breaking news
Guntur District News
-
ఆటో నడిచేదెలా..?
చంద్రబాబు పాలనలో ఆటోడ్రైవర్లకు కష్టాలు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. అడ్డగోలు జీవోలు, నిత్యం పెరిగిపోతున్న ధరలతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో రెక్కాడితేగానీ డొక్కాడని వేల మంది సామాన్య ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆటో విడిభాగాలు, మెయింటనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో వారు కుదేలు అవుతున్నారు. దీనికితోడు రుసుములు, జరిమానాల పెంపుతో కష్టాలపాలవుతున్నారు. పట్నంబజారు: ప్రస్తుత కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులు, అవసరాలు మారడంతో దాదాపు ప్రతి ఇంటికీ ఒకటి లేదా రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలు పెరిగిపోవడంతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ఆటో ఎక్కేందుకు మొగ్గు చూపడం లేదు. పల్లెలను, పట్టణాలను అనుసంధానించే భారీ ‘సెవెన్ సీటర్’ ఆటోలు నిషేధానికి గురయ్యాయి. నగరంతోపాటు అనేక ప్రధాన ప్రాంతాల్లో తిరిగే త్రీ సీటర్స్, ఫోర్ సీటర్స్ ఆటోలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా అరకొర ఆదాయం దిక్కువుతోంది. రోజువారీ ఇంధన ఖర్చులకే సంపాదన సరిపోతోంది. ఏటా కట్టాల్సిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులు, బీమా ప్రీమియం, ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఇంధనం అందించాలని, ఫైనాన్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఆటో కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జీవోల రద్దుకు విజ్ఞప్తి రాష్ట్రంలో ముఖ్యంగా సీ్త్ర శక్తి పథకం ప్రారంభించిన తరువాత ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మహిళలు ఆటోలు ఎక్కే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ప్రభుత్వ సేవల ఫీజులు పెంచుతూ, భారీ జరిమానాలు విధించేలా తెచ్చిన జీవో 21, 31 లు ఆటోవాలాలకు మరింత గుదిబండగా మారాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ బీమా రూ. ఆరు వందలకు తగ్గించాలని, ప్రైవేట్ సంస్థల పరిధిలోని వాహన ఫిట్నెస్ పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలతో కూడిన ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు. నేను ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఇదే జీవనాధారం. డీజిల్, ఇతర ఖర్చులు పోను రోజుకు రూ.200 కూడా మిగిలడం లేదు. రోడ్డుపై ఆటో నిలుపుకొనే పరిస్థితి లేకుండా పోతోంది. బిడ్డల చదువులు.. పెద్దల వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఆటో రంగానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆటోవాలాలను ఇబ్బందికి గురి చేసేలా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలి. – శేషగిరి పవన్కుమార్, ఆటో యూనియన్ నాయకుడు ఆటోడ్రైవర్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారిపోతోంది. ఇప్పటికే ఉచిత బస్సు పథకంతో కిరాయిలు లేక బతుకులు చితికిపోయాయి. ప్రభుత్వం వెంటనే వ్యాట్, సెస్లను రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.చంద్రబాబు ఆటోవాలాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వాహనమిత్ర సాయం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పిచడంతోపాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. – మేడా మురళి, ఆటోడ్రైవర్, ఏటీ అగ్రహారం రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోలకు నెలవారీ ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నిస్సహాయ స్థితిలో ఆటోడ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కోల్పోయిన అనేకమంది డ్రైవర్లు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఏర్పడింది. ఇంధనం లీటరుపై ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ రూ.25 నుంచి రూ.28 లోపు ఉంటే.. ఏపీలో అత్యధికంగా రూ.30 ఉందని ఆటో, మోటారు వర్కర్స్ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తరహాలో పన్ను తగ్గిస్తే రవాణా రంగానికి, సామాన్యులకు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. కూటమి సర్కార్ ఈ దిశగా కూడా యోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఏపీలో ఇంధన ధరలు పెంచడంపై ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకునే అనుమతులను రద్దు చేయటంతోపాటు ధరలపై నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026జిల్లాలోని మూడు సీహెచ్సీల్లో ఖాళీగా గైనకాలజిస్ట్ పోస్టులు మాతాశిశు రక్షణ మాటలకే పరిమితమైంది. ఉత్తుత్తి ప్రకటనలతో చంద్రబాబు బండారం బయటపడుతోంది. నియోజకవర్గంలో ఫస్ట్ రెఫరల్ సెంటర్లుగా చెప్పుకొనే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్సీలు) నెలల తరబడి ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయకుండా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండడం పేద గర్భిణులకు శాపంగా మారింది. ఇటీవల తాత్కాలిక నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ గైనకాలజిస్టులు ముందుకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందడం లేదు. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.1200 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.20 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.కొల్లూరు: కొల్లూరులో గ్రామ దేవతలకు మహిళలు ఆదివారం ఆషాఢ సారె సమర్పించారు. పొంగళ్లు, సారెలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని మూడు సీహెచ్సీల్లో గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇతర ఆస్పత్రుల నుంచి వారంలో రెండు రోజులు గైనకాలజిస్టులను డిప్యూటేషన్పై పంపిస్తున్నాం. ఇటీవల తాత్కాలికంగా ఇద్దరు గైనకాలజిస్టులను నియమించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. ఆగస్టులో పోస్టులను భర్తీ చేసి సమస్యను పరిష్కరిస్తాం. – డాక్టర్ బీవీ రంగారావు, డీసీహెచ్ఎస్, గుంటూరు జిల్లా -
కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళి
గుంటూరు లీగల్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధంలో పాల్గొన్న వీరజవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని స్థానిక గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న 14 మంది సైనికులను గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్న్ సత్కరించి మాట్లాడారు. కార్గిల్ ఆపరేషన్ విజయ్లో మన సైనికులు చూపిన ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత యోజనపై కార్గిల్ యుద్ధ వీరులకు, వారి కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు, మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన సలహాలు, పెన్షన్, సంక్షేమ సదుపాయాల విషయంలో సహాయం ఈ పథకం ద్వారా అందుతుందని న్యాయమూర్తి వివరించారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల మాట్లాడుతూ డీఎల్ఎస్ఏ కార్యదర్శి, న్యాయమూర్తి సహాయంతో ఇప్పటి వరకు 40 మందికిపైగా సైనిక కుటుంబాల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం సూపరింటెండెంట్ ఆనందరావు, డీఎల్ఎస్ఎ ప్యానల్ సీనియర్ న్యాయవాది కె.కాళిదాసు, డీఎల్ఎస్ఎ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ జె.సురేష్బాబు, ఐ.మధుబాబు, ఎల్.సుబ్బయ్య, లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది పి.రాజేష్ లింగం, డీఎసల్ఎస్ఏ ఇన్చార్జి సూపరింటెండెంట్ వాణి, ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సైనిక కుటుంబ సభ్యులు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: నేషనల్ సబ్ మాస్టర్స్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. మంగళగిరి పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం పతకాలు సాధించిన క్రీడాకారిణి జ్యోతివర్మ దంపతులను సత్కరించి మెమెంటో అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీల్లో పవర్ లిఫ్టర్ జ్మోతివర్మ మాస్టర్స్ –2 విభాగంలో పాల్గొని మూడు పతకాలు సాధించినట్లు తెలిపారు. 69 కేజీల క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్, క్లాసిక్ డెడ్ లిఫ్ట్ విభాగాల్లో బ్రాంజ్ మెడల్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లో సిల్వర్ మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు మూడు పతకాలు సాధించడం గర్వకారణమని వారు కొనియాడారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వాయిదాలు వేయడం తప్ప పరిష్కారం చూపడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘ(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ఆరోపించారు. వాయిదాల పాలనకు ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమం ద్వారా చరమగీతం పాడుతామని హెచ్చరించారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునాథరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వర రావు, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆర్థిక కార్యదర్శులు శ్యాంబాబు, హనుమత్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.అమరనాథ్ పాల్గొన్నారు. పెదకాకాని: పశులు మేపుకునే విషయంలోలో చోటు చేసుకున్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన కొల్లికొండ శివయ్యకు ఇంటి ఎదురుగా ఉన్న కొల్లికొండ సాయికి పశువుల మేత విషయంలో గురువారం వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం రాత్రి ఇళ్ల వద్ద రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొల్లికొండ శివయ్య, అతని కుమారుడు గోపీనాథ్ తలలు పగిలి రక్తగాయాలయ్యాయి. అలానే మరొక వర్గానికి చెందిన కొల్లికొండ సాయికి కంటి పక్కన, చేతికి గాయమైంది. ఈ దాడిలో గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు చెందిన కొల్లికొండ శివయ్య, గోపీనాథ్, శివయ్య భార్యలపై ఆనందరావు ఫిర్యాదు చేయగా ఆనందరావు, సాయి, అంజమ్మ, కోటమ్మ మరి కొందరిపై శివయ్య ఫిర్యాదు చేశాడు. విచారించి కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ టీపీ నారాయణస్వామి ఆదివారం తెలిపారు. -
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ వ్యాప్తంగా నీట్ నిర్వహణలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగా కూటమి ప్రభుత్వంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 28వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంఽధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆదివారం బృందావన్గార్డెన్స్లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి శంకర్విలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన, ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు రూ.12 వేల కోట్లు ఫీజు రీ యింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదన్నారు. రెండేళ్ల కాలంలో ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.మూడు వేల చొప్పున రూ.72 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. మంగళవారం కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిని వినోద్, నగర యువజన విభాగ అధ్యక్షుడు కోటి, అనిల్, బాజీ, జగదీశ్, సాజిత్, మస్తాన్, అరుణ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు -
మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని ఆదివారం ప్రత్యేక గాజులతో అలంకరించారు. దేవస్థానం భక్తులతో కళకళలాడింది, ఆషాఢ మాసం రెండవ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేక పూజలను ఆదివారం అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణ జపాలు, రుష్యశృంగ జపం,వరుణ మంత్ర హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం సహస్ర ఘటాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి చేశారు. సోమవారం అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలకమండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, ధూపాటి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. సత్ ప్రవర్తనతో జీవించాలని రౌడీషీటర్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సూచించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంపాలెం: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన ఉండాలని సీఐడీ ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లోని రోటరీ భవన్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ ఎస్పీ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన సొమ్ము సైబర్ నేరాలతో క్షణాల్లో మాయమవుతుందని పేర్కొన్నారు. ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్లు ఇతరులకు చెప్పొద్దని కోరారు. తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని చెప్పారు. అనుమానిత ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్కు కాల్ చేయాలని అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సదస్సులో క్లబ్ అధ్యక్షుడు పొందూరి శివప్రసాద్, కార్యదర్శి తుమ్మల శ్రీనివాసరావు, కోశాధికారి కొల్లి అరవింద్కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వైభోగ బోనం
● కనుల పండువగా ఊరేగింపు ● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు ● ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు దుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను దండలుగా సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఆరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు తమవంతుగా ఉత్సవాలలో భాగస్వాములు అవుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వానలు పుష్కలంగా కురియాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్ల్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది. భక్తితో బయలెల్లి.. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనానికి కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతరాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు. అమ్మవారికి ప్రణమిల్లి.. జోగిని అవికా బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న తర్వాత కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితరాలను సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి ఆలయ ఈవో, చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం బంగారు, వెండి బోనాలతోపాటు పూజ సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్ పేర్కొన్నారు. -
జిల్లాలో 2.37 లక్షల ఓట్లు తొలగింపు
నెహ్రూనగర్: సర్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 40 రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో 2,37,513 ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కలిపి 18,02,074 ఓట్లు ఉన్నాయి. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టింది. 2002 జాబితా ప్రకారం ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఇంటింటికి వచ్చి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా? లేదా? అనేది సర్వే చేపట్టాలని సూచించిన గడువు జూలై 24తో ముగిసింది. తొలి దశ ప్రక్రియ ముగియడంతో ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై అభ్యంతరాలు, క్లయిమ్లు అందజేసేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 3న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ‘పశ్చిమ’లో భారీగా .. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓట్లు ఉండగా వీటిని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు పరిశీలించారు. డిజిటలైజేషన్ అయిన ఓట్లు 2,19,236 కాగా... మ్యాపింగ్ కానివి 3,176. అబ్సెంట్, పర్మినెంట్ షిఫ్టింగ్, డెత్లు కలిపి 59,319 ఓట్లు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా దొంగ ఓట్లు చేరాయని పలు రాజకీయ పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఓట్లు ఉన్నప్పటికీ మనుషులు లేని పరిస్థితి అధికారులు గుర్తించారు. తరువాత తూర్పు నియోజకవర్గంలో 2,52,062 ఓట్లు ఉండగా డిజిటలైజేషన్ పూర్తయినవి 2,03,094 ఓట్లు ఉన్నాయి. వీటిలో మ్యాపింగ్ కానివి 2,093, ఏఎస్డీ కింద పోయిన ఓట్లు 48,968 ఉన్నాయి. తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2,70,185 ఓట్లు ఉండగా డిజిటలైజేషన్ అయినవి 2,35,748గా తేల్చారు. మ్యాపింగ్ కానివి 1,034, ఏఎస్డీ కింద పోయినవి మొత్తం 34,437 ఓట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. మ్యాపింగ్ కాని ఓట్లు 16,558 -
చేనేత రంగానికి ప్రగడ సేవలు ఆదర్శం
చీరాల: చేనేతల పితామహుడు ప్రగడ కోటయ్య అని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఆదివారం స్థానిక పద్మశాలి బహూత్తమ సంఘ కల్యాణ మండపంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను నిర్వహించారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి ఎస్.సవిత హాజరయ్యారు. చేనేత వస్త్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేస్తాయని ప్రగడ కోటయ్య నమ్మారని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వారి గళాన్ని వినిపించిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర చేనేత కార్మికుల సొసైటీలు, సహకార సంఘాలు వ్యవస్థాపకులుగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, సంచాలకులు రేఖరాణి, ఉపసంచాలకులు బి.వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య, ఆప్కో ఎండీ కన్నబాబు పాల్గొన్నారు. -
ఆగస్టులో బీ–2 బిజినెస్ ఎక్స్పో
గుంటూరు మెడికల్: గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్న్స్లో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న బీ–2 బిజినెస్ ఎక్స్పో–2026 పోస్టర్ను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు ఆదివారం అమరావతిరోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో కుటీర పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషించగా, నేడు యువత ఆధునిక సాంకేతికతతో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తూ పారిశ్రామిక రంగంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొని తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాలని కోరారు. బీ–2 ఎక్స్పో అధ్యక్షుడు కుమ్మమూరి శ్రీధర్బాబు, కార్యదర్శి బి.హేమంత్, కోశాధికారి కె.బాలకష్ణ, ధృతి హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ రేవూరి హరికష్ణ మాట్లాడుతూ యువత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎక్స్పోలో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, సేవా సంస్థలు పాల్గొంటాయన్నారు. స్టాల్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నిర్వాహకుల ద్వారా ముందస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్స్పో కన్వీనర్ ఎం.రవిశంకర్, కో–కన్వీనర్ కె.బద్రి, ఏపీబీఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు కోనూరు సతీష్శర్మ, కో కన్వీనర్ అ రమణమూర్తి, ప్రముఖ జీఎస్టీ అడ్వకేట్ సుందర రామశర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, హనుమప్రసాద్, రామకృష్ణ పరమహంస తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మునగాల రవి గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీనియర్ డాక్యుమెంట్ రైటర్ మునగాల రవి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో నిరసన కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ధర్నా కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని రోజులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జీఓ నెంబర్ 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం.. గుంటూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా సిద్ధం ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడిగా మునగాల రవి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కె.జయరాజు, ప్రధాన కార్యదర్శిగా ఏనుగుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా వి.శేషిరెడ్డి, యలగాల రామకృష్ణ, బి.గంగాధరరావు, సహాయ కార్యదర్శులుగా జి.ఉదయ్చంద్ర కుమార్, మక్కెన ప్రకాష్, ఎస్.మహేష్, లీగల్ అడ్వైజర్గా మల్లాది చంద్రశేఖర్, కోశాధికారిగా కత్తి సాంబిరెడ్డి, సంయుక్త కోశాధికారిగా ఎ.పిచ్చయ్య, కార్యవర్గ సభ్యులుగా బి.వెంకట భద్రయ్య, టి.శ్రీధర్, ఏ.అనిల్ కుమార్, దిడుగు చంద్రశేఖర్, బి.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుగ్గిరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుగ్గిరాలకు చెందిన కుర్రా నాగయ్య(59), తరుణ్ కలసి బైకుపై తెనాలి వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని కారు బైకుని ఢీ కొట్టింది. నాగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తరుణ్ని అంబులెన్స్లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లక్ష్మీపురం(తిరువూరురూరల్): ఇబ్రహీంపట్నం–జగదల్పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యమ యోధుడు ముద్రగడ
● నంబర్ వన్ చానల్ అధినేత సాయి సుధాకర్ ,రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మలిశెట్టి సుబ్బారావు, మిరియాల శ్రీనివాసరావు, చందు జనార్దన్, అమ్మ శ్రీనివాస్నాయుడు, జనసేన నుంచి చందు సాంబశివరావు, గాదె వెంకటేశ్వరరావు, పాకలపాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, టీడీపీ నుంచి ఆజా రామకృష్ణ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, మార్కండేయులు (బీజేపీ), మాజీ మేయర్ కావటి మనోహర్, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ నుంచి నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కాపు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలుముద్రగడ సంతాప సభకు హాజరైన పలు పార్టీల కార్యకర్తలు అభిమానులు, కాపు వర్గీయులు -
ఇద్దరు ప్రైవేటు బ్యాంకు మేనేజర్లు అరెస్ట్
లక్ష్మీపురం: అరండల్పేటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇద్దరు మేనేజర్లు సైబర్ నేరానికి పాల్పడటంతో అరెస్టు చేశారు. అరండల్పేట, సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్లో సీఐ ఆరోగ్య రాజు విలేకరులతో తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు అరండల్పేట 4వ లైన్లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్లుగా సయ్యద్ నౌషాద్, ఆపరేషనల్ మేనేజర్గా షేక్ బాజీ విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది మనీ మ్యూల్ అకౌంట్స్ ద్వారా సుమారుగా 11 ఖాతాల నుంచి రూ.25 లక్షలు విత్డ్రా చేసినట్లు సీఐడీ నుంచి ఫిర్యాదు వచ్చింది. సైబర్ క్రైమ్ సోషల్ మీడియా వింగ్కు చెందిన ఎస్ఐ లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం రూ.25 లక్షలు సైబర్ మోసం చేసినట్లు తెలిసింది. సయ్యద్ నౌషాద్ ఇదంతా చేసి మేనేజర్ కొడవటిగంటి రామకృష్ణ ద్వారా యూకేలో ఉండే దగ్గుపాటి సాయి కిరణ్కు చేర్చి కమీషన్ తీసుకున్నట్లు గుర్తించారు. నేపాల్లో సైబర్ నేరం చేసి రూ.4.87 లక్షల నగదు కాజేసిన మోసంలో కూడా వీరు పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం బ్రాడిపేట 4వ లైను వద్ద సయ్యద్ నౌషాద్, రామకృష్ణలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చాటిన అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ఒ. చిరంజీవులు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, సైబర్ క్రైమ్ సెల్ సీఐ మొహమ్మద్ నిసార్ బాషా, ఎస్ఐ లక్ష్మి , హెడ్ కానిస్టేబుల్ రాజ కిశోర్, కానిస్టేబుల్లు యాసిన్, సాయి, ఇమాం, మానస, అరుణలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. సైబర్ క్రైమ్కు సహకరించిన నిందితులు -
విజయకీలాద్రిపై తొలి ఏకాదశి వేడుకలు
నరసరావుపేట రూరల్: గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 29వ తేదీ ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మేధాదక్షిణామూర్తి హోమం, గిరి ప్రదక్షిణ, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. ఆలయ అవరణలో నిర్వహించే అక్షరాభ్యాసం, ఇతర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. తాడేపల్లిరూరల్ : ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు, సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్.డి.విల్సన్ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు తేజస్వి, ఎడిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీనివాస్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, డీసీపీ సరిత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, సామాన్య ప్రయాణికుల రక్షణే ధ్యేయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మహిళలు, సామాన్య ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శనివారం నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్, ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆటోల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ పరిశీలించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఆటో ముందు, వెనుక, లోపల ప్రయాణికులకు కనిపించేలా అతికిస్తారని చెప్పారు. ప్రయాణికులు మొబైల్ఫోన్లల్లో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్, యజమాని వివరాలు, ఆటో/ మొబైల్ నంబర్లు, చిరునామా ప్రత్యక్షమవుతాయన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాసరావు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), నిషార్బాషా (ఐటీ కోర్), యాప్ రూపకల్పనకు సహకరించిన పెంచలరెడ్డి శేఖర్, కమ్యూనికేషన్స్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
వ్యవసాయాభివృద్ధికి శాసీ్త్రయ పరిశోధనలు అవసరం
బాపట్ల టౌన్: వ్యవసాయాభివృద్ధికి శాసీ్త్రయ పరిశోధనలు అవసరమని, సహజ సాగు పద్ధతులు భవిష్యత్కు మార్గమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్, పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాసీ్త్రయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ సాగు విధానాలు అత్యంత అవసరమన్నారు. ఆరు దశాబ్దాలుగా వర్సిటీ వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతులకు, సాగులో ప్రగతికి విశేష సేవలు అందిస్తోందన్నారు. ఈ స్నాతకోత్సవం విద్యార్థుల కృషి, పట్టుదల, అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. వారి విజయాల్లో తల్లిదండ్రులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తల పాత్ర అమూల్యమన్నారు. ప్రధాన అతిథిగా విచ్చేసిన ఐసీఏఆర్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, పూర్వ విద్యార్థి డాశ్రీశ్రీ శ్రీనివాసరావును గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. సహజ వనరుల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ విధానాల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి దేశానికి మార్గదర్శకమన్నారు. పత్తి సాగు అభివృద్ధికి విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన పత్తి శాస్త్రవేత్త కె. రవీంద్రనాథ్కు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (హానోరిస్ కాజా) ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదన్నారు. దేశ సంస్కృతి, ఆహార భద్రత, సమాజ శ్రేయస్సుకు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. 50 మందికి డాక్టరేట్, 240 మంది పీజీ విద్యార్థులు, 1385 మంది గ్రాడ్యుయేట్లతోపాటు పలువురికి పతకాలు, ప్రతిభ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఐసీఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి.వి. సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ -
ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు
– జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేసే కంపెనీల వాహనాలు అతివేగంతో తిరుగుతున్నాయని, వాటికి కచ్చితంగా స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పరిధిలోని నేషనల్ హైవేపై విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ల దగ్గర స్పీడ్ బ్రేకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యతగా మధ్యాహ్న భోజనం గుంటూరు వెస్ట్: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా, నాణ్యతగా సరఫరా చేసేందుకు స్మార్ట్ కిచెన్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): శుక్రవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, డీవైఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి వై. కృష్ణకాంత్ , ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కె. సుభాని, జిల్లా అధ్యక్షుడు జె.చైతన్య తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసుల అమానుష చర్యలు నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు ఈ బంద్ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యాసంస్థల నుంచి బంద్కు అనూహ్య స్పందన వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ముందుగానే సెలవులు ప్రకటించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ ఉండడంతో మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చారని తెలిపారు. వివిధ కళాశాలల బస్సులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు ఇచ్చారని తెలిపారు. గుంటూరు నగరంలోని పలు విద్యా సంస్థలను విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్లి మూసివేయించారని పేర్కొన్నారు. ప్రశ్నించే విద్యార్థుల గొంతులను లాఠీలతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి బి. యశ్వంత్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు గనిరాజు, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు దుర్గప్రసాద్ నాయక్, నాయకులు యశ్వంత్, సాయి, అమృత, కిన్నెర, పింకి, ఉమామహేశ్వరరావు, జాషువా తదితరులు పాల్గొన్నారు. -
తల్లి తోడు.. వందనం ఇస్తే ఒట్టు
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026రిజిస్ట్రేషన్ పనులు యథాతఽథం గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని గుంటూరు సబ్ రిజిస్ట్రార్–1 ఎం.షరీల్ బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల నిరసనలో భాగంగా కార్యాలయాల్లో పనులు జరగడం లేదని ప్రజలు భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు సేవలు యథాతథంగా పొందవచ్చని తెలిపారు. సమాచారం కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. దస్తావేజు లేఖరులు ప్రజలను ఆటంక పరచవద్దని కోరారు. వారు కూడా సమ్మె విరమించి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. సమావేశంలో సబ్ రిజిస్ట్రార్లు ముప్పాళ్ళ వెంకటేశ్వరరావు, ఎ. గోపాల్, వెంకట్ పాల్గొన్నారు. ప్రత్తిపాడు: ఒక చేత్తో తల్లికి వందనం అంటూ బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తూ.. మరో చేత్తో డ్వాక్రా అప్పుల పేరుతో నగదు విత్ డ్రా చేసుకోనివ్వకుండా చంద్రబాబు సర్కారు మోకాలడ్డుతోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా అప్పులకూ, తల్లికి వందనం నిధులకు ముడి పెడుతూ ప్రభుత్వం ఆటలాడుతోంది. దీంతో తమ ఖాతాల్లో నగదు పడిందని డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళుతున్న మహిళలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రత్తిపాడుకు చెందిన కీర్తన, ఆరోగ్యమాత గ్రూపులకు చెందిన కొందరు మహిళలు తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ అయిన తల్లికి వందనం డబ్బులు తీసుకునేందుకు స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంకుకు వెళ్లారు. ‘సభ్యులు సక్రమంగా రుణం చెల్లించకపోవడం వలన వ్యక్తిగత ఖాతా ఫ్రీజ్ చేయబడింది.. డబ్బులు డ్రా చేసుకోవడం కుదరదు. ఓవర్ డ్రాఫ్ట్, డీఫాల్ట్లో ఉంది...’ అంటూ బ్యాంకర్లు రకారకాల కారణాలు చెప్పారు. దీంతో వారు శుక్రవారం ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు సమస్యను చెప్పారు. ‘మీరేమో తల్లికి వందనం డబ్బులు చదువులకే వినియోగించాలని అంటున్నారు.. కానీ బ్యాంకు వాళ్లేమో మా డ్వాక్రా అప్పులకు ఆ డబ్బులకు ముడిపెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోమేటిక్గా అకౌంట్లు ఫ్రీజ్.. దీంతో ఎమ్మెల్యే ప్రత్తిపాడులోని యూనియన్ బ్యాంకుకు వెళ్లారు. తల్లికి వందనం డబ్బులు మహిళలకు ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని బ్యాంకు మేనేజర్ ఎం. సురేష్ను ప్రశ్నించారు. ఎవ్వరికీ డబ్బులు ఆపలేదని, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయ్యాయని మేనేజర్ చెప్పారు. ఉన్నతాధికారులకు లేఖ రాసి ఫ్రీజింగ్ తొలగించాలని కోరుతామని మేనేజర్ చెప్పారు. అసహనానికి గురైన ఎమ్మెల్యే ఎల్డీఎంతో ఫోన్లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలన్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురి నియామకం
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొప్పుల విజయ మాధవిని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన దారా హేమప్రసాద్ను జిల్లా వలంటీర్స్ విభాగ అధ్యక్షుడిగా నియమించారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సయ్యద్ బషీద్ – జిల్లా మైనార్టీ విభాగ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, సూదాతులసి కుమారి – జిల్లా మహిళ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. నగర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలిగా వజ్రాల విజయమేరి, ప్రధాన కార్యదర్శిగా ఎర్రంరెడ్డి రమణ, కార్యదర్శులుగా రామిశెట్టి జోత్న్స, దాళవాయి సౌజన్య, వి.ఈశ్వరమ్మబాయి, నగర మహిళ విభాగం కార్యనిర్వాహక సభ్యులుగా షేక్ ఫాతిమా, కె.వి.ఆదిత్య, ఆకుల వసుంధర, ఉల్లంగుల విజయరాజ్యం, అలికేపల్లి అనూరాధ నియమితులయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడిగా కుండేరు విజయదీపక్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా నల్లక వెంకటరమణ, పశ్చిమ నియోజకవర్గ ఉద్యోగ, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పాలేటి సుందరరావు, పశ్చిమ నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడిగా రాజవరపు మురహరిరావు నియమితులయ్యారు. -
మెగా పీటీఎంకు స్పందన
గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా 1,048 పాఠశాలలు, ఐదు ప్రభుత్వ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతంగా సాగిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రతినిధులు వారి పరిధిలో కార్యక్రమ విశిష్టతను తెలియజేశారని పేర్కొన్నారు. అధికారులు కూడా విద్యాసంస్కరణలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు వంటి అంశాలు వివరించారని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక, లీప్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి తెలుసుకొనే విధానం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా విద్యార్థుల చదువు తీరు తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
మెరుపులు.. మరకలు!
గుంటూరుశుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026షైనింగ్ స్టార్స్ అవార్డుల్లో కూటమి సర్కారు వివక్షఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.బడుగు, బలహీన, నిరుపేదలకు విద్య అందించాల్సిన బాధ్యత తనది కాదంటూ విద్యావ్యవస్థను నీరు గారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ‘ప్రైవేటు’కు దాసోహం అంటోంది. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని షైనింగ్ స్టార్స్గా ఎంపిక చేసి, ఒక్కొక్కరికీ రూ.20 వేలు చొప్పున అందజేసింది. సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ద్రోహం చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ప్రతిభావంతులుగా నిలిచిన వారిని పక్కన పెట్టింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు పెద్ద పీట వేసింది. -
సమస్యలు హల్చల్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతారాహిత్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. నిత్యం వివాదాలు మూటగట్టుకుంటోంది. సిబ్బంది పర్యవేక్షణ లోపంతో హాస్టళ్ల నిర్వహణ గాడితప్పుతోంది. గుంటూరు నగరంలోని సంక్షేమ హాస్టళ్లలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నగరంలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్కు చెందిన ఓ విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. తిరిగి సాయంత్రానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కంగుతిన్న సంక్షేమ శాఖ అధికారులు నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ పంచాయితీ నిర్వహించాల్సి వచ్చింది. ఇది హాస్టళ్లలో భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ’ఆకలి’ కేకలు ఈ ఘటన మరువకముందే.. ఈ నెల 17వ తేదీన ఎస్వీఎన్ కాలనీలోని ఎస్సీ హాస్టల్లో దాదాపు 20 మంది విద్యార్థులకు సరిపడా భోజనం లేకపోవడంతో ఆకలితో అలమటించారు. విద్యార్థులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే హాస్టల్లో కొద్ది నెలల కిత్రం తినే ఆహారంలో బల్లి పడిన విషయం తెలిసిందే. దీంతో హుటాహుటిన అధికారులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ ఏమీ కాలేదని తెలుసుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో, కనీస పర్యవేక్షణ చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖను సమర్థవంతంగా నడిపించేందుకు ఇటీవల కొత్తగా గ్రూప్–1 స్థాయి అధికారిని జిల్లా అధికారిగా నియమించినప్పటికీ, పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. జిల్లా అధికారిగా హర్షిత విధులో చేరిన రోజే హాస్టల్ విద్యార్థిని మిస్సింగ్ అవ్వడంతో ఆమె 5 రోజులు సెలవు పెట్టి వెళ్లారు. బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు సక్రమంగా ఆహారం పెట్టకపోవడంపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిందిస్థాయి సిబ్బంది అలసత్వం, పర్యవేక్షణ లోపంతో శాఖపై కంట్రోల్ పూర్తిగా తప్పినట్లు తెలుస్తోంది. రోజుకో వివాదం తెరపైకి రావడం, ప్రభుత్వం వద్ద సమాధానం చెప్పుకోలేక ఒత్తిడి పెరిగిపోవడంతో సంబంధిత జిల్లా అధికారి సెలవుపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. -
26న దుర్గమ్మకు తెలంగాణ బంగారుబోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు 26వ తేదీ ఆదివారం తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5 వందల మంది కళాకారులు, బేతాళ నృత్యకారులతో ఊరేగింపుగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. బోనాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్ నుంచి బోనాల కళాకారులు నగరానికి చేరుకుంటారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. బోనాల కమిటీ సభ్యులకు సీవీ రెడ్డి చారిటీస్లో వసతి కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సీవీ రెడ్డి చారీటీస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆదివారం కావడం, మరో వైపున ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో సారె సమర్పించే భక్త బృందాల కోలాహలం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాకంబరీ ఉత్సవాల నిమిత్తం ఇప్పటికే ఆలయ ప్రాంగనంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలలో కూరగాయలు, ఆకుకూరలను కట్టేందుకు ఐరన్గ్రిల్స్ను ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేస్తుంది. మరో వైపున శాకంబరీ ఉత్సవాల అలంకరణకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాల సేకరణకు ఆలయానికి చెందిన కొంత మంది అధికారులు, సిబ్బంది రైతులను, హోల్సేల్ వ్యాపారులను కలిసి విరాళాలను అందించాలని కోరారు. శని, ఆదివారం నాటికి కూరగాయలు, ఆకుకూరలు దేవస్థానానికి చేరే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా రానున్న పది రోజులు చాలా కీలకమైన ఆలయ అధికారులు భావిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా విధులు కేటాయింపు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. -
లీవ్ అడిగితే ఉద్యోగం తీసేశారు
సుభాష్నగర్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాజుపాలెం భావన ఈసీఐఎల్ లో నివాసము అంటూ బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా లో ప్రాసెస్ అసోసియేట్ పనిచేస్తుంది. మూడు రోజులుగా సెలవు తీసుకున్నందున తనను ఉద్యోగం నుంచా అకారణంగా తీసి వేశారు అంటూ బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి న్యాయం దొరకకపోవడంతో గురువారం టెక్ మహేంద్ర ముందు కూర్చొని నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడగా తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ బాధితురాలు భావన ఆరోపించింది. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈనెల 17, 18 20 మూడు రోజులు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈ మెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్కు వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని, నాకు న్యాయం జరిగే వరకూ కంపెనీ ముందు నిరసన కొనసాగుతుందని సాయంత్రం వరకు అలాగే బైఠాయించింది. -
4వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను పరిరక్షించాలి
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డిమొగల్రాజపురం(విజయవాడతూర్పు):గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పొలాల్లో బయల్పపడిన 4వ శతాబ్దానికి చెందిన రెండు చిన్న వినాయక విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాజ గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటరామారెడ్డి తన పొలాన్ని దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు లభించాయని తనకు సమాచారం ఇవ్వడంతో గురువారం వాటిని పరిశీలించానని చెప్పారు. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణం గల ఎర్ర ఇసుక రాతి (చింతామణి రాయి)తో చేసి రెండు విగ్రహాలతో పాటు ఎరుపు, నలుపు, గచ్చకాయ, గోధుమ రంగు మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయని తెలిపారు. అవి 4వ శతాబ్దం (శాతవాహన, ఆనందగోత్రినుల కాలం) నాటివని శివనాగిరెడ్డి చెప్పారు. రెండు విగ్రహాల్లో రెండు చేతులు, దంతం, మోదకాలను ధరించి, తలపై కిరీటం లేకుండా ఏనుగు తల, తొండం, పెద్ద బొజ్జతో లలితాసనంలో వినాయకుడు కూర్చుని ఉన్నాడని వివరించారు. పల్నాడు జిల్లా చేజర్ల కపోతేశ్వర ఆలయంలో ఉన్న పాలరాతి వినాయక విగ్రహాన్ని పోలి ఈ రెండు విగ్రహాలు ఉన్నందున, ప్రతిమ లక్షణాన్ని బట్టి ఈ రెండు గణేశ ప్రతిమలు, సామాన్య శకం 4వ శతాబ్దిలో ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన, ఆనందగోత్రిన రాజుల కాలం నాటివని స్పష్టమైందని వివరించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివనాగిరెడ్డి కోరారు. -
వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం
మంచాల(చేబ్రోలు): వరుణుడి కరుణ కోసం చేబ్రోలు మండలం మంచాల గ్రామంలోని గ్రామదేవత దేశమాంబకు మహిళలు గురువారం జలాభిషేకం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బిందెలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తొలతు గ్రామదేవత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం జరిగింది. అర్చకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ఫిరోజి ఋషి ఇంద్రుల వారి మఠంలో వేంచేసియున్న వేదమాత గాయత్రి దేవస్థానంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, మహానవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు వారాహి మాత పూజలు, హోమాలు జరిగాయి. వేదమాత గాయత్రి అమ్మవారి ప్రధాన అర్చకులు బాల ఫిరోజి గురువారం అమ్మవారికి సాలగ్రామ అలంకార మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో భజనలు, కుంకుమ పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తులు పద్మ, మమత, ఫిరోజి అంజలి, సుజాత, మల్లేశ్వరి, సుకన్య తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: వర్షాలు సమృద్ధిగా కురవాలని మండల కేంద్రమైన అమరావతికి చెందిన మహిళలు గురువారం గ్రామ నడిబొడ్డున ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టుకు నీటితో వారు పోసి అభిషేకించారు. తొలుత పవిత్ర కృష్ణానది జలాలను బిందెలలో నింపుకొని ఊరేగింపుగా వచ్చి మహాలక్ష్మమ్మ చెట్టుకు అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలను రక్షించాలని వేడుకుంటూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని: పెదకాకానిలోని ప్రసిద్ధ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీలలోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురం పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి. అనుపమ హాజరయ్యారు. హుండీల ద్వారా 122 రోజులకు రూ.67,22,181 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.3,97,918 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కొంత వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా అమెరికన్ డాలర్లు 72, ఇతర విదేశీ కరెన్సీ కూడా కానుకల్లో ఉన్నట్టు చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
● ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ ● విజ్ఞాన్లో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
సమన్వయంతోనే వినూత్న ఆవిష్కరణలు చేబ్రోలు: భవిష్యత్లో పరిశోధనలు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో మరింత విస్తరించనున్నాయని, గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభిన్న రంగాల సమన్వయంతో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (ఐసీసీఎంఎస్ఎస్–2026)’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్లైన్, ఆఫ్లైన్) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా సదస్సుకు సంబంధించిన కాన్ఫరెన్స్ సావనీర్ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ మాట్లాడుతూ అనువర్తిత గణితం, కంప్యూటేషనల్ సైన్సెస్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకగా నిలుస్తున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, హై–పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, శాసీ్త్రయ అనుకరణలు వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఐఐటీ పాట్నా ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ సంక్లిష్టమైన శాసీ్త్రయ సమస్యలను విశ్లేషించడంలో, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలను రూపొందించడంలో అధునాతన గణిత భావనలు కీలకంగా మారాయని తెలిపారు. ఎన్ఐటీ కాలికట్ ప్రొఫెసర్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ కంప్యూటేషనల్ గణితం ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అభివృద్ధిలో కీలకమైన సాధనంగా మారిందన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
తుళ్లూరు మండలం రాయపూడి వద్ద ఘటన తాడికొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టిప్పర్ వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన భార్యాభర్తలు గురువారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద వెనుకనుంచి వచ్చిన టిప్పర్ వీరి బండిని ఢీకొట్టడమే కాకుండా.. కొంతమేరకు ఈడ్చుకువెళ్లింది. ఘటనలో భార్య డేగల వెంకాయమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నెగంటి స్పోర్ట్స్ సొసైటీ వైస్ చైర్మన్గా సత్యనారాయణ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఏపీ వైస్ చైర్మన్గా కనమర్లపూడి సత్యనారాయణను నియమించారు. గురువారం స్థానిక విశ్రాంత ఎస్పీ సిహెచ్ చక్రపాణి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొసైటీ సభ్యుడిగా చక్కని సేవలందించిన సత్యనారాయణ నిబద్ధతను చూసి వైస్ చైర్మన్గా ఎంపిక చేశామన్నారు. సమాజంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల అభివృద్ధికి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సత్యనారాయణకు విశ్రాంత ఎస్పీ చక్రపాణి చేతులమీదుగా నియామకపత్రాలను అందజేసారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, ఎస్.ప్రసాద్, నాగరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రాగితీగల చోరీ ముఠా గుట్టురట్టు
మంగళగిరి రూరల్: నిర్మాణంలో ఉన్న భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 28 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాగి తీగ విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని కాజా టోల్గేట్ సమీపంలోని ఓ టెక్ పార్క్లో భద్రపరిచిన 20 బండిళ్ల ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురయ్యాయని జూన్6న నిర్మాణ కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో కాజా, చినకాకాని ప్రాంతాల్లో నిర్మాణ భవనాల నుంచి వైర్లు చోరీ చేసి వాటిని కాల్చి కాపర్గా మార్చి పేరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గండాలయ్యపేట, తాడికొండ, పేరేచర్లలకు చెందిన మొగిలి మధు, జగన్నాథం, ఏసుబాబు, సాంబయ్య, నాగ తేజ, ఉయ్యాల సతీష్ లపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందన్నారు. కేసు దర్యాప్తులో ఏఎస్ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, రాము, చలమరావు, కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు. -
యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం, యూజీసీ పేస్కేల్ అమలు చేయాలని అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణించి యూజీసీ పే స్కేళ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఏఎన్యూ ప్రాంగణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గురువారం రిలే నిరాహార దీక్షలో భాగంగా కె.సందీప్, డాక్టర్ వీడీ రాజాజీ, డాక్టర్ కె.శ్రీదేవి, డాక్టర్ ఎస్కే మస్తానమ్మ, డాక్టర్ సీహెచ్ రాధిక, డాక్టర్ ఎన్.ప్రసన్న కుమార్ విధులకు సెలవు తీసుకొని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులు ముగించుకుని పెద్ద సంఖ్యలో నిరసన శిబిరానికి చేరుకొని దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఎన్యూ వద్ద కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రిలే నిరాహార దీక్షలు -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్లకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.ఆర్.రాజీవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వి.రాజీవ్ పారా లీగల్ వలంటీర్ల ముఖ్యమైన బాధ్యతల గురించి వివరించారు. వాటిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మధ్యవర్తిత్వం, సంధానం, రాజీ విధానం ద్వారా న్యాయ పరంగా కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చి, చట్ట పరమైన సేవల గురించి కూడా అవగాహన కల్పించే బాధ్యత ఉందని తెలిపారు. చిన్న చిన్న ఉదాహరణలతో వలంటీర్లకు అర్ధమయ్యే రీతిలో సివిల్, క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలో వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, సీనియర్ పారా లీగల్ వలంటీర్ షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడారు. శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీ రాజీవ్ -
నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ – గుంటూరు ఆధ్వర్యంలో ప్రజా చర్చా వేదిక గురువారం నిర్వహించారు. న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమన్నారు. ఇటీవల డాక్టర్ విజయ ప్రపంచ స్ట్రోక్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికై న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు నాయకులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సభను గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకులు ఎల్.ఎస్. భారవి, జి. శ్రీనివాసరావు, మల్లికార్జున్, మురళి సమన్వయంతో నిర్వహించారు. న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ -
కరకట్ట వెంబడి తప్పిన పెను ప్రమాదం
బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిని ఢీకొట్టిన టిప్పర్ తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గంలో కృష్ణానది ఎగువ ప్రాంతంలోని బకింగ్హామ్ కెనాల్ వద్ద ఓ టిప్పర్ లారీ గురువారం అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి కరకట్ట వైపు లారీ వెళుతోంది. అక్కడ రోడ్డు పల్లంగా ఉండడంతో బ్రేకులు పడకపోవడంతో వేగంగా వెళ్లి బకింగ్హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ గేటు దిమ్మకు ఢీకొని లారీ నిలిచిపోయింది. లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గం, వీవీఐపీలు తిరిగే మార్గం కావడంతో తాడేపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల, భద్రతా సిబ్బంది లారీని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఈ సమయంలో 45 నిమిషాల పాటు ప్రకాశం బ్యారేజ్, మంగళగిరి రోడ్డు నుంచి కరకట్టవైపు వెళ్లే వాహనాలను, సచివాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. -
జ్వరం వస్తే.. కాస్త జాగ్రత్త!
గుంటూరు మెడికల్: కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో నాలుగు కరోనా మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. తొలుత జిల్లాలో జూలై 16న మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు స్థానిక యువతి(18)కి, నవులూరుకు చెందిన యువతి (27)కి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వైరస్ ప్రభావం చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఉంటుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు గతంలో థర్డ్వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ సబ్వేరియంట్ ఆర్ఎఫ్ 5గా వైద్య నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన లేకపోవటం, రుచి తెలియకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ ఎవరికై నా సోకిందో.. లేదో.. తెలుసుకునేలోపు బాధితుల నుంచి ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా కొద్దిరోజులపాటు ప్రజలంతా ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి. కరచాలనం చేయడం మానివేయాలి. కొత్త వ్యక్తులు, పరిచయం లేనివారికి దూరంగా ఉండాలి. దగ్గిన, తుమ్మినా ముఖానికి కర్చీఫ్లు, మాస్క్లు అడ్డుపెట్టుకోవాలి. సాధ్యమైనంత మేరకు ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. జనసంచారం ఉండే సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదు. దగ్గు, జలుబు బాధితులకు దూరంగా ఉండటం ఉత్తమం. కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో అప్రమత్తత ముఖ్యం వైద్య నిపుణులు, అధికారుల సూచనలు -
కమీషన్లకు లైసెన్స్
కొత్త డ్రామాకు తెరతీసిన అధికారులు.. ప్రైవేట్ ఏజెంట్లతో ఆర్టీఏ అధికారులు, సిబ్బంది కుమ్మక్కు గుంటూరులో స్లాట్ బుకింగ్.. తెనాలి, మంగళగిరిలో పరీక్ష డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే అడ్డగోలుగా ఫోర్వీలర్ లైసెన్స్లు అవినీతికి మారుపేరైన రెవెన్యూ శాఖతో సమానంగా పోటీ పడుతున్నారు ఆర్టీఏ అధికారులు. లైసెన్స్ కోసం వెళ్లామంటే చాలు, లంచం ఇవ్వందే పని చేయడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో మధ్యవర్తులతో కుమ్మకై ్క జేబులు నింపుకొంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
జ్వరాన్ని అశ్రద్ధ చేయొద్దు
గతంలో మాదిరిగా కరోనా వైరస్ సోకగానే భయపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం వస్తున్న కేసులు ఒమిక్రాన్ సబ్వేరియంట్కు చెందినవి. వీటి వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ నిర్ధారణ జరిగిన తరువాత వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందటం చాలా ఉత్తమం. తొలుతే గుర్తిస్తే మందులతోనే కరోనాను కట్టడి చేయవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఇంజెక్షన్లు చేయాల్సి వస్తుంది. – డాక్టర్ వరా అనిల్కుమార్, కరోనా నోడల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ జ్వరం సోకగానే భయపడకుండా, అశ్రద్ధ చేయకుండా అది ఏ జ్వరమో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహాలు లేకుండా జ్వరం రాగానే మందులు వాడకూడదు. దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటుగా ప్రతి ఒక్కరూ వైరస్ను కట్టడి చేసేందుకు హైప్రోటీన్ డైట్ తీసుకోవాలి. గుడ్డు, పాలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్, పప్పుధాన్యాలు, అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు మంచి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానం వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కోగంటి కల్యాణ్చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు -
నేడు ఓలేరులో వారాహి మహా హోమం
భట్టిప్రోలు: మండల పరిధిలోని ఓలేరు శివానంద ఆశ్రమంలో శ్రీ వారాహి గుప్త నవరాత్ర మహోత్సవంలో భాగంగా బుధవారం బాలాజీ గురుకుల్ పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం మహాహోమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రరూప ధారిణి అయిన అమ్మవారిని చూడటం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని... అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పారు. ఈ పూజలో పాల్గొంటే శత్రు బాధలు, దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు. కుంచవరం (తెనాలి): కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసియున్న శ్రీవారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రులు బుధవారం ఎనిమిదో రోజుకు చేరాయి. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలను పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం హోమాలు, సాయంత్రం కుంకుమపూజ చేశారు. చక్రాయపాలెంకు చెందిన పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక, సారె సమర్పించారు. ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, భరత్స్వామి, హేమంత్కుమార్, జెట్టి వెంకట సాయితేజ, భక్తులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: ప్రజలను కరుణించాలని వరుణుడిని కోరుతూ మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, లోక కల్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని 23 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ టెట్ మోడల్ టెస్ట్ పేపర్లను డీఈఓ షేక్ సలీమ్ బాషా బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ యూటీఎఫ్ తయారు చేసిన టెస్ట్ పేపర్లు ఇన్స్టెంట్గా చదువుకుని, ఉత్తీర్ణులయ్యేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏలో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, మాథ్స్, సోషల్ విడివిడిగా టెస్ట్ పేపర్లను పుస్తకాల రూపంలో అందుబాటులో తెచ్చామన్నారు. గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ కోసం అదనంగా మరికొన్ని మోడల్ పేపర్లను కలిపి పుస్తకాలను రూపొందించామని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్లు మాట్లాడుతూ మోడల్ టెస్ట్ పేపర్లు కావలసిన వారు బ్రాడిపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు ఎం. గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా ఫ్లయ్ఓవర్ పనులు
చిలకలూరిపేట: జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఉన్న చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ప్రమాదకర రీతిలో ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా, ఎన్హెచ్ఏఐ అధికారుల అనుమతి లేకుండా పనులు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నోటీసు జారీ చేసినా పనులు కొనసాగించటం విశేషం. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గడ్డర్ నేలకొరిగి పెను ప్రమాదం సంభవించింది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 18న జారీ చేసిన నోటీసుకు విలువ లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీతనం ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. వాడరేవు నుంచి ... చీరాల వాడరేవు నుంచి చిలకలూరిపేట మీదుగా నకిరికల్లు వరకు 167ఏ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఓడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర ఓ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు నిర్వహిస్తోంది. బొప్పూడి సమీపంలో చైన్నె నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి బైపాస్ రోడ్డుపై ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన నిర్మాణ పనులు పరిశీలించిన జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్... నిర్మాణంలో ఉన్న ఫ్లయ్ఓవర్ కింద వాహనాల రాకపోకలు ఎలా అనుమతిస్తారని, ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా పనులు నిర్వహించరాదని సంబంధిత కాంట్రాక్టు సంస్థకు ఈ నెల 18వ తేదీన స్టాప్ వర్క్(పనుల నిలిపివేత) నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండానే పనులు కొనసాగిస్తున్నారు. గతంలో కూలిన గడ్డర్... ఇదే నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా పిల్లర్లపై ఐరన్ రాడ్లు, సిమెంట్తో నిర్మించిన గడ్డర్లను భారీ క్రేన్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో యత్నించారు. అప్పుడు క్రేన్లకు అమర్చిన ఐరన్ రోప్లు జారడంతో వందల టన్నుల బరువైన గడ్డర్ నేలకొరిగింది. ఈ ఘటన గత మార్చి 7వ తేదీన జరిగింది. నాడు ట్రాఫిక్ డైవర్షన్ చేసినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాంట్రాక్టర్కు సంబంధించిన క్రేన్కు మాత్రమే నష్టం జరిగింది. ఇలాంటి చేదు అనుభవం ఉన్నప్పటికీ సంబంధిత సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే నిర్మాణం నిలిపివేయాలని ఎన్హెచ్ఏఐ నోటీసులు లెక్క చేయకుండా కొనసాగిస్తున్న కాంట్రాక్టు సంస్థ గతంలో పెను ప్రమాదం జరిగినా అదే నిర్లక్ష్యం ట్రాఫిక్ మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు నిర్వహిస్తున్న విషయం మా పరిశీలనలో నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసు జారీ చేశాం. ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి పొంది ట్రాఫిక్ డైవర్షన్ ఇతర నిబంధనలు పాటించాకే పనులు పునఃప్రారంభించాల్సి ఉంటుంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటాం. – వికాస్.ఎస్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15న అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న మార్గం, ప్రధాన వేదిక ఏర్పాటు, జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు, న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, ఉన్నత అధికారులు, ఇతర విభాగాల వ్యక్తులు కూర్చొనేందుకు ఏర్పాట్లు, పోలీస్ పెరేడ్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు, సాధారణ ప్రజానీకం వాహనాల పార్కింగ్, ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే వివిధ శాఖల శకటాలు, తదితర అంశాలను పరిశీలించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అభిషేక్, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రొటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, సీఆర్డీఏ ఇంజినీర్లు పాల్గొన్నారు. శాఖల మధ్య సమన్వయం కీలకం.. ప్రజా సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ పేర్కొన్నారు. గుంటూరు నగర పాలక సంస్థతోపాటు జిల్లాలోని ఇతర అభివృద్ధి పనులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మధ్య నెలకొన్న వివిధ సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించేందుకు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీసి హాల్లో జిల్లా కలెక్టర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ సుధీష్ణ సేన్ మాట్లాడుతూ, రైల్వే శాఖ పరిధిలో ఉన్న సమస్యలను జిల్లా యంత్రాంగం, గుంటూరు నగర పాలక సంస్థతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జిఎంసీ కమిషనర్ మాయూర్ అశోక్, రైల్వే అడిషనల్ డీఆర్ఎం రమేష్ కుమార్, రెవెన్యూ, రైల్వే శాఖల అధికారులు పాల్గొన్నారు. యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు ర్యాంప్, ఈఎస్డిపీ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధ్వర్యంలో ర్యాంప్ ఎంట్రీప్యూనర్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకంలో 10 రోజుల పాటు ఎంటర్ప్రనెస్ట్ గురించి మరో 10 రోజులు టెక్నికల్ కోర్సుల గురించి ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు మధ్యనున్న యువతీ యువకులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వి.విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
దిద్దుబాటుకు కుస్తీలు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): తీవ్ర ఒత్తిడి మధ్య ఆర్పీలు అల్లాడిపోతున్నారు. తమకు గత నాలుగు నెలలుగా సీఓ ఇందిరా సుశీల జీతాల అప్రూవల్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న విషయంపై 12వ డివిజన్కు చెందిన ఆర్పీలు కొద్ది రోజుల క్రితం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ‘జీవితాలను ‘ఆర్పీ’వేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో ఉలిక్కి పడిన మెప్మా సిబ్బంది దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పీడీ స్థాయిలో విచారణ చేయరా? ఆర్పీల జీతాల విషయంపై రచ్చ జరుగుతుండటంతో మెప్మా కార్యాలయంలో ఓ సీఓ.. ఈ వివాదాన్ని పలుచన చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ సమస్యను పీడీ స్థాయి అధికారి విచారణ చేపట్టాల్సి ఉండగా..సీఓ స్థాయి వ్యక్తి విచారణ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆర్పీలను కలెక్టరేట్ వద్ద ఉన్న మెప్మా కార్యాలయానికి ఓ సీఓ పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో సదరు ఆర్పీలు కూడా సీఓ కాదు.. జీతాలు ఆప్రూవల్ పీడీ లాగిన్లో పెండింగ్లో ఉన్నాయంటూ.. కాదు మరో అధికారి లాగిన్లో ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం ముదరకుండా ఆర్పీలకు జీతాలు వేసే ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. గతంలో ట్యాబ్ల కుంభకోణం ఎమ్మెల్యే వెంట తిరిగే ఓ వ్యక్తి, డివిజన్లో ఉండే క్లస్టర్ ఇన్చార్జ్ అండ చూసుకునే సీఓ రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లస్టర్ ఇన్చార్జ్ కనుసన్నల్లోనే సదరు సీఓ అన్ని పంచాయితీలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. గతంలో ఆర్పీలకు ట్యాబ్లు ఇచ్చే సమయంలో కూడా ట్యాబ్కు రూ.5వేలకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా క్లస్టర్ ఇన్చార్జ్ పర్యవేక్షణలో జరిగినట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆర్పీలపై టీడీపీ నాయకుల పెత్తనం లేకుండా చూడాలని పలువురు ఆర్పీ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన బాధ్యత
గుంటూరు వెస్ట్: సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన కనీస బాధ్యతని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో నిర్వహిస్తున్న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ రెండో రోజు కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తితోపాటు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ పెద్దలను గౌరవించే సమాజం గొప్ప సమాజంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది తమ సేవా కాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలు అమూల్యమైనవని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు పెన్షన్ మంజూరు కోసం ఏజీ కార్యాలయం చుట్టూ తిరిగేవారని, అలాంటి పరిస్థితుల్లో వారిని గుర్తించి గౌరవించడం గొప్ప విషయమన్నారు. ఇందుకు అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులకు అభినందనీయులన్నారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసాక వారు పడే ఇబ్బందులను సత్వరంగా పరిష్కరించేందుకు జిల్లాలకు తరలివచ్చి ప్రత్యక్షంగా అదాలత్ నిర్వహిస్తుండటం శుభసూచికమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు సీనియర్ అధికారుల నుంచి నేర్చుకుని, వారి ఉద్యోగ విరమణ సమయంలో వారికి సేవలు అందించడం మంచి విషయమన్నారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ మాట్లాడుతూ సుదీర్ఘ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులు పెన్షన్ పొందటం వారి హక్కు అని, దానిని సక్రమంగా అందించడం తమ బాధ్యతన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్లు విరమణ చేసిన ఉద్యోగులు కొందరికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. జీపీఎఫ్ చందాదారులు, డీడీఓల అవసరార్ధం సమగ్ర సమాచారంతో కూడిన తెలుగులో ముద్రించిన కరదీపికను జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యుటీ అకౌంటెంట్ జనరల్ ఆషితా పట్నాయక్ , కుషాల్ కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, అకౌంటెంట్ జనరల్ కాార్యాలయ సీనియర్ అధికారులు టి.విజయ్ కుమార్, డి.చంద్రశేఖర్, వి.సురేష్, పి.రమేష్ తదితరులు, జిల్లా ట్రెజరీ డీడీ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల ప్రతినిధులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి -
‘గిరిజన’ ఉపాధ్యాయులను రోడ్డున పడేసిన ప్రభుత్వం
తాడేపల్లి రూరల్: గిరిజన గురుకుల ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడవేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని గురుకుల కమిషనర్ కార్యాలయం వద్ద గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆందోళన చేయడానికి వీలు లేదని, అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, కానీ ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వీరికి రాష్ట్రంలోని లక్షలాది మంది అంగన్వాడీలు అండగా నిలుస్తారని హెచ్చరించారు. విద్యాశాఖలో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో అతి తక్కువ వేతనం రూ. 12 వేలు తీసుకుంటూ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గురుకుల ఉపాధ్యాయులను రెన్యువల్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. తొలగించిన వందలాదిమంది ఉపాధ్యాయులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ జేఏసీ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతు ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయుల సమస్యను తాత్సారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంఘం నాయకులు మల్లిఖార్జున నాయక్, పరమేశు, విజయ నాయక్, మహమ్మద్, తార, దిల్షాద్, బాబు, పీటర్పాల్, రాజేష్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
నికరలాభంలో వృద్ధి సాధించిన యూకో బ్యాంక్
త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సీఈఓ రాజేంద్రకుమార్ సాబుతాడేపల్లి రూరల్: యూకో బ్యాంక్ ఇటీవల ప్రకటించిన జూన్ 30, 2026 నాటితో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకారం బ్యాంక్ తన నికర లాభంలో మంచి వృద్ధిని సాధించిందని, ఈమేరకు బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ రాజేంద్రకుమార్ సాబు నుంచి ప్రకటన విడుదలైనట్లు బుధవారం యూకో బ్యాంక్ విజయవాడ జోనల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 6,05,083 కోట్లుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 15.53 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. సీఎఎస్ఏ వృద్ధి రూ. 1,16,136 కోట్లుగా నమోదు అయ్యిందని, ఇది వార్షిక ప్రాతిపదికన 12.34 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపారు. రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో అడ్వాన్సులు, రిటైల్ అడ్వాన్సుల్లో కూడా వార్షిక వృద్ధి చెందినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికానికి లాభదాయకత 79.84 శాతం వృద్ధిని కనబరిచి రూ. 2810 కోట్లుగా నమోదు అయ్యిందని, జూన్ 30 నాటికి మూలధన పర్యాప్త నిష్పత్తి 19.03 శాతంగా ఉండగా, మూల ధన నిష్పత్తి 17.44 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రూ. 656 కోట్లుగా నమోదు అయ్యిందని, గత సంవత్సరంతో పోలిస్తే 8.05 వృద్ధిని నమోదు చేసుకుందన్నారు. ఆస్తులు, అప్పులు ఈ త్రైమాసికానికి రిటైల్ అడ్వాన్సులు రూ. 71,549 కోట్లుగా నమోదు అయ్యాయని, గృహ రుణాలు, వాహన రుణాల పోర్టుపోలియోలో వృద్ధి కారణంగా ఇది. 27.32 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసినట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణాలు రూ. 38.952 కోట్లుకు చేరిందని, ఈ త్రైమాసికంలో రూ. 47244 కోట్లు రుణాలు ఎంఎస్ఎంఈకి ఇచ్చినట్లు తెలిపారు. దేశీయ శాఖలు 3421 ఉండగా, హాంగ్కాంగ్, సింగపూర్లలో రెండేసి విదేశీ శాఖలు, ఇరాన్లో 1 ప్రతినిధి కార్యాలయం ఉన్నాయన్నారు. దేశీయ శాఖల్లో 61 శాతం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఆర్థిక సమ్మిళిత కార్యాక్రమాలకు దోహదపడుతున్నాయని సీఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లాలో బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలని వ్యాపారస్తులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుదల కనిపిస్తుండటంతో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత పది రోజులుగా జిల్లాలో సూపర్ ఫైన్ బియ్యం ధర రూ.5 నుంచి 6 వరకు పెరిగిందని, కందిపప్పు, మినప్పప్పులు కూడా రెండు నుంచి మూడు రూపాయలు పెరిగినట్లుగా రోజువారీ ధరల సేకరణలో తెలిసిందన్నారు. ధరల పెరుగుదలపై వ్యాపారస్తులను ఆరా తీశారు. బియ్యం, కందిపప్పు ధరలలో ఇంకా పెరుగుదల కనిపిస్తే జిల్లా యంత్రాంగం స్థానిక హోల్సేల్ వ్యాపారస్తులు, మిల్లర్ల సహకారంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు, మిల్లర్లు సహకారం అందించాలని కోరారు. ఇతర వస్తువుల ధరలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నాటి నిబద్ధత ఫలమే నేటి వైభవం ఏఎన్యూ(పెదకాకాని): తల్లి లాంటి విశ్వ విద్యాలయం మనకు, మన కుటుంబాలకు ఎన్నో అవకాశాలు, గుర్తింపు, గౌరవాన్ని అందించిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ ఆచార్య కె.వియన్నారావు అన్నారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన పూర్వ బోధన, బోధనేతర సిబ్బంది సత్కార కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. దశాబ్దాల పాటు వర్సిటీ అభ్యున్నతికి సేవలందించిన ఉద్యోగులు, అధ్యాపకులను ఒకే వేదికపై ఘనంగా సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం తర్వాత అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిన విద్యాసంస్థగా ఏఎన్యూ ఎదిగిందన్నారు. నాటి ఉద్యోగుల నిబద్ధతతో కూడిన విధులే నేటి వైభవానికి కారణమన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సరసన నిలుస్తూ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని ఏఎన్యూ నిలబెట్టుకుంటోందన్నారు. -
ఎంపీఈఓలను పర్మినెంట్ చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ ఎక్స్టెన్సన్ ఆఫీసర్(ఎంపీఈఓ)లను పర్మినెంట్ చేయాలని ఏపీ మల్టీ పర్పస్ ఎక్స్టెన్సన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పుల్లగూర అనిల్కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎంపీఈఓలు బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టి సహాయ నిరాకరణ, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ ఎంపీఈఓలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ కింద నమోదు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఈఓలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల పాటు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సహాయ నిరాకరణ, ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డేవిడ్, నాయకులు అనిల్, అఖిల్, వర్ధన్, సురేష్, రాఘవ, అంజిబాబు, సుభానీ, వెంకటేష్, కోటి, శాంతి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీఈఓల అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ -
నాటకాలు వహ్వా..!
‘‘దోచుకుంది మనవాళ్లయితే చాలు.. అది ఎంత పెద్ద అవినీతైనా చూసీచూడనట్లు వదిలేద్దాం.. మళ్లీ వేరే పేర్లతో టెండర్లు కట్టబెట్టి జేబులు నింపుదాం.. ఎవరైనా అడిగితే విచారణల పేరుతో కాలయాపన చేద్దాం...’’ ఇదీ.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న తంతు. ప్రజాధనం రూ.కోట్లలో దోపిడీకి గురైనా.. అటు అధికారులపై గానీ, ఇటు కాంట్రాక్టర్లపైగానీ ఇప్పటివరకు చర్యల ఊసే లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల స్వాహా...నకిలీ పత్రాలతో ప్రణాళిక 2017 నుంచి జరుగుతున్న తంతు.. అడ్డదారిలో వంద వర్కులా? -
24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్
గుంటూరు వెస్ట్: మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) 3.1ను ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలుపుకుని 1048 ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుమారు లక్షా 80 వేల మంది పేరెంట్స్ పాల్గొననున్నారన్నారు. ఇదొక మెగా ఈవెంట్గా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఇందులో తల్లిదండ్రులతో ఒక్కో ఉపాధ్యాయుడు పరస్పరం మాట్లాడి, విద్యార్థి చదువు వివరాలు చర్చిస్తారన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఆంధ్ర ప్రదేశ్ (లీప్) యాప్ ను తల్లిదండ్రులు అందరూ డౌన్ లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తారన్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల తమ పిల్లల విద్యా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి ఏదో ఒక పాఠశాలలో తప్పక హాజరు కావాల్సి ఉందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల చదువు వివరాలతోపాటు తల్లిదండ్రులకు మరింత బాధ్యత పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా పాల్గొన్నారు. -
అమానుషంపై ఆగ్రహం
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనలో మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం ఉదయం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పాలనలో చోటు చేసుకున్న అమానుష సంఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ తెనాలి, తాడికొండ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, కొలకలూరి కోటేశ్వరావు, జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు, పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకాయమ్మ, జిల్లా అనుబంధం విభాగాల అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్, దానం వినోద్, తాడిపోయిన వేణుగోపాల్, సీహెచ్ వినోద్, వాసిమళ్ల విజయ్, దానం వినోద్బాబు, యేటి కోటి, చిన్నపరెడ్డి, జి.ప్రభు, అవినాష్, మహిళా నాయకులు ఝాన్సీ, స్వర్ణలత, శివ పార్వతి, కవిత, బూసి రాజ్యలత, యక్కలూరి మారుతి కోటి లింగారెడ్డి, బూసి రాజలత తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
ఈ ఘటన ఎంతో అమానుషం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ నివాసముంటున్న జిల్లా ఇది. డీజీపీ, మహిళా కమిషన్ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయినా ఒక సాధారణ మహిళకు రక్షణ కల్పించలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి బాధితులు మొరపెట్టుకున్నా తమ పార్టీ నాయకుడు కావడంతో కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తరువాత కేసు నమోదు చేసిన మరునాడు బాధితురాలిని పరామర్శిచేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వచ్చారు. నిందితులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. హోం మంత్రి అనిత ఎక్కడున్నారు? అసలు ఆమెకెందుకు ఆ పదవి? – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు -
మమ్మల్ని బతికించండి
20వ రోజు కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేతల నిరాహార దీక్ష మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద 20 రోజులుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఇది కచ్చితంగా వివక్షేనని అన్నారు. మేము పారిశ్రామికవేత్తలమే కాని అసాంఘిక శక్తులం కాదు. దేశ ప్రగతిలో, జీఎస్టీలో మేము భాగస్తులమే ఈ విషయాన్ని ప్రభు త్వం మర్చిపోయి మా డిమాండ్లు నెరవేర్చకుండా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకుండా చిత్రహింసలుకు గురి చేస్తుందని వాపోయారు. పోలీసులు, పారిశ్రామికవేత్తల మధ్య వాగ్వాదం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా బయలుదేరుగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు తీసుకున్నామని పారిశ్రామికవేత్తలు చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారు. ఈ దశలో పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేతల మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి ఓఎస్డీ మనోజ్ హెగ్డే పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం మరొకసారి అనుమతి తీసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తామని వారు నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లారు. సీపీఎం, కేవీపీఎస్ మద్దతు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరాహార దీక్ష శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తానన్నా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఊబిలో ముంచుతుందని దుయ్యబట్టారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అండా మాల్యాద్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్య పరిష్కారం కోసం దళిత సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. అధ్యక్షుడు ఆనర్బాబు, వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తినాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రమేష్, కారం సత్యనారాయణమ్మ, కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చినమౌలాలి, త్రిమూర్తులు, అమలాపురం కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్లు దయాకర్, నీరజ, కడప కోఆర్డినేటర్ ఆర్ఎం రా జా, నంద్యాల నుంచి సుబ్బారాయుడు, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు
నగరంపాలెం: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసుని తాడికొండ పోలీసులు ఛేదించగా, ఐదుగుర్ని అరెస్టు చేసి బంగారు సొత్తు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల ఏడున తాడికొండ మండలం ఫణిదరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడుగుల శంకరరావు (52) అదృశ్యమైనట్లు ఫిర్యాదివ్వగా తాడికొండ పీఎస్లో కేసు నమోదైంది. ఐదు రోజులు గడిచాక నల్లపాడు క్వారీ గుంతల్లో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులను తీసుకెళ్లగా, మృతుడు శంకరరావు అని నిర్ధారించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా, మృతుని మొబైల్ లాం, వైజాగ్లో ఉన్నట్లు చూయించడంతో విచారణ కొనసాగించారు. మొబైల్ఫోన్ లాం గ్రామంలో చూయించగా, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్, గుజ్జర్లపూడి శ్యామూల్ అలియాస్ సీమోను, కనపర్తి మణికంఠ, ఘట్టమనేని పుష్ప, దేవళ్ల పద్మను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఐదుగుర్ని అరెస్ట్ చేసి నాలుగు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, రూ.70 వేలు, కారు, మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ప్లాన్లతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఏ–1 నాగేశ్వరరావుకు మిగతా నలుగురితో పరిచయం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకరరావుతో శ్యామూల్కు పరిచయం ఉంది. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడని, అతన్ని బెదిరిస్తే డబ్బులు వస్తాయని శ్యామూల్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యడ్లపాడులో భూమి కొనాలని శంకరరావుని నమ్మించి, ముందస్తుగా ప్లాన్ వేశారు. ఈనెల ఏడు సాయంత్రం రియల్ ఎస్టేట్ వ్యాపార్ని అద్దె కారులో తీసుకెళ్లారు. వంకాయలపాడు గ్రామ సమీపాన ఐదుగురు ఏకమై, అతనిపై దాడికి పాల్పడ్డారు. కొరియా తాడుతో అతను గొంతుకి బిగించి హత్య చేశారు. అనంతరం మృతుని ఒంటిపై నాలుగు బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు, రూ.72 వేలు తీసేసుకున్నారు. మృతదేహానికి సిమెంట్ రాయి, బైండింగ్ వైరు కట్టేసి పొత్తూరు పరిధిలోని క్వారీ గుంతలో పడేశారు. అక్కడ్నుంచి అందరూ పరారయ్యారు. అయితే మృతు ని మొబైల్ఫోన్ లోకేషన్ వైజాగ్, లాం గ్రామంలో చూయించగా ఆ దిశగా విచారించారు. మరో హత్య కేసు వెలుగులోకి.. తాడికొండ పోలీసుల విచారణలో మరో యువకుడి హత్య కేసు వెలుగు చూసింది. వెంగళాయపాలెంకు చెందిన నాగరాజు, నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. నాగేశ్వరరావు కుమార్తె వేరొకరితో వెళ్లిపోయింది. అందుకు నాగరాజు సహకరించినట్లు నాగేశ్వరరావు పగ పెంచుకున్నాడు. రెండు నెలలు కిందట నాగరాజుని దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహన్ని మాచర్ల సమీపాన సాగర్ కుడి కాలువలో పడేశారు. మాచర్ల పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. కుమారుడు అదృశ్యంపై తల్లిదండ్రులు నల్లపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఏ–1 నాగేశ్వరరావుపై మహిళా పీఎస్, ఎకై ్సజ్ పీఎస్లో కేసులు, మణికంఠపై మూడు కేసులు, ఇద్దరు మహిళలపై చీటింగ్ కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. నాగేశ్వరరావు, మణికంఠపై పీడీ యాక్ట్కు సిఫార్సు చేస్తామని అన్నారు. అదృశ్య కేసులను చేధించిన తాడికొండ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, ఎస్ఐ జేత్యనాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిస్సింగ్ కేసులను ఛేదించిన తాడికొండ పోలీసులు -
ఇప్పటికే స్టాంపులను నాశనం చేశారు...
గతంలో నాన్జుడిషియల్ స్టాంపులు పుష్కలంగా దొరికేవి. ఓటీపీ విధానం పెట్టి ఎవరూ కొనకుండా చేశారు. స్టాక్ హోల్డింగ్ పేరుతో ప్రైవేటు కంపెనీని తీసుకొచ్చి ఈ–స్టాంపు పేపర్లు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా స్టేషనరీ సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటు వేశాం. ప్రజలకు మేలు చేయకపోగా ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. – షేక్ రషీద్, స్టాంపు వెండర్ల అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ -
ఉద్యోగాల పేరుతో లక్షలు కాజేశారు
ఎస్పీ ఎదుట బాధితుల మొర నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలు కాజేశారంటూ బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను అలకించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా విచారించారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 166 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదిదారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా అన్నదానం చేశారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), శివాజీ (సీసీఎస్)లు ఫిర్యాదులు స్వీకరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: సదరన్ ప్రైవేటు లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు దరఖాస్తులు సమర్పించాలని, సెప్టెంబర్ 6వ తేదీ గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. వివరాలకు సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పయర్థ నాగయ్యను 99499 29674 నంబర్లో సంప్రదించాలని సూచించారు. తెనాలి: యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్ భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈనెల 18న నిర్వహించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్ (జీసీవైసీడబ్ల్యు) ఆధ్వర్యంలోని ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్‘ కార్యక్రమంలో భారతీయ బాల కవయిత్రులు ప్రణవి బిట్రా, ఇషాన్వి బిట్రా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సోదరీమణులు మంగళగిరికి చెందిన బిట్రా వెంకటేశ్వరరావు, మల్లికల కుమార్తెలు. పదహారేళ్ల ప్రణవి బిట్రా సృజనాత్మక రచనలో ప్రతిభ, ఊహాశక్తి, సాహిత్య నిబద్ధతకు గుర్తింపుగా ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్–2026‘ ప్రదానం చేశారు. అదే కార్యక్రమంలో ఆమె సోదరి, 12 ఏళ్ల ఇషాన్వి బిట్రాకు సృజనాత్మక రచనలో చురుకై న భాగస్వామ్యానికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ను అందజేశారు. డాక్టర్ కృష్ణ కుమార్, చిత్ర కుమార్ స్థాపించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్, ఈ యువ రచయిత్రుల సాహిత్య ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో సృజనాత్మక రచనలు చేసి ప్రపంచ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించింది. యూకేలోని డెర్బీ పట్టణంలో ఉంటున్న బిట్రా వెంకటేశ్వరరావు రోల్స్రాయిస్ ప్రధాన కార్యాలయంలో ఒక డివిజన్ టీమ్ లీడర్గా చేస్తుండగా, మల్లిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు. వీరి కుమార్తెలు ప్రణవి 11 క్లాస్ పాసై, కాలేజిలో చేరనుండగా, ఇషాన్వి ఫోర్త్ క్లాస్ చదువుతోంది. చదువుతోపాటు సృజనాత్మక అంశాల్లో రాణిస్తున్న వీరు, కవితా రచనలోనూ సాధనచేస్తూ గుర్తింపును సాధించటం స్ఫూర్తిదాయకం. -
కుమారుడి హత్య కేసులో తల్లిదండ్రులు, సోదరుడి అరెస్ట్
తెనాలి రూరల్: ఆస్తి, డబ్బు కోసం తల్లిదండ్రులను కన్న కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడు. సహనం సహించిన తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అతడిని హత్య చేసి శవాన్ని కృష్ణా నదిలో మాయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న వేళ సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర భాస్కరరావు, బుల్లెమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కోటేశ్వరరావు(28) ఆటో డ్రైవర్. చిన్న కుమారుడు మరియదాసు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్. కోటేశ్వరరావుతో విభేదించిన భార్య కొంతకాలం క్రితం వెళ్ళిపోయింది. నాజరుపేటలో తల్లిదండ్రులతో కలిసి కోటేశ్వరరావు ఉంటున్నాడు. వీరికి కొల్లిపరలో రెండున్నర సెంట్ల భూమి ఉంది. మద్యానికి బానిసైన కోటేశ్వరరావు ఆ భూమిని అమ్మి తనకు వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 రాత్రి కూడా ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో తీవ్రంగా గొడవపడ్డాడు. తల్లిదండ్రులు, రెండో కుమారుడు మరియదాసు, మరో మహిళ మున్నంగి నాగేశ్వరమ్మతో కలిసి నిందితుడిని కొట్టి, గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసును వెంటనే ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. సీఐ సీహెచ్. రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు జీవితంలో ఎదగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉత్తమ ప్రతిభతో షైనింగ్ స్టార్లుగా నిలిచిన విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ‘షైనింగ్ స్టార్స్ – 2026‘ కార్యక్రమాన్ని సోమవారం పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్లో 137, ఇంటర్మీడియట్లో 40 మంది చొప్పున విద్యార్థులకు సన్మానం చేశారు. రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, పతకం, ధ్రువపత్రం బహూకరించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచి విద్యా వ్యవస్థ ఉందన్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు స్ఫూర్తిప్రదాతలు అన్నారు. ఎమ్మెల్యేలు ఎండీ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, డీఈఓ షేక్ సలీమ్ బాషా, ఇంటర్ ఆర్జేడీ జె.పద్మ, ఆర్ఐవో జి.సునీత, సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తహసీల్దార్ సుభాని, డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
అసలు ఎందుకు పీపీపీ విధానం తీసుకొచ్చారు?
ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ (ప్రైవేట్, పబ్లిక్ పార్టరన్షిప్) చేయాల్సిన ఆవసరం ఏముంది. వేల కోట్లు ఆదాయాలు తీసుకోవడం తప్పితే ప్రభుత్వం ఏనాడైనా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పట్టించుకుందా. ఉమ్మడి జిల్లాలో 38 ఎస్ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 8 మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు. మిగిలినవి ప్రైవేటు భవనాల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం తమ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. – డి.విష్ణుమూర్తి, సీనియర్ దస్తావేజు లేఖరి -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
మహిళకు రక్షణ కల్పించలేని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. బాధితురాలికి న్యాయం చేయకుండా, నిందితులకు వత్తాసు పలకడం సిగ్గు చేటు. ఇది రాష్ట్రంలోనే అత్యంత అమానుష ఘటన. టీడీపీలోని రౌడీలు, గూండాలకు చట్టం అంటే భయం లేదు. వారికి పార్టీలో పదవులు ఇచ్చి అచ్చోసిన అంబోతుల్లా రోడ్లపైకి వదులుతున్నారు. గల్లా మాధవి ఏం మాట్లాడుతతున్నారో ఆమెకే తెలియదు. వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పార్టీలో ఇంత మంది మహిళలం నాయకులుగా ఎదిగాం. టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర మాజీ మేయర్ -
వైభవంగా వీవీఐటియూ జగన్నాథ రథయాత్ర
పెదకాకాని: విశ్వప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా నిర్వహించిన వీవీఐటియూ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. మండలంలోని నంబూరు వీవీఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రథయాత్రను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి గోళ్లమూడి గ్రామం మీదుగా వీవీఐటియూ వరకు ఈ యాత్రను వివా, వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు చేరాపహరాతో (బంగారు చీపురుతో శుభ్రపరిచి) ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయహే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. వీవీఐటియూ అధ్యాపకేతర సభ్యుడు నంబూరు మణికుమార్ జగన్నాథుని వేషధారణలో ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో శివాలయం ఈవో గోగినేని లీలాకుమార్, వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, పెదకాకాని పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీడీసీసీ బ్యాంకు అభివృద్ధికి నోడల్ వ్యవస్థ కీలకం
బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావుకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరును మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నోడల్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు అధికారులను ఆదేశించారు. గుంటూరు బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ అభివృద్ధిలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నోడల్ అధికారి తమ పరిధిలోని శాఖల పనితీరు మెరుగుపడేలా అవసరమైన సూచనలు అందించడంతో పాటు లోపాలను వెంటనే గుర్తించి పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్లో 11 మంది నోడల్ అధికారులతో నోడల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని బ్యాంక్ సీఈఓని ఆదేశించారు. బ్యాంక్ శాఖలు, సహకార సంఘాల మధ్య సమన్వయం పెంచుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో బ్యాంకు సీఈవో వీవీఎస్ ఫణి కుమార్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వినుకొండ సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి
వినుకొండ: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సోమవారం వినుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, కట్ట కాళిదాస్, లోక్ అదాలత్ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు. లీకేజీ నీటిని పరిశీలించిన సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీటి విడుదల జరిగేటప్పుడు కుడి జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న లీకేజీ వాటర్ను సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి.కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలో కెనాల్ బెడ్ కొట్టుకుపోవడంతో వాల్ దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీరు పవర్ హౌస్లోకి లీక్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జునరావు, వపర్ హౌస్ డీఈఈ రాజారెడ్డి, సాగర్ ప్రాజెక్టు డీఈఈ గోపాలరావు, ఏఈలు శివయ్య, యుగంధర్ పాల్గొన్నారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా భారతి పెదకాకాని: రాష్ట్ర దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్ పర్సన్గా విశ్రాంత న్యాయమూర్తి ఎం.భారతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన భారతిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు జిల్లా పెదకాకానిలోని రాష్ట్ర దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ పదవిలో భారతి నియమితులయ్యారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.థామస్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సిద్దెల ప్రేమ్సాగర్ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలెక్టరేట్లో కలసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి సవరణ తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలన్నారు. కలెక్టర్ను కలసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శేషిరెడ్డి ఉన్నారు. -
వైఎస్ జగన్ వచ్చాక లెక్కలు తేలుస్తాం
కూటమి పాలనలో మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఆ పార్టీ వారే దాడి చేశారని, అన్యాయం జరిగిందని ఒప్పుకొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. న్యాయం చేశామని చెప్పడం సిగ్గుచేటు. శిక్ష వేసినా న్యాయం జరగదు. రాష్ట్ర మొత్తం సిగ్గు పడాల్సిన విషయం. ఎమ్మెల్యే చెబితేనే కేసు పెడతారా? కూటమి ప్రభుత్వం వైఫల్యం వలనే మేం ఇక్కడకు రావాల్సి వచ్చింది. ప్రభుత్వంపై తిరగబడతాం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తాం. పోలీసులు కేసు నమోదు చేయడంతోనే బాధితురాలికి న్యాయం జరగలేదు. కేసులో నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. – కాకాణి పూజితారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ -
గళ్లా మాధవికి బుద్ధి ఉందా?
సభ్య సమాజం తలదించుకునే రీతిలో తన నియోజకవర్గంలోని మహిళపై దాడి జరిగితే నీరుగార్చే ప్రయత్నం చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవికి బుద్ధి ఉందా? అరెస్టు చేసి రిమాండ్కు పంపడం మినహా నిందితులపై ఎటువంటి చర్యలు లేవు. మహిళకు రక్షణ లేదు. నిందితుడు టీడీపీలో ఉన్నాడని, పార్టీ నుంచి బహిష్కరించి చేతుల దులుపుకొనేందుకు ఇది రాజకీయ వ్యవహారం కాదు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తేనే టీడీపీలో ఉన్న మిగిలిన రౌడీలకు బుద్ధి వస్తుంది. మహిళలు అని చూడకుండా దాడులకు తెగబడటం, అధికారం తమ చేతుల్లో ఉందని పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకోవడంతో ప్రజలకు రక్షణ కరువైంది. – షేక్ నూరి ఫాతిమా, వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు -
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తారా?
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ప్రభుత్వ కన్ను పడింది. ఏడాదికి జిల్లాకు రూ.1000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీఓ నెంబర్ 396ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే) ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యంత పకడ్బందీ వ్యవస్థల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ప్రజల ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకు, లీగల్గా కాపాడడం వీటి ప్రధాన బాధ్యత. రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా దస్తావేజలు లేఖరులు, స్టాంపు వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా సుమారు 10 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జీఓ నెంబర్ 396 అమలైతే వీరంతా ఉపాధి కోల్పోయే అవకాశముంది. దీంతో దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టంది. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ దస్తావేజు లేఖరులతోపాటు వివిధ సంస్థలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రజలు కూడా తమ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని విమర్శిస్తున్నారు. నల్ల జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. -
మహిళలకు రక్షణ కరువు
గుంటూరు ఎడ్యుకేషన్: సభ్య సమాజం తలదించుకునేలా గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఘటనపై వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, నేతలు మండిపడ్డారు. గుంటూరు కేవీపీ కాలనీ మెయిన్రోడ్డులోని కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి ఈ నెల 15వ తేదీన బోరింగ్ పంపు వద్ద నెలకొన్న వివాదంలో ఒక మహిళను వివస్త్రను చేసిన ఘటనలో బాధితురాలిని సోమవారం వారు పరామర్శించారు. బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాము వచ్చామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, మాజీ కార్పొటర్లు బూసి రాజలత, యక్కలూరి మారుతి కోటి లింగారెడ్డి, వంగల హేమలత, అచ్చాల వెంకటరెడ్డి, గేదెల రమేష్, కాండ్రుకుంట గురవయ్య, నాయకులు త్రివేణి, సుబ్బులు, గరిక ఝాన్సీ, పిల్లి మేరీ, స్వర్ణలత, గౌరీ, పెద్దిరెడ్డి సుధ, జగన్ కోటి, అబీద్, పోలవరపు వెంకటేశ్వర్లు, వంగల వలివీరారెడ్డి, పోకల వసంత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం బిహార్ను మించిపోయింది. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పోలీసులు కూడా ప్రజల కోసం కాకుండా టీడీపీ నేతల కోసం పని చేస్తున్నారు. నిందితులు టీడీపీ నాయకుడు కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఈ నేతలను కాపాడే ప్రయత్నం చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్న గల్లా మాధవి తన నియోజకవర్గ పరిధిలో ఒక సాధారణ మహిళపై ఇంతటి దారుణం జరిగితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. సీసీ కెమెరా ఫుటేజీలు ఉండటం వలనే ఈ అమానుష దాడి బయటకు వచ్చింది. – విడదల రజిని, మాజీ మంత్రి బాధితుల ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉండటం వలనే జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. లేకుంటే టీడీపీ నేతలు, పోలీసులు అసలు కేసే లేకుండా మేనేజ్ చేసేవారు. ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మహిళా కమిషన్ ఏం చేస్తోంది? ఆధారాలు ఎలా బయటకు వచ్చాయనే ఆందోళన మినహా నిందితులపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదు. బాధితులకు అండగా నిలవాలనే ఆలోచన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు లేదు. ఎక్కడైనా, ఏ పార్టీలో అయినా నాయకుడు సరిగా ఉంటే దానిని అందరూ పాటిస్తారు. – ఉప్పాల హారిక, కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ -
ఎస్సీ హాస్టల్ విద్యార్థుల
ఆకలి కేకలునెహ్రూనగర్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది. అధికారులు, వార్డెన్ల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా శుక్రవారం రాత్రి గుంటూరు నగరంలోని ఎస్వీఎన్ కాలనీలో ఉన్న ఎస్సీ హాస్టల్లో హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోగా, ఉన్న కాస్త అన్నం, కూర కూడా అయిపోవడంతో సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. కూర లేదు.. అన్నం లేదు.. నీళ్ల చారే దిక్కు! మెను ప్రకారం రోజువారీ ఆహారం పెట్టకుండా నిబంధనలను పక్కనబెట్టి నాణ్యత లేని టమాటా కూర, నీళ్లలాంటి చారును వండారని విద్యార్థులు వాపోయారు. తీరా రాత్రి 8 గంటల సమయానికే కూర, అన్నం పూర్తిగా అయిపోయాయి. అప్పటికే ఆకలితో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వండిన కూర నీళ్ల సాంబారులా ఉందని, అన్నంలో నీళ్లు కలుపుకొని తినాల్సిన దుస్థితి వచ్చిందని విద్యార్థులు వాపోయారు. వార్డెన్ బాధ్యతారాహిత్యం హాస్టల్లో విద్యార్థులకు భోజన వసతి సరిగ్గా అందుతుందో లేదో చూడాల్సిన వార్డెన్ రాత్రి 7:45 గంటలకే హాస్టల్ వదిలి వెళ్లిపోయారని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లో అన్నం, కూర అయిపోయి విద్యార్థులు ఆకలితో అలమటిస్తుంటే.. విద్యార్థులు వార్డెన్కు దాదాపు 10 సార్లు ఫోన్ చేసినప్పటికి స్పందించలేదని ఆరోపించారు. చివరకు అరగంట తర్వాత ఫోన్ ఎత్తిన వార్డెన్.. తాను కూరగాయలు తెచ్చి హాస్టల్లో పెట్టి హాస్పిటల్కి వచ్చానని సాకులు చెప్పడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాత్రి 9 గంటలైనా భోజనం లేదని, తాము ఏం తినాలని విద్యార్థులు నిలదీయగా.. ‘రేపు పొద్దున వండిస్తానయ్యా‘ అంటూ వార్డెన్ అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు తమ బాధను వివరిస్తుండగానే వార్డెన్ ఫోన్ కట్ చేయడం వారి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. తెల్లారితే పరీక్షలు.. రాత్రంతా పస్తు పడుకోవాల్సిన దౌర్భాగ్యం ఉదయం తమకు పరీక్షలు ఉన్నాయని, రాత్రంతా ఆకలితో ఉంటే పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు వీడియోలో వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విద్యార్థుల ఆకలి తీర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోపై జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి హర్షితను వివరణ కోరగా ఆమె స్పందించలేదు. -
మినుము సాగు.. మిగులు బాగు!
వరినాట్లకు కూడా... సంప్రదాయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడుతూ పంటలు సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో అధికలాభాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు మల్లెపెద్ది రామకృష్ణ. తక్కువ నీటితో కూలీల ఖర్చు లేకుండా వరిసాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రబీ సాగు అనంతరం 50 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా మూడో పంటగా మినుము వేశారు. కేవలం రూ.15 వేల పెట్టుబడితో ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. మార్కెట్ ధరతో ఎకరాకు ఖర్చులు పోను రూ.35 వేల ఆదాయాన్ని తీస్తున్నారు. మిషనుతో నూర్పిడి చేస్తూనే ఖాళీ అయిన భూమిని జీరో లెవెలింగ్ చేస్తూ ఖరీఫ్కు సిద్ధం చేస్తున్నారు. ఈ రైతు విజయం స్ఫూర్తిదాయకం. 50 ఎకరాల్లో తక్కువ వ్యయంతో మూడో పంట ఎకరాకు రూ.35 వేల వరకు లాభం అభ్యుదయ రైతు రామకృష్ణ ప్రయోగం -
ఆధునిక సాంకేతికతతో జీవితంలో విజయం తథ్యం
తెనాలి: ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో గల వందలాది అప్లికేషన్స్ను విద్యార్థులు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించటం తథ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి సేవాసమితి ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్.శివరామప్రసాద్ ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారక ప్రసంగం చేశారు. సెల్ఫోన్లో అనవసర విషయాలను వీక్షించటం మానుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష్య, అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ, తోటివారికి సహాయం చేస్తూ, సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి రోజూ కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని క్రియాశీలత, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం 60 మందికి రూ.3 లక్షలను బహూకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వా ఏసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాష, వెంపటి సత్యనారాయణ, మొవ్వా విజయలక్ష్మి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపాందించాలి
ఎస్టీయూ నాయకులు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళిరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితులు అరెస్ట్
తెనాలిరూరల్: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఐదుగురికి గాయాలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చీరాల రూరల్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య ఆదివారం వివరాలు తెలిపారు. ఒంగోలు మరాఠీపాలేనికి చెందిన అనంత ఇందిరాదేవి (56) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. అయితే మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ఇక వ్యాధి ఎప్పటికీ తగ్గదేమోనని భావించి జీవితంపై విరక్తి చెందింది. వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్లో గుర్తు తెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తాడికొండ గురుకుల పాఠశాలను కొనసాగించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ లక్ష్మీపురం: తాడికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను మూసివేయటాన్ని, దీనిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థు తల్లిదండ్రులు, ఎస్.ఎఫ్.ఐ, కె.వి.పి.యస్ సంఘాల నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా దాడిచేసి అరెస్టు చేయటాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని అన్నారు. రాజధానిలో వేల ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు కూడా అలాగే భూములు కేటాయించి నడపవచ్చని, ఏకపక్షంగా గురుకుల పాఠశాలను తరలించడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి కట్టబెట్టటాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. అమర్యాదగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన సీఐపై చర్య తీసుకోవాలని, తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించటానికి ప్రభుత్వం పూనుకోవాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మహంకాళికి నిమ్మకాయల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో రెండోస్థానం కైవసం గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ పోలవరపు కృష్ణప్రియ క్విజ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. న్యూఢిల్లీలో శనివారం ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీ తరఫున గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి పాల్గొన్న డాక్టర్ కృష్ణప్రియ జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన డాక్టర్ కృష్ణప్రియ జాతీయ స్థాయిలో చేరుకున్నారు. ఆదివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి, న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గాజుల రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మ, పలువురు పీజీ వైద్య విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గాజుల రామకృష్ణ 2014లో జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించగా.. నేడు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీకి చెందిన డాక్టర్ కృష్ణప్రియ రెండో స్థానంలో నిలిచారు. తద్వారా గుంటూరు వైద్య కళాశాల పేరు మరోమారు జాతీయస్థాయిలో మారుమోగేలా చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు. -
దుష్ట పాలనపై ‘వినతి పాదయాత్ర’
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి దుష్టపాలన సాగుతోందని, దానిపై రాజీలేని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యలను నిరసిస్తూ ఈ నెల 31, ఆగస్టు ఒకటో తేదీలలో గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరి డీజీపీ కార్యాలయం వరకు 29 కిలోమీటర్ల మేర ‘వినతి పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహణపై ముందస్తు ప్రణాళితోపాటు, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం బస్టాండ్ వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ... జనవరి 31న గుంటూరులో తన ఇల్లు, కార్యాలయంపై టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, రాళ్లతో గంటలపాటు దాడి చేసి అరాచకం సృష్టించాయని గుర్తుచేశారు. పోలీసులు అక్కడే ఉన్నా దాడిని ఆపలేదని, టీవీల్లో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. తనను మాత్రం అక్రమంగా 18 రోజులు జైల్లో పెట్టారని, ఈ అధర్మానికి అడ్డుకట్ట వేయడానికే తాము శాంతియుతంగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేతల కోసం రాజీలా? గుంటూరులో ఇటీవల ఒక మహిళపై జరిగిన అమానుష దాడిపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 15న మధ్యాహ్నమే స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసినా, నిందితుడు టీడీపీ నేత కావడం వల్లే స్థానిక మహిళా ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యాకే చంద్రబాబు నాటకీయంగా సీరియస్ అయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారతాయని, పోలీసులు తమ సర్వీసులపై మచ్చ తెచ్చుకోవద్దని అంబటి హితవు పలికారు. అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి బలి పశువులు కావొద్దని, చట్టప్రకారం పనిచేయాలని హెచ్చరించారు. పాదయాత్ర కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ తరలిరండి పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని షేక్ నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆగ్రహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 31న గుంటూరు నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు అంబటి నడక ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని ఆవేదన గుంటూరులో మహిళపై అమానుష దాడి ఘోరమని వ్యాఖ్య -
కష్టార్జితం ఖాళీ
‘సైబర్’ గాలం.. జిల్లాలో పెరిగిన సైబర్ మోసాలు లోన్ యాప్ల ద్వారా డబ్బు తీసుకున్న తర్వాత బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించడం, సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి ఫొటోలు, సందేశాలతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. నకిలీ ట్రేడింగ్, లాటరీలు, గిఫ్ట్ స్కీమ్ల పేరుతోనూ మోసాలు చేస్తున్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు ప్రజల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
నేడు విద్యార్థులకు సన్మానం
గుంటూరు వెస్ట్: ఈ ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ‘షైనింగ్ స్టార్స్ – 2026’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులతో ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 10వ తరగతిలో 137, ఇంటర్కు 40 మందిని సన్మానించనున్నారు. ఏర్పాట్లు పూర్తి షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. ఆదివారం పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్లో కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చక్కగా ఏర్పాట్లు చేశారని ఎంఈవోలు, ఇతర అధికారులు, పలువురు ప్రధానోపాధ్యాయులను ఆయన అభినందించారు. -
గుంటూరు నగరంలో భారీ వర్షం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మూడు వంతెనలు, కొత్తపేట, విద్యానగర్, కొరిటెపాడు, పాతగుంటూరు, అమరావతి రోడ్డులోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాలి లోతున నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలో కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు. మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. -
రూ.10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా కేర్ సెంటర్
గుంటూరు మెడికల్: డెక్కన్ టుబాకో ఎక్స్పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ రూ. 10 కోట్లు విరాళంతో తన తండ్రి పేరు మీద నిర్మిస్తున్న అజీజ్ఖాన్ ఆర్ధో అండ్ ట్రామా బ్లాక్కు శనివారం గుంటూరు జీజీహెచ్లో శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శంకుస్థాపన చేశారు. ● ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు రూ.10 కోట్ల విరాళంతో సర్వీసు బ్లాక్ను సిద్ధం చేస్తున్నామని, నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ● డెక్కన్ టుబాకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ తన తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్ధో అండ్ ట్రామా సెంటర్లో వంద పడకలు అందుబాటులో ఉంటాయని, ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ● ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ షఫీక్ ఖాన్ జీజీహెచ్కు వచ్చే పేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు భవన నిర్మాణం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ● ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విరాళం అందజేసిన షఫిక్ ఖాన్ను అభినందించారు. ● భవన నిర్మాణ దాత షఫిక్ ఖాన్ మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి, ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నారు. తమకు వచ్చే లాభాల్లో రైతులకు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని విదేశాల్లో స్థిరపడిన వారంతా మాతృదేశానికి, స్వస్థలాలకు విచ్చేసి అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఏపీఐఐసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బుజ్జా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
గుంటూరువెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ విధానంపై రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తీక్, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రారంభంలో మార్కెట్ ధర ప్రకారం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిందన్నారు. భూ సేకరణ వల్ల తాము నష్టపోతామని, దానికి బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రైతుల విజ్ఞప్తిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయం మేరకే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ఆ మేరకు రైతులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ విధానాలపై ఉన్న సందేహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నివృత్తి చేశారని చెప్పారు. రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు త్వరలోనే గ్రామ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ -
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు. -
గురుకుల పాఠశాలలో పాలకుల దాష్టీకం
తాడికొండ: తాడికొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది. పేద విద్యార్థులకు అన్యాయం ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ బాధితులకు వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ప్రక్రియ కొనసాగించాలని హెచ్చరించారు. దీంతో ఆ రోజుకు వాయిదా వేసి శుక్రవారం పేరెంట్స్ మీటింగ్ పేరుతో పిలిచారు. తర్వాత పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. అధికారుల తీరుపై నిరసనగా వారందరూ రోడ్డెక్కితే పోలీసులను రంగంలోకి దించారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారు. విద్యార్థులను బయటకు పంపించేశారు. ఆవేదనలో విద్యార్థి నారాయణ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని వసతులు ఉన్న 3 గురుకులాలను ఎంచుకొని దందాకు పక్కాగా స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు. తాడికొండలోని గురుకుల పాఠశాల 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాజధానికి కూతవేటు దూరంలో ఉండటంతో ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతుంది. దీంతో అన్ని వసతులు ఉన్న ఈ పాఠశాలలను పీపీపీ పద్ధతిలో ‘నారాయణ’కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఒక్కో సెంటర్కు రూ. 3.90 కోట్ల చొప్పున రూ. 11.7 కోట్లకు ప్రభుత్వం టెండర్లను ఇప్పటికే పిలిచింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టేందుకు సెంటర్కు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈ ఏడాది విద్యాభ్యాసం ప్రారంభించేందుకుగాను ఇప్పటికే కంటెయినర్ లోడు ఐఐటీ– జేఈఈ మెటీరియల్ను గుంటూరులోని అడవి తక్కెళ్ళపాడు గురుకులానికి నారాయణ సంస్థల నుంచి చేర్చినట్లు సమాచారం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ప్రభుత్వం ఐఐటీ– జేఈఈ పేరుతో 1,500 మంది పేద విద్యార్థుల చదువులను దెబ్బతీయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. పోలీసుల జులంతో దిక్కుతోచని స్థితిలో చిన్నారులను వెంటబెట్టుకొని చంకన పుస్తకాలు బ్యాగు, ట్రంకు పెట్టెలతో తల్లిదండ్రులు తరలిపోయారు. -
31న వినతి పాదయాత్ర ప్రారంభం
● ఆగస్టు 1న రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం అందజేయడంతో ముగింపు ● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మంగళగిరి రూరల్: తన ఇంటిపై జరిగిన దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న తేదీన గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. మండలంలోని ఆత్మకూరు పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ జనవరి 31న తన ఇంటిపై ఏకంగా ఏడు గంటలపాటు జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఏప్రిల్ 16వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. అందుకే డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాజా గ్రామంలో 31వ తేదీ రాత్రి బస చేసి, ఆగష్టు ఒకటో తేదీన డీజీపీ కార్యాలయానికి చేరుకుంటామని అనంతరం డీజీపీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ దాడి ఘటనపై స్పందించకపోవడం ఆందోళనకరమని, ప్రజలకు న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బురమ్రుక్కల వేణుగోపాల్రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు అమర నాగయ్య, దుగ్గిరాల రూరల్ మండల అధ్యక్షుడు శివగోపయ్య, పార్టీ పంచాయతీరాజ్ కార్యదర్శి ఫిరోజ్, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్రాజు, జిల్లా ఆక్టివిటీస్ కార్యదర్శి మల్లావరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
బాజీ కుటుంబానికి ఆర్థిక సహాయం
మేడికొండూరు : జగనన్న బాటలోనే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ హబీబుల్లా, అవుతు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సుబ్బారెడ్డి పాములపాటి జయరావు, రాజేంద్రప్రసాద్ అన్నారు. మేడికొండూరు గ్రామానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించాడు. శుక్రవారం వీరంతా బాజీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన బాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని మేడికొండూరు మండలంలో పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఉపాధ్యక్షులు ఉడతా ప్రభాకర్, చావుపాటి బాజీ షేక్ హుస్సేన్ మీరా, జలంధర్ బాజీ, మన్నవ బ్రహ్మయ్య, జోకర్ గఫార్, షేక్ సుభాని, పాల్గొన్నారు. -
నీట్లో 58 శాతం మందికి అర్హత
గుంటూరు ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 21వ తేదీన నిర్వహించిన నీట్ రీ–ఎగ్జామ్లో 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ర్యాంకులు కై వసం చేసుకున్నారు. జూన్ 21న 22 కేంద్రాల పరిధిలో 6,645 మంది పరీక్ష రాశారు. గుంటూరుకు చెందిన వేల్పుల ధీరజ్ కృష్ణ జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 342వ ర్యాంకు, రిజర్వుడు కేటగిరీలో 95వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. వివిధ కేటగిరీల్లో సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115, వి.రేచల్ అమృత 154, సిద్ధార్థ 164, ఆళ్ల ఎస్ఎస్ నిఖితారెడ్డి 288, గాలి హర్షవర్ధన్ 433, బంటు ధాత్రిక 507, ఎం. రాకేష్ చౌదరి 519, ఎల్.వెంకట గౌతమ్ 620, సూరా సుమతి 696, జి.భరత్ రెడ్డి 898, నిహాల్ పర్వేజ్ 935, పి.నిహాల్ దీప్ 935, ఎ. నికేత్ రామ్ చౌదరి 1514, బి. శశిధర్ 1620వ ర్యాంకును కై వసం చేసుకున్నారు. ర్యాంకర్లకు కోరుకున్న కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంది. -
రైతులపై ఎరువు ధరవు
కొరిటెపాడు(గుంటూరు): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే పడింది. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అన్నదాతలు ఆందోళనలో మునిగారు. జిల్లాలో నైరుతి రుతుపవనాల కారణంగా ఆశించిన వర్షం కురవలేదు. అక్కడక్కడా వానలు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రణాధారమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.600 వరకు పెంచేయడంతో ఊహించని ఖర్చుతో భారం తడిసి మోపెడవుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాగును మరింత భారంగా మార్చాయి. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగించే 90 శాతం యంత్రాలు డీజిల్తోనే నడుస్తున్నాయి. దుక్కి దున్నే ట్రాక్టర్ మొదలు పంట నూర్పిడి యంత్రాలు, ఎరువులు, వంటల రవాణాకు వినియోగించుకునే ఆటోలు, ట్రాక్టర్లకు డీజిల్ కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ట్రాక్టర్ల అద్దె, విత్తనాలు, ఎరువుల రవాణా ఖర్చులు, పంట కోత యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ఎల్నినో భయం కూడా వెంటాడుతోంది. వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతను కలవర పెడుతున్నాయి. వర్షాధార పంటలైన వరి, పత్తి, మొక్క జొన్న తదితర పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. పాలన గాలికి వదిలేసిన సర్కారు, ఎరువుల పంపిణీలో పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అన్నదాతల ఆక్రందన.. ‘పంట వేస్తే ఎరువులు దొరకవు. దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు’ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి, ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసి, కాంప్లెక్స్ ఎరువల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారికి పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అన్నదాతకు సాగు నానాటికీ కష్టంగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుతో వారికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క బాధపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఎరువులు, సాగు యంత్రాలను అద్దెకు తెచ్చుకుంటే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అక్కడా అడ్డగోలుగా పెంచేశారు. పరిస్థితిని నియంత్రించడానికి సర్కారు కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల విషయంలో ఉదారతతో వ్యవహరించాల్సింది పోయి ధరలు పెంచడం సరికాదు. కౌలు రైతులు వ్యవసాయం మానేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులపై ఈ ధరల పెంపు పెనుభారంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలు తగ్గించాలి. –కంచుమాటి అజయ్కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, గుంటూరుమద్దతు ధర లేక గత పంటలు ఇంకా ఇళ్లలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సాగుకు సిద్ధమవుతుంటే, ఎరువుల ధరలు అమాంతం పెంచి మాపై అదనపు భారం మోపారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వాలు... ఇలా ధరలు పెంచి నడ్డి విరవడం ఏమాత్రం సమంజసం కాదు. ఇకనైనా అన్నదాతలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి. – తూము వెంకటస్వామిరెడ్డి, గుంటూరు, రైతు -
తరగతి గదుల నిర్మాణం పూర్తికి చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: వెంగళరావునగర్లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో నాడు–నేడు ద్వారా నిర్మించిన తరగతి గదులకు ఫినిషింగ్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెస్తూ శుక్రవారం ‘‘సాక్షి’’లో ప్రచురించిన ‘నాడు వడివడి.. నేడు తడబడి’ కథనానికి సమగ్రశిక్ష ఏపీసీ వి.పద్మావతి స్పందించారు. పాఠశాలలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి, తరగతి గదులను విద్యార్థినులకు అందుబాటులో తెస్తామని చెప్పారు. మనబడి మన భవిష్యత్తు రెండో దశలో భాగంగా సదరు పాఠశాలలో రూ.నాలుగు లక్షలతో ఫ్లోరింగ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మిగిలిన పనులను సైతం వేగవంతంగా పూర్తి చేసి, ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ నాగార్జున
గుంటూరు మెడికల్: ఐదు జిల్లాల పరిధి వరకు విస్తరించి ఉన్న గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్ నెస్ కార్యాలయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందారు. ఆయనను గుంటూరుకు కేటాయిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం అధికారికంగా గుంటూరు నగరంపాలెంలోని సీ.జీ.హెచ్ ఎస్ కార్యాలయం లో సీ.ఎం.ఓ గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరు సీ.జీ.హెచ్.ఎస్ నుంచి బదిలీ పై వచ్చిన దాసరి రమేష్ సీ.ఎం.ఓ గా ప్రస్తుతం గుంటూరులో విధులు నిర్వహిస్తున్నారు. కొండా నాగార్జునకు కూడా పదోన్నతి లభించడంతో సీ.జీ.హెచ్.ఎస్ కేంద్రాలలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో ఇద్దరు సీ.ఎం.ఓ లు విధులు నిర్వహించడం విశేషం. పదోన్నతి పొందిన కొండా నాగార్జున ను గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లోకల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లు గుమ్మడి సీతారామయ్యచౌదరి, కట్టా వెంకటేశ్వర్లు, పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
మూలాంకురేశ్వరికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాకంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 20న జగన్నాథ రథయాత్ర తెనాలి టౌన్: ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్చార్జి సింహ గౌరదాస్ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులున్నారు. దుర్గమ్మకు ఆషాఢ సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని బైపాస్రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు. -
అత్తింటికి కన్నం వేసిన అల్లుడు అరెస్ట్
తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
చంద్రబాబు గుప్పెట్లో మీడియా సంస్థలు
గుంటూరు ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి పోషిస్తున్న ఎల్లో మీడియా చెప్పిందే వేదం అన్నట్లుగా అబద్ధాలనే నిజాలుగా ప్రచారం సాగిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పాల్సిన బాధ్యతను వైఎస్సార్ సీపీ తన భుజస్కంధాలపై వేసుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ పోస్టర్లను పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు)తో కలసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలోని మెజార్టీ చానల్స్, పత్రికలను తన గుప్పెట్లో పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, అరాచకాలను ప్రజలకు తెలియనివ్వడం లేదన్నారు. తన పరిపాలన ఆహో, ఓహో అనే విధంగా ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఎల్లో మీడియా పత్రికల్లో రాయరు, చానల్స్లో ప్రసారం చేయరని చెప్పారు. చైతన్యవంతంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నందున ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టిందని చెప్పారు. సోషల్ మీడియాపైనా నియంత్రణ తెస్తూ, పోలీసులతో నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇవన్నీ వివరించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ను ఆవిష్కరించారని చెప్పారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో తాను పోలీసులపై దాడికి పాల్పడ్డానని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఉండవల్లిలో కానిస్టేబుల్ తల పగులగొట్టిన టీడీపీకి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేయలేదన్నారు. యాప్ను అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు డౌన్లోడ్ చేసుకుని తాజా సమాచారాన్ని, వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బి. భానుకిరణ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం గూగుల్ ప్లే స్టోర్లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని టైపు చేయగానే వైఎస్ జగన్ చిత్రంతో కూడిన యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం సెల్ నంబరు, ఓటీపీ నమోదు చేయాలి. యాప్ వినియోగించే వారి పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు తాజా పరిణామాలు, వాస్తవాల గురించి తెలుసుకోవచ్చు. -
తెనాలి పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు
● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ, డీఎస్పీ సహా అధికారులకు మెమోలు ● ‘సాక్షి’ కథనానికి స్పందన తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్ను కాకుమాను స్టేషన్కు, తెనాలి రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్ఐ కె.ఆనంద్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. -
రేపు మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక 5వ వార్షిక అవార్డు ప్రదానోత్సవం ఈనెల 19వ తేదీన జరగనుంది. స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు ఉదయం 9 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభలో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఈ అవార్డును బహూకరిస్తారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున దాదాపు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికను బహూకరిస్తారు. సంబంధిత ఆహ్వానపత్రికను శుక్రవారం కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ● అవార్డు ప్రదానోత్సవ సభలో తెనాలి ఆర్డీవో కె.శ్రీరమణి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇన్ఛార్జి రెక్టార్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ఫాకల్టీ ప్రొఫెసర్ ఆర్.శివరామప్రసాద్, తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మానవత, తెనాలి చైర్మన్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ పాల్గొంటారని వివరించారు. ● సేవాసమితి పేరుతో 2018 నుంచి మొవ్వా విజయలక్ష్మి స్మారకార్థం పట్టణంలో పలు ప్రజోపయోగ శాశ్వత నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. ● 2022లో ఆమె పేరుతో అవార్డును ప్రవేశపెట్టి, వివిధ రంగాల్లో ప్రముఖులకు బహూకరిస్తూ, విద్యార్థులకు విజయలక్ష్మి స్మారకోన్యాసం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎస్ అధికారిణి, సీఐడీ అడిషనల్ ఎస్పీ కేజీవీ సరిత, తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు బహూకరించినట్టు వివరించారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో ప్రసాదం పూర్ణచంద్రరావు, ఎన్.హనుమారెడ్డి, ఎ.రామూర్తి, వి.శరత్, వెనిగళ్ల శివప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బహూకరణ 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు -
ఇవేమి జ్వరాలు బాబోయ్!
● జ్వరాలతో అల్లాడుతున్న గుంటూరు నగరం ● చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విజృంభిస్తున్న వైనం ● ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండని వైద్యులు ● కిటకిటలాడుతున్న గుంటూరు జీజీహెచ్ గుంటూరు మెడికల్: ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ జ్వర బాధితులతో కిక్కిరిసిపోతోంది. గుంటూరు నగరంతో పాటు రూరల్ ఇతర గ్రామీణ ప్రాంతాల వారు కూడా పలు రకాల జ్వరాలతో ఆస్పత్రిబాట పడుతున్నారు. అయినా ఆరోగ్య శాఖ చోద్యం చూస్తూ జ్వర నివారణ చర్యలపై శీతకన్ను వేసింది. పేదలకు ఈ వైద్యశాలే దిక్కు కాగా.. ఆర్థికంగా ఫర్వాలేదు అనుకున్న వారు మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 1717 ఫీవర్ కేసులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారిక లెక్కల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 1717 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 27 డెంగీ కేసులు కాగా, 1200 టైఫాయిడ్ కేసులు, ఐదు మలేరియా కేసులు, మిగితావి సాధారణ జ్వరాలుగా నమోదయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం శోచనీయం. దీంతో జీజీహెచ్తో పాటు నగరంలోని ప్రైవేటు వైద్యశాలల్లో జ్వరపీడితులు సాంత్వన పొందుతున్నారు. మలేరియా నిధులు ఎటు పోతున్నట్లో..? దోమల నియంత్రణ కోసం జిల్లా మలేరియా విభాగానికి ప్రత్యేక నిధులు వస్తుంటాయి. అయితే వాటిని ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తున్నారో ఎవరికీ సమాచారం ఉండటం లేదు. ప్రతి ఏడాది జిల్లాలో డెంగీ, మలేరియా వంటి జ్వరాలు దోమల వల్లే అధికంగా వ్యాపిస్తున్నాయి. మలేరియా విభాగంలో ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ జ్వర కేసుల వివరాల సేకరణ, జ్వరాల నియంత్రణ వంటి కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు పెద్దగా ఉండవు. జిల్లా మలేరియా అధికారి ఎప్పుడు కార్యాలయంలో అందుబాటులో ఉండరన్న ఆరోపణలున్నాయి. ప్రతిరోజూ కార్యాలయంలో ఉండకుండా సొంత పనులు చక్కదిద్దుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు అధికారే ఇలా ఉంటే సిబ్బంది ఎందుకు సక్రమంగా విధులు నిర్వహిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు. వివరాల సేకరణలో విఫలం పెద్ద ఎత్తున జ్వరాల కేసులు నమోదు అవుతున్నా వివరాలు సేకరించడంలో వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలం అయింది. సిబ్బంది వెళ్లి తనిఖీ చేయాల్సిన నిబంధనలకు పాతర వేశారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కూడా జ్వరాలతో చికిత్స పొందుతున్న వారి వివరాలు, డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులకు తెలియజేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంగీ మాసోత్సవాలు, మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి శుక్రవారం ఏఎన్ఎం, ఇతర వైద్య సిబ్బందికి గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా జ్వరాలను ఏవిధంగా గుర్తించి, చికిత్స అందించాలనే విషయాలపై తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ -
ఆస్తి వివాదంలో యువకుడు హత్య
తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కలకలం రేపిన ఘటనపై పట్టణ వన్టౌన్ సీఐ ిసీహెచ్ రాంబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాజరుపేటలో నివాసం ఉండి, ఆటో డ్రైవర్గా జీవనం సాగించే కొల్లిపర కోటేశ్వరరావు(28)కు కొంతకాలంగా తల్లిదండ్రులతో ఆస్తి వివాదం జరుగుతోంది. కొల్లిపరలో ఉన్న నివేశన స్థలాన్ని అమ్మి తనకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మ, తమ్ముడు మరియదాసులపై కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తుండడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు పరస్పరం వాదనలు, ఘర్షణ జరిగాయి. ఘర్షణలో తల్లిదండ్రులు సోదరుడు మరియదాసు చేతిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని మూటలో పెట్టి ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి.... కోటేశ్వరరావు డబ్బు కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి తెచ్చిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. వివిధ రకాల పనులు చేసి తమ్ముడు కూడబెట్టిన సుమారు రూ.5 లక్షల వరకు సొమ్మునూ ఖర్చు చేశాడు. వేమూరు మండలం చదలవాడ గ్రామానికి చెందిన మహిళతో కోటేశ్వరరావుకు వివాహం కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం భార్యతో విడిపోయాడు. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబ సభ్యుల సంపాదనంతా వారికి ఖర్చు చేస్తుండడంతో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ నాజరుపేట ఇంద్ర టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు మకాం మార్చారు. వీరితో కలిసి ఉంటున్న కోటేశ్వరరావు ఆటో నడుపుతూ తన జల్సాలను మాత్రం మానుకోలేదు. డబ్బు కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీవ్రతరం చేశాడు. భాస్కరరావు బుధవారం కొల్లిపర వెళ్లి తమ బంధువులతో ఇంటి స్థలం విక్రయించాలని, బేరం త్వరగా చూడాలని కోరి, తమ పెద్ద కొడుకు వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వేధింపులు తాళ లేక హతమార్చి ఉంటారని బంధువులు చెబుతున్నారు. కొల్లిపర కోటేశ్వరరావు(ఫైల్) ఆటోలో ఉన్న కోటేశ్వరరావు మృతదేహం తల్లిదండ్రులు, తమ్ముడే అంతమొందించారని ఆరోపణలు -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు. -
హరే రామ.. హరే కృష్ణా..!
గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగర పుర వీధుల్లో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగింది. హరేకృష్ణ నామ సంకీర్తనతో వీధులన్నీ మార్మోగాయి. స్వామినామంతో భక్తులు పులకించిపోయారు. గుంటూరు ఏటీ అగ్రహారం పరిధిలోని మల్లారెడ్డినగర్లో ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి, హరే రామ, హరేకృష్ణ నామ సంకీర్తనల ఆలాపనతోపాటు కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. యాత్ర మిర్చియార్డు, కలెక్టరేట్రోడ్డు, కంకగుంట రైల్వే ఫ్లై ఓవర్, పట్టాభిపురం, కుందుల రోడ్డు, బృందావన్గార్డెన్స్, లక్ష్మీపురం, కొరిటెపాడు మీదగా చంద్రమౌళినగర్ మాజేటి కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. అనంతరం స్వామివారికి మంగళహారతి. మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రకు హాజరై నామస్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని తెలిపారు. ● అదేవిధంగా గుంటూరు తూర్పు పరిధిలో గురువారం రాత్రి శ్రీజగన్నాథస్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి ఎదురు శ్రీజగన్నాథ స్వామి వారి దేవస్థానంలో శ్రీబాలభద్ర సుభద్ర శ్రీజగన్నాథస్వామి వారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గుంటూరు నగరంలో నివసించే ఒడిశా రాష్ట్ర భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఫినిషింగ్ పనులకు గ్రహణం
వైఎస్సార్ సీపీ హయాంలో నాడు–నేడు ద్వారా తరగతి గదులు నిర్మాణం ఫినిషింగ్ వర్క్స్ చేయడంలో నేటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం గతంలో మూడొంతులకు పైగా పూర్తి చేసిన పనులకు నేడు మంగళం కిటికీలు, తలుపులు లేని గదుల్లోనే నేలపై కూర్చుని చదువులు కొనసాగిస్తున్న విద్యార్థినులు ఉపాధ్యాయులకు కుర్చీలు సైతం కరువు -
రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డు అభివృద్ధికి కృషి
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్ యార్డులో గణనీయంగా నిమ్మకాయల వ్యాపారం జరుగుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పి.రవి సుభాష్ పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డును మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మార్కెట్యార్డుకు చెందిన అన్ని తనిఖీ కేంద్రాల్లో ఈ–పర్మిట్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని వ్యవసాయ మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ స్పష్టంచేశారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డును మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ గురువారం సందర్శించారు. అక్కడి నిమ్మకాయల వ్యాపార కేంద్రానికి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతి, ధరల వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్ అభివృద్ధి పనులపై డైరెక్టర్తో చర్చించారు. ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎం.దివాకర్, విజయవాడ, సహాయ మార్కెటింగ్ సంచాలకులు, గుంటూరు పి.సత్యనారాయణచౌదరి, కార్యనిర్వాహక ఇంజినీరు కె.శేషగిరిరావు, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు డి.కోటయ్య, మార్కెట్యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి డీసీహెచ్ సుబ్బారావు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసిన తరువాతే మిగిలిన ఖాళీలు భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి ఇచ్చిన ఎలిజిబిలిటీ లిస్టులలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సీహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబరు 114 ప్రకారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలన్నారు. ఏఎన్యూలో వివిధ విభాగాల్లో, కళాశాలల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్ని అర్హతలు ఉండి ఎన్నో ఏళ్లగా విశ్వవిద్యాలయాల్లో అన్యాయానికి గురవు తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలన్నారు. జీఓ నెంబరు 46, జీఓ నెంబరు 14 ప్రకారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ పే స్కేల్ అమలు చెయ్యాలన్నారు. ప్రభుత్వం పెట్టిన ఎలిజిబుల్ లిస్టుల్లో విశ్వవిద్యాలయాలు యూజీసీ పే స్కేల్ ఇవ్వని కారణం చూపించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి అనర్హులను చేయడం శోచనీయమన్నారు. యూజీసీ పే స్కేల్ ఇవ్వని కారణంగా తాము రెగ్యులర్ రిక్రూట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకి పోటీపడే అవకాశాన్ని కోల్పోతున్నామని వాపోయారు. సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ వై.సునీత, ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.రవి, సహాయ కార్యదర్శులు డాక్టర్ బి.పూర్ణచంద్రశేఖర్, డాక్టర్ తౌషీఫ్ అహ్మద్ పాల్గొన్నారు. -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీరో ప్రమాద మరణాలే లక్ష్యం.. కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోకాకోలా, సంగం డెయిరీ, సిసిల్ సంస్థల సేఫ్టీ అధికారులు, వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు. 1996 నుంచి సేవలు ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది. తాత మరణం కలచివేసింది.. ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు.డాక్టర్ విజయ తన తండ్రి పమిడిముక్కల కుటుంబారావు పేరుతో 2006లో చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందజేస్తున్నారు. వేలాది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలందిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనేక సంస్థల్లో, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్: నేషనల్ మాస్టర్స్ (మెడ్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ చాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గురువారం తెలిపారు. ఈనెల 18 నుంచి 23 వరకు మహారాష్ట్ర ఛత్రపతి సంబోజి నగర్లో నిర్వహించనున్న పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని చెప్పా రు. మాస్టర్స్–1లో 84 కిలోల విభాగంలో లక్ష్మీతులసి, మాస్టర్స్– 2లో 69 కిలోల విభాగంలో జ్యోతివర్మ, మాస్టర్స్–2 మెన్లో 93 కిలోల విభాగంలో మస్తాన్వలి టీమ్ తరఫున జిల్లాకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికైన పవర్లిఫ్టర్లు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సుల్లో విజ్ఞాన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్పీటీఈఎల్ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ సాధించేందుకు కృషి చేసిన ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
18న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని శుక్రవారం తాడికొండ నియోజక వర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పేరేచర్ల జంక్షన్ వద్ద సాయిబాబా మందిరం ఎదుట ఉన్న సాయి కృష్ణ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. -
విద్యార్థులను మోసగిస్తున్న మంత్రి లోకేష్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విద్యా రంగ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మోసగిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఆరోపించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. గుంటూరు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్లు మాట్లాడుతూ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్మెంట్లను మూసి వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష , కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్, గుంటూరు నగర నాయకులు అజయ్, వెంకటేష్, సతీష్, బాషా, రాజేంద్ర, తిమోతి, తెనాలి నియోజకవర్గ నాయకులు మణి, కోట్లు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ -
కృష్ణా డెల్టాకు నీరు విడుదల
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రకాష్లు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కృష్ణానదిపై ఎగువన ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు రాలేదన్నారు. కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిచింతలలో 30 టీఎంసీలు నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 16 టీఎంసీలు తరలించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే మరో 30 టీఎంసీలు, వెరసి ఈ సీజన్లో 75 టీఎంసీలు అందించే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. కృష్ణా డెల్టాలోని మొత్తం 13 లక్షల ఎకరాల సాగుకు 150 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేడీఎస్ సీఈ రాంబాబు, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి రూ.30 లక్షల విరాళం గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్థలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్మెల్ మాత ఉత్సవాలుఫిరంగిపురం: కార్మెల్మాత ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు బాల ఏసు దేవాలయం విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి అన్నారు. గ్రామంలోని ఫాదర్స్ బంగ్లాలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరియ దళం సభ్యులు 150 మంది పతాకాలు ధరించి ఊరేగింపులో పాల్గొంటారని చెప్పారు. చిన్నారులతో మాత వేషధారణ ఉంటుందన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మెల్ కొండపైకి వెళ్లేందుకు ఘాట్రోడ్డు నిర్మించాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించామని చెప్పారు. కొండ వెనుక భాగంలో బ్లాస్టింగ్ ఎక్కువగా నిర్వహిస్తున్నందున ఆలయ వెనక భాగంలో గోడలు బీటలు వారాయని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
అన్నదాతల కన్నీటి ‘వెద’
ఖరీఫ్ ఆరంభంలోనే తప్పని సాగునీటి కష్టాలు కృష్ణా పశ్చిమ డెల్టాలో వెద సాగు చేస్తున్న రైతన్నలకు ఈ ఏడాది నీటి సమస్యలు పెరిగాయి. ఎటు చూసినా పంట కాలువలు ఎండిపోయి చుక్క నీరు కనబడక ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. జూన్ నుంచి ఖరీఫ్ ప్రారంభంతో అక్కడక్కడ బోర్లు, డీజిల్ ఇంజిన్ల సహాయంతో వెద సాగు చేపట్టారు. జూన్ నెలలోనే సాగునీరు విడుదల అవుతుందన్న ఆశతో సాగుకు సమాయత్తమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆదిలోనే నీటి సమస్యలు రూ.వేలల్లో కౌలు చెల్లింపు -
గురుకుల విద్యార్థులను పంపిస్తే సహించం
తాడికొండ: తాడికొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులను అర్ధంతరంగా పంపించి వేస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. పాఠశాలలో 5, 6, 7, 8 విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలంటూ ఉపాధ్యాయులు ఫోన్లు చేస్తున్న నేపథ్యంలో వారంతా పాఠశాలకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. వారికి మద్దతుగా వనమా బాల వజ్రబాబు వచ్చి బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. గతంలో తనకు వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో స్పందించి ప్రిన్సిపల్ వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఇక్కడ ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్, జేఈఈ శిక్షణ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఇలా తరలిస్తే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. 437 మంది విద్యార్థులున్నా తల్లిదండ్రుల సమావేశం కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఎందుకు నిర్వహించలేదన్నారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇస్తే నేడు గురుకుల సెంటర్నే ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు. ఇది నారాయణ కలను సాకారం చేసేందుకే అన్నారు. వెంట పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసరి రాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నియోజకవర్గ అధ్యక్షుడు సంపతి నాగరాజు, మండల అధ్యక్షుడు మల్లంపాటి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ విభాగాల నాయకులు బోళ్ళ లోకేష్ రెడ్డి, దానం వినోద్, గుంటి రఘువరన్, బాకి వెంకట స్వామి, చావల రంజిత్, షేక్ అజీస్, షేక్ జర్జీష్, ఉయ్యూరు వెంకటరెడ్డి, కూచిపూడి సాయికిరణ్ ఉన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు -
● ప్చ్.. ఏం బ్యాగో లేదు..!
చిరిగిన బ్యాగులు.. ప్లాస్టిక్ కవర్లు, విద్యామిత్ర కవర్లలో పుస్తకాలు, స్వీటు బ్యాగు సంచుల్లో పలకలు, జూటు బ్యాగుల్లో నోట్బుక్స్.. ఇలా కనిపిస్తున్న ఈ చిత్రాలు చంద్రబాబు సర్కారు తీరును వెక్కిరిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలు ఇలా బడికి వెళ్తుండటం విద్యాశాఖ నిర్వాకాన్ని ఎండగడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం,... బడులు తెరిచి నెల అవుతున్నా నేటికీ స్కూల్ బ్యాగ్లు ఇవ్వలేదు. విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులు, కవర్లలో పుస్తకాలను తీసుకుని బడి నుంచి ఇంటికి వెళుతుండటం మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. ప్రత్తిపాడు మండలంలో 2,517 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ ఏడాది నూతన బ్యాగులు ఇవ్వలేదని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. – ప్రత్తిపాడు -
ముద్రగడ మృతి తీరని లోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాఽభం మృతికి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచితనానికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఆదర్శమైన మంత్రిగా మెలిగారన్నారు. ఇటువంటి నిజాయతీ గల వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. ఆయన మృతి రాష్ట్ర భవిష్యత్కు, కాపు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముద్రగడ మృతి తీరని లోటని కోన అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొన్నూరు: ప్రముఖ కాపు నేత, రాజకీయ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపల్లె: కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీరని లోటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో ముద్రగడ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. కాపుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన ఉద్యమాలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన దీక్షలు, పోరాటాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వారి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని అన్నారు. -
రైలు నుంచి జారిపడిన యువతి
తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు వేజండ్ల(చేబ్రోలు): చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామ పరిధిలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువతికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్తున్న రైలు నుంచి మధ్యాహ్న సమయంలో సుమారు 20 సం.ల వయస్సు కలిగిన యువతి జారిపడి పొలాల్లో పడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ట్రాక్టర్తో పొలం దున్ను తున్న రైతులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వెళ్లిన సిబ్బందికి సంఘటనా ప్రాంతం నుంచి తీసుకురావటానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు కి.మీ దూరం వరకు రైలు పట్టాలపై, రాళ్లలో నడుచుకుంటూ అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్ట్రెక్చర్పై 108 సిబ్బంది కోట ఉదయ్ కిరణ్, బి.యహోషవాలతో పాటు స్థానిక రైతులు అంబులెన్స్ వాహనం వరకు అతికష్టం మీద తీసుకువచ్చి అత్యవసర వైద్య సేవలు అందించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను ఒడిశాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. రైలు గేటు వద్ద ఉన్న సమయంలో పొరపాటున జారిపడి ఉంటుందా లేక ఎవరైన ఉద్దేశపూర్వకంగా కిందకు నెట్టి ఉంటరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మై భారత్ పోర్టల్లో నమోదు వేగవంతం చేయాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: మై భారత్ పోర్టల్లో విద్యార్థులు, యువత నమోదును వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. నేటితో ముగియనున్న ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ – అవగాహన డ్రైవ్ పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని, ప్రతి కళాశాలలో మై భారత్ నోడల్ అధికారులను నియమించి, మై భారత్ చాప్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జేసీతోపాటు అధికారులు మై భారత్ పోర్టల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి సంజీవరావు, జిల్లా ఎన్ఎన్ఎస్ ప్రోగ్రాం అధికారి సునీల్, స్టెప్ మేనేజర్ రాధిక తదితర అధికారులు పాల్గొన్నారు. -
పశ్చిమలో ‘పచ్చ’ఓట్ల దగా?
సాక్షి టాస్క్ఫోర్స్: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పుణ్యమా అంటూ దొంగ ఓట్ల బాగోతం బయటపడుతోంది. నియోజకవర్గంలో ఎక్కువ అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దొంగ ఓట్లు చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా పూర్తి స్థాయిలో ఓట్ల పరిశీలన జరుగుతుండటంతో పశ్చిమ నియోజకవర్గంలో అంతులేని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా మిస్సింగ్... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓట్లు ఉన్నాయి. వీటిని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో మ్యాపింగ్ కాని ఓట్లు 19,873, డెత్లు 11,728, పర్మినెంట్ అడ్రస్ షిఫ్టింగ్ 38,977, డబుల్ ఓటింగ్ 6,218, అబ్సెంట్ ఓట్లు 6,384, అదర్స్ 113... ఇలా అన్నీ కలిపి మొత్తం 83,293 ఓట్లు ఉన్నాయి. డెత్లు 11,728, అబ్సెంట్ ఓట్లు 6,384 పోయినప్పటికీ, దాదాపు 60 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్లలోనే.. పశ్చిమ నియోజకవర్గంలోని చంద్రమౌళినగర్, విద్యానగర్, వికాస్నగర్, కృష్ణానగర్, నవభారత్నగర్, రాజేంద్రనగర్, శ్యామలనగర్, ఎస్వీఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఓట్లు ఉంటాయి. కానీ అందులో ఓటర్లు ఉండరనే విషయాన్ని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు గమనించారు. ఒక్కో అపార్ట్మెంట్లో వందకుపైగా దొంగ ఓట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతోపాటు మరణించిన వారి పేర్లపై కూడా 2024 ఎన్నికల్లో ఓట్లు పడ్డాయనే అనుమానాలు లేకపోలేదు. డబుల్ ఎంట్రీ ఓట్లపై దృష్టి ముఖ్యం నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లు 6,218 ఉన్నాయి. వీరంతా కూడా ఎక్కడో ఒక చోట ఓటు వేసి, తిరిగి పశ్చిమలో ఓటు వేశారని చెప్పుకోవచ్చు. ఒకే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు సృష్టించారనే ఆరోపణలు లేకపోలేదు. అదే విధంగా పేరులోని ఒకటి, రెండు అక్షరాలను మార్చి లేదా తొలగించి వారి పేర్లపై దొంగ ఓట్లు సృష్టించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ డబుల్ ఎంట్రీ ఓటింగ్పై విచారణ చేపడితే అసలు నిజాలు బయటకు వస్తాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనవరిలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు పశ్చిమ నియోజకవర్గంలో చేర్చినట్లు ప్రస్తుత సర్ ప్రక్రియ లెక్కలు చూస్తుంటే అర్థమవుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గళ్ళా మాధవికి 1,16,067 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విడదల రజనికి 64,917 ఓట్లు దక్కాయి. వీటి మధ్య వ్యత్యాసం 51,150 ఓట్లు. కాగా, ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా సదరు ఓట్ల లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, 60 వేలకుపైగా ఉన్న దొంగ ఓట్లే గల్లా మాధవి గెలవడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. -
మెడికల్ షాపులో చోరీకి యత్నం
సెక్యూరిటీ అలారం మోగడంతో పరారీ మంగళగిరి టౌన్: మెడికల్ షాపులో చోరీకి వచ్చి అలారమ్ మోగడంతో వారు పరారీ అయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో గౌతమబుద్ధ రోడ్డు వెంబడి శ్రీ ధాత్రి సాయి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ను పట్టణానికి చెందిన ఫణీంద్ర అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తన ఫోన్లో అలారం మోగడంతో వెంటనే షాపు సీసీ కెమెరాలను తన ఫోన్లో చూశాడు. అదే సమయంలో అలారం ఏర్పాటు చేసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ వారు కూడా ఫణీంద్రకు ఫోన్లో సమాచారం అందించారు. అయితే సీసీ కెమెరాల్లో ఏమీ కనబడకపోవడంతో నిద్రపోయాడు. వెంటనే మరుక్షణంలోనే అలారం మోగడంతో తన ఫోన్లో సీసీ కెమెరా ఓపెన్ చేయగా షట్టర్ పగలకొట్టి లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించడం గమనించాడు. వెంటనే తన ఫోన్లో అలారం బటన్ నొక్కి తన షాపులో మోగే విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో దుండగుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటి వద్ద నుంచి షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలకొట్టి, పైన ఉన్న సీసీ కెమెరా పక్కకు వంచి ఉండడం, సైరన్ బాక్స్ పగలకొట్టి ఉండడం గమనించాడు. వెంటనే పట్టణ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుడు తెలిపాడు. షాపులో ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. గతంలో ఇదే తరహాలో.... మూడేళ్ల క్రితం 2023 జూలై నెలలో ఇదే తరహాలో షాపు పైభాగంలో రంద్రం చేసి దుండగుడు లోపలకు ప్రవేశించాడని, షాపులో వున్న అధిక మొత్తంలో నగదును, హార్డ్డిస్క్ అపహరించుకుపోయినట్లు బాధితుడు ఫణీంద్ర తెలిపాడు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి విచారించారని, కానీ నేటికీ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, అందువల్లే ఇప్పుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు. లోయలో పడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ సన్నిధి కొండపై వున్న గండాలయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ద్విచక్రవాహనాల ద్వారా భక్తులు ప్రయాణాలు చేస్తారు. అమావాస్య కావడంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి కొండపైకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఘాట్రోడ్లో వస్తుండగా రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. వాటిపై ఉన్న ఇద్దరు యువకులు లోయలోకి జారుకున్నారు. గమనించిన పలువురు భక్తులు వారిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద భరితంగా ఉన్న ఘాట్రోడ్లో ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు, సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్సకోసం స్థానిక దేవస్థానం సిబ్బందిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 20267తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1800, గరిష్ట ధర రూ.3700, మోడల్ ధర రూ.2500 వరకు పలికింది.దుగ్గిరాల: కంఠంరాజుకొండూరులో కొలువైన శ్రీ మహంకాళి ఆలయ అభివృద్ధికి పెదకాకాని వాసి మెట్టు సాంబశివరెడ్డి – స్వప్న దంపతులు రూ.4.30 లక్షల విరాళం అందించారు.అచ్చంపేట : ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.9103 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... దిగువకు అంతే నీరు వదులుతున్నారు.గుంటూరు వెస్ట్: జిల్లాలో ఖరీఫ్–2026 సీజన్కు కృష్ణా పశ్చిమ డెల్టాకు 15వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సీతానగరం వద్ద ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు ఉదయం 10.30 గంటలకు నీటిని విడుదల చేస్తారని కలెక్టర్ వివరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు అవసరమయ్యే యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని విక్రయ కేంద్రాల్లో ఎరువుల పంపిణీ తప్పనిసరిగా ఏపీ–ఏఐఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో జూలై అవసరాలకు మించి యూరియా, డీఏపీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 209 రైతు సేవ కేంద్రాలు (ఆర్ఎస్కేలు), 43 ప్యాక్స్/డీసీఎంఎస్ కేంద్రాలు, 272 ప్రైవేట్ రిటైల్ దుకాణాల్లో ఎరువుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎల్నినో కారణంగా ఈ సీజన్లో 41 శాతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జల హారతి–జల ధార కార్యక్రమం కింద చేపట్టిన వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టి 0.69 టీఎంసీల అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించినట్లు తెలిపారు. రైతులకు వీలైనంత వరకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు ఎడ్యుకేషన్: హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంతో పాటు ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించాయి. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నేతలు, ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాగేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ 2023 జూలై ఒకటో తేదీ నాటికి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి స్పందన లేవపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు విడతల్లో డీఏలు పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్య వైఖరి తగదు ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. బసవ లింగరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. 13వ పీఆర్సీని డిమాండ్ చేయాల్సిన సమయంలో వ్యవధి దగ్గర పడుతున్న తరుణంలో 12వ పీఆర్సీకే దిగ్గు లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మార్గదర్శకాలపై నిర్ణయ జాప్యం, పాఠశాలలు తెరిచి నెల కాకముందే పదవ తరగతికి మిషన్ 2027 పేరుతో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించడం చూస్తుంటే ఉపాధ్యాయుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందని, ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను పరిష్కరించడాన్ని విస్మరిస్తున్నారన్నారు. పీఆర్సీలో నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతినెలా వేలాది రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. దేశంలో ఏ ఇతర శాఖల్లోని ఉద్యోగులకు లేని అర్హత పరీక్ష సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకే పెట్టడం ఏమిటన్నారు. దీనిపై పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని పేర్కొన్నారు. జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె. వీరాంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ. 25 వేల కోట్లకు పైబడి బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వీటి చెల్లింపులలో నిర్దిష్టమైన కాల వ్యవధి లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో బకాయిల చెల్లింపులు జరగడం లేదన్నారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నా పాలకులు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ వై. శ్యాంబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలనడం తగదన్నారు. పార్లమెంటులో చట్ట సవరణ చేయడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా, బోధనకు ఆటంకం లేకుండా ఆన్లైన్ విధానంలో ప్రత్యేక టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం సమర్పించారు. పికెటింగ్లో మాజీ ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు. రాజశేఖర్రావు, జి.దాసు, జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, షేక్ బాజీ, ఎండీ ఖాలీద్, మేకల సుబ్బారావు, ఎస్. రామచంద్రయ్య, గుడిపాటి దాస్, ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను లాక్కెళుతున్న పోలీసులు జేసీ అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు -
యువతిని బలిగొన్న క్రేన్
సత్తెనపల్లి: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం యువతిని బలిగొంది. పొన్నూరు సమీపంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన లలితశ్రీ (21) నలంద కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. రోడ్డుపై వెళుతుండగా రహదారి విస్తరణ పనులు నిమిత్తం వచ్చిన క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వలన ఆమెకు క్రేన్ తగిలి కింద పడిపోయింది. స్థానికులు గమనించి, డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసే సమయానికి పరిస్థితి విషమించి మృతి చెందింది. -
టీడీపీ నేత ధనదాహం
పెదకాకాని: జల వనరులతో స్వప్రయోజనం కోసం చేస్తున్న అక్రమ నీటి వ్యాపారాన్ని మండల అధికారులు పరిశీలించారు. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొంతకాలం క్రితం మైనర్ ఇరిగేషన్ ట్యాంక్కు సమీపంలో స్థలాన్ని ఆక్రమించాడు. మంచినీటి చెరువు, ఫిల్టర్బెడ్లు, సంపునకు సమీపంలో ఉన్న ఆ స్థలంలో బారు బావి తీయించాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ఆ బోరు ద్వారా నీటిని సుమారు 700 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా నిర్మించిన సంప్నకు పైప్లైన్ ద్వారా తరలిస్తున్నాడు. ఆ నీటితో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ కళాశాలలకు, ఆసుపత్రులకు ట్రాక్టర్లు, లారీల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ జేబులు నింపుకొంటున్నాడు. కొంతకాలం పంచాయితీ కనెక్షన్ ఉచితంగా వినియోగించుకున్నాడు. దీనిపై గ్రామానికి చెందిన వేల్పుల నాగరాజు ఇప్పటికే రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో తన సొంత పొలంలో వేసిన బోరు బావి నీటిని ట్యాంకర్లకు అమ్ముకుంటున్న వ్యక్తికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెదకాకాని మండల అభివృద్ధి అధికారి రమావత్ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి.కృష్ణకాంత్, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సారిక, పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి సాంబశివరావులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. వ్యవసాయ భూమి నుంచి పైపులైన్ ఏర్పాటు చేయడం, రోడ్డు పక్కనే సంపు, ట్యాంకర్లు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ కనెక్షన్లను గుర్తించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎంపీడీఓ తెలిపారు. -
కోల్డ్ స్టోరేజీ బాధిత రైతులను మోసం చేసిన ప్రభుత్వం
దుగ్గిరాల: దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన రైతుల సమావేశం నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాలలోని పసుపు యార్డులో ములకా సాంబిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీలో దగ్ధమైన పసుపునకు పరిహారం అందించడంలో రైతులను ముప్పతిప్పలు పెడుతోందన్నారు. పెద్దల కమిటీలో బహిరంగంగా రైతులకు క్వింటాకు రూ.7 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు పరిహారం కుదించి రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఉద్యమ బాటలో నడవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. రైతులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని, ఈ నెల 20 లోపు న్యాయం జరగకపోతే వ్యవసాయ మంత్రి క్యాంపు కార్యాలయానికి రాయబారానికి వెళ్లాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు లాయర్లు కె.వీరయ్య, వై.శ్రీనివాసరావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్, కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు, రైతులు రవి కిషోర్, వెంకటప్ప రెడ్డి, నాగేశ్వర రెడ్డి, సత్యనారాయణ, సురేంద్ర, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మెల్మాత ఉత్సవాలు ప్రారంభం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపైనున్న కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బాల ఏసు దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రారంభించారు. కొండపై దివ్యపూజాబలి నిర్వహించారు. కొండవీడు విచారణ గురువు సీహెచ్ అలెక్స్ వాక్యోపదేశం చేశారు. దివ్యపూజాబలి కార్యక్రమంలో మొదటిరోజు సెయింట్ ఆన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మఠకన్యలు పాల్గొన్నారు. అనంతరం మరియమాతను ప్రత్యేకంగా అలంకరించారు. తేరులో ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయించారు. గుంటూరు మెడికల్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. పట్టణ ఆరోగ్యకేంద్రాలలో 20 ఫార్మసిస్ట్, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 20 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎంపికై న వారికి మంగళవారం నియామకపు ఉత్తర్వులు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ విజయలక్ష్మి అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండపై ఉన్న గండాలయ స్వామికి మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. గండాలయ స్వామివారిని దర్శించుకున్నారు. తమ గండాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు, ఎండోమెంట్ అధికారులు తగిన సౌకర్యాలు కల్పించారు. పెదకాకాని: శివాలయంలో అమావాస్య మంగళవారాన్ని పురస్కరించుకుని రాహుకేతు పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారు జాము నుంచే భక్తుల సందడి నెలకొంది. మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల వరకు భక్తులు పాలుపంచుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పూజా టికెట్ల విక్రయం ద్వారా స్వామి వారికి రు. 5.30 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దుర్గమ్మకు బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారుహారాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. -
సాంకేతిక విద్యాబోధనా నైపుణ్యాలు అలవర్చుకోవాలి
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యాబోధన నైపుణ్యాలు అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అన్నారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మంగళవారం డివిజన్ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంతో పాటు డీఆర్పీలకు జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పట్టాభిపురం, వేణుగోపాల్నగర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మారిన సిలబస్, లీప్ యాప్, తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను డివిజన్ స్థాయిలో శిక్షణ కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బోధించి, పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. కోర్సు కో–ఆర్డినేటర్ కె.విజయభాస్కర్ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ రీసోర్స్ పర్సన్, డైట్ అధ్యా పకులు, డీఆర్పీలు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని గురుకుల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం నేతలు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకపక్కన రోడ్డుపై కూర్చొని ఉపాధ్యాయులు నిరసన చేస్తుంటే మరోపక్క విధులు నిర్వహించడానికి వచ్చిన అదనపు పోలీస్ సిబ్బంది ఇదేమీ పట్టనట్లు కార్యాలయం కింద పార్కింగ్ ప్లేస్లో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ధర్నా జరుగుతున్నంత సేపు ఆడుకుంటూ ఉన్నారు. ధర్నా జరుగుతున్నా అటువైపు చూడకుండా ఆటలో నిమగ్నమవ్వడంతో అక్కడి అధికారులు నివ్వెరపోయారు. ధర్నా జరిగే సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పరిస్థితి ఏంటంటూ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అక్కడున్న విలేకరులు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినా వారితో వ్యంగ్యంగా మాట్లాడి క్యారమ్స్ ఆడడం మాత్రం ఆపలేదు. కార్మికుడి కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో దొండపాడు వద్ద పనిచేస్తూ మట్టి గడ్డలు పడి ప్రమాదంలో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు 21 సంవత్సరాల గుడు సాహూ మృతి చెందడం బాధాకరం అని సీఐటీయూ నాయకులు అన్నారు. ఆ కుటుంబానికి తను పనిచేస్తున్న ఎన్సీసీ కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాజధాని డివిజన్ సీఐటీయూ అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.రవి, బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తుళ్లూరు పీహెచ్సీలో ఉన్న గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ బృందం పరిశీలించి, వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికులు, వలస కార్మికులకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత సీఆర్డీయేకు, ఏడీసీలకు ఉందన్నారు. రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు సీఐటీయూ బృందం ప్రయత్నించినా దాటవేసే ప్రయత్నం చేశారని, ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా మభ్యపెట్టాలని చూస్తే భవిష్యత్తలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్మికుడు గుడ్డు సాహు మృతదేహాన్ని సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి బి.లక్ష్మణరావు, నాయకులు జె.నవీన్ ప్రకాష్, పి.బాబురావులు పరిశీలించి, మృతుని బంధువులను పరామర్శించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న గుత్తా సునీల్కుమార్కు అరుదైన అవార్డులు లభించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ(ఎఫ్ఐపీ) 9వ గ్రాండ్ నేషనల్ ప్రింట్ సలాన్ కన్వెన్షన్ 2026లో సునీల్ తీసిన ఫొటోలకు అవార్డులు వచ్చాయి. ది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్లో ఒకటి, ది ట్రైబల్ లైఫ్ కేటగిరీలలో మరొకటి లభించాయి. అలాగే మరొక కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ లభించింది. గతంలో ఎన్నో అవార్డులు, మెడల్స్, ప్రశంసలు అందుకున్న సునీల్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఆకాంక్షించారు. -
విద్యాకుసుమాలకు ఉపకారి
గుంటూరు రూరల్: ఆయన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తన స్వగ్రామంలో ఏడవ తరగతి వరకే ఉండడంతో సుదూర ప్రాంతానికి వెళ్లి స్కూలు విద్య పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా ఆయన నాటి పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేశారు. ఇదంతా గతం! ఇప్పుడాయన ఒక విజయవంతమైన ప్రవాసాంధ్రుడు! అయినా విజయ గర్వంతో పొంగిపోకుండా.. ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ముందుకు సాగుతున్న అతని పేరు ఏరువ సాయిరాం! కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా.. గుంటూరు రూరల్ మండలం, పెద పలకలూరు గ్రామానికి చెందిన ఏరువ సాయిరాం ఉత్తమమైన నడవడికతో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ తాను ఈ స్థాయికి చేరడం వెనుక పడిన కష్టాలను మాత్రం మర్చిపోలేదు. అందుకే తనలా విద్యను అభ్యసించేందుకు ఎవరూ కష్టపడకూడదన్న సదుద్దేశంతో ఏటా వేలాది మంది విద్యార్థులకు తన తండ్రి ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ విద్యాదాతగా వెలుగొందుతున్నారు. ఏరువ సాయిరాం ‘సాక్షి’తో మాట్లాడుతూ, తనలా ఎవరూ విద్య వనరుల కోసం కష్టపడకూడదనే సంకల్పంతోనే తన తండ్రి పేరిట ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సైతం 1600 మంది విద్యార్థులకు రూ 60 లక్షలు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని బుధవారం ఉదయం పెదపలకలూరులోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, పార్టీ పత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, బార్ కౌన్సిల్ మెంబర్ కొమ్మసాని శ్రీనివాసులురెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. -
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
తెనాలిరూరల్: వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నకిలీ పోలీసులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావటి కిరణ్కుమార్, సదుపాటి మురళి స్నేహితులు. కిరణ్కుమార్ గతంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గుంటూరు, చీరాల, ఇంకొల్లు, వేటపాలెం, ఒంగోలు, నందిగామల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. మురళి 12 ఏళ్లు బీఎస్ఎఫ్లో పనిచేసి 2012లో ఉద్యోగం వదిలి వచ్చేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కిరణ్కుమార్తో కలిసి ఇటీవలి కాలంలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 7వ తేదీన కొల్లిపర చెందిన మల్లికార్జున రెడ్డి నందివెలుగు నుంచి స్కూటీపై తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద అతడిని ఇద్దరు నిందితులు అడ్డగించి పోలీసుల పేరుతో బెదిరించారు. స్కూటీని చెక్ చేయాలంటూ భయపెట్టి డిక్కీలో ఉన్న రూ. 1.60 లక్షల నగదులో రూ.50,000 లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు దుగ్గిరాల సమీపంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద మోపెడ్పై వెళుతున్న వృద్ధుడు మహమ్మద్ ఫరూక్ను కూడా బెదిరించి అతని వద్ద ఉన్న రూ 7వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 57 వేల నగదు, పల్సర్ బైక్ స్వాధీనపర్చుకున్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సయావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
కొనసాగుతున్న ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తల దీక్షలు
మంగళగిరి రూరల్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన 750 కోట్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక ధర్నా సోమ వారం 13వ రోజుకు చేరుకుంది. మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద కొనసాగుతున్న ధర్నాలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్యూనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోత్ రమేష్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు జిల్లాల వారీగా ధర్నాలు కొనసాగనున్నాయని, అప్పటికీ ప్రభు త్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే జూలై 20న రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలు మహా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు, టీడీపీ కేంద్ర కార్యాలయం, వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ ముట్టడి చేపట్టి మహా ధర్నా చేపడతామని ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోతు రమేష్ హెచ్చరించారు. కారం సత్య మాట్లాడుతూ సబ్సిడీలు అందక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు రోడ్లు పడ్డారని వాపోయారు. పర్సంటేజ్ రూపంలో కాకుండా 100 శాతం సబ్సిడీల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బేతపూడి విజయ్, బంటు వీర్రాజు, జక్కుల రాజు, జక్కుల నారాయణ, బత్తుల విష్ణుమూర్తి, జూపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషా పండితుడు సద్యోజాతం మృతి
తెనాలి: ప్రముఖ తెలుగు భాష, వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ చావలి సద్యోజాతం(77) అనారోగ్య కారణంతో సోమవారం స్థానిక ఈటీ కాలనీలోని స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సద్యోజాతం తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా గుర్తింపు పొంది, శిశు విద్యామందిర్లో పదేళ్లు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1987–2012 వరకు కిన్నెరసాని, ఏనుకూరు, శ్రీశైలంలోని ఏపీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు వంశపారంపర్యంగా వస్తున్న శైవ ఆగమంలో పాండిత్యం సంపాదించడంతోపాటు వాస్తుశాస్త్రంలో మంచి పరిజ్ఞానాన్ని పొందారు. వాస్తు సమస్యలపై సదస్సులు నిర్వహించారు. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సలహా మండలి సభ్యుడిగా వ్యవహరించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, రామలింగేశ్వరరావు, మేడూరు శ్రీనివాసమూర్తి, ఈఎల్వీఅప్పారావు, జెట్టి అరుణ, గాలి సత్యనారాయణ, సామ్రాజ్యం, సుశీల వర్ధని, కృష్ణకుమారి, ఉమాదేవి, పలువురు ఆదిశైవ సంఘం, అర్చక సమాఖ్య, అర్చక సేవా సంఘం ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. -
దళిత ఉద్యమనేత కోటి జేమ్స్ కన్నుమూత
చీరాల రూరల్: దళిత ఉద్యమనేత, చీరాల జాన్పేటకు చెందిన కోటి జేమ్స్ అనారోగ్యంతో సోమవారం తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు దళిత, ప్రజా సంఘాల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి జేమ్స్ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. కార్మిక నాయకుడిగా హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారు. కారంచేడు మారణకాండ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు ఆర్థికంగా, నైతికంగా అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు సాగించారని నాయకులు గుర్తుచేసుకున్నారు. దళిత ఉద్యమ శిఖరం డాక్టర్ కత్తి పద్మారావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ.. దళిత మహాసభ ఉపాధ్యక్షుడిగా ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జేమ్స్.. చివరి దశలో క్రీస్తు పరిచర్యలో గడిపారని వివరించారు. జేమ్స్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, దళిత, ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, మాచవరపు జూలియన్, కొరివి వినయకుమార్, దారా అంజయ్య, పులిపాటి బాబురావు, గోసాల ఆశీర్వాదం, దుడ్డు భాస్కరరావు తదితరులు ఉన్నారు. నివాళులర్పించిన దళిత, ప్రజా సంఘాల నేతలు -
చీఫ్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ దాసరి రమేష్
గుంటూరు మెడికల్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) గుంటూరు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా (సీఎంఓ) డాక్టర్ దాసరి రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరంపాలెంలోని సీజీహెచ్ఎస్ వెల్నెస్ కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రమేష్ను సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్, సెంట్రల్ టాక్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు అంశాలను పెన్షనర్లు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని డాక్టర్రమేష్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడి రోగి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొండ నాగార్జున మాట్లాడుతూ డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ తాము వందకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నామన్నారు. దూర ప్రాంత రోగులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి.వివేకానంద మాట్లాడుతూ విధి నిర్వహణలో డాక్టర్లు నిబద్ధతత, నిశ్వార్ద సేవలు అందించాలని కోరారు. రోగుల పట్ల మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. లోకల్ అడ్వైజరీ కమిటి మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ సీజీహెచ్ఎస్లో ఆరోగ్య సేవలు పొందడం పెన్షనర్ల హక్కు అని చెప్పారు. శస్త్రచికిత్సలకు అధిక రుసుము వసూలు చేసే ఎంప్యానల్డ్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్లు పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్.నగేష్బాబు, కె.సాంబ్రాంజ్యం, నర్సింగ్ ఆఫీసర్ హేమసుందరి, ఫార్మాశిస్టుల ఆయేషా బేగం, సునిల్, వైద్య సిబ్బంది పేరేశ్వరరావు, మురళి, రామారావు పాల్గొన్నారు. -
రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా?
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సంప్రదింపులు జరపకుండా వారి నుంచి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు అన్నారు. ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ ప్రాంతాన్ని ఆయన స్థానిక సీపీఎం నాయకులతో కలసి సోమవారం పరిశీలించారు. అనంతరం సీపీఎం కార్యాలయంలో బాబూరావు మాట్లాడుతూ.. ఇక్కడి రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా అని ప్రశ్నించారు. చట్టాలను లెక్కచేయకుండా, కోర్టులో వివాదం నడుస్తుండగా, కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మహిళలను విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని లాగివేయడం సరికాదన్నారు. రూ.ఆరేడు కోట్ల విలువ చేసే విలువైన భూములను రిజిస్ట్రేషన్ వాల్యూ తెలీకుండా ఆర్డరు ప్రకటించడం దుర్మార్గమన్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నామంటూ 9.3 అంగీకారం తెలిపినా, రైతుల భూముల్లో దౌర్జన్యంగా మట్టి వేశారన్నారు. మాట తప్పింది ప్రభుత్వమేనని, రైతులు కాదని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యులు, మంత్రి లోకేశ్ నోరు మెదపడంలేదని విమర్శించారు. పవన్ ఎందుకు మాట్లాడరు?.. ఇక ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల భూములు బలవంతంగా తీసుకుంటే జనసేన చూస్తూ ఊరుకోదని చెప్పిన పవన్కళ్యాణ్, నేడు పేదల భూముల లాక్కుంటుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రెండవ దశలోని 43 గ్రామాల్లో 1,43,000 ఎకరాలు భూసేకరణ చేస్తామనడం దుర్మార్గమన్నారు. రాజధాని అంటే పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, నాయకులకేనా, రైతుల గోడు పట్టదా అని బాబురావు మండిపడ్డారు. -
హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అధ్యక్షుడు
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రొటోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు వీర మణింద్ర, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ రమేష్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ను కలిసి గుంటూరు జిల్లా కోర్టులో నూతన భవనం ఏర్పాటు గురించి చర్చించటం జరిగిందని బార్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ‘ఎన్టీఆర్’ డీఎంహెచ్ఓగా డాక్టర్ శ్రావణ్బాబు గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబును ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న ఆయనకు సివిల్ సర్జన్గా పదోన్నతి ఇచ్చి డీఎంహెచ్ఓగా పోస్టింగ్ ఇచ్చారు. గుంటూరు జల్లా రేపల్లె సమీపంలోని బెల్లంవారిపాలెంకు చెందిన డాక్టర్ శ్రావణ్బాబు గుంటూరు వైద్య కళాశాలలో 1988లో ఎంబీబీఎస్, విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో 2011లో పీజీ డీసీహెచ్ చేశారు. గుంటూరు జిల్లా అప్పికట్లలో 1998లో మెడికల్ ఆఫీసర్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. బాపట్ల పీపీ యూనిట్లో, పొన్నూరు, పొదిలిలలో పలు హోదాల్లో పనిచేశారు. చీరాల ఏరియా ఆసుపత్రిలో పిల్లల వైద్యనిపుణులుగా పనిచేశారు. డాక్టర్ శ్రావణ్బాబు డీఎంహెచ్ఓ కార్యాలయంలో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్గా, ఆర్బీఎస్కే జిల్లా కోర్డినేటర్గా గతంలో విధులు నిర్వహించారు. డాక్టర్ శ్రావణ్బాబుకు గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, పలువురు వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
నగరంపాలెం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్, పరిపాలనలో ఇద్దరు పోలీస్ అధికారులు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఏఆర్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న హనుమంతు, ప్రస్తుతం రేపల్లె డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న షేక్.అజీజ్ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించి, జ్ఙాపికలు అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని అన్నారు. తద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. సామాజిక సేవలో హనుమంతు ముందుంజలో ఉన్నారని అన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (సీసీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి, సురేష్బాబు, కృష్ణయ్య, ఆర్ఎస్ఐలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫీవర్ ఆస్పత్రి ఆర్ఎంఓగా డాక్టర్ పద్మావతి
గుంటూరు మెడికల్: పల్నాడు జిల్లా నరసరావుపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మక్కెన పద్మావతిని గుంటూరు గోరంట్ల గవర్నమెంట్ హాస్పటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డీసీజెస్(ఫీవర్ ఆస్పత్రి) సీఎస్ ఆర్ఎంఓగా నియమిస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.సురేష్కుమార్ ఉత్తర్యులు జారీచేశారు. గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న తాడికొండ రోమ్లో పనిచేస్తున్న డాక్టర్ వై.నళినీదేవిని గుంటూరు రీజనల్ ట్రైనింగ్ సెంటర్(ఫీమేల్) ప్రిన్సిపల్గా బదిలీ చేస్తూ సురేష్కుమార్ ఉత్తర్యులు జారీచేశారు. ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మిని మన్యం పార్వతీపురం డీఎంహెచ్ఓగా నియమిస్తూ ఉత్తర్యులు జారీచేశారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి.బి.ఎస్.రోహిణి రత్నశ్రీని మంగళగిరి ఎన్టీఆర్ వైద్యసేవ టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్గా బదిలీ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లక్ష్మీపురం: ఈనెల 15న విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి పవన్, జి నాగరాజులు పిలుపు నిచ్చారు. ఈమేరకు గుజ్జనగుండ్లలోని సోమవారం విద్యుత్ స్టోర్స్ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పీఆర్సీ కమిటీని నియమించాలని, కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అన్నారు. ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారి కె రాంబాబు,యూనియన్ నాయకులు నాయక్, బాలు, బాజి, లక్ష్మణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్టు మంగళగిరి రూరల్: మండలంలోని చినకాకాని గ్రామ పరిధిలోని హాయిలాండ్ రోడ్డులో గత నెల 17న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్జిల్లా దొంగలు వెంపాల చంటి, క్రోసూరు శ్రీనివాసరావును సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన కుటుంబాన్ని గమనించిన నిందితులు ఇంటిని రెక్కీ చేసి, తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 16 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంపాల చంటిపై గతంలో సుమారు 100కు పైగా, క్రోసూరు శ్రీనివాసరావుపై 28 పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీసెట్–2026) లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 18వ తేదీ లోపు వెబ్ ఆధారిత ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు ఏపీ డీసెట్ కన్వీనర్, పాఠశాల విద్య గుంటూరు జోన్ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈనెల 20 నుంచి 23 వరకు సీట్ల కేటాయింపు జరుపుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. సంబంధిత అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలని సూచించారు. డీఎల్ఈడీ ప్రధమ సంవత్సర తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభమవుతాయని, అర్హత సాధించిన అభ్యర్థులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోపు ప్రవేశం పొందాలని తెలిపారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీగా శివాజీరాజా నగరంపాలెం: గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎస్పీ మధుసూదనరావు కర్నూలు జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం విదితమే. -
ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి
– ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావు అచ్చంపేట: ప్రజలు కోరిన సమాచారం అందుబాటులో ఉంటే వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అచ్చంపేట తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. సహ చట్టం రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్నింటికి సమాచారం అందించారనే విషయాలను పరిశీలించారు. అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రతి సమాచారం పబ్లిక్కు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీవో గోపాలకృష్ణ, తహసీల్దారు సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రి మహోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కె.చక్రధరరెడ్డి తెలిపారు. సోమవారం 90వ అమావాస్య దివ్యహోమం సందర్భంగా అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలలో దేవతారూపం లేకుండా కేవలం చక్ర రూపంలో గయా క్షేత్రంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీమాధవేశ్వరి మహామాత అలంకరణలో పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా ఆలయంలో జరిగిన హోమం, విశేష పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు: ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) జి.నాగేంద్రప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) డి.సాంబ్రాజ్యంతో క లసి డిపో–1 గ్యారేజీని పరిశీలించారు. బస్సుల మరమ్మతుల పనులను పరిశీలించారు. గుంటూరు డిపో–2లో జరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సుల గ్యారేజీ పనుల గురించి ఆరా తీశారు. ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహా శైవాక్షయోగం రోజున శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేయడం వలన వంద మహాశివరాత్రులు ఆచరించిన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు, అర్చకులు అందించారు. -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల, వైద్యశాల ముఖ ద్వారం నెరవేరిన జగనన్న సంకల్పం పిడుగురాళ్ల: పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి గతంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం పల్నాడు జిల్లాకే మణిహారంగా మారింది. బడుగు, బలహీన వర్గాలు, పేదలకు వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మించారు. ఈ ప్రాంతం ప్రజల కల వైఎస్ జగన్ సహకారంతో సాకారం అయిందని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు 2026–27 విద్యా సంవత్సరానికి కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాసుపత్రి, తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధమైనట్లు వైద్య బృందం తెలిపింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ... పల్నాడు జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఈ వైద్య కళాశాల ఎంతో ఉపయోగపడనుంది. వైద్యులు, బోధన సిబ్బంది, ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం దక్కింది. పరోక్షంగా ఎంతో మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య పెరగటంతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావటం మాజీ ముఖ్యమంత్రి జగన్ చలవేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుచూపు ఫలితమే నేడు పిడుగురాళ్ల వైద్యశాల, వైద్య కళాశాల రూపకల్పనకు కారణమైంది. గతంలోనే 90 శాతం పూర్తి జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రత కోసం చేపట్టిన కళాశాల నిర్మాణం 90 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల కూడా ప్రారంభం కానుండటంతో వంద సీట్లు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టమని ఎన్ఎంసీ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల, వైద్యశాల నిర్మాణం శరవేగంగా చేసేందుకు అప్పటి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి చూపిన చొరవను ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిసరాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం, విద్య అందించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించారు. అందులో భాగంగా పిడుగురాళ్లలో వైద్య కళాశాల పనులు చేపట్టి దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. నేడు ఆ కళాశాల ప్రారంభమవడమే కాకుండా తాజాగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పొందింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యశాల కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలను సత్వరం పరిష్కరించండి
● జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ పీజీఆర్ఎస్ ● 197 అర్జీలు స్వీకరణ నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. మొత్తం 197 అర్జీలు వచ్చాయి. ఫిర్యాదిదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా పోలీస్స్టేషన్లకు పిలిచి, నిర్దేశిత గడువులోగా విచారించాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్)లు అర్జీలు స్వీకరించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ (సాయినగర్) ఫిర్యాదిదారులకు అన్నదానం నిర్వహించారు. దాడికి పాల్పడ్డారు.. నాకు మా నాన్న ద్వారా సంక్రమించిన స్థలం ఉంది. ఈ స్థల వివాదమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే అవతలి వైపు వ్యక్తులు ఇటీవల నాపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. నా ప్రత్యర్ధులు నాపై దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని.. చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ప్రయోజనంలేదు. వారిపై చర్యలు తీసుకుని, న్యాయం చేయగలరు. – షేక్ ఫజల్, పొన్నూరు టౌన్ -
కళకళలాడిన శివాలయం
పెదకాకాని: శివాలయంలో ఆరుద్ర నక్షత్రం. కృష్ణ చతుర్దశి మహా పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. మాస శివరాత్రి రోజున భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో అంతరాలయ అభిషేకాలు, ఏక వారాభిషేక పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు అధికసంఖ్యలో జరిగాయి. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఒక్క రోజులో స్వామి వారికి రూ.4 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, పూజలు చేశారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ వరప్రసాద్ కూడా స్వామి వారిని దర్శించుకుని, అభిషేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు ఆయన్ను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. వేద ఆశీర్వచనం చేశారు. -
గుంటూరు చానల్ గండ్లకు శాశ్వత పరిష్కారం చూపాలి
లక్ష్మీపురం: గుంటూరు చానల్ గండ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ జిల్లా అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు చానల్ గండ్లు సమస్య, తూటికాడ, మురుగు పేరుకుపోయి ప్రతి సంవత్సరం వర్షాలకి పొంగిపొర్లి చేతికొచ్చిన పంటలు నీటిపాలవుతున్నాయన్నారు. సమస్య అధికారులు తాత్కాలికంగా పరిష్కారం చేస్తున్నారు తప్పితే శాశ్వత పరిష్కారం చేయడలేదన్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారన్నారు. రాజధాని, ఎన్నారై, చుట్టుపక్కల అపార్టుమెంట్ల నుంచి మురుగు నీరు మొత్తం గుంటూరు ఛానల్ లోకి వస్తుందన్నారు. దీనివలన బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వరి పంటకు ఎకరానికి రూ. వేలు ఖర్చుపెట్టిన సాగు చేస్తున్న రైతులకు కట్టలకు గండ్లు బడి పూర్తిగా పంట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వల్లూరి భారతి, జిల్లా కమిటీ సభ్యులు కారుమూరి గోపాల్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, బీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీటీఈఎల్ సర్టిఫికేషన్ కోర్సుల్లో విజ్ఞాన్ నిరులకు ఏ గ్రేడ్
గుంటూరు రూరల్: విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవరి–ఏప్రిల్ 2026 ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సుల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు కళాశాలకు ఏ రేటింగ్ లభించిందన్నారు. ప్రతిష్టాత్మక అవార్డును 2026 జూలై 11న చైన్నెలోని ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ ఎస్.లక్ష్మీశిరీష అందుకున్నారన్నారు. జనవరి–ఏప్రిల్ 2026 సెమిస్టర్లో కళాశాల నుంచి మొత్తం 923 మంది ఎన్పీటీఈఎల్ కోర్సులకు నమోదు చేసుకోగా, వారిలో 238 మంది విద్యార్థులు, 11 మంది అధ్యాపకులు కలిపి మొత్తం 249 మంది సర్టిఫికెట్లు సాధించారన్నారు. 19 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. జాతీయ స్థాయిలో కళాశాలకు లభించిన ఈ గుర్తింపు విద్యార్థులు, అధ్యాపకుల నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎస్. లక్ష్మిశిరీషను, అధ్యాపకులను, విద్యార్థులను, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. ఆర్వీఆర్ జేసీకి జాతీయ స్థాయిలో 14వ సారి ఏఏ రేటింగ్.. 98 స్టార్ అవార్డులు లభ్యంగుంటూరు రూరల్: ఎన్పీటీఈఎల్ పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి వరుసగా 14వ సారి ప్రతిష్టాత్మక ఏఏ రేటింగ్ను సాధించటంతో పాటూ 98 స్టార్ అవార్డులు అందుకోవడం, దేశ వ్యాప్తంగా వున్న ఎన్పీటీఈఎల్ అన్ని లోకల్ చాఫ్టర్స్లో తమ కళాశాల అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్, డాక్టర్ జగదీష్లు తెలిపారు. సోమవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల ఈ అద్భుత విజయాలు కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య, ఆధునిక బోధనా విధానాలకు నిదర్శనమన్నారు. ప్రతిష్ఠాత్మక గుర్తింపులో భాగంగా,కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 259 గోల్డ్, 672 సిల్వర్, 1,034 ఎలైట్ గ్రేడ్లను సాధించారన్నారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 84 మంది విద్యార్థులు టాపర్ సర్టిఫికెట్లు పొందారన్నారు. ఇటీవల చైన్నెలోని ఐఐటీ మద్రాస్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కళాశాల లోకల్ చాప్టర్ సమన్వయకర్త డాక్టర్ ఎంవీపీ చంద్రశేఖరరావు కళాశాల తరఫున ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారన్నారు. ఎన్పీటీఈఎల్ కోర్సులు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని, స్టార్ గుర్తింపు పొందిన విద్యార్థులకు ఐఐటీలలో నెలకు రూ.15,000 స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ అవకాశాలు, అత్యాధునిక సాంకేతిక అంశాలపై హ్యాండ్స్ఆన్ వర్క్షాప్లు, అలాగే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరచుకునే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక రంగంలో మార్పులను అభ్యసించాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: సాంకేతిక రంగంలో మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ పరీక్షలో ఇంగ్లీష్ బాషాంశాలు అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ పరీక్ష ఉపాధ్యాయులను విద్యార్థులుగా మార్చిందన్నారు. వేగంగా మారిపోతున్న విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగం మార్పులను ఉపాధ్యాయులు అభ్యసించాలని అన్నారు. తద్వారా ఆధునిక విద్యార్థులను తయారు చేయగలరని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ బోధనా శాస్త్రాల పునఃశ్చరణ కల్పించి టీచర్లు అందరూ టెట్ లో ఉత్తీర్ణులయ్యేలా యూటీఎఫ్ క్లాసులు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరు కావడం అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాటంలోనూ, అవసరమైన సందర్భంలో ఉపాధ్యాయులకు అండగా ఉండటంలోనూ యూటీఎఫ్ ముందుంంటుందన్నారు. రాబోవు ఆదివారం సైతం టెట్ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, టి.ఆంజనేయులు, ఏ.శ్రీనివాసరావు, ఎం. గోవింద్, కె.కామాక్షి, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి ఆడిట్ కమిటీ సభ్యులు వి.వినోద్, ఎన్. ధనలక్ష్మి, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సంకల్ప బలంతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరు ఎడ్యుకేషన్: సంకల్ప బలం, క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్యార్థుల తొలి మెట్టు అని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గుంటూరు రూరల్ అంకిరెడ్డిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్, ప్లస్టూలలో నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ సభ్యులకు ఆదివారం బృందావన్గార్డెన్స్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ సంకల్పబలం, క్రమశిక్షణతో అత్యుత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించగలరని చెప్పేందుకు అంకిరెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలే చక్కని నిదర్శనమని అన్నారు. మరోవైపు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో సంయుక్తంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితోనే నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయని, తద్వారా అంకిరెడ్డిపాలెం పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించటమే కాక జూనియర్ కళాశాల విద్యార్థిని ఈ ఏడాది ఐఐటీలో సీటు సాధించగలగడం గొప్ప విషయమన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సాహక బహుమతులతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రరావు, జాతీయ అవార్డు గ్రహీత ఉప్పాల రామ్మోహనరావు, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు లేళ్ల పెద అప్పిరెడ్డి, కుర్రి సాంబిరెడ్డి, సంజీవరెడ్డి, గంగాధరరెడ్డి, పుల్లారెడ్డి, దేవగిరి సీతారామిరెడ్డి, శ్యామల రఘురామి రెడ్డి , పరంధామ రెడ్డి పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు
పట్నంబజారు: ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాలు.. ఏప్రిల్ నెల 4వ తేదీన చౌత్రా డౌన్ గంజిబజార్లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో గుడి పూజారిని మాయ చేసి అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక వ్యక్తి దోచుకుని పోయాడు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడుని గుర్తించారు. కృష్ణాజిల్లా విజయవాడ మాచవరానికి చెందిన ఏమని రాంబాబు ప్రస్తుతం హైదరాబాదులోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీన విజయవాడ నుంచి స్కూటీపై గుంటూరుకు వచ్చి గంజి బజార్లోని కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజారి గుడి శుభ్రం చేస్తుండగా అమ్మవారికి దండం పెట్టుకున్నట్లు నటించి ఆయనకు రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయలు దక్షిణ తీసుకుని మిగతావి తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఆలయ అర్చకుడు బయటకు వెళ్లిన సమయంలో అమ్మవారి బంగారు మంగళ సూత్రాలు, బొట్టు మొదలగు వెండి వస్తువులను అపహరించుకుపోయాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 70కి పైగా ఆలయాల్లో చోరీకి చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. -
ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రక్రియలో ఎస్జీటీలుగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్ అర్హతలు ఉన్న వారిని వివిధ ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పలువురు ఎస్జీటీలు గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వెళ్లారు. కౌన్సెలింగ్కు హాజరైన 147 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో తెలుగు మీడియం విభాగం నుంచి హైస్కూల్కు అర్హతలు గల ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోరుకోగా, మరో 10 మంది ఎస్జీటీలు వేర్వేరు పాఠశాలలను కోరుకున్నారు. ఉర్దూ మీడియంలో హాజరైన తొమ్మిది మంది ఉపాధ్యాయుల్లో ఇద్దరు వేర్వేరు పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 147 మంది ఉపాధ్యాయుల్లో 15 మంది పాఠశాలలను ఎంపిక చేసుకోగా, మిగిలిన వారు సుముఖత చూపలేదు. కౌన్సెలింగ్ ప్రక్రియలో గుంటూరు డీవైఈవో జి.ఏసురత్నం, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్ సిబ్బంది నాగమల్లేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, నరేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: పోలీసులమని చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న వారిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి ఈ నెల 7వ తేదీన తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులమని, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. ఈ కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరు చీరాలకు చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి బాపట్లకు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ సమాచారం.నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆయా సబ్ డివిజన్లలోని డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలుగా ఈ తనిఖీలు కొనసాగించారు. తొలుత రిజిస్టర్ పుస్తకాలను పరిశీలించారు. రోజుకి ఎంత మంది వస్తున్నారు, ఏయే పనులపై వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారనే విషయాలపై నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. అనంతరం గదుల్లో బస చేసిన వ్యక్తుల ఆధార్ కార్డులు, ఇతరత్రా గుర్తింపు కార్డులను పరిశీలించారు. జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు నగరంలో వారు ఎందుకు వచ్చారనేది అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వస్తే ఒరిజినల్ ఆధార్, ప్రభుత్వ గుర్తింపు కార్డులను పరిశీలించాక వాటి జిరాక్స్ కాపీలను తీసుకోవాలని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారు. విధిగా రిజిస్టర్లల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలు వాడుకంలో ఉండాలని, కనీసం నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. దుర్గమ్మకు విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. తిరుపతి జిల్లా పనగలూరుకు చెందిన జి. సుబ్రహ్మణ్యంరెడ్డి కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికా రులకు అందజేశారు. మచిలీపట్నం నరసింహనగర్కు చెందిన సీహెచ్ శ్రీలలిత కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈవో కిషోర్బాబు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను దాతలకు అందజేశారు. -
జిల్లా ఎస్పీని కలిసిన అమరావతి ఎల్అండ్ఓ ఓఎస్డీ
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఆదివారం అమరావతి లా అండ్ ఆర్డర్ (ఎల్/ఓ) నూతన ఓఎస్డీ మనోజ్ రామనాథ్హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మనోజ్ రామనాథ్హెగ్డే రాజంపేట నుంచి బదిలీపై అమరావతి ఎల్ అండ్ ఓకు బదిలీయ్యారు. అమరావతి రాజధాని ఏరియాకు ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ అన్నారు. సున్నితమైన ప్రాంతంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తుళ్లూరు, సీఆర్డీఏ లో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇంటెలిజెనన్స్, ఎస్బీ సమాచారంతో ఉండాలని, ప్రజా భద్రతకై విధులు చేపట్టాలని సూచించారు. -
వల్లూరుకు రావిశాస్త్రి సాహిత్య పురస్కారం
సీతంపేట: ప్రముఖ కథా, నాటక రచయిత రావిశాస్త్రి(రాచకొండ విశ్వనాథశాస్త్రి) పేరిట ప్రదానం చేసే ‘శ్రీ రావిశాస్త్రి రచనా పురస్కారం–2026’కు తెనాలికి చెందిన ప్రముఖ కథా, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ ఎంపికయ్యారు. ఈ నెల 30న విశాఖపట్నంలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో, డాక్టర్ జి.రఘురామారావు అధ్యక్షతన నిర్వహించే ప్రత్యేక సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. అరసం విశాఖ జిల్లా శాఖ అధ్యక్షుడు ఉప్పల అప్పలరాజు, ఉపాధ్యక్షులు హనుమంతరావు, డాక్టర్ ఈశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి బసు పోతన, కార్యదర్శులు చంద్రమోహన్, శ్యాంసుందర్ తదితరులు వల్లూరు శివప్రసాద్కు అభినందనలు తెలిపారు. సాహిత్యంలో కథా, నాటక రచయితగా వల్లూరు శివప్రసాద్ విశిష్ట సేవలు అందించారని, ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం సముచిత నిర్ణయమని ఉప్పల అప్పలరాజు పేర్కొన్నారు. కొల్లూరు: అరటి గెలలు లోడుతో ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో పంట పొలాలలోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టిన సంఘటన కొల్లూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. లంక గ్రామాల నుంచి అరటి గెలల లోడుతో వాహనం మిర్యాలగూడ బయలుదేరింది. కూలీలను వారి గ్రామంలో దింపేందుకు మండలంలోని కోటిపల్లి వెళుతుండగా కొల్లూరు సమీపంలోని మలుపు దాటిన అనంతరం అకస్మాత్తుగా స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపు కోల్పోయి పంట పొలాల వైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు పంట పొలాల్లోకి దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పల్టీ కొట్టిన వాహనంలో నుంచి డ్రైవర్ సైతం క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ బిగించిన ఇనుప రాడ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జక్రయ్య దివ్యాంగుడు. ఒక కాలు లేకపోవటంతో మూడు చక్రాల బండిపై తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో జక్రయ్య నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం వద్ద రోడ్డు వెంబడి రెయిలింగ్కు బిగించిన ఇనుప రాడ్లు దొంగిలించి పాత ఇనుప దుకాణంలో విక్రయిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు గత పదిరోజులుగా సీసీ కెమేరాల ఫుటేజీ గమనించి సుమారు రూ.60 వేలు విలువైన ఇనుప రాడ్లు దొంగిలించి, విక్రయించినట్లు నేషనల్ హైవే పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన వస్తువులను ఎక్కడెక్కడ విక్రయించాడో ఆరా తీస్తున్నారు. -
ఐఏపీ ప్రెసిడెంట్ ఎలక్ట్గా డాక్టర్ ఉమాజ్యోతి
గుంటూరు మెడికల్: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్ డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, సెక్రటరీ డాక్టర్ పసుపుల సాయి కిరణ్, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు. గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహౖ వెద్యనిపుణులు, ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వీవీ రామకుమార్ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్ ఎంపవర్మెంట్ డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్స్‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్ శశాంక్ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్ చైర్మన్ మనోజ్ చేతుల మీదుగా డాక్టర్ రామ్కుమార్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్ రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లిదండ్రుల విశ్వాసమే భాష్యం విజయానికి పునాది
రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు తమపై ఉంచిన విశ్వాసమే భాష్యం విజయానికి పునాది అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్ను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గోరంట్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని భాష్యం విద్యాసంస్థలకు చెందిన సెంట్రల్ అడ్మిన్ టీం, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో భాష్యం రామకృష్ణకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ 1993లో 183 మంది విద్యార్థులతో మొదలైన భాష్యం విద్యాసంస్థలు విజయ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి కృషి, సహకారం దాగి ఉన్నాయని, తద్వారా భాష్యం తన స్థానాన్ని పదిలపరచుకుందని పేర్కొన్నారు. భాష్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ భాష్యం స్థాపించిన నాటి నుంచి తమతో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తొలుత భాష్యం మెయిన్ క్యాంపస్ నుంచి గోరంట్ల వరకు భాష్యం రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులను భాష్యం కార్యనిర్వాహక సిబ్బంది ర్యాలీగా తీసుకెళ్లి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు భాష్యం రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కార్యనిర్వాక సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహంగుంటూరు రూరల్: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్ సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వినూత్న ప్రయోగం ‘గ్రహాంతర ప్రేమికుడు’
తెనాలి: మానవాళితో గ్రహాంతరవాసుల సహజీవనం కథాంశంతో మా–ఏపీ నుంచి నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న ’గ్రహాంతర ప్రేమికుడు’ ఓటీటీ చిత్రం ఒక వినూత్న ప్రయోగమని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా చెప్పారు. తెనాలిలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రహాంతర వాసులు... ఏలియన్స్ ఉనికిని నేచర్ అస్ట్రానమి జర్నల్ సైంటిస్టులు ధ్రువీకరించారని దిలీప్రాజా చెప్పారు. దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధనల నుంచి స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు నటిస్తున్నారని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి రాప్ బిలియర్డ్స్ గేమ్ జోన్ విజేతగా శివశర్మ
గుంటూరువెస్ట్(క్రీడలు): గుంటూరులోని రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి బిలియర్ట్స్ చాంపియన్న్ షిప్ పోటీల విజేతగా కాకినాడకు చెందిన శివశర్మ నిలిచాడు. ద్వితీయ స్థానంలో గుంటూరుకు చెందిన బద్రు జుబేర్ నిలిచాడు. శనివారం జరిగిన విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేతలు అమర ఆదినారాయణ, అమర అజయ్ మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి పోటీలను విజయవంతం చేయడం అభినందనీయమని క్రీడాకారులు ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు సుమారు రూ.1.50 లక్షలు నగదు రూపంలో అందజేశామని చెప్పారు. భవిష్యత్లో రాప్ స్నూకర్స్ గేమ్ జోన్ ఆధ్వర్యంలో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి బిలియర్డ్స్ పోటీలను నిర్వహించడంతో పాటు గుంటూరును ఈ క్రీడకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెనాలిరూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ ఐదో నంబరు ప్లాట్ఫాంపై శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ఐదో నంబరు ప్లాట్ఫాం పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేశాడు. కాళ్లు తెగిపోయి తీవ్ర రక్తస్రావమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: ఇద్దరు బాలికల అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. మంగళగిరి– తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట, అంబేడ్కర్ కాలనీలో బాలికలు వారి తల్లిదండ్రుల కలసి నివాసం ఉంటున్నారు. మొహరం కుమార్తె ఇస్రా, అస్మతున్నిసా కుమార్తె నూర్జహాన్ కనిపించకుండా పోయారంటూ తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉదయం సమయంలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద మంగళగిరి వెళ్లే ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాదెండ్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... నుదురుపాడు గ్రామానికి చెందిన పారెళ్ళ అనిల్కుమార్ (27) కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో తమ బంధువు మృతి చెందటంతో ద్విచక్రవాహనంపై వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో నాదెండ్ల–అప్పాపురం డొంక రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలో పడింది. స్థానికులు గమనించి 108కు సమాచారమిచ్చారు. అనిల్కుమార్ను చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించగా, శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించటంతో స్వగ్రామమైన నుదురుపాడుకు తరలించారు. -
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
విజయపురిసౌత్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యనభ్యసించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) కార్యదర్శి కృష్ణమోహన్ అన్నారు. శనివారం స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కళాశాల 1976–78 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 25 మంది హాజరవ్వటం ఎంతో సంతోషకరమన్నారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎం హేమాంబర్రెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రగతి, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విజయాలను వివరించారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులను ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శి ఉబేదుల్లా ఘనంగా సన్మానించారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పోటీలకు హాజరైన క్రీడాకారులను రామకృష్ణ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ పోటీలు రెండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయన్నారు. ముఖ్యంగా అండర్ 11, 13, 15 విభాగాలలో క్రీడాకారులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవడం విశేషమని తెలిపారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షులు రంగబాబు, జిల్లా కమిటీ సభ్యులు మొకమటం వెంకట్, సతీష్ చంద్ర, బండారు రాము, బొచ్చు రమేష్, హరి పాల్గొన్నారు. -
ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్పై అపోహలు వద్దు
తెనాలిటౌన్: మార్కెటింగ్శాఖ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అపోహలు అవసరం లేదని మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం.దివాకర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం ది డాల్మిల్స్, పల్సెస్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై వ్యాపారులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రభుత్వం రూపొందించిన ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెక్పోస్ట్ల వద్ద నగదు రశీదులు రాసి ఇవ్వడం పూర్తిగా రద్దు చేయబడిందని వెల్లడించారు. లైసెన్స్ కలిగిన వ్యాపారస్తుడు స్వతహాగా ఆన్లైన్ ఈ–పర్మిట్ తీసి సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్కు ఇచ్చి పంపాలని స్పష్టం చేశారు. వాహన డ్రైవర్ ఆన్లైన్ ఈ–పర్మిట్ ప్రింట్ను తన మొబైల్కు వచ్చిన నంబర్ను చెక్ పోస్టు వద్ద చూపించి స్కానింగ్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. ముందస్తు ఆన్లైన్ ఈ–పర్మిట్ లేకుండా సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్ల నుంచి చెక్ పోస్టు వద్ద కేవలం ఫోన్పే, జీపే, పేటీఎం ఇతర డిజిటల్ పద్ధతిలోనే మార్కెట్ ఫీజు వసూలు చేసి పర్మిట్ జారీ చేయబడుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నగదు అంగీకరించబడదని వెల్లడించారు. పర్మిట్ తీసుకున్న పది రోజుల వరకు గడువు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులందరూ నూతన ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానానికి సహకరించాలని కోరారు. ఏజీఆర్ఎల్ఎంకెటీజీ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి డి.సిహెచ్.సుబ్బారావు, సిబ్బంది వ్యాపారులు పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం.దివాకర్


