాతల సాయం మరువలేనిదని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. స్తంభాల గరువులోని ఉడుముల కోటి రత్నం, సాంబిరెడ్డి రెడ్ల బాలికల నూతన వసతి గృహ ప్రారం భోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రెడ్ల బాలికల హాస్టల్ నిర్మాణం కోసం బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బండి అశోక్ రెడ్డి, సుధారాణి దంపతులు రూ.కోటి, ఉడుముల కోటి రత్నం రూ.కోటి, మరి కొంతమంది దాతలు రూ.2కోట్లు ఇచ్చి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. దాతలు ఇచ్చిన సహకారంతో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత మీ ఉన్నతికి సహకరించిన హాస్టల్ అభివృద్ధికి సహాయ సహకారం అందించాలన్నారు. రెడ్డి హాస్టల్లో మరిన్ని వసతులు కల్పించి మరింత మందికి వసతి కల్పించి విద్యాభివృద్ధికి సహకరించేందుకు రెడ్డి సామాజిక వర్గం తగిన సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ అభివృద్ధికి అనవేమా ట్రస్ట్ చేస్తున్న కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమవరపు పిచ్చిరెడ్డి, గుంటూరు వేమారెడ్డి, మోదుగుల వాసుదేవ రెడ్డి, దుగ్గెంపూడి వెంకట్రామిరెడ్డి, కంది సంజీవరెడ్డి, చల్లా అంజిరెడ్డి, వనుకూరి సూరారెడ్డి, రోళ్ళ మాధవి, అచ్చాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి బాలికల నూతన వసతి గృహ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి -
స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి
నెహ్రూనగర్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనగణన (’సెన్సెస్–2027) మొదటిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతోందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఆదివారం ‘సెన్సస్ 5 కే రన్‘ను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు నిర్వహించారు. తొలుత నగర కమిషనర్ మయూర్ అశోక్తో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ (httpr://re.cenrur.gov.in) ద్వారా ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, డిజిటల్ పద్ధతిలో తమ వివరాలను నమోదు చేసుకుని జనగణనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగణనపై ఎటువంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. జనగణనలో ఓటీపీ కేవలం లాగిన్ కోసం మాత్రమే అడగడం జరుగుతుందని బ్యాంకు గాని ఇతర సంబంధిత వివరాలు ఇందులో అడగడం జరగదని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో స్వీయ గణన చేసుకోవడం వలన మే ఒకటో తేదీ నుంచి ఇంటింటికి జరిగే జనాభా లెక్కల సేకరణ సులభతరం అవుతుందని అన్నారు. ఈ ‘సెన్సస్ 5కే రన్‘లో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీహెచ్.కృష్ణ, పర్యాటక అధికారి రమ్య, జనాభా గణన ఇన్చార్జి అధికారి ఆదిత్య లక్ష్మి, కలెక్టర్ కార్యాలయ విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎడ్ల భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువకళారత్న పురస్కారాల ప్రదానం
నగరంపాలెం: గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తున్న మహామంజీరనాదం–26 వైభవంగా కొనసాగుతున్నాయి. సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు ఆదివారం జరగ్గా, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ హనీ ఉన్నికృష్ణన్ (కర్ణాటక) మోహినీ అట్టం, తరిత్ సర్కార్ (జార్ఖండ్) కఽథక్ నృత్యం, క్షితిజా కాసరవల్లి (కర్ణాటక) భరత నాట్యం, గోపాల్ సింగ్ (మణిపుర్) మణిపురి నృత్యాలను విభిన్న విన్యాసాలతో నర్తించారు. కళాకారుల నృత్యాలు సభికులను అలరించాయి. కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజు వేంకటసుబ్రహ్మణ్యం, కోశాధికారి వేంకటగిరి నాగలక్ష్మీ, నారా రాధిక పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏడు రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న టీ–20 సీనియర్ క్రికెట్ ఆంధ్ర జోనల్ టోర్నీలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.వి.శివరామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్టు నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, విశాఖపట్నం, అనంతపురం జట్లపై వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగించిందన్నారు. ఆంధ్ర జోనల్ విన్నర్గా నిలిచిందన్నారు. ముఖ్యంగా యువ క్రీడాకారులు సమష్టిగా రాణించి అద్భుత విజయాలు నమోదు చేశారని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత గుంటూరు జిల్లా క్రీడాకారులు విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. జట్టు సభ్యులకు త్రీ మెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, సిహెచ్.వి.నాగరాజు అభినందనలు తెలిపారు. చీరాల రూరల్: థాయ్లాండ్లో నిర్వహించిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాలకు చెందిన క్రీడాకారులు సిహెచ్.నాగరాజు, జి.ఉమామహేశ్వరరావు, ఎ.సాంబశివరావు 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్ విభాగంలో పాల్గొని పతకాలు సాధించారు. ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడారు. 100, 200 మీటర్లు పరుగు పందెంలో, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ మెడల్స్ సాధించి చీరాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని క్రీడాకారులను కొనియాడారు. పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, శ్రీరాం రమేష్, పూర్ణా, మద్దు వెంకట సుబ్బారావు, రవి, భాస్కరరావు, రామబ్రహ్మం పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.80 అడుగులకు చేరింది. ఇది 160.0644 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్సార్దే
గుంటూరు మెడికల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెట్టి, వారి గుర్తింపు కోసం ఎంతో కృషి చేశారని ఏపీఆర్జేసీ న్యాయ సలహాదారు డాక్టర్ లోక్నాథ్ అన్నారు. ఆదివారం గుంటూరు నాజ్సెంటర్లో సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ లోక్ నాథ్ మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ మరుగున పడిపోయిందన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరువలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు, అధ్యక్షుడు సాంబశివరావు, అమర్ రెడ్డి, నిర్గుణ రావు, శ్రీనివాసరావు, వలి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రహ్మరెడ్డి, అఖిల భారత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సెయింట్ జాన్ అంబులెన్స్ ఇండియా గౌరవ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ ఎం.మహేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వి.బి.సుమంత్ లు మాట్లాడుతూ.. 24 గంటలూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఆర్ఎంపీలు వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా ధైర్యంగా ప్రజలకు వైద్యం అందించాలని, అది ప్రథమ చికిత్సకు కట్టుబడి మాత్రమే పనిచేయాలని సూచించారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా, ఎన్ని పీహెచ్సీలు పెరిగినా, అర్థరాత్రి అయినా ఆర్ఎంపీలకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. పలు జిల్లాలకు చెందిన గ్రామీణ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.300 కోట్ల నష్టం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో 29వేల ఎకరాల్లో 16 లక్షల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్న, జొన్న, శనగ పంటల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవడం వలన రైతులకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రెండేళ్లుగా క్రాప్ ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో పాటు గతేడాది వర్షాల కారణంగా 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులకు పైసా ఇవ్వలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపు టీడీపీ పాలనలో జరిగే పరిస్థితులు లేవు. – బలసాని కిరణ్కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త -
ఏకబిగిన 9 గంటలపాటు కొనసాగిన వైఎస్సార్ సీపీ రైతు నిరశన విజయవంతం
కడుపు మండిన రైతన్న ● జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన రైతులు, పార్టీ సమన్వయకర్తలు ● జొన్న, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు ● పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీక్ష సారథి, సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ● ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా రైతులకు చేసిందేమీ లేదని నరేంద్రపై మండిపాటు ● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్/గుంటూరు వెస్ట్: పంటలకు మద్దతు ధర కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’ విజయవంతమైంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, టీడీపీ సర్కారు సహాయ నిరాకరణతో కడుపు మండిన రైతులు వందలాదిగా పోరాట దీక్షకు తరలివచ్చారు. ● వ్యవసాయం దండగన్న చంద్రబాబు తీరుతో ఆరుగాలం శ్రమించి, దుక్కిదున్ని పండించిన పంటను కొనుగోలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరితో అప్పులపాలవుతున్న అన్నదాతలు వైఎస్సార్ సీసీ పోరాట దీక్ష వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కారు. ● వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సారధ్యంలో చేపట్టిన రైతు పోరాట దీక్ష మరో ప్రత్యామ్నాయం లేకుండా పంటలను పూర్తిస్థాయిలో మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి అల్టిమేటం విధించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్కుమార్, అన్నాబత్తుని శివకుమార్ , పార్టీ నాయకులు నాగార్జున యాదవ్, నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు దుర్గా ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కొరటిపాటి ప్రేమ్ కుమార్, ప్రచారం విభాగం అధ్యక్షులు దానం వినోద్, పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, పొన్నూరు టౌన్, రూరల్ అధ్యక్షులు షేక్ నాసర్, సీహెచ్ మురళి, చేబ్రోలు, పెదకాకాని అధ్యక్షులు ఆళ్ళ శ్రీరామ్ రెడ్డి, ముడియాల మల్లిఖార్జున రెడ్డి, జడ్పీటీసీ గోళ్ళ జ్యోతి, పెదకాకాని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ చాగంటి మురళీ కుమార్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వరరావు, రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శి అమరనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీకి గురవుతున్న రైతు
టీడీపీ పాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నానా కష్టాలు పడి, అధిక ధరలకు కొనుగోలు చేసి పంట పండించాక దానిని అమ్ముకునేందుకు మళ్లీ రోడ్డెక్కాల్సిన దుస్థితి. వైఎస్ జగన్ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాలుగా సేవలు అందించడంతో పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను మద్దతకు ధరకు కొనుగోలు చేయించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులు నష్టపోకుండా చూశారు. పంట కొనుగోలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనం. – వరికూటి అశోక్బాబు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ● -
గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని, ప్రతీ గృహం యొక్క నిర్మాణ పనులు దశ మారాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ ఇంజనీర్లు, గుత్తేదారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుత్తేదారులు వారికి గతంలో జరిగిన చెల్లింపుల మేరకు పనులు తక్షణం పూర్తి చేసి తదుపరి దశకు తీసుకురావాలన్నారు. 26న సెన్సస్ 5 కే రన్ జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5 కె రన్‘ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. సెన్సస్ 5 కె రన్ ఆదివారం ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభం అవుతుందని తెలిపారు. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములైన వాస్తవ వివరాలు పొందుపరచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన రెండు దశల్లో నిర్వహిస్తారన్నారు. మొదటి దశగా ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహిస్తారని చెప్పారు. ఇందులో ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరుగుతుందని అన్నారు. 5 కే రన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. -
జగన్ కోసం ఎదురు చూపు
ఈ ప్రభుత్వ పాలనలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లేకపోగా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే దళారులు మాత్రం రూ.1500–1600 మద్యలోనే కొనుగోలు చేస్తున్నారు. రైతుకు దిక్కుతోచని పరిస్థితిలో అమ్ముకుంటున్నారు. – దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి సమన్వయకర్త మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతులు. గత ప్రభుత్వ హయాంలో 54 లక్షల మంది రైతులకు పంటల బీమా కింద జగన్ రూ.7200 కోట్లు వెచ్చించారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే. రైతుల పట్ల తమ పార్టీకి ఉన్న నైతికతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రైతులు, యువత మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. – వనమా వజ్రబాబు, తాడికొండ సమన్వయకర్త చంద్రబాబు నాయుడు హామీలన్నీ మేనిఫెస్టో దాటవు. రైతులు కుమిలిపోతుంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ధోరణి అవలంబిస్తోంది. రైతులకు మద్దతు ధర కోసం న్యాయమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే తప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. టీడీపీ పాలనలో అన్ని పార్టీలకు చెందిన రైతులు అవస్థలు పడుతున్నారు. – నూరి ఫాతిమా, గుంటూరు తూర్పు సమన్వయకర్త -
ఆవకాయ ప్రియులకు కనికట్టు
భ్రమరాంబ గారి చెట్టు మున్నంగి(తెనాలి): ఆవకాయ రుచి చూడని తెలుగువారు ఉండరు. తెలుగిళ్లలో వేసవితోనే ఆవకాయ ప్రణాళిక ఆరంభమవుతుంది. ఇంటి ఇల్లాళ్లు అవసరమైన సంబారాలు సిద్ధం చేసుకుంటూనే, మామిడికాయ ఎంపికపై శ్రద్ధ పెడతారు. కొల్లిపర ప్రాంతం వారికి మాత్రం ‘భ్రమరాంబ చెట్టు మామిడికాయ’ గుర్తుకొస్తుంది. ఆవకాయ ప్రియులకు ఆ చెట్టు పేరు వినగానే నోరూరుతుంది. పరిసరాల్లోని గ్రామాలే కాదు...కృష్ణా జిల్లాలోని వారికీ ఆ చెట్టుకాయ రుచి సుపరిచితం. గ్రామానికి చెందిన ఎన్నారైలు వీటిి రుచి చూడకుండా వదలరు సుమా! భ్రమరాంబ చెట్టు పుట్టు పూర్వోత్తరాలకు వెళితే, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోకి చూడాలి. ఊరి వెలుపల పంట పొలంలో దాదాపు పది సెంట్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందీ చెట్టు. ఆరు దశాబ్దాల కిందట బొంతు చెంచారెడ్డి ఉత్తరాది నుంచి ఈ మొక్కను తీసుకొచ్చి నాటారు. చెంచారెడ్డి భార్య భ్రమరాంబ పచ్చడి మామిడి చెట్టు అనగానే అంతా నిరుత్సాహపడ్డారు. కాపు కాయటం మొదలుపెట్టీ, ఆవకాయగా రూపాంతరం చెందాక రుచి చూసినవారంతా వహ్వా! అనేశారు. అప్పటి నుంచి ఆ చెట్టుకు మహర్దశ పట్టింది. భ్రమరాంబ గారి చెట్టుగా పేరు స్థిరపడిపోయింది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి ప్రియులు అందరూ భ్రమరాంబగారి చెట్టు కాయల కోసం అడుగుతుంటారు. ఈ కాయలతో చేసిన ఆవకాయ పచ్చడి ఏడాది కాలమైనా తాజాగా ఉంటుందట! ఏడాది తర్వాత తిన్నా...ముక్క మెత్తపడకుండా కరకరలాడుతూ తాజాగా ఉండటం ప్రత్యేకతగా చెబుతారు. ఈ కాయల కోసం కొల్లిపర మండల గ్రామాల నుంచే కాకుండా దుగ్గిరాల, తాడేపల్లి మండలాలు, బాపట్ల, తెనాలి, కృష్ణాజిల్లాల నుంచి కూడా తెలిసినవారు ఏటా కారులలో వచ్చి తీసుకుని వెళతారు. ఈ కాయల పచ్చడికి విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. మున్నంగి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు, గుండె వైద్యనిపుణులు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఈ చెట్టు పచ్చడికి పెద్ద అభిమానిగా గ్రామానికి చెందిన బొంతు బాపిరెడ్డి చెప్పారు. ప్రతి సంవత్సరం ఆయన అమెరికా తీసుకుని వెళతారు. కుదరకపోతే కొరియర్లో పంపాల్సిందేనట! అక్కడ తన మిత్రులందరికీ ఆ ఊరి ఆవకాయను రుచి చూపిస్తుంటారు. అలా మున్నంగి గ్రామంలోని ఈ చెట్టు చెంచారెడ్డి–భ్రమరాంబ కుమారుడు శివరామిరెడ్డి పర్యవేక్షణలో ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. కొడుకు శరత్రెడ్డి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. కుమార్తె జ్యోతి కృష్ణాజిల్లాలో టీచరు వృత్తిలో ఉన్నారు. ఆస్తులన్నీ పంచేశారు. ప్రస్తుతం మామిడిచెట్టు ఉన్న స్థలం కొడుకు శరత్రెడ్డికి వెళ్లింది. ఆలనా పాలనా శివరామిరెడ్డి చూస్తున్నారు. ఏటా వర్షాలు రాగానే వానపాముల ఎరువు, నైపోగు ఎరువు వేస్తానని చెప్పారు. ఏటా వేసవిలో నాలుగు వేల కాయల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ మామిడిచెట్టు కొంతకాలం క్రితం వరకు వేసవిలో గ్రామ యువతకు పెద్ద ఆటవిడుపు. ఇప్పుడు ఎక్కువమంది నగరాల బాట పట్టటంతో ఆ సందడి కరవైంది. పది సెంట్ల విస్తీర్ణంలో భారీ మామిడిచెట్టు 60 ఏళ్లయినా ఏటేటా అదే కాపు ఏడాది గడచినా తాజాగా పచ్చడి వేసవి వస్తే ఆ కాయలకు డిమాండ్ -
కెనాల్ డ్రైనేజీలోకి దూసుకు వెళ్లిన కారు
తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్ వద్ద బకింగ్హామ్ కెనాల్కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలోకి ఓ కారు దూసుకు వెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో కారు కాలువకు, డ్రైనేజీకి మధ్యలో మురుగునీటిలో కూరుకుపోయింది. కానిస్టేబుల్ ఒకరు ఉండవల్లి సెంటర్ నుంచి బైపాస్ వైపు కారులో అతివేగంగా వెళుతుండగా, భరత మాత సెంటర్ వద్ద కాంక్రీట్ దిమ్మను ఢీకొని 15 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంఽధించిన నాలుగు స్థాయీ సంఘ సమావేశాల అజెండాలపై చర్చించారు. చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన ఆయా సమావేశాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంగళగిరిలో అదనపు కోర్టు ప్రారంభం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనంగా నిర్మించిన కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు న్యాయమూర్తులతో కలసి ప్రారంభించారు. తొలిరోజు నాలుగు కేసులను విచారించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తొలుత హైకోర్టు న్యాయమూర్తులు మంగళగిరి కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవతకు పూలమాలలు వేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సురేష్బాబు, గుంటూరు జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, గుంటూరు న్యాయమూర్తులు, మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన నిలిచి పోరాటం
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడున్న రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిలిచి పోరాటం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మామిడి, పొగాకు, మిర్చి రైతుల కోసం వారి పక్షాన నిలిచి మనోధైర్యాన్ని ఇచ్చి, ప్రభుత్వం చేసే అరాచకాలని వెలుగులోకి తెచ్చారు. రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నిలదీసే కార్యక్రమాన్ని తీసుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన కార్యక్రమాలను చూశాం. రాష్ట్రంలో పేదవారికి సహాయం చేయాలనీ, వారిని ఆదుకోవాలని ఆలోచన చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఈ సర్కారును ప్రజలు త్వరలో ఇంటికి పంపుతారు. – సింహాద్రి రమేష్, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే● -
గుంటూరు
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026●పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కళ్లుండీ చూ డలేని కబోదిలా మా రింది. మొక్కజొన్నకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.2,400కు కొనుగోలు చేయాల్సిన సర్కారు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులకు రూ. 1200 నుంచి రూ.1400లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. టీడీపీ నేతలు దళారులతో కుమ్మకై ్క తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవు. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి 7తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది. ముప్పాళ్ళ: చాగంటివారిపాలెంలోని సుభద్రా బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయంలో 30న శివాలయ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పిడుగురాళ్ల: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జన్మదిన వేడుకలలో భాగంగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. మొక్కజొన్న ఽగిట్టుబాటు ధర కోసం అంబటి మురళీ కృష్ణ రగిలించిన పోరాట స్ఫూర్తికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మార్చేస్తాం.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు కరవుతో అల్లాడిపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల కోసంరూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కనివ్వడం లేదు. – లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ గుంటూరు జిల్లాలో కమర్షియల్, డొమెస్టిక్ పంటలు కలిసి దాదాపు 100 రకాల పండిస్తారు. ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాల్సి పోయి రైతు కష్టాన్ని దళారుల పాలు చేస్తుంది. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు రైతుల విషయంలో పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పరిశీలకులు రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. దీనిలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతోంది. ఒక్క మొక్కజొన్నకే కాకుండా ఏ పంటకు కనీసం మద్దతు ధర లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతుకు క్రమం తప్పకుండా న్యాయం జరిగేది, ఇప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది. – పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కనీస మద్దతు ధరలేక, ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో మంచి రోజులొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మొక్క జొన్న కొనేందుకు డబ్బులు లేవనడం వారి చేతకాని తనానికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న విషయం ప్రజలకు తెలీదనుకుంటున్నారా..? – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, -
మద్దతుపై దగా.. రైతులపై పగ
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట పండించడమే కష్టం.. అమ్ముకోవడం మరింత సమస్య అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చోద్యం చూస్తున్నారు. ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నా. దిగుబడి ఎకరానికి 41 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.1,700కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తే నష్ట రాకుండా ఉంటుంది. – యర్రాకుల వీరాంజనేయ రాజు, వీరనాయకునిపాలెం, చేబ్రోలు మండలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: బర్లీ పొగాకు, పత్తి పంటలు సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న సాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. ఆ మాటలు విని మొక్కజొన్న సాగు చేసిన రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆటుపోట్లను తట్టుకుని పండించినా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. దళారులు అడిగిన కాడికి విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు కూడా రాక, అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చేతులెత్తేసింది. గుంటూరు జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1,400 నుంచి రూ.1,700కే అడుగుతున్నారు. దిక్కులేని స్థితిలో నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు తప్పడం లేదు. ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేయూతనిచ్చారు. దళారులు సైతం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు లాభాలు గడించారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల సహాయంతో మద్దతు ధర వచ్చేలా చూశారు. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 79,202.50 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు సుమారు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులే అధికంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర లేదని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. రైతులు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ నేటికీ ప్రయోజనం దక్కలేదు. తెలంగాణలో 2025–26 ఖరీఫ్ సీజన్తో పాటు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నలను అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతులు రూ.210 కోట్ల నుంచి రూ.270 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉంది. తొమ్మిదిన్నర ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఖరీఫ్లో వరి ధర పతనంతో తీవ్రంగా నష్టపోయా. ప్రస్తుతం మొక్కజొన్నకు ఎకరానికి 40 వేల వరకు పెట్టుబడి పెట్టా. క్వింటా రూ.1,650 మాత్రమే ఉంది. – మాతంగి ఆశీర్వాదం, శేకూరుపాలెం, చేబ్రోలు మండలం మంగళగిరి టౌన్ / పొన్నూరు/ గుంటూరు వెస్ట్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మొక్క జొన్న రైతు పోరాట దీక్ష ’ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీక్షపై వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు ధరలేక ఇబ్బందు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో విస్తృత స్ధాయిలో మొక్కజొన్న పండించారని పేర్కొన్నారు. కేవలం 1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మద్దతు ధర రూ. 2400 ఉందని, 800 తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష ’ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులు అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వ దృష్టికి రైతుల ఇబ్బందులను తీసుకువెళ్లే ప్రయత్నానికి సహకరించాలని కోరారు. మద్దతు ధర అందించిన వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మద్దతు ధర కింద రూ. 2,400 ప్రకటించి నాలుగు సంవత్సరాలపాటు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400లకు కొనుగోలు చేయాలని కోరుతూ ఈ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని అన్నారు. ఎమ్మెల్యే తమ సంగం సంస్థ పేరిట నిల్వ చేసి పశువులకు దాణాగా మార్చటంతో మరికొంత మారుబేరానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. గుంటూరులో నిర్వహిస్తున్న దీక్షకు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు, మురళీకృష్ణ -
రోడ్డెక్కితే మంట.. ఎటెళ్లినా తంటా!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): శంకర్విలాస్ ఓవర్బ్రిడ్జి పనుల్లో భాగంగా అనేక ట్రాఫిక్ డైవర్షన్లను నగరంలో చేపట్టారు. దీనికితోడు కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా నగరవాసులకు చేటు చేస్తున్నాయి. ముఖ్యంగా అరండల్పేట నాలుగో లైనులో ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. డొంకరోడ్డు మొదలు మూడు వంతెనల కిందుగా వాహనదారులు ప్రయాణం చేయాలంటే ప్రత్యక్ష నరకమే కనపడుతోంది. అక్కడి నుంచి కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వరకు అసలు మరో మలుపు కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సుధీర్ఘ రహదారిలో శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్ అంటే నాలుగు రోడ్ల కూడలి. నాజ్సెంటర్, లీలామహల్రోడ్డు, నెహ్రూనగర్, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాల అనుసంధానమై ఉంది. ఇక్కడ సైతం అధికారులు అనాలోచితంగా మూసివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డొంకరోడ్డు మొదలు కొత్తపేట వరకు వెళ్లాలంటే కనీసం 30 నిమిషాలకుపైగానే పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు ఈ మార్గంలోనే ఉండటంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ తీవ్రస్థాయికి చేరుతోంది. కొత్తపేట శివాలయం నుంచి లీలామహల్ సెంటర్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులు అధికంగా ఉన్న ప్రాంతం కావటంతో ఒక్కోసారి అంబులెన్స్లు సైతం కదలలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాప్రతినిధి చెప్పారని... ఒక ప్రజాప్రతినిధి చెప్పాడనే కారణంతో గుంటూరు తూర్పు పరిధిలో అత్యంత కీలకమైన రాధాకృష్ణ థియేటర్ సెంటర్ (ఆర్కేటీ) పాయింట్ను మూసివేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని పూర్తిగా నిలువరించటం వలన ఆర్టీసీ బస్టాండ్ నుంచి వచ్చే వారికి, లాలాపేట మార్కెట్ ప్రాంతాలకు వెళ్లే వారికి, కొత్తపేట వచ్చే వారికి అనేక ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా కింగ్స్ హోటల్ సెంటర్ వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మాయాబజార్ వంటి సందుల్లో ప్రయాణం చేసి కొత్తపేట, నాజ్సెంటర్ వైపు వెళ్లాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి దారుణంగా మారింది. గుంటూరు నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ ఇప్పటికే అస్తవ్యస్తంగా మారింది. శంకర్విలాస్ ఓవర్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో సమస్య ఇంకా ఎక్కువైంది. నిప్పులు కక్కుతున్న భానుడి ఉగ్ర ప్రతాపంతో వాహనదారులు రోడ్డుపైకి వస్తే చాలు బెంబేలెత్తుతున్నారు. పాలకులు, అధికారుల అనాలోచిత విధానాలతో సామాన్యులు అల్లాడుతున్నారు. -
విజ్ఞాన్, ఇంటెల్ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, ప్రముఖ టెక్ దిగ్గజం బెంగళూరులోని ఇంటెల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ఇంటెల్ ఇండియా కంపెనీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలను అందించడం ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఫ్యాకల్టీ, ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు కో–బ్రాండెడ్ సర్టిఫికెట్లు అందించడం, ఉపాధి అవకాశాలపై మార్గదర్శకత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటెల్ ఇండియా ఆసియా పసిఫిక్–జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్ మాట్లాడుతూ, విజ్ఞాన్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వైపు దారితీస్తూ, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను అందించి వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటెల్ ఇండియా రూపొందించిన కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 601 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ‘ఏఐ స్మార్ట్ క్యాంపస్ హ్యాకథాన్’లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంటెల్ ఇండియా నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్ విక్రమ్ పర్మార్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
పదోన్నతులపై పిల్లిమొగ్గలు
గుంటూరు మెడికల్: అంతా మా ఇష్టం... ఏది చేసినా అడిగెదెవ్వరు... అన్నట్లుగా గుంటూరు జీజీహెచ్ పరిపాలన అధికారులు వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చక పదేళ్లుగా పోస్టు ఖాళీగా ఉన్నా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయలేదు. ప్రమోషన్లు ఇస్తామని కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏడాదిలోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసే వరకు సాగదీసి, మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని పదోన్నతులు రాకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రికార్డు అసిస్టెంట్ పోస్టులు 2021 నుంచి రెండు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల్లో చాలా మంది అర్హులున్నారు. గతంలో రెండు సార్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తాజాగా మళ్లీ నోటిఫికేస్ ఇచ్చారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోస్టులు ఐదుకుపైగానే ఖాళీగా ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడి ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. పది సంవత్సరాలుగా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల పలు కిందిస్థాయి పోస్టులు రద్దయ్యాయి. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. మిగతావారు కూడా కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదు. వారికి మాత్రం ఓకే... గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజ్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఆ దిశగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాలోనే పరిపాలన అధికారులుగా (ఏఓ)పనిచేసిన ఇరువురు నేడు జీజీహెచ్, వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లుగా ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఈనెల 13న అడిషనల్ డీఎంఈగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు 2024 అక్టోబర్లో అడిషనల్ డీఎంఈగా ప్రమోషన్ ఇచ్చారు. -
గుంటూరు
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గజలక్ష్మీదేవి అలంకరణ పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు గజలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.6,000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.5360 టీఎంసీలు. 7 -
ఆంగ్రూ వీసీగా బాపట్ల పూర్వవిద్యార్థి
బాపట్ల టౌన్: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నూతన ఉప కులపతిగా బాపట్ల వ్యవసాయ కళాశాల 1983 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏజీ విశ్వవిద్యాలయంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు సత్యనారాయణను శాలువాతో సత్కరించారు. ప్రసూనారాణి మాట్లాడుతూ బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1983లో బీఎస్సీ చేరి, అంచలంచెలుగా ఎదిగి, పరిశోధన సంచాలకులు స్థాయికి సత్యనారాయణ చేరుకున్నారన్నారు. 40కిపైగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రూపొందించి ఆంధ్ర రైస్ మాన్గా పేరు సాధించారని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు మొబైల్ వ్యాన్ గుంటూరు లీగల్: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అందజేసిన మొబైల్ లీగల్ అవేర్నెస్ వ్యాన్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పేద, బలహీన వర్గాలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువడానికి ఈ వ్యాన్ కీలకంగా మారనుందని తెలిపారు. ఐదు వెండి గంగాళాలు బహూకరణ పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి నిత్యాభిషేక సేవకు వినియోగించేందుకు 1.174 కిలోల తూకం కలిగిన ఐదు వెండి చిన్న గంగాళాలను చినకాకాని గ్రామానికి చెందిన రావెళ్ళ సత్యనారాయణ దంపతులు బహూకరించారు. వీటిని శుక్రవారం ఉప కమిషనరు గోగినేని లీలాకూమార్కు అందజేశారు. ఉచిత అన్నప్రసాద వితరణకు విశాఖపట్నానికి చెందిన ఎం.నారాయణ, శివపార్వతి దంపతులు రూ. 40 వేలు, గుంటూరుకు చెందిన చింతా రవీంద్రరెడ్డి, సునీత దంపతులు రూ.60 వేలు విరాళంగా అందించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. దర్మకర్తల మండలి సభ్యుడు దూపాటి శివశంకరరావు సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తిరిగి ప్రారంభించారు. -
దివ్యాంగులను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వం
మంగళగిరి టౌన్: రీ వెరిఫికేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులను వేధిస్తోందని రాష్ట్ర దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ వెంబడి ఉన్న వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షులు బొక్క అగస్టీన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి దివ్యాంగుల విభాగం సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దుర్గారెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా రీ వెరిఫికేషన్ పేరుతో ఇబ్బందులు పెడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుప్పం నియోజకవర్గంలో 350కి పైగా కొత్త పెన్షన్లు ఇచ్చారని, చంద్రబాబు ఒక్క కుప్పంకు ముఖ్యమంత్రా? రాష్ట్రానికా అని ప్రశ్నించారు. గతంలో 90 శాతం ఉన్న దివ్యాంగులను నేడు 45 శాతం ఉందంటూ పెన్షన్లు ఎత్తివేసే భారీ కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. దివ్యాంగులకు రావాల్సిన సదరం సర్టిఫికెట్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెరిఫికేషన్ పేరుతో ఎక్కడ అన్యాయం జరిగినా ఉద్యమబాట చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యలపై అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారని తెలియజేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో గుంటూరు తూర్పు, తెనాలి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు కొణతల చంద్రశేఖర్, కృష్ణాజిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు శామ్యూల్, మంగళగిరి నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు వేమూరి వందనం ఇస్సాక్, గుంటూరు తూర్పు, పత్తిపాడు, తెనాలి నియోజవర్గాల అధ్యక్షులు గణేష్, నాగుల్ మీరా, సందీప్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి జిల్లా దివ్యాంగుల విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే1వ తేదీ నుంచి 31 వరకు వివిధ క్రీడల్లో వేసవి శిక్షణనిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 8నుంచి14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిబిరంలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి క్రీడా హాస్టల్స్కు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు బీఆర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్టెప్ మేనేజర్ బి.రాధిక, మేనేజర్ సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. గుంటూరు లీగల్: జిల్లాలో కుటుంబ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కోర్టుకు తోడు, అదనంగా మరో కుటుంబ వివాదాల న్యాయస్థానం ఏర్పాటు చేశారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు కోర్టును ప్రారంభించనున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా, సెషన్న్స్ జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో, గుంటూరు బార్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం యువ న్యాయవాదులకు డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్వేయన్సింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు న్యాయవిభాగంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్,కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సురేష్ అధ్యక్షత వహిస్తారన్నారు. కీనోట్ స్పీకర్ గా జిల్లా మాజీ జడ్జి జీవీ కృష్ణయ్య, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ బి. వెంకట రమణారెడ్డి, నర్రా శ్రీనివాసరావులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, యువన్యాయవాదులు వారి అనుభవాన్ని, అమూల్యమైన వృత్తి సలహాలను సద్వినియోగం చేసుకోవాలని విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ కొరిటెపాడు(గుంటూరు): రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మిర్చియార్డు ఎదుట ఉన్న నిర్కా(పూర్వ సీటీఆర్ఐ) ప్రాంగణంలో జిల్లాలోని గిరిజన రైతులకు సబ్ ప్లాన్ కింద నానో బయోటెక్ ఎరువులు, టార్పాలిన్ పట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిర్కా గుంటూరు ఇన్చార్జి డాక్టర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువగా పొగాకు, పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారని తెలిపారు. అయితే అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తోన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని వల్ల మట్టిలో పోషకాలు లేక భూమి సారం కోల్పోతుందన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నానో బయోటెక్ ఎరువులను తాము గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల సూక్ష్మజీవులు బాగా పెరిగి పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు, పంట ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో నిర్కా శాస్త్రవేత్త జె.పూర్ణబిందు, టెక్నికల్ ఆఫీసర్ ఎంవీ జయకృష్ణ, సుబ్బారావు, బాపట్ల ఏసు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శుక్రవారం కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. – సమావేశంలో నూతన ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విస్తరణ, పరిశోధన శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ, విశ్వవిద్యాలయం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు స్థాయిలో క్షేత్ర పరిశీలనలు, విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. 2026–27 సంవత్సరం వ్యవసాయ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు అన్ని అనుబంధ శాఖలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ● పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. ● విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివిధ విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ● పత్తిపంటలో గులాబి రంగు పురుగుల యాజమాన్యం, అపరాల పంటల్లో సమగ్ర యాజమాన్యం పద్ధతులు, వరిలో కలుపు యాజమాన్యం, పశుపెంపకం, వంటి ప్రచురణలను విడుదల చేశారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్సీఆర్ డైరెక్టర్ డాక్టర్ వై సతీష్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యవసాయ అధికారులు, ఆర్ఈఏసీ సభ్యులు, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళపై పీడీ చట్టం అమలు
రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు నగరంపాలెం(గుంటూరువెస్ట్): గంజాయి, మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాలు, అక్రమ రవాణా చేసే ఓ యువ మహిళపై పీడీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని తాడేపల్లి టౌన్లో ఉంటున్న 26 ఏళ్ల వి.నాగమణి గంజాయి క్రయ, విక్రయాలు, నిల్వలు, రవాణా చేస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు. దీంతో ఆమైపె నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఆమైపె కేసులు నమోదు చేసినా ఆమెలో మార్పురాలేదు. ప్రజా భద్రత దృష్ట్యా ఆమెను నిర్బంధించడమే సరైన చర్యగా పోలీసులు భావించారు. దీంతో నాగమణిపై పీడీ చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ద్వారా తాడేపల్లి పీఎస్ సీఐ వీరేంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయగా, ఆమెను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26న గుంటూరు జిల్లా నుంచి రిలే నిరాహారదీక్షకు జిల్లా ఫ్యాప్టో నాయకులు, కార్యకర్తలు, ఫ్యాప్టో పోరుబాటకు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని జిల్లా ఫ్యాప్టో కార్యవర్గం పిలుపునిచ్చింది. సమావేశంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్, జి.దాసు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎం.కళాధర్, షేక్ బాజీ,ప్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంగళగిరిటౌన్: ఓ యువతి సమయస్ఫూర్తితో అర్ధరాత్రి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడుతుండగా పోలీసులకు సమాచారం అందించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువతిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళగిరి మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన ఓ యువతి బాపట్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇంటర్నషిప్ కోసం బెంగళూరు వెళ్లింది. తాను చదివే కళాశాలలో శుక్రవారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు 23వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరింది. మధ్యాహ్నానికి కుప్పం చేరుకుంది. కుప్పం రైల్వేస్టేషన్లో విజయవాడకు వెళ్లే శాతవాహన రైలు ఎక్కి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ చేరుకుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో బస్టాండ్కు చేరుకుంది. బస్సు కోసం ఎదురు చూడసాగింది. ఎంతసేపటికీ బస్సులు రాకపోవడంతో తన తండ్రికి ఫోన్ చేసింది. ఆరోగ్యం బాగోలేదంటూ కాజ టోల్గేటు వరకు వస్తే అక్కడ ఎదురు చూస్తానని తండ్రి చెప్పాడు. విజయవాడ బస్టాండ్లో ఓ ఆటో డ్రైవర్ యువతి వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ అడిగాడు. అవసరం లేదు.. బస్సులో వెళతానని యువతి బదులిచ్చింది. జాగ్రత్తగా తీసుకువెళతానంటూ ఆటో డ్రైవర్ యువతిని నమ్మబలికి ఆటో ఎక్కించాడు. విజయవాడ కనకదుర్గ వారధి దాటిన తరువాత ఆటోడ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో యువతికి భయం వేసి ఫోన్లో శక్తి యాప్ను ఇస్టాల్ చేసుకుని వివరాలను యాప్ ద్వారా పోలీసులను అలర్ట్ చేసింది. ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన యువతి మధ్యమధ్యలో ఫోన్లు చేస్తూ ఉంది. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. స్థానిక పోలీసులు యువతికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. మంగళగిరి దాటిన తరువాత చినకాకాని సమీపంలో ఆటోను వేరే మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేశాడు. యువతి పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ మధ్యమధ్యలో ఆపుతూ వెళ్లాడు. అప్పటికే యువతి లొకేషన్ తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని గమనించిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో ఆటోను వెంబడించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ తాడేపల్లి సీతానగరానికి చెందిన బోయిన ఫణీంద్రగా పోలీసులు గుర్తించారు. -
ఎన్టీఆర్ స్టేడియానికి విద్యుత్తు సరఫరా బంద్
లక్ష్మీపురం: గుంటూరు నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించక పోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం, శ్యామలానగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఫ్యూజులు తీసేయడంతో క్రీడాకారులు తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యారు. తొలి నుంచీ క్రీడాకారుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోంది. శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు ఫ్యూజులు తీయడంతో సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. శ్యామలానగర్లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్లో సాయంత్రం ఇలా చేయడంతో క్రీడాకారులుగా సభ్యత్వం ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్కు సకాలంలో నీటి సరఫరా అందడం లేదు. ఇప్పటికే నంబర్ షిప్కు రూ.50వేల చొప్పున సుమారు రూ.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు వందల మందికి సభ్యత్వాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. -
సీఆర్డీఏ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
గుంటూరు వెస్ట్: సీఆర్డీఏ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల సమన్వయ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ● జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశాలకు చెందిన దస్త్రాలు సంబంధిత ప్రతిపాదనలు తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో జరగాలన్నారు. భూ సేకరణ అధికారులు భూ సేకరణకు అవసరమయ్యే నోటిఫికేషన్లు, నోటీసులు జారీ చేయడంలో నిర్దిష్టమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో నిబంధనలను పక్కాగా పాటించాలన్నారు. ● సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ మాట్లాడుతూ 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి, బంజరు, ఇనాం, దేవదాయ, నీటిపారుదల తదితర భూముల కేటగిరీ వారీగా కార్యాచరణ ప్రణాళికలు అవసరం అని వివరించారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు జాయింట్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సంజనా సింహ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి ఇన్ చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, సీఆర్డీఏ భూ సేకరణ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ -
ఖైదీ పరారీపై జైళ్ల శాఖ డీఐజీ విచారణ
రేపల్లె: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్కుమార్ పరారైన ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ వరప్రసాద్ శుక్రవారం రేపల్లె సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ సబ్జైలులోని రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇప్పటికే సస్పెండ్కు గురైన జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించారు. పరారీ వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ వరప్రసాద్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనే ఇతర జైలు నుంచి తప్పించుకున్న చరిత్ర ఉన్న అజిత్కుమార్ను రేపల్లె సబ్జైలుకు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అతనికి ఇక్కడ రిమాండ్ ప్రవేశం కల్పించడంపై విచారణ చేస్తున్నామన్నారు. ఖైదీ అజిత్కుమార్ అధికారులకు రూ. లక్షల్లో లంచం ఇచ్చాడన్న ఆరోపణలను అవాస్తవమన్నారు. అయితే విచారణలో కొంతమంది సిబ్బందికి కొంత మేర నగదు అందినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్ చంద్
తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్లోని తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్కు సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఎ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి.మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నూరు: స్వర్ణపురి పట్టణంలో వేంచేసియున్న సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు శిఖాకొల్లి గురునాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, పొన్నూరు బాలగంగాధర తిలక్ తదితరులు పర్యవేక్షించారు. నకరికల్లు: మండలంలోని అడ్డరోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల గురువారం కనుల పండువగా జరిగింది. ధర్మకర్త కాళంగి వెంకట నర్సింహారావు, అర్చకులు వినుకొండ కొండమాచార్యులు ఆధ్వర్యంలో 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి లక్ష తమల పాకులతో అర్చన చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఆరాధ్యదైవం సీతారామాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని గురువారం కనుల పండువగా నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు, భవనం కొండారెడ్డి సహాయ సహకారాలతో నిర్వహించిన ఉత్సవాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. స్వామి వారి తీర్థ ప్రసాదం మహా అన్నదాన కార్యక్రమాన్ని మండలం ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి ప్రారంభించారు. 20 వేల మందికిపైగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను వసూళ్లలో గుంటూరుకు గుర్తింపు
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మరోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. గురువారం విజయవాడలోని ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 పై జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్ షాప్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరపాలక సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, సీడీఎంఏ సంపత్ కుమార్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్కు ప్రశంసా పత్రం, షీల్డ్ అందించి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లలో 2026–27లో గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం రాయితీతో వసూళ్లలో జీఎంసీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇందులో నగరంలోని పన్ను చెల్లింపుదారులు చొరవతోపాటు రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు కార్యదర్శుల కృషి ఉందని చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
పాఠశాలకు పంగనామాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్నెల్లుగా పాఠశాల ముఖం చూడని ఉపాధ్యాయుడు లీప్ యాప్లో నిత్యం హాజరు నమోదు చేసుకుంటున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో దీర్ఘకాలిక సెలవులో ఉండి, మరోవైపు విధుల్లో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపుతున్న వైనం వెలుగు చూసింది. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్ఈ)లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్ నుంచి పాఠశాలకు రావడం లేదు. వ్యక్తిగత వ్యవహారాలతో పాఠశాలకు రాలేని పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారికంగా సెలవు పెట్టుకోవాల్సి ఉంది. అయితే అధికారికంగా సెలవు పెట్టకుండా, సంబంధిత పాఠశాల హెచ్ఎంకు వాట్సాప్ ద్వారా సెలవు సమాచారాన్ని పంపుతున్నట్లు తెలిసింది. లీప్ యాప్లో పాఠశాల సమీపంలోనే ఉండి హాజరు నమోదు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇది సీసీఈ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఐదు తరగతులకు ఇద్దరే టీచర్లు... పాఠశాలలో 62 మంది విద్యార్థులు చదువుతుండగా, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయగా, మిగిలిన ముగ్గురిలో ఒకరు ఆర్నెల్లుగా గైర్హాజరు కావడంతో ఉన్న ఇద్దరు టీచర్లే ఐదు తరగతులను బోధిస్తున్నారు. దీంతో వారిపై అధిక పని భారం పడి సతమతమవుతున్నారు. నిత్యం పాఠశాల విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులతో పాటు డిప్యూటేషన్పై వెళ్లిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉపాధ్యాయులు సైతం విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున పాఠశాలకు ఖచ్చితంగా హాజరు కావాలని విద్యాశాఖ నిబంధనలు చెబుతుండగా, సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కాలేదు. పాఠశాలకు రాకుండా, అధికారికంగా సెలవు పెట్టకుండా యాప్లో హాజరు నమోదు చేస్తున్న సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను వివరణ కోరగా, ఉపాధ్యాయుడి వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నీటి వ్యాపారంపై తనిఖీలు
తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని గుంటూరు చానల్ నుంచి ‘నీటి వ్యాపారం సాగుతోందిలా’ శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఇరిగేషన్ శాఖ గుంటూరు చానల్ జేఈ అవినాష్ పరిశీలించి కాలువపై నుంచి వేసిన పైపులైన్లు తొలగించారు. గుంటూరు చానల్ నుంచి నీటిని తీసుకోవడం లేదని నిర్ధారించారు. ఎత్తిపోతల గ్రావిటీ కాలువ ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి నగరపాలక సంస్థకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లు అక్కడక్కడా ఓపెన్గా ఉండడంతో విద్యుత్ మోటారును ఏర్పాటు చేసి నీటిని గుంటూరు చానల్ దాటించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వైపు పాత జాతీయ రహదారి వెంబడి ఉన్న పలు నిర్మాణాలు, కంపెనీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. గుంటూరు నగరపాలక సంస్థ నుంచి నీటిని చోరీ చేస్తున్న విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అవినాష్ తెలిపారు. -
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు
నగరంపాలెం: ఐపీఎల్కి సంబంధించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే 15 మందిని లాలాపేట, పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 లక్షలు, 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో బుధవారం రాత్రి ఏటుకూర్రోడ్డు చాకలిగుంట ఒకటో వీధిలోని ఓ ఇంట్లో లాలాపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొబైల్ఫోన్లతో గ్రూప్లుగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్లో ఇస్లావత్ జయరామ్నాయక్ నిర్వాహాకుడు అని విచారణలో వెల్లడైందన్నారు. ఆన్లైన్ వెబ్సైట్లో లాగినై, అనంతరం మిగతా బెట్టింగ్ రాయుళ్లకు లాగిన్ సృష్టించి, ఇచ్చేవాడని చెప్పారు. వారిలో ఇస్లావత్ జయరామ్నాయక్, గుమనంపాటి రామారావు, తోట గీతవెంకటగోపీనాథ్, షేక్.చిన్న జిన్నాసాహెబ్, పాలపర్తి గోపికృష్ణ, నేలకుర్తి నాగయ్య, భోగ్యం హనుమంతురావు, షేక్.షుకుర్, షేక్.నాగుల్మీరా, కుటాల వెంకట్, దార్ల కోటేశ్వరరావును అరెస్ట్ చేసి, పది సెల్ఫోన్లు, రూ.1.25 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. అలాగే నందివెలుగురోడ్లో గురువారం చిన్నారి కిళ్లీ దుకాణంలో పాతగుంటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో షేక్.రియాజ్, సుర చిన్నకేశవులు అలియాస్ చిన్నారి, తుమ్మూరు రవీంద్రనాధ్కుమార్రెడ్డి అలియాస్ రవి, బల్ల వెంకటేశ్వరరెడ్డిలను అరెస్ట్ చేసి, రూ.75 వేలు, మూడు సెల్ఫోన్లు, ఒక బుక్ స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఓవర్కు ఎన్ని పరుగులు తీస్తారనే అంశాలపై ఫ్యాన్సీ బెట్టింగ్లు నిర్వహించేవారని అన్నారు. విద్యానగర్లో ఉంటున్న రియాజ్ బెట్టింగ్ నిర్వహకుడని, అతని ద్వారా చిన్నకేశవులు, రవీంద్రనాధ్, బల్ల వెంకటేశ్వరరెడ్డిలు బెట్టింగ్లు వేస్తారని చెప్పారు. ఈ కేసులు చేధించిన తూర్పు డీఎస్పీ షేక్. అబ్దుల్అజీజ్, సీఐలు ఏవీ.శివప్రసాద్ (లాలాపేట పీఎస్), కె.వెంకటప్రసాద్ (పాతగుంటూరు పీఎస్), ఎస్ఐలు షేక్.హసీం, అబ్దుల్రెహమాన్, కానిస్టేబుళ్లు కిరణ్కుమార్, పి.శంకర్, షేక్.మీరావలి, కె.బాబురావు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు. 15 మంది అరెస్ట్ -
పాస్ పుస్తకాల జారీకి వేగవంతమైన చర్యలు
జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ గుంటూరు వెస్ట్: సర్వే పూర్తయిన రెండు గ్రామాల్లో పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కళ్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు. విజయ పతాకం ఎగురవేయాలి.. పారా సిట్టింగ్ క్రికెట్లో గుంటూరు జిల్లా నుంచి టీమ్ జాతీయ జట్టుకు ఎంపికై న కంఠ ఈశ్వరరావు, షేక్ నాగూర్ వల్లి, బండపల్లి మహేష్, బండారు దుర్గారావులను జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ గురువారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. టీమ్ ఇండియాకు ఎంపికై న అభ్యర్థులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా కలిసారు. విజయ పతాకతో తిరిగిరావాలని జిల్లా కలెక్టర్ ఆకాక్షించారు. కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి .. కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ కొనియాడారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి బి.సి సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బీసీ సంఘాల నాయకులు వేములకొండ శ్రీనివాస్, జంపని నాగేశ్వర రావు, షేక్ షూకుర్, రాజకొండ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం కావాలి... అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో మంజూరైన రహదారులు వాటి పరిస్థితుల వివరాలను పరిశీలించి తక్షణం పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న వాటిని అతివేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పతకాలు సాధించి గుంటూరు జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ అన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా సీనియర్ అథ్లెటిక్ ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపికల్లో జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టు ఎంపిక చేసి మే నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జరిగే ఏపీ స్టేట్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో శాప్ అథ్లెటిక్స్ కోచ్లు వెంకటేశ్వరరావు, శివారెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, సభ్యులు కే అరుణ్కుమార్, నాని తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలి
మంగళగిరి టౌన్: దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలని ఇందుకోసం పట్టుదలతో కూడిన సాధన ఎంతో అవసరమని అంతర్జాతీయ మహిళా రెజ్లర్, రియో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గురువారం ఉద్గమ్ 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలను సాక్షి మాలిక్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. తాను 12వ ఏట నుంచి రెజ్లింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టానని, ఎప్పటికై నా ఒలంపిక్స్లో పతకం సాధించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్లో ఆ కోరిక నెరవేరిందని, భారత జాతీయ పతాకం అంతర్జాతీయ క్రీడావేదికపై ఎగురుతుంటే కలిగే ఆనందం వర్ణించలేనిదన్నారు. ఎంచుకున్న క్రీడారంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కఠోర శ్రమ, సాధనతో దానిని అధిగమించాలని క్రీడాకారులకు సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. వర్శిటీ క్రీడాకారులు ఆదిత్య, అనామిక, ముబాసినాలకు వర్శిటీ తరఫున రూ. 20 లక్షల ప్రోత్సాహక పారితోషికాన్ని అందజేశారు. వీరు ఇటీవల జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సాక్షి మాలిక్, గౌరవ అతిథిగా హాజరైన అర్జున్ అవార్డు గ్రహీత సత్యవ్రత్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, అసోసియేట్ డైరెక్టర్ సుస్మితా సింగ్, వర్శిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ -
వేతనాల కోసం ఎదురు చూపులు
సకాలంలో ఇవ్వాలని కోరుతున్న ఏఎన్యూ ఉద్యోగులు, పెన్షనర్లు ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో వేతనాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సకాలంలో వేతనాలు అందడం లేదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వర్సిటీలో పలువురు ఉద్యోగులు ఏ నెలకు ఆ నెల ఎప్పుడు వేతనాలు అకౌంట్కు జమ అవుతాయా అని ఎదురు చూడాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల 21వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ నాన్టీచింగ్, టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు చేతికి అందలేదు. వర్సిటీలో పనిచేస్తున్న డైలీవైజ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీకి మాత్రమే ఈ నెల వేతనాలు అందాయి. నెలలో మొదటి వారంలో అందాల్సిన వేతనాలు మూడు వారాలు గడుస్తున్నా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన తరువాత నెల నెలా వచ్చే పెన్షన్పైనే ఆధారపడి జీవితం గడుపుతూ ఉంటారు. ఏప్రిల్ నెల 21వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ వేతనాలు చేతికి రాకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని పలువురు పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. ఏఎన్యూలో పెన్షనర్లు సుమారు 600 మంది ఉండగా, వారికి ప్రతి నెలా రు. 5 కోట్లకు పైగా అందాల్సి ఉంది. సకాలంలో రాక వందల సంఖ్యలో పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, పెన్షనర్లకూ వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.10,000 వరకు పలికింది. ఈవీఎం గోడౌన్ తనిఖీ నరసరావుపేట: స్థానిక మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ను పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా బుధవారం తనిఖీ చేశారు. సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్ తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా కొల్లాబత్తుల కార్తీక్ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్లోని ఆయన చాంబర్లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్కు కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ తేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా శైలజారాణి కొరిటెపాడు(గుంటూరు) : గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్గా మంగళగిరి మండలం ఏఓ జంపని శైలజారాణి ఎన్నికయ్యారు. స్థానిక కృషీ భవన్లో బుధవారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్గా శైలజారాణితో పాటు వైస్ ప్రెసిడెంట్గా దుగ్గిరాల మండలం ఏఓ రాగాల విజయబాబు, జనరల్ సెక్రటరీగా పెదకాకాని ఏఓ కె.రమణకుమార్, జాయింట్ సెక్రటరీగా పి.సంధ్యారాణి, కోశాధికారిగా బి.కిశోర్లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్ బాల భాస్కర్, కార్యదర్శి బి.ప్రవీణ్, కోశాధికారి మురళీ కిషోర్ల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన సభ్యులను సత్కరించి, అభినందనలు తెలిపారు. గుంటూరులో మోడల్ లా సెట్ గుంటూరు లీగల్: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్ లా సెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్ రిసీవర్ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ రాజేష్ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్, ఓర్సు జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి సాక్షి భావ నారాయణ బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీసమేత సాక్షి శ్రీ భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మే 5వ తేదీ వరకు జరుగుతాయని ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. 23వ తేదీ రాత్రి 10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 24వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన తిరుమంజన ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ధర్మకర్తల మండలి డైరెక్టర్ గున్నాథరావు, సభ్యులు కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట సాయికిరణ్, ఆకు రాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, సింహాద్రి రాము తదితరులు పాల్గొన్నారు. అక్రమాలకు అండగా టీఢీపీజంగా వెంకట కోటయ్య అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు గుంటూరు మెడికల్: ఆమె మరణించినా తన అవయవాలతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్ వైద్యులు అవయవాలు సేకరించి పలువురికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. వివరాలు... బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన ఆకురాటి రత్నకుమారి (65) బ్రెయిన్ స్ట్రోక్కు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈ నెల 19వ తేదీన గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్లో అడ్మిట్ చేయించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోకపోవడంతో ఈ నెల 21న బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు. రత్నకుమారి కుటుంబసభ్యులకు జీవన్దాన్ ట్రస్టు కో ఆర్డినేటర్లు అవయవ దానం గురించి వివరించారు. వారు కూడా దానం చేయడానికి ముందుకు వచ్చారు. లివర్, ఒక కిడ్నీని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్లో, విజయవాడ విజయ హాస్పటల్లో చికిత్స పొందుతున్న రోగికి మరో కిడ్నీ, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు పంపించారు. తద్వారా ఐదుగురికి నూతన జీవితాలు ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు మాట్లాడుతూ అవయవదానం అత్యంత గొప్ప మానవ సేవ అని పేర్కొన్నారు. 7జెడ్పీ వార్షిక బడ్జెట్తో సంబంధం లేకుండానే భవిష్యత్తులో చెల్లింపులు జరిపేందుకు ప్రణాళిక లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రూ.44.73 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షంగా గతంలో అనుమతులు ఇచ్చేశారు. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుత సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానాన్ని కొనసాగించారు. రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి ఈ విషయమై గట్టిగా తన గళం వినిపించారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు మించి రూ.38 కోట్ల పనులు ముందస్తుగా అనుమతులు ఇవ్వడంతో జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. దీనిపై తాము గత సమావేశాల్లోనూ అభ్యంతరం చెప్పామని, జెడ్పీటీసీలతో చర్చించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ నిధులతో సంబంధం లేకుండా రూ.38 కోట్లు, గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.2,35,15,668 తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.4.38 కోట్లను కలుపుకొని రూ.44.73 కోట్ల పనులకు చైర్పర్సన్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారన్నారు. నిధుల లభ్యత లేకుండా ఇలా చేస్తే భవిష్యత్తులో పూర్తయిన పనులకు ఏ విధంగా చెల్లింపులు జరుపుతారని ఓబుల్రెడ్డి ప్రశ్నించారు. దీంతోపాటు రూ.32 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ నిధులు విడుదల చేయని టీడీపీ సర్కారు తీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 44.73 కోట్ల ముందస్తు అనుమతులకు ఆమోదం గుంటూరు ఎడ్యుకేషన్ జెడ్పీటీసీ సభ్యుల అంగీకారం లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేసిన పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. నిధులు లేకుండా రూ.కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా కేటాయించేస్తూ, జెడ్పీ ఖజానాకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై ఆమోదింప చేసుకున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. పిడుగురాళ్లలో జూన్ నుంచి ఓపీ సేవలు పిడుగురాళ్ల వైద్య కళాశాలలో జూన్ నుంచి ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చెప్పారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ఇప్పుడు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇందులో రెండు ప్రభుత్వాల సహకారం ఉందన్నారు. జూన్లో అకడమిక్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులపై సభ్యుల నిలదీత పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో 15వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీకి వచ్చిన నిధులు, పూర్తి చేసిన పనులతోపాటు రద్దు చేసిన పనుల వివరాలు చెప్పాలని అడిగారు. దీనిపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సమాధానమిస్తూ రూ.180 కోట్ల పనులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.142 కోట్లు వచ్చాయని చెప్పారు. మిగిలిన రూ.38 కోట్ల పరిస్థితి ఏంటని నిలదీయడంతో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతారంటూ సమాధానం దాటవేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చి ఏడాది ముగిసినా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ విధంగా రద్దు చేసిన పనులకు సైతం నిధులు కేటాయించినట్లు చూపుతున్నారని కోటయ్య నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇరువురు జెడ్పీటీసీలను వారించారు. నిధుల విషయమై చర్చ ముగించాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా... జెడ్పీటీసీ సభ్యులను మాట్లాడనీయలేదు. దీంతో చేసేది లేక వారు మౌనం వహించారు. అజెండా ఆమోదించినట్లుగా ప్రకటించుకున్న చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, పల్నాడు జేసీ సంజనా సింహ, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, వేగెశ్న నరేంద్రవర్మ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామం టిడ్కో గృహ సముదాయంలో నివాసముండే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం ఉండవల్లి సెంటర్కు చెందిన త్రివేణి (23) కి దుగ్గిరాల మండలం మంచికలపూడికి చెందిన రవికుమార్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల పాప ఉంది. ఐదు సంవత్సరాల క్రితం త్రివేణి భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి కొంతకాలం ఉండవల్లి సెంటర్లోని తల్లి ఇంటి వద్ద నివాసముండి ప్రస్తుతం పెనుమాకలో టిడ్కో హౌస్లో నివాసముంటూ హైకోర్టు వద్ద జిరాక్స్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో జూనియర్ లాయర్గా పనిచేస్తున్న విక్కీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో విక్కీ మరో యువతిని ప్రేమిస్తున్నాడని త్రివేణి అనుమానం పెంచుకుంది. విక్కీ తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన త్రివేణి ఆమె నివాసముండే ప్లాట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై తల్లి రాజకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరేంద్ర తెలిపారు. -
26 నుంచి నృసింహస్వామి జయంత్యుత్సవాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి నగరంలో వేంచేసియున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంత్యుత్సవాలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26 ఆదివారం నుంచి మే 1వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణమ్, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, 27వ తేదీ ఉదయం 8 గంటలకు విష్వక్సేన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, నారసింహ మూలమంత్ర హోమం, సాయంతం 6 గంటలకు కుంభార్చన, నారసింహ హోమం, రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ సేవ, 28వ తేదీ ఉదయం సుదర్శన నారసింహ హోమం, రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ, 29వ తేదీ ఉదయం లక్ష పుష్పార్చన, రాత్రి చతుర్వేద పారాయణం 30వ తేదీ ఉదయం విశేష అలంకారం, మే 1వ తేదీ మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, స్వామివారి గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
తెనాలిరూరల్: రైలు కింద పడి తెనాలిలోని పినపాడు రైల్వే గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పట్టణ ముత్తెంశెట్టిపాలెం మల్లాది వారి వీధికి చెందిన కోటపాటి కళ్యాణ్ చక్రవర్తి(53) వందే భారత్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ: కోర్టు వారెంట్ను అమలు చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం, ఆవులమంద గ్రామానికి చెందిన పిడతల అనూషకు, పిడతల పూల రంగయ్యతో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రస్తుతం వినుకొండలోని శాలివాహన నగర్లో నివాసం ఉంటున్న అనూష స్థానిక కోర్టులో భర్తపై భరణం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడైన పూల రంగయ్య కోర్టుకు హాజరుకాకపోవడంతో, వినుకొండ కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ముషీరాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పూల రంగయ్యపై వారెంట్ను అమలు చేసేందుకు వినుకొండ పోలీసు స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, సత్యరావు హైద రాబాద్ వెళ్లారు. అక్కడ పూల రంగయ్య పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించా రు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు గాను హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ ఎస్హెచ్ఓ బి.ప్రభాకర్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు పూల రంగయ్యను అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి: భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన మన్నేటి గోపీకృష్ణ, భార్య ఆదిలక్ష్మి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇరువురు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి అచ్చంపేట మండలం చెరుకుంపాలెంలోని పుట్టింటికి వెళ్లడంతో గోపికృష్ణ యాసిడ్ ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
బెట్టింగ్కు బానిసైన విద్యార్థి
మాచర్ల క్రికెట్ బెట్టింగ్ భూతం చిన్న పిల్లలను వదలడం లేదు. పట్టణంలో చాలా రోజులుగా బెట్టింగ్ బాబులు హల్చల్ చేస్తున్నారు. కొందరు దీనికి బలైపోతున్నారు. కొందరు అప్పుల పాలవుతున్నారు. తాజాగా పట్టణంలో ఓ కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే బాలుడు బెట్టింగ్కు బానిసయ్యాడు. గుంటూరులో చదువుకుంటూ వ్యసనపరుడుగా మారాడు. అప్పుల పాలై డబ్బులెలా చెల్లించాలో తెలియక చివరికి తన తల్లి బ్యాంకు ఖాతాకు ఎసరుపెట్టాడు. పాస్ బుక్, ఏటీఎం కార్డు తీసుకెళ్లి రూ. 3 లక్షలు డ్రా చేసి అప్పులు కట్టాడు. అంతటితో ఊరుకోలేదు. మళ్లీ బెట్టింగ్ ఆడాడు. గమనించిన తల్లి తన పెద్ద కుమారుడితో వెళ్లి బ్యాంకు ఖాతా పరిశీలించగా విషయం తేలింది. కుమారుడిని మందలించి, గుంటూరులో ఉంటున్న ఆమె మాచర్లకు తిరిగొచ్చి ఇక్కడే ఉంటోంది. తాజాగా రెండు రోజుల కిందట తన తల్లి ఖాతాలో మరో రూ. లక్ష ఉన్నాయని తెలుసుకున్న చిన్న కుమారుడు... డ్రా చేయటానికి ఆమె సెల్ఫోన్ తీసుకెళ్లాడు. ఈలోపు తన ఖాతాను ఆమె బ్లాక్ చేయించింది. అనంతరం ఆ మైనర్ సెల్ఫోన్ తీసుకొని ఉడాయించాడు. దీనిపై తల్లి మంగళవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. బాలుడు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించాలి
తులసి ధర్మచరణ్ కొరిటెపాడు (గుంటూరు వెస్ట్) : అంతర్జాతీయ క్రీడ బాక్సింగ్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గుంటూరు జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ తులసి ధర్మ చరణ్ పేర్కొన్నారు. బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొసనా వేణుగోపాలరావు మెమోరియల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో తులసి ధర్మచరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ కార్యక్రమానికి అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ, కార్యదర్శి డాక్టర్ చిరంజీవి అధ్యక్షత వహించారు. తులసి ధర్మచరణ్ మాట్లాడుతూ కఠోర సాధన తోనే బాక్సింగ్ క్రీడలో విజయాలు సాధ్యమవుతాయన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంతో రాష్ట్రానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారవుతారన్నారు. ఈ సందర్భంగా బాక్సింగ్ విజేతలకు తులసి ధర్మ చరణ్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ ఆర్.విశ్వనాథం, గంధం వెంకటేశ్వరరావు, వాకా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు బీరువాను ధ్వంసం చేశారు. నగదు, విలువైన వస్తువులు లభ్యం కాకపోవటంతో వెనుతిరిగారు. ప్రకాష్నగర్లో బుధవారం వెలుగు చూసిన చోరీ యత్నం సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్నగర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం షిరిడి యాత్రకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని వన్టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి కింద, పై అంతస్తులోని రెండు తలుపుల తాళాలను పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని సామాన్లను చిందరవందరుగా పడేసి ఉండటాన్ని గమనించారు. షిరిడి యాత్రలో ఉన్న ఇంటి యజమానితో సీఐ మాట్లాడారు. ఇంట్లో విలువైన వస్తులు, నగదు ఏమీ లేవని చెప్పటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. గృహ సమీపంలోని సీసీ పుటేజ్లను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. -
వేసవిలో పిల్లల భద్రత ముఖ్యం
తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ సూచన నగరంపాలెం (గుంటూరు వెస్ట్): వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభం దృష్ట్యా విద్యార్థులు, చిన్న పిల్లలను అనుక్షణం తల్లిదండ్రులు గమనించాలని కోరారు. సెలవుల్లో సరదా కోసం వారు కృషా్ణ్ నది లోపలకు, ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. పిల్లలు సరదాగా ఈత కొట్టేందుకు లేదా స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాల్వలు, కృష్ణానది, నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు. నీటి ప్రమాదాలతో కలిగే నష్టాలు, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు తెలియజేసి, వారిలో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం లేదా వేసవి శిక్షణ శిబిరాలకు వారిని పంపించాలన్నారు. జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు నది ఉధృతిని స్థానికులు తెలియజేయాలన్నారు. హెచ్చరిక బోర్డులున్న ప్రదేశాల్లోని నీటిలోకి దిగవద్దని అన్నారు. అత్యవసర పరిస్థితులలో డయల్ 100, 112 లేదా స్థానిక పోలీస్ స్టేషనులో సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. -
పోరాడుదాం.. నారీశక్తిని చాటుదాం
పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడానికి వైఎస్సార్ సీపీలోని ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ఆయా విభాగాలకు చెందిన మహిళా నాయకులు తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం.. సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి.. మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. మావిగన్ ప్రతిపాదన అద్భుతం.. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ డెప్యూటీ మేయర్ శీలం భారతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పి.గీతా హాసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు. -
25న మొక్కజొన్న రైతు పోరాట దీక్ష
ఉదయం 8 గంటలకు ప్రారంభం ... ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రైతులు భారీగా రాక వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వెల్లడి నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’ను ఈ నెల 25వ తేదీన గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గసమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతు ఆదాయం పెంచే దిశగా కృషి చేయాలి
– జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పని చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. వివిధ ప్రాథమిక రంగాల శాఖాధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు పంటల విధానాన్ని మార్పు చేసి అధిక ఆదాయం వచ్చే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంటల వారీగా వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని, ఉత్తమ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి పాల్గొన్నారు. – ఏఎన్యూలో మరో మాయాజాలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్కు బదులుగా మరో సెంటర్ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్ సెంటర్ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్లో హాల్ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం. గుంటూరుమెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఐ.ఎస్.సి.సి.ఎం సహకారంతో ఏబీజీ అనాలసిస్పై వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం (సీఎంఈ) నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.సేవ కుమార్, డాక్టర్ బి.సాయికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం జి.ఎం. ఏ బిల్డింగ్లో నిర్వహించే కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కె.ఉదయ్, డాక్టర్ వై.విశ్వజ్యోతి ప్రసంగిస్తారన్నారు. గుంటూరు నగర వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగాకోరారు. తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. -
నీతి లేని పోలీసుల రీతి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వ్యవహారంలో తేటతెల్లం ● ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై మాత్రం చర్యలు శూన్యం ● శాంతియుతంగా నిరసన తెలిపిన అంబటిపై కేసు నమోదు ● రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పోలీసుల అత్యుత్సాహంలక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈ నెల 19వ తేదీన గుంటూరులోని కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చేపట్టిన నిరసన దీక్షపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేశారంటూ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా దీక్ష చేపట్టిన అంబటిపై ఎస్ఐ ప్రసన్న కేసు నమోదు చేశారు. కానీ కూటమి నాయకులు సుమారు 7 గంటలకుపైగా అంబటి ఇంటిపై, కార్యాలయంపై చేసిన విధ్వంసకాండకు సంబంధం ఉన్న వ్యక్తులపై ఇంత వరకు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతోపాటు అంబటి రాంబాబుపై ఇద్దరు పోలీస్ అధికారుల ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్లో చేసిన వేధింపులపై పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే డిమాండ్లతో ఈ నెల 19వ తేదీన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టిన నిరహార దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని, కూమటి నాయకుల ఆదేశాల మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గోప్యంగా అంబటిపై కేసు నమోదు చేశారు. రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అదే రోజు పోలీసులు అంబటిని అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అదే రోజు న్యాయమూర్తిని అంబటి తన ఇంటి పై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదును తీసుకోవాలంటూ చేసిన అభ్యర్థన మేరకు వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నామమాత్రంగా ప్రస్తుత మాజీ కార్పొరేటర్ పేరుతో మరికొందరు అంటూ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. అంబటి ఇంటిపై దాడికి పాల్పడిన వారికి టీడీపీలో కీలక పదవులను ఇచ్చి ప్రోత్సాహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పథకం ప్రకారమే అంబటిపై దాడి చేసినట్లు పదవులు ఇవ్వడంతో స్పష్టం అవుతోంది. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాఽధికారులు, సంబంధిత అధికారులు పార్టీలకు అతీతంగా సమన్యాయంతో విధులు నిర్వహించాలన్నారు. కూటమి నాయకుల మెప్పు కోసం కేసులు బనాయించడం సరికాదని అన్నారు. -
రేపు ‘పొన్నూరు రైతు పోరాట దీక్ష’
● వాల్పోస్టర్లు ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ● జొన్న, మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ పెదకాకాని: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్లో గురువారం ‘పొన్నూరు రైతు పోరాట దీక్ష’ నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రమైన పెదకాకానిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రైతులతో కలిసి ఆయన వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జొన్న, మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న సాగు చేయగా, ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారన్నారు. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ప్రకటిస్తే ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదన్నారు. రైతులు చేసిన అప్పులు చెల్లించేందుకు, నిల్వ చేసుకునే స్థలం లేక క్వింటా రూ.1400 నుంచి రూ.1700లకు అమ్ముకుని నష్టపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అనుచరులు దళారుల అవతారమెత్తి రైతులను మోసం చేస్తూ పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎమ్మెల్యే తన సంగం డెయిరీలో నిల్వ చేసి పశువులకు దాణాగా మార్చడం, మారు బేరానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం గుంటూరులో నిర్వహిస్తున్న రైతు పోరాట దీక్షకు పొన్నూరు నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. -
పేదల గూడుపై పాలకుల పగ
పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు కూల్చండని ఎంత బతిమాలినా ఆ రాతి గుండెలు కరగలేదు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు చాలా మంది ఉన్నారయ్యా.. వారిని తరలించేందుకు, సామగ్రి తీసుకెళ్లేందుకు కొంచెం సమయం ఇవ్వండయ్యా అని కాళ్లావేళ్లా పడినా జాలి కూడా చూపలేదు. రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను రైల్వే అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు కలసి పోలీస్ అధికారులను వందలాది మందిని రంగంలోకి దింపి నెహ్రూనగర్ జీరు లైను అయిన మోతీలాల్ నగర్లో ఇళ్లను కూల్చేశారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): మోతీలాల్ నగర్కు చెందిన పేద కుటుంబాలు నెహ్రూనగర్ రైల్వే గేటు దగ్గరలో గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి. ట్రాక్ పక్కనే డ్రైయిన్ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణ పనులతో 135 నివాసాలు పూర్తిగా తొలగిస్తున్నామని.. కొద్ది రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే దిక్కుతోచని బాధితులు స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు గోడు వెళ్లబోసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి సమస్యను తీసుకెళితే కనీస వసతులు లేని ప్రాంతాల్లోకి వెళ్లి ఉండాలని చెబుతున్నారని బాధితులు వాపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు లేవని, మౌలిక వసతులు కల్పిస్తే తాము వెళ్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని విలపించారు. ఒక పక్క ఇళ్లు కూలుస్తారని బాధలో మోతీలాల్ నగర్ వాసులు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో పక్క సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది బాధితులను వ్యాన్లోకి ఎక్కించి అరెస్టు చేవారు. కూల్చివేతలు పూర్తయిన తరువాత వారిని వదిలిపెట్టారు. ఇందులో కొంతమంది మహిళా పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించారు. మోతీలాల్ నగర్లో రైల్వే ట్రాక్ వెంబడి ఇళ్లను కూల్చివేసిన రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది పోలీసులు, జేసీబీలతో వచ్చి కూల్చివేతలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని బాధితుల ఆందోళన అన్ని విధాలా తమను నాశనం చేశారని పాలకులకు శాపనార్థాలు సామగ్రి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం -
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కుట్రలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన శనివారం ఈ దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు. మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్ జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం చంద్రమౌళీనగర్లోని భాష్యం మెయిన్ క్యాంవస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయి న్స్ సెషన్–2 పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుంచి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడని, ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంకును కై వసం చేసుకున్నట్లు చెప్పారు. వివిధ కేటగిరీల్లో జేసీహెచ్ వర్షిత్ ఆలిండియా 5వ ర్యాంకు, డి.పవన్ 6వ ర్యాంకు, ఆర్.బాలానాయక్, 24వ ర్యాంకు, కె. రామకష్ణారెడ్డి 62వ ర్యాంకు, సీహెచ్ ప్రణయ్ 83వ ర్యాంకు, వై.యశస్వి 99వ ర్యాంకు, ఎం.బాలసాయిరామ్ 123వ ర్యాంకు, కె.కేశవకుమార్ సాయికృష్ణ 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ 140వ ర్యాంకు వంటి 150లోపు 10 అత్యుత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. ఆల్ ఇండియా 200లోపు 28 ర్యాంకులు, 500లోపు 60 ర్యాంకులు, వెయ్యి లోపు 82 ర్యాంకులు కై వసం చేసుకుని 73.24 శాతం సక్సెస్రేట్తో సత్తా చాటారన్నారు. ఇదే స్ఫూర్తితో మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్లోనూ తమ విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు చైర్మన్రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఐఐటి ప్రోగ్రామర్ ఎం. ఆనంద్ కుమార్ అభినందనలు తెలిపారు. -
నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. మాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాడని వాపోయింది. దీనికిగాను నా 150 గజాల స్థలానికి రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న తమకు న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. ఇక మరణమే తనకు దిక్కు అని సుధారాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం లక్ష్మీపురంలోని క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుంటూరుజోన్ నుంచి పి.ప్రవీత్ చెన్నకేశవ్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 83వ ర్యాంకు సాధించాడని చెప్పారు. వివిధ కేటగిరీల వారీగా బి.ఆంజనేయులు నాయక్ 82వ ర్యాంకు, టి.చెన్నయ్య 91వ ర్యాంకు, ఎం.సాకేత్ 143వ ర్యాంకు, డి.యశ్వంత్ 596వ ర్యాంకు, ఎస్ఎస్ నాగలక్ష్మి 604వ ర్యాంకు, టి.ప్రేమ్కిషన్ 767వ ర్యాంకు, సీహెచ్ గీతామయూరి 837వ ర్యాంకు, డినేష్ కార్తీక్ నాయక్ 776వ ర్యాంకు, జె.ఆనంద్ 911వ ర్యాంకుతోపాటు వెయ్యిలోపు 12, రెండువేల లోపు 38, ఐదు వేల లోపు 72, 10వేల లోపు 175, 20వేల లోపు 210 మంది ర్యాంకులు సాధించారని వివరించారు. సంస్థ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఈమని దుర్గాప్రసాద్, డీన్లు సురేష్బాబు, కిషోర్, కృష్ణ, చంద్రశేఖర్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమా చారం ఇవ్వొచ్చని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత పట్ల జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్లతో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, ఇతర అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తరాదు తాగునీటి ఎద్దడి ఏ గ్రామంలోనూ తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడే గ్రామాలు గుర్తించాలని, అటువంటి గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్లను 24 గంటలలో మరమ్మతులు పూర్తి చేసేందుకు అవసరమైన విడి పరికరాలు సిద్ధంగా పెట్టాలన్నారు. పశువులకు, వీధి కుక్కలకు కూడా తాగునీటిని అందుబాటు ఉంచాలని సూచించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు ప్రతి రోజూ చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వడ దెబ్బపై ప్రజల్లో అవగాహన అవసరమని, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వడ దెబ్బకు గురి కాకూడదని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన చోదకులు కొంతసేపు నిలువ వలసి ఉంటుందని, వారికి నీడను కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బడి పిలుస్తోంది పోస్టర్ ఆవిష్కరణ బడి పిలుస్తోంది కార్యక్రమం పోస్టర్ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రామాణిక విద్య అందించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అర్హత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు బోధిస్తారని, ఉచిత పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్, బూట్లు వంటి సామాగ్రి అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడం లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి పాఠశాలకు చేరే విద్యార్థులు విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మ్యాపింగ్ జరగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఎంఈఓ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. జలధార–జల హారతిపై గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలి ‘జలధార –జల హారతి’పై గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. జిల్లాలో అన్ని శాఖల కింద ఉన్న ప్రతి చెరువు, ప్రతి నీటి నిలువ ప్రదేశం జాబితాలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పూడికలు తీయాలని, గరిష్ట నీటి సామర్థ్యం మేరకు నిలువ చేయాల్సిందేనని అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని చెప్పారు. ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, అధికారులు పాల్గొన్నారు. 26న సెన్సస్ 5 కె రన్ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఈనెల 26న ‘సెన్సస్ 5కె రన్‘ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఈ రన్లో పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో స్వీయ జన గణన అందరూ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మంగళగిరి ఎయిమ్స్ వైద్యురాలికి అరుదైన అవకాశం
మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ తుమ్మలగుంట ప్రత్యూషకు అరుదైన అవకాశం లభించింది. జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ – (ఈఎస్సీఎంఐడీ) సదస్సులో భారతదేశం నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ ప్రత్యూష క్లినికల్ మైక్రోబయాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్పైన పరిశోధనలు చేయడంతోపాటు ఆమె రచించిన విలువైన సిద్ధాంతపత్రాలు వివిధ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని మ్యూనిచ్లో ఈ నెల 17నుంచి ప్రారంభమైన సదస్సు నేటితో ముగియనుంది. క్లినికల్ మైక్రోబయాలజీ, అంటువ్యాధులపై ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం నుంచి ఆమె ప్రతినిధిగా పాల్గొని అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యరంగం పరంగా చేపట్టాల్సిన పలు అంశాలపై ఆమె కీలకపన్యాసం చేశారు. ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొన్న డాక్టర్ ప్రత్యూషను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంతాసింగ్, అధికారులు అభినందించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.13,700, మోడల్ ధర రూ.10,500 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2280 టీఎంసీలు.క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ తెనాలి రూరల్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల ఖాతాల్లోని రూ.3.61 లక్షలను ఫ్రీజ్ చేయించారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని పాఠశాల సమీపంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఎస్ఐ ఎన్సీ ప్రసాద్కు ఆదివారం వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు ప్రధాన నిర్వాహకులతోపాటు బెట్టింగ్లో పాల్గొన్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ప్రధానసూత్రధారి ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ లింక్ను అత్తోటలోని వ్యక్తులకు పంపి ఐడీ, పాస్వర్డ్ను చెప్పేవాడు. దాని ఆధారంగా లాగిన్ అయి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మినహా మిగిలిన నిందితులను అత్తోట గ్రామానికి చెందిన బొల్లిముంత అవినాష్, యర్రు ప్రవీణ్, దాసరి రమేష్, బొల్లిముంత రమేష్, బొల్లిముంత శంతన్, బొల్లిముంత ఉమామహేశ్వరరావులుగా గుర్తించా రు. వీరి వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరి ఖాతా ల్లోని నగదును ఫ్రీజ్ చేయించినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఐ నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, ఏఎస్ఐలు ప్రసాదరావు, పోతురాజు, హెడ్కానిస్టేబుళ్లు సత్యనారాయణ, మురళీకృష్ణ, కానిస్టేబుల్ కూర్మారావులను డీఎస్పీ అభినందించారు. మట్టిలో మౌనం.. శతాబ్దాల ధ్యానం.. నాగలి స్పర్శతో భక్తులకు దర్శనం అలంకారం వీడి..ఆత్మరూపం చూపి తరాల సేవ..తరగని భక్తి... ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి 7 -
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను అభినందించిన కలెక్టర్
గుంటూరు వెస్ట్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఇస్రో నిర్వహించిన యువికా యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికై న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఇర్ల జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సుస్మితా చంద్లు అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థులు జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషాతో కలసి కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి 14 మంది విద్యార్థులు ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపిక కాగా, వారిలో గుంటూరు జిల్లా నుండి ఇద్దరు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఉన్నత అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులు రామాంజనేయులు, శ్రీనివాస్, ముట్లూరు ప్రధానోపాధ్యాయులు జోస్ మేరీలను అభినందించారు. ఎంపికై న విద్యార్థులు మే 9 నుండి 23 వరకు శ్రీహరికోట షార్ కేంద్రంలో జరిగే యూనికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొంటారని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా పాల్గొన్నారు. -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. బాపట్ల: న్యూఢిల్లీలో ఈనెల 21న జరిగే 18వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్నకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికై న అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్కు చోటు దక్కడం విశేషం. కలెక్టర్ ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించింది. నరసరావుపేట రూరల్: మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మండలానికో ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీవోలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్లు వరకు, సబ్సిడీతో రూ.5కోట్లు వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 526.30 అడుగులకు చేరింది. ఇది 161.0148 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలి
నగరంపాలెం: బాధితులకు నిర్ణీత వేళల్లో చట్ట ప్రకారం న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. బాధితుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు అర్జీలు స్వీకరించగా, 146 ఫిర్యాదులు వచ్చాయని కార్యాలయపు వర్గాలు లె లిపాయి. -
కర్షకులపై బాబు కక్ష
గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం అన్ని విధాలుగానూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు వేడుక చూస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు. పొన్నూరు నియోజకవర్గ రైతులతో కలిసి ఆయన సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేసి, జిల్లాలోని రైతుల కష్టాలను వివరించారు. అనంతరం మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్లో పండించిన మొక్క జొన్న, జొన్న పంటలకు మద్దతు ధర లభించక రైతులు నైరాశ్యంలో మునిగిపోయారన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ పంటలను 70 వేల ఎకరాల్లో సాగు చేస్తే ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాలు సాగుచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మొక్కజొన్నకు క్వింటాకు మద్దతు ధర రూ.2,400, జొన్నకు క్వింటాకు రూ.3,700 రైతులకు అందడంలేదన్నారు. దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దళారులు మొక్కజొన్న క్వింటాకు రూ.1700, జొన్న రూ.1900 మాత్రమే కొంటూ రైతుల కష్టాలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రూ.కోట్లలో నష్టపోతున్న రైతులు మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు నియోజవకర్గంలో మొక్కజొన్న దిగుబడి సుమారు 18 లక్షల క్వింటాళ్లు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రైతులకు సుమారు రూ.432 కోట్లు రావాల్సి ఉందన్నారు. అయితే దళారులు తక్కువ ధరకు కొనడం ద్వారా సుమారు రూ.130 కోట్ల మేర నష్టపోతున్నారన్నారు. ఇంత దారుణం జరుగుతుంటే, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా రైతాంగం తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ, మండలాల వారీగా మార్కెఫెడ్, మార్కెట్ యార్డ్ల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతులకు మనోధైర్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భాను కిరణ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెనుమాల అరుణ్ కుమార్, పెదకాకాని జడ్పీటీసీ సభ్యులు గోళ్ళ జ్యోతి, కాకాని మండల మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చాగంటి మురళీ కుమార్ రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి రాఘవ, రైతు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి మంగళగిరి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతుల కష్టాలు ఆలకించి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్లు డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులకు నాయకులు, కార్యకర్తలతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జొన్న, మొక్కజొన్నకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.2,400 మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు ధర లేక దళారులకు క్వింటా రూ.1,700లకే అమ్ముకునే స్థితికి రైతును ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, మంగళగిరి, తాడేపల్లి మండలాల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, అమరా నాగయ్య, జిల్లా అధికార ప్రతినిధి బాజీ గంగాధరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు మేకల సాంబశివరావు, శివనాగేంద్ర, పార్టీ రైతు విభాగాల అధ్యక్షులు రుక్మాంగరెడ్డి, తమ్మా సాంబిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లాలో దారుణం మైనర్పై అత్యాచారం
-
ఉచితంగా వైద్యసేవలు...
గుంటూరు జీజీహెచ్లో లివర్ జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. లివర్ జబ్బులను ముందస్తుగానే గుర్తించి చికిత్స అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేకంగా లివర్ను దెబ్బతిసే వైరస్లకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. హెపటైటిస్–బీ వైరస్ నియంత్రణ కోసం ప్రతినెలా రూ.2000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. హెపటైటిస్–సీ జబ్బులకు ఉచితంగా రూ. 20,000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. –డాక్టర్ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
పర్వతారోహకుల బృందానికి వీడ్కోలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతరంలో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం సాధికారికతను పెంపొందిస్తూ దృఢమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వైహెచ్ఏఐ) పనిచేస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వీవీజే సోమరాజు పేర్కొన్నారు. వైహెచ్ఏఐ గుంటూరు యూనిట్ నుంచి హిమాచల్ప్రదేశ్లోని 1,300 అడుగుల ఎత్తులో ఉన్న ’సర్పాస్’ మంచు పర్వతారోహణకు బయల్దేరిన 60 మంది పర్వతాహరోహకులకు ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ఆవరణలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ జర్మనీకి చెందిన రిచర్డ్ షేర్మాన్ 1909లో యూత్ హాస్టల్స్ ఉద్యమాన్ని ప్రారంభించగా, మన దేశంలో 1946లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థాపించారని వివరించారు. గుంటూరు యూనిట్ చైర్మన్ డాక్టర్ కె.కొండయ్య మాట్లాడుతూ వైహెచ్ఏఐకు అనుబంధ సంస్థగా రాష్ట్రంలో 700 మంది అత్యధిక సభ్యులతో ఉన్న గుంటూరు యూనిట్ గత 10 ఏళ్లుగా అనేక ట్రెక్కింగ్ కార్యక్రమాలతో పాటు సముద్ర స్నానం, సైకత సాధన, పర్వతారోహణ, అవరోహణ, రాఫ్టింగ్, ఫ్యామిలీ క్యాంపింగ్ వంటి సహజ కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. కొండవీడు, సూర్యలంక, కొండపల్లి, పరిటాల, మూలపాడు, పుట్టకోట, లంబసింగి, అరకు, తలకోన, శేషాచలంతో పాటు చార్దామ్ యాత్ర, నేపాల్, ముక్తినాథ్, వంటి సాహస యాత్రలను ప్రోత్సహిస్తూ యువతలో దేశభక్తి, జాతీయ భావం ఐక్యత కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోతురాజు, గుంటూరు యూనిట్ అధ్యక్షుడు తుపాకుల చంద్రశేఖర్, కార్యదర్శి రవి కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి భాను భాస్కర్ రావు, కోశాధికారి సుధాకర్ తదితరులు జెండా ఊపి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అమరావతి... ఓ అంతులేని కథ
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆచరణ సాధ్యం కాని అమరావతి రాజధాని నిర్మాణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్లలో రాజధాని అమరావతిలో ఎటువంటి పురోగతి లేదన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు అతి తెలివి, అవినీతి, స్వార్థంతో పెద్ద రాజధానిని నిర్మిస్తానని క్షేత్రస్థాయిలో సాధ్యం కాని ప్రాజెక్టును తలకెత్తుకున్నారని ఆరోపించారు. అమరావతి అనేది ఓ అంతులేని కథ అని, చంద్రబాబు జీవితంలో కాదు కదా, వందల ఏళ్లలో సైతం పూర్తి చేసేందుకు వీలుపడని ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. తాత్కాలిక నిర్మాణాలతో కాలం వెళ్లబుచ్చారని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి, కాంట్రాక్టర్లకు డబ్బులు దోచి పెట్టేందుకు, కమీషన్లు దండుకునేందుకు తప్ప రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం లేని పనులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్తో చెట్టాపట్టాలు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు బీజేపీకి శత్రువైన కాంగ్రెస్తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఓ వైపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చి, మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు డిన్నర్లు చేయడం ద్వారా చంద్రబాబు మరోసారి తన ఊసరవెల్లి రాజకీయాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులు, నేతల అరెస్టులేంటి? లోకేష్ వందల సంఖ్యలో యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తూ మావిగన్ అంటే బూతు మాట అని భారీ ఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. చంద్రబాబు తిరిగి డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. సీనియర్ జర్నలిస్టు అయిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పూడి శ్రీహరి వంటి వారి అరెస్టులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో కేవీఆర్ అనే ఓ జర్నలిస్టు ఇంటికి ఆంధ్రా పోలీసులు అర్ధరాత్రి వెళ్లి ఆయన వచ్చే వరకూ వెళ్లమని చెప్పారని అన్నారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులపై పోలీసులను వాడాలనే పరిస్థితికి చంద్రబాబు దిగజారారని, పైవాళ్లు చెప్పారని పోలీసులు ఇలాంటి పనులు చేస్తే వారే ఇరుక్కుపోతారని హెచ్చరించారు. అమరావతిలో భవన నిర్మాణాలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు వెచ్చించడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు?. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కోసమే రూ.రెండు లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయగా, క్షేత్రస్థాయిలో వాటిని పూర్తి చేసేందుకు రూ.నాలుగు లక్షల కోట్లకు ఖర్చు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. మిగతా భవనాలకు రూ.లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఆర్థికంగా ఇది రాష్ట్రానికి భారమేనన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా, అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదన తెచ్చారని, దీంతో చంద్రబాబు గుండెల్లో రాయి పడిందన్నారు. ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారని టీడీపీ పెద్దలు బూతులతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారని అన్నారు. 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల మంది అమరావతిలో నివశిస్తారని చంద్రబాబు చెబుతుండగా, ప్రస్తుతం అక్కడ ఉన్న జనాభా వేల మందే అని అర్థమవుతోందన్నారు. వైఎస్ జగన్ చెప్పిన మావిగన్లో ఇప్పటికే 35 లక్షల నుంచి 45 లక్షల మంది నివసిస్తున్నారని తెలిపారు. -
భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి
గుంటూరు వెస్ట్: భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను సమీపంలోని కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ నాలుగు సంక్షేమ పథకాలను పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాకు డబ్బులు జమచేసే విధంగా అమలుచేస్తారని వివరించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయం డిజిటల్ సెక్రటరీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీల ద్వారా అర్జీ దాఖలు చేయవచ్చని సూచించారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు గల కార్మికులందరూ దగ్గరలోని కార్మికశాఖ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు కార్డు కలిగిన భవన నిర్మాణ కార్మికులు ఆ కార్డును నవీకరించుకోవాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అందజేసే సంక్షేమ పథకాలకు ఈ కార్డు కలిగిన కార్మికులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
లివర్ క్యాన్సర్కు దారితీస్తాయి...
లివర్ క్యాన్సర్లు రావటానికి హెపటైటిస్– బీ, హెపటైటిస్–సీ వ్యాధులే కారణం. కామెర్ల వ్యాధి(జాండీస్) సోకిన వారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో హెపటైటిస్ వైరస్ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ హెపటైటిస్కు దారి తీసి కొన్నేళ్ల తరువాత లివర్ దెబ్బతినటానికి కారణమవుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ వస్తుంది. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు. -
మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన రంగంశెట్టి జగదీష్ రూ.కోటీ యాభై లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అంగీకారపత్రాన్ని ఆలయ ఈవో కె.సునీల్కుమార్, ధర్మకర్త రంగప్రసాద్కి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అనివేటి మండపం, ప్రాకారం, పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా రూ.ఆరు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఈవో తెలిపారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుని మండలాభిషేక మహోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో మహోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు విఘ్న విమోచక హనుమంతునికి 108 కలశాలతో అభిషేక మహోత్సవం, విశేష అర్చనలు, అనంతరం తీర్థ ప్రసాదగోష్ఠి, సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ, హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుమంజన సేవ, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామానుజ సూత్తందాది, సాయంత్రం తిరువీధి ఉత్సవం, జగదాచార్యులు, భగవద్రామానుజులు అనుగ్రహించిన గద్యత్రయ పారాయణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పైకార్యక్రమాలలో పాల్గొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. వేటపాలెం: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలేనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు ట్రిపుల్ జంప్ఽ కాంపిటిషన్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు బ్యాంకాక్ దేశంలో థాయిలాండ్ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలు జరిగాయి. 49 ప్లస్ వయస్సులో ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమాను స్నేహితులు అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,55,030 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.3,86,53, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,26,665, స్వామి వారికి డొనేషన్లు రూపంలో రూ.1,73,217, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 28,800, దర్శనం ద్వారా రూ.33,900 కలిపి మొత్తం రూ.7,55,030 ఆదాయం వచ్చిందన్నారు. -
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనూరాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ‘స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనూరాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. వదంతులు నమ్మవద్దుఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనూరాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని చెప్పారు. అనూరాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేసిందని తెలిపారు. హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనూరాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని చెప్పారు. వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనూరాధకు షహనాజ్ పరిచయం కావడంతో ఇరువురు కలిసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనూరాధ తిరిగి తెనాలి చేరటం, అక్రమార్జనకు పాల్పడటం ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామ చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాలలో వాస్తవం లేదని, ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐ నక్కా ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
23న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా సీనియర్ (పురుషులు, మహిళలు) అథ్లెటిక్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారు ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ పాల్గొనటానికి అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 23వ తేదీ 9 గంటలకు బీఆర్ స్టేడియంలో తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రిపోర్ట్ చేయాలని కోరారు. అంతర్జాతీయ హంగులతో సూర్యలంక తీరం అభివృద్ధి బాపట్ల: సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. సూర్యలంక తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన ఆయన, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్డ్స్ను సందర్శించారు. గదుల లభ్యత, సేవల నాణ్యత, రెస్టారెంట్ ఆహార ప్రమాణాలపై ఆరా తీశారు. బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకుల రక్షణ కోసం లైఫ్ గార్డులు, హెచ్చరిక బోర్డులు, నిఘా వ్య వస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీవీఎం చైతన్య, మేనేజర్లు సతీష్, నాగభూషణం, వర్క్ ఇన్న్స్పెక్టర్ శ్రీధర్, కాంట్రాక్టర్ సతీష్, డివిజన్ కార్యాలయ సిబ్బంది, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా బేస్ బాల్ కార్యదర్శి కే శ్రీను, అజయ్ కుమార్, నరేష్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ఈనెల 24, 25, 26 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్ సంయుక్తంగా 16వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ● మొదటి రోజైన 24వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 కు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’ నాటిక, రాత్రి 9:30 నిమిషాలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటిక, రాత్రి 10:30 నిమిషాలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు ప్రదర్శిస్తారు. ● రెండో రోజు శనివారం యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘ధర్మో రక్షతి’ నాటిక, శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారి ‘ద్వార బంధాల చంద్రయ్య నాయుడు’ నాటిక, హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శిస్తారు. ● చివరి రోజు ఆదివారం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సుహాన నాటిక, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక రాత్రి బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి ‘కన్నీటికి విలువెంత’ నాటికలు అనంతరం బహుమతి ప్రదానం ఉంటుందని సాంబశివరావు తెలిపారు. -
పారా వెటర్నరీ కౌన్సిల్ అమలు చేయాలి
గుంటూరు మెడికల్: పారా వెటర్నరీ కౌన్సిల్కు 2023లోనే గెజిట్ వచ్చినా నేటికీ అమలు కాకపోవటం చాలా బాధాకరమని, పూర్తిస్థాయిలో పారా వెటర్నరీ కౌన్సిల్ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ భూక్యా సేవానాయక్ కోరారు. ఆదివారం గుంటూరులోని ఏపీఎన్జీజీఓ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీస్ ఫెడరేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం, సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవాలు, ప్రపంచ పశువైద్య వేడుకలు నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 600 మంది ఫెడరేషన్ సభ్యులు హాజరయ్యారు. ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సేవా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేడకలకు ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజు, కో చైర్మన్ ఎన్. రాఘవరావు, వైస్ చైర్మన్ జి.రామకృష్ణ , ప్రసాదరావు, సీహెచ్ అనిల్, రాకేష్, శశిధర్రెడ్డి, వెంకట సుబ్బయ్య, రాష్ట్ర మాజీ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, రామారావు, ఆర్డీ సుబ్రహ్మణ్యం, వెంకటరాముడు, పశు సంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు కేవీపీ సత్యన్నారాయణ, ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్ హాజరై మాట్లాడారు. సమావేశంలో పారా వెటర్నరీ కౌన్సిల్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ కేడర్ వీఎల్ఓ కేడర్కు గెజిటెడ్ హోదా ఇవ్వాలని, ఎల్ఎస్ఏ క్యాడర్ను వెటర్నరీ ఇన్స్పెక్టర్గా పేరు మార్పు చేయాలని కూడా వారు ఆయా డిమాండ్లపై చర్చించారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని నిర్ణయించారు. ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ భూక్యా సేవానాయక్ -
లివర్ను ఇలా కాపాడుకోవాలి..
ఆల్కాహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది కాబట్టి మద్యం జోలికి వెళ్లవద్దు. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినవద్దు. ఉప్పు, చక్కెర , రెడ్మీట్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. పచ్చని ఆకు కూరలు తినటం వల్ల లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. ఆలీవ్ ఆయిల్స్, వాల్నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు, వెల్లులి పాయలు, పసుపు లివర్కు మేలు చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కాలేయం వద్ద పేరుకుపోయే కొవ్వును నియంత్రణ చేస్తుంది. రోజూ నీటిని ఎక్కువగా తాగటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాజిస్ట్, గుంటూరు జీజీహెచ్. -
మానవ సంబంధాలపై మొబైల్స్ తీవ్ర ప్రభావం
నగరంపాలెం: మొబైల్ ఫోన్లల్లో అవసరం లేనివి తొలగించినట్లు(డెలిట్) నేడు బంధాలు– మానవ సంబంధాలు తొలగించుకునే అంశాలుగా మారిపోతున్నాయని అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మురుగుడు శ్రీహరి రచించిన శ్రీహరి సిత్రాలు ఛాయా చిత్ర కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. పుస్తకాన్ని పెనుగొండ ఆవిష్కరించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహణలో బృందావన్గార్డెన్న్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఆలయ సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పెనుగొండ మాట్లాడుతూ వందేళ్ల అనుబంధాలను క్షణాల్లో తెంచుకుంటున్న తీరుపై ఈ పుస్తక రచయిత తెగిపోతున్న బంధాలు పేరుతో కవిత్వం రాయడంపై హర్షం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిరా చుక్క మౌనం వహిస్తే, సారా చుక్క రాజ్యమేలుతుందని అన్నారు. కవులు మౌనం వీడాలని, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవిత్వం రాయాలని ఆకాంక్షించారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ కవిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు రంగప్రవేశం చేస్తున్నాయని అన్నారు. ఛాయాచిత్ర కవిత్వం అనే కొత్త ప్రక్రియతో కవిత్వమై పుస్తకంగా మనముందుకొచ్చిన శ్రీహరిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పుస్తకాన్ని సుప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్ పరిచయం చేశారు. సభలో మోదుగుల రవికృష్ణ, ఆధ్యాత్మిక రచయిత పచ్చిపులుసు సూర్యనారాయణ, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండికల్లు జమదగ్ని, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, కావూరి రవికుమార్ పాల్గొన్నారు. అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ -
సర్కారు డొంక తిరుగుడు
గోవాడ(తెనాలి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అంత వైభవంగా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే ప్రసిద్ధ శైవక్షేత్రం గోవాడలోని శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానం. అక్కడ ఏటా తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంఎఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి కట్టబెట్టటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ అభ్యంతరం చెప్పినా, ప్రజలు అభ్యర్థించినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు ఆ స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. ఆగమేఘాలపై అక్కడ నిర్మాణ పనులనూ ఆరంభించారు. ప్రజల అభ్యంతరాలు/ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా పనులను నిలుపుదల చేశారు. నిర్మాణ సామగ్రిని మాత్రం తొలగించలేదు. నిబంధనలకు విరుద్ధంగా డొంకరోడ్డును ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించటం, అధికారుల అత్యుత్సాహంపై విచారణ చేయాలని స్థానికులు శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఉత్సవాలకు ఎంతో కీలకం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలో గోవాడ గ్రామం ఉంది. అక్కడి శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి విశేష చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏటా అక్కడ 15 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. అందుకోసం పలు అన్నదాన సత్రాలు వెలిశాయి. చివరి మూడురోజులు తిరునాళ్ల మరింత ప్రత్యేకమైంది. గోవాడ–కావూరు డొంకరోడ్డు వెంట జరిగే మూడు రోజుల తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల మంది వస్తారని అంచనా ఉంది. తిరునాళ్ల ఏర్పాట్లపై రేపల్లె ఆర్డీఓ అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరునాళ్లకు దాదాపు 500 దుకాణాలు ఏర్పాటు అవుతాయి. డొంకరోడ్డు సరిపోక స్టాల్స్ నిర్వాహకులు సమీప రైతుల స్థలాల్లోనూ సర్దుకుంటారు. ఏడురోజుల పశుప్రదర్శన కూడా మరో ఆకర్షణ. వివిధ ప్రాంతాల నుంచి తిరునాళ్ల స్పెషల్ బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. ఇంతటి కీలకమైన డొంకరోడ్డు గోవాడ, చెరుకుపల్లి మండల గ్రామం కావూరు మధ్య ఉంది. గోవాడ పరిధిలో సర్వే నెం.605/ఏ, 605/బీ, 606, 758/ఏ, 758/బీ, 758/సీ లోని దాదాపు 4 కి.మీ.వరకు 40–80 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డొంకరోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉన్నాయి. రోడ్డు దిగువన మంచినీటి పథకం పైప్లైన్ కూడా ఉందని చెబుతున్నారు. గోవాడ, కావూరే కాకుండా, పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఏడాదంతా వ్యవసాయ పనులకు ఈ డొంక రోడ్డును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అధికారుల అత్యుత్సాహం గోవాడ డొంకరోడ్డు భూమిలో కొంత భాగాన్ని 1943లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుడికి కేటాయించింది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం రావటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే డొంక రోడ్డు ప్రాంతాన్ని పేదల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించినా తర్వాత ఆ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి, ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, మొత్తం డొంక రోడ్డు ప్రదేశాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించింది. డొంకరోడ్డును ఇతర ఏ అవసరాలకు కేటాయించరాదనే నిబంధనతో భూమి స్వభావాన్ని కూడా మార్చి బంజరు భూమిగా చూపించారని అధికారులపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గతేడాది గోవాడ పంచాయతీ ఎంఎస్ఎంఈ పార్కుకు అనుమతిస్తూ తీర్మానించినా, మరికొద్ది నెలల్లోనే ఆ తీర్మానాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ అమృతలూరు తహసీల్దారు పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏపీఐఐసీకి అప్పగించటం, సంబంధిత కాంట్రాక్టు సంస్థ పనులను ఆరంభించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజరు అత్యుత్సాహం చూపారని, కాంట్రాక్టు సంస్థ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా స్థానికులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి జిల్లా కలెక్టరుతో మాట్లాడినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా లేదంటున్నారు. -
కాలేయం వ్యాధులపై అప్రమత్తం
గుంటూరు మెడికల్: గుంటూరు సంగడిగుంటకు చెందిన సాకేత్ ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో సకాలంలో ఆహారం తీసుకోకుండా హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తోటి సహచరులతో కలిసి మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి మద్యం సేవించటం వల్ల కాలేయానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని నిర్ధారించారు. మద్యానికి స్వస్తిపలికి వైద్యుల సలహాలతో మందులు వాడని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఇలా ఎంతో మంది లివర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు. అతి పెద్ద గ్రంథి కాలేయం కాలేయం (లివర్) మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. లివర్ పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అనేక మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు లివర్ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది లివర్ జబ్బులతో ప్రతి ఏడాది చనిపోతున్నారు. 2030 నాటికి లివర్ జబ్బులు 35 శాతం పెరుగుతాయి. లివర్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. లివర్ బాధితులు... గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ వైద్యవిభాగంలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 130 మంది లివర్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నవారు. ప్రతి ఏడాది 4000 మందికి పైగా వివిధ రకాల సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యవిభాగంలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువ శాతం మంది లివర్ సంబంధిత సమస్యలున్న వారేనని వైద్యులు తెలిపారు. లివర్ చేసే పనులు... మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయటం, జీర్ణక్రియకు దోహదపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరం జబ్బు బారిన పడకుండా రక్షణ కల్పించటం, రక్త శుద్ధి చేయటం, శరీరంలోని విషాలను హరించటం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించటం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చటం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు త్వరగా మానటానికి కావాల్సిన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయటం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. కాలేయ సమస్యలకు ముఖ్యకారణాలు మత్తు పదార్థాలు సేవించటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఇన్ఫెక్షన్స్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడటం వల్ల హెపటైటిస్ బీ, సీ వ్యాధులు సోకుతాయి. కలుషిత రక్తమార్పిడి, కలుషిత నీరు తాగటం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులొస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి కాలేయంపై పేరుకుపోతుంది. నూనె వస్తువులు ఎక్కువగా తినటం, పిజ్జాలు, బర్గర్స్లు, ఫాస్ట్ఫుడ్ వల్ల లివర్ వ్యాధులు వస్తాయి. శరీరానికి హానిచేసే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మన రోగ నిరోధక శక్తి మనవైపే ప్రతికూలంగా పనిచేయటానికి అవకాశం ఉన్నప్పుడు , వంశపారంపర్యంగా కాలేయ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కళ్లు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కామెర్ల సమస్యలు ఉన్నట్లు భావించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం చేయని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. -
గరికపాటికి లీగల్ నోటీసు
తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్, వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టణ అయితానగర్లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్, శ్రీనివాస్ మాట్లాడారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఈతకు వెళ్లి యువకుడు మృతి పట్నంబజారు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పాత గుంటూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సీతానగర్కు చెందిన పొదుకూరి లోకేష్ (19) అదే ప్రాంతంలోని కాళికామాత తల్లి ఆలయంలో సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మణిపురం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న నీళ్లకుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్తో కలిసి మరో ఇద్దరు ఈతకు దిగారు. నీటి కుంట లోతు అంచనా వేయలేని లోకేష్ లోపలకు దిగిన క్రమంలో ఈత కొట్టలేక అందులో కూరుకుపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం సిబ్బంది కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పాత గుంటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
గుంటూరు రూరల్: 2018 జూలై నెల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు. రాష్ట్ర కోశాధికారి శివరామకృష్ణ సంఘం ఆర్థిక లావాదేవీల వివరాలను వివరించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెట్ చెల్లింపులకు చర్యలు తీసుకున్నందున ఆయా విషయాలపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్సీ నియామకానికి చర్యలు తీసుకోవాలని, అదనపు పెన్షన్ పుపరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లు తమ మెడికల్ బిల్లులను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల ద్వారా గానీ ట్రెజరీ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లకు మెరుగైన ఆర్థిక రక్షణ కోసం రూ.5 లక్షల వరకూ కవరేజ్ కలిగిన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెన్షన్ స్లిప్లలో బకాయిల వివరాలు స్పష్టంగా చూపించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, బకాయిల భాగాలను వివరంగా చేర్చాలని కోరారు. గతంలో అందుబాటులో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ సౌకర్యాన్ని గత రెండేళ్ళుగా నిలిపివేశారని దాని వల్ల బిల్లుల స్థితిని తెలుసుకోలేకపోతున్నామని వెంటనే ఈ సౌకర్యాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీడీవో బి శ్రీనివాసరావు పెన్షనర్ల సమస్యలపై స్పందించి ప్రభుత్వానికి విషయాలను తెలియజేసి సంఘానికి సహకరిస్తానని తెలిపారు. కా ర్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏపీపీఆర్డీఈఆర్ఈ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ -
ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఫిరంగిపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మండలంలోని హౌస్ గణేష్పాడులో జలధార–జలహారతి, స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. జలధార, జలహారతిలో భాగంగా గ్రామంలోని చెరువు వద్ద పనులకు కొబ్బరికాయ కొట్టి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం వందరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి చెరువు నీటితో నిండి ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జలవనరులు మనిషి మనుగడకు దోహదం చేస్తాయని చెప్పారు. వాటిని భావితరాలకు అందించాల్సిన వనరు అని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం వాటర్, పాజిటివ్ ఆంధ్రా థీమ్తో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ ఇంజినీర్ వి.శంకర్, జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయి కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కల్యాణ చక్రవర్తి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ‘బడి పిలుస్తోంది..’ పెద్దఎత్తున నిర్వహించండి గుంటూరు వెస్ట్: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శత శాతం పిల్లలు ప్రభుత్వ బడిలో నమోదు అయ్యే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఇతర అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రామాణిక విద్య అందించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అవగాహన ర్యాలీలను నిర్వహించాలని సూచించారు. ప్రతి చిన్నారి బడిలో ఉండాలని, విద్యకు దగ్గర కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మంచి అర్హత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు బోధిస్తారని, ఉచిత పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్, బూట్లు వంటి సామాగ్రి అందించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీల నుంచి పాఠశాలకు చేరే విద్యార్థులు విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మ్యాపింగ్ జరగాలని సూచించారు. ఈ నెల, 20 21 తేదీల్లో విద్యార్థుల సర్వే నిర్వహించాలన్నారు. 23వ తేదీ నాటికి పాఠశాలలో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వివరించారు. -
బాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలతోపాటు విద్యారంగ సమస్యలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ చేపట్టిన రెండవ దశ పోరాటంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వేయని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నతి పాఠశాలకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుని తో పాటు పీఈటీ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ నుంచి సీనియర్ టీచర్స్కి మినహాయింపు, పీఎస్ ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి బదిలీలలో వారి సబ్జెక్ట్లో అవకాశం ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, జిల్లా నాయకులు పి.పార్వతీ, పి.లక్ష్మీనారాయణ, జి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, పచ్చల శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్లు సాయి లక్ష్మి, కె.రమేశ్, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్యాం సుందర్ శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు కళ్యాణ్, వి.కిషోర్ షా, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు సిద్దిక్, బాలరాజు, వి.కిషోర్ షా, ఆదినారాయణ, రమాదేవి, విజయశ్రీ, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మద్యానికి బార్లా తెరిచేశారు..!
గుంటూరు రూరల్: ‘ఎవరు ఎలా పోతే మాకేంటి? మేం మాత్రం పగలూ రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయించాలి. జేబులు పూర్తిగా నిండేలా సంపాదించుకోవాలి’ అన్నట్లుంది నగరంలో, నగర శివారుల్లో బార్ నిర్వాహకుల పరిస్థితి. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం విక్రయిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరంలోనే కాకుండా రూరల్ పరిసరాల్లో సైతం నిత్యం మద్యం అందుబాటులోనే ఉంటోంది. తెల్లవారుజామున 5 గంటలకే బార్లు బార్లా తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు బాహాటంగానే కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల తరువాత బార్లలో లైట్లు ఆపి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వెనుక డోర్ నుంచి విక్రయాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పాత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకే మద్యం విక్రయాలు చేసేవారు. అనంతరం బార్లు తెరిచి ఉంటే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించేవారు. ఇక్కడ ప్రత్యేక రూల్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాలి. గుంటూరు నగరంలో మరీముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం రోజులో 24 గంటలు మద్యం ఏరులై పారుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక రాత్రి గస్తీ తిరిగే పోలీసులు సైతం అదే మామూళ్ల మత్తుకు అలవాటయ్యారు. అనధికార అనుమతి ఇస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. బార్ యజమానులు దీనికోసం భారీగానే అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక బార్లో కొనుగోలు చేసిన బీర్ సీసాలో పురుగులు రావటంతో నిర్వాహకులతో కొనుగోలుదారులు వివాదానికి దిగిన సంఘటన తెలిసిందే. విషయం బయటకు రాకుండా పోలీసులు, బార్ యాజమాన్యం సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ప్రతి వైన్ షాపులో బార్లను మించిన పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి మద్యం విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకుని నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యాలయం మీడియా ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రహుల్లాలు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పనులపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరంతరం మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మేకా అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరసరావుపేట: స్వీయ జనగణనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తన వివరాలను ఆన్లైన్ ద్వారా శుక్రవారం నమోదు చేసుకున్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30 తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ: వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంపై పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సుమారు రూ.54 కోట్లు అంచనా వేశారని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తాయని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సివిల్ పనుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ మురళి, ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ, మున్సిపల్, రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 527 అడుగులకు చేరింది. ఇది 162.3490 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,431, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,231 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,231 క్యూసెక్కులు చేరుతోంది. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐ కె.కె.తిరుపతిరావును చెరుకుపల్లి స్టేషన్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న జి.కిరణ్బాబును నిజాంపట్నం స్టేషన్కు, జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న బి.బాబురావును మార్టూరు అర్బన్ స్టేషన్, చెరుకుపల్లి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.అనిల్ కుమార్ను వీఆర్ బదిలీ చేశారు. -
నీరుగారుతున్న నైపుణ్యం
సుమారు రూ. 2 కోట్లకుపైగా ఖరీదు చేసే వైద్య పరికరాలు స్కిల్స్ ల్యాబ్లో ఉన్నాయి. వైద్య పరికరాలు అన్ని ల్యాబ్లో లేవని, కొన్ని మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ రిజిస్ట్రరు, నిధుల అకౌంట్ ఆడిట్ గోప్యంగా ఉంచడం ఎవరికి సమాచారం లేకపోవడం సెంటర్తో ఎ సంబంధం లేదని వ్యక్తుల పరిధిలో సెంటర్ నిర్వహణ ఉండటం అనుమానాలకు తావిస్తుంది. అవి కొనుగోలు చేసిన విధానంపై కూడా విమర్శలు ఉన్నాయి. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వినియోగించకుండా మూలన పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు నెల్స్ స్కిల్స్ ల్యాబ్పై విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం ఎంతో మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. గుంటూరు మెడికల్: కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడి, మరణాలు తగ్గింపే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ (నెల్స్) పేరుతో దేశ వ్యాప్తంగా స్కిల్స్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గుంటూరు వైద్య కళాశాలలో కోవిడ్–19 సమయంలో నెల్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రసూతి మరణాలు తగ్గించడం, పిల్లల అత్యవసర చికిత్సలపై శిక్షణ, పాముకాటు, విష ప్రయోగంపై శిక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడేందుకు ట్రామా మెడికల్పై శిక్షణ ఏదైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తినపుడు ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, నీళ్లలో ముగిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా రక్షించాలనే విషయాలపై నెల్స్ కేంద్రంలో శిక్షణ అందిస్తారు. శిక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు ఖర్చు పెట్టింది. వైద్యులు, వైద్య సిబ్బందికి అచ్చం మనిషి మాదిరిగా ఉండే మాలిక్యూల్స్పై శిక్షణ అందించేందుకు పలు వైద్య పరికరాలు సైతం రూ. 2 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా శిక్షణ సమయంలో వినియోగిఒంచేందుకు నిధులు ఇచ్చింది. శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారు, వైద్య సిబ్బంది తాము శిక్షణ కాలంలో ఎంత మేరకు నైపుణ్యం పెంపొందించుకున్నారనే విషయాలపై ఎవరికి సమాచారం లేకపోవడం విమర్శలకు తావునిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారు, ఎంత మేరకు నిధులు మిగిలి ఉన్నాయి...అనే విషయాలపై ఎవరి వద్ద సమాచారం లేకపోవడం ఒకరిపై ఒకరు నెపాలు వేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా నెల్స్ స్కిల్స్ సెంటర్లో కోర్స్ కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసిన తీరు తీవ్ర విమర్శలకు, పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు నెలల వ్యవధికే కోర్స్ కోఆర్డినేటర్ గుంటూరు వైద్య కళాశాల నెల్స్ స్కిల్ సెంటర్లో కోర్సు కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికై న వారికి కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. హెల్త్ గ్రాడ్యుయేట్ లేదా బీఎస్సీ జీఎన్ఎం నర్సింగ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్లో విద్యార్హతలు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ నర్సింగ్ అభ్యర్థిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశారు. మూడు నెలలకు మాత్రమే ఉద్యోగం ఉంటుందని, నిమామకపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కో ఆర్డినేటర్గా వై.అనిత 2026 జనవరిలో విధుల్లో చేరారు. విధుల్లో చేరిన మూడు నెలల అనంతరం కాలపరిమితి ముగిసిందని వైద్య కళాశాల అధికారులు సమాచారం అందించారు. మూడు నెలలపాటు పనిచేసినందుకు వేతనాలు చెల్లించకపోవడం, మరో పక్క ఉద్యోగ కొనసాగింపు లేదని ఆదేశాలు ఇవ్వడంతో సదరు అభ్యర్థిని మీడియాకు తన గోడు వెల్లబుచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ముందే నిధులు విడుదల చేసినప్పటికీ అభ్యర్థినికి వేతనాలు చెల్లించకుండా స్కిల్స్ సెంటర్ ఇన్చార్జి, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ అభ్యర్థినికి చుక్కలు చూపిస్తున్నారు. నెల్స్ స్కిల్ ల్యాబ్లో కోర్స్ కో ఆర్డినేటర్కు వేతనాలు చెల్లించకపోవడం వాస్తవమే. ఉద్యోగినికి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాను. స్కిల్స్ ల్యాబ్ బడ్జెట్కు సంబంధించి ఉన్న అకౌంట్ను నా దృష్టికి తీసుకు రాకుండానే క్లోజ్ చేశారు. అందువల్లే వేతనాల చెల్లింపు జరగలేదు. – డాక్టర్ ఎన్.సుందరాచారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విశాఖపట్నం నెల్స్ కోర్స్ కో ఆర్డినేటర్ను 2024లోనే రిక్రూట్మెంట్ చేశారు. రెండేళ్లుగా కోర్సు కో ఆర్డినేటర్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ గుంటూరు వైద్య కళాశాలలో మూడు నెలలకే నియామక ఉత్తర్వులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర జిల్లాల్లో రెండేళ్లపాటు అభ్యర్థులు పనిచేసేలా నియామక ఉత్తర్వులు ఉన్నా గుంటూరు వైద్య కళాశాలలో ముందస్తుగా రిక్రూట్మెంట్ చేయకుండా బడ్జెట్ దిగమింగేందుకు ఆర్థిక సంవత్సరం ముగిసే మూడు నెలల కాలానికి ముందు నియామకపు ఉత్తర్వులు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో ఆర్డినేటర్తో స్కిల్ ల్యాబ్ నిర్వహణ పనులు చేయించకుండా ఇతర చోట్ల డ్యూటీలు వేసి పనులు చెల్లించడం స్కిల్ ల్యాబ్లో జరుగుతున్న అవినీతికి నిదర్శనమ్మ విమర్శలు ఉన్నాయి. -
వైద్యుడి నియామకంలో కునికిపాట్లు
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను ఐదు నెలల క్రితం సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ నియంత్రణ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేకపోవటం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు ఆశ్రయించడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. రోజూ ఎనిమిది నుంచి పది వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. సగటున నెలకు సుమారు 200కుపైగా నిర్వహించేవారు. గతేడాది నవంబర్ నెలలో ఓ మహిళకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ టి. నారాయణస్వామి సర్జికల్ బ్లేడును తొడ భాగంలో వదిలేశారు. రోగి బంధువులు ఆందోళన చేయటంతో విచారణ జరిపిన అధికారులు... డాక్టర్, స్టాఫ్ నర్స్ శౌరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. వారిద్దరిని గతేడాది డిసెంబర్ 5వ తేదీన అధికారులు సస్పెండ్ చేశారు. ఆ స్థానంలో మరో డాక్టర్ను ఇప్పటివరకు నియమించలేదు. సంఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పీపీ యూనిట్ విభాగంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు రోగులు వచ్చి వెనుతిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. వైద్యం లేదు.. ప్రోత్సాహకం రాదు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషనుకు రూ.1,500, పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సకు రూ.2,000కుపైగా అందించటం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. దీంతోపాటు ప్రయాణ భత్యం, ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, చికిత్స అందిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆశ వర్కర్లకు కూడా ప్రోత్సాహకం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవటంతో ఈ ప్రయోజనాలన్నీ దక్కటం లేదు. ఒకవైపు ఉచిత వైద్యం కోల్పోతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్ర చైత్ర మాస అమావాస్య పురస్కరించకుని మహా కుంభాభిషేకంలో భాగంగా కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి అమ్మవారికి పల్లకీ సేవ ఘనంగా చేశారు. వేదాంతం సునీత మాట్లాడుతూ లలిత సహస్ర పారాయణం విశిష్టతను వివరించారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష్, ఆలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, జిల్లా సంస్కృతి ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, తమ్మన సాంబశివరావు, చింతల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త సమాజాల వారు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరే శ్రీనివాస భజన సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ్చాంధ్ర పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ పాజిటీవ్ ఆంధ్రా స్కీమ్తో అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. వర్షపు నీటి సంగ్రహణ, నిర్మాణాలు, మరమ్మతులు, పునరుద్ధరణ, చెరువులు, కుంటలు శుభ్రపరచడం, పరిరక్షించడంతోపాటు, ఇంకుడు గుంతల నిర్వహణ, విస్తరణ, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్వాస యాప్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. స్వీయ గణనలో పాల్గొనండి కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 30 వరకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్లైన్ పోర్టర్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనగణనగా ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. జనగణన వల్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. పిరియాడికల్గా జరిగే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. జనగణనలో ఓటీపీ కేవలం లాగిన్ పోర్ట్ మాత్రమే అడుగుతోందని, బ్యాంకు ఇతర సంబంధిత లావాదేవీలకు సంబంధించినవి కాదని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, డీసీఓ నాగసాయికుమార్, ఎంటీఎంసీ అదనపు కమిషనర్ శంకుతల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ (ఎస్పీ – సంపర్క్) నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. తెనాలిటౌన్: రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల క్షౌ రశాలలకు 200 యూనిట్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కె.రఘురామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల 200 యూనిట్లలోపు ఉన్న క్షౌ రశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసినట్లు చెప్పారు. బార్బర్ షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆదాయ సర్టిఫికెట్, షాపు ఓనర్ ధృవీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డును సబ్మీట్ చేయాలని సూచించారు. పట్టణాలలో సంవత్సర ఆదాయం రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేలు ఉండాలని జీవో ఉండగా ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి పట్టణాల్లో సంవత్సర ఆదాయం రూ.1,44,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,20,000 ధృవీకరణ పత్రం తీసుకురావాలని విద్యుత్శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని విద్యుత్ అధికారులకు అందజేయాలని సూచించారు. -
మద్యం షాపులో మంత్రి ఆకస్మిక తనిఖీ
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో మద్యం షాపును రాష్ట్ర గను లు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరులో ఎకై ్సజ్ శా ఖ రీజనల్ లేబొరేటరీ, మద్యం శాంపిల్స్ని పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి రోడ్డులోని విజయశ్రీ వైన్ షాపులోకి వెళ్లి పరిశీలించి..షాపునకు వచ్చిన మద్యం కొనుగోలుదారులతో మాట్లాడి మద్యం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించి, సామాన్యుల కోసం రూ.99 అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్తీకి అవకాశమే లేకుండా ఎకై ్సజ్ సురక్ష యాప్ కూడా తీసుకొచ్చామని, ఆ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్ను ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటుగా, తయారీ నుంచి ప్రతి వివరాలు ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. షాపు నిర్వాహకులు తప్పనిసరిగా సమయపాలన, ఎమ్మార్పీ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులకు కీలక ఆదేశాలిచ్చామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు గమనిస్తే ప్రజలు స్వచ్చందంగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐ బొలిశెట్టి లతా, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
● భారీగా నిల్వలు గుర్తింపు ● డీలర్పై 6ఏ కేసు నమోదు యడ్లపాడు: రేషన్ డీలర్ ఆఽధీనంలో అక్రమంగా సరుకుల నిల్వలు అధికంగా ఉన్నాయంటూ మండలంలోని జాలాది గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రసాద్ గురువారం రాత్రి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల రాకతో ఫిర్యాదు దారులు సైతం కలిసి తామే ఫిర్యాదు చేశామని చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉన్నట్లు తేలడంతో యడ్లపాడు డీటీ అనురాధకు సరుకుల వివరాలను చూడాలంటూ ఆదేశించి వెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం డీఎస్వోను వివరాలు అడగ్గా గ్రామంలోని 16వ రేషన్షాపులో ప్రజా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత బియ్యం, జొన్నలు అధిక నిల్వలు ఉన్నందున వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిల్వల వివరాలు మండల అధికారుల నుంచి తీసుకోవాలని చెప్పగా, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ వాటి పూర్తి వివరాలు తమ వద్దకు రాలేదని శనివారం తెలియజేస్తామంటూ సమాధానమిచ్చారు. అధికారుల తనిఖీల్లో సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 95.50 కేజీ పంచాదార, జొన్నలు కూడా నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. -
పరారీలో న్యూడ్ కాల్స్ వ్యవహారం సూత్రధారి
తెనాలిరూరల్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో అసలు సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పాండురంగపేటకు చెందిన 44 ఏళ్ల బోడపాటి అనూరాధ(ఎ–1), ఇందిరా కాలనీకి చెందిన 56 ఏళ్ల మహమ్మద్ షెహనాజ్(ఎ–2), మరో యువకుడు సాయి (ఎ–3)లపై కేసు నమోదు చేశారు. త్రీ టౌన్ ఎస్ఐ నక్కా ప్రకాశరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, సీఐ ఎస్.సాంబశివరావు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేట పాత ఎమ్మెల్యే బజారు వెనుక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఐ ప్రకాశరావు, సిబ్బంది గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. సదరు ఇంట్లో అనూరాధ, షహనాజ్ మాత్రమే ఉన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఎ–1, ఎ–2తో పాటు, ఎ–1 కోడలూ రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్ట్రిప్ చాట్ యాప్లో ఆన్లైన్లో ఉంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ... వారి నుంచి హెచ్పీ ల్యాప్టాప్, వివో ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో రాశారు. మూడో నిందితుడిగా పోలీసులు పేర్కొన్న సాయి పరారీలో ఉన్నాడని ఎఫ్ఐఆర్లో ఉంది. సాయి ఇంటి పేరు కానీ, అతని ఇంటి అడ్రస్ వంటి వివరాలేవీ ఎఫ్ఐఆర్లో లేవు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, స్ట్రిప్చాట్ అకౌంట్ లాగిన్లు చూసే సాయి ఈ వ్యవహారంలో కీలకం. అతని ఇంటి పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేకపోవడం, మొదటి నిందితురాలి కోడలు గురించి ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన పోలీసులు నిందితుల్లో ఆమె పేరు పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ‘అత్త, కోడలు, పిన్ని, కుమారుడు న్యూడ్ కాల్స్ దందా’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
దుగ్గిరాల మండల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దుగ్గిరాల మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఖజానాధికారి ఎం.చంద్రశేఖర్రెడ్డిని కలెక్టరేట్లోని కార్యాలయంలో కలిసిన ఎస్టీయూ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దుగ్గిరాల సబ్ ట్రెజరీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనానికి సంబంధించిన సమస్యపై సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని, వారి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని డీటీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కె.శ్రీనివాసరావు, జె.గురుబ్రహ్మం, వి.ప్రసాద్, జోజప్ప, కె.వెంకయ్య, యు.మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్, సీహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు(ట్విన్స్) ఎంఎన్వీ అలేఖ్య లావణ్యశ్రీ, ఎంఎన్వీ ఆస్రిత రమ్యను జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జి.జనార్ధన్రెడ్డి అభినందించారు. శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో విద్యార్థినులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఇంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి, జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు వరుసగా 462, 459 మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వేసిన బలమైన పునాది తాము టెన్త్, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ జి.శైలజ, జి.సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు -
విత్తనాల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి స్పష్టం చేశారు. స్థానిక కృషి భవన్లో రాబోవు ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు, ఉత్పత్తిదారులతో శుక్రవారం సాయంత్రం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో అత్యంత కీలకమైన పత్తి, మిరప పంటల సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. డీలర్లు, ఉత్పత్తిదారులు విత్తనాల నిల్వలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు. ప్రతి డీలరు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విత్తన కంపెనీ, రకాల వారీగా కచ్చితంగా వెల్లడించాలన్నారు. షాపుల వద్ద ప్రతి రోజూ విత్తనాల లభ్యతను తెలిపేలా స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను అక్రమంగా నిల్వ చేస్తే సీడ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ స్థాయిలో రైతు సేవా కేంద్రాలతో సమన్వయం చేసుకుని విత్తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. స్టాక్ మూవ్మెంట్కు సంబంధించిన తాత్కాలిక కాలక్రమ పట్టికను అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. అనధికారిక, నకిలీ విత్తనాల విక్రయం నేరమని, అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే విత్తనాలను సేకరించాల్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు విత్తన రకం, కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీతో కూడిన అధికారిక రశీదు ఇవ్వాలని ఆదేశించారు. లూజు విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధమని, ప్యాకెట్లపై స్పష్టమైన లేబుల్స్, సర్టిఫికేషన్ ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని బీజీ–3(హెటీ కాటన్) వంటి చట్టవిరుద్ధమైన విత్తనాలను నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. గుజరాత్, బెంగుళూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనధికారిక విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్సు బృందాలు గోడౌన్లు, మార్కెట్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా డీలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో డీడీఏ ఐ.సునీత, ఏడీఏ ఎన్.మోహన్రావు, ఏఓ సునీల్కుమార్, విత్తన డీలర్లు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఏఓ ఎం.పద్మావతి -
బాధితులకు 150 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 150 మొబైల్ఫోన్లను బాధితులకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్లో ఫిర్యాదుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు రూ.8.44 కోట్ల విలువైన 4,224 మొబైల్ ఫోన్లను ఎటువంటి రుసుం లేకుండా బాధితులకు అప్పగించామని తెలిపారు. మొబైల్ ఫోన్లల్లో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు మొబైల్ఫోన్లల్లో ఎక్కువ నిర్వహిస్తున్నారని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని చెప్పారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో రూ.కోట్ల వైద్య పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రికంటే దీటుగా అందిస్తున్నామని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అన్నారు. ఆసుపత్రిలో మీకోసం మేము కార్యక్రమంలో భాగంగా 73వ వారం రోగులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇటీవల కాలంలో రూ. వంద కోట్లతో జింకానా ఎంసీహెచ్ భవనం ప్రారంభించామన్నారు. ప్రభుత్వం రూ.30 కోట్ల వైద్య పరికరాలు అందించిందన్నారు. క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సంతానం లేనివారికి ఐవీఎఫ్ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోత, కుట్లు లేని ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో ఉన్న రోగులను పరామర్శించేందుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ఒకరు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, రోగుల సహాయకులు దీన్ని గుర్తించి తమకు సహకరించాలన్నారు. ఆహారం తిని ఎక్కడబడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఆర్ఎంఓ శ్రీనివాసరాజు, పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
డివిజన్ల పునర్విభజన శాసీ్త్రయంగా చేపట్టాలి
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా జరుగుతుందని భావిస్తున్నామని, అశాసీ్త్రయంగా చేస్తే ఎంతటి పోరాటానికై నా సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డివిజన్ల పునర్విభజనపై అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గురువారం నగర కమిషనర్ మయూర్ అశోక్ను వైఎస్సార్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 57 నుంచి 76కు డివిజన్ల పెంపునకు సంబంధించి ఒక మ్యాపు బయటకు వచ్చిందని.. ఇది ఎలా వచ్చిందని కమిషనర్ను అడిగామన్నారు. అది అధికారిక మ్యాపు కాదని, ఈ నెల 23వ తేదీన పునర్విభజనకు సంబంధించిన మ్యాపు రిలీజ్ చేస్తామని కమిషనర్ చెప్పారన్నారు. ఆ తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తామని.. వాటిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే దాని ప్రకారం పునర్విభజన ఫైనల్ ప్రక్రియ ఉంటుందని కమిషనర్ సమాధానం ఇచ్చారని అంబటి పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియ న్యాయబద్ధంగా జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగితే ఎంతటి పోరాటానికై నా సిద్ధమవుతామని స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు. ఎక్కడైనా నగర ప్రజలకు అభ్యంతరాలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని కమిషనర్కు వివరిస్తామని పేర్కొన్నారు. అందరినీ భాగస్వాములు చేయాలి ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పునర్విభజన ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కోరామన్నారు. జనాభా ప్రాతిపదికన, సరిహద్దుల ప్రకారం పునర్విభజన జరగాలని తెలిపారు. ఇటీవల వచ్చిన మ్యాపును చూస్తుంటే ఎక్కడో ఉన్న ఏటుకూరును తీసుకొచ్చి నల్లపాడులో, నల్లపాడును తీసుకెళ్లి నల్ల చెరువులో కలిపినట్లు ఉందన్నారు. పునర్విభజనకు సంబంధించిన అన్ని సందేహాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ప్రక్రియ అంతా రూల్ ప్రకారం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఎక్కడా రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియ ఏకపక్షంగా జరగదని, ప్రోసీజర్ ప్రకారమే జరుగుతుందని కమిషనర్ ఇచ్చిన సమాధానం సంతృప్తి ఇచ్చిందన్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్, ఖాళీ స్థలాలు, పార్కులు, గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులపై చర్చించామని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన మ్యాపు అధికారికంగా రాలేదని.. ప్రజల అభిప్రాయ సేకరణతో ఫైనల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని కమిషనర్ చెప్పారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందా? లేదా ఏరియా ప్రతిపాదికన జరుగుతుందా? అని కమిషనర్ను అడిగామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పునర్విభజన జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. -
దాడులు చేసిన వారికి అందలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కాయి. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా నారా లోకేష్ తన మార్కు రాజకీయాన్ని చూపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్నికల ముందు వరకు పార్టీలోనే లేని వ్యక్తికి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయగానే ఏకంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో పదవి దక్కడం విశేషం. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవికి తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యురాలిగా పదవి దక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది దాడి చేయించినందుకు బహుమతిగా ఇచ్చినట్లుగా కేడర్ చెబుతోంది. మరోవైపు ఇదే తరహాలో ముందుండి దాడులకు తెగబడిన కనపర్తి శ్రీనివాసరావు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి)కి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా చోటు కల్పించారు. జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో వీరికి నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మాజీ కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి, మరికొందరు అని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై బాధితుడు అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లను కనీసం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. సంఘటన జరిగిన 75 రోజులకుపైగా అయిన తర్వాత కూడా వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు జిల్లా ఎస్పీ, డీజీపీలను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత మొక్కుబడిగా ఒక డీఎస్పీని పంపించి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడే మోహరించి ఉండగా జరిగిన దాడిపై సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ముందుకు కదలకపోవడం, దాడులకు తెగబడిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కడం చూస్తుంటే ఈ దాడి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది జనవరి 31న తన కార్యాలయంపై, ఇంటిపై విధ్వంసం స్పష్టించి, తనను చంపేందుకు జరిగిన ప్రయత్నంపై, నల్లపాడు పోలీస్స్టేషన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తనను హింసించిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శనివారం నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ 12 గంటలపాటు జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేయనున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. ఆయా కేసుల్లో విచారణలో పురోగతి లేకపోవడంతో గత నెల 23న గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను, రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకూ పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన దమనకాండ అర్థరాత్రి 12.20కి ముగిసిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని అంబటి రాంబాబు అన్నారు. పలుగులు, కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్స్తో వచ్చారని ఇంట్లోని మహిళలు, చిన్నారులు భయబ్రాంతులకు గురయ్యారని కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు. ఆ తర్వాత తనను అరెస్ట్ చేయడం, కోర్టుకి హాజరుపర్చడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండటం జరిగిందన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన విధ్వంసం కాండను ప్రపంచమంతా చూశారని, కానీ విధుల్లో ఉన్న పోలీసుల నుంచి మాత్రం యాక్షన్ లేదన్నారు. కనీసం ఇటువంటి దమనకాండపై పోలీసులు సైతం సుమోటో కేసుగా తీసుకోకపోవడం దారుణమన్నారు. దాడులకు తెగబడిన వారిపై, దాడికి గురైన తనపై కూడా ఏడేళ్లల్లోపు శిక్షలు విధించే కేసులు నమోదు చేశారని అన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి పట్టాభిపురం పోలీస్స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు ఇంతవరకూ నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ముద్దాయిలకు మద్దతుగా సీఐ ప్రవర్తించారని, దాడికి గురైన తనకు మాత్రం స్టేషన్ బెయిల్ యివ్వలేదని, అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని అన్నారు. అదే రోజు రాత్రి 10.40కి నల్లపాడు పోలీస్స్టేషన్ లాకప్లో ఉన్నానని అర్థరాత్రి 2.30కి పైకి తీసుకెళ్లారని అన్నారు. నల్లపాడు పోలీస్స్టేషన్ సీఐ వంశీధర్, పట్టాభిపురం పోలీస్స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు తనను హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జీజీహెచ్లో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ ఆదేశం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గతేడాది సెప్టెంబరులో 61 పోస్టులకు గుంటూరు వైద్య కళాశాల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రొవిజనల్ లిస్టు ప్రకటించకపోవడం, మరో పక్క ఐదు నెలల్లో నోటిఫికేషన్ కాలపరిమితి దాటిపోయి రద్దయ్యే అవకాశం ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈవిషయాన్ని ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 15న ‘నో.. పిటికేషన్’..! శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ పరిపాలనా అధికారుల మధ్య సమన్వయలోపంతో ఉద్యోగ నియామక ప్రక్రియ జరగడం లేదని ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అంతేకాకుండా గత ఏడాది మార్చిలో 27 ఉద్యోగాలను జీజీహెచ్ నాట్కో సెంటర్లో భర్తీ చేశారు. ఏడాది పూర్తయినా నేటి వరకు వారికి ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదు. దీనిపై కూడా ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ చిన్నం సుధారాణిని తన కార్యాలయానికి పిలిపించి నియామక ప్రక్రియ జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వేతనాలు చెల్లించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తక్షణమే వేతనాలు చెల్లించేలా, ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. -
స్వీయ గణనలో స్ఫూర్తిగా నిలుద్దాం
గుంటూరు వెస్ట్: జనగణనలో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకోవాలన్నారు. దాదాపుగా అంతా వాస్తవిక సమాచారాన్ని అందిస్తే దేశానికి మేలు చేసినవారౌతారని తెలిపారు. స్వీయ గణనలో నమోదు చేసే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయన్నారు. అవి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియవని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా స్వీయ గణనలో అందించే సమాచారం కారణంగా ఉన్న సంక్షేమ పథకాలను తొలగించడంగాని, కొత్త పథకాలకు సిఫార్సులు చేయడంగాని ఉండవన్నారు. అందుకని ఎటువంటి సమాచారం ఉన్నా నిర్భయంగా అందజేయాలని కోరారు. ప్రత్యేక కార్యక్రమాలు కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో భాగంగా గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తొలి కార్యక్రమం ప్రజాప్రతినిధులతో నిర్వహించామని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా అధికారులు, సిబ్బందితోనూ, 18వ తేదీన సెలబ్రటీస్ ప్రముఖులతోను, 26న భారీ స్థాయిలో స్వీయ గణనపై 5కె వాక్ నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక పోస్టర్ల ద్వారా స్వీయ గణనపై సమాచారం పొందవచ్చన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతోపాటు వివిధ ఎన్జీఓల సాయం కూడా తీసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులను, తెలిసిన వారిని కూడా పాల్గొనేలా చూడాలన్నారు. -
పిడుగురాళ్ల పోలీస్స్టేషన్ను సందర్శించిన ఐజీ
పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తెనాలిలో ఎన్క్వాస్ బృందం పర్యటన
తెనాలిఅర్బన్: నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం తెనాలి నందులపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం తనిఖీ చేసింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సభ్యులు ఆరా తీశారు. వైద్యశాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్క్వాస్ సభ్యులు డాక్టర్ అనోజ్, డాక్టర్ రవీషా, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంవో శ్యామ్, జిల్లా కన్సల్టెంట్లు వాసు, మాధవి, డాక్టర్ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆసియా, ఎంపీహెచ్ఈవో ఉమాకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: నిజాంపట్నం కోస్టల్ గార్డ్ కమాండెంట్గా సాంకేత్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతర జ్ఞాపికను ప్రదానం చేశారు. కోస్తా తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. గుంటూరు లీగల్: కోర్టు ధిక్కరణ కింద ఓ మహిళకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 జరిమానా, లేకుంటే 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరండల్పేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసు విచారణ నిమిత్తం ప్రధాన జిల్లా కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ సమయంలో ఈ కేసులో సాక్షిగా ఉన్న గుంటూరు నగరం వసంతరాయపురానికి చెందిన కొఠారి పావని సాక్ష్యం చెప్పటానికి వచ్చింది. సాక్ష్యం చెప్పే క్రమంలో కోర్టు విధివిధానాలను ధిక్కరిస్తూ న్యాయమూర్తి ఎదుట ధిక్కారంగా మాట్లాడింది. దీంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు బనాయించి వేధించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి ప్రకటించారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. -
మొక్కజొన్నకు మద్దతు మమ!
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో అన్నదాతలు కుదేలు● సాధారణ సాగు కంటే భారీగా పెరిగిన విస్తీర్ణం ● గిట్టుబాటు ధర దక్కక రూ.800– రూ.900 వరకు నష్టపోతున్న రైతులు ● జిల్లాలో మచ్చుకైనా ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు ● అన్నదాతల కష్టాలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వం ● పక్క రాష్ట్రంలో మద్దతు ధరతో జోరుగా కొనుగోళ్లు ● ఇక్కడ మాత్రం కర్షకులకు తప్పని కన్నీటి వెతలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం కాస్త కూడా వారిపై జాలి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారుల దెబ్బకు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/ కొరిటెపాడు: మొక్కజొన్న సాగు రోజురోజుకూ భారంగా మారుతోంది. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోతుండగా, మార్కెట్లో లభిస్తున్న ధరలు మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తున్నాయి. పంట పండించడమే కష్టం, అమ్ముకోవడం మరింత కష్టం అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. సర్కార్ దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉంది. అయితే మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,700 వరకే దక్కుతోంది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు రూ.200 నుంచి రూ.300 వరకు తేడా ఉంటే రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. కానీ మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు వ్యత్యాసం రూ.900 వరకు ఉండటం వల్ల రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2025–26 రబీ సీజన్లో గుంటూరు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు. కానీ 79,202.5 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. జిల్లాలో దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, కొల్లిపర, చేబ్రోలు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో మొక్క జొన్న సాగు అధికంగా ఉంది. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేశారు. మొక్కజొన్న సాగులో కౌలు రైతులే అధికంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర పడిపోయిందని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా చూడాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎంత మొత్తుకున్నా.. ఇలా కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉంది. ఆదుకోవాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే మొక్కజొన్న సాగు తగ్గిపోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు కాగా, రైతులు 79,202.5 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 38 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, అంతర సేద్యం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కోత, నూర్పిడి తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు సుమారు రూ.50 వేలకుపైగానే రైతులు ఖర్చు చేశారు. అన్నీ సక్రమంగా ఉంటే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి రావాలి. ఈ ఏడాది ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లలోపే దిగుబడి ఉందంటున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,400 గా ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో బయట మార్కెట్లో దళారులు క్వింటా రూ.1,500 నుంచి రూ.1,700 కే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలకు విక్రయిస్తే భారీగా అప్పులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఉంది. రూ.2,400 లెక్కన కొనుగోలు చేస్తే మిగులు లేకపోయినా కనీసం పెట్టుబడి, చాకిరి ఖర్చు అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో సుమారు 3.01 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్కో ఎకరాకు రూ.వేలు పెట్టుబడి పెట్టి రాత్రింబవళ్లు కష్టపడి పండించిన రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. -
కొనుగోలు కేంద్రాలేవీ?
నేను 1.50 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో క్వింటా రూ.1,700 కు బయట మార్కెట్లో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ లెక్కన ఎకరాకు రూ.21 వేలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – కంకిపాటి శ్రీనివాసరాజు, కౌలు రైతు, కొల్లిపర గ్రామం -
ఇంటర్లో మూడోసారీ అద్వితీయం
● ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం కై వసం ● సీనియర్ ఇంటర్లో గతేడాది కంటే తగ్గిన ఉత్తీర్ణత ● జూనియర్ ఇంటర్లో 82 నుంచి 86.02 శాతానికి పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సత్తా చాటిన బాలలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయస్థానంలో హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడేళ్లపాటు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్ధానంలో నిలిచింది. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. సీనియర్ ఇంటర్ డల్... సీనియర్ ఇంటర్ జనరల్ కోర్సుల పరీక్ష ఫలితాల్లో గత ఏడాది 91 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం అది 86.31 శాతానికి పరిమితమైంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ సాంఘిక సంక్షేమ హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలలవారీగా పరీక్షలు రాసిన 31,116 మంది విద్యార్థుల్లో 26,856 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 14,611 మంది హాజరు కాగా, 12,940 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలురు 16,505 మంది పరీక్ష రాయగా, 13,916 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురను అధిగమించి బాలికలు పైచేయి సాధించారు. జూనియర్ ఇంటర్లో జోష్ జూనియర్ ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రస్తుతం అది 86.2 శాతానికి చేరింది. పరీక్షలు రాసిన 34,329 మంది విద్యార్థుల్లో 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 15,760 మంది పరీక్షలు రాయగా, వారిలో 13,861 మంది ఉత్తీర్ణులయ్యారు. 87.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 18,569 మందిలో 15,669 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.38 శాతంగా నమోదైంది. బాలికలే పై చేయి సాధించారు. ఓకేషనల్ కో ర్సుల్లో ఉత్తీర్ణత ఒకేషనల్ విభాగంలో సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన 1076 మంది విద్యార్థుల్లో 626 మంది ఉత్తీర్ణులై 58.18 శాతంగా నమోదైంది. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన 1157 మంది విద్యార్థుల్లో 530 మంది ఉత్తీర్ణులై 45.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల సత్తా ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. గత ప్రభుత్వంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలోని జెడ్పీ హైస్కూల్ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ రషీదా 958, గంజరబోయిన కీర్తన 945 మార్కులు కై వసం చేసుకున్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో గాలి హూమైలా 463, ఆలా వాహిని యాదవ్ 435, బురదగుంట దీపిక రేణు 420 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు ఆలా తరుణి 429 కై వసం చేసుకుంది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచారు. ● సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో బి.సాయిహర్షిత అత్యధికంగా 992 మార్కులు సాధించింది. అదేవిధంగా డి.కృష్ణపూజిత 991, బి.పూజిత 990, ఎం.డి.సఫా సకీనా 990 మార్కులు సాధించారు. ● జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 455 మార్కులకు టి.దుర్గా గీతిక అత్యధికంగా 452 మార్కులు సాధించింది. అదేవిధంగా 451 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు. ● సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో జి.ఎన్.వి.పవన్కుమార్, బి.దినేష్కుమార్, బి.సాయి సాత్విక్, జి.విష్ణువర్ధన్ వరుసగా నలుగురు విద్యార్థులు వెయ్యికి 990 మార్కులు సాధించారు. ● జూనియర్ ఎంపీసీ విభాగంలో విద్యార్థిని ఎన్.ఆశ్రేష 470కి 467 మార్కులు సాధించింది. 466 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు. -
స్వీయ జనగణనలో వాస్తవాలు వివరించండి
ప్రతి చెరువునూ గుర్తిస్తున్నాం ‘జలధార–జలహారతి’ కింద జిల్లాలో ఉన్న ప్రతి చెరువునూ గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, డ్వామా పీడీ వి.శంకర్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం పాల్గొన్నారు. -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్ట్లు
తాడేపల్లిరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన చేయడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చీప్ ట్రిక్లు ఉపయోగిస్తున్నారన్నారు. పోలీసులను గౌరవ న్యాయస్థానం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఇలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూడి శ్రీహరిన బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లారని, స్థానిక పోలీసులు మాకు ఏమీ తెలియదని మీడియా సాక్షిగా చెబుతున్నారని, అలా చెబుతూనే పూడి శ్రీహరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. లాయర్లు ప్రశ్నించడంతో చివరకు అక్కడ కూర్చుని నోటీసులు వ్రాసి అందజేశారని తెలిపారు. అరెస్ట్ విషయం తెలియనప్పుడు ఎందుకు సోదా చేస్తున్నారని ప్రశ్నించగా మొదట వచ్చిన ఎస్ఐకి బదులుగా మరో ఎస్ఐ వచ్చి సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శనరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుకోటి మధు, జిల్లా బీసీ సెల్ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు -
మెప్మా ఆర్పీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: ఆర్పీలు అనేక ఒత్తిడిలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పనిచేస్తున్నారని వారికి నెల నెల జీతాలు రావడం లేదని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మెప్మా ఆర్పీల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు అధ్యక్షత మెప్మా పీడీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, ఏడు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఆర్పీలకు జీతాలు 5వ తేదీలోపు చెల్లించాలని, గ్రీటింగ్ విధానం రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసీపీ యాప్ని రద్దు చేయాలని, అర్హత ఉన్న ఆర్పీలను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా కార్యాలయ అధికారి ఐబి హనుమంతు నాయక్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంకమ్మ, అనూష, ఎస్కె పర్వీన్, ఎస్.కె కమీలిబీ, సుమతి, నసురున్ సుజాత, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకుల డిమాండ్ మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా -
18న ఔటర్ రింగ్ రోడ్డు బాధితుల రాష్ట్ర సదస్సు
లక్ష్మీపురం: ఔటర్ రింగ్ రోడ్డు బాధితుల రాష్ట్ర సదస్సును ఈనెల 21వ తేదీ విజయవాడ బందర్ రోడ్డులోని ఎంబీ భవన్లో నిర్వహిస్తున్నామని, బాధిత రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ జిల్లా సమావేశం బుధవారం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 189 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సిద్ధమైనదని, ఈ మేరకు ఐదు జిల్లాల పరిధిలోని 121 గ్రామాల్లో భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. రైతులతో చర్చలు కానీ, రైతులు వివరాలు కానీ ఇవ్వకుండా భూమిలో మార్కింగ్ చేశారన్నారు. సుమారు పదివేల మంది రైతులు భూములు కోల్పోతారన్నారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచక తప్పదు అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ 140 మీటర్లు మాత్రమే తీసుకుంటున్నట్టు కొంతమంది రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. కానీ మిగిలిన జిల్లాలో 250 మీటర్లు కచ్చితంగా తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్లు తెలియజేయడం రకరకాల అనుమానాలకు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకులు వై.నేతాజీ, రైతు నాయకులు బిక్కి శ్రీనివాసరావు, రైతులు చిరుమామిళ్ల రంగారావు, కోయ కోటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, ఈ.నిరంజన్, సీహెచ్, కృష్ణ్ణమోహన్, కె. పద్మావతి, జై.లలిత, జి.సాంబశివరావు, ఎస్.సాంబశివరావు, పి తేజ పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య -
అంతర్జాతీయ షూటర్ ముఖేష్కు ఘన సన్మానం
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఇటీవల స్పెయిన్లోని గ్రేనాడలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో గుంటూరుకు చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి, పాలక్ల జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి, సరికొత్త ప్రపంచ రికార్డుతోపాటు బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొనియాడారు. ముఖేష్ తమ అకాడమీని సందర్శించిన నేపథ్యంలో ఆయనను సత్కరించామన్నారు. ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు ప్రపంచస్థాయిలో సరికొత్త రికార్డు నెలకొల్పడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఒలింపిక్స్లో కూడా ముకేష్ మన రాష్ట్రానికి, దేశానికి బంగారు పతకం అందించాలని ఆకాంక్షించారు. ముఖేష్ విజయ రహస్యాలను ఔత్సాహిక షూటర్స్ తెలుసుకుని కఠోర సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో అకాడమీ షూటర్లు, తల్లిదండ్రులు పాల్గొని ముకేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. -
మహిళను హత్య చేసిన న్యాయవాది
నగరంపాలెం: మహిళను హత్య చేసిన న్యాయవాది, అతని స్నేహితుడ్ని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. పాతగుంటూరు యాదవబజార్ 1/4వ అడ్డరోడ్డులో ఉంటున్న ఆకుల రమాదేవి (45) శ్రీనివాసరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 12 సంవత్సరాల కిందట అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతిచెందాడు. రమాదేవికి చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన న్యాయవాది ఎనుమల సురేష్బాబుతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లి కలుకోలను వెంకాయ్య పాతగుంటూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసి సీఐ వెంకటప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. రమాదేవి సెల్ఫోన్ ఆధారంగా విచారించగా, చివరి కాల్ సురేష్బాబు మొబైల్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా విచారించారు. రమాదేవితో అతనికి రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అదిగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ.18 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సురేష్బాబు గుంటూరు కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడని, హైకోర్టులోనూ కొన్ని కేసులున్నాయి. ఆమె వద్ద తీసుకున్న డబ్బులు ఇటీవల జరిగిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఖర్చు చేసినట్లు గుర్తించారు. రమాదేవిని డబ్బులు విషయమై పిల్లలు అడగడంతో ఆమె సురేష్బాబుపై ఒత్తిడి తీసుకొచ్చేది.ఈ క్రమంలో ఆమెతో శ్రీశైలం వెళ్దామని సురేష్బాబు నమ్మించి, తెనాలి రూరల్ సంగంజాగర్లమూడి గ్రామ వాసి ఆటోడ్రైవర్ కోపల్లి శేఖర్ సాయంతో ఫిబ్రవరి 21 అర్ధరాత్రి శ్రీరంగపురం వెళ్లే డొంకరోడ్డులోని సంగంజాగర్లమూడి కాలువ వద్దకి తీసుకెళ్లారు. అనంతరం కర్రతో ఆమెను కొట్టి ఇద్దరు కల్సి ఆమె జుట్టు పట్టుకుని కాల్వలోకి తోసేయగా, ఆమె పైకి వచ్చేందుకు ప్రయత్నించగా మళ్లీ కర్రతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు. రమాదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి సుమారు రెండు నెలలైంది. మృతదేహం జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతదేహన్ని గుర్తించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. లాక్ల వద్ద కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారని అన్నారు. కేసుని ఛేదించిన తూర్పు డీఎస్పీ ఎస్కే అబ్దుల్అజీజ్, సీఐ కె.వెంకటప్రసాద్, ఎస్ఐ ఎస్కే.అబ్దుల్ రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు వి.రామారావు, ఎండీ.నూరుద్దీన్, ఎ.మోహన్బాబు, కానిస్టేబుల్ పి.మురళిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. నిందితులకు రిమాండ్గుంటూరు లీగల్: మహిళా హత్య కేసులో న్యాయవాది ఎనుముల సురేష్ బాబుతో పాటు మరోకరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి మహమ్మద్ గౌస్ తీర్పునిచ్చారు. జిల్లా జైలుకు తరలించారు. మరొకరి అరెస్ట్ కర్రలతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు.. సుమారు రెండు నెలలైనా మృతదేహం జాడలేదు.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్ -
సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్ట్ అన్యాయం
నెహ్రూనగర్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేసి శ్రీహరి నివాసంలో సోదాలు నిర్వహించడం అర్ధరహితమని చెప్పారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు. పోలీస్లు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిబంధనలను పాటించకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ విభాగంగా మారిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా పోస్టుల సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా యాక్టివిస్టులను గత 22 నెలలుగా 1500 మందిపై కేసులు నమోదు చేశారని, దాదాపు 2,800 మందిపై రాజకీయ అరెస్టులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై గత 22 నెలలుగా ఎంత మందిని అరెస్టు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంచాలని డిమాండ్ చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి -
వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి
పట్నంబజారు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియో జకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మండిపడ్డారు. బుధవారం కొత్తపేట పోలీసు స్టేషన్లో వై.ఎస్.జగన్పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మావిగన్ అంశం వై.ఎస్.జగన్ ప్రస్తావించగానే దానిని అడ్డుకోలేక ఏదోఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అసత్యాలు, కల్పితాలు, దూషణాత్మక వీడియోల ద్వారా పచ్చమీడియా సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. ఆయనపైనే కాకుండా కుటుంబ సభ్యులపైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేక కల్పిత కథనాలు, ఆధారాలు లేని అవాస్తవాలను ఆయన కుటుంబానికి అంటగడుతూ ప్రచారం చేయడం సబబు కాదన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఫిర్యాదుతోపాటు, వైఎస్ జగన్పై వచ్చిన అసత్య వీడియోలు, సోషల్ మీడియా స్క్రీన్షాట్లను జత పరిచారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఫర్జానా, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కీసరి సుబ్బులు, తూర్పు నియోజకవర్గ అధ్యక్షురాలు ఉషారాణి, ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుల్లా మేరి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్తెనపల్లి రమణి, వలంటీర్ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు తోటకూర స్వర్ణలత, పార్టీ నేతలు గనిక ఝాన్సీ, రిహానా, సుల్తానా, వెంకాయమ్మ, మరియమ్మ, కుమారి, భాగ్యమ్మ, రాహేలమ్మ, భారతి, అమీనా, నాగరాణి, అచ్చమ్మ, శిరీష పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు -
మహిళా విద్యాభివృద్ధి ద్వారానే దేశం పురోగతి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ గుంటూరు ఎడ్యుకేషన్: మహిళల విద్యాభివృద్ధి ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ పేర్కొన్నారు. బుధవారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల 84వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారానే విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితం పట్ల లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా చదువుకు సంబంధించిన విషయాలపై ఆసక్తితో కోరుకున్న రంగంలో స్థిరపడాలని కోరారు. మారుతున్న కాలానుగుణంగా మహిళల ప్రాధాన్యత గుర్తెరిగి చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు రావటం మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఆర్.జ్యోత్స ్నకుమారి మాట్లాడుతూ 2014లో స్వయం ప్రతిపత్తి సాధించిన కళాశాల యూజీసీ నుంచి మరో పదేళ్లపాటు దానిని కొనసాగిస్తూ అనుమతి పొందిందన్నారు. 3వేల మంది విద్యార్థినిలు 27 శాఖలతో చదువుతోపాటు ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం అకడమిక్, స్పోర్ట్స్, కల్చరల్ విజేతలకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ డాక్టర్ డి.విజయశ్రీ, డాక్టర్ పి విజయలక్ష్మి, డాక్టర్ అపర్ణ సీతారాం పాల్గొన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విజయకేతనం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంఈసీ విభాగంలో అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో డి.లీలానాగదుర్గ 982, వై.తన్విశ్రీ 981, ఎం.ఎల్.వి.నాగయశశ్విని 979, పి.కృష్ణచైతన్య 977, జి.వంశీప్రియ 976, సి.హెచ్.తన్మయి 976, ఎస్.వెంకటసాయి శ్రీరామ్ 974, ఎం.అరుణకిరణ్ 973, ఎస్.మేఘన 972 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎం.షకీర్ 494, పి.రామ్చరణ్ తేజ్ 493, వై.పి.వి.శ్రీనివాసరావు 493, రహత్ ఫాతిమా 493, బి.కావ్యశ్రీ 492, సి.హెచ్.ప్రణవి 492, కె.హవీష్ 492, పి.అభినేష్ 492, ఎం.ప్రత్యూష 492, ఎన్.మెహర్శ్రీసాన్వి 492, రఫత్ ఫాతిమా 492, కె.జ్యోషిత 490, ఎం.రోహన్ రాజాజీ 490, ఎం.సాత్విక్ 490, జూనియర్ సీఈసీ విభాగంలో ఉమ్ ఈ రేయాన్ 489, సీనియర్ సీఈసీ విభాగంలో డి.బిందురమ్య 912 మార్కులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీమేధ కరస్పాండెంట్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
ఘనంగా అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్ల జయంతి
గుంటూరు లీగల్: మహనీయులు బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్స్ జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రేవతి, ట్రెజరర్ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్ లింగం, లేడీ రిప్రజెంటివ్ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా అండర్–13 ఓపెన్, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక నలందానగర్లోని మకూన్స్ కిడ్స్ ప్లే స్కూల్లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్ గోగినేని, మారెడ్డి తేజభరత్రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షలు సీహెచ్ రవీంద్రరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు. -
నో.. టిఫికేషన్!
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ చేయడం లేదు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాలకు గత ఏడాది నోటిఫికేషన్ గుంటూరు వైద్య కళాశాలలో గత ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ సంవత్సరం సెప్టెంబరు 9న విడుదల చేసిన నోటిఫికేషన్లో 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులో ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్మెంట్ షెడ్యూల్లో ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాది నవంబరులో ఉద్యోగ నియామకం చేపట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీసం ప్రొవిజన్ మెరిట్ లిస్టు కూడా ప్రకటించలేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తారా, లేదా.. అనే అనుమానం నిరుద్యోగుల్లో నెలకొంది. ఉద్యోగులను మరో ఐదు నెలల్లో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏడాదిలోపు సదరు రిక్రూట్మెంట్ నిర్వహణ చేయకపోతే నోటిఫికేషన్ రద్దవుతుంది. ఈ నేపథ్యంలో నెల, రెండు నెలల రోజుల్లో చేయాల్సిన నియామకాలను తొమ్మిది నెలలు గడిచినా చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమోషన్లకూ అదే పరిస్థితి గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ఆసుపత్రి అధికారులు రెండేళ్లుగా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రమోషన్లు మాత్రం ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు తమకు ప్రమోషన్లు వస్తున్నాయని ఎంతో ఆశతో నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలోపు ప్రమోషన్ ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రద్దు చేస్తున్నారు. ఇలా మూడు పర్యాయాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కింది స్థాయి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అధికార పరిధిలో గుంటూరు జీజీహెచ్, గోరంట్ల జ్వరాల ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉన్నాయి. వీటిల్లో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ రీసోర్స్ (హెచ్ఆర్) విధులన్నీ గుంటూరు వైద్య కళాశాల అధికారులు చూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ విషయాలు గుంటూరు జీజీహెచ్ అధికారులు చూస్తుంటారు. గతంలో వైద్య కళాశాలకు సంబంధించిన విషయాలన్నీ కళాశాల ఏడీ, ప్రిన్సిపాల్, జీజీహెచ్కు సంబంధించిన విషయాలన్నీ రిక్రూట్మెంట్లు, హెచ్ఆర్ పనులు, ఫైనాన్స్ పనులన్నీ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏడీలే చూసేవారు. హెల్త్ సెక్రటరీగా కృష్ణబాబు పనిచేస్తున్న సమయంలో వైద్య కళాశాల, జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ల విధులు కొంత మార్పు చేశారు. వైద్య కళాశాలకు సంబంధించిన ఫైనాన్స్ పనులు, జీజీహెచ్కు సంబంధించిన ఫైనాన్స్ పనులు గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. రిక్రూట్మెంట్లు, హెచ్ఆర్ పనులు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్కు సంబంధించినవి రెండు కూడా గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం ముఖ్యంగా ప్రమోషన్లు, రిక్రూట్మెంట్లకు సంబంధించినవి పక్కన పడేస్తున్నారు. జీజీహెచ్ చైర్మన్గా ఉండే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఒకసారి దీనిపై దృష్టి సారించి జీజీహెచ్లో సిబ్బంది కొరత లేకుండా త్వరితగతిన రిక్రూట్మెంట్ జరిగేలా చూడాలని, రోగుల ఇబ్బందులు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో 2025 మార్చిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్లో 27 మంది ఉద్యోగులు సదరు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మార్చికి వారు చేరి ఏడాది అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిగా వేతనాలు లేకుండానే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కడుపులో బాధ దిగమింగుకుంటూ సేవలు అందిస్తున్నారు. సదరు ఉద్యోగులకు వేతనాలు వేసేందుకు ప్రభుత్వం ఆప్కాస్ విధానం ప్రవేశపెట్టింది. ఆప్కాస్ వెబ్సైట్లో జీజీహెచ్ అధికారులు పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లు నమోదు చేయకుండా గత ఏడాది ఐదు నెలల పాటు తాత్సారం చేశారు. దీంతో ప్రస్తుతం వెబ్సైట్ పనిచేయక కాంట్రాక్టు ఉద్యోగుల పేర్లు ఆప్కాస్లో నమోదు కాలేదు. ఆసుపత్రి అధికారులు, కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు 27 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ చిరుద్యోగులు వేతనాలు లేక అలమటిస్తున్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్ డెంటల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబటి రాంబాబుకు 35(3) బీఎన్ఎస్ఎస్ నోటీస్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు. -
చేబ్రోలు పోలీసుల అత్యుత్సాహం
చేబ్రోలు: స్వల్ప విషయాన్ని రాద్ధాంతంగా మార్చి టీటీపీ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయం చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన గ్రామంలో ఉద్రికత్తలకు కారణంగా నిలిచింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఈ నెల 7వ తేదీన తిరునాళ్ల జరిగింది. గుడి ఎదురుగా 50 సంవత్సరాల క్రితం స్థానిక దాతలు బస్ షెల్టర్ను నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంతంలో మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆలయ ధర్మకర్తల కుటుంబసభ్యులు గుడి వద్ద భక్తులకు ఉపయోగపడేందుకు శిథిలావస్థలో ఉన్న షెల్టర్ను తొలగించారు. స్థానిక టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు స్టేషన్ నుంచి ఎస్ఐ కే వీరనారాయణ సిబ్బందితో కలిసి పోలేరమ్మ గుడి సెంటర్ వద్ద షెల్టర్ వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి ఇబ్బందులు కొత్తరెడ్డిపాలెంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో సంఘటనా ప్రాంతం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. షెల్టర్ తొలగింపు చేపట్టిన విషయాన్ని వాస్తవాలను గుర్తించాల్సిన పోలీసులు దానిని తుంగలో తొక్కారు. గ్రామానికి చెందిన గాదె వినయభూషణ్రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు ఆపి సంఘటన గురించి వివరాలు అడిగారు. ఫిర్యాదు చేసిన వారినే అడిగితే వారే పేర్లు చెబుతారుగా అని సమాధానం చెప్పటం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఎస్ఐ వీరనారాయణ అసభ్యకరంగా బూతులతో మాట్లాడటంతో... సక్రమంగా మాట్లాడాలని వినయభూషణ్రెడ్డి చెప్పారు. దీంతో జీపులో ఎక్కించి వారికి మర్యాదలు చేయండి అని సిబ్బందికి చెప్పటంతో గ్రామస్థులు అడ్డుతిరిగారు. వినయభూషణ్రెడ్డిని, ఆయన భార్య గీతావాణి, బీబీఏ చదువుతున్న శశిదత్రాయరెడ్డిలను ఎస్ఐ ఈశ్వర్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు జీబులో స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లారు. గుండె సంబంధ వ్యాధితో బాదపడుతున్న వినయభూషణ్రెడ్డిని అర్ధరాత్రి రెండు గంటల వరకు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కానిస్టేబుల్తో పోలీసులపై దౌర్జన్యం చేశారనే తప్పుడు ఫిర్యాదుతో వారి కుటుంబసభ్యులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 8వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ వద్ద ఉంచి ఇబ్బంది పెట్టారు. చదువుతున్న ఆయన కుమారుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లు వినకపోతే మీ అంతు చూస్తామని బెదిరింపులకు పోలీసులు దిగారు. వారు తొలగిస్తే వైఎస్సార్సీపీ వారిపై కేసులు షెల్టర్ను తొలగింపు పనులు చైన్నె ప్రాంతానికి చెందిన లింగమ్మ ఉరఫ్ లీలావతి చేపట్టినట్లు ఆమె పంచాయతీకి, పోలీసులకు తెలియజేసింది. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్కు, పంచాయతీకి తిరిగినా ఆమె మొర ఆలకించలేదు. వారికి కావలసిన చైన్నెలో ఉన్న ఉడుముల కోటేశ్వరరెడ్డి, ఉడుముల నరసింహరెడ్డి, గ్రామంలోని వైఎస్సార్సీపీకి చెందిన గాదె కేశవరెడ్డి, కొల్లి శేషిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. 50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన భవనం రాఘవరెడ్డి సొంత స్థలంలో బస్ షెల్టర్ను ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించారు. ప్రస్తుతం అది ప్రభుత్వ స్థలం అని, దానిలో అనుమతి లేకుండా ఎవరూ ఈత కొట్టవద్దని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాదిపై ఎస్ఐ వీరంగం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన సంఘటనపై కేసు వివరాలు తెలుసుకోవటానికి వచ్చిన హైకోర్టు న్యాయవాది శివప్రసాద్పై చేబ్రోలు ఎస్ఐ పి. వీరనారాయణ వీరంగం సృష్టించారు. హర్ట్ పేషంట్ను, మహిళలను అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచటంపై న్యాయవాది ప్రశ్నించటంతో ఎస్ఐ అసహనానికి గురయ్యారు. సీసీటేజీల గురించి, ఎఫ్ఐఆర్ల గురించి హైకోర్టు న్యాయవాది వివరాలను అడగటంతో ఎస్ఐ లేచి మీదకు రావటంపైజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయటం, పోలేరమ్మ గుడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బండారుపల్లిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు. -
గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలో ఐద్వా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువతకు అందుతున్నాయన్నారు. చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పడం తప్ప కార్యాచరణ లేదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులో గంజాయి దొరకడం వలన వారి భవిష్యత్ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన పనిదినాలు తగ్గిపోయాయని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలకు భద్రత లేకపోవడంతో అత్యాచారాలు, దాడులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస కుమారి మాట్లాడుతూ పసిపిల్లలు సైతం దాడులకు గురికావాల్సి వస్తోందని, సమాజంలో సీ్త్ర విముక్తి కోసం మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఐద్వా పనిచేస్తుందని అన్నారు. దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సక్రమంగా విద్య అందించకపోవడం వలన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, నాయకులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి -
రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు
నెహ్రూనగర్: అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా అందరికి సమాన హక్కులు లభించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బృందావన్గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగల భారతదేశం, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నట్లు వెల్లడించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానమే మన దేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక విభిన్న దేశంగా నిలబెట్టిందని కొనియాడారు. కులం, మతం, ప్రాంతాలకతీతంగా భారతీయులందరికీ ఉమ్మడి పవిత్ర గ్రంథాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాట అందరికి ఆదర్శనీయమన్నారు. వర్ణ వివక్ష, కుల వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం రూపంలో మన దేశానికి ఒక తారకమంత్రం ఇచ్చారని చెప్పారు. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ వారందరూ కలసిమెలసి సహజీవనం చేయగలుగుతున్నారంటే అందుకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. సమ సమానత్వాన్ని సాధించేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడిగా అంబేద్కర్ను అందరూ స్మరించుకోవాలని కోరారు. కాని ఈనాడు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగడం లేదని..నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన ఆదర్శ మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాలన్నీ కూడా సమానంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, గడ్డేటీ సురేంద్ర, ప్రభు, రాజు, పఠాన్సైదా ఖాన్, ప్రేమ్కుమార్, వినోద్బాబు, పవన్, వెంకటేష్, దూపాటి వంశీ, బూసి రాజలత, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), వెంకాయమ్మ, కోటి, షర్ఫుద్దీన్, సాయికిరణ్, సింగ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ లైజర్ ఆఫీసర్ ఉబా ప్రసాద్, జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్ రోడ్డులోని మహావీర్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్న్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
గుంటూరు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
మంట చింతల..!
మండల కేంద్రమైన రెంటచింతలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.6 కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గ్రామంలో ఆది, సోమ, మంగళవారం మూడు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43.1 డిగ్రీలు, 43.8 డిగ్రీలు 44.6 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామస్తులు అల్లాడిపోయారు. భానుడు ఒక్కసారిగా భగభగ మంటూ మండుతుండటంతో గ్రామం నిప్పుల కొలిమిగా మారడంతో పాటు వడ గాడ్పులు వీస్తుండటంతో గ్రామస్తులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో గ్రామంలోని మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారితో పాటు గ్రామంలోని వీధులన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – రెంటచింతల -
టీడీపీ మాజీ కార్పొరేటర్పై సిటిబస్ల యజమానుల ఫిర్యాదు
సాక్షి టాస్క్ఫోర్స్: కోవిడ్–19 క్వారెంటైన్ సెంటర్కు సిటిబస్లు ఏర్పాటుచేశామని, ఆ బస్లకు సంబంధించి లక్షల రూపాయల బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బస్ యజమానులు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ తీరుపై ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్లో గుంటూరు ఆర్టీవో ద్వారా ఈపూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద క్వారంటైన్ సెంటర్ కింద బస్ ఏర్పాటు చేశామని సిటిబస్ యజమాని నళిని, ఆమె భర్త శివరామప్రసాద్ మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు అక్కడే ఉంచామని అన్నారు. ఏళ్లు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో గుంటూరు ఆర్టివో అధికారులను సంప్రదించామని చెప్పారు. సిటిబస్ ఆపరేటర్స్ అసోసియేషన్ గుంటూరు కార్యదర్శి, టీడీపీ 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వరప్రసాద్బాబు (సిటిబస్)కి చెల్లించామని తెలియజేశారని తెలిపారు. ఈ విషయమై బస్బాబుని అడగ్గా, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కోవిడ్–19 వేళల్లో బస్ ఏర్పాటు చేశానని, లక్ష రూపాయలు రావాల్సి ఉందని మరో బస్ యజమాని వడ్లమూడి కిషోర్ తెలిపారు. జీవనోపాధి నిమిత్తం తాను కొనుగోలు చేసిన సిటిబస్ను బస్బాబుకి అప్పగించినట్లు మరో బాధితుడైన ఎం.రమేష్ చెప్పారు. బస్కు సంబంధించి రోడ్డు పన్ను ఇతరత్రా పన్నులు చెల్లించాలని అతనితో ఒప్పందం చేసుకున్నానని అన్నారు. బీమా కూడా చెల్లించకుండా నకిలీ బీమాతో బస్సు నడిపాడని ఆరోపించారు. ప్రస్తుతం నా బస్ని అప్పగించాలని కోరగా, బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పుడు అగ్రిమెంట్ స్పష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎనిమిది మంది బాధితులు ఉన్నారని, టీడీపీ మాజీ కార్పొరేటర్ నుంచి రూ.8.50 లక్షలు రావాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. -
జీజీహెచ్లో అమెరికా వైద్యుల సేవలు
గుంటూరు మెడికల్: అగ్రరాజ్యం అమెరికా నుంచి పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు పలువురు వైద్యులు గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించి, దాన్ని అరికట్టేందుకు తమవంతు సాయం చేసేందుకు అమెరికా నుంచి గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థుల సహాయ సహకారాలతో గుంటూరు జీజీహెచ్కు నాట్కో క్యాన్సర్ సెంటర్లో సోమవారం ఉచితం క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్యపరీక్షలుచేశారు. ఈనెల 16వరకు నాలుగురోజులపాటు వైద్య శిబిరం కొనసాగనుంది. కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన పీఐఎన్సీసీ సంస్థ సహకారంతో డాక్టర్ కడియాల సమత నేతృత్వంలో శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ జీన్ టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హబాక్, డాక్టర్ పీఎన్ పార్వతి, గుంటూరు వైద్యకళాశాల ఓబీజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆంకాలజీ, పాథాలజీ విభాగ నిపుణులు కలిసి హెచ్పీవీసీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 112 మంది మహిళలను పరీక్షించగా, 8 మందిలో ప్రారంభ లక్షణాలు గుర్తించి వారికి తగిన చికిత్స అందించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ విజేత, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ అరుణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత, నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్ కుమార్, పోతురాజు సమత, వైద్యులు పాల్గొన్నారు. -
పెండింగ్ అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలి
గుంటూరు వెస్ట్: పెండింగ్ అర్జీలపై శాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకుని పరిష్కరించాలని, నిర్ధిష్టమైన కారణం లేకుండా అర్జీలు పెండింగ్ పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సాయికాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలితో కలసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా వేసవి కావడంతో పదేపదే తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత కక్షలతో పదే పదే వచ్చే అర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వచ్చిన 447 అర్జీలను కలెక్టర్తోపాటు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పరిశీలించారు. -
ఏ దారి కానరాక..!
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు. రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్ -
అర్జీదారులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు
నగరంపాలెం: అర్జీదారుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్ఎస్ భవనంలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల మొరను ఆలకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించాలని పోలీస్ అధికారులకు సూచించారు. 178 మంది ఫిర్యాదులు అందించగా, జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అబ్దుల్అజీజ్ (తూర్పు డీఎస్పీ) ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గతనెల 21న గుంటూరు హిందూ కళాశాల సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, భాజపా, యువమోర్చా నాయకులు పథకం ప్రకారం కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయంలోని బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు తగులబెట్టారు. దీనిపై గతనెల 21న నగరంపాలెం పీఎస్లో కేసు నమోదైంది. ఈ దాడికి సంబంధించి ముందస్తు సమాచారం పోలీసులకు తెలుసునని, అంతేగాక పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్పు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్.మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే మూడు రోజులుగా మా ఐదెకరాల పొలంలో మట్టి తవ్వుకెళ్తున్నారు. పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. అదేమని అడిగితే మైనింగ్ చేస్తున్నామని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి చెందిన పొలమని, ఎటువంటి అనుమతుల్లేకుండా ఇష్టానుసారంగా తమ పొలం తవ్వడం ఏంటనేది అర్థం కావడంలేదు. మా ఒక్కరి పొలమే తవ్వుతున్నారు. న్యాయం చేయగలరు. – నిమ్మగడ్డ ధనలక్ష్మి, శ్రీనివాసరావు, పల్లపాడు, వట్టిచెరుకూరు మండలం. -
కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫైర్ క్రాకర్స్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్, శ్రీలక్ష్మీ దుర్గా మెస్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్ఐ, ప్రత్తిపాడు సీఎస్ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అండర్–19 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా అండర్–19 యువకుల క్రికెట్ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.శివకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్టు ఈనెల 15 నుంచి 18 వరకు పేరేచర్ల మైదానంలో అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జట్టు సభ్యులు జి.దేవ్ప్రమోద్–కెప్టెన్–వికెట్ కీపర్, ఎం.సమన్యుదత్త, కె.ఎన్.వి.కౌషిక్, వి.వెంకట రోహిత్, వి.రిత్విక్, కె.ఎస్.మణికంఠ, వై.శశాంక్రెడ్డి, టి.నాగసాయిచరణ్, ఎం.తులసి నందన్, ఎ.యోచన్, వి.డి.డింకు రామ్ చరణ్తేజ్, ఓ నాగూర్ అబ్దుల్ జబ్బార్, కె.ఆదిత్య శ్రీకర్, ఇ పృధ్వీ శ్రీనివాసరెడ్డి, ఎస్కె.మక్సూర్ ఇర్ఫాన్, డి.డేవిడ్ మెల్విన్. స్టాండ్ బైస్: ఎం.ఎస్.విజయ్, ఎస్కె.నాగుర్ బాషా, ఎస్కె ఎండీ గులాషన్ జమీల్ మోయిన్, వి.అభిషేక్, ఎస్కె అబ్దుల్ అజీజ్. కాటన్ కన్సార్టియం బలోపేతానికి కృషి –ఉప్పుటూరి సాంబశివరావు కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్లో కాటన్ కన్సార్టియం కింద పనిచేస్తున్న జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ కాటన్ టీఎంసీ మిల్స్ అసోసియేషన్ కన్సార్టియం నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఎన్ కాలనీలోని సమావేశ మందిరంలో సోమవారం అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావుతోపాటు ఉపాధ్యక్షుడుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి గౌరీశంకర్, సహాయ కార్యదర్శిగా నేరెళ్ల ఏడుకొండలు, కోశాధికారిగా గుండా సాంబశివరావులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో ఏపీ కాటన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి, వివిధ జిల్లాల ప్రతినిధులు తుమ్మల సాంబశివరావు, మల్లయ్య, జయ కాటన్ సుబ్బారావు, బుల్లెట్ సుబ్బారావు, మదమంచి రంగారావు, కె.గోపాలకృష్ణ, వెంకటరామిరెడ్డి, దశరథరామిరెడ్డి, కుబేర్నాథరెడ్డి, మొరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు –రూ.12.93 లక్షలు అపరాధ రుసుం వసూలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో డీ–13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్నగర్, ఆర్టీసీ కాలనీలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీలు చేశారు. అనుమతించిన లోడు కన్నా అదనంగా విద్యుత్ వాడుతున్న 183 మందికి రూ.12.16 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుతున్న ఆరుగురికి రూ.52 వేలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరికి రూ.25 వేలు మొత్తం కలిపి రూ.12.93 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ఏ కరీమ్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.హుస్సేన్ ఖాన్లు మీడియాకు తెలిపారు. తనిఖీల్లో డీఈఈలు పి.రమేష్, ఎన్.మల్లికార్జున ప్రసాద్, కె.రవికుమార్, ఏఈఈలు వి.బాజీ, యు.శివశంకర్, ఎం.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు ఖాకీల రేంజ్ వేరు
కట్టుతప్పుతున్న రేంజ్ పోలీసులు ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకూంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తు.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. గోడ దూకి మరీ వెళ్లి.. తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు. ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది. -
డ్రగ్స్ ఆరోగ్య సమస్య కాదు – భద్రత సమస్య
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ చేబ్రోలు: డ్రగ్స్ ఆరోగ్య సమస్య, నేర సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశానికి హానికరంగా మారుతోందన్నారు. దీనిని ‘నార్కో టెర్రరిజం’గా అభివర్ణించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో, ఈగల్ టీమ్ సహకారంతో ‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ – దండి మార్చ్ 2.0’ పేరుతో నిర్వహిస్తున్న 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర 8వ రోజు విజ్ఞాన్ యూనివర్సిటీకి చేరింది. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమంగా ‘ది గ్రేటెస్ట్ డ్రగ్–ఫ్రీ మార్చ్ ఆన్ ఎర్త్’ అనే సందేశంతో యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ ఏఎస్పీ స్వరూపరాణి, తెనాలి డీఎస్పీ మల్లికార్జునరావు, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదలకు రోబోటిక్ వైద్య సేవలు అందాలి
గుంటూరు మెడికల్: రోబోటిక్ల ప్రవేశంతో ఆధునిక వైద్యరంగం ఓ పెద్ద మలుపు తీసుకుందని ఏపీ ఏరో స్పేస్ డిఫెనన్స్ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్రెడ్డి అన్నారు. కచ్చితత్వంతో కూడిన రోబోటిక్ వైద్య సేవలు పేదలకు సైతం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తక్కువ ఖర్చుతో రోబోటిక్లను రూపొందించినప్పుడు అది సాధ్యపడుతుందని ఆ మేరకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సతీష్రెడ్డి తన ఆప్తమిత్రుడైన సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇంటికి భోజనాది కార్యక్రమాలకు హాజరయ్యారు. సతీష్రెడ్డిని బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ నరేంద్రరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తనను కలిసిన మిత్రులతో సతీష్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమైన వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికను సద్వినియోగపరచుకోవడంలో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరిందన్నారు. గుంటూరు లాంటి చిన్న నగరంలో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ’మాకో’ రోబో సేవలు అందుబాటులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకుకు దీటుగా ఇక్కడి వారికి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడలోని రెండు హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. భోజనం అనంతరం డాక్టర్ సతీష్రెడ్డిని బూసిరెడ్డి దంపతులు సత్కరించారు. ఏపీ ఏరో స్పేస్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
నాటక రంగానికి యువత అవసరం యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. అమ్మచెక్కిన బొమ్మ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. అందరూ మంచివారే కానీ..! కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇది అతని సంతకం సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం -
తీరం.. ఫలహారం!
చీరాల అర్బన్: తమ భూములపై హక్కును కోల్పోయేలా మత్స్యకారులను ప్రభావితం చేయటం వెనుక పెద్ద కుట్ర దాగుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం విధించనున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తి జరిగే సమయం కావటం అందుకు కారణం. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో అతిక్రమణలకు తెర తీశారు. అందులో రిసార్టుల నిర్వాహకులు ముందున్నారు. రిసార్టుల ఎదురు రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంపై వారసత్వ హక్కు ఉన్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రలోభపరచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి లాభమేంటంటే.. తీరం నుంచి రోడ్డు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో సీవ్యూ పేరుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు రాత్రి వేళల్లో క్యాంప్ ఫైర్ పేరుతో విందు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా ఫంక్షన్లు కూడా తీరం వెంట నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీగా డబ్బు వసూలు చేసి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన అతిక్రమణలపై అధికారుల నియంత్రణ శూన్యమనే చెప్పాలి. వారిని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో తృప్తి పరుస్తుండటం అందుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, రెండు రిసార్టులకు మినహా మిగిలిన వారికి అనుమతులు లేవు. అనుమతులు ఉన్న వాటిలో కూడా అతిక్రమణలు ఉన్నాయి. ఇది అన్ని శాఖల అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యం. అధికార ముద్ర పడితే చాలు ‘‘అనుమతులా? అవెందుకు? ఎమ్మెల్యేతో ప్రారంభించుకుంటాం. దాంతో అధికార ముద్ర పడుతుంది. అవసరమైతే వారిని సంతృప్తి పరుస్తాం. దీంతో పాటు పార్టీ ఫండ్ ఇచ్చి సహకరిస్తామని చెప్తాం. అది చాలు. అంతేకానీ ఆ అనుమతి, ఈ అనుమతి అంటూ వివిధ శాఖల అధికారులు చుట్టూ ఎక్కడ తిరుగుతాం. తిరిగినా పని కాదు. నిబంధనల మేరకు రిసార్టు కట్టాలంటే అయ్యే పని కాదు. అయినా మమ్మల్ని ఏమన్నా చేయాలంటే మాకన్నా ముందు కట్టిన వారిపై చర్యలు చేపట్టండని అడుగుతాం. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న నిర్మాణాల సంగతేంటని అడుగుతాం. ఇదో కందిరీగల తుట్టె. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం. ఇక మాపై చర్యలేంటి?’’ అనే మాటలు రిసార్టుల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి. పరిష్కారం ముఖ్యం పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే రిసార్టుల నిర్మాణం లేదా నిర్వహణ నిబంధనల మేరకు సాగించటమనేది పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. తీరంలో భద్రత పెరుగుతుంది. అలా చేస్తే సంబంధికుల వ్యక్తిగత ప్రయోజనాలకు గండి పడుతుంది. అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో 8 మంది మృతి చంద్రబాబు సర్కారు నిర్వాకంతో సముద్ర తీరం పరాధీనమవుతోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతికి తీరం వెంట కేటాయించిన అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మడచెట్లు మాయం అయ్యాయి. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రిసార్టుల నిర్వాహకులు కారణం. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో విలువైన సహజ సంపద ప్రమాదంలో పడుతోంది. గతంలో సునామీ విపత్తు వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో 8 మంది మృత్యువాత పడ్డారు. అన్నీ సక్రమంగా ఉంటే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అతిక్రమణలతో జరిగే ప్రమాదాలు కనిపించవు. ఏదన్నా సునామీ లాంటి విపత్తు ఎదురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రస్తుతం కొమ్ముకాస్తున్న పాలకులు, అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తీరం వెంట అటవీ భూమి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతి కోసం కేటాయించింది. తీరం వెంట ఉన్న మడ చెట్లతోపాటు వారికి కేటాయించిన భూముల్లో సరిగ, యూకలిప్టస్, సుబాబుల్ వంటి సామాజిక వనాలను పెంచాలి. అందులో జీవాలు, పశువులను మేపుతూ భృతి పొందాలి. కోతకు వచ్చిన వనాల కలపను విక్రయించి వచ్చిన డబ్బుతో వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి. ఇది ఈ ప్రక్రియ లక్ష్యం. తమకు కేటాయించిన ప్రాంతం ఎప్పుడైతే వివిధ కారణాలతో పరాధీనం అయ్యిందో, అప్పటి నుంచి తీరంలో సామాజిక వనాలు, మడచెట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. మత్స్యకార గ్రామాల్లో పలువురు జీవాలు, గేదెల మేపునకు కూడా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్లో వారు తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
రంగా కాలనీలో వ్యక్తి హత్య
సత్తెనపల్లి: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీ భీమవరం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన మల్లవరపు బ్రహ్మయ్య (46) చిత్తు కాగితాలు ఏరుకుంటూ రంగాకాలనీలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మయ్యకు స్థానికుడైన చెన్నంశెట్టి శ్రీనుతోపాటు చెల్లెలు వరుసైన క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పద్మతో పరిచయాలు ఉన్నాయి. వారిరువురు కూడా క్రోసూరు ఏరియాలో చిత్త్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పద్మతో చెన్నంశెట్టి శ్రీను సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం తాగిన బ్రహ్మయ్య, శ్రీను ఈ విషయంలో గొడవ పడ్డారు. శ్రీను తలపై బ్రహ్మయ్య కర్రతో దాడి చేయగా గాయమైంది. తన సహజీవనానికి అడ్డు తగలడాన్ని మనసులో పెట్టుకున్న చెన్నంశెట్టి శ్రీను, పద్మలు కలిసి బ్రహ్మయ్యపై దాడి చేశారు. గుండెలపై తీవ్రంగా కొట్టి భీమవరం రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీను, పద్మ సహజీవనం చేస్తుండడంతో బ్రహ్మయ్య గతంలో కూడా పలుమార్లు మందలించాడు. దానిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మయ్యపై దాడి చేసి హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలోనే నల్లబోతు బ్రహ్మయ్యను వారిద్దరు హతమార్చినట్లు వెల్లడించారు. నిందితులు చెన్నంశెట్టి శ్రీను, పద్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
చినపులివర్రులో ఉద్రిక్తత
కొల్లూరు: మండలంలోని చినపులివర్రు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఆదివారం తెల్లవారుజామున మఫ్టీలో తనీష్బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు గోడలు దూకి ఇంటిలోకి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రశ్నించిన తనీష్బాబు భార్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గ్రామానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనీష్కు మద్దతుగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, చినపులివర్రు వాసులను వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్ల ఎస్ఐలు అడ్డగించారు. కొల్లూరు సమీపంలో రేపల్లె ● తెనాలి ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు అశోక్బాబు, తనీష్ కుటుంబ సభ్యులు మాత్రమే స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కొల్లూరు పోలీసుస్టేషన్లో తనీష్కు పోలీసులు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సమక్షంలో 41 నోటీసులు అందజేశారు. అనంతరం తనీష్ భార్య అనూష పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. -
ఓఆర్ఆర్ మలుపులపై రైతుల నిరసన
గుంటూరు రూరల్: ఔటర్ రింగ్ రోడ్డు 2017లో తొలిసారిగా ఇచ్చిన ఎలైన్మెంట్ను తుంగలో తొక్కి 2025లో ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పుతూ మరోసారి ఎలైన్మెంట్ మార్చిన ప్రభుత్వం తీరుపై వట్టిచెరుకూరు మండలం రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో రైతులు ప్రస్తుతం ఔట్ రింగ్ రోడ్డు వెళుతున్న మార్గంలో పొలాల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు చమళ్ళమూడి, కుర్నూతల పుల్లడిగుంట గ్రామాల మీదుగా వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మలుపు తిరగడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 2017 అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన ఎలైన్మెంట్ సజావుగా ఉందని, 2025–26 మ్యాప్ ఎలైన్మెంట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్నె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో లేని వెడల్పాటి 140 మీటర్ల రోడ్లు తమకొద్దని, 70 మీటర్ల రోడ్డు నిర్మాణం చాలని రైతులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు ఇప్పుడు ఇస్తున్న పరిహారం సరిపోదని, సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి బాధిత రైతుల డిమాండ్లను తెలుసుకుని, వాటిని అమలు చేయాలని కోరారు. లేని పరిస్థితుల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పి రైతులను ఇబ్బందులకు గురిచేయటమే ఈ ఎలైన్మెంట్ లక్ష్యంగా ఉందన్నారు. ఈ మార్పుల వల్ల చమల్ళమూడి, కుర్నూతల పరిధిలోని రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్తో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి కనీసం పొంతన లేదని వాపోయారు. పాత ఎలైన్మెంట్ను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులపై మరో బాదుడు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెను భారాన్ని మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులను గణనీయంగా పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా పాత వాహనాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడిన వాహనాల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. భారీగా పెంపు గతంలో ప్రైవేట్ కార్ల ఫిట్నెస్ ఫీజు కేవలం రూ.600 ఉంది. గత సంవత్సరం నవంబర్లో తీసుకున్న సవరణలతో ఇది రూ.5 వేలకు పెరిగింది. అదే విధంగా ద్విచక్ర వాహనాల ఫిట్నెస్ ఫీజు రూ.200 కాగా రూ.1,000 కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు రూ. 400 ఉండగా రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ వాహనాల విషయంలో పెంపు మరింత ఎక్కువగా ఉంది. గూడ్స్ వాహనాలు, బస్సుల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ ఫీజు గతంలో రూ.1,000 ఉంది. ఇప్పుడు రూ.12,500 కు పెరిగింది. మిడిల్ కేటగిరీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రూ.800 నుంచి రూ.10 వేల వరకు పెంపు అమల్లోకి వచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంగా రెన్యూవల్ చేస్తే అదనంగా జరిమానా కూడా విధించనున్నారు. ఉదాహరణకు, లైట్ మోటార్ వాహనాలకు రోజుకు రూ. 50 వరకు, భారీ వాహనాలకు రోజుకు రూ. 100 వరకు లేట్ ఫీజు విధిస్తున్నారు. పాత వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగిన ఈ ఫీజులు సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు భారమే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.7 వేలు, కార్లు (లైట్ మోటార్ వెహికల్స్)కు రూ.15 వేలు, మధ్యస్థ వాహనాలకు రూ. 20 వేలు, భారీ వాహనాలకు రూ.25 వేలు ఫిట్నెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకుపైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెనన్సు మొత్తాలతోపాటు విడి భాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచటం ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
తాడేపల్లిరూరల్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న పూణేలో జ్యోతిరావు పూలే జన్మించారని, చిన్ననాటి నుంచే కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి, తన భార్యని పాఠశాలకు పంపి, 1848లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటి సారిగా పాఠశాలను స్థాపించారని అన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకు వచ్చారని, మహిళల విద్య, దళిత బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, ఈశ్వర్, ఆకాశపు స్వామి, ఈశ్వరరావు, చిలకలపూడి పాపారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా అన్నారు. శనివారం నల్లచెరువులోని మహావీర్ జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈఓ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి కోసం నిరంతరం తపించిన వ్యక్తి పూలే అని, బాల్యం నుంచే తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలు చదివే వారని, మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతారని చెప్పారని అన్నారు. విద్య, జ్ఞాన సముపార్జనను జీవిత లక్ష్యాలుగా ఎంచుకుని, విద్యావకాశాలు లేని ప్రాంతాల్లో తన సతీమణి సావిత్రీబాయి పూలేతో కలసి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. బాలికల కోసం పాఠశాలలను తెరవాలని, బాలికా విద్య కోసం సావిత్రీబాయి పూలేను దేశపు తొలి తరం మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేసి, తద్వారా మహిళా విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ కె.వెంకట్ రెడ్డి, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, ఉపాధ్యాయులు శాంతి ప్రియ, అనుపమా దేవి, శారద, పలువురు హెచ్ఎంలు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. నగరంపాలెం: మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకై చేసిన సేవలను స్మరించుకోవాలని హోంగార్డు ఆర్ఐ రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మహాత్మా పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన పూలే
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మగుంటూరు వెస్ట్: అస్పృశ్యత, కుల వివక్ష, బాల్య వివాహాలు వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఫులే చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫులే ఆలోచన విధానం నేటి విద్యావ్యవస్థ బలోపేతానికి, బాలికా విద్య పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టడానికి దోహదం చేశాయన్నారు. సమాజంలో దురాగతాలను రూపుమాపేందుకు బాటలు వేసిన మహనీయుడన్నారు. -
నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మదుసూదనరావుకు అందజేశారు. ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టింగ్ పెట్టాడనే నెపంతో సోషల్ యాక్టివిస్ట్పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్ వారియర్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. దారిదోపిడీ నిందితుడి అరెస్ట్ నరసరావుపేట రూరల్: దారిదోపిడీ కేసులో నిందితుడిని రొంపిచర్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు కేసు వివరాలు తెలియజేశారు. గత నెల 16వ తేదీన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన మహిళ స్కూటీపై నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి ఆమెను అటకాయించి రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లి బంగారు వస్తువులు దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మంగళగిరికి చెందిన రాచగిరి రాఘవయ్యను సుబ్బయ్యపాలెం వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు, ఏఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు.


