Guntur District News
-
నాడు–నేడు పనులపై నిర్లక్ష్యం
2014–19 మధ్య టీడీపీ పాలనలో సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన వైఎస్సార్సీపీ సర్కారు నాడు–నేడు ద్వారా సకల వసతులతో పాఠశాలలను ఆధునికీకరించింది. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా చేపట్టిన పనులు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం పట్టించుకోలేదు. అదనపు తరగతి గదులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక, వినియోగంచకుండా పక్కన పడేశారు. రెండో దశలో పాఠశాలలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా రెండేళ్ల కూటమి పాలనలో కరువైంది. -
నాలుక కోస్తాం..
పిల్లి కూతలు కూస్తే .. గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్పీఎస్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలోఊదరగొట్టి తర్వాత హామీలు అమలు చేయకపోవడం ఆయన నైజమని మరోసారి తేలింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెనాలి, పొన్నూరు, గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు సభలతోపాటు బీసీ ఘర్జనలో పాల్గొన్ని సూపర్ సిక్స్ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూపర్సిక్స్ పథకాల గురించి తమ అనుకూల పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. మంత్రి అనుమతితోనే కేసులు గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లోకేష్ అండ్ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి గుంటూరు జిల్లాలో నడుస్తోంది. ముఖ్యంగా సోషల్మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్ మీడియా కేసులు, వైఎస్సార్సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారలేదు. చినబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక దాడులు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడున్నర గంటలసేపు చేసిన దౌర్జన్యం, హింసాకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో కూటమిలోని ఇతర పార్టీ నేతలతోపాటు ముఖ్యంగా కాపు సామాజికవర్గం వారిపై జరుగుతున్న దాడులతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పేరుకే పథకాలు తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15 వేలు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల తాలూకు డబ్బులు జమ కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నా ఇప్పటికీ సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా అరకొర మాత్రమే ఉన్నాయి. కొత్త బస్సులు లేవు. దీనివల్ల మహిళా ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. యువతకు అన్యాయం ‘యువతకు ఉపాధి కల్పిస్తాం. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ’ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే భృతి కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పాలన సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం... మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చింది. గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై అడుగు ముందుకు పడలేదు. ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామంటూ’ గుంటూరు పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ ఆస్తులు, అంజుమన్ ఆస్తులను ఏపీఐఐసీకి ధారాదత్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని కూడా తక్కువ నిధులు వచ్చాయని ఫ్లైఓవర్ బదులుగా మళ్లీ బ్రిడ్జినే కడుతూ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలను రోడ్డున పడేశారు. ఈ రెండేళ్లలో తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. గుంటూరు చానల్, కొండవీటి వాగుల వల్ల పూర్తిగా మునిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి రాజ్యమేలుతోంది. భూములు ఇవ్వని రైతులను వేధిస్తుండటంతో వారందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు రెండోవిడత భూసమీకరణను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. -
రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి
గుంటూరు వెస్ట్: రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతివారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ్ , కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలసి రాజధాని భూసేకరణ గురించి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాల గురించి చర్చించారు. భూసేకరణ ప్రక్రియలోని ప్రతి అంశానికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్న్డ్ భూములు, పట్టా భూములు విషయంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ సర్వే విషయంలో సంయుక్త తనిఖీలు త్వరగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, సీఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ అత్యంత కీలకం ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం రాత్రి కలక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో చుక్కలు
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. సన్నాహాక కార్యక్రమంలో భాగంగా గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆమె.. మాట్లాడుతూ ఈ నెల 28 బూత్ స్థాయిలో, 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వెల్లడించారు. సుమారు 1,49,054 మంది 0 నుండి 5 ఏళ్ల పిల్లలు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 12,899 పోలియో వ్యాక్సిన్ వైల్స్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 584 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు , డబ్ల్యుహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ జి.భవాని, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సురేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి, డీపీవో సైమన్, సూపర్వైజర్ శాస్త్రి పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే
నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల్లో సేదదీరి తిరిగి వచ్చే విద్యార్థులకు టీడీపీ సర్కారు తీరుతో తీవ్ర నిరాశే మిగలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా పంపిణీ చేయాల్సిప విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ను సిద్ధం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చతికిలపడింది. అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. స్టూడెంట్ కిట్తోపాటు ఇవ్వాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాల పంపిణీకే పరిమితం కానుంది. గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లో భాగంగా పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయాలి. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల రోజులకుపైగానే పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగలా విద్యాకానుక పంపిణీ నిర్వహించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం గుంటూరు జిల్లాలోని 18 మండలాల పరిధిలో 89,157 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇవ్వనున్నారు. కిట్లో భాగంగా అందించే పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు బుక్స్, వర్క్బుక్స్, బ్యాగులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, పిక్టోరియల్ డిక్షనరీలు రావాల్సి ఉంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. వైఎస్ జగన్ చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన గత వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 1,730 జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 3.49 లక్షలు ప్రభుత్వ బడుల సంఖ్య 1,074 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 89,157 ప్రైవేటు పాఠశాలల సంఖ్య 656 ప్రైవేటు బడులలోని విద్యార్థుల సంఖ్య 2,60,354 ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్యపుస్తకాలు: 15,26,181 -
వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు
గుంటూరు వెస్ట్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో వెల్ఫేర్ హాస్టల్స్ సంక్షేమ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఆర్ అండ్బీ శాఖ అధికారులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 67 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో 32 హాస్టల్స్ ప్రభుత్వ భవనాలు కలిగి ఉన్నాయన్నారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతి గృహాల అభివృద్ధి, ఆధునికీకరణకు ‘మార్పు’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి సదుపాయాలు ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అన్ని హాస్టల్స్ ఒకే విధానంలో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 28 నాటికి పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, బీసీ కార్పొరేషన్ ఈడీ మంజుల, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి, పంచాయతీరాజ్ ఎస్ఈ జి.శ్రీనివాసులు, వసతి గృహాల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ల్యాడ్స్పై నివేదిక సమర్పించాలి ఎంపీ ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎంపీ ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. సమావేశంలో సీపీఓ శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు అమరావతి రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొంటారన్నారు.జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు
లక్ష్మీపురం: భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ డివిజనల్ సేఫ్టీ అధికారి బి.విజయకీర్త్తి హెచ్చరించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ పిలుపు మేరకు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుధేష్ఠ సేన్ పర్యవేక్షణలో ఈనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాలు బుధవారంతో ముగిశాయి. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణ, రహదారి వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా అధికారులు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది రక్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా పట్టాభిపురం, ఇన్నర్ రింగ్ రోడ్, పెదకపలకలూరు, మంగళగిరి ప్రాంతాల్లోని రైల్వే గేట్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే భద్రతా బృందాలు లెవెల్ క్రాసింగ్ల సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భద్రతా సూచనలు తెలియజేడంతోపాటు పోస్టర్లు, కరపత్రాల ద్వారా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధికారులు, ఆర్పిఎఫ్ సిబ్బంది, పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయకీర్త్తి -
ఎట్టకేలకు చిక్కిన రిమాండ్ ఖైదీ
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ దాదాపు 70 రోజుల తర్వాత తమిళనాడు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెం గ్రామం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్కుమార్ (29) ఓ కేసులో ఒంగోలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వారెంట్ ముద్దాయి అయిన అతన్ని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ ఏడాది మార్చి 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. పరారయ్యేందుకు జైల్లోనే పథకం రూపొందించాడు. మార్చి 25న ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలికి శస్త్రచికిత్స చేయగా నొప్పిగా ఉందని సబ్ జైలు అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందే క్రమంలో 28న అజిత్కుమార్ మూత్రవిసర్జనకి వెళ్తున్నానని పరారైన విషయం విదితమే. రేపల్లె సబ్ జైలు అధికారికి ఆన్లైన్లో నగదు చెల్లించారనేది విచారణలో బహిర్గతమైంది. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ జాగ్రత్త పడటంతో నెలలు గడిచాయి. తమిళనాడులోని తిరుపూర్లో క్రైం విభాగం పోలీసులు సుమారు వారం క్రితం ఓ కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం. అతన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు పోలీస్ బృందం వెళ్లినట్లు తెలిసింది. పరారీ ఘటపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిపై ఇప్పటికి విచారణ చేస్తున్నారు. -
గుంతలోకి జారిపడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్లో ఉన్న శరత్బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్బాబును మెగా కంపెనీ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కు కాపు నాడు వినతి నెహ్రూనగర్: కాపుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సంకటి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి వద్ద ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 2017 డిసెంబర్లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 100 నియోజకవర్గాల్లో కాపు భవనాలు, హాస్టళ్లు, కల్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చి కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్న్కు ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. కాపు విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కాపు మహిళా సాధికారత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.15,000, 5 సంవత్సరాలకు రూ.75,000 వరకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. 2019లో కాపులను బీసీల్లో చేర్చి 9వ షెడ్యూల్లో పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తిగా పరిశీలించి కాపులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. కాపునాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, వ్యతిరేకం కాదని, రిజర్వేషన్, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడే సంస్థ అని స్పష్టం చేశారు. -
మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ భైరవకోన సభ్యులు డిమాండ్ చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నగంటి లక్ష్మి, వి.ఎం.సుహాసిని మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డీఎస్సీలో కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1,369 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్లా చంద్రయ్య, డి.ఆదినారాయణ, డి.నాగేశ్వరరావు, టి.ఏసుబాబు, సీహెచ్ఎల్వీ తులసి, ఆర్.రామారావు పాల్గొన్నారు. -
ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదాపై పరిశీలన
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపజేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మంచి ప్రభుత్వానికి, మంత్రి వర్యులకు ముద్రణా రంగ పారిశ్రామికవేత్తల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రింటింగ్ రంగాన్ని ఇప్పటివరకు కేవలం ఒక వ్యాపారంగానే చూస్తున్నారని, దీనికి పూర్తిస్థాయిలో పరిశ్రమగా గుర్తింపు ఇవ్వాలని మంత్రి టీజీ భరత్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కోలా వెంకటరమణ, సలహాదారులు మిక్కిలినేని వెంకట శివప్రసాద్, కార్యదర్శి కట్రగడ్డ మోహన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవీందర్ రెడ్డి, తెలంగాణ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు చక్కా శివప్రసాద్ హర్షారెడ్డి పాల్గొన్నారు. -
పొగాకు బాధితులకు చేదు వార్త
గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం స్మోకింగ్కు అలవాటు పడినవారు ఆ అలవాటు మానాలనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగంలో డీ అడిక్షిన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రం ఉన్నాయి. వీటిలో చికిత్స కోసం ప్రతి రోగి పది నుంచి 15 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు, ఖైనీ, గుట్కా, పాన్పరాగ్లాంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారు సైతం జీజీహెచ్కు వస్తున్నారు. వీరికి ఆ అలవాటును మాన్పించేందుకు శరీర భాగంలో ఛాతీకి లేదా భుజానికి లేదా తొడకు వెంట్రుకలు లేని ప్రాంతంలో నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటించి కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా ప్రతినెలా బాధితులు పొగాకు ఉత్పత్తులు విడనాడుతున్నారు. మందులు మింగే పనిలేకుండా కేవలం ఒక స్టిక్కర్ మాదిరిగా నికోటిన్ ప్యాచ్ను అంటించుకోవడం ద్వారా పొగాకు వినియోగాన్ని సునాయాసనంగా విడిచి పెట్టడంతో రోజూ జీజీహెచ్కు బాధితులు క్యూ కడుతున్నారు. కానీ ప్యాచ్లు ఆరు నెలలుగా జీజీహెచ్లో స్టాక్ లేవు. వాస్తవానికి ఈ ప్యాచ్లను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు నెలకు రూ.3 వేలకుపైగా ఉంటుంది. పలువురు బాధితులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేక కౌన్సిలింగ్ చేయించుకున్నప్పటికీ ప్యాచ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా రోజువారి కూలీలు, దిగువ మధ్యతరగతి వారు బాధితులుగా ఉన్నారు. ఆరు నెలలుగా స్టాకు లేక బయట కొనుగోలు చేసే స్థోమత లేక పొగరాయుళ్లు సతమతం అవుతున్నారు. గుంటూరు జీజీహెచ్కు కేవలం గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం నికోటిన్ ప్యాచ్ల కోసం పొగ అలవాటును మానాలనే ఉద్దేశంతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. జీతాలకు కూడా దిక్కులేదు... డీ అడిక్షన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు కూడా విడుదల కాలేదు. ఇరువురు కౌన్సిలర్లు, ఇరువురు నర్సింగ్ సిబ్బంది, ఇరువురు నాలుగో తరగతి ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పొగరాయుళ్లుకు చెడు అలవాట్లు మాన్పించటంలో సహాయపడుతున్నారు. ఒక పక్క నికోటిన్ ప్యాచ్లు లేక, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు విడుదల కాక డీ అడిక్షన్ సెంటర్ పనితీరు దిగజారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి పొగాకు వినియోగంలాంటి చెడు అలవాట్లు విడనాడాలనుకునే వారికి నికోటిన్ ప్యాచ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలు విడుదల అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026గ్లాసులు గలగల.. అధికారంలోకి రాగానే సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తాం.... ఇదీ చంద్రబాబు ఎన్నికల ప్రకటన. ఆ సంపద ఏమోగానీ, దానిని తమ నుంచే కొల్లగొడుతున్నారని తెలియని ప్రజలు విస్తుపోతున్నారు. రేయింబవళ్లు గ్లాసులు గలగల అనేలా సర్కారు ప్రోత్సాహం ఇస్తోంది. ఖజానా కళకళలాడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. గత నెలలో భారీగా ఆదాయం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
చేనేతల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ఫిబ్రవరి 22న చేనేత కార్మికులతో మంగళగిరిలో నిర్వహించిన చేనేత గర్జన, ప్రదర్శన, బహిరంగ సభ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినా పాలకుల వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ, మగ్గాలు లేని షెడ్ల కార్మికులు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారిని విస్మరించిందని ఆరోపించారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి అందించాల్సిన 25 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయకపోవడం వలన చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేనేత రంగ పరిరక్షణ కోసం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళగిరి హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం వద్ద జూన్ 22వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, పి.బాలకృష్ణ, రామారావు, కోటేశ్వరరావు, రవి పాల్గొన్నారు. -
మార్కెట్లోకి రాని పాఠ్యపుస్తకాలు
ఎస్సీఈఆర్టీ నిర్లక్ష్యం వల్లే... గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో టీడీపీ సర్కారు విఫలమైంది. 2026–27 నూతన విద్యాసంవత్సరం శుక్రవారం ప్రారంభం కానుండగా, అదే రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించిన పాఠ్య పుస్తకాలను ప్రైవేటు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పుస్తకాలు ఇంకా రాలేదని దుకాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠ్యాంశాల బోధన తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలతో పూర్తిస్థాయిలో బోధన చేసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలను విధిగా కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలతో వ్యవస్థను గాడిలో పెట్టారు. వైఎస్సార్ సీపీ పాలనకు ముందు టీడీపీ హయాంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో యాజమాన్యాలు రూ.వేల ఖర్చుతో ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలండర్కు విరుద్ధంగా సొంత సిలబస్ను బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో బోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సేల్ టెక్ట్స్బుక్స్కు ఇండెంట్ తీసుకుంటున్న విద్యాశాఖ ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలకు అదనంగా సేల్ టెక్ట్స్బుక్స్ను ముద్రించి, విక్రయాలు జరిపింది. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను బహిరంగ మార్కెట్లో సిద్ధం చేయడంలో ఎస్సీఈఆర్టీ విఫలమైందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలను అందించలేని దుస్థితి నెలకొందని, పాఠశాలలు తెరిచిన తరువాత పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలవారీగా హెచ్ఎం లాగిన్ ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టి, నేరుగా ముద్రణదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అంటున్నారు. పాఠశాలలు రీ ఓపెన్ చేసేందుకు వ్యవధి దగ్గర పడినప్పటికీ పాఠ్య పుస్తకాలు సైతం అందించలేని దుస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ఆరోపణలు చేస్తున్నారు. -
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
గొప్ప జీవన విధానం యోగా
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తాడేపల్లి రూరల్: ప్రపంచానికి గొప్ప జీవన విధానమైన యోగాను అందించినది భారతదేశమని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన యోగా అని అన్నారు. యోగా అంటే శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, వివిధ భంగిమల (ఆసనాలు) ద్వారా శరీరాన్ని, మనస్సును ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అని తెలిపారు. యోగా చేయడం ద్వారా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈనెల 13వ తేదీన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పెను భారంగా మారిన ధరలు
లక్ష్మీపురం: ప్రధాని బాధ్యతారాహిత్యం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అసాధారణ రీతిలో పెరిగి సామాన్యులకు భారంగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు. పెంచిన వీటి ధరలు తగ్గించాలని స్థానిక హిమనీ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చి ప్రజలు వినియోగించే వంట గ్యాస్, ఇంధన ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మార్గమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఎన్డీఏ పాలనలో రూపాయి విలువ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షోభం వచ్చిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచామని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేజీ బేసిన్లో రాష్ట్రానికి సగం ఉత్పత్తులు ఇవ్వాలని ప్రణాళిక సంఘం చెప్పినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యుడు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, సురేష్ బాబు, గుండెబోయిన లక్ష్మి, బి.వెంకటేశ్వర రెడ్డి, చల్ల మరిదాసు, జంగాల చైతన్య, రత్నం, కోట్ల మరిదాసు, రాయల వెంకటేశ్వర్లు, ఆకిటి రామచంద్రుడు, పున్నయ్య, షేక్ వలి, మిరియాల కోటేశ్వరరావు, అప్పమ్మ, రాగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం కావాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీనివాసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గస్థాయిలో వెన్నుపోటుకు రెండేళ్లు టౌన్హాల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకరవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సుధాకర్బాబు మాట్లాడుతూ టీడీపీ రెండేళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని తెలిపారు. వైఎస్సార్ సీపీలో సమర్థుడైన నేతగా ఎదిగిన అంబటి రాంబాబు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి, వైఎస్ జగన్కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గుంటూరు నగరంలో ఎంతో మంది ఉద్దండులైన నేతలు ఎంపీలుగా రాణించిన పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చిన పెద్దమనిషి రాజకీయ దాడులతో గుంటూరులో రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో అధికార మదం దింపుతారని అన్నారు. వైఎస్ జగన్ అంటేనే భయం ఉండటంతో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్కు జానియర్ ఎన్టీఆర్ అంటే భయమన్నారు. చిరంజీవిని తిట్టిన చింతకాయల విజయ్కు చంద్రబాబు రాజ్యసభ పదవిని కట్టబెట్టారని, టీడీపీ బినామీ లింగమనేనికి పవన్ కల్యాణ్ జనసేన తరఫున రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగాను చంపిన వాళ్లే, అంబటిని అంతం చేసేందుకు ఆయన ఇంటిపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన టీడీపీ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. సమష్టి కృషి అవసరం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీ యింబర్స్మెంట్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ నోరు తెరవకపోవడంతోనే ఆ అక్రమాలు నిజమని నిర్ధారణ అయిందన్నారు. టీడీపీ మూడు కోతుల పాలన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మాట్లాడకుండా, పవన్ కల్యాణ్ వినకుండా, లోకేష్ కళ్లతో చూడకుండా మూడు కోతుల పాలన సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసాలతో నిండి పోయిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు తమను తాము నిందించుకుంటున్నారని అన్నారు. 2029లో వైఎస్ జగనన్న పాలన కోసం రాష్ట్రంలోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు, నేరాలు పెరిగాపోయాయని అన్నారు. సదస్సులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకురాలు నల్లమోతు రూత్రాణి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వంగల వలివీరారెడ్డి, పోలే ముత్యం, కొల్లి శివరామిరెడ్డి, యర్రం హనిమిరెడ్డి, సింగు నరసింహారావు, మామిడిరాము, కె.విజయమాధవి, కె.చిన్నపరెడ్డి, పఠాన్ సైదాఖాన్, ఈమని రాఘవరెడ్డి, బాల వెంకట్రెడ్డి, షేక్ రాజియా బేగం, బాల మురళీకృష్ణ, చదలవాడ రవీంద్రనాథ్, వి.సుబ్బారెడ్డి, దేవరశెట్టి సత్యనారాయణ, సీహెచ్ ధన్వంతరీ భగవాన్, యేటి కోటేశ్వరరావు, పల్లపు మహేష్, వెంకాయమ్మ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పే చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన నేతగా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లు దోచుకోవడం, అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపడం తప్ప చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాంబాబుపై దాడితో రాష్ట్రంలో టీడీపీ పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 12న తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి ఎదురైందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేసినా అవేవీ సాధ్యం కాదని వైఎస్ జగన్ నాడే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అదే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ... చంద్రబాబు వాగ్దానాలు అమలు కావని తెలిసే ఎక్కడా వాటి గురించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ తరఫున ప్రజలను చైతన్యం చేసేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో టీడీపీ చేసిన రాజకీయ దాడులు, హత్యలతో అసలైన గొడ్డలి పార్టీగా అదే నిలిచిందని చంద్రబాబు తెలుసుకోవాలని చురకలు అంటించారు. జూలై 29న వినతి యాత్ర తన ఇంటిపై దాడికి తెగబడిన దుండగులపై ఇప్పటివరకు కేసులు లేవని అంబటి అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో నిరసన దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న గుంటూరు నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి 29 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి డీజీపీకి వినతి పత్రం సమర్పిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లలో భాగంగా ఈ నెల 12న పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. -
దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్ మొదటి, రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్ జవ్వాజి శ్రీనివాస్, ఉద్యోగులు, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో మార్చినెలలో ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి మంగళవారం తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రివైజ్ చేసి, ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల జాబితా రూపొందించామన్నారు. కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన వారు ఈనెల 10 తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కోసం హాజరు కావాలన్నారు. ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మార్కుల మెమో, ప్రొవిజనల్లీ సర్టిఫికెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్ ఏపీ ఎన్ఎంసీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, అపాయింట్మెంట్ఆర్డర్ కాపీ, సర్వీస్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అంగవైకల్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లు, కరోనా సమయంలో పనిచేసినందుకు శాలరీ పొందిన బ్యాంకు స్టేట్మెంట్ తీసుకుని రావాలన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. -
లారీ యాజమానులపై అదనపు భారం మోపవద్దు
నగరంపాలెం: లారీ యజమానులపై అదనపు భారం మోపవద్దని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఏఎంటీఏ) జిల్లా ఇన్న్చార్జి సాంబశివరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గూడ్స్ క్యారేజ్ వాహనాలపై వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైస్(వీఎల్టీడీ)ను తప్పనిసరి చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తద్వారా లారీ యజమానులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం జారీ చేసిన రూల్ 125 హెచ్, 2018 నాటి వీఎల్టీడీ మార్గదర్శకాల్లో ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ గురించే ప్రస్తావించారని అన్నారు. గూడ్స్ క్యారేజ్ వాహనాలకు వీఎల్టీడీ తప్పనిసరి అమలుపై చట్టపరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గతనెల 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలలో వీఎల్టీడీ, పానిక్ బటన్ అమలుపై దృష్టి సారించిందని, గూడ్స్ వాహనాలపై తప్పనిసరి అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, టైర్లు, స్పేర్ పార్ట్స్ ధరలు, బ్యాంకు రుణాల వడ్డీలు పెరుగుతున్న దృష్ట్యా లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి వేళ ఒక వాహనానికి వీఎల్టీడీ పరికరం కొనుగోలు, అమరిక, వార్షిక నిర్వహణ, సిమ్, సాఫ్ట్వేర్ ఛార్జీల రూపంలో వేలాది రూపాయల అదనపు వ్యయం మోపడంతో చిన్న, ముధ్య తరహా లారీ యజమానులకు భారంగా మారుతుందని వాపోయారు. గూడ్స్ వాహనాలపై వీఎల్టీడీ తప్పనిసరి అమలుకు ఉన్న చట్టపరమైన ఆధారాన్ని ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని అన్నారు. రూల్ 125 హెచ్, 2018 వీఎల్టీడీ మార్గదర్శకాలపై అధికారిక స్పష్టీకరణ జారీ చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి ట్రాన్స్పోర్ట్ సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు ఫిట్నెస్, పర్మిట్, బ్యాక్స్, ఇతర పరిపాలనా చర్యలలో వీఎల్టీడీ నిబంధనను అమలు చేయరాదని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా లారీ యజమానులకు ఆర్థిక భారం తగ్గించే చర్యలు చేపట్టాలని అన్నారు. లారీ యజమానుల న్యాయమైన ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రంలోని ట్రాన్న్స్పోర్ట్ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రవాణా రంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధానాల కంటే, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
సచివాలయాల ఉద్యోగుల నుంచి ఫోన్ కాల్స్
లక్ష్మీపురం: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ పేరుతో సచివాలయాల నుంచి ఫోన్ కాల్స్ చేసి ఓటీపీలు అడుగుతుండటంతో నగర వాసులు సైబర్ నేరాలకు ఎక్కడ గురవుతామోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, నగరపాలక సంస్థ అధికారుల సూచన మేరకు గుంటూరు నగర వాసులకు సచివాలయాల ఉద్యోగులు ఓటీపీ చెప్పాలని ఫోన్ కాల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటీపీలు చెబితే చాలు ఖాతాల్లోని రూ.లక్షల నగదు మాయం అవుతున్న రోజులివి. ఇప్పుడు యోగాంధ్రా కోసం సచివాలయాల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, దానికి సంబంధించి మీ సెల్ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చిందని సచివాలయ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంత మంది చెప్పినప్పటికీ చాలామంది భయంతో వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ పదే పదే కాల్స్ చేస్తుండటంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని సచివాలయాల నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తుండటంతో ఇదే నమోదు అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. నమోదు చేస్తున్నట్లు చెప్పకుండా నేరుగా ఓటీపీ చెప్పమని అడుగుండటంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగానే సంబంధిత అధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ఇలా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
గళమెత్తిన న్యాయవాదులు
చీరాల రూరల్: చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులను చీరాల కోర్టుల నుంచి పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ బార్ అసోసియేషన్, అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చినగంజాం మండల సివిల్, క్రిమినల్ కేసులను పర్చూరు కోర్టుకు బదలాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల–వాడరేవుపై ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు చీరాల కోర్టుల్లోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీనియర్ న్యాయవాదులు శ్రీకాంత్ ఠాకూర్, మిక్కిలి పుల్లయ్య, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పింజల ప్రసాద్, గౌరవ రమేష్బాబు మాట్లాడారు. చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు మార్చినట్లయితే ఆయా మండలానికి చెందిన అనేక గ్రామాల కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడతాయని చెప్పారు. చినగంజాం పరిసర గ్రామాలకు చెందిన కక్షిదారులు పర్చూరు కోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాలన్నారు. పర్చూరుకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కూడా లేదని, కక్షిదారులు సుమారుగా 60 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని తద్వారా వారికి సమయంతో పాటు డబ్బు అధికంగా ఖర్చు అవుతాయని తెలిపారు. చినగంజాం పరిసర గ్రామాల కక్షిదారులు చీరాల చేరుకోవాలంటే అనేక రవాణా సదుపాయాలున్నాయని ముఖ్యంగా రైలుబండ్లు, బస్సులు నిరంతరాయంగా ఉంటాయని దూరం కూడా 20 కిలో మీటర్లులోపే ఉంటుందని వారు తెలిపారు. ఉన్నత న్యాయ స్థానాలు న్యాయం మన ఇంటి ముంగిటకే వస్తుందని చెప్పే మాటలన్నీ నీటి మూటలని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో ఇలా జరిగితే అప్పుడు కూడా ఉద్యమాలు చేపట్టి చీరాల కేసులు పర్చూరు కోర్టులకు వెళ్లకుండా ఆపగలిగామని చెప్పారు. పర్చూరు కోర్టులో కేసులు తక్కువగా ఉండడం కారణంగానే చినగంజాం మండల కేసులన్నింటిని తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని వారు విమర్శించారు. -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు తుమ్మేటి రమేష్, తుమ్మల శ్రీకుమార్, న్యాయవాదులు సీవీఎల్ఎన్ మూర్తి, బైరపునేని నరేష్, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
మృతదేహంతో ఇంటి ముందు నిరసన
గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది. -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఎ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. స్టీలు బ్రిడ్జి పనులు ప్రారంభం తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ప్రకాశం బ్యారేజ్ సమీపంలో బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి గతంలో స్వల్పంగా ఒరగడంతో ఆ బ్రిడ్జిలో కొంత భాగాన్ని సీఆర్డీఏ అధికారుల సూచనల మేరకు తొలగించారు. ఆ గడ్డర్లను సరిచేసి బకింగ్హామ్ కెనాల్పై అమర్చేందుకు కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి పనులు ప్రారంభించారు. మొత్తం నాలుగు ఐరన్ గడ్డర్లు బిగించాల్సి ఉండగా సాయంత్రం సమయానికి మూడు గడ్డర్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. మరో గడ్డర్ను అమర్చి దానిపై కాంక్రీట్ వేసేందుకు ప్రత్యేకమైన రేకులు, స్టీలును అమర్చాల్సి ఉంది. 10–15 రోజుల్లో స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. -
కూటమి ప్రభుత్వం పనైపోయింది
తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ దుష్రచారం చేస్తున్నారనీ, ఆయన తనయుడూ, విద్యాశాఖ మంత్రి ‘దగా డీఎస్సీ’పై నోరెత్తటం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ బహిరంగసభ సోమవారం స్థా నిక ఎం.కన్వెన్షను హాలులో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే చంద్రబాబునాయుడు అమలుచేశానని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పోడిచాడని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందనీ, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చా డని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలోంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టంచేశారు. పొత్తులేనిదే బాబు గెలవలేడు సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేదని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ ఇద్దరూ కూటమిలో ఉన్నారని గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి తెనాలికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో వచ్చారని మంత్రి మనోహర్ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్ నుంచి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు, నియోజకవర్గ పరిశీలకుడు కాకుమాను సదాశివరెడ్డి, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణకిషోర్రెడ్డి, ప్రసాదం సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, బూరెల నాంచారమ్మ, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి,శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, గోల్డ్ రహిమా, కొడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, టి.యల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్నాయుడు, అవుతు శేఖర్రెడ్డి, కోలా వాసు, షేక్ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్ దుబాయ్బాబు, నిట్టా బాలు, పి.అశోక్, కిరణ్కుమార్రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే కూటమి ప్రభు త్వం గ్రాఫ్ పడిపోయిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది గ్రహించిన చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిది గొడ్డలి పార్టీ అంటూ అన్పాపులర్ చేయాలని చూస్తున్నారని, అది ఆయ న వల్లకాదన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెడితే సంగతేంటో తేలిపోతుందన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం చేసి అధికారంలోకి రావటం మినహా రుజుమార్గంలో ఏనాడూ రానేలేదని అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నట్టు చెబుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు కేఎన్నార్పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీని అణచాలని ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. క్రీడాకోటా శాతాన్ని ముందే పెంచుకుని దొంగ సర్టిఫికెట్లతో మెగా డీఎస్సీలో 421 పోస్టులు రిక్రూట్మెంట్ చేశారని ఆరోపించారు. ఈ మోసం విద్యార్థిలోకం ఉద్యమిస్తుంటే సంబంధిత శాఖామంత్రి నారా లోకేశ్ తేలుకుట్టిన దొంగలా మాట్లాడటం లేదన్నారు. లింగమనేని రమేష్ అక్రమ కట్టడంలో తండ్రీకొడుకులు ఉంటూ, ఆయన్ను జనసైనికుడుగా రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు. ఇందుకు ‘కలెక్షన్ కింగ్’ వంతపాడుతున్నారని అన్నారు. ఇల్లిస్తే, స్థలమిస్తే రాజ్యసభకు అర్హతగా తేల్చారని చెబుతూ జగన్మోహన్రెడ్డి పార్టీలో కష్టపడినవారినే రాజ్యసభకు పంపారని రాంబాబు గుర్తుచేశారు. -
ఏపీఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్, వెనిగండ్ల దనీత్ ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ కార్యాలయం ఎస్ఈఐటీ సెల్ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్ రాజన్, డీడీ ఫర్టిలైజర్ ఎం.ఆనంద్రావు, వ్యాసర్ ల్యాబ్ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్ బాచావో అభియాన్ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్ రామ్మోహన్రావు పాల్గొన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ గుంటూరు మెడికల్: బ్రెయిన్ ట్యూమర్లు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉందని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ అన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్మెడికల్ సెన్సెస్ హాస్పటల్లో బ్రెయిన్ ట్యూమర్స్పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. డాక్టర్ నరేన్ మాట్లాడుతూ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెదడులో ట్యూమర్ ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఎమ్మారై ట్రాక్టోగ్రఫీ నేడు అందుబాటులో ఉందన్నారు. ట్యూమర్ స్వరూపాన్ని కచ్చితంగా నిర్ధారించే న్యూరో నావిగేషన్ గైడెడ్ బయాస్పి వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్లు ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు. బ్రెయిన్ ట్యూమర్లు అని క్యాన్సర్కు దారి తీయవని, మెనిమ్జియోమా వంటి కొన్ని ట్యూమర్లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే జీవితాంతం మరలా రావని సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు అన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూష మాట్లాడుతూ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ లక్షణం కాదని, తలనొప్పితోపాటు ఇతర నాడి సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ ప్రారంభ దశలో ట్యూమర్లను గుర్తిస్తే కేవలం ఆపరేషన్ ద్వారానే 90 నుంచి 95 శాతం విజయవంతంగా నయం చేయవచ్చు అన్నారు. అవగాహన సదస్సులో 300 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు. బ్రెయిన్ ట్యూమర్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘5జీ కపుల్స్’ నాటికను ప్రదర్శించారు. ఎస్కేడీ హస్సన్ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్ఎంఆర్ క్రియేషన్స్, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి. -
రెవెన్యూ క్లినిక్స్పై సీఎస్ ఆరా
సిబ్బందికి సున్నితంగా హెచ్చరికలు గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికంలో భాగంగా స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్ను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సందర్శించారు. వచ్చే అర్జీలు, వాటి అప్లోడ్ విధానం, అధికారులు ఇచ్చే పరిష్కార మార్గాలు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తో కలిసి ఆయన కొంతమంది బాధితులతో మాట్లాడి. పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు. పాత రికార్డులు అడగవద్దు 1900 నాటి రికార్డుల కోసం అర్జీదారులను ఇబ్బంది పెట్టద్దని అధికారులకు సీఎస్ సూచించారు గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 1239లో ఎకరం 69 సెంట్లు రిజిస్టర్ భూమిని తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేశామని, ఆ తర్వాత వాగు పోరంబోకుగా తేల్చి 22/ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆ ప్రాంతవాసులు పశ్చిమ మండల అధికారులకు అర్జీ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూల్చివేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. భూమి డాక్యుమెంట్లు 1900 సంవత్సరం నుంచి కావాలని అధికారులు అడగగా అక్కడే ఉన్న సీఎస్ స్పందించారు 1900 రికార్డులు వారి దగ్గర ఎలా ఉంటాయని, ఒకవేళ అవి తెస్తే మొగలుల కాలంనాటి రికార్డులు అడుగుతారా అని సిబ్బందికి చురకలంటించారు. అధికారులు ఉక్కిరి బిక్కిరి సీఎస్ సాయి ప్రసాద్ రావడం, అక్కడే మూడు గంటలపాటు ఉండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎస్ రెవెన్యూ క్లినిక్కు వచ్చే సమస్యలు వాటి అప్లోడ్ వంటి వివరాలను తెలుసుకునేందుకు వచ్చానని మీరు కంగారు పడకండి అని సిబ్బందికి ధైర్యం నింపారు. ముఖ్యంగా కొత్తగా తహసీల్దార్ బాధ్యతలు తీసుకునేవారు గతంలో ఉన్న భూ సమస్యల కేసులను స్టడీ చేయాలని సూచించారు. సర్వేలో ప్రైవేటు వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్ రావటం అదే సమయంలో యువతి ఆత్మహత్య, కరెంటు కోత వంటి ఘటనలతో అధికారులు ఇబ్బంది పడ్డారు. -
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే బొల్లా అక్రమ అరెస్టు
నరసరావుపేట: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అక్రమ అరెస్టును గమనిస్తే ఆంధ్రాలో మాదిరిగానే చంద్రబాబునాయుడు శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారనిపిస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాధితులపైనే కేసు పెట్టడమంటే కూటమి ప్రభుత్వం డైరెక్షన్లోనే రేవంత్రెడ్డి నడుస్తున్నాడన్నారు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన బొల్లాను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయటం అనైతికం అన్నారు. బొల్లా కుటుంబానికి పార్టీ, ఎస్సీ సెల్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు బొల్లా అండగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడుతూ ఒక తప్పుడు ఫేక్ కేసుతో బొల్లాను అరెస్టు చేశారన్నారు. బొల్లాకు 70 ఏళ్ల వయస్సుతో పాటు గుండె ఆపరేషన్ జరిగిందని, భూమి కొనుగోలులో బాధితుడైన బొల్లాను అరెస్టు చేయటం హేయం అన్నారు. తమ పార్టీ సమస్యలు, బెదిరింపులకు భయపడే పార్టీ కాదన్నారు. ఎదురెళ్లి ధమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తోందని, కడిగిన ముత్యంలా బొల్లా బయటకు రావటం ఖాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలో సగటున 11 మి.మీ వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 36.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా కొల్లిపర మండలంలో 1.6 మి.మీ వర్షం కురిసింది. సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరంగిపురం మండలంలో 19.2 మి.మీ., పెదకాకాని 16.2, మంగళగిరి 14.8, గుంటూరు పశ్చిమ 14.6, వట్టిచెరుకూరు 12.4, తాడికొండ 11.6, గుంటూరు తూర్పు 11.4, చేబ్రోలు 10.2, తాడేపల్లి 9.2, కాకుమాను 8.2, దుగ్గిరాల 7.4, పెదనందిపాడు 6.2, తెనాలి 5.6, ప్రత్తిపాడు 4.6, పొన్నూరు 4.6, తుళ్లూరు మండలంలో 4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం బంగారు దుకాణాల సముదాయం గంటాలమ్మ చెట్టు ఏరియాలో ఉంటున్న పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా దాస్పూర్ గ్రామ వాసి బవానందదాస్ (72) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తలనొప్పితో బాధపడుతున్న అతను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మధ్యాహ్నాం అతను ఇంటి పైభాగంలోని స్టోర్లో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె రూపాలి దాసు ఫిర్యాదుతో లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే ఎక్ట్స్రా కార్బొరియల్ మోంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఏక్మో) సేవలు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినట్లు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ లోకేష్ గుప్తా తెలిపారు. సోమవారం మణిపాల్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ అమరావతి ప్రాంతం తుళ్లూరుకి చెందిన గుమ్మా వెంకటరావు అత్యంత విషమ పరిస్థితుల్లో మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. రోగికి ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయిందని, వివిధ రకాల పరీక్షల అనంతరం రోగికి హార్డ్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సహాయం, ప్రోన్ పొజిషనింగ్, యాంటీ బయాటిక్స్, అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా మరింత దిగజారిందని వివరించారు. రోగికి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వకపోడంతో ‘ఏక్మో’ సపోర్ట్తో వైద్యం ప్రారంభించారని, తాత్కాలికంగా ఊపిరితిత్తులు పనిని నిర్వహిస్తూ అవి కోలుకొనే సమయాన్ని కల్పించినట్లు తెలిపారు. 27 రోజులు రోగికి ఐసీయూలో చికిత్స అందించామని, చికిత్స సమయంలో భారీగా రక్తస్రావం జరిగిందని, వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపి నిర్వహించామని పేర్కొన్నారు. శ్వాసనాళానికి అడ్డుగా ఉన్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించామని, రెండు వారాల పాటు ఏక్మో సపోర్ట్, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపి వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికి త్స అందించామని వివరించారు. ప్రస్తుతం రోగి స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ దినేష్కుమార్ గొంట్ల, టి.శ్రీనివాస్, దిలీప్ రట్టి, వరుణ్ పమ్మిడి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ... దేవుడితో రాజకీయాలా ?
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కాలనీల్లో వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను నిర్మించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన చర్యలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బ్రాహ్మణ విభాగ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. సోమవారం గుంటూరులోని బృందావన్గార్డెన్స్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై అమితమైన భక్తి, శ్రద్ధలతో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 216 ఆలయాలను పునరుద్ధరించి, పూర్వ వైభవం కల్పించారని చెప్పారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 1,342 శ్రీవారి దేవాలయాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిందన్నారు. వీటిలో తిరుపతి జిల్లాలోనే 135 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయాలకు సంబంధించి యూసీలు లేవనే సాకుతో రూ.147 కోట్లు విడుదల చేయకుండా అడ్డుకుంటోందని, సంబంధిత యూటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దేవదాయ శాఖ సిద్ధంగా ఉన్నా సీఎం చంద్రబాబు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామన్న పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం తగదన్నారు. దేవుడితో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని, ఆలయాల జోలికి రావొ ద్దని హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి భూ ములిచ్చిన రైతులకు దేవదాయ శాఖ భూము లను చదునుచేసి ప్లాట్లుగా ఇచ్చేలా టీడీపీ సర్కారు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు వరుసగా రూ.22 కోట్లు, రూ.23 కోట్లు కేటాయించారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణమాచారి మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్)లో బ్రాహ్మణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఎవరి దగ్గరైనా గంజాయి, డ్రగ్స్ లభ్యమైతే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు సబ్ డివిజన్లోని కొత్తపేట పీఎస్, పాతగుంటూరు పీఎస్, లాలాపేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి నేరస్తులకు సోమవారం బీఆర్ స్టేడియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, గంజాయి కేసుల్లోని నేరస్తులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఏయే పనులకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ నివసిస్తున్నారనే అంశాలపై ఆరాతీశారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూర్పు సబ్ డివిజన్లోని రౌడీషీటర్స్, పాత గంజాయి కేసులున్న 120 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (డిడికె)తో పరీక్షలు నిర్వహించగా అందులో 17 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు వీరయ్య (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాత గుంటూరు పీఎస్), ఎస్ఐలు రెహమాన్ (పాతగుంటూరు పీఎస్), రవి (లాలాపేట పీఎస్) సునీల్ (ఈగల్ ఆర్ఎస్ఐ) పాల్గొన్నారు. -
మెగా కాదు దగా డీఎసీ
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన గుంటూరు వెస్ట్: ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేసే విధంగా మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు జి.సురేంద్ర డిమాండ్ చేసారు. బాధితులతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో దళిత కుటుంబాలకు చెందిన కర్రా బేబి, మేడిద సుధారాణిలకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 140,143 ర్యాంకులు వచ్చాయన్నారు. వీరికి ఉద్యోగం ఇవ్వకుండా క్రీడా కోటా కింద ఇతరులకు ఉద్యోగాలివ్వడమేంటో అర్ధం కావడంలేదన్నారు. ఇద్దరు దళిత యువతులకు ఇక్కడే అన్యా యం జరిగిందన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంత అన్యాయం చేసారో గమనించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కోటాలో 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నారు. ఆ వివరాలు అడిగితే సమాధానం చెప్పడంలేదన్నారు. ప్రశ్నిస్తే దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు డీఎస్సీ ఎంపిక ప్రక్రియ విషయంలో ప్రశ్నించే వారిని దుర్మార్గులుగా చిత్రీకరించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా ఎంపిక తదితర అంశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అనేక మంది అభ్యర్ధులు డీఎస్సీలో ఎంపికవుదామని అహర్నిశలు కష్టపడి చదువుకుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రతి అంశంలో ముందుకు వచ్చే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మాట్లాడడంలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేదిలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న బాధితుల తరపున వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని సురేంద్ర హెచ్చరించారు. అది దగా డీఎస్సీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పెద్ద దగా డీఎస్సీగా వర్ణించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పూర్తి వైఫల్యం చెందారన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ప్రతిభకు ప్రభుత్వం నిలు వునా పాతరేసిందన్నారు. ఎందరో ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు వీరికి ఎవరి చ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల తరపున రాజీలేని పోరాటానికి సిద్ధపడ్డారని ఆయనకు అండగా రాష్ట్ర యువత నిలుస్తుందని చెప్పారు. పార్టీ ఎస్సీ విభాగం పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు జి.ప్రభు, అంకాల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, పార్టీ ఎస్సీ విభాగం నేతలు పున్నారావు, సిహెచ్ కిరణ్, టి.నాని, గేరా సంజీవ్, పి.కవిత, ఆర్.వరలక్ష్మి, పిల్లి మేరి, బత్తుల వెంకట్, జల్ది స్వామినాథన్ పాల్గొన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలి
దుగ్గిరాల: శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం వాగ్దానం మేరకు క్వింటాకు రూ.7వేలు పరిహారం వడ్డీతో సహా చెల్లించాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం దుగ్గిరాలలోని పసుపు యార్డు ముట్టడి కార్యక్రమం సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా యార్డుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పసుపు రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు. ముందుగా యార్డు బయటకు వెళ్లే మార్గంలో బైటాయించారు. రైతులను ఉద్దేశించి శివశంకర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పసుపు ఽక్వింటాకు రూ.13,400 ఉండగా, ప్రభుత్వం రైతులు, వ్యాపారులతో చేసిన ఒప్పందం ప్రకారం రూ.7 వేలు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలు గడిచినా పసుపు రైతులకు పూర్తి పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ నిల్వ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పసుపు దగ్ధం కావడానికి కారణమైన యజమానిని కఠినంగా శిక్షించాలని కోరారు. యార్డు ఇన్చార్జి కార్యదర్శి డి.చిన సుబ్బారావుకి వివతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానిని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వల్లూరి భారతి, గద్దె శ్రీహరి, కాజా వెంకటేశ్వరరావు, జెట్టి బాలరాజు, పి.రవికిషోర్, బి.చిన్న వెంకటరెడ్డి, ఎన్.యోగేశ్వర రావు, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు. -
లోతైన అధ్యయనం చేయాలి
చట్టంలోని నిబంధనలు చేబ్రోలు: కోర్టులో తుది తీర్పు వెలువడే వరకు పక్షాల హక్కులను రక్షించేందుకు ఇంటర్ లాక్యుటరీ అప్లికేషన్స్ కీలక సాధనాలు, న్యాయవాదులు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమర్థవంతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏపీహెచ్ఆర్సీ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరియు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల ‘‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’’ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఏపీహెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య కలిసి ప్రారంభించారు. జస్టిస్ సీతారామమూర్తి మాట్లాడుతూ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ దాఖలు చేసే సమయంలో న్యాయవాదులు చట్టంలోని నిబంధనలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఏఐ యుగానికి న్యాయవాదులు సిద్ధం కావాలి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ నేటి ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం న్యాయవృత్తిపైనా స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు అనుగుణంగా న్యాయవాదులు సిద్ధం కావాలని అన్నారు. భవిష్యత్ న్యాయరంగం, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ నేరాలు, మానవ విలువల ప్రాధాన్యతపై విశదీకరించారు. కృత్రిమ మేధస్సు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, పరిపాలనతో పాటు న్యాయరంగంలోనూ వేగంగా ప్రవేశిస్తోందన్నారు. న్యాయపరమైన పరిశోధనలు, కేసుల విశ్లేషణ, చట్టాల అధ్యయనం, తీర్పుల అన్వేషణ, పత్రాల తయారీ వంటి అనేక అంశాల్లో ఇప్పటికే ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ పనితీరును ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో సాంప్రదాయ నేరాల కంటే సైబర్ నేరాలే పెద్ద సవాలుగా మారనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జీ. ప్రతిభాదేవి, ఏఐఎల్యూ అఖిల భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బెజవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి లక్ష్మీ నారాయణ, ఎం నాగేశ్వరరావు, ఏఐఎల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
చిట్టీల పేరిట మోసగించారు
ఎస్పీకి నివేదించిన బాధితులునగరంపాలెం(గుంటూరు వెస్ట్) : చిట్టీల పేర్లతో మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు.ఆయా సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదిదారుల సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్రావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అంతా మమ.. శుభ్రత భ్రమ! ● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం అధికారుల ప్రయత్నాలు ● ఆప్కాస్ కార్మికులపైనే మొత్తం పని ఒత్తిడి ● 293 మందికిపైగా పర్మినెంట్ వర్కర్లకు మస్టర్ వేసి ఇళ్లకు పంపుతున్న వైనం ● ఇందుకుగాను ప్రతినెలా కార్మికుల నుంచి డబ్బులు వసూలు ● మరికొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులకు పరిమితం ● ఇంకొంతమందికి నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటేషన్ ● అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ సక్రమంగా పనులు చేయించలేని పరిస్థితి నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు రెగ్యులర్, ఇద్దరు ఇన్చార్జి పారిశుద్ధ్య సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులు 293 మంది ఉన్నారు. వీరితోపాటుగా ఆప్కాస్ వర్కర్లు 1897 మంది, అదనపు వర్కర్లు 420 మంది విధులు చేపడుతున్నారు. ఇందులో పనిచేసే పర్మినెంట్ వర్కర్లను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. వీరికి మస్టర్లు వేసి ఇంటికి పంపించాలని శానిటరీ సూపర్వైజర్లే సంబంధిత ఇన్స్పెక్టర్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనికోసం కార్మికుల నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగర పరిధిలో 1,897 మంది ఆప్కాస్ వర్కర్లు ఉంటే వారిలో కూడా రెగ్యులర్గా విధులు నిర్వహించేది 1,500 మందే అని సమాచారం. మిగతా వారంతా డెప్యూటేషన్పై నగరపాలక సంస్థ కార్యాలయంలో, పాఠశాలల్లో, రిజర్వాయర్లలో, పలు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక్కో అధికారి వద్ద వీరు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు శానిటరీ ఇన్స్పెక్టర్ల ఇళ్లల్లో, ఇతర అధికారుల నివాసాల్లో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో నిత్యం 3 లక్షలకుపైగా ఇళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే 470 మెట్రిక్ టన్నుల చెత్తను కేవలం కొంత మంది ఆప్కాస్ వర్కర్లే తరలించాలంటే తలకు మించిన భారంలా మారుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతి డివిజన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అందరూ సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకుతోపాటు నగరవాసులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యఅప్కాస్ వర్కర్లుఅదనపు కార్మికులురోజుకు ఉత్పత్తి అయ్యే చెత్తమొత్తం కార్మికుల సంఖ్యమాట్లాడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎన్.రవీంద్రరెడ్డికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న దృశ్యం 7ఆలయ చైర్మన్ తమ ఆచార వ్యవహారాల్లో కలుగజేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. కంకణధారణ కార్యక్రమాల్లో మా నాన్నమ్మ, అమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు మా అక్క పాల్గొంటుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంకణధారణలను ఇంటిలో తయారు చేసి ఆదివారం ముందు రోజు పూజలో ఉంచి అభిషేకాలు నిర్వహించి భక్తులకు కడతాం. ఇప్పుడు అలాంటి పూజాదికాలు లేకుండా కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి భక్తులకు విక్రయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వ్యాపారం అవుతుంది. మేం చేయలేమని చెప్పడంతో అధికారం ఉందని పేర్కొన్నారు. మమ్మల్ని బయటకు వెళ్లండని బెదిరిస్తున్నారు. – కె.కార్తికేయ, ఆలయ అర్చకుడు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఈ సంస్కృతి మరింత పెచ్చుమీరుతోందనే చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో చెత్త తరలించే భారం అంతా ఆప్కాస్ వర్కర్లపైనే పడుతోంది. అధికారులు చెప్పిన ప్రతి పనిని వారే చేయాల్సి వస్తోంది. అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఏదైనా డివిజన్లో ఆప్కాస్ వర్కర్లు సెలవు పెడితే సదరు డివిజన్కు అదనపు వర్కర్లును పంపించాలంటే శానిటరీ ఇన్స్పెక్టర్లను సంబంధిత సూపర్వైజర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం నగరపాలక సంస్థ పాట్లు పడుతుంటే మరో పక్క పారిశుద్ధ్య సూపర్వైజర్లు కొంత మంది తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పర్మినెంట్ వర్కర్లు ఉన్నప్పటికీ వారికి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నారు. ప్రతిఫలంగా వారి నుంచి ప్రతి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాఽధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిపోయి జేబులు నింపుకొనేందుకు యత్నించడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
అర్చకులపైనా ఆగడాలు
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆలయ అర్చకులపై కూడా అమలు చేస్తున్నారు. ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ అర్చకులపై ఆలయ కమిటీ చైర్మన్ వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే గుడి నుంచి బయటకు వెళ్లాలని అర్చకులకు హుకుం జారీ చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధంగా తాము పనిచేయలేమని చెప్పినందుకు కక్ష సాధిస్తున్నారు. వంశపారంపర్యంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్న కంకణధారణను రద్దు చేయించారు. ఆలయంతో సంబంధం లేని పూజారులతో ఆదివారం కంకణధారణకు అధికారులు, కమిటీ సభ్యులు ప్రయత్నించారు. వారిని ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. దీంతో ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న కంకణధారణలో రద్దీ ఎక్కువగా ఉండే ఆదివారాలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లో అర్చక కుటుంబ సభ్యులు పాల్గొంటారు. దీనిపై కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు పాల్గొనకూడదంటూ తేల్చిచెప్పారు. తమ తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని ఎలా వదలుకుంటామంటూ అర్చకులు కంకణధారణను కొనసాగిస్తున్నారు. దీనిపై కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆలయంలో కంకణధాణను రద్దు చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వీవీఎస్కే ప్రసాద్ ఈనెల 2వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. ఇరువర్గాల వాగ్వాదం ఆదివారం ఉదయం ఆలయ ఈవో నలబోతు మాధవీదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూడి చంద్రశేఖర్లు ప్రైవేటు అర్చకులతో కంకణధారణ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజాదికాలు నిర్వహించాలని అర్చకులను కోరారు. దీనికి అర్చకస్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారికి నివేదనతో పూజాదికాలు నిర్వహించిన అనంతరమే కంకణాలను ఇస్తామని స్పష్టంచేశారు. భక్తుల నమ్మకాలతో వ్యాపారం చేయలేమని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన కంకణాలనే భక్తులకు అందిస్తామని తేల్చిచెప్పారు. కంకణాలకు పూజలు జరిపేందుకు ప్రైవేటు అర్చకుడిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించారు. దీనిని ఆలయ అర్చకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్వ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆలయ అర్చకులకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇస్సపాలెం ఆలయ అర్చకులకు టీడీపీ నేతల వేధింపులు తాజాగా కంకణధారణ రద్దు చేయించిన నాయకులు ప్రైవేటు అర్చకులతో నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు అడ్డుకున్న ఆలయ అర్చకులు... ఆలయంలో ఉద్రిక్తత -
మద్యం మత్తులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: మద్యం మత్తులో ఈతకు వెళ్లి వాచ్మెన్ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మధుపవన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామలానగర్ సీతమ్మకాలనీ సమీపంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న బొబ్బుల ప్రసాద్ (35) అదే కాలనీలో పలు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న తన స్నేహితులైన బొడ్డుపల్లి బ్రహ్మయ్య, మరో ఇద్దరుతో కలిసి ఆదివారం మద్యం సేవించేందుకు వెంగళాయపాలెం సమీపంలోని కాలువ వద్దకు చేరారు. మద్యం సేంచి సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లారు. అనంతరం నలుగురు మరలా మద్యం సేవించేందుకు పక్కనే ఉన్న ఫ్లాట్లులోకి వెళ్ళారు. మిగిలిన ముగ్గురు మద్యం సేవిస్తుండగా ప్రసాద్ తాను మద్యం సేవించనని ఈతకొడుతూ ఉంటాను మీరు రండి అంటూ మరలా కాలువలో ఈతకు దిగాడు. మద్యం సేవించిన మిగిలిన ముగ్గురు కాలువ వద్దకు చేరి చూడగా ప్రసాద్ కనిపించలేదు. చుట్టు చూసి కాలువలో వెతకగా కొంతదూరంలో ప్రసాద్ మృతదేహం కాలువలో కనిపించింది. దీంతో ముగ్గురు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అమ్మబాబోయ్.. రాజధాని లారీలు
తాడికొండ: రాజధానికి మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను తాడికొండలో గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రిళ్లు అధిక వేగంతో వస్తున్న లారీ మలుపు వద్ద యువకుడిని ఢీకొట్టబోవడంతో అప్రమత్తమైన అతను త్రుటిలో తప్పుకున్నాడు. గతంలో సైతం గ్రామంలో అధిక వేగంతో వెళుతున్న లారీల కారణంగా ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగిన నేపధ్యంలో స్థానిక ట్యూబ్లైట్ సెంటర్లో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద యువకులు రోడ్డుపై లారీలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. రాజధానికి వెళ్లే పలు లారీలు బారులు తీరి నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులతో చర్చించగా గ్రామంలో లారీలు అధిక వేగంతో వెళుతున్న కారణంగా పడుతున్న ఇబ్బందులు తెలియజేశారు. పేరేచర్ల ప్రాంతం నుంచి రాజధాని నిర్మాణాలకు వెళ్ళే కంకర, ఫ్లైయాష్తో వెళ్లే లారీలతో పాటు ఇతర సామగ్రి రవాణా లారీలు, రాజధాని నుంచి అక్రమంగా తరలిస్తున్న నల్లమట్టి, ఇసుక లారీలు రోడ్లపై నిత్యం హోరెత్తిస్తున్నాయని, అధిక శబ్ధంతో కూడిన వాహనాలు అధిక వేగం కారణంగా రోడ్డుపై నడవాలంటే భయందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెరిగిన రద్దీ దృష్ట్యా లారీలు, ఇతర రాజధాని వాహనాల రవాణా కోసం గ్రామ శివారు నుంచి బైపాస్ రహదారి నిర్మించిలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తాడికొండ పోలీస్ స్టేషన్లో మితిమీరిన వేగంతో వస్తున్న లారీలపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతానికి మట్టి, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి తరలిస్తూ అధిక వేగంతో వెళ్తున్న లారీలు ప్రమాదాలబారిన ప్రజలు తాడికొండలో లారీలను ఆపి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన పోలీసులు -
మోటరోలా సొల్యూషన్స్ ఎండీ, కంట్రీ హెడ్గా అనుదీప్
తెనాలి: మోటరోలా సొల్యూషన్స్లో ఆర్నెల్ల క్రితం అతి పిన్నవయసులోనే సీనియర్ డైరెక్టర్గా ఎదిగి, భారత ప్రభుత్వంచే ‘యూత్ ఐకాన్–2025’ గౌరవాన్ని స్వీకరించిన ముత్తవరపు అనుదీప్ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందారు. తన కార్యస్థానం అమెరికా నుంచి బెంగళూరుకు మారింది. దేశం అంతటా కంపెనీ ఉనికిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తారు. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ చేశాడు. అమెరికాలోనే డల్లాస్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో టెలీకమ్యూనికేషన్స్లో మరో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశాడు. తదుపరి ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కాలేజిల్లో ఒకటిగా, అమెరికాలో సెకండ్ ర్యాంకులో ఉన్న నార్త్వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్ూచ్యన్ 500 కంపెనీల్లో ఒకటైన మోటారోలాలో అతి పిన్నవయస్కుడైన సీనియర్ డైరెక్టర్గా ఎదిగిన అనుదీప్, ఇప్పుడు అదే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, కంట్రీ హెడ్, ఇండియాగా పదోన్నతిని పొందటం విశేషం. -
సెన్సారు బోర్డు సభ్యురాలిగా యార్లగడ్డ శైలజ
తెనాలి: దూరదర్శన్ విశ్రాంత డెప్యూటీ డైరెక్టర్ (ప్రోగ్రామ్స్) యార్లగడ్డ శైలజ కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సెంట్రల్బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యురాలిగా, హైదరాబాద్ రీజియన్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు పనిచేస్తారు. సొంతూరు రూరల్ మండలం గుడివాడ యార్లగడ్డ శైలజ సొంతూరు తెనాలి రూరల్ మండల గ్రామం గుడివాడ. తల్లిదండ్రులు పిన్నక వెంకటేశ్వరరావు తెలుగు పండితులు. అమ్మ చారుమతి హార్మోనియం ప్లేయర్. తెనాలిలో బీఎస్సీ, భీమవరంలో ఎంఏ (తెలుగు) చదివాక, మీడియాపై ఆసక్తితో 1984లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో టెలివిజన్ ప్రోగ్రాం ప్రొడక్షన్ కోర్సు చేశారు. అనంతరం హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా ఉద్యోగజీవితం ఆరంభించారు. 1990–99 వరకు కర్ణాటకలోని గుల్బర్గా దూరదర్శన్లో పనిచేశారు. అక్కడ్నుంచి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పదోన్నతిపై విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి బదిలీపై వచ్చారు. 2005లో మళ్లీ పదోన్నతిపై డెప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్కు వెళ్లారు. అక్కడే 2015లో రిటైరయ్యారు. విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన దూరదర్శన్లో విభిన్న కార్యక్రమాలు, డాక్యుమెంటరీల రూపకల్పన చేశారు. 1992–93లో ఉత్తమ టీవీ ప్రొడ్యూసర్గా ఈసీటీవీ అవార్డు అందుకున్నారు. ‘పెంబర్తి కళారూపాలు’పై చేసిన డాక్యుమెంటరీకి 1994లో రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు దక్కింది. శైలజ రూపొందించిన ‘మనసంటూ ఉంటే’ ఉత్తమ మహిళా కార్యక్రమంగా 2001లో దూరదర్శన్ జాతీయ అవార్డు లభించింది. కలంకారి కళపై తీసిన డాక్యుమెంటరీకి కూడా అదే ఏడాది దూరదర్శన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. వరించిన బంగారు నంది క్లిష్టమైన శాసీ్త్రయ నాట్యాన్ని సాధారణ ప్రజలకు కూడా అర్థమయేలా 2005లో ‘మువ్వల సవ్వడి’ని రూపొందించారు. వంద ఎపిసోడ్లుగా ప్రసారం చేసిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపుతోపాటు 2007లో బంగారు నందిని అందుకున్నారు. ఇందులోనే రిలేటివ్ స్పెషల్, తర్వాత 15 ఏళ్ల బాలల కోసం ‘చిరుమువ్వల సవ్వడి’ని రూపొందించి మరో వంద ఎపిసోడ్లను ప్రసారం చేశారు. ఈ పరంపరంలోనే ‘గానగంధర్వం’ మరో యాభై ఎపిసోడ్లు వచ్చింది. రైతుల కోసం ‘రైతే రాజు’, ‘గామదర్శిని’ తీసుకొచ్చారు. ప్రసారభారతి ప్రారంభించిన ‘ఇండియా ఇన్నోవేషన్స్’లో భాగంగా చింతకింది మల్లేశం, బొమ్మగాని మల్లేష్ వంటి సృజనకారుల్ని పరిచయం చేశారు. రిటైరయ్యాక 2016 నుంచి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఓ విభాగానికి అధిపతిగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా మరో బాధ్యతల్లోకి వచ్చారు. -
మహిళా అభ్యర్థులకు పరీక్షలు
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీ సెట్–2026కు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. పోటీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి ప్రారంభించారు. 680 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 470 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. ఏపీ పీ సెట్ 2026 పరీక్షల్లో చివరి రోజు సోమవారం హాల్ టికెట్ నంబరు 30681 నుంచి 31179 వరకూ మొత్తం 499 మంది మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సందేశాత్మకంగా సాగిన నాటికలు
తెనాలి: స్థానిక డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ● తొలిగా కళాహారతి, తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించారు. ఆన్లైన్ యాప్ల రుణాల ఉచ్చులో చిక్కుకుంటే జీవితాలే నాశనమవుతున్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఉమా రచనకు ‘నాట్యాచార్య’ ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో కుమార్బాబు, రచయిత డి.ఉమాశంకర్, దర్శకుడు ఎంవీ రమణ, డి.వినయ్, ఎం.సౌమ్య నటించారు. సంగీతం సింహాద్రిపురం రమణ, బాషా అందించారు. ● అనంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటికను ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత స్నిగ్ధ రచనకు టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. ● చివరిగా ఆరాధన ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు ఈ నాటికను రచించగా నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ● ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం–తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలను నిర్వహించారు. అధ్యక్షులు ఆరాధ్యుల కన్న, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. -
సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి
మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్ జాతీయ కన్వీనర్ ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. మంగళగిరి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సెక్యూరిటీ గార్డ్స్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సాయిబాబా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యవసాయ కార్మికుల తర్వాత కోటిమందికి పైగా సెక్యూరిటీ గార్డ్స్గా పని చేస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వ రంగంలో సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రెగ్యులైజేషన్ ఉద్యోగులుగా కూడా పనిచేశారని, ప్రస్తుతం సెక్యూరిటీ రంగం మొత్తం ప్రైవేటుపరం అయిందన్నారు. ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టుకోవడం జరుగుతుందని, దీనివలన ఏజెన్సీ నిర్వాహకులు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో కనీస వేతన చట్టం చేయడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలైనా కనీస వేతన చట్టం సవరణ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంస్థలలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ఆయా ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.893 ల నుంచి 1065 వరకు వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాలని, ఈఎస్ఐ కార్డులను సెక్యూరిటీ గార్డులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సెక్యూరిటీ గార్డులకు చట్టపరమైన భద్రత కల్పించాలని అన్నారు. ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో యూనియన్ రాష్ట్ర గౌరవ అధక్షుడు ముజఫర్ అహ్మద్, సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, మంగళగిరి ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ కార్యదర్శి కె.బుజ్జిబాబు, సీఐటీయూ సీనియర్ నాయకుడు జేవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
నగరంపాలెం: వాహనాల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని జిల్లా ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై జిల్లా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బీవీ నారాయణ ప్రారంభించారు. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు సాగింది. అక్కడి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ సైక్లింగ్ను ప్రోత్సహించాలని అన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని తెలిపారు. ర్యాలీలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర స్థాయి సిలంబం సబ్ జూనియర్, సీనియర్ చాంపియన్షిప్ విజేతగా గుంటూరు జిల్లా నిలిచింది. స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ ఆదివారం ప్రారంభించారు. సిలంబం స్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ పోటీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ప్రథమ స్థానంలో గుంటూరు జిల్లా, ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచాయన్నారు. అనంతరం విజేతలకు అఫ్రోజ్ ఖాన్తోపాటు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ. అశోక్బాబు, క్రిస్టఫర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోచ్లు కాశీనాథ్రెడ్డి, సీహెచ్ శ్రీరామ్, ఎం.శ్రీనివాసరావు, కె.కిరణ్, వెంకటసాయి, నాంచారయ్య, నవీన్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని తన కుటుంబ సభ్యులు నలుగురిని కిందకు దించారు. క్షణాల్లో కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపుచేశారు. అరగంటపాటు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాతూరు రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు. తెనాలిరూరల్: ఉరి వేసుకుని తాపీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేటకు చెందిన పఠాన్ చాన్బాషా(37) తాపీ పనులకు వెళుతుంటాడు. మద్యం తాగి వచ్చి తరచూ భార్య, పిల్లలతో ఘర్షణ పడి కొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వచ్చి ఘర్షణ పడుతుండడంతో భార్య పక్క ఇంటికి వెళ్లింది. గదిలోకి వెళ్లిన అతను నైలాన్ తాడుతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్తె కిటికీలో నుంచి చూసి చుట్టుపక్కల వారికి చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని దింపి, వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సింగ్ ఉద్యోగాల మెరిట్లిస్టు రివైజ్ చేస్తాం
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్నర్సు ఉద్యోగానికి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్హెచ్సీ, సీహెచ్ఓ, యూపీహెచ్సీలో చేసిన స్టాఫ్నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్, రెసిడెన్షియల్ కాలేజ్ స్టాఫ్కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు. -
అలా అమిర్చికున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మనోడైతే చాలు ఎటువంటి నిబంధనలు, టెండర్లు వంటి ఏ ప్రక్రియ అవసరం లేదు. ఒక జీఓ ఇచ్చేయడమే... ప్రభుత్వ స్థలాన్ని ధారాదత్తం చేసేస్తారు. పైగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి చినబాబుకి దగ్గరైతే ఇంక అడ్డేముంది. మంగళగిరికి చెందిన తెలుగుదేశం నాయకుడు పోతినేని శ్రీనివాసరావుతో పాటు పోతినేని సుబ్బారావుకు గుంటూరు మిర్చియార్డులో అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం 70 సెంట్ల స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ఇటీవల జీఓ జారీ అయ్యింది. మంగళగిరి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న పోతినేని శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్కు అన్ని తానై వ్యవహరించారు. ఇప్పటికి కూడా మంగళగిరిలో అన్ని వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతుంటారు. దీంతో దానికి రుణం తీర్చుకోవడం కోసమే రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా పోతినేని శ్రీనివాసరావుకు కట్టబెట్టేశారు. రైతులకు ప్రయోజనం శూన్యం మిర్చియార్డులో ఇప్పటికే ఒక కోల్డ్స్టోరేజీ ఉంది. గతంలో దీన్ని కూడా 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనివల్ల మిర్చియార్డుకు వస్తున్న ఆదాయం నామమాత్రమే. అయితే రైతులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఇప్పుడు దీనికి కూడా లీజు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.వేల కోట్ల వ్యాపారం జరిగే మిర్చియార్డులో ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రైతులకు కూడా తక్కువ ధరకు తమ మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రైవేటు వారికి, ముఖ్యంగా తమ అనుచరులకు కట్టబెట్టుకుంటూ పోతే దీని వల్ల రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన తర్వాత ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగే పనికాదు. ఆగమేఘాలపై జీఓ.. 2018లో ప్రభుత్వం తరపున కోల్డ్స్టోరేజీ నిర్మాణం కోసం పనులు చేపట్టారు. అయితే అవి పిల్లర్ల వరకూ వచ్చి వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిపోయింది. ప్రస్తుతం అదే స్థానంలో కొత్తగా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రైవేటువారికి కట్టబెట్టారు. కొత్తగా కోల్డ్స్టోరేజీ కేటాయించాలంటే కనీసం టెండర్లు పిలవడం కాని, పాలకవర్గం ఆమోదించడం గాని జరగాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఏకంగా ప్రభుత్వం నుంచి ఫలానా వారికి మిర్చియార్డులో 70 సెంట్ల స్థలం కేటాయిస్తున్నట్లు జీఓ ఇచ్చేయడం గమనార్హం. 1995లోని మార్కెటింగ్ శాఖ జీవో 448, 1999లోని జీఓ 280 ప్రకారం నియమనిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కనీసం ఫలానావారు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కేటాయించాలని కోరుతూ తీర్మానాలు కూడా ఏమీ లేకుండానే కేవలం లోకేష్ ముఖ్యఅనుచరుడు కావడంతో కేటాయించడాన్ని వ్యాపారులు తప్పు పడుతున్నారు. -
ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026 విజేత ‘హంగ్రీ చీతాస్’
గుంటూరు మెడికల్: ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డాక్టర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, ఎంఎస్కే క్రికెట్ గ్రౌండ్స్లలో నిర్వహించిన ‘ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026’ టీ–20 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. పది టీములు డే అండ్ నైట్ మ్యాచ్లో పాల్గొనగా హంగ్రీ చీతాస్ గుంటూరు టీం విన్నర్స్గా నిలిచి రూ.లక్ష నగదు రోలింగ్ షీల్డ్, వైజాగ్ మార్వెల్ ఫిజియో క్రికెట్ క్లబ్ రన్నర్స్గా రన్నర్స్ షీల్డ్ రూ.50 వేల నగదు పారితోషికం అందుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ రవితేజ మాట్లాడుతూ క్రీడలు దేశభక్తి, జాతీయ సమైక్యత, విశాలమైన ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండాలన్నారు. ఆంధ్ర ఫిజియోస్ క్లబ్ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.నాగ సతీష్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ టోర్నమెంట్స్ విజయవంతం కావటంలో స్పోర్ట్స్ క్లబ్ కమిటీ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిత్వేద లైఫ్ సైన్సెస్ సీఈఓ, విన్నర్స్ ప్రైస్ షీల్డ్ స్పాన్సర్ ముప్పరాజు వెంకట్రావు, తులసి సర్జికల్స్ అధినేత సంజీవ్ కుమార్, క్లబ్ గౌరవ సలహాదారు పొందూరి శివరాం ప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ విజయ సాగర్ సంయుక్త కార్య దర్శులు డాక్టర్ బాజీ, డాక్టర్ నాగేంద్ర బాబు, సభ్యులు డాక్టర్ కిరణ్ డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకంగా కొనసాగిన టీ–20 క్రికెట్ పోటీలు క్రీడల ద్వారా స్నేహభావం, దేశభక్తి, జాతి సమైక్యత పెంపొందాలి శ్రీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ యార్లగడ్డ రవితేజ -
బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ గుంటూరు వెస్ట్: బాలింతల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ శాఖలు సంయుక్త బాధ్యత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలవుతున్న చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బాలింతలకు అవసరమైన వైద్యాన్ని ప్రతినెలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సరైన పోషకాహారాన్ని అందించటం, వారికి ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ ఉన్న సందర్భాలలో జాప్య నివారణకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలన్నారు. గృహ హింస జరిగిన కేసుల్లోని బాధితులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించాలన్నారు. సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా బడి ఈడు పిల్లలు ప్రవర్తన గురించి ఉపాధ్యాయులు గమనించాలన్నారు. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులు ప్రవర్తన గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిషేధం గురించి కాలేజీ స్థాయిలోనే సంపూర్ణ అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసూన, డీసీపీఓ విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సవాలక్ష నిబంధనలుతెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్ ధర రూ.2,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: సంగీతం భక్తిభావంతోపాటు సాధకుడి ఆయుర్దాయాన్ని పెంచుతుందని ప్రముఖ నాదస్వర విద్వాంసుడు ‘నాదసుధార్ణవ’ అన్నవరపు రామస్వామి అన్నారు. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవాన్ని శనివారం సాయంత్రం బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాధశర్మ అధ్యక్షత వహించారు. గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ వయొలిన్ విద్వాంసులు డీవీకే వాసుదేవన్, ఫ్లూట్ విద్వాంసులు డి.ఫణికుమార్ (దేవన్ద్రోణ్ ద్వయం)కు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథి రామస్వామి మాట్లాడుతూ గద్దె రామకుమారి గొప్ప సంగీత గురువుగా చెప్పారు. ఏటా ఆమె వర్ధంతిని తెనాలిలో వైభవంగా నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ, సంగీతంలో తనదైన ఒరవడిని సృష్టించుకున్న రామస్వామి కొత్త రాగాలు, తాళాలను రూపకల్పన చేశారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు పాల్గొంటారు. వినూత్న వాద్య ద్వయం దేవన్ ద్రోణ్ల సంగీత సేవను అభినందించారు. సభానంతరం సభానంతరం డి.ఫణికుమార్ వేణువుపై, డీవీకే వాసుదేవన్ వయోలిన్పై సంగీత కచేరీ కొనసాగింది. వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి. – కంచుమాటి అజయ్కుమార్, ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్షుడు, గుంటూరుకొరిటెపాడు(గుంటూరు): యంత్రాల సబ్సిడీ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. నిబంధనల పేరుతో రైతులకు రాయితీ యంత్రాలను దూరం చేస్తోంది. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ గొప్పలు పలికిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సబ్సిడీ యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే రైతుల మెడపై నిబంధనల కత్తి వేలాడదీస్తూ మరోసారి కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు 849 పరికరాలు మంజూరు పంటకోత, నూర్పిడి పరికరాలు 11, మొక్కల సంరక్షణ పరికరాలు 560, పంట కోత అనంతరం ప్రాసెసింగ్, విలువ జోడించు యంత్రాలు 12, పవర్ ట్రిల్లర్స్ 40, పశుగ్రాసం కట్టకట్టే పరికరాలు 40, స్వీయ చోదక యంత్రాలు 67, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 9, ట్రాక్టర్ పవర్ టిల్లర్ నడిచే పరికరాలు 81, ట్రాక్టర్లు 29 కలిపి మొత్తం 849 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.3.39 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పినవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అవన్నీ టీడీపీ వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పథకం ఏదైనా పచ్చ చొక్కాలకే వెళ్తున్నాయి. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిబంధనల శరాఘాతం.. చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలు పొందేందుకు పలు నిబంధనలు విధించి సామాన్య రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. మూడేళ్లలో మూడు సార్లు ఈ–పంట నమోదు చేసి ఉండాలన్న నిబంధన విధించడం చాలామంది రైతులకు శరాఘాతంలా మారింది. ఒకవేళ అర్హత సాధించినా లాటరీలో అదృష్టం వరించాలి. ఆపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతోనే జాబితా తయారవుతుంది. ట్రాక్టర్ మంజూరై డిపాజిట్లు మొత్తం ముందే చెల్లించినా సబ్సిడీ మాత్రం జూలైలో అందజేస్తామని పేర్కొనడం గమనార్హం. ఇన్చార్జ్ మంత్రి ఆమోదం ఉంటేనే..! నిబంధనల పేరిట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులకు దూరం చేయనుందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా మూడేళ్ల పాటు ఈ–క్రాప్ నమోదు కలిగి ఉండాలి, కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 4,13,604 ఎకరాల్లో రైతులు ఈ–క్రాప్ కలిగి ఉన్నారు. సన్న చిన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగున్నా.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎంపిక చేయనున్నారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. లాటరీలో టీడీపీకి చెందని వారి పేరు వస్తే వారికి యంత్ర పరికరాలను అందించేందుకు ఇన్చార్జ్ మంత్రి ఆమోద ముద్ర వేస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాదని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి యంత్రాల పంపిణీ కలగానే మిగలనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమృద్ధి కేంద్రం ప్రారంభించిన పెమ్మసాని9మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ప్రతి ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పరికరాలను పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్ పనిముట్లు, రోటో వేటర్, స్పేయర్లు అందజేశారు. రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కూటమి పాలనలో అర్హులకు యంత్ర పరికరాలు అందుతాయనే నమ్మకం కలగడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి. –తియ్యగూర పేరిరెడ్డి, వట్టిచెరుకూరు మండలం, రైతు, గారపాడు -
నేడు శివాలయం తలుపులు మూసివేత
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
పక్కాగా జిల్లా ఎగుమతుల ప్రణాళిక
గుంటూరు వెస్ట్: జిల్లా ఎగుమతుల ప్రణాళిక పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక, బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలను తయారు చేయాలని సూచించారు. తద్వారా విలువ ఆధారిత పెరుగుతుందని, తలసరి ఆదాయంలో వృద్ధి వస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కోసం ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలో అనవసర ప్రక్రియ అనే విధానాన్ని ప్రభుత్వం తొలగించి మరింత సులభతరం, వేగవంతం చేసిందని వివరించారు. కనీస తనిఖీలు విధానంలో ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమం అనంతరం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఆర్జీలు స్వీకరించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పాలసీ కింద 1,848 దరఖాస్తులు అందాయని, అందులో 1,827 నిర్ణీత గడువులోగా పరిష్కరించామని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో చేపట్టిన వివరాలు తెలిపారు. ఇ కామర్స్పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసినవారికి రూ.83 లక్షల ప్రోత్సాహకాలను కమిటీ ఆమోదించింది. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్రపాల్రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, వివిధ ఆర్థిక సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ -
ఆహార భద్రతపై అవగాహన ఉండాలి
గుంటూరు లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, నాలుగో అదనపు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) సి.రమణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించటం అనారోగ్యాలను గుర్తించటమని, మనం తినే ఆహారం ఎటువంటి కలుషితం కాకుండా సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్. రాజీవ్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల వలన మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి.నరసింహుడు, గవర్నమెంట్ ప్లీడర్ ఎం.సురేష్ బాబు, సి.డబ్ల్యూ.సి. శాఖ శ్రీవాణి, డిస్ట్రిక్ట్ సప్లయి ఆఫీసర్ కోమలి పద్మ పాల్గొన్నారు. -
నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజులపాటు నిర్వహించనున్న పోటీల బ్రోచర్ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. నాలుగురోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల్నుంచి 10.30 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సభాధ్యక్షులుగా అజో విభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు, నటుడు ఎన్.రవీంద్రరెడ్డికి ప్రదానం చేయనున్నారు. తొలిరోజున ఆరు గంటలకు కళాహారతి తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించనున్నారు. ఉమా రచించిన ఈ నాటికకు నాట్యాచార్య ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. సభానంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 9.15 గంటలకు ఆరాధనా ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శిస్తారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ్, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు జి.వేణుగోపాలరెడ్డి, అక్కిదాసు కిరణ్కుమార్, మైలా విజయ్నాయుడు, చుక్కా ఆనంద్ పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం (ఏపీ ఏఓ) గుంటూరు, పల్నాడు జిల్లాల సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం గుంటూరు కిమ్స్– శిఖర హాస్పిటల్లో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి వ్యక్తికి 26 అంశాలలో పరీక్షలు నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 150 మంది సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.బాల భాస్కర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి.ప్రవీణ్, ట్రెజరర్ డాక్టర్ బి.మురళి కిశోర్, సెక్రటరీ డాక్టర్ కె.అమల కుమారి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. రూ.ఏడు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరణ నాదెండ్ల: నాదెండ్ల పోలీస్స్టేషన్లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్ఐలు ఆర్.వెంకటేశ్వరరావు, అనిల్కుమార్, శివరామకృష్ణ సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారంపై అంకితభావం ఉండాలన్నారు. -
రేపు లలిత పీవీఎస్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా లలితనగర్లోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జూన్ 8న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిమక్కల విజయ తెలిపారు. మెదడు కణితుల లక్షణాలు, ట్యూమర్ పరిమాణం, రకం, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయని, తరచూగా తలనొప్పి, మూర్చ రావడం, ఉదయం వేళల్లో వికారం, వాంతులు, చూపు మందగించడం, చేతులు, కాళ్లల్లో బలహీనత, మాట్లాడడంలో ఇబ్బంది, జ్ఞాపక శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, వినికిడి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అత్యాధునిక న్యూరో ఇమేజింగ్, ఇమేజ్ గైడెడ్, మినిమల్లి ఇన్వేసీవ్, న్యూరో సర్జరీ, న్యూరో నావిగేషన్, ఇంట్రా ఆపరేటీవ్ ఎమ్మారై, ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీలో నేడు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన పెంపొందించుకుని వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రివెంటీవ్ మెడిసిన్లో భాగంగా తమ హాస్పిటల్లో నిర్వహించే అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. -
టెక్స్టైల్ పరిశ్రమకు అండగా ఉంటా
కొరిటెపాడు(గుంటూరు): టెక్స్టైల్ పరిశ్రమకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. టెక్స్టైల్ రంగంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసోసియేషన్ నాయకులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల సబ్సిడీని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న రూ.50 కోట్ల క్లెయిములను త్వరలో విడుదలయ్యేలా చేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. టెక్స్టైల్ పరిశ్రమను పరిశ్రమల శాఖ పరిధిలోకి బదిలీ అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. పత్తి కొనుగోలు, సీసీఐ, విద్యుత్ సమస్యలపై లోతుగా చర్చించామని, పరిశ్రమకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారం చిరస్మరణీయమని, భవిష్యత్లోనూ ఆయన మార్గదర్శకత్వం కావాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ను అసోసియేషన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కోటి రావు, సత్యనారాయణ, వీర నారాయణ, బ్రహ్మానందం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
గుంటూరు మెడికల్: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి తన ఛాంబర్ నుంచి ప్రోగ్రామ్ అధికారులకు, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 8 నుండి నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమం గురించి వివరించారు. ఈనెల 8న గ్రామ/వార్డు స్థాయిలో ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎంల ద్వారా ఫ్రీ పీఎంఎస్ఎంఏను, 9న వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులతో ఆరోగ్య కేంద్రాలలో, 10న ఎక్సెండెడ్ పీఎంఎస్ఎంఏను సీ్త్ర శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల సహకారంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. 8వ తేదీ ఉండవల్లి, 13వ తేదీ మంగళగిరిలో నిర్వహించే యోగా కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు నెల చివరి వరకు పొడిగించిన హెచ్పీవీ టీకా కార్యక్రమం లక్ష్యాల్లో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని, ఈనెల నుంచి జరిగే స్టాప్ డయేరియా కార్యక్రమం కోసం తగిన ప్రణాళికలను సిద్ధం చేసికొని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సుబ్బరాయణం, అధికారులు పాల్గొన్నారు. -
నేడు ‘దేవన్ ద్రోణ్’ వినూత్న కచేరి
‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారంతెనాలి: పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవంలో భాగంగా ఈనెల 6వ తేదీన తెనాలిలో శాసీ్త్రయ సంగీత సభ నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 6.15 గంటలకు బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ విద్వాంసులు డీవీకే వాసుదేవన్, డి.ఫణికుమార్(దేవన్ద్రోణ్)కు ప్రదానం చేయనున్నారు. వినూత్న వాద్య ద్వయం... తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక సంగీతం, ఫ్యూషన్ సంగీతం, సంగీత విద్యలో రెండున్నర దశాబ్దాలుగా విశిష్ట సేవలను అందిస్తున్న వయోలిన్, వేణువు ద్వయం ‘దేవన్ ద్రోణ్’. విజయవాడకు చెందిన డాక్టర్ వయోలిన్ వాసుదేవన్, మచిలీపట్నం ఫ్లూట్ విద్వాంసుడు ద్రోణేంద్ర ఫణికుమార్ ఈ ప్రత్యేక సంగీత ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ‘నాదసుధానిధి’ డాక్టర్ అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను అభ్యసించిన వీరు, సంగీత చరిత్రలో తొలిసారిగా వయోలిన్–ఫ్లూట్ ద్వయాన్ని సంగీతాభిమానులను రంజింపజేసే స్థాయికి తీసుకొచ్చారు. డాక్టర్ వాసుదేవన్ ఐఐటీ విజిటింగ్ ఫ్యాకల్టీగానూ.. డాక్టర్ వాసుదేవన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వయోలిన్ విద్వాంసుడు, పరిశోధకుడు, విద్యావేత్త, సంగీతంలో పీహెచ్డీతోపాటు భారతీయ సంగీతం, సమాచార సాంకేతికతలో ఉన్నతవిద్యను అభ్యసించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సంగీత అధ్యాపకునిగా సేవలందించారు. ప్రస్తుతం ఐఐటీ, ఐఐఐటీ వంటి విద్యాసంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. సంగీత విద్య, పరిశోధన, సంస్కృతి పరిరక్షణ రంగాల్లో విశేష సేవలను అందిస్తూ, పలు పుస్తకాలను రచించారు. సంస్కృతి ఫౌండేషన్తో వేలాదిమందికి సంగీత శిక్షణ, సాంస్కృతిక అవగాహనను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫణికుమార్ ‘ఫ్లూట్ ఫణి’గా గుర్తింపు పొందిన ద్రోణేంద్ర ఫణికుమార్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీరు. సంగీతాన్ని జీవన సాధనంగా స్వీకరించారు. బాల్యం నుండే సంగీతాభ్యాసం ప్రారంభించి, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. ‘ఘంటసాల పురస్కారం’, ‘బెస్ట్ యంగ్ టాలెంటెడ్ మ్యూజీషియన్’ గౌరవాలను అందుకున్నారు. ‘లెర్న్ ఫ్లూట్ బై యువర్సెల్ఫ్’ అనే శిక్షణ కార్యక్రమం, ‘నాదయోగ’ ఆల్బమ్తో సంగీతాన్ని విద్య, ధ్యానం, వ్యక్తిత్వ వికాసంతో అనుసంధానించారు. ‘సిరాజ్’ సంస్థతో కర్ణాటక సంగీత ప్రచారానికి కృషిచేశారు. ఈ ఇద్దరు సంగీత విద్వాంసులు కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీత అంశాలను సమన్వయపరుస్తూ వయొలిన్, ఫ్లూట్, కీబోర్డు, ఘటం వంటి వాద్యాలతో వినూత్న సంగీతానుభూతిని అందిస్తున్నారు. పండితులతో సహా సాధారణ ప్రజల ఆదరణ పొందుతున్నారు. శాసీ్త్రయ సంగీతానికి భంగం కలగకుండా ఆధునిక శైలిలో ప్రజలకు చేరువవుతున్నాయి వీరి ప్రదర్శనలు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఫ్రాన్స్, యూరప్ దేశాల్లోనూ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్, నమస్తే ఫ్రాన్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా, తెలుగు కల్చరల్ ఫెస్టివల్స్, లివింగ్ హెరిటేజ్ ఫెస్టివల్, నాదనీరాజనం వంటి ప్రముఖ వేదికలపై తెలుగు సంగీత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రశాంతి నిలయం, కంచి మఠం, శివానంద ఆశ్రమం వంటి ఆధ్యాత్మిక వేదికల్లోనూ వీరి సంగీతం విశేష ఆదరణ పొందింది. స్వయంకృషితో ఎదిగి ‘దేవన్ ద్రోణ్’ పేరుతో తెలుగు సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంగీత ద్వయం, తెలుగు సంస్కృతి, సంగీత వైభవాన్ని ప్రపంచ వేదికలపై చాటుతున్న ఈ కళాకారులు స్ఫూర్తిప్రదాతలు. తొలిసారిగా వీరు తమ వినూత్న వాద్య కచేరీని తెనాలి ప్రేక్షకులకు పరిచయం చేయనుండటం విశేషం! సభానంతరం ఏడు గంటలకు వినూత్న వాయిద్య ద్వయం డి.ఫణికుమార్ వేణువుపై, డి.వాసుదేవన్ వయోలిన్పై సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ నాదస్వర విద్వాంసులు, పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ అన్నవరపు రామస్వామి, శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు పాల్గొంటారు. అనంతరం సంగీత సభను నిర్వహిస్తారు. మృదంగంపై కె.అరవింద్, ఘటంపై ఎం.హరిబాబు వాయిద్య సహకారం అందిస్తారు. డీవీకే వాసుదేవన్డి.ఫణికుమార్ -
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత
తాడికొండ: పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. తుళ్లూరు మండలం ఐనవోలులోని విట్– ఏపీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలకు శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ విద్యుత్ వాహనాలు, సైకిళ్ల వినియోగం పెంచడంతోపాటు మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. సచివాలయం నుంచి ఆమె ఎలక్ట్రిక్ బైక్పై ప్రయాణించి విట్కు చేరుకొని పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న నిబద్ధతను చాటారు. కార్యక్రమంలో విఐటి– ఏపీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి అరుళ్ళోళి వర్మన్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎస్ సత్యన్నారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ ఖాదిర్ భాషా, ఏపీ చెస్ అసోసియేషన్ చైర్మన్ కెవివి శర్మ, అధ్యక్షులు డాక్టర్ సురేష్, కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్ బచావో అభియాన్
గుంటూరురూరల్: సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం పరిరక్షించబడటమే కాకుండా పంటల నాణ్యత, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతుందని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అన్నారు. నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం, వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధనా సంస్థ(అటారీ) జోన్–పది సంయుక్తంగా ఖేత్ బచావో అభియాన్(పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేల ఆరోగ్య కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ విచక్షణ రహితంగా రసాయనాలు వాడటం వలన ఐదు నిముషాలలో దీనిని నాశనం చేస్తున్నామని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడకోవాలని సూచించారు. లాం పరిశోధన స్థానం మృత్తికాశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విన్నకోట, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము పంటలు తొలకరిలో వేసుకొని భూమిలో కలియ దున్నడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నేల నీటి నిల్వ సామర్థ్యం సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రసాయన ఎరువుల అవసరం కొంత మేర తగ్గి, సాగు వ్యయాలు కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. యడ్లపాడుకు చెందిన ప్రగతిశీల రైతు శివరామకృష్ణ మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమన్వయం పాటించి సమతుల్యతను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అటారీ జోన్–పది శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ భాస్కరన్, ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, ప్రగతి శీల రైతులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు):మిర్చి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు స్పష్టం చేశారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో చైర్మన్ అప్పారావు అధ్యక్షతన శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మిర్చి యార్డుకు సంబంధించి 2026 మార్చి వరకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను ఆమోదించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి యార్డుకు వచ్చే మిర్చి రైతులకు మెరుగైన వసతులు, రైతు విశ్రాంతి భవనంలో రైతు ఉపయోగార్థం గ్రంథాలయం ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, గుంటూరు కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్) చైర్మన్ వడ్రాణం హరిబాబు, వైస్ చైర్మన్ బి.మల్లిక, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కుపై వివాదం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశంలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం మరోసారి చర్చకు వచ్చింది. ప్రజావ్యతిరేకత, విజిలెన్స్కు ఫిర్యాదుతో నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో శుక్రవారం గోవాడ అలయానికి వచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించటం వివాదానికి దారితీసింది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయటమే కాకుండా ఒక రైతు ఆలయం ముందు ధర్నాకు దిగారు. స్థానికుల్లో కలకలం మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మండల స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ వినోద్కుమార్, రేపల్లె ఆర్డీవో శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవాడ ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక ప్రదేశానికి జిల్లా కలెక్టరు చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ భర్త మండవ రమేష్, ఇతర గ్రామస్తులు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణాన్ని మొత్తం డొంక ప్రదేశంలో కాకుండా మూడు ఎకరాల్లో నిర్మిస్తే ఏమైనా అభ్యంతరం ఉందా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో గ్రామస్తుల్లో కలకలం రేగింది. అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్ల ప్రదేశాన్ని ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం తగదని చెప్పాం కదా... పంచాయతీలో తీర్మానం చేయటం ఏంటని సర్పంచ్ భర్తను ప్రశ్నించారు. తర్వాత అదే తీర్మానాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. మళ్లీ ఇప్పుడు పార్కు నిర్మాణం ప్రతిపాదన ఏంటని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సిందే... గ్రామ రైతు వేమూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ తన పొలం ఎదుట మూడు ఎకరాల డొంకలో పార్కు నిర్మాణానికి ససేమిరా అన్నారు. పంటల నూర్పిడికి తనకు అవకాశం ఉండదన్నారు. ఈ వాగ్వాదంలో ఇద్దరు ఆ రైతును పక్కకు తోశారు. అక్కణ్నుంచి జిల్లా కలెక్టర్ దేవాలయానికి వెళ్లి, అక్కడ స్థానికులతో మాట్లాడుతుండగా చంద్రశేఖర్ అక్కడకు వెళ్లి గుడి ముందు ధర్నా చేశారు. తనను నెట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతసేపు వాదప్రతివాదనల అనంతరం అతడికి క్షమాపణ చెప్పటంతో వివాదం ముగిసింది. డొంకరోడ్డులో పార్కు నిర్మాణానికి నిబంధనలు అంగీకరించవని తెలిసినా, అధికారులు బంజరు భూమిగా చూపి, నిర్మాణానికి పూనుకోవటం తెలిసిందే. దీనిపై తెనాలి, అమృతలూరు మండలాలకు చెందిన వారు విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు. కోర్టులో కూడా పిటిషను దాఖలు చేశారు. దీనితో నిర్మాణ పనులు ఆపేసి, సామగ్రిని కూడా సదరు కాంట్రాక్టు సంస్థ తీసుకెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యతో వివాదం నెలకొనటం చర్చనీయాంశమైంది. -
మొక్కలు నాటుదాం... పచ్చదనాన్ని కాపాడుదాం
మేడికొండూరు: ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పేరేచర్ల వద్ద నగర వనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేశారు. మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వలన కాలుష్య కోరల నుంచి బయటపడవచ్చని, ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ మాట్లాడుతూ సీడ్ బాల్స్తో మొక్కలు పెరుగుటకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించుటకు లక్ష మొక్కలు నాటాలని తెలిపారు. మిషన్ కూల్ గుంటూరు పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, సి.ఎస్.ఆర్. ఆర్గానిక్స్ నిర్వాహకులు మొక్కల సీతారామయ్య, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
సహాయకులకు సమస్యలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గర్భిణులు, బాలింతల కోసం వచ్చిన సహాయకులకు కనీస వసతులు లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. జీజీహెచ్లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ. 100 కోట్లు విరాళంగా అందించడంతో కానూరి రామచంద్రరావు జింకానా మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించారు. ప్రభుత్వం రూ. 26 కోట్ల వైద్య పరికరాలు అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో ఎంసీహెచ్ భవనం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఐదంతస్తుల భవనంలో 600 పడకలతో మాతా శిశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రులకు మించి ఉన్నప్పటికీ రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. జీజీహెచ్కు పలు జిల్లాలకు చెందిన గర్భిణులు కాన్పు కోసం వస్తున్నారు. ప్రసవం అనంతరం అత్యవసర చికిత్సల కోసం పలు జిల్లాలకు చెందిన చిన్నారులను జీజీహెచ్కు తీసుకొస్తున్నారు. భవనం మెట్లపైనే ద్వారాల వద్ద రోగుల సహాయకులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వానాకాలం వస్తే మరిన్ని కష్టాలు గుంటూరు జీజీహెచ్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులు, బాలింతల కోసం, చిన్నారుల చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకుల సంఖ్య అధికంగానే ఉంటుంది. కాన్పు సమయంలో ఆందోళన, అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, ఇతర వస్తువులు తెచ్చుకునేందుకు గర్భిణికి ఇరువురు సహాయకులు తప్పనిసరి. అలాంటి వారికి ఎంసీహెచ్ భవనం లోపల వేచి ఉండేలా ప్రత్యేక వసతి కల్పించాల్సి ఉంది. ఒకపక్క ఎండలు మండుతున్నా సహాయకులు పగడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే మరింత ఇక్కట్లు తప్పవు. ఎంసీహెచ్ భవనంలో సౌకర్యాలు కల్పించలేని పక్షంలో ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో వసతి ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉండి, వైద్యులు పిలిచినప్పుడు లోపలకు వస్తుంటారు. రూ. 100 కోట్లకుపైగా దాతలు విరాళాలు అందజేసినప్పటికీ గతంలో పాత కాన్పుల విభాగంలో మాదిరిగానే నేటికీ సహాయకులకు వేచి ఉండే గదులు లేక అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరతతో కష్టాలు నూతన ఎంసీహెచ్ భవనంలో విశాల గదులు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు తగిన సిబ్బంది లేరు. ప్రభుత్వం వైద్య పరికరాలకు రూ. 26 కోట్లు మంజూరు చేసింది. సరిపడా నర్సింగ్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. గత ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్ను నాట్కో ట్రస్టు వారు నిర్వహిస్తే, అందులో నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగులను 110 మందికిపైగా ప్రత్యేక రిక్రూట్మెంట్ చేసి భర్తీ చేసింది. తద్వారా నాట్కో క్యాన్సర్ సెంటర్లో నేడు అంతర్జాతీయ వైద్య సేవలు లభిస్తున్నాయి. ఎంసీహెచ్ భవనంలో అదే స్థాయిలో వైద్య సేవలు అందాలంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక నియామకాలు చేపట్టకపోతే భవన నిర్వహణ దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ భవనంలో అలాంటి ప్రత్యేక రిక్రూట్మెంట్ లేకపోవడం వల్లే నిర్వహణ సామర్థ్యం సక్రమంగా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జింకానా వారు కొన్నేళ్లపాటు భవన నిర్వహణ పనులకు ముందుకు వచ్చారు. వారికి తోడ్పాటుగా ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపట్టి ప్రత్యేక వైద్య సిబ్బంది, వైద్యులను నియమించాల్సి ఉంది. గతంలో గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో 100 నుంచి 200 వరకు మాత్రమే పడకలు ఉండేవి. నూతన ఎంసీహెచ్ భవనంలో 600 పడకలు వచ్చాయి. అదనంగా వచ్చిన పడకల్లో వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వం తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉంది. -
ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం
లక్ష్మీపురం: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం రెండో రోజు గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డులో నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలసి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యలు హాజరయ్యారు. ముందుగా పానుగంటి చైతన్య తదితరులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా నిరసన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అక్కడకు వచ్చారు. రుషి వ్యాలీ అపార్ట్మెంట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తిరిగి శ్రీనివాసరావు పేట 60 అడుగుల రోడ్డు వద్దకు ర్యాలీ చేరుకుంది. అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిలు మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యకర్తలను పంపించేందుకు పోలీసులు హడావిడి చేశారు. అయినప్పటికీ లెక్కచేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్ బక్కెట్తో నీటిని తీసుకొచ్చి దహనం అవుతున్న కరపత్రాలపై పోశాడు. పార్టీ నేతలు కలపాల సత్యన్నారాయణ, పల్లపు వెంకటేష్, ఖాజామొహీయుద్దీన్, కాండ్రుగుంట గురవయ్య, గేదెల రమేష్, యాపర్తి కోటి, షేక్ రోషన్, ఆచారి, పల్లపు మహేష్, యూనుస్ పాషా, తోట వెంకటేష్, వెంకాయమ్మ, శివపార్వతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసుల కాపలా నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నగరంపాలెం పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ట్రాఫిక్ సీఐ, నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలు, వెస్ట్ ఇన్చార్జి డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలతో భారీ సంఖ్యలో మోహరించారు. -
పాలనపై ప్రశ్నిస్తే కేసులా?
గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ ప్రభుత్వ అసమర్థ పాలన, నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజలకు వచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ సంతకాలు చేసిన సూపర్సిక్స్ ప్రతులను అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాలు తగులబెట్టారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ... సొంతమామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు తన జీవితంలో అనేక మందిని వెన్నుపోటు పొడుచుకుంటూ పైకి వచ్చారని అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటులో భాగంగా 9వ తేదీన టౌన్ హాల్ సదస్సు, 12న భారీ ర్యాలీతో ప్రజల్లోకి వెళతామన్నారు.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారన్నారు. 11 సీట్లు వచ్చాయని ఎగతాళి చేస్తున్న టీడీపీ నాయకులకు వైఎస్ జగన్ను చూసి అంత భయమెందుకని ప్రశ్నించారు. అడ్డగోలుగా కేసులు పెడతారా? ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెడతామని చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని, అసమర్థ పాలనపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇదేనా ప్రజాస్వామ్యమని నిలదీశారు. టీడీపీకి భజన చేస్తే కేసులు ఉండవా అన్నారు. వైఎస్ జగన్ను దూరం చేసుకున్న ప్రజలు చంద్రబాబు రెండేళ్ల పాలన చూసిన ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఎందుకు దూరం చేసుకున్నామా అని బాధపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు గడప తట్టేవని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన విధానంతో దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు పాలన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు తప్ప, ప్రజా పరిపాలన లేదన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్వలి, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఈచంపాటి వెంకటకృష్ణ, వంగల వలి వీరారెడ్డి, యక్కల కోటి లింగా రెడ్డి, బోయపాటి కిషోర్, రెడ్డి కోటేశ్వరరావు, బూసి రాజలత, అచ్చాల వెంకటరెడ్డి, షేక్ రోషన్, పల్లపు వెంకటేష్, సాంబశివరావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పటాన్ సైదా ఖాన్, వినోద్, సత్యనారాయణ, కొరిటిపాటి ప్రేమ కుమార్, నాయకులు ఓలేటి అరవింద్, దీపక్, వెంకటేష్ రెడ్డి, వెంకాయమ్మ, వెంకటేష్ నాయక్, జగన్ కోటి, శివ పార్వతీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. చెత్తబుట్టలో పడేసిన చిత్తు కాగితాలు డంపింగ్యార్డుకు తీసుకెళ్లి తగులబెడతారని, అదే చెత్తను తాము రోడ్డుపై తగుల బెడుతున్నామని అన్నారు. టీడీపీ పాలన ప్రజల కోసం కాదని, అమరావతిలో బినామీల పేరుతో ఉన్న భూములను కాపాడుకునేందుకు, కాంట్రాక్టర్లకు జేబులు నింపి, వాటిలో కమీషన్ల కోసమే పాలన సాగుతోందన్నారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైఎస్సార్ సీపీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహిళలను మోసగించారని ఆరోపించారు. పాలన అంతా అవినీతిమయంగా మారిందని అన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 519.50 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,000, గరిష్ట ధర రూ.2,200, మోడల్ ధర రూ.1,600 వరకు పలికింది. 7 -
అధిక ధరకు మద్యం విక్రయిస్తే దుకాణాల లైసెన్ ్స రద్దు
నెహ్రూనగర్ మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్లు రద్దు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ హెచ్చరించారు. బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిర్మూలించాలని, గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు ఎకై ్సజ్ కార్యాలయంలో గుంటూరు, పల్నాడు జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ మద్యం షాపులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. నాటు సారా తయారు చేసే వారికి పునరావాసం కల్పించి ఆ వృత్తిని మానిపించాలన్నారు. సమావేశంలో గుంటూరు ఎకై ్సజ్ డీసీ డాక్టర్ కే. శ్రీనివాసులు, గుంటూరు ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ హెచ్చరిక -
సుమయ మృతదేహానికి రీపోస్టుమార్టం
పట్నంబజారు: బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన సుమయ(44)కు 20 సంవత్సరాల కిందట మొహమ్మద్ షౌకత్ అలితో వివాహం జరిపారు. గతనెల 31న సుమయ హార్పిక్ తాగి మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులకు భర్త షౌకత్ అలి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే సరికి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి సోదరుడు షేక్ షఫీ తన సోదరి సుమయ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్లుగా భార్య, భర్తల మధ్య వివాదం జరుగుతోందని, ఈనేపథ్యంలో తన సోదరిని చంపి పడేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహసీల్దారు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో శుక్రవారం ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికలో సుమయ మృతదేహాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాలు లక్ష్మీపురం: రాజధానిలో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సి.ఆర్.డి.ఎ. అడిషనల్ కమీషనర్ కొల్లాబత్తుల కార్తీక్తో కలసి రాజధాని భూసేకరణ గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ – 3, ఈ – 13, ఈ –15 పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి, ఎన్హెచ్ 16ను కలిపేలా ట్రంకు రోడ్డు తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాల గురించి చర్చించారు. ఇరిగేషన్, రైల్వే తదితర శాఖలకు సంబంధించిన భూముల విషయంలో పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి పెండింగ్ లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లంక భూములకు సంబంధించి ఏకీకృత నివేదికలు తయారు చేయాలన్నారు. గ్రామ కంఠాలు, మ్యూటేషన్స్ విషయంలో ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి సకాలంలో పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు, సీఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్గా కెరీర్ కౌన్సెలింగ్ ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ప్రాక్టికల్గా ఇద్దామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కెరీర్ కౌన్సెలింగ్కు ఆయా కంపెనీలు, వ్యక్తుల వద్దకు పంపాలని సూచించారు. జిల్లా విద్యా శాఖ అధికారి సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న 32 వసతి గృహాలు ఆహ్లాదకరంగా ఉండాలని సూచించారు. ఆరు నెలలలో నవీకరణ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా బీసీ అధికారి కె.మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి. దుర్గాబాయి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్ కార్ట్ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ
మెప్మా జిల్లా పీడీ విజయలక్ష్మి లక్ష్మీపురం: మెప్మా జీవనోపాధి ప్రోత్సాహక కార్యక్రమాల కింద, ఎన్ఈసీసీ (నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ) సహకారంతో పట్టణ ఎస్హెచ్జీ మహిళా లబ్ధిదారులకు ఎగ్ కార్ట్స్ ఉచితంగా అందజేస్తామని జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా మెప్మా కార్యాలయంలో గురువారం ఎగ్ కార్ట్ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎగ్ కార్ట్ వ్యాపారం ప్రారంభించిన లబ్ధిదారుల వ్యాపార నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు బలోపేతం చేయడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. మెప్మా కార్యాలయ సిబ్బంది, ఎన్ఈసీసీ కో–ఆర్డినేటర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
లీలా మహేశ్వరి ధన్యజీవి
గుంటూరు ఎడ్యుకేషన్ అంతరించిపోతున్న విలువలకు ప్రతిరూపంగా నిలిచిన వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించిన వావిలాల కుమారి లీలామహేశ్వరి ధన్యజీవి అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వావిలాల లీలామహేశ్వరి 88వ జయంతి సందర్భంగా గురువారం అరండల్పేటలోని వావిలాల సంస్థ ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు, వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ సోడేకర్ అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్యకు వెన్నంటి ఉంటూ వారు తుది శ్వాస విడిచే వరకూ సేవలు అందించిన మహనీయురాలు లీలామహేశ్వరి అని తెలిపారు. వావిలాల గోపాలకృష్ణయ్య 1952 నుంచి 1972 వరకు నాలుగు సార్లు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అద్వితీయమైన కృషి చేశారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభించిన సారా వ్యతిరేక ఉద్యమం విజయవంతమై సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చిందని, పొదుపు ఉద్యమం ప్రారంభమై మహిళలు సంఘటితమయ్యారని అన్నారు. వావిలాల లీలామహేశ్వరి వివాహం చేసుకోకుండా తోబొట్టువులుగా ఉన్న 12 మందిని చదివించి వృద్దిలోకి తీసుకురావడంతో పాటు వావిలాల గోపాలకష్ణయ్య అనారోగ్యం పాలైన రోజుల్లో సెతం కన్నబిడ్డగా సేవలను అందించారన్నారు. అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ వావిలాల లీలా మహేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వేలాది మంది విద్యార్థులను అభివృద్ధి పదంవైపు నడిపారని, 40 ఏళ్లపాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో పనిచేసి వేలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తిని ప్రేరేపించారని తెలిపారు. వావిలాల సంస్థ పూర్వ చైర్మన్ డాక్టర్ ఎండీవీ రమణారావు మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య ఆలోచన ధోరణితోనే లీలా మహేశ్వరి కొనసాగినారన్నారు. దేశభక్తి, మద్యనిషేధం, తెలుగు భాష, సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలకు వావిలాల ఇల్లు చిరునామాగా మారిందన్నారు. మహిళా విద్య కోసం 70 ఏళ్ల క్రితమే వావిలాల కుటుంబం కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మాజేటి సోమశేఖర్, పూర్వ ప్రిన్సిపాల్ వి. సుబ్బారాయుడు, వావిలాల కుటుంబ సభ్యులు వావిలాల రమ, సత్యం, భారతి, భారతీ చంద్ర, బీజేపీ నేత ఆర్. లక్ష్మీపతి, రవాణాశాఖ సంయుక్త కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, వావిలాల గ్రంథాలయ శాస్త్ర పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధోనె రాంబాబు, బీహెచ్ హైస్కూల్ పూర్వ హెచ్ఎం మనోరమ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
కాలువల మరమ్మతులకు రూ.42.19 కోట్లు
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలోని కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఏడాదిలో 578 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. కాలువ కట్టల బలోపేతం, పూడిక తీత, నీటి నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, గేట్లు, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో సుమారు 290 పనులను గుర్తించి ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరవ్వాలని రెక్టార్ ఆర్. శివరాంప్రసాద్ అన్నారు. ఏఎన్యూలో ఎనిమిది రోజులపాటు జరిగే ఏపీ పీసెట్ పరీక్షలకు రెండవ రోజు గురువారం 715 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. 5వ తేదీన హాల్టికెట్ నెంబరు 11431 నుంచి 12144 వరకూ మొత్తం 713 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మాచర్ల రూరల్: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 48 సిలెండర్లను స్వాధీనపరుచుకున్న సంఘటన పట్టణంలోని శ్రీశైలం రోడ్డు, బ్రహ్మ బోర్వెల్స్లో చోటుచేసుకుంది. తహసీల్దార్ బి.కిరణ్కుమార్ నేతృత్వంలో గురువారం పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. శ్రీశైలం రోడ్డులోని బ్రహ్మ బోర్వెల్స్, కృష్ణ బలిజ కాలనీ, ఆర్చీ పక్కన గల షాపులలో తనిఖీ చేసి చిన్ని శ్రీనివాసరావు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 48 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి వివిధ పేర్లతో డెలివరీ తీసుకొని తన షాపులో నిల్వ ఉంచుకొని బ్లాకులో ఒక్కొక్కటి రూ. వేల చొప్పున విక్రయిస్త్తున్నట్లు ఆరోపణలు రావటంతో తహసీల్దార్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. శ్రీనివాసరావుపై 6 ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ షేక్ బాషా, ఆర్ఐ అనిల్కుమార్, వీఆర్ఓ, వీఆర్ఏలు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 519.60 అడుగులకు చేరింది. ఇది మొత్తం 148.5482 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,933 క్యూసెక్కులు విడుదల అవుతోంది. -
రీపోస్టుమార్టం చేయాలంటూ ఫిర్యాదు
పట్నంబజారు: మహిళ మృతిపై రీపోస్టుమార్టం నిర్వహించాలని ఫిర్యాదు ఘటనపై కేసు నమోదైంది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన షేక్ సుమయ (44) మహిళను 20 ఏళ్ల క్రితం మొహమ్మద్ షౌకత్అలీ వివాహం చేశారు. కొద్దిరోజులపాటు ఆయాప్రాంతాల్లో నివాసం ఉన్న దంపతులు, వివాదాల నేపథ్యంలో వేర్వేరుగా సుమయ అరుంధతీనగర్లో నివాసం ఉండగా, ఆనందపేటలో షౌకత్ అలీ నివాసం ఉంటున్నాడు. గతనెల 30న రాజీ నిమిత్తం ఆనందపేటకు రావాలని పిలిపించారు. 31న సింగరాయకొండలో ఉన్న మృతురాలి సుమయ సోదరుడు షేక్ షఫీకి ఫోన్ చేసి మీ సోదరి హార్పిక్ తాగి చనిపోయిందని ఖననం చేశారు. తన సోదరి మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని షేక్ షఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను చంపి పాతిపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రీపోస్టుమార్టం చేయాలని పోలీసులతోపాటు, తహసీల్దారుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రీపోస్టుమార్టం చేసేందుకు సన్నద్ధమయ్యారు. చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి నగరంపాలెం/ఫిరంగిపురం: ఫిరంగిపురం పోలీస్స్టేషనన్లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కె.భూషణం (55) మృతిచెందారు. బుధవారం రాత్రి విధుల్లో కె.భూషణం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన సహచర సిబ్బంది చికిత్స నిమిత్తం తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్సకై గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. భూషణంకు భార్య, పిల్లలు ఉన్నారు. భూషణం అంత్యక్రియలు యర్రగుంట్లపాడు గ్రామంలో ప్రభుత్వలాంఛనాలతో నిర్వహించారు. సీఐ భుజంగరావు, స్టేషన్ సిబ్బంది, గుంటూరు నుంచి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్స్ భూషణం మృతదేహం వద్ద గాలిలోకి కాల్పులు జరిపి పోలీసు లాంఛనాలతో నివాళులర్పించారు. గతంలో ఆయన పక్షవాతంతో బాధపడ్డాడని, అయినా నిబద్ధతతో విధులు నిర్వర్తించాడని సహచర సిబ్బంది గుర్తుచేసుకున్నారు. భూషణం కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు. -
పేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం
లలిత పీవీఎస్ హాస్పటల్ నిర్వాహకులు డాక్టర్ రాఘవశర్మ గుంటూరు మెడికల్: పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకు రావాలనే లక్ష్యంతో గుంటూరు తక్కెళ్లపాడులోని లతితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పటల్ను ఏర్పాటు చేశామని చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవశర్మ చెప్పారు. గురువారం హాస్పటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా లలితా గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో లక్షలాది మందికి వైద్య సేవలు అందించామన్నారు. ఆవైద్య సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతోనే లలితానగర్లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో అన్ని రకాల వైద్య సేవలతో, ఆహ్లాదకరమైన పరిసరాలతో నూతన ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ, త్రీడీ టెక్నాలజీ ఎమ్మారై స్కానింగ్ మెషిన్ను ఏర్పాటు చేశామన్నారు. హాస్పటల్ సీఈఓ, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోలవరపు అనురాగ్ మాట్లాడుతూ గుండె జబ్బు రోగుల కోసం మూడు అత్యాధునిక క్యాథ్ల్యాబ్లు, పది మంది కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, న్యూరాలజిస్ట్, డాక్టర్ నరేన్ పోలవరపు మాట్లాడుతూ ఏపీలోనే తొలిసారిగా 1990 నుంచి న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యసేవలు తాము గుంటూరు కొత్తపేటలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తమ అడ్వాన్స్డ్ అంకినీడు స్ట్రోక్ సెంటర్లో ఏఐ ఆధారిత స్ట్రోక్ సేవలు అందిస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ క్యాన్సర్ జబ్బులకు సమగ్ర వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతినెలా రెండో గురువారం పురుషులకు, మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని, వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సిరిచందన గంగసాని మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అత్యాధునిక వైద్యం, విద్య పరిశోధన, సమాజ సేవ అనే నాలుగు అంశాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. -
వెన్నుపోటుపై నిరసన వెల్లువ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుపై గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన వెల్లువెత్తింది. ప్రజల్ని మోసం చేసిన టీడీపీ మేనిఫెస్టో కాపీలను పలుచోట్ల దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల ప్రయత్నం చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్లో చేసిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అండగా నిలబడటమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే పట్టాభిపురం సీఐ అక్కడే ఉండి చోద్యం చూడటం విమర్శలకు తావిచ్చింది. నియోజకవర్గాల వారీగా ఇలా... అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను డస్ట్బిన్లో వేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలను టీడీపీ మూకలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు తగులబెట్టాలని టీడీపీ నేతలకు చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలే అధికారంలో నుంచి పీకిపారేస్తారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబు... ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మను పోలీసులు దగ్గరుండి దహనం చేయించారని మండిపడ్డారు. -
చిన్నారికి అరుదైన గుండెశస్త్ర చికిత్స
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మెడ్స్టార్ హాస్పిటల్లో యూరప్ చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుండె శస్త్ర చికిత్స వైద్యనిపుణులు డాక్టర్ పి.వి. నరేష్కుమార్, డాక్టర్ చైతన్యలు మాట్లాడుతూ యూరప్లోని జార్జియా దేశానికి చెందిన చిన్నారి పుట్టుకతోనే పల్మనరీ అట్రేసియా అనే క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధితో బాధపడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య కారణంగా చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో ప్రాణాపాయస్థితి ఎదురైందని తెలిపారు. స్వదేశంలో వైద్యం చేయించినప్పటికీ ఆశించిన ఫలితం లభించలేదని వివరించారు. గతంలో అక్కడ బ్లేలాక్ టాసిగ్ (బిటి) షంట్ చికిత్స నిర్వహించారని తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రిని సంప్రదించారని, ఇక్కడి వైద్యుల సూచన మేరకు చిన్నారిని యూరప్ నుంచి గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. రోగి పరిస్థితిని పరిశీలించిన మెడ్స్టార్ యాజమాన్యం ప్రత్యేక బహుళ విభాగాల నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఆ చిన్నారికి సరిపోయేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళికను రూపొందించి ఆపరేషన్ పూర్తి చేశామని తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంటోందని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. కార్డియోథొరాసిక్ సర్జరీ నిపుణులు డాక్టర్ పి.వి.నరేష్కుమార్, డాక్టర్ చైతన్య నేతృత్వంలో జరిగిన ఈ అరుదైన శస్త్ర చికిత్సలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి.విజయ చైతన్య, సీనియర్ కార్డియాలిజిస్ట్ డాక్టర్ బి.శ్రీహరి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయితేజ, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్లతో పాటు కార్డియోథొరాసిక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది కీలక ప్రాత పోషించారని తెలిపారు. -
విజ్ఞాన్ – ఏఆర్సీఐ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: అధునాతన మెటీరీయల్స్ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో విజ్ఞాన్ యూనివర్సిటీ మరియు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ ఎంఓయూ పత్రాలను ఏఆర్సీఐ డైరెక్టర్ డాక్టర్ విజయ్ రావు, , విజ్ఞాన్ యూనివర్సిటీ చాన్సలర్ పావులూరి సుబ్బారావు సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. డాక్టర్ పావులూరి సుబ్బారావు అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సీఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఇరు సంస్థల మధ్య శాసీ్త్రయ సమాచార మార్పిడి, అధ్యాపకులు మరియు విద్యార్థుల ప్రయోగశాల సందర్శనలు, సంయుక్త సదస్సులు, వర్క్షాపులు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, గెస్ట్ లెక్చర్స్, ఫ్యాకల్టీ ఇమ్మర్షన్ ప్రోగ్రాంలు నిర్వహించనున్నారు. ఉమ్మడి పరిశోధన పత్రాల ప్రచురణ, పరిశోధన ప్రాజెక్టుల ప్రతిపాదనలు, విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు, పీహెచ్డీ పరిశోధనలకు సహ పర్యవేక్షణ, శాసీ్త్రయ పరికరాల వినియోగం వంటి అంశాల్లో సహకారం అందించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమలకు అనుసంధానమైన పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీని పరిశీలించిన శాప్ చైర్మన్
తాడికొండ: వీఐటీ ఏపీలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ను గురువారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) గౌరవ చైర్మన్ అనిమిని రవి నాయుడు సందర్శించారు. అమరావతి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నాలుగో రోజు సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ను పరిశీలించిన ఆయన వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి అరుళ్మొళివర్మన్తో కలిసి చెస్ ఆడి క్రీడాకారులకు పలు సూచనలిచ్చారు. శాప్ డైరెక్టర్ ఎస్.సంతోష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి, విద్యార్థి సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖదీర్ పాషా, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ, అధ్యక్షుడు డాక్టర్ సురేష్, కార్యదర్శి జగదీశ్, తదితరులు పాల్గొన్నారు. -
సర్వేశాఖ ఏడీ వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం: గుంటూరు జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులుగా సజ్జ వెంకటేశ్వరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లాలో సర్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై గుంటూరు సహాయ సంచాలకులుగా నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మను ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. జిల్లాలో సర్వే, రీ సర్వే పనులు విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, సర్వే శాఖ ఉపసంచాలకులు పాల్గొన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల రిజిస్ట్రేషన్ గడువు పెంపు గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాకేంతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీని ఈనెల 22వ తేదీ వరకూ పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ వయస్సు 15 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలనే నిబంధనలు సవరించారని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా ఈ కోర్సులకు ప్రవేశాలకు అర్హులేనని తెలిపారు. మరిన్ని వివరాలకు www. angrau. ap. in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. వీవీఐటీయూను సందర్శించిన సింగపూర్ విద్యార్థులు పెదకాకాని: సింగపూర్కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ మిలనీ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివా, వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని వీవీఐటీయూ ప్రో–ఛాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండల పరిధిలోని వర్సిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక సమ్మేళనంలో భాగంగా ఐదు రోజుల పర్యటనకు విచ్చేసిన సింగపూర్ విద్యార్థులు బహుళ సాంస్కృతిక అవగాహన, విద్యావిధానం, సాంకేతికత, సమస్యా పరిష్కారానికి మానవీయ కోణంలో ఆలోచించి డిజైన్ థింకింగ్ పద్ధతిలో పరిష్కారాలను కనుగొనడం వంటి అంశాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారని ఆయన వివరించారు. వీవీఐటీ విద్యార్థులతో కలిసి సింగపూర్ విద్యార్థులు విషయ విశ్లేషణ (గ్రూప్ డిస్కషన్) నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సింగపూర్ కళాశాల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, టీఎల్సీ హెడ్ డాక్టర్ రావెల నవీన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ఫోన్లు గుర్తింపు
నగరంపాలెం: మొబైల్ఫోన్లు పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు సంప్రదించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం సుమారు రూ.28 లక్షల విలువ చేసే 140 మొబైల్ఫోన్లను బాధితులకు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటిదాకా సుమారు రూ.8.73 కోట్ల విలువ చేసే 4,364 మొబైల్ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కు, సైబర్ క్రైమ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
జీజీహెచ్లో హడలెత్తిస్తున్న లేడీ బాస్
గుంటూరు మెడికల్: ‘ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వేదం.. అలా నడుచుకోకపోతే పనిష్మెంట్ తప్పదంటూ’ గుంటూరు జీజీహెచ్లో ఓ లేడీ బాస్ చేస్తున్న ఓవర్ యాక్షన్కు మనస్తాపం చెందిన నర్సింగ్ సిబ్బంది గురువారం విధులకు సెలవు పెట్టారు. దీంతో అత్యవసర సేవల కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ పంచాయితీ చివరికి సూపరింటెండెంట్ వద్దకు చేరడంతో శాంతించిన నర్సింగ్ సిబ్బంది విధుల్లో చేరారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ బుధవారం నర్సింగ్ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. తాను చెప్పిన చోట కూర్చోవాలని, ఎప్పటి నుంచో నర్సింగ్ సిబ్బంది ఉంటున్న ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. సదరు డాక్టర్ తీరుపై మనస్తాపం చెందిన నర్సింగ్ సిబ్బంది ఆసుపత్రి సీఎస్ఆర్ఎంఓ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో గురువారం నర్సింగ్ సిబ్బంది విధులు నిలిపివేసి, సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ సీనియర్ లేడీ డాక్టర్ గతంలో ఇదే తరహాలో పీజీ వైద్యులతో, క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్లతో గొడవ పెట్టుకోవడంతో వారు ఆమె తీరుపై విసుగు చెంది ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు ఉన్న ఇన్చార్జి బాధ్యతలు తొలగించి, ఇతర వైద్యులకు అప్పగించారు. ఇన్చార్జిగా ఉన్నవారిపై సైతం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెకున్న రాజకీయ పలుకుబడికి ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగానే రెండు రోజులుగా నర్సింగ్ సిబ్బంది ఆమె బారిన పడి ఇబ్బందులు పడుతూ వైద్య సేవలు నిలిపివేసే పరిస్థితి నెలకొంది. జీజీహెచ్కు గుండెలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్లో అందరిని కలుపుకొనిపోవాల్సిన సీనియర్ లేడీ బాస్ అందరితో వివాదాలకు దిగడం, తాను పనిచేయకుండా, మిగితావారిని కూడా విసిగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం వివాదాలకు నిలయంగా మారింది. వైద్య సేవల్లో జాప్యానికి కారణమవుతున్న లేడీబాస్పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. -
చదివింది ఒకటి.. సర్టిఫికెట్ మరొకటి!
గుంటూరు మెడికల్: చదివింది జీఎన్ఎం నర్సింగ్ కోర్సు.. కానీ ఉద్యోగం పొందేందుకు బీఎస్సీ నర్సింగ్తో పనిచేసినట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టారు. స్క్రూట్నీ చేసిన అధికారులు మామూళ్ల మత్తులో పడి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించినా ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమవడం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలి 500 మందిలో 50 మంది వారే... ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 7 వేల మందికిపైగా అభ్యర్థులు జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ఆర్డీ కార్యాలయం అధికారులు స్క్రూట్నీ చేసి మే 14 నుంచి 19వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు గడువు ఇచ్చి, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారు. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మే 29న విడుదల చేసి 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని అధికారులు ప్రకటన విడుదల చేయడమేంటని అన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సమయం సరిపోదని, మామూళ్లు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారికి ఉద్యోగాలు వచ్చేలా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ మెరిట్ జాబితాలో తొలి 500 మంది అభ్యర్థుల్లో 50 మంది వరకు నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఇవే కరోనా సమయంలో ఉద్యోగాలు చేసేందుకు 2020 ఆగస్టులో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం పిడుగురాళ్ల జీజీహెచ్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసిన వారిలో పలువురు ఆగస్టుకు ముందే అంటే నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉద్యోగాల్లో చేరి పనిచేసినట్లు 2020 ఏప్రిల్, మే నుంచి పనిచేస్తున్నట్లు సర్టిఫికెట్లు పెట్టడం పలువురు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన రేపింది. 2024లో భర్తీ చేసిన నోటిఫికేషన్లో కరోనా మార్కులు జత చేయకపోవడంతో ఓ అభ్యర్థి 790కు పైగా నాటి మెరిట్ జాబితాలో ఉండగా, నేడు 30లోపే ఉండటం, ఉద్యోగం వచ్చేలా నేడు కరోనా మార్కులు జతచేయడం ఇతర అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. కొంత మంది అభ్యర్థులు కరోనా విధులు నిర్వహించిన సర్టిఫికెట్లు దరఖాస్తులో చూపగా, ఇంకొందరు అదనంగా కరోనా డ్యూటీ చేసినట్లు, డ్యూటీ చేయకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం, వాటిని ఆర్డీ కార్యాలయం అధికారులు ఆమోదించి వారిని మెరిట్ జాబితాలో చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు ఎంఎల్హెచ్పీగా ఉద్యోగం చేస్తూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టారు. ఎంఎల్హెచ్పీలను ప్రస్తుతం సీహెచ్ఓలుగా పిలుస్తున్నారు. అయితే జీఎన్ఎం కోర్సు చదివిన అభ్యర్థులకు ఎంఎల్హెచ్పీ విధులు నిర్వహించినట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు జత చేసి, వారి పేర్లు సీనియార్టీ జాబితాలో ముందు వచ్చేలా అధికారులు చేయడం తగదని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026వైభవంగా షిరిడి సాయినాథ బ్రహ్మోత్సవాలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,500, గరిష్ట ధర రూ.2,500, మోడల్ ధర రూ.1,900 వరకు పలికింది.అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం కాలేదు. టీడీపీ సర్కారు ముందు చూపు లేని పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు నిరాశే మిగలనుంది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం రోజున ఆనందంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఈ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భేష్.. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెలకుపైగా పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. పాఠ్య పుస్తకాలు మినహా జిల్లాకు పూర్తిస్థాయిలో సామగ్రి చేరుకోలేదు. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగగా విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కల్పించారు. ఈ విధంగా ఐదేళ్లపాటు పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే విద్యార్థుల చేతుల్లో కిట్లను ఉంచారు. నగరంపాలెం: స్థానిక హౌసింగ్ బోర్డుకాలనీ షిరిడి సాయినాథ మందిరంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సుప్రభాత సేవ, కాకడ హారతి, బాబా వారికి పంచామృతాలతో అభిషేకం, 108 కళాశాలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార పూజ, ప్రత్యేక హారతులు నిర్వహించారు. సాయంత్రం వేళ సంధ్యా హారతి అనంతరం శ్రీరామ భక్త వీరాంజనేయ బృందం భజన జరగ్గా, భక్తులను కార్యక్రమం అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడే మామిడి సీతారామయ్య, గౌరవాధ్యక్షుడు మామిడి రామారావు, సభ్యులు పాల్గొన్నారు. 7ప్రస్తుత టీడీపీ పాలనలో విద్యార్థులకు ఆ భరోసా కరువైంది. పాఠశాల తెరిచేందుకు మరో 10 రోజుల వ్యవధి సైతం లేని పరిస్థితుల్లో జిల్లాకు పాఠ్య పుస్తకాలు మినహా మిగిలిన సామగ్రి చేరుకోలేదు. విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బ్యాగు, రెండేసి జతల చొప్పున యూనిఫాం, బూట్లు, నోటు పుస్తకాలు, సాక్సులు, టై, బెల్టు అరకొరగా వచ్చాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 15,26,181 పాఠ్యపుస్తకాల్లో ఇప్పటి వరకు 14,64,850 .... అదే విధంగా నోటు పుస్తకాలు 5,32,451 వచ్చాయి. ఇలా అరకొరగా వచ్చిన సామగ్రితో కిట్లు సిద్ధం చేసి, పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తోంది. -
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్ హెడ్ డాక్టర్ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో మాట్లాడుతూ తుఫాన్లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా, ఎస్డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్ఈఓసీ ఇన్చార్జి పీటర్, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
ముఖ్యమంత్రికి స్వాగతం
గుంటూరు మెడికల్: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ స్వాగతం పలికారు. తక్కెళ్లపాడులోని లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి చంద్రబాబు బుధవారం వచ్చారు. ముఖ్యమంత్రి రాక కోసం అక్కడ ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఏఎన్యూలో 8 రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు తొలిరోజు బుధవారం 715 మందికిగాను 491 మంది హాజరయ్యారని కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గురువారం హాల్టికెట్ నెంబరు 10,716 నుంచి 11,430 వరకున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. -
చదువుతోపాటు క్రీడలకూ ప్రోత్సాహం
తాడికొండ: విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించడంలో వీఐటీ– ఏపీ వర్సిటీ కృషి అభినందనీయమని ఏపీ యువజన సేవలు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. వీఐటీ– ఏపీలో బుధవారం 3వ రోజు కొనసాగుతున్న చెస్ టోర్నమెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెస్ ఆడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వీఐటీ– ఏపీ వీసీ డాక్టర్ పి.అరుళ్మోళి వర్మన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడా రంగంలోను ప్రతిభను పెంపొందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందులో భాగంగానే అతిపెద్ద అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డీడీ డాక్టర్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు పేర్కొన్నారు. బుధవారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బసవ లింగారావు మాట్లాడుతూ... పాఠశాల విద్యారంగం అనేక ఆటుపోట్లకు గురవుతూ సంక్షోభంలో ఉందన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రైవేటు వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి. నాగశివన్నారాయణ, పుట్టా జనార్దనరావు, పి.లక్ష్మీనారాయణ, జి.శివరామ కృష్ణ, పచ్చల శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.వెంకటేశ్వరావు, ఆడిట్ కమిటీ సభ్యులు షేక్ సిద్దిక్, కె.ఆదినారాయణ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్నెహ్రూనగర్: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుంచి తారకరామ నగర్ వరకు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్ను కాపాడుకోవాలంటే మనం పర్యావరణ అనుకూలమైన సైకిల్ వాడకాన్ని ప్రజా రవాణా వ్యవస్థగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీనా బేగం, హార్ట్ ఫుల్ సెంటర్ రీజినల్ కో ఆర్డినేటర్ రామచంద్రరావు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, ఎన్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ జె.సుధీర్, ఎస్ఎస్ సోమశేఖర్ పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ఏఐ ఆధారిత పరీక్షలు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఒంగోలు జోనల్ రీజినల్ జేడీ బి.మనోరంజనిలక్ష్మీపురం: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా 0 – 6 ఏళ్ల పిల్లల కోసం ఏఐ ఆధారిత శిశు వికాస పరీక్షల కోసం శిక్షణ కార్యక్రమం స్థానిక కృషి భవన్లో బుధవారం నిర్వహించారు. చిన్నారుల్లో వికాస లోపాలను ముందుగానే గుర్తించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు జోనల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ మనోరంజని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పోషణ్ 2.0 లో భాగంగా, ఏఐ ఆధారిత శిశు వికాస పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. అంగన్వాడీ కార్యకర్త స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా పిల్లల మాట, చూపు, స్పందన, కదలికలను రికార్డ్ చేసి, స్క్రీనింగ్ చేస్తారని తెలిపారు. లవ్, టాక్, ప్లే (ప్రేమ, మాట, ఆట) ముఖ్య లక్ష్యంతో 0–3 ఏళ్ల వయసులోనే గుర్తిస్తే 80 శాతం కేసులు పూర్తిగా నయం చేయవచ్చన్నారు. అంగన్వాడీలు ఇకపై కేవలం పోషకాహార కేంద్రాలు మాత్రమే కాకుండా ఏఐ సహాయంతో ప్రతి బిడ్డ మెదడు వికాసాన్ని కాపాడే ‘నవచేతన’ నిలయాలు చేయడమే లక్ష్యం అన్నారు. ఈ ట్రైనింగ్ తర్వాత జిల్లాలోని 1480 అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి, సాధికారత అధికారి పి.పి.జి.ప్రసూన మాట్లాడుతూ జిల్లా స్థాయి శిక్షణను ఉపయోగించుకొని, జిల్లాలోని బాలలందరూ ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలని తెలిపారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ కీర్తి జిల్లాలో టీఓటీలుగా వ్యవహరించిన విజయ్ గౌరి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీఓలు, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిజియోస్ క్రికెట్ లీగ్ ప్రారంభం
గుంటూరు మెడికల్: ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి ‘ఫిజియోస్ క్రికెట్ లీగ్ – 2026’ టీ20 పోటీలు బుధవారం పెదకాకాని డాక్టర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభించిన చంద్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఎన్ శరత్ చంద్ర కుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ వైద్యులు వత్తిపరమైన బాధ్యతలు మరింత సమర్థంగా నిర్వహించేందుకు టోర్నీ నిర్వహించటం అభినందనీయం అన్నారు. గెలుపోటములతో పని లేకుండా ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తితో మెలగాలని కోరారు. ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి. నాగ సతీష్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి 10 టీములు పాల్గొంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ యార్లగడ్డ రవితేజ, డాక్టర్ ముప్పరాజు వెంకట్రావు, స్పోర్ట్స్ క్లబ్ గౌరవ సలహాదారు పొందూరి శివరాంప్రసాద్, కమిటీ సభ్యులు, టీం లీడర్లు తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ ఉద్యోగాల్లో నకిలీలలు
గుంటూరు మెడికల్ : అర్హత లేకున్నా ఉద్యోగాలు పొందేందుకు కొందరు నర్సింగ్ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. ఉద్యోగం చేయకపోయినా నకిలీ అనుభవ ధ్రువపత్రాలు తయారు చేసి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైద్య అధికారులు కొందరి సర్టిఫికెట్లను నకిలీవిగా నిర్ధారించి ఆయా జిల్లాల వైద్య అధికారులకు పరిశీలించాలని వెనక్కు పంపించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. పోస్టులకు తీవ్ర పోటీ ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు పోస్టులకు మార్చి నెలలో గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 వేల మందికిపైగా జనరల్ నర్సింగ్ అండ్మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. గత నెల చివరిలో అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును, ఫైనల్ మెరిట్ లిస్టును సైతం ఆర్డీ కార్యాలయం అధికారులు విడుదల చేశారు. స్క్రూట్నీ సమయంలో పలు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని గమనించి ఆర్డీ కార్యాలయం అధికారులు నిజ నిర్ధారణ కోసం వెనక్కు పంపించారు. ఈ అంశం నేడు మూడు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో పనిచేసినట్లుగా... కరోనా సమయంలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించినట్లు, ప్రభుత్వ నోటిఫికేషన్ల సమయంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలు పొంది పనిచేసినట్లుగా మూడు జిల్లాలకు చెందిన పలువురు నర్సింగ్ అభ్యర్థులు సర్టిఫికెట్లు అందజేశారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో కొన్ని సర్టిఫికెట్లు నకిలీవిగా ఆర్డీ కార్యాలయం అధికారులు తేల్చారు. అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అభ్యర్థుల అపాయింట్మెంట్ ఆర్డర్లకు, వారు పనిచేసిన సమయంలో పొందిన బ్యాంకు ఖాతాలకు పొంతన లేకపోవడంతో ఆర్డీ కార్యాలయం అధికారులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు జిల్లాలకు చెందిన వైద్య అధికారులకు వాటిని పరిశీలన నిమిత్తం వెనక్కు పంపించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని సరిదిద్దకుండా మరలా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పనిచేసిన కొంత మంది వ్యక్తులకు ఎక్స్పీరియన్స్ మార్కులను కలపకుండా పనిచేయకుండానే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించిన వారికి ఉద్యోగాలు వచ్చేలా మార్కులు కలిపారని పలువురు నర్సింగ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అభ్యంతరాల పరిశీలన అనంతరం విడుదల చేసిన ఫైనల్ మెరిట్ జాబితాలో తప్పిదాలు ఉన్నాయని, వాటిపై అప్పీలు చేసేందుకు గడువు కేవలం 24 గంటలు ఇవ్వడం వల్ల తమకు చెప్పే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. పరిశీలనకు వెనక్కు పంపాం నకిలీ ఫేక్ సర్టిఫికెట్లు వచ్చిన విషయాన్ని తాము గుర్తించామని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు విడుదల చేసిన ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు పంపించి నిర్ధారణ చేయాలని ఆదేశించామన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో నకిలీ అర్హత ధ్రువపత్రాల కలకలం ఆర్డీ కార్యాలయ పరిశీలనలో వెలుగులోకి వ్యవహారం కొలువు ఇప్పిస్తామని రూ. లక్షల్లో వసూలు చేస్తున్న దళారులు అభ్యంతరాలు స్వీకరించకుండానే తుది మెరిట్ జాబితా విడుదల కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టులను ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు రూ. లక్షల్లోనే వసూలు చేశారనే ఆరోపణలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు నర్సింగ్ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. దళారుల ప్రమేయం వల్ల అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులను ఆశ్రయించిన వారికే ముందస్తుగా ప్రొవిజనల్ లిస్టు జాబితాకు చేరుకోవడం వారి అనుమానాలకు ఊతమిస్తోందని చెబుతున్నారు. కార్యాలయంలో కొంత మంది సిబ్బంది సహకారం వల్లే దళారులు కార్యాలయం సమాచారం సేకరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి ఏపీ పీసెట్–2026
ఏఎన్యూ(పెదకాకాని): ఏపీ పీసెట్–2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్లో బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకూ దేహదారుఢ్య పరీక్ష, క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నుంచి ఈనెల 6వ తేది వరకూ పురుషులకు, ఏడు నుంచి 8వ తేదీ వరకూ సీ్త్రలకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం హాల్ టికెట్ నెంబరు 10001 నుంచి 10715, 4న 10716 నుంచి 11430 వరకూ, 5న 11431 నుంచి 12144 వరకూ జరుగుతాయన్నారు. 6న 12145 నుంచి 12858 వరకూ, 7న 30001 నుంచి 30680 వరకు, 8న 30681 నుంచి 31179 వరకూ జరుగుతాయన్నారు. పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్లు పరుగు, షాట్ ఫుట్, లాంగ్జంప్ గానీ హైజంప్ అంశాల్లో తప్పని సరిగా పాల్గొనాలన్నారు. నిర్దేశిత ఆటల్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నైపుణ్యం పరీక్షించబడుతుందని ఏపీ పీసెట్ కన్వీనర్ వివరించారు. -
సొంతంగా కంపెనీ స్థాపిస్తా..
మా స్వస్థలం సత్తెనపల్లి. 6వ తరగతి నుంచి గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదువుతున్నాను. నాన్న పిచ్చిరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ గౌతమి గృహిణి. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో రోజుకు 13 గంటలపాటు చదివాను. కాలేజీలో ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ, అధ్యాపకుల నుంచి ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నాను. మంచి ర్యాంకు సాధించాలని కష్టపడ్డాను. అయితే ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. ముంబై ఐఐటీలో సీఎస్ఈ బ్రాంచ్లో చేరతాను. చదువు పూర్తయ్యాక సొంతంగా స్టార్టప్ ప్రారంభిస్తాను. – వెన్నా ప్రవీణ్కుమార్ రెడ్డి, 34వ ర్యాంకు (ఓపెన్ కేటగిరీ) -
హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష
తెనాలిటౌన్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను మరింత విస్తృతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్ మున్సిపల్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్, ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్కుమార్, ఎన్పీఎంయూ దీపక్ గోయల్లు మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ జరగటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణను ఇప్పుడున్న 1.47 లక్షల టన్నులకు మించేలా చూడాలని చెప్పారు. పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ ద్రవవ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని 15–20 ఎంఎల్డీకి పెంచుకోవాలని సూచించారు. మొక్కల సంఖ్యను అధికంగా ఉండేలా చూడాలని సురభి మాలిక్ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి నాలుగు బుట్టల్లో చెత్త సేకరణ జరగాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఏసుబాబు, మున్సిపల్ ఇంజినీర్ పి.శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో పరిపాలనాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ మండల పరిషత్ కార్యాలయాల పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ అంశాలు, ఆడిట్ అభ్యంతరాలు, కోర్టు కేసులపై విస్తృతంగా చర్చించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మండల పరిషత్తు కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న లోకల్ ఫండ్, ఏజీ ఆడిట్ అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, ప్రస్తుత పరిస్థితిని రింగ్ ఫైళ్ల రూపంలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. జెడ్పీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, వాటి సంరక్షణ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రతి అధికారికి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై విద్యార్థులకు పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం(గుంటూరు) ఆధ్వర్యంలో రూపొందించిన వేస్ట్ టూ ఆర్ట్, వేస్ట్ టే వెల్త్ పర్యావరణ అవగాహన పోటీల పోస్టర్లను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఆవిష్కరించారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ ఇంజినీర్ ఎండీ నజీనా బేగం మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం, పర్యావరణ బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు వ్యక్తిగతం, బృందాలుగా పాల్గొనవచ్చునని వివరించారు. పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని, ఉత్తమ నమూనాలను రూపొందించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026రైతులపై బాబు మార్క్ రాజకీయం ● మాజీ సీఎం జగన్తో రాజధాని రైతుల సమావేశం ● అధికార పార్టీలో కలకలం ● అగమేఘాలపై పెనుమాకలో అన్నదాతలతో సీఆర్డీఏ సమావేశం ● గ్రామ సభను బహిష్కరించిన రైతులు ● రాజధానికి భూములిచ్చినా ఎందుకు వేధిస్తున్నారని నిలదీత ● తమపై కక్ష సాధింపు మానుకోవాలని హితవు ● రైతులకు అండగా ఉంటామన్న మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: భూములు ఇవ్వని రాజధాని రైతులను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది. నయానో భయానో భూములు లాక్కొనేందుకు చేయాల్సినదంతా చేస్తోంది. ఉండవల్లి, పెనుమాక రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఇష్టపడటం లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం, కొండవీటి వాగు విస్తరణ కోసం... ఇతర రోడ్ల కోసం అవసరమైన భూమిని ఇప్పటికే ఇచ్చారు. ప్రభుత్వం మిగిలిన భూమిని కూడా బలవంతంగా తీసుకునేందుకు భూసేకరణ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వారు కలవడానికి సిద్ధం కాగానే విషయం తెలుసుకున్న ప్రభుత్వం కంగారు పడింది. అప్పటికప్పుడు పెనుమాకలో గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, కురగల్లుకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఉండవల్లి అనేది లోతట్టు ప్రాంతమని, తాము భూములు ఇవ్వకుండానే ప్లాన్లు గీసేశారని పేర్కొన్నారు. ఉండవల్లి గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉండవల్లి భూములు చాలా విలువైనవని, రాజధాని రాకముందే తమ గ్రామంలో అపార్ట్మెంట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకూ ఉండవల్లి రోడ్డునే అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్నారని గుర్తుచేశారు. అయినా కనీసం రోడ్డు కూడా అభివృద్ధి చేయరా? అని నిలదీశారు. రాజధానికి భూములు ఇస్తే పిల్లలకు స్కూలు ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారని పేర్కొన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ప్లాట్లను కనీసం అభివృద్ధి కూడా చేయలేదన్నారు. రాజధానిలో తవ్వుకున్న మట్టిని విక్రయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఒకపక్క రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం, మరోపక్క ఆ రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ను కలవడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రెస్మీట్ పెట్టి వైఎస్ జగన్ను కలిసిన వారిలో రైతులే లేరంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. అయితే వైఎస్ జగన్ను కలిసిన వారందరూ భూసేకరణ బాధితులే కావడం గమనార్హం. 7తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, భూములు ఇచ్చేవరకూ తమ చుట్టూ తిరిగారని రైతులు వాపోయారు. భూములు ఇచ్చిన తర్వాత తాము అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట రోడ్డును విస్తరణ చేస్తే సరిపోతుందని, కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని రైతులు వాదిస్తున్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదు. భూసేకరణ తప్పనిసరి కాదని, ఇప్పటికై నా పూలింగ్కు ఇవ్వవచ్చంటూ హితబోధ చేశారు. అధికారుల వైఖరి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 519.90 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,933 క్యూసెక్కులు వస్తోంది. కనీసం గ్రామ సభకు నాలుగు రోజుల సమయం ఉంటుంది. హడావిడిగా మీటింగ్ ఉందంటూ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రకటించారు. అయినా రైతులు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గ్రామసభకు వచ్చారు. 11 గంటల వరకూ అధికారులు మాత్రం రాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో గతంలో భూములు ఇచ్చిన రైతులను తీసుకువచ్చి సమావేశంలో కూర్చొబెట్టారు. వారు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినా ఇప్పటివరకూ గ్రామ కంఠాలు నిర్ణయించలేదన్నారు. ఎక్కడో పల్లపు ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చారని, అవి కూడా అభివృద్ధి చేయలేదని నిరసన తెలిపారు. -
సామర్థ్యాలు పెంపొందించే ఆట చెస్
తాడికొండ: వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే ఆట చెస్ అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంతో వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహిస్తున్న వీఐటీ –ఏపీ అమరావతి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్– 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డీజీపీ మాట్లాడుతూ నాయకత్వం, దేశ నిర్మాణానికి అత్యంత అవసరమైన లక్షణాలు చెస్ ద్వారా పొందవచ్చన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం, ఆంధ్ర చెస్ అసోసియేషన్్ను ఆయన అభినందించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్–చాన్స్లర్ డాక్టర్ పి.అరుళ్మొళి వర్మన్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ సురేష్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ మాట్లాడారు. గుంటూరు ఈగిల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నగేశ్, ‘‘డ్రగ్స్ రహిత భారతదేశం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’’ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా -
అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో మానవత్వంతో వ్యవహరించాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా అర్జీలు పరిష్కరించాలన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం చూపకుండానే అర్జీలను మూసివేసే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలతో అధికారులు, సిబ్బంది మర్యాదగా మలచుకోవాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించమని అడిగే హక్కు ప్రజలకుంటుందన్న వాస్తవాన్ని మరచిపోకూడదన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. అనంతరం వచ్చిన 184 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. నగరంపాలెం: లక్షల్లో నగదు చెల్లించి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్ – గ్రీవెన్స్)కు 160 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను అలకించారు. బాధితులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదనరావు (గుంటూరు సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించిన వారిలో ఉన్నారు. గుంటూరు మెడికల్: మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధిఅకారి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, డీపీఎంఓ డాక్టర్ సుజాత, డెమో శివ సామిరెడ్డి, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిడో (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ప్రతిష్టాత్మక ‘జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్‘ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో జరిగిన ’సస్టైయినబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ( ఎస్సీ ఐఏపీ)’ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును జీఎంసీ మహిళా కార్మికులతో కలిసి కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణను అనుసంధానిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేసిన వినూత్న విధానాలకుగాను ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కమిషనర్ చెప్పారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. తొలి సంతకమే తుస్సు 6నారా లోకేష్కు నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే, సిగ్గు ఉంటే మెగా డీఎస్సీలో జరిగిన దగాకు సమాధానం చెప్పాలని అంబటి పేర్కొన్నారు. లోకేష్ పుట్టిందే ఏదోక పదవి కోసమని, ఇటీవల మంత్రి నుంచి సీఎం అయ్యేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయలేక కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయిస్తున్నారని పత్రికల్లో వార్తలు రాయించడం కాదని, మంత్రి లోకేష్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రాష్టంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్ సీపీ మాట్లాడుతుందన్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరఫున మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ ఉందని చెప్పారు. నారా లోకేష్ రాజీనామా చేయాలని లేకుంటే మెగా డీఎస్సీపై సీబీఐ విచారణైనా చేయించాలని డిమాండ్ చేశారు. -
సంగం డెయిరీ రైతులదా... టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రదా?
గుంటూరు ఎడ్యుకేషన్: రైతుల సంక్షేమం కోసం సహకార రంగంలో స్థాపించిన సంగం డెయిరీని లిమిటెడ్ కంపెనీగా మార్చిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డెయిరీ ఆస్తులతో ప్రైవేటుగా వ్యాపారాలు సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. సంగం డెయిరీ ముసుగులో నరేంద్ర చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సంగం డెయిరీ రైతులదా.. ధూళిపాళ్ల నరేంద్రదా అనే విషయం తేల్చాలి. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయించాలని రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కేందుకు నరేంద్ర ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులు పంట నిల్వ చేసుకున్న గోదాముకు నరేంద్ర ప్రోద్బలంతో సీలు వేసినప్పటికీ... విచారణ అనంతరం కలెక్టర్ ఆదేశాలతో తిరిగి తెరిచారు. సంఘటన జరిగిన తర్వాత మామిళ్లపల్లిలో ఆరుగురు కాపు, నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదం సర్దుమణిగిన తర్వాత శాంతి, భద్రతల పేరుతో మహిళలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. వీరితోపాటు మామిళ్లపల్లిలో మరో 14 మందిపై ఎమ్మెల్యే నరేంద్ర తప్పుడు కేసులు పెట్టించారు. మొక్కజొన్న పంట కొనుగోలు వ్యవహారం, రైతులకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్సీపీ సాగిస్తున్న పోరాటాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ కేసులను తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తాం’’ అని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లేందుకు నరేంద్ర సిద్ధం కావాలి ‘‘మహిళలపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోకుంటే తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల ఉద్యోగాలను వైఎస్సార్ సీపీ అధికారంలోకా రాగానే ఊడగొడతాం. ఎమ్మెల్యే నరేంద్ర సైతం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. కాపు మహిళలపై మోపిన తప్పుడు కేసులపై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. మరోవైపు డెయిరీ స్థలంలో తండ్రి పేరుతో నరేంద్ర డీవీసీ ఆస్పత్రి నిర్మించి, వ్యాపారం చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే ఆస్పత్రి నిర్మించారు తప్ప అక్కడ పనిచేస్తున్న వైద్యులకు సరైన అర్హతలు లేవని ప్రజలే ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా సంగం డెయిరీ చైర్మన్ పదవిలో గుత్తాధిపత్యం చేస్తున్న నరేంద్ర వ్యవహారంపై సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో దళారీలా మారిన నరేంద్ర రైతుల పంటలకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు’’ అని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో భాష్యంకు ర్యాంకులు
గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్లోని మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థి వెన్నా ప్రవీణ్కుమార్రెడ్డి అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 34వ ర్యాంకు కై వసం చేసుకుని విజయకేతనం ఎగురవేశాడని చెప్పారు. 6వ తరగతి నుంచి భాష్యం ఐఐటీ ఫౌండేషన్తో ఘన విజయాన్ని సాధించాడని అన్నారు. వివిధ కేటగిరీల్లో జె.చాము వర్షిత్ అఖిలభారతస్థాయిలో 3వ ర్యాంకు, సీహెచ్ సాహిల్ 6వ ర్యాంకు, డి.పవన్కుమార్ 16వ ర్యాంకు, కె.రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్ నూర్బాషా 42వ ర్యాంకు, వై.ప్రవచన 54వ ర్యాంకు, ఆర్.బాలానాయక్ 76వ ర్యాంకు, సీహెచ్.వెంకట నాగపవన్ 82వ ర్యాంకు వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. 100లోపు తొమ్మిది, 200లోపు 21, 500లోపు 53, వెయ్యిలోపు 93, రెండువేలలోపు 126, ఐదువేల లోపు 235 ఆలిండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటీ సెలెక్షన్స్లో ఆలిండియా అల్ టైం ది బెస్ట్గా నిలిచిందన్నారు. ఇటీవల జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరిలో 100 పర్సంటైల్ తో పాటు ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన భాష్యం విద్యార్థి టి.దుర్గా సుప్రభాత్కు రూ.10 లక్షల చొప్పున ఉన్నత చదువు కోసం నగదు ప్రోత్సాహక చెక్కు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, భాష్యం ఐఐటీ ప్రోగ్రామర్ ఆనందకుమార్ అభినందించారు -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
పసూపర్..!
గుంటూరు, కృష్ణా, ఇతర రాష్ట్రాలలోని రైతులు విత్తన మార్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపును విత్తనానికి వాడతారు. దీంతో కడప పసుపు విత్తనాలకు గిరాకీ ఉంది. మా తాతలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి కడప పసుపు తీసుకువచ్చి ఇక్కడకు వచ్చే రైతులకు అమ్మేవారు. ఇక్కడ విత్తన పసుపునకు మార్కెట్ ఏర్పడటం, గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతున్నాం. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో ఈ ఏడాది పంట దిగుమతులు సరిగా లేనందున ఈ ఏడాది ఇక్కడ నుంచి గతంలో కంటే అధికంగా విత్తనం అక్కడికి వెళుతుంది. దీంతో ఈ సారి విత్తనానికి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువుగా ఉంది. – బి.పి.తిరుమలేష్, యువ రైతు, మైదుకూరు, వైఎస్సార్ కడప జిల్లా కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం పరిధిలోని కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం మార్చి నెలలో దిగుమతులు చేసుకుని మే చివరి వారంలోను, జూన్ మొదటి వారంలోను తొలకరి వర్షాలు రాగానే గ్రామంలో అమ్మకాలు ప్రారంభిస్తారు. ఈ సారి కడప నుంచి దిగుమతులు తక్కువ రావటంతో పుట్టి సుమారు రూ.7500 నుంచి రూ.8000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండంలోని రైతులు, వైఎస్సార్ కడపజిల్లాలోని మైదుకూరు గ్రామంలోని వ్యాపారులు కలసి అక్కడి నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని తూములూరు గ్రామంలో రెండు నెలలు నిల్వ చేసి తొలకరి వర్షాలు రాగానే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. నాణ్యమైన విత్తనాలు లభ్యం గత 45 ఎళ్లుగా కడప జిల్లా లో వివిధ ప్రదేశాలల్లో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17వేల నుంచి 18 వేల పుట్ల వరకు పచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. ఏడాది గ్రామంలోకి 240 లారీలకు గాను 14,400 పుట్లు దిగుమతి వ్యాపారులు చేశారు. గత సంవత్సరం 300 పై చిలుకు లారీల ద్వారా దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం సుమారు 100 లారీలు తక్కువ లారీలు దిగుమతి అయ్యాయి. దీంతో విత్తనం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న విత్తనం రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులతో పాటు ఒడిశా నుంచి కూడా పసుపు రైతులు వచ్చి కొనుగోలు చేస్తారు. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో సుమారు 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది. ఈ ఎడాది మహారాష్ట్రలో పసుపు దిగుబడులు తక్కువగా ఉండటం వలన ఇప్పటికే ఇక్కడ నుంచి సుమారు 50 లారీల పసుపు మహారాష్ట్రకి పంపటానికి వ్యాపారులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. రెండేళ్లుగా నిరాశే! గత రెండేళ్లుగా ఎండు పసుపునకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.70 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు అమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలక పోవడంతో నష్టాలను చవిచూశారు. దీంతో ఈ ఏడాది 14వేల పుట్లు నిల్వ చేశారు. ఈసారి మహారాష్ట్రలో పసుపు దిగుబడులు రాకపోవటంతో ఇప్పటికే కొంత మంది రైతులు ఇక్కడ ఉన్న పసుపు విత్తనాన్ని పావు వంతు కొనుగోలు చేశారు. దీంతో తక్కువ దిగుమతి చేసుకోవడం, ఇప్పుడు ముందుగానే కొనుగోలు కొంత జరగటం వలన విత్తన పసుపునకు మరో 10 రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు భావిస్తున్నారు. పస్తుతం పుట్టు రూ.7500 నుంచి రూ.8000 వరకు అమ్మకాలు ప్రారంభించారు. గత ఏడాది జూన్ నెలలో పుట్టు రూ.5500 నుంచి రూ.7000 వరకు అమ్మినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరు పేట, బాక్రాపేట, తమిళనాడు సేలం, సుగంథ, కడప, మైదుకూరు, ప్రగడ వరం వంటి రకాలు ఇక్కడ ప్రతి ఏడాది దిగుమతి అవుతాయి. ఈ సారి గ్రామంలోకి తమిళనాడు సేలం, మైదుకూరు కడప వంటి పసుపు విత్తనాలు మాత్రమే దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొల్లిపర మండలంలో ఎక్కువ శాతం రైతులు సేలం రకం విస్తారంగా సాగు చేస్తారు. మిగిలిన జిల్లాలోని రైతులు వారి పంట భూములకు అనుకూలంగా ఉందే విత్తనాలను కొనుగోలు చేస్తారు. -
సుందరం చేస్తారా..
జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా సుందరాచారిగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో పలు సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలి. కానీ పలువురు సీనియర్ వైద్యులు మధ్యాహ్నం కల్లా సొంత క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా జూనియర్ వైద్యులతోనే రోగులకు ఓపీ సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బెడ్సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఉదయం ఓపీ వేళల్లోనే రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లిపోతున్నారు. తద్వారా వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. కార్యాలయంలో లంచావతారులు పరిపాలనా కార్యాలయంలో ఏఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా, ఫైల్ముందుకు వెళ్లాలంటే మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. రీయింబర్స్మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి మామూళ్లు ముట్టజెబితేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు. కార్యాలయంలో పరిపాలనా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అడ్మినిస్ట్రేషన్ పరంగా వైద్య కళాశాల ఏడీ, జీజీహెచ్ ఏడీ మధ్య సమన్వయలోపంతో పలు ఫైల్స్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. నర్సింగ్ కార్యాలయంలో మామూళ్ల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఫోన్పేలు చెల్లించుకుని నచ్చిన చోట డ్యూటీలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కొంత మంది సిబ్బందికి ఓపీ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ఆరోగ్యశ్రీ పారితోషకాలు వచ్చే వార్డుల్లోనే డ్యూటీలు వేస్తున్నారని, వారి వద్ద మామూళ్లు తీసుకోవడం వల్లే కంటిన్యూగా ఒకే వార్డులో ఉంచుతున్నట్లు వాపోతున్నారు. క్యాజువాల్టీలో సమస్యలు క్యాజువల్! జీజీహెచ్కు గుండెకాయలాంటి క్యాజువాల్టీని చక్కబెట్టాల్సిన బాధ్యత నూతన సూపరింటెండెంట్పై ఉంది. క్యాజువాల్టీలో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు, డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు అందుబాటులో ఉండటం లేదని పలు మార్లు ఫిర్యాదులు వచ్చాయి. క్యాజువాల్టిని పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డెప్యూటీ ఆర్ఎంఓలు ఆసుపత్రిలో నివాసం ఉండటం లేదు. వారే డ్యూటీలో ఉండకపోవడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో చికిత్సకోసం వచ్చిన వారు సకాలంలో వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యలపై దృష్టి సారించాలి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి ఏడాదిలోనే రూ. 10 కోట్ల దాతల విరాళాలతో కళాశాలను అభివృద్ధి చేసి రాష్ట్రంలో రోల్మోడల్గా గుంటూరు వైద్య కళాశాలను డాక్టర్ సుందరాచారీ తీర్చిదిద్ది పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. గతంలో జీజీహెచ్లో న్యూరాలజీ విభాగాధిపతిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాతల సహాయంతో పక్షవాత రోగుల కోసం స్ట్రోక్ యూనిట్, స్ట్రోక్ ఐసీయూను, స్లీప్ ల్యాబ్ను ఏర్పాటు చేయించి, పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందేలా చేశారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పేదలకు మెరుగైన వైద్య సేవలు, సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు నూతన సూపరింటెండెంట్ను కోరుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుందరాచారి గుంటూరు మెడికల్: పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. అవసరమైతే రోగిని వీల్చైర్లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్ యశస్వి రమణ నుండి డాక్టర్ సుందరాచారి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుందరాచారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ క్యాజువాలిటీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదట గా జీజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు జమ్ముల అరుణ్, నూతక్కి శ్రీకాంత్, వేణు, లంకపల్లి శ్రీనివాస్,జీవీ కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్స్ వాసిరెడ్డి కార్తిక్, తిరుపతిరావు, ఆనంద్, పలువురు నర్శింగ్ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
వేధిస్తున్న మందులు, సర్జికల్స్ కొరత
జీజీహెచ్లో కొన్ని వైద్య విభాగాల్లో అత్యవసర మందులు, సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉండక చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీలో సైతం అన్ని మందులు అందుబాటులో ఉండటం లేదు. చికిత్స కోసం పలు జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తున్న పేద రోగులు జీజీహెచ్లో మందులు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా జీజీహెచ్లో లభించక బయట బ్లడ్ బ్యాంకుల నుంచి రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. జీజీహెచ్ బ్లడ్బ్యాంక్పై పర్యవేక్షణ లోపించిందని, అందువల్లే రోగులు సకాలంలో బ్లడ్ లభించక బయట బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి ఆన్లైన్లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉర్దూ ప్రాథమిక శిక్షణ తరగతులను సోమవారం నుంచి 30 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్ నాగూర్వలీ ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక అంశాలు సులభంగా బోధిస్తామని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్యా, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ స్థాయి లో ఉర్దూను చదవడంద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లగలరని, వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపా లెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసా దాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పటమట(విజయవాడతూర్పు): ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా’ ముగింపు సదస్సు జూన్ 1, 2 తేదీల్లో విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోయూహెచ్ఏ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఊయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ సుస్థిరత, వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్ మిషన్, జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న జెమ్ అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రదానం చేయనున్నారని తెలిపారు. జూన్ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల చార్జింగ్ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించనున్నారన్నారు. -
ఇదేనా మర్యాద!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతాఽధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకై నా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
హ్యాకథాన్లో మంగళగిరి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8 లక్షల నగదును అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు -
ఇక్కడ మామూళ్లు మామూలే..!
జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే తమ చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలంటే అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒకరేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి మామూళ్లు వసూలు చేస్తారు. చనిపోయిన వారిని ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రిళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ప్రైవేటు అంబులెన్సులు ఆశ్రయించి మృతుల బంధువులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. పగలు మహాప్రస్తానం వాహనాల్లో భౌతికకాయాలు తీసుకెళ్లినప్పటికీ కొంత మేరకు ముడుపులు చెల్లించాల్సి వస్తుందని మృతుల బంధువులు వాపోతున్నారు. -
బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు
లక్ష్మీపురం: చోరీ కేసు లో విచారణ నిమిత్తం ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్కు వచ్చిన ఓ యువకుడు బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన తమలపల్లి దుర్గ హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మార్క్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఒక మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. రెండో కుమార్తె నాగతేజ, అల్లుడు రాజశేఖరరెడ్డి ఇద్దరు కలిసి ఏప్రిల్ నెలలో వారి వద్ద ఉన్న 26 గ్రాముల బంగారం, వెండి, రూ.37 వేలు నగదు తల్లి వద్ద భద్రపరిచారు. దుర్గ తమ్ముడు వెంకటేశ్వర్లు నిత్యం మద్యం తాగుతుంటాడు. ఏప్రిల్ 29వ తేదీన వెంకటేశ్వర్లు తన అక్క ఇంట్లో లేని సమయంలో వచ్చి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును చోరీ చేసి పరారయ్యాడు. దుర్గ ఇంటికి వచ్చిన తర్వాత బీరువా తెరచి చూడగా సొత్తు కనిపించలేదు. దీంతో ఇల్లు అంతా వెతుకలాడింది. తన తమ్ముడు ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని అతడిని నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. మే 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. అరండల్పేట పోలీసులు వెంకటేశ్వర్లును స్టేషన్కు పిలిపించి కేసు నమోదు చేసి విచారించారు. పోలీసుల విచారణలో చోరీ చేసిన బంగారం, వెండి, నగదు విజయవాడ మొఘల్రాజపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు భార్య మాదిగాని జయ, కుమారుడు గోపీలకు ఇచ్చినట్లు అంగీకరించాడు. అరండల్పేట పోలీసులు తల్లి, కుమారుడిని పిలిపించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు భార్య జయ, కుమారుడు గోపి వీరంగం వేశారు. తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఈ బంగారం, వెండి, నగదు చోరీ వ్యవహరం తమకు తెలియదంటూ కొద్దిసేపు స్టేషన్ బయట వీరంగా చేసి గోపి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపికి స్వల్ప గాయం కావడంతో గమనించిన పోలీసులు జీజీహెచ్కి తరలించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారంఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. -
వ్యవసాయాన్ని కాపాడుకుందాం..
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలో రాజధాని రైతు సంఘం 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎస్కే పేరు సాహెబ్, జి.నాగేశ్వరరావు వ్యవహరించారు. తొలుత రైతు సంఘం జెండాను ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట టి.బక్కిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం తెస్తామన్న మోదీ, కూటమి ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానాలకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు వాడకం సగానికి తగ్గించేశారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే వ్యవసాయం మనుగడని పేర్కొన్నారు. పొదుపు పేరుతో ఆహార పదార్థాలు, నూనెలు తగ్గించి వాడమంటున్నారని, పాలన చేతకాని ప్రభుత్వాలలే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవ్రంగా ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ల్యాండ్ బ్యాంక్ విధానం రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడానికే అని స్పష్టం చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని 10 శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల రూపాయితో డాలర్ విలువ తీవ్రంగా పడిపోయందని విమర్శించారు. అమెరికాలో 10 లక్షల మంది భారతీయులు వీసా రాక, ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రవి, కె.జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సన్మానం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్ఐలు కె.రాజశేఖర్బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
గాదె వెంకటరెడ్డికి ప్రముఖుల నివాళులు
ఇంకొల్లు (చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మృతిచెందగా, శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరై సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, నరసరావుపేట,చీరాల మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం కేపీ కొండారెడ్డి, చీరాల పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, అంబటి హరినాథ్ , మారెళ్ళ వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, రామారావు, వై శివారెడ్డి, పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు గ్రామ అధ్యక్షులు, అభిమానులు, రిటైర్డ్ అధికారులు నివాళులర్పించారు. సజ్జల, అంబటితో పాటు హాజరైన పలువురు నాయకులు -
మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటరు రూ.30లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లకు, పవర్ స్పెయర్లకు రూ.50లకు లీటర్ పెట్రోలు సరఫరా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు న్యాయమైన ధర కల్పించి, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న, అపరాలకు రైతులు నష్టపోకుండా స్వామినాథన్ సిఫార్సు మేరకు 50 శాతం మిగులు ఉండునట్లు కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయ కులు ముప్పాళ్ల శివశంకరరావు, ప చ్చలసాంబశివ రా వు, ఆంజనేయులు ,వేణు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగాయి. సమావేశంలో జేసి మాట్లాడుతూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్పై ప్రమాదాల పట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. అవసరమైతే బారికేడింగ్ పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. నరసరావుపేట రహదారిలో డోకిపర్రు వద్ద ప్రమాదాల నివారణకు ఆక్రమణలు తొలగించాలన్నారు. వెస్ట్రన్ బైపాస్ వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, ఏ దిశగా వెళ్లాలో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాటుచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విద్యాసంస్థలు, వాటి చుట్టుప్రక్కల ఎట్టి పరిస్థితుల్లోను మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చూడాలన్నారు. ఉప రవాణా కమిషనర్ కే సీతారామిరెడ్డి మాట్లాడుతూ రహదారులపై ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో 19, రహదారులు, భవనాలు శాఖ పరిధిలో 16 బ్లాక్ స్పాట్ లను గుర్తించామని చెప్పారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇది శుభం కాదు
శుభం కోల్డ్స్టోరేజీ వ్యవహారంలో రైతులతో టీడీపీ ప్రభుత్వం చెలగాటంతెనాలి: ‘మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో 2024 జనవరి 19న జరిగిన అగ్నిప్రమాదంలో రైతులు కోల్పోయిన ప్రతి బస్తా పసుపు, ఇతర పంట ఉత్పత్తులు, వ్యవసాయ సామగ్రికి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలి’...2024 ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో అంశమిది. అన్నిటికీ బీమా చెల్లించడం ముఖ్యం...వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించాలనీ సూచించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ఏడాది జూలై 10న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు నష్టపరిహారంగా క్వింటాకు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కోల్ట్స్టోరేజీలోని సరుకులు, నిర్మాణానికి వచ్చే బీమా మొత్తాన్ని రైతులు/వ్యాపారులకు చెల్లించేందుకు సంబంధిత యజమాని అంగీకారం తెలిపారు. కాలి బూడిదైన 4వేల బస్తాల పంట దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్స్టోరేజీలో 2024 జనవరి 19న అగ్రిప్రమాదం జరిగింది. అందులో రైతులు నిల్వ చేసుకున్న లక్షా నాలుగు వేల బస్తాల పసుపు పంట దగ్ధమైంది. మార్కెట్లో కొన్నేళ్లుగా పసుపు ధరల్లో నెలకొన్న మాంద్యం కారణంగా చాలామంది రైతులు కోల్డ్స్టోరేజీలో నిల్వ చేసుకున్నారు. మార్కెట్లో ధర వచ్చినపుడు అమ్ముకోవచ్చన్న ఆశతో గుంటూరు జిల్లా రైతులే కాకుండా బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికిపైగా ఇక్కడ పసుపు పంటను నిల్వ చేసుకున్నారు. 2024 జనవరిలో సంక్రాంతి పండగ నాటికి క్వింటా ధర రూ.13,600కు చేరుకుంది. నేడో, రేపో కోల్ట్స్టోరేజి నుంచి పసుపును తీసుకుని మార్కెట్లో అమ్ముకుందామని రైతులు భావిస్తున్న సమయంలో అదే నెలలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పటికి పసుపునకు గల ధరలో సగానికి మాత్రమే బీమా చేసిన కోల్డ్స్టోరేజీ నిర్వాకం తెలిసి నివ్వెరపోయారు రైతులు. నిల్వ ఉన్న సరుకు విలువకు తగినట్టుగా రూ.115 కోట్లకు బీమా కాకుండా రూ.40 కోట్లకే ప్రీమియం చెల్లించి, తమను నట్టేట ముంచారని రైతులు ఆవేదన పడ్డారు. అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను కలిశారు. ఆయన జిల్లా కలెక్టరును సంప్రదించగా, రైతులకు జరిగిన నష్టంపై విచారణ కమిటీని వేశారు. అంతటితో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అగ్నిప్రమాద బాధిత రైతుల కమిటీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు చెప్పినట్టు అప్పటి మార్కెట్ ధర క్వింటాలుకు రూ.13వేలు చొప్పున పరిహారం వచ్చేలా చూడాలని కోరారు. అందుకు ససేమిరా అన్న మంత్రి క్వింటాలుకు రూ.7 వేలు వచ్చేలా చూస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా మంత్రి హామీ కార్యరూపం దాల్చకపోవటంతో విసుగెత్తిన బాధిత రైతులు 2025 జనవరి 20న సంబంధిత బీమా కంపెనీ, తెనాలి శాఖ ఎదుట ధర్నాకు పిలుపు నిచ్చారు. మంత్రి లోకేశ్ కార్యాలయం సూచనపై ధర్నాను వాయిదా వేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత బీమా పరిహారం రూ.20 కోట్లు వచ్చింది. ఆ మొత్తాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కార్యాలయంలో అందచేశారు. ఆ ప్రకారం ఒక్కో రైతుకు రూ.400 నుంచి రూ.2300 వరకు మాత్రమే లభించింది. మంత్రి హామీ ప్రకారం రావాల్సిన రూ.7 వేలకు వ్యత్యాసం కింద రావాల్సిన మొత్తం ఇప్పటివరకు అందనేలేదు. ఇప్పటికి రెండేళ్లు గడిచాయి. తీరా ఇప్పుడు మరో ప్రతిపాదనను రైతుల ముందుకు తెచ్చారు. గతేడాది కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం ఇచ్చిన బీమా సొమ్ముతో కలిపి క్వింటాలుకు రూ.5 వేల చొప్పున ఇస్తామనీ, దానిని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి సంతకాలు చేయాలంటూ కోల్డ్ స్టోరేజీ యజమాని ఓచర్లు పంపారు. మార్కెట్రేటు ప్రకారం పరిహారం చెల్లించాలన్న చంద్రబాబునాయుడు, అధికారంలోకి వచ్చాక రూ.7 వేలకు పరిమితం చేశారు. రెండేళ్లు గడిచాక ఇప్పుడు రూ.5 వేలకు ఫైనల్ సెటిల్మెంటు అంటూ సంతకాలు చేయాలనటం ఏమిటని రైతులు ఆవేదన పడుతున్నారు. -
ప్రతిభా పురస్కారాలు అందజేత
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): విద్యతోనే అత్యుత్తమ స్థానాలను దక్కించుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు, వారికి నగదు, బ్యాగులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. బీసీ గురుకులాలు, హాస్టల్లో నిరంతరం విద్యుత్తుకు ఇన్వర్టర్లను అమర్చుతున్నామని చెప్పారు. క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చేలా స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎయిమ్స్లో మహిళ అదృశ్యం తాడేపల్లి రూరల్: పట్టణ పరిధిలోని ఎయిమ్స్లో రోగికి సహాయకురాలిగా వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ మేరకు రోగి పి.శ్రీలక్ష్మి శనివారం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన శ్రీలక్ష్మి వైద్య నిమిత్తం ఎయిమ్స్కు వస్తూ తన బంధువైన మహాలక్ష్మిని సహాయకురాలిగా వెంట తెచ్చుకుంది. మతి స్థిమితం లేకపోవడంతో మహాలక్ష్మి ఈ నెల 29వ తేదీన అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొంది. వివరాలకు 7995201371, 8074102715 సంప్రదించాలని కోరారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ సుందరాచారి
జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి బాపట్ల: భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోనున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్లో ‘బీచ్ ఆఫీసు’, ‘బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సెంటర్’లను మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వరరావు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాలను మంత్రి పరిశీలించారు. బే ఆఫ్ బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీచైన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్ వద్ద పునఃనిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, ఇన్చార్జి టూరిజం ఆఫీసర్ ఆనంద్ సత్యపాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ప్రతి ఒక్కరూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్లోని పలు యూనిట్లలో ఉద్యోగోన్నతి పొందిన 24 మంది సీఐలు శనివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజా సేవా దృక్పథంతో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని సూచించారు. సీఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో గుంటూరు జిల్లాలో పది మంది, పల్నాడు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, సీఐడీలో ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, సీీసీఎస్ నుంచి ఒక్కొక్కరూ ఉన్నారని తెలిపారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం ఆ తీవ్రత మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. -
ముఖదర్శనం తప్పనిసరి
విద్యార్థులకూ ముఖ ఆధారిత హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, ఖాళీ సమయంలో కళాశాలకు వెళ్లకుండా ఉండడం, ఇష్టమొచ్చినప్పుడు కళాశాలలో బోధన చేయడం, కళాశాల ముఖమే చూడకుండా కేవలం సర్టిఫికెట్ల కోసమే కోర్సులు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇటువంటి వారికి చెక్ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు ప్రైవేటులోనూ అమలుకు రంగం సిద్ధం -
జూన్ ఒకటి నుంచి ధరల పెంపుపై ఆందోళన
వామపక్ష పార్టీల నాయకుల వెల్లడి లక్ష్మీపురం: పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ఆందోళన నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్షాల సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్కుమార్, సీపీఐ(ఎంఎల్) నాయకులు యు.నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్ రాష్ట్ర నాయకులు మన్నవ హరిప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపోరు నాయకులు పి.కొటేశ్వరరావు, ఎం.సీపీఐ(యూ) నాయకురాలు డి.నాగలక్ష్మి విలేకరులలో మాట్లాడారు. జూన్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన రాస్తారోకో చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేయాలని, 4వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహించాలని, 9వ తేదీన జరిగే రాస్తారోకో పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఈమని అప్పారావు పాల్గొన్నారు. -
సారీ.. కమిషనర్
అమృతరావు దాడి ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని క్షమాపణ నగరంపాలెం: గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు దాడి ఘటన, అనంతరం ప్రెస్మీట్ నిర్వహించి కమిషనర్పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నార్ల ఆడిటోరియం పునః ప్రారంభ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరంసభలో మంత్రి మాట్లాడుతూ... గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయతీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కమిషనర్పై ఇలా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, లేదంటే తన వద్దకు రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీస్లపైకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికిగాను నగర కమిషనర్కి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రజుమంలో పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నాయకులు, నగర కమిషనర్ మయూర అశోక్, అన్నమయ్య సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. -
సర్కారు మాటల్లోనే లైబ్రరీలు
గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య కాలంలో నిర్వీర్యమైపోయిన గ్రంథాయాలకు తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ సర్కారు పునర్వైభవం తెచ్చే దిశగా సాగింది. ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నాడు–నేడు ద్వారా ఆధునికీకరించి, మౌలిక వసతులు కల్పించారు. వైఎస్ జగన్ పుణ్యమాని ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ కృషి ఫలితంగానే 2024–25 సంవత్సరంలో రూ.16.05 కోట్ల మేరకు సెస్ బకాయిలు వసూలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సెస్ బకాయిలు విడుదలకు నోచుకోలేదు. అదే విధంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు నిరుద్యోగ ఉద్యోగార్థులు గ్రంథాలయాలపైనే ఆధారపడుతున్నారు. కాలానుగుణంగా రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుడు హామీలు గ్రంథాయాల నిర్వహణకు నిధులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం... డిజిటల్ గ్రంథాయాలను తెస్తామని ఊదరగొడుతోంది. రాజధానిలో ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మిస్తామని కాలం గడుపుతోంది. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ గ్రంథాలయం అని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అడ్డగోలు హామీ ఇవ్వడం మినహా ఒక్క అడుగు సైతం ముందుకు పడటం లేదు. గుంటూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 97 శాఖ, 41 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. మరో 106 పుస్తక పంపిణీ కేంద్రాలున్నాయి. 71 శాఖ గ్రంథాలయాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, 15 అద్దె, ఇంకో 12 అద్దె మినహాయింపులతో నడుస్తున్నాయి. ఆయా గ్రంథాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 205 పోస్టుల్లో ప్రస్తుతం 115 మంది పని చేస్తున్నారు. 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజ్ఞాన భాండాగారాలు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్నాయి. సమాజానికి పుస్తక పఠనాన్ని నేర్పిన గ్రంథాలయాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గ్రంథాలయాల అభివృద్ధికి పైసా నిధులు కేటాయించడం లేదు. పైగా ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో సెస్ రూపంలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వాటాను ఎగ్గొట్టారు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటల్లోనే ప్రభుత్వం కోటలు కడుతోంది. -
ఆసుపత్రుల్లో ఫైర్ ఆడిట్ జరగాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఫైర్ ఆడిట్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, ఎన్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ్శేఖర్ పాల్గొన్నారు. ● వేసవి సెలవుల నేపథ్యంలో నీటి గుంటలు, ఊబి ప్రదేశాల వద్ద ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం పోటీ
గుంటూరు మెడికల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్ వైద్యులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ యశస్వి రమణ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనెల 31 ఆదివారం కావటంతో శనివారం సాయంత్రానికల్లా సూపరింటెండెంట్గా ఎవరిని నియమిస్తున్నారో ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో సూపరింటెండెంట్ సీటు ఎవరిని వరిస్తుందోనని వైద్యులు, వైద్య సిబ్బంది అంతటా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్ వైద్యులు పోటీ పడుతున్నారు. జూన్ నెల 1 నుంచి కొత్త సూపరింటెండెంట్ విధులు చేపడతారు. ముగ్గురు చొప్పున పురుషులు, మహిళలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఈసారి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పోటీ పడుతుండడం ఆసుపత్రి వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.వి.సుందరాచారి రేసులో ఉన్నట్లు సమాచారం. న్యూరో సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణమూర్తి డీపీసీ సీనియార్టీ జాబితాలో నాల్గవ పేరులో ఉన్నారు. సూపరింటెండెంట్ రేసులో ఈయన కూడా ఉన్నారు. ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ అనుమల కవిత, మానసిక విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి, గతంలో గుంటూరు జీజీహెచ్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేసి, ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పద్మశ్రీలు సూపరింటెండెంట్ పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట వరకు విజయవాడ జీజీహెచ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు (ఏవైరావు) ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ రఘునందన్ను నియమించింది. విజయవాడ తరహాలో గుంటూరు జీజీహెచ్కు, వైద్య కళాశాలకు ఒక్కరినే నియమించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న డాక్టర్ సుందరాచారికి సూపరింటెండెంట్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. డాక్టర్ ఉమాజ్యోతి గతంలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. కొన్ని రోజులపాటు ఇన్చార్జి సూరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. గతంలో పనిచేసిన అనుభవంతోపాటు, ఎన్నారై మద్దతు ఉండటంతో సూపరింటెండెంట్ సీటు దక్కే అవకాశాలు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్ ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయని, సూపరింటెండెంట్ సీటు వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ కవిత భర్త డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ అండదండలు ఉండటం వల్ల డాక్టర్ కవితకు సూపరింటెండెంట్ పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. డీపీసీ సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో డాక్టర్ సత్యనారాయణమూర్తి పేరు ఉండటంతో ఈయనకు సూపరింటెండెంట్ పదవి రావచ్చనే భావిస్తున్నారు. డాక్టర్ పద్మశ్రీ నెల్లూరులో పనిచేసిన పరిపాలనా అనుభవంతో విజయవాడ సూపరింటెండెంట్గా ప్రయత్నించి అక్కడ విఫలమవడంతో ఇప్పుడైనా ఇవ్వాలంటూ తన పలుకుబడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సూపరింటెండెంట్ పదవి ఎవరిని వరిస్తుందో శనివారం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. -
మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలన
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ను శుక్రవారం ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ, రాజ్యసభ సభ్యుడు సి.విజయేంద్రప్రసాద్లు పరిశీలిచారు. జిల్లా, స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన వారు మ్యాజిక్ డ్రెయిన్ పనితీరు, మురుగు ఇంకే విధానం స్వయంగా అధ్యయనం చేశారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, నిర్మాణానికి రా మెటీరియల్ ఏమేమి ఎంత మొత్తంలో వినియోగించారు, పనితీరు ఎలా ఉంది అనే అంశాలను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మ్యాజిక్ డ్రెయిన్ వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా, గతంలో మురుగు పారుదలకు, ఇప్పుడు మ్యాజిక్ డ్రెయిన్తో మురుగు ఇంకుతున్న తీరుకు ఏమైనా తేడా గమనించారా అని ప్రశ్నించారు. గతంలో మురుగు సక్రమగా తియ్యక, పారుదల లేక రోజుల తరబడి నిలిచి దోమల ఉధృతి అధికంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ డ్రెయిన్ నిర్మాణంతో మురుగు అంతా ఇంకిపోతుందని మహిళలు తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీవీవో హనుమతంరావు, ఎంపీడీవో కె.శివపార్వతి, ఏపీవో ఏడుకొండలు తదితరులున్నారు. స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి పెదకాకాని: ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధించడానికి స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. మండల పరిధిలోని అనుమర్లపూడి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): చైనాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఎక్విప్డ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జూనియర్ విభాగంలో ఇ.లక్ష్మి వినయశ్రీ, మదిన షారూను బ్రాంజ్ పతకాలు, సబ్ జూనియర్ కేటగిరీలో బి.లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారితో ముచ్చటించి సాధన, పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.అఫ్రోజ్ ఖాన్, కోచ్ సాయి రేవతి పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూన్ 3వ తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు, ఇతర సమన్వయ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, భవన అంతస్తులను సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం వద్ద నుంచి సీఎం సందర్శించే ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, వీవీఐపీల రాకపోకల మార్గాలు, ప్రజల రాకపోకలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారంనాటికి ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 521.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 6,906 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది. 7 -
మెగా కాదు... దగా డీఎస్సీ
అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్: అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వకుండా అవినీతి, అక్రమాలతో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ముమ్మాటికీ దగా డీఎస్సీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, విద్యార్థి విభాగ నాయకులు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరంలో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీపురం నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చారు. పార్టీ నేతలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. డీఎస్సీ నిర్వహణలో టీడీపీ సర్కారు, మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన 16 వేల పోస్టుల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఫలితంగా మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని మండిపడ్డారు. కృష్ణాజిల్లాకు చెందిన నవీన్కు మొదటి ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రావీణ్యం లేనివారికి, అసలు క్రీడల్లో పాల్గొనని 421 మంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు విక్రయించారని ఆరోపించారు. చివరికి ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగజారిపోయారని విమర్శించారు. లవ్ క్యాష్ (లోకేష్) రాజాకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో అక్రమాలు ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్న అనాలోచిత, దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. ఓవైపు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు డీఎస్సీ నిర్వహణను సైతం పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపించారు. నిజాయతీగానే డీఎస్సీ నిర్వహిస్తే అసలు మెరిట్ లిస్టులను దాచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. టాపర్ వివరాలను సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నిలదీశారు. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికై న వారి జాబితాలు పెట్టకుండా కేవలం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు పంపడంపై నిలదీశారు. దీనిపై సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు బట్టబయలు అవుతాయని అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల బాధ్యతారాహిత్యం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా తాము విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ సమయంలో కమిషనర్ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. వారు ప్రభుత్వ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకుల్లా మాట్లాడారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, పార్టీ నేతలు షేక్ మస్తాన్వలీ, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవానంద్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గెడ్డేటి సురేంద్ర, షేక్ షరీఫ్, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకష్ణ (ఆచారి), షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, అంబేడ్కర్, వంశీ, గేదెల రమేష్, బోడపాటి కిషోర్, గురవయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విఠల్, గంటి, జిల్లా అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షుడు అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, ఆర్కే, మస్తాన్, సాజిద్, నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాజీ, జిల్లా కార్యదర్శులు సతీష్ యాదవ్, బంకా అరుణ్, మంగళగిరి, తెనాలి అధ్యక్షులు సందీప్, శామ్యూల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు భాను, గన్నవరం అధ్యక్షుడు చైతన్య, సాయి, హోసన్నా, శ్రీనివాసరెడ్డి, బాషా, ఆలా కిరణ్, కోటి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నాయకుల నిరసన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ముఖ్య నేతలు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026● భక్తిశ్రద్ధలతో బక్రీద్ తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,300, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.గుంటూరు నగరంలో బక్రీద్ పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంపాలెం, పాతగుంటూరు ప్రభుత్వ బాలుర పాఠశాల, ఆంధ్రా ముస్లిం కళాశాల, పొన్నూరు రోడ్డులోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరుల రాకతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. – నగరంపాలెం 7 -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
గ్రామంలో ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో మట్టి దోపిడీ జరుగుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. సొంత పొలంలో మట్టి తవ్వకాలు చేసుకుంటూ మెరక చదును చేసుకుంటేనే అనుమతులు లేవని కేసులు నమోదు చేసి సీజ్ చేసే రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వారు కావటంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ అధికారులు పత్తా లేరు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా, సంబంధిత అధికారులు స్పందించికపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకం దారులకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, మట్టి దందాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వడ్లమూడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చేబ్రోలు: చెరువుల అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మట్టి దందాకు తెరలేపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువును ప్రధానమంత్రి కృషి సంచార యోజన (పీఎంకేఎస్వై) కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేసింది. అయితే, ఈ నిధులను సద్వినియోగం చేసి చెరువును బాగు చేయాల్సింది పోయి, కొందరు అధికార పార్టీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని కాసులు కురిపించే వ్యాపారంగా మార్చుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా తవ్వకాలు పీఎంకేఎస్వై పథకం కింద చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. నాలుగు పెద్ద పెద్ద పొక్లెయిన్లు, హిటాచీ వంటి భారీ యంత్రాలను రంగంలోకి దించి రాత్రీ పగలు తేడా లేకుండా చెరువును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వడ్లమూడి పెద్ద చెరువును ఇష్టానుసారంగా తవ్వేస్తూ కొల్లగొడుతున్నారు. చెరువును తవ్వగా వచ్చిన నాణ్యమైన మట్టిని అధికార పార్టీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి ట్రాక్టర్ రూ.1200ల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి సీనరేజీ రూ.700లు, ట్రాక్టర్ బాడుగ రూ.500ల చొప్పున మొత్తం రూ.1200లుగా నిర్ణయించి ప్లాట్లకు, మెరకల కోసం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఒకపక్క ప్రభుత్వ నిధులు రూ.50 లక్షలు, మరోపక్క మట్టిని అమ్ముకుంటూ రెండు చేతులా లాభాలు గడిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లిఫ్టర్లకు మంత్రి మనోహర్ అభినందన
తెనాలి: చైనాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాలను సాధించిన స్థానిక కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన మంత్రి, అంతర్జాతీయ పతకాలను సాధించిన ఈఎల్ వినయశ్రీ, ఎం.షానూన్ను అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అకాడమీ కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, శివరామకిరణ్ రాజులు క్రీడాకారిణుల ప్రతిభను, సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. సత్తెనపల్లి: విత్తన దుకాణదారులు ప్రతి దుకాణంలోనూ ధరల పట్టిక, విత్తన నిల్వల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా విత్తన అమ్మకాల బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న విత్తన అధీకృత డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు పంట విత్తన కాలం మొత్తం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామాలలో గుడ్డ సంచుల్లో, ప్యాకింగ్ లేని విత్తనాలు అమ్మకాలు జరిపినట్లయితే సమచారం వ్యవసాయశాఖ అఽధికారులకు తెలియజేయాలన్నారు. తనిఖీల్లో సత్తెనపల్లి సబ్డివిజన్ సహాయ వ్యవసాయసంచాలకులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల విద్యాశాఖాధికారి బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యడ్లపాడు: చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కొండవీడు కోటపై మరో అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటపై దాదాపు 700 ఏళ్ల క్రితం నిర్మితమై, కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన షాహీ జుమ్మా మసీదులో ఈ శుక్రవారం సామూహిక జుమ్మా నమాజ్ నిర్వహించనున్నట్లు గుంటూరు నౌ అవర్ హిస్టరీ సంస్థ అధ్యక్షులు, మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్ వెల్లడించారు. ఒకప్పుడు రాజుల కాలంలో వైభవంగా వెలిగిన ఈ మసీదుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దీని చారిత్రక ప్రాధాన్యతను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అరబిక్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన ప్రముఖ పండితులు డాక్టర్ మొహమ్మద్ ఇస్తాక్ నద్వీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం టీచింగ్ ఆస్పత్రిలో ఎంఆర్డీ ఎంతో కీలకమని చెప్పారు. జనన మరణాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో ఎంఆర్డీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ యడ్లపాటి అశోక్కుమార్, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని హాయ్లాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళగిరి రూరల్ పోలీసులకు స్థానికులు గురువారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి వివరాలు లభించలేదు. బహుశా వడదెబ్బవల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, నలుపురంగు గీతలు కలిగిన ప్యాంటు, తెలుపు, ఆకుపచ్చ గళ్ల చొక్క, గెడ్డం ఉన్నాయని, మృతుడి వయస్సు సుమారు 30–35 ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే మంగళగిరి రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మల్లికార్జునపేట 5వ లైన్లోని పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయం వేదికగా ఎమ్మెల్సీలు, గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా ఉండి ప్రతి ఒక్కరినీ గెలిపించి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి బాటలు వేయనున్నాయని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి బూత్ ఏజెంట్ల ఎంపిక, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ అన్ని అంశాలపై పట్టున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి, బలపరచాలన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మేకపోతు గాంభీర్యం తప్ప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా లేదన్నారు. తొలుత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభయమేది... బాబూ?
పట్నంబజారు: హైదరాబాద్కు చెందిన ఒక మహిళ గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమె ఆటో ఎక్కిన తరువాత ఆటో డ్రైవర్ దుర్బుద్ధితో ఆమైపె అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయాడు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో కూడా పోలీసులు మాత్రం చెప్పటం లేదు. అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఒక యువతిని నలుగురు తాగుబోతులు ఆటోలో ఎక్కించుకుని మణిపురం ఓవర్ బ్రిడ్జి వద్దే ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు ఏ ఒక్క పరికరం అందుబాటులో లేకుండా పోయింది. అభాగ్యులకు అండగా.. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ‘‘అభయం’’ ప్రాజెక్టు. అర్ధరాత్రి, ఇతర ఆపత్కర పరిస్థితుల్లోనైనా.. డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకుని వెళ్లినా.. వెంటనే బాధితులకు అండగా నిలవాలన్నదే అభయం ఉద్దేశం. మహిళలు, యువతులు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వారికి క్షణాల వ్యవధిలో రక్షణ కలిగించేలా రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూట తిరిగే ఆటోల్లో అభయం మిషన్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యూఆర్ స్కానింగ్లోనే వివరాలు... అభయం ప్రాజెక్టు కింద ఆటోల్లో పరికరం బిగించే సమయంలో ఇంజిన్కు కనెక్షన్ ఇస్తారు. దీంతో జీపీఎస్ ట్రాకింగ్తోపాటు, ప్యానిక్ బటన్ ఉంటాయి. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా అభయం యాప్ ఇన్స్టాల్ చేసుకుని, ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే.. ఆటో నంబర్, డ్రైవర్ ఫొటో, అతని పేరు, సెల్నెంబర్లు అందులో వచ్చేస్తాయి. త్వదారా అసలు ఆటోలో ఉన్న వ్యక్తి సంబంధిత వ్యక్తా? వేరే వారా? అనే నిర్ధారించుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోల్లో అమర్చుతారు. వాహనానికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. వాహనాన్ని స్టార్ట్ చేసే సమయంలో డ్రైవర్ తనకు జారీ చేసిన స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఐఓటీ డివైజ్ వద్ద ట్యాప్ చేయగానే డ్రైవర్ వివరాలన్నీ అభయ పరికరంలో నిక్షిప్తమవుతాయి. ఆటో ఎక్కిన తరువాత దారి తెలియని ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వివరాలను సన్నిహితులకు పంపటం ద్వారా ఎటు వెళుతున్నారో తెలుస్తుంది. నమోదు చేసిన రూ ట్లు కాకుండా వేరే రూటుకు వెళ్లినా.. డ్రైవర్ ప్రవర్తన సరి లేకపోయినా.. పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కగానే.. సెకన్ల వ్యవధిలో కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం వెళుతుంది. జీపీఎస్ లోకేషన్ ట్రాకింగ్ ద్వారా బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఆపేసి... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అభయం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్లను రద్దు చేసిందని తెలుస్తోంది. విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పించే ఇలాంటి ప్రాజెక్టును కనీసం పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంట్రాక్ట్ సంగతి దేవుడికెరుక.. ఇప్పుడున్న రవాణాశాఖ అధికారులకు ఈ పథకం గురించి కూడా అవగాహన లేదంటే ప్రభుత్వ పనితీకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 40వేలకుపైగా ఆటోలు ఉన్నాయి. వాటిలో 20 వేల ఆటోలకు అభయం మిషన్లు ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిషన్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలో అప్పుడు అధికారులు నెలల వ్యవధిలో 2 వేలకుపైగా మిషన్లు ఏర్పాటు చేశారు. తొలుత గుంటూరు, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తిగా సఫలం కావటంతో ప్రతి ఆటోలో బిగించేలా దృష్టి సారించారు. అనంతరం ఎన్నికలు రావటంతో ఆ అభయం ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ విషయాన్నే గాలికి వదలేసింది. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని విధానాలతో ప్రాజెక్ట్ కొండెక్కింది.


