breaking news
Guntur District News
-
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...
ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు. ఇలాంటివారిని తక్షణమే మానసిక వైద్యులకు చూపించడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగిన వస్తువు కొనిపించకపోతే చనిపోతామని బెదిరిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే స్పందించి వారిని మానసిక వైద్యులకు చూపించాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానసిక రుగ్మత. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసికవ్యాధుల వైద్య నిపుణుల సంఘం, జిల్లా అధ్యక్షుడు -
కారుమూరి కోటిరెడ్డికి ఘననివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు రూరల్: మండలంలోని అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బావ కారుమూరి కోటిరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని కోటిరెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్నాబత్తిని శివకుమార్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా, బలసాని కిరణ్కుమార్, అంబటి మురళి, డైమండ్ బాబు, గజ్జల సుధీర్భార్గవరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జునయాదవ్, మాజీ ఇన్కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాంరసూల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్క జీవితం..!
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువ. కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. డేంజర్ బెల్స్.. వ్యక్తులు డల్గా ఉండటం, ఎవరితో కలవకుండా మూలన ఒంటరిగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, బరువు తగ్గిపోవడం, ముఖం దిగాలుగా ఉండటం, ఆహారం మానివేయడం, తదితర లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై వారికి మానసిక వైద్యులచేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈలక్షణాలు కనిపించేవారు హైరిస్క్ గ్రూపునకు చెందిన వారు. కారణాలు.... భారతదేశంలో ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు బానిసలవ్వటం, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో అపజయాలు, ఒత్తిడి, కుంగుబాటు, ఆర్ధిక సమ్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, పేదరికం, అక్రమ సంబంధాలు, కుల,వర్గ వివక్షలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీజీహెచ్లో బాధితుల వివరాలు... గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి చికిత్స పొందినవారు ప్రతినెలా 30 మందికిపైగా ఉంటున్నారు. జీజీహెచ్ వైద్యులు, మానసిక వైద్య నిపుణులు వీరిలో పలువురికి కౌన్సెలింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. ప్రతిఏడాది 200 నుంచి 300 మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వారు జీజీహెచ్కు వస్తుండగా, కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాలలో, వార్తా పత్రికల్లో, ఆత్మహత్యలు జరిగే విధానాన్ని అన్వేషించేవారిని, విచారం, దిగులు, దుఃఖం, ఎక్కువ కాలం ఉంటే అది ఆత్మహత్యకు దారి తీసే అవకాశముంది. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా సడన్గా శాంతంగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తుంటే తేడాను గమనించాలి. గతంలో లాగా స్నేహితులతో కలవకుండా, ఆట పాటల్లో పాల్గొనకుండా, దైనందిన కార్యక్రమంలో నిరాసక్తతతో ఒంటరి తనంగా వుండడానికి ఇష్టపడుతుంటే ఆ మార్పును ఆత్మహత్యకు సంకేతంగా పరిగణించాలి. మాటల్లో, సంభాషణల్లో నైరాశ్యం కనబరుస్తూ, వస్త్రధారణలో, వ్యక్తిగత శుభ్రతలో, ఆకర్షణలో నిరాసక్తత, వ్యక్తపరుస్తుంటే వారితో తప్పనిసరిగా వారితో మాట్లాడి వారి బాధను ఆలకించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. -
నేడు దశాబ్ది ఉత్సవాలు
నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు. -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్లెట్ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు. దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు, బాబు, బి.సత్యనారాయణ, పి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పెదకాకానిలో 35.2 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 35.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. చేబ్రోలు మండలంలో 21 మి.మీ., పొన్నూరు 19.8, తాడేపల్లి 19.6, ప్రత్తిపాడు 14.8, ఫిరంగిపురం 12.2, వట్టిచెరుకూరు 10.2, మంగళగిరి 3.8, గుంటూరు పశ్చిమ 2.8, తెనాలి 2.6, కాకుమాను 2.6, గుంటూరు తూర్పు 1.8, తుళ్ళూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 43.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట హోటల్–7లో 6వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ప్రారంభించిన చైర్మన్ అండ్ ఎండీ మోహన్ శ్యామ్ప్రసాద్ -
నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్న్లు, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్సైట్ www.a pcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్న్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలి
మంగళగిరి టౌన్: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాలని, వారం రోజుల్లో ధరలు నియంత్రించకపోతే గిడ్డంగుల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. గౌతమబుద్ధ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డీటీకి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నిత్యావసర ధరలను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజలను సమీకరించి గిడ్డంగులను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, చంద్ర నాయక్, న్నవరపు ప్రభాకర్, జాలాది జాన్బాబు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్యసేవలు....
గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు, సంసార జీవిత సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ప్రయోజకులు కాకపోవడం, ఉద్యోగపరమైన ఒత్తిడులు, తాగుడు అలవాటు ఉండటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య పాల్పడిఉండటం తదితర కారణాల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని సంప్రదించటం, వారితో చర్చించటం, వారికి వనరులు కల్పించటం ద్వారా నివారించవచ్చు. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వైద్య విభాగాధిపతి, జీజీహెచ్ -
నిమిషంలో 60 ఆరోగ్య పరీక్షలు
మంగళగిరి టౌన్: అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతతో వైద్యరంగంలో సరికొత్త మార్పులకు మంగళగిరి వేదికగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే లక్ష్యంతో మంగళగిరి పట్టణ పరిధిలోని గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఎరోస్ వెల్నెస్ ఆధ్వర్యంలో వినూత్న ఏఐ ఆధారిత ఆరోగ్య పరీక్షల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఏఐ ఆధారిత ముఖ స్కానింగ్ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల మాట్లాడుతూ సాధారణంగా ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాల నివేదకల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త విధానంలో రక్తనమూనా సేకరించడకుండానే కేవలం 60 సెకండ్లలో 60 రకాల ఆరోగ్య సూచికలను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతికతలో భాగంగా వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్తప్రసరణ, చర్మకణాల కదలిక తదితర అంశాల ఆధారంగా సుమారు 28 రకాల శారీరక కొలమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అదనంగా ఇంటర్నెర్ ఆధారిత జీవ సంవేదకాలు, ఆధునిక స్క్రీనింగ్ పరికరాలతో మరో 32 కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసేందుకు యూపీహెచ్సీకి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎరోస్ వెల్నెస్ సీఈవో శిల్పాదేశాయ్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, వైద్యసిబ్బంది, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపుపై విచారణకు కలెక్టర్ ఆదేశం
గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు తొలగించారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విచారణకు ఆదేశించారు. మన్నవ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బొనిగల అమరేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు, అలాగే గత నెల 5వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమరేంద్ర ప్రసాద్ కోరారు. ఎంపీటీసీ సభ్యుని భార్య సహా సుమారు 173 మంది ఓటర్ల పేర్లు ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు తొలగించారు. సర్ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగింపునకు గురయ్యాయి. వీటితోపాటు బీఎల్వో లాగిన్ను అనధికార వ్యక్తులు వాడుతూ జోక్యం చేసుకోవడం తదితర అంశాలు ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పందించిన కలెక్టర్... విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని 88–పొన్నూరు ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను ఆదేశించారు. నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా ప్రతాప్రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజులు జిల్లా పరిధిలోని పలు సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేయనున్నారు. -
చేనేత పింఛన్లకు నిబంధనలు సడలించాలి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులకు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లకు విధించిన నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విన్నవించింది. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కార్యాలయంలో బుధవారం జాయింట్ డైరెక్టర్ రాజారావుకు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద నుంచి పొందుతున్న కూలి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో తీసుకుంటున్నట్లుగా ఆధారం చూపాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. నూలు, ఇతర ముడి సరుకులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, మోహనరావు, రామారావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటల నుంచి దృష్టిదోష నివారణ, గ్రహదోష నివారణ, ఆయురారోగ్య అభివృద్ధి నిమిత్తం సర్వరక్షాకర శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఉదయం 8.30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ వెల్ఫేర్) జిల్లా ఇన్చార్జిగా డి.దుర్గాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న హర్షిత 45 రోజుల పాటు హెచ్ఆర్డీ (హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్) ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న దుర్గాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. వీటిని ఏపీ టూరిజం, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా ఆ వాహనాలను వారు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.1.71 కోట్లతో చేపట్టిన జిప్రైడ్, జిప్ సైక్లింగ్ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, డీటీఓ నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మయ్య, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్, నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమల్ హాసన్ పాల్గొన్నారు. తెనాలి: డివిజన్ సబ్ కలెక్టర్గా సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. 1992లో జన్మించారు. సివిల్స్ పరీక్షలు రాసి, 259వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఆయన్ను తీసుకున్నారు. శిక్షణ అనంతరం గతేడాది ఏప్రిల్ 28న తిరుపతిలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కె.శ్రీరమణి ఆర్డీఓగా పనిచేస్తుండగా.. ఆమె స్థానంలో సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. -
నిర్దేశిత ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వినాయకుని విగ్రహాలను నిర్ణయించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని పాటించి పర్యావరణ హితానికి తోడ్పాటును అందించాలని కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా పర్యావరణ హిత రంగులు మాత్రమే విగ్రహాలకు వినియోగించాలన్నారు. అవసరమైన సౌకర్యాలతో తాత్కాలికంగా ప్రత్యేక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మండపాలు నిర్వహించే వర్గాలు సహా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి నాణ్యత దెబ్బతినకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
ముగ్గురు ద్విచక్ర వాహన చోరులు అరెస్ట్
తెనాలి రూరల్: వారంతా చదువు మధ్యలో ఆపేసిన వారు. బైక్ మరమ్మతు పనులు నేర్పించేందుకు మెకానిక్ల వద్ద తల్లిదండ్రులు చేర్పించారు. తాళం లేకుండా వాహనాలను స్టార్ట్ చేసి తీసుకెళ్లడం, ఇగ్నిషన్ వైరింగ్ మార్చి బైక్లను ఆన్ చేయడం నేర్చుకున్నారు. ఇంకేముంది.. బైక్లను చోరీ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. మైనార్టీ తీరని వీరు తొలి ప్రయత్నంలోనే మూడు బైక్లను చోరీ చేశారు. ఎక్కడ అమ్మాలో తెలియక పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న బాల నేరస్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సీహెచ్. రాంబాబు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలో ఇటీవలి కాలంలో బైక్ల ఇగ్నిషన్ వైరింగ్ను తప్పించి, చిన్న వైరు ముక్క సాయంతో బైక్ల చోరీ జరుగుతుండడంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మూడు కేసులు నమోదైనట్టు తెలిపారు. దర్యాప్తులో ముగ్గురు బాల నేరస్తులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బజాజ్ పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, బజాజ్ ప్లాటినా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయడంతో పాటు, వీలైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్కుమార్ ఉన్నారు. బాల నేరస్తులను జువైనెల్ హోంకు తరలించారు. బైక్లు చోరీ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరాల ఫుటేజ్లు, వాహనాల నంబర్లను మెకానిక్ల గ్రూప్లో పెట్టడం నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఉపయోగపడింది. మెకానిక్ పనులు నేర్చుకుంటూ దొంగతనాలు చేసిన మైనర్లు -
రేపటిలోగా బహిరంగ విచారణ పూర్తి చేయాలి
డీఆర్వో షేక్ ఖాజావలి గుంటూరు వెస్ట్: ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) పెండింగ్ దరఖాస్తుల బహిరంగ విచారణ గురువారం నాటికి పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి స్పష్టం చేశారు. సర్పై తహసీల్దార్లతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. బుక్ ఏ కాల్ విధానంలో వచ్చిన అభ్యర్థనలను వేగంగా పరిష్కరించడానికి కనీసం గంటకు ఒకసారి యాప్ను సందర్శించాలని పేర్కొన్నారు. ఫారం 6,7,8 లలో వచ్చిన క్లెయిమ్పైనా దృష్టి సారించాలని తెలిపారు. నిబంధనల మేరకు కాలానుగుణంగా రాజకీయ పార్టీలకు వివరాలు అందించాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) తమ పరిధిలో గల పన్నెండు వందల మంది ఓటర్ల వివరాలు, ఫొటోలు విధిగా పరిశీలించాలని చెప్పారు. వాటిలో తప్పులు ఉన్నా, ఫొటో జత కాకపోయినా వారే బాధ్యులు అవుతారని తెలిపారు. ప్రతి విద్యాసంస్థలో ఓటరు అక్షరాస్యత క్లబ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జనగణన కింద విచారణ పూర్తి కావలసిన అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు, తాళాలు వేసిన ఇళ్ల వివరాలు సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. రీ సర్వే వంటి ప్రక్రియపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది విస్తృతంగా ప్రజలతో మమేకం కావాలని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన అన్ని రకాల సేవలు అందించాలని డీఆర్వోవివరించారు. -
అవి ఉండే అవకాశం లేదు..
ప్రత్తిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా పింఛన్ల మంజూరు సంఖ్యను దరఖాస్తు దశలోనే కుదించేందుకు పథకం పన్నినట్లుగా కనబడుతోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఇంట్లో సహజంగా ఉండే ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్ జాబితాలో చేర్చలేదు. స్థానికతను నిర్ధారించుకునేందుకు అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ, గ్యాస్ బిల్లు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ల్లో ఏదో ఒకటి తప్పనిసరన్న నిబంధనను విధించింది. దీంతో వృద్ధుల పరిస్థితి ఆదిలోనే హంసపాదులా తయారైంది. కేవలం ఆధార్ను ఆధార్ హిస్టరీ అప్లోడ్ చేసేందుకు, హౌస్హోల్డ్ మ్యాపింగ్కు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ అవ్వక.. ఇటీవల సర్ ప్రక్రియతోపాటు అంతకుముందు జరిగిన సవరణల్లో ఓటర్ ఐడీ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసినట్లు మొన్నటి వరకు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఓటర్ ఐడీ కోసం కార్యాలయాలకు వెళ్తున్న వారికి ఇంకో సమస్య ఎదురవుతోంది. కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదని, ముందు కార్డు లింక్ చేయించుకోవాలని ఉచిత సలహాలిచ్చి వెనక్కు పంపిస్తున్నారు. దాదాపుగా సగం మందికి ఫోన్ నంబర్తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. ఇవి కాక ఆధార్ కార్డులకు లింక్ అయిన మొబైల్ నంబర్లు, ఓటీపీలు, కరెంటు బిల్లులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా సమర్పించాల్సిన పత్రాలెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకుని స్వర్ణ గ్రామ కార్యాలయాలకు వెళ్లడానికి దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక దరఖాస్తుకే ఇలా ఉంటే విచారణ తర్వాత ఎన్ని మంజూరవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను పరిశీలించి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి స్థానికతను నిరూపించుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నాలుగింటిలో మూడు ప్రూఫ్లు వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. పాస్పోర్టు విదేశాలకు వెళ్లే వారి వద్ద లేదా కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వారి వద్ద మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కచ్చితంగా 95 శాతం మంది వృద్ధుల వద్ద ఉండే అవకాశమే లేదు. డ్రైవింగ్ లైసెన్స్ 60 ఏళ్ల పైబడిన కర్ర లేనిదే కాలు బయట పెట్టలేని వృద్ధుల వద్ద ఉండటం చాలా అరుదు. మొదటి నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్న అతికొద్ది మంది వద్ద మాత్రమే ఉండే వీలుంది. మొత్తమ్మీద ఐదు, పది శాతం మంది వద్ద కూడా ఉండని పరిస్థితి. మూడవది గ్యాస్ బిల్లు. మలి వయస్సులో కొడుకులు, కుమార్తెల వద్ద ఉండే వృద్ధుల పేరుతో గ్యాస్ బిల్లు ఉండటం అంటే సాధ్యమయ్యే పని కానే కాదు. ఓటర్ ఐడీ అనేక మంది వృద్ధులకు ఉన్నా అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవేళ పాత కార్డు దొరికినా ఇప్పుడు పది అంకెలతో ఉండే కొత్త కార్డు కావాలని మెలిక పెడుతున్నారు. -
చీకటి గోపి మృతిపై తేలని చీకటి కోణాలెన్నెన్నో
తాడికొండ: చీకటి గోపి మృతిపై చీకటి కోణాలను బయట పెట్టాలని దళిత ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. ఒంటిపై గాయాలతో పోలీస్స్టేషన్ నుంచి నేరుగా ఆస్పత్రిలో చేరిన గోపి తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడి జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యులకు గోపి చనిపోయే ముందు నన్ను పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడి సోదరుడు సతీష్, సోదరికి చెప్పి భయాందోళనకు గురయ్యాడని, ఆస్పత్రి నుంచి వెళ్తే మళ్లీ తీసుకెళ్లి చావబాదుతారంటూ భయంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అనంతరం గోపి కాళ్లు, ఒంటిపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బంధువులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే... పోస్టుమార్టం పూర్తయిన వెంటనే నివేదిక రాకుండానే పోలీసులు ఒక అడుగు ముందుకేసి పోలీసులు అసలు కొట్టనేలేదని సెలవిచ్చారు. తాడికొండ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని చెప్పుకొచ్చారు. ఎక్కడా కొట్టినట్లు అందులో నమోదు కాలేదని చెబుతున్నా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పర్యవేక్షణ లేని ఓ గది ఉండటం, అందులోకి చీకటి గోపి సహ నిందితులను విచారణ నిమిత్తం తీసుకెళ్లి తీసుకొచ్చినట్లు ఆ రికార్డుల్లో నమోదయింది. అయితే ఆ గది దుస్తులు మార్చుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతి కౌన్సెలింగ్కు అదే గదిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ● చీకటి గోపి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఉంగరం దొంగతనం చేసిన ప్రధాన నిందితుడు చింతచెర్ల గోపి, శాంతిరాజు ఉన్నారు. అయితే గోపి మృతి చెందిన దగ్గర నుంచి ఆ కుటుంబాలు జాడ లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అయితే వీరు భయంతో పారిపోయారా లేక వారు నోరు విప్పితే అసలు విషయం బయట పడుతుందని పోలీసులే వారిని తప్పించారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ● మృతుడు గోపికి జనసేన సభ్యత్వం ఉంది. ఆన్లైన్ రసీదును కూడా బంధువులు చూపిస్తున్నారు. సోదరుడు సతీష్కి టీడీపీ సభ్యత్వం, ఐడీ కార్డు కూడా ఉంది. ఇంతా జరిగిన స్థానిక కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యే, ఇతర నాయకులు కనీస పరామర్శకు రాకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ● రెండు రోజుల పోలీసు కస్టడీలో విచారణ పేరుతో ఆ గదిలోకి మృతుడు గోపి, ఇతర నిందితులను సీసీ కెమెరా పర్యవేక్షణ లేని గది లోపలికి తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చినట్లు కెమెరా రికార్డుల్లో స్పష్టంగా నమోదయినట్లు సమాచారం. కాగా అసలు కొట్టినట్లు ఎక్కడా కనిపించలేదు కాబట్టి పోలీసులు కొట్టలేదంటూ సమర్దించుకుంటున్నారు. -
సీఐని విధుల నుంచి తొలగించాలి
● గిరిజన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణం ● సీఐపై గుంటురు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు నగరంపాలెం: డైభ్బె ఏళ్లు పైబడిన గిరిజన మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐను విధుల నుంచి డిస్మస్ చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్నాయక్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి వినతిపత్రం అందించారు. మట్రా జాలమ్మపై సీఐ ప్రవర్తించిన తీరుని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వడిత్యా శంకర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఆరున బాపట్ల జిల్లా ఆదినారాయణపురంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారని అన్నారు. ఈ క్రమంలో 70 ఏళ్లు పైబడిన గిరిజన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మట్రా జాలమ్మపై బాపట్ల రెండో పట్టణ పీఎస్ సీఐ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. సీఐ మాట్లాడిన మాటలు మా ఆత్మలు క్షోభిస్తున్నాయని, మనసులు కలిచివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత వృద్ధురాలి నుంచి స్వయంగా వాంగ్మూలం నమోదు చేయాలని కోరారు. ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ, వీడియో రికార్డులు, పోలీసుల విధి నిర్వహణ వివరాలు, ఇతరత్రా ఆధారాలను భద్రపరిచి పరిశీలించాలని కోరారు. విచారణ ముగిసే వరకు బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఐజీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఆమె పట్ల ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారని పేర్కొన్నారు. ఐజీని కలిసిన వారిలో నాయకులు రామావతు అంజినాయక్, హరిలాల్ నాయక్, పాండు నాయక్, కె.ఆనంద్, ఇ.హనుమంతునాయక్, పి.గోవర్ధన్ ఉన్నారు. -
మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు
గుంటూరుమెడికల్: నగరంలోని జీజీహెచ్ మార్చురీ విభాగంలో మంగళవారం ఆసుపత్రి అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ‘మార్చురీలో పైసాచికం’ శీర్షికతో మార్చురీలో మృతదేహం అప్పగించేందుకు మామూళ్లు తీసుకుంటున్నారనే విషయంపై ‘సాక్షి’ పత్రికలో ఈ నెల 4న కథనం ప్రచురితమైంది. గతంలో సీసీ కెమెరాలు ఉండేవి, నేడు కెమెరాలు లేకపోవడం వల్ల పలువురు వైద్య సిబ్బంది మార్చురీలో మృతదేహాలు అప్పగించేందుకు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ ప్రచురించడంతో ఆసుపత్రి అధికారులు స్పందించారు. సదరు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
విద్యుత్ బస్లను ఆర్టీసీ పర్యవేక్షించాలి
నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంపాలెం: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన నేరస్తుడిపై పీఐటీ–ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో యువత, విద్యార్థులు లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మల్లవరుపు పృధ్వీపై ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పృధ్వీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అతనిపై మంగళగిరి పట్టణ పీఎస్, తాడేపల్లి పీఎస్, దుగ్గిరాల పీఎస్, ఎన్టీఆర్ జిల్లా సూర్యారావుపేట పీఎస్, గుడూరు పీఎస్లో కేసులు ఉన్నాయని తెలిపారు. -
జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పొన్నూరు మండలంలో 26 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.4 మి.మీ. వర్షం పడింది. సగటున 5.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివరాలు.. ప్రత్తిపాడు మండలంలో 20.4 మి.మీ., పెదనందిపాడు 18.6, గుంటూరు పశ్చిమ 13.1, గుంటూరు తూర్పు 9.2, తెనాలి 3, దుగ్గిరాల 2.8, తుళ్ళూరు 2.4, మేడికొండూరు 2.4, పెదకాకాని 2.4, ఫిరంగిపురం 2.2, కాకుమాను మండలంలో 1.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 38.7 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 31.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. నగరంపాలెం: యూకే బ్రైటన్లో స్థిరపడిన ప్రముఖ తెలుగు సెలబ్రిటీ చెఫ్ కాంతికిరణ్ తమ్మా అరుదైన గౌరవా న్ని సొంతం చేసుకున్నా రు. గుంటూరు కొత్తపేటలో జన్మించారు. యూకే లో స్థిరపడ్డారు. బ్రైటన్న్లో ది స్పైస్ సర్క్యూట్ లిమిటెడ్ చెఫ్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను ప్రతిష్టాత్మక బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్ (2026)లో చెఫ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఫైనలిస్ట్గా ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. యూకేలో దక్షిణ భారత, ముఖ్యంగా తెలుగు వంటకాలు, ఆహార సంస్కృతికి అందిస్తున్న విశిష్ట సేవలకు లభించిన అరుదైన గుర్తింపుగా ఈ గౌరవాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్– 2026 విజేతలను లండన్లోని క్వాగ్లినోస్లో ప్రకటించనున్నారు. కాంతికిరణ్ తమ్మా చెఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్గా నిలవడం తెలుగు వారి గర్వకారణంగా మారింది. మంగళగిరి రూరల్: యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకట శ్యామ్ (22) రాజధానిలో ఈ– 14 రోడ్డు నిర్మాణం చేస్తున్న ఓ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి రోజు విధుల కు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరులో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో కాంక్రీట్ మిక్సర్ వేయాల్సిన ప్రదేశం కాకుండా ముందుకు వెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఇంజినీర్ శ్యామ్ వాహనాన్ని వెనక్కి పిలవడంతో డ్రైవర్ రివర్స్ గేర్లో వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతను డైరెక్షన్ మార్చుకో అని డ్రైవర్కి చెప్పేలోపు వాహనం శ్యామ్కు తగలడంతో అతను కింద పడిపోవడం అతడిపై టైర్ ఎక్కటం క్షణాల్లో జరిగిపోయింది. తోటి ఉద్యోగులు ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో పట్టణ పాండురంగపేటకు చెందిన వంట మాస్టర్ ఎమ్మిటిశెట్టి నాగేశ్వరరావు(67) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎర్ర రంగు చేతి సంచి ఉంది. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించగా, రాత్రికి మృతుడి వివరాలు తెలిశాయి. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళాద్రిపై అరుదైన అతిథి... పునుగుపిల్లి సంచారం
● భక్తుల కెమెరాకు చిక్కిన వన్యప్రాణి ● అటవీ శాఖ అధికారుల నిర్ధారణ ● రాత్రి వేళల్లోనే సంచారం ● భక్తులు ఆటంకం కలిగించవద్దని సూచనమంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండపై అరుదైన పునుగుపిల్లి కనిపించింది. నాలుగు రోజుల క్రితం కొండపైకి వెళ్లిన భక్తులు రాళ్ల మధ్య పునుగుపిల్లి సంచరిస్తున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీసి పునుపుపిల్లి సంచారాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం. మంగళగిరి కొండకు సమీపంలో కృష్ణానది పరీవాహక ప్రాంతం ఉండడం, పరిసరాల్లో పంట్లతోటలు, పొదలు, నీటి వనరులు అందుబాటులో ఉండడం పునుగుపిల్లి సంచారానికి అనుకూల పరిస్థితులుగా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా పునుగు పిల్లులు రాత్రి వేళల్లో చురుకుగా సంచరిస్తూ, పగటి సమయంలో రాళ్ల సందుల్లో, పొదలు వంటి సురక్షిత ప్రాంతాల్లో దాక్కుంటాయి. పండ్లు, చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పునుగుపిల్లులు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కనిపించే చిన్న క్షీరదాలు. ఆంధ్రప్రదేశ్లో శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాల్లో వీటి ఉనికి నమోదు అయింది. జనసంచారం ఎక్కువగా ఉండే మంగళగిరి కొండపై ఇలాంటి వన్యప్రాణి కనిపించడం, వన్యప్రాణి ప్రేమికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొండపై పునుగుపిల్లి కనిపించనపుడు దాని దగ్గరకు వెళ్ళడం, వెంబడించడం, ప్లాష్ లైట్లు వేయడం, ఆహారం అందించడం, పట్టుకునే ప్రయత్నం చేయవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అది తన సహజ ఆవాసంలో స్వేచ్ఛగా సంచరించేలా భక్తులు, సందర్శకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి తాడేపల్లి పరిసరాల్లో గతంలోనూ పునుగుపిల్లులు జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది మార్చి 2న తాడేపల్లి ముగ్గురోడ్డు సమీపంలోని నివాస గృహంలోకి పునుగుపిల్లి ప్రవేశించడంతో అధికారులు దానిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్రావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్మరియరాజు, సిబ్బంది ఉన్నారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు. గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్లో నల్లమాస్క్లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజ్ఞాన్కు హెచ్సీఎల్టెక్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్టెక్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైస్ చాన్సలర్ కృష్ణకిషోర్కు హెచ్సీఎల్టెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగ ప్రతినిధి రాజమురుగన్ అథిముత్తు నాడర్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’కు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. హెచ్సీఎల్టెక్ సంస్థ తన ప్రశంసాపత్రంలో సాంకేతిక ప్రతిభావంతుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఇరువర్గాల ఉమ్మడి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించింది. ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’గా విజ్ఞాన్ యూనివర్సిటీతో కలిసి విద్యా రంగం– పరిశ్రమ మధ్య బలమైన వారధిని నిర్మిస్తున్నామని, విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుకుని వృత్తిపరమైన కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్న్డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్న్డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. -
21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత
లక్ష్మీపురం: కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములను పేద రైతులు సాగు చేస్తున్నారని, వారికి దేవదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వాలని కోరారు. పంట వచ్చిన తరువాత కౌలు చెల్లంచేందుకు అనుమతినివ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింప చేయాలని, పంట నష్టపరిహారాలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపునకు, నల్లమడ ఆధునికీకరణకు ఒకే సారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నీలాంబరం, ఏడుకొండలు, మొగిలయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ -
నంబూరులో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం
పెదకాకాని: నంబూరు గ్రామ పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రూ.29.71 కోట్ల నిధులతో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్తో కలసి మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అనేక చోట్ల విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉప కేంద్రం వల్ల మండలంలో లోఓల్టేజి సమస్యలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రాణం మార్కెండేయబాబు, అధికారులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాల పెంపుతోనే ప్రత్యేక గుర్తింపు
ఏఎన్యూ(పెదకాకాని): విద్యార్థులు నైపుణ్యాల పెంపుతో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఏఎన్యూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, సంస్కారం, లౌక్యం, బాధ్యతాయుతమైన లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. తాను ఏఎన్యూ పూర్వ విద్యార్థినని, విశ్వవిద్యాలయం అందించిన సర్టిఫికెట్ తన సినీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. తనను ప్రముఖ సినీ దర్శకుల స్థాయిలో నిలబడటానికి అది దోహదపడిందన్నారు. సమాజంలో క్రమక్రమంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా, వాటిని అవసరమైన మేరకే వినియోగించాలని హితవు పలికారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రెక్టార్ ఆచార్య శివరాం, ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తదితరులు ప్రసంగించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం అందించిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. పాటలు, నృత్యాలతోపాటు విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఆద్యంతంగా ఉత్సాహంగా కనిపించారు.ఉత్సాహంగా 5కే వాక్ ఏఎన్యూ స్వర్ణోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన 5కే వాక్ ఉత్సాహంగా సాగింది. క్రీడా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలంలు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్, అనంతరం సర్వీస్ రోడ్డు మీదుగా కంతేరు అండర్ బ్రిడ్జి, ఆనందజ్యోతి మీదుగా విశ్వవిద్యాలయ ప్రధాన గేటుకు వాక్ చేరుకుంది. తిరిగి క్రీడా మైదానానికి వెళ్లింది. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
జీఎంసీ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ పనులను రద్దు చేసి, డిపాజిట్లను జప్తు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి జీఎంసీ కమిషనర్ జారీ చేసిన ఏకపక్ష ఉత్తర్వులను కొట్టివేసింది. బాధితుడి డిపాజిట్ మొత్తాన్ని ఆరు వారాల్లోగా తిరిగి చెల్లించాలని జస్టిస్ హరినాథ్.ఎన్ తీర్పు వెలువరించారు. అసలేం జరిగిందంటే.. నల్లచెరువుకు చెందిన ‘దిరిసాల శ్రీనివాసరావు’ ఏజెన్సీ గతంలో (2017–18, 2019–20) ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పోర్టల్ డేటాను, రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిందని జీఎంసీ ఆరోపించింది. నాయుడుపేట డ్రెయిన్లు, చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డు, క్రిస్టియన్ పేట యూజీడీ పనుల్లో పోర్టల్ శాతాలకు, ఎల్వోఏ రిజిస్టర్కు మధ్య భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సదరు ఏజెన్సీకి సంబంధించి గుండారావుపేట, బండ్ల బజార్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ పరిసరాల్లో చేపట్టిన రూ. 2.02 కోట్ల విలువైన ఆరు సివిల్ పనులను రద్దు చేస్తూ, ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేస్తూ జీఎంసీ కమిషనర్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరికొంత మంది కాంట్రాక్టర్లు కూడా ఇదే జాబితాలో ఉన్నారు. జీఎంసీ చర్యను సవాల్ చేస్తూ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది అనంత వాదనలు వినిపించారు. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండా డిపాజిట్లు జప్తు చేయడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించారు. ఉభయ పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి.. పాత పనుల్లో అక్రమాలు జరిగాయన్న నెపంతో కొత్త టెండర్లను రద్దు చేయడం, డిపాజిట్లను జప్తు చేసే అధికారం జీఎంసీకి లేదని స్పష్టం చేశారు. కమిషనర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రొసీడింగ్స్ను పూర్తిగా రద్దు చేశారు. పిటిషనర్కు సంబంధించిన ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ను తీర్పు ప్రతి అందిన ఆరు వారాల్లోగా రీఫండ్ చేయాలని జీఎంసీని ఆదేశించారు. -
నగర ఖాళీల సంస్థ!
సిబ్బంది నిల్.. ఒత్తిడి ఫుల్.. అవినీతి హల్చల్ అవినీతికి ‘ఇన్చార్జ్’లునెహ్రూనగర్: రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పాలనను పట్టించుకోని సర్కారు వైఖరితో నగరంలో పౌరసేవలు అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సేవలందించాల్సిన స్థానిక సంస్థను ఖాళీల సమస్య దారుణంగా వేధిస్తోంది. మొత్తం 110 మంజూరైన క్యాడర్ పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 46 మంది మాత్రమే విధుల్లో ఉండగా, ఏకంగా 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 58 శాతానికి పైగా పోస్టులను భర్తీ చేయకుండా గాలికొదిలేయడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నికల నిర్వహణ ఎలా? ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ చివరినాటికి నిర్వహించాలని ప్రభుత్వం ముమ్మరంగా యోచిస్తోంది. అయితే కార్పొరేషన్లో సిబ్బంది కొరతతో ఈ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా సాధ్యమనేది ఇప్పుడు ‘మిలియన్ డాలర్ల ప్రశ్న’గా మారింది. ఉన్న సిబ్బందిని ప్రభుత్వం ఎడాపెడా అదనపు బాధ్యతలతో ముంచెత్తుతోంది. ఓటర్ల జాబితా తయారీ కోసం, బీఎల్ఓ డ్యూటీలు, రోజుకో సర్వే చేయమంటూ ప్రభుత్వ ఆదేశాలు, వీటికితోడు నగర ప్రజల రోజువారీ దరఖాస్తులు, రెగ్యులర్ డ్యూటీలతో ఉద్యోగులు ఊపిరిసలపక నానా తంటాలు పడుతున్నారు. ఎస్ఈ విధుల్లోకి.. వస్తారా.. రారా? ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వర్లు గత రెండు నెలల క్రితం సెలవుపై విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఈఈ సుందరామిరెడ్డి ఇన్ఛార్జ్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇంజినీరింగ్ సెక్షన్లో దొంగ టెండర్లు, ‘లెస్’ మాయాజాలం సృష్టించి ప్రభుత్వ ఖజానాకు, కార్పొరేషన్కు కోట్ల రూపాయల నష్టం చేకూర్చిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఈ వ్యవహారం నగరంలో తీవ్ర దుమారం రేపింది. ఏసీబీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవుపై వెళ్లిన ఎస్ఈ తిరిగి విధుల్లోకి చేరతారా లేదా? అన్న అనుమానాలను సిబ్బందే బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 18 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు గాను 13 ఖాళీగా ఉన్నాయి. కేవలం ఐదుగురితో ఇంత పెద్ద నగరంలో రోడ్లు, కాలువల పనులను పర్యవేక్షించడం అసాధ్యంగా మారింది. ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. చేరిన నెలరోజుల్లోనే లీవ్లోకి ఏసీ.. కార్పొరేషన్లో కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు కూడా నిలకడలేకుండా పోయింది. కమిషనర్ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. అడిషనల్ కమిషనర్ (జీఎస్డబ్ల్యూఎస్) పోస్టు ఇప్పటికే ఖాళీగా ఉంది. డిప్యూటీ డైరెక్టర్ వంటి ఉన్నత స్థానాల్లోనూ ఎవరూ లేరు. కీలక అధికారులంతా సెలవులపై వెళ్లడం, పోస్టులు భర్తీ కాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు ఫైళ్ల రూపంలో మూలనపడుతున్నాయి. సంతకాలు పెట్టే దిక్కులేక పాలనాపరమైన అనుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. టౌన్ ప్లానింగ్ బేజారు.. అక్రమ నిర్మాణాల జోరు అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం ఖాళీల అడ్డాగా మారింది. ఏకై క టౌన్ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. 13 టీపీ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు ఉండగా ఒక్కరూ విధుల్లో లేరు. తొమ్మిది టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పోస్టుల్లో ఏకంగా ఏడు ఖాళీలే. నాలుగు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టుల్లో రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి, ఇన్ఛార్జ్ల అండదండలతో నగరంలో అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగర పాలనను మాత్రం పూర్తిగా గాలికొదిలేసింది. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్లో మంజూరైన ఐదు మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో ఒక్కరూ పనిచేయడం లేదు. మొత్తం ఐదు పోస్టులూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో ముగ్గురు శానిటరీ సూపర్వైజర్ పోస్టుల్లో ఒక్కరూ లేరు. 24 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండగా, 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న కీలక స్థానాల్లో రెగ్యులర్ అధికారులను నియమించకుండా, ఉన్న అరాకొర సిబ్బందికే ప్రభుత్వం ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెడుతోంది. అయితే ఈ తాత్కాలిక పాలన నగరంలో అవినీతి దందాలకు రాచబాటగా మారింది. అదనపు పోస్టులను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం,ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో సామాన్యులను, వ్యాపారులను నిలువునా పిండుకుంటున్నారు. ఎవరిపై నిఘా లేకపోవడం, రేపోమాపో ఇంకొకరు వస్తారనే ధీమాతో విచ్చలవిడిగా ‘ముడుపుల’ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వైభవంగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం
నగరంపాలెం: స్థానిక నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొలువైన శ్రీవీరభద్రస్వామి ఆలయ 25వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు పోలీస్ అధికార, సిబ్బంది ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతోపాటు జిల్లా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ బృందంలోని ఐదుగురు వేద పండితులు ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం, కుటుంబాల శ్రేయస్సు, జిల్లా ప్రజల శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వందలాది మందికి అన్నదానం చేశారు. డీఎస్పీలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), శంకరయ్య (ఏఆర్) దంపతులు, ఏఆర్ ఆర్ఐలు శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గ్రీన్ వాక్
గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్వాక్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్వాక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్లను ఆన్లైన్లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు. మ్యూజికల్ నైట్కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్కు చెందిన పుసులూరి దిలీప్కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెరిట్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి
● జీఓ 102ను రద్దు చేసి 151 ప్రకారం వైద్య సీట్ల భర్తీ చేయాలి ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య ప్రవేశాలకు 2020 డిసెంబరు 4న విడుదల చేసిన జీఓఎంఎస్ నంబరు 151ని అమలు కొనసాగించాలని, 2026 జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102ను పునః పరిశీలించాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం అమరావతి రోడ్డులోని ఆలా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. జీవో ఎంఎస్ నంబరు 102తో నిబంధనలు డబ్ల్యూపీ నంబరు 11018/2019లో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా 2020 డిసెంబరు 4న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబరు 151ని జారీ చేసిందన్నారు. నాటి నుంచి జీఓఎంఎస్ నంబరు 151కనుగుణంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జీఓకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు రాలేదన్నారు. ఈ జీఓ రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థుల ప్రయోజనాలు కాపాడిందని వివరించారు. అయితే నేడు అన్ని ఐచ్చికాల పద్ధతిని నిలిపివేయాలన్న ప్రదిపాదన, హైకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ప్రవేశ విధానం స్ఫూర్తి, లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్ నంబరు 151 కింద ఏర్పాటు చేసిన పారదర్శక యంత్రాంగం ఏ మాత్రం పక్కకు వెళ్లినా అది రిజర్వేషన్ల సమర్థంగా అమలుపై ప్రతికూట ప్రభావం చూపి విద్యార్థులకు అనవసరమైన ఆందోళనకు గురికావచ్చని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీఓ నంబరు 102 రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థులకు నష్టం కలిగించడమే కాకుండా సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102లోని నిబంధనలను పునః పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్ని ఎంపికల విధానాన్ని కొనసాగించాలని, జీఓ 151ని మార్పులు చేయకుండా అమలు చేయాలని కోరారు. సమావేశంలో కొరివి వినయ్కుమార్ పాల్గొన్నారు. -
తైక్వాండోలో గుంటూరు జిల్లా ఓవరాల్ చాంపియన్
తెనాలి: అమరావతి తైక్వాండో అసోసియేషన్(గుంటూరు) ఆధ్వర్యంలో తెనాలిలో రెండురోజులపాటు నిర్వహించిన 5వ ఏపీ స్టేట్ సబ్జూనియర్, 3వ ఏపీ స్టేట్ కిడ్స్ తైక్వాండో చాంపియన్షిప్–2026లో గుంటూరు జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్లో ఈ పోటీలను నిర్వహించారు. విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రన్నర్స్గా, అనకాపల్లి తృతీయస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చాంపియన్షిప్లో తెనాలికి చెందిన తైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు. అమరావతి తైక్వాండో అసోసియేషన్, గుంటూరు కార్యదర్శి బండారు దానిశ్వరరావు పర్యవేక్షించారు. -
పీజీఆర్ఎస్కు డుమ్మా కొడితే చర్యలు
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ముఖ్యమైన కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరవుతున్నట్లు గుర్తించామన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దూరప్రాంతాల నుంచి అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన అర్జీలను కలెక్టర్తోపాటు జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా మైనారిటీ అధికారి జె.పార్థసారథి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
జీఎంసీకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
నెహ్రూనగర్: వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) జాతీయ స్థాయిలో సత్తా చాటి ఒకే వేదికపై రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కై వసం చేసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ – 2026’ పోటీల్లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుని ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ’గా గుర్తింపు పొందింది. అలాగే రాష్ట్రస్థాయి వార్డుల కేటగిరీ–2 విభాగంలో నగరంలోని 42వ వార్డు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అదనపు కార్యదర్శి అమన్దీప్ గార్గ్ల చేతుల మీదుగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వందలాది నగరాలతో పోటీపడి గుంటూరు నగరం రెండో స్థానంలో నిలవడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. జీఎంసీ ఇన్చార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ అనిల్కుమార్, కోమలి పాల్గొన్నారు. న్యూఢిల్లీలో అవార్డులు అందుకున్న కమిషనర్ కె.మయూర్ అశోక్ -
వెనిగండ్లలో మహిళ దారుణ హత్య
బంగారం, నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు పెదకాకాని: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చిన ఘటన పెదకాకాని మండలం వెనిగండ్లలో చోటు చేసుకుంది. దుండగులు ఇంట్లో ఉన్న నగదు, నగలు అపహరించుకుని వెళ్లారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామానికి చెందిన దాది కోటేశ్వరమ్మ(48)కు గోరంట్ల గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. సుమారు 20 ఏళ్ల కిందట భర్తతో మనస్పర్ధలు రావడంతో పిల్లలతో కలసి స్వగ్రామం వెనిగండ్లలోనే నివసిస్తోంది. ఏడాది కిందట కుమార్తె బంతిని తన మేనల్లుడు సాయికి ఇచ్చి వివాహం జరిపించింది. గత రెండు నెలలుగా గ్రామంలోని కొండమడుగుల సంజీవరెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని ఆమె తన కుమారుడు సాధిక్ నివసిస్తున్నారు. సాధిక్ గుంటూరు ఆటోనగర్లో షెడ్డులో మెకానిక్గా పనిచేస్తున్నాడు. గేదెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న కోటేశ్వరమ్మ అనారోగ్యం కారణంతో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన సాధిక్ తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షల నగదు, 8 సవర్ల బంగార ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లో పొలం అమ్మిన డబ్బులు, బంగారం ఆభరణాలు ఉన్నట్లు పక్కా సమాచారంతో తెలిసిన వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటానని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. -
ఏడిపింఛెన్..!
తొలి రోజేస్వర్ణ–2 కార్యాలయం బయట నిరీక్షిస్తున్న వృద్ధులు రెండేళ్లుగా పింఛను కోసం ఎదురుచూసి, ఎన్నో ఆశలతో కొత్త పింఛనుకు దరఖాస్తు చేసుకుందామని సోమవారం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వారికి తొలి రోజే చుక్కలు కనిపించాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సేవ పోర్టల్ కొంత సేపు సర్వర్ డౌన్ అవ్వడం, మరికొంత సేపు నెమ్మదించడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజంతా కార్యాలయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రత్తిపాడులోని స్వర్ణ–1లో మూడు, స్వర్ణ–2లో రెండు, స్వర్ణ–3లో మూడు దరఖాస్తులు మాత్రమే సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ అయ్యాయంటే సర్వర్ ఎంత స్లోగా ఉందో చెప్పకనే తెలుస్తుంది. – ప్రత్తిపాడు -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
చారిత్రక నవలల అధ్యయనం ద్వారానే నాగరిక సమాజాభివృద్ధి
నగరంపాలెం: గత కాల సామాజిక, నాగరికత, రాజకీయ సాంస్కృతిక, నేపథ్యాలు తెలుసుకునేందుకు చారిత్రక నవలల అధ్యయనం దోహదపడతాయని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అన్నారు. ఆదివారం నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య వసతిగృహ సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగులో చారిత్రక నవలలు అంశంపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. రచయిత కోసూరి రవికుమార్ అధ్యక్షత వహించారు. అడవి బాపిరాజు చారిత్రక నవలపై షేక్ రెహమానుద్దిన్, అనువాద చారిత్రక నవలలపై సూరిప్రసాద్, నోరి నరసింహశాస్త్రి, చారిత్రక నవలలపై పిన్నమనేని మృత్యుంజయరావు పత్ర సమర్పణ చేశారు. మధ్యాహ్న సభలో రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ సిహెచ్.సుశీలమ్మ అధ్యక్షత వహించారు. విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక నవలపై కె. మురళీకృష్ణ, వర్తమాన కాలంలో చారిత్రక నవలలు అంశంపై మారుతీ పౌరోహితం, ఎం.శివప్రసాద్ చారిత్రక నవలలపై ఎస్.జ్యోతి పత్ర సమర్పించి మాట్లాడారు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి షణ్ముఖానంద, రచయిత మోదుగుల రవికృష్ణ, డాక్టర్ వి.సింగారావ్, భూసరపల్లి వెంకటేశ్వర్లు, రావెల సాంబశివరావు, కె.శివప్రసాద్, కె.దయానంద్ పాల్గొన్నారు. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
జీఓ నంబర్ 33 తక్షణమే రద్దు చేయాలి
లక్ష్మీపురం: తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ మార్పిడిలకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్ 33ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో వీడియో విడుదల చేశారు. గతంలో కిడ్నీ మార్పిడిల పేరుతో అనేక అక్రమ దందాలు జరిగాయని, కోట్లాది రూపాయల వ్యాపారం సాగడంతోపాటు పేద, సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు. కిడ్నీ మార్పిడిలో రక్త సంబంధీకులకు మాత్రమే అవకాశం ఉండేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత జీవో నం.33 ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు కిడ్నీ మార్పిడిల విషయంలో మరింత అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో నంబర్ 33ను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
యంత్రాలపైనా మాయ మాటలే!
● సర్కారు యంత్రాల కోసం 1,943 మంది అన్నదాతల నిరీక్షణ ● ఖరీఫ్ ముగుస్తున్నా ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి ● రూ.3.30 కోట్ల నిధులున్నా పథకం అమలులో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కొరిటెపాడు (గుంటూరు): రాయితీపై వ్యవసాయ యంత్రాలను పొందే రైతులకు ప్రభుత్వం పలు కఠిన నిబంధనలను విధించింది. లబ్ధిదారులకు సొంత భూమి ఉండటంతో పాటు కనీసం మూడు సార్లు ఈ–పంట రికార్డుల్లో నమోదు చేయించి ఉండాలి. గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భూమి రికార్డులను సమర్పించిన రైతుల ఆన్లైన్ దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా ఎంపికై న అర్హుల జాబితాపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతకం చేసిన తర్వాత ఐదు రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. మే నెలలోనే 1,943 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాయితీ ట్రాక్టర్లు, యంత్రాలను పంపిణీ చేయలేదు. నిధులున్నా నిర్లక్ష్యమే.. పథకంలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ సామగ్రి, స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లలా తొమ్మిది రకాల యంత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుంటూరు జిల్లా కోటా కింద 880 యూనిట్లకు రాయితీగా రూ.3.30 కోట్లను కేటాయించింది. ఇందులో ఇతరులు, జనరల్ కోటాకు రూ.2.55 కోట్లు, షెడ్యూల్డ్ కులాల కోటాకు రూ.58 లక్షలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోటాకు రూ.17 లక్షలను కేటాయించారు. ఖరీఫ్ ముగుస్తున్నా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 67 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సాగు పనుల ప్రారంభంలోనే సబ్సిడీ యంత్రాలను అందజేసి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. సీజన్ అంతా ముగిసిపోయిన తర్వాత ఇస్తే తమకేం లాభమని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో పండుగ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పరికరాలు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్ సామగ్రి, రోటోవేటర్లు, స్ప్రేయర్లు అందజేశారు. నాడు రైతు సంక్షేమంపై ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. కానీ నేడు టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.– ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని అన్నదాతలకు కష్టాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రైతులను ఏ మాత్రం ఆదుకోని సర్కారు.. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, మద్దతు ధర కల్పించడం వంటి అన్ని విషయాల్లోనూ రైతులకు అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) కింద సబ్సిడీ యంత్రాల పంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. -
రూ.53.76 కోట్లతో ‘నవ గుంటూరు’ నిర్మాణం
నెహ్రూనగర్: గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.53.76 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ మేరకు 6 ప్రధాన విభాగాలలో నగరవ్యాప్త పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం రూ.17.93 కోట్లతో బీఆర్ స్టేడియం, కలెక్టరేట్, చుట్టుగుంట, నాజ్ సెంటర్ తదితర 7 ప్రధాన జంక్షన్లను సుందరీకరించనున్నట్లు చెప్పారు. రూ.7.30 కోట్లతో మహిళ, సూపర్ హీరో వంటి వినూత్న కాన్సెప్టులతో ఆరు థీమ్ పార్కులు, రూ.7.01 కోట్లతో నగరంలోని 21 ప్రాంతాల్లో నైబర్హుడ్ పార్కులను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతను చాటుతూ విజయవాడ–గుంటూరు ప్రవేశ మార్గంలో రూ.1.59 కోట్లతో ‘మిర్చి థీమ్ పార్క్’ నిర్మించనున్నామని పేర్కొన్నారు. రూ.10.58 కోట్లతో 30 అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లను, పచ్చదనం పెంచేందుకు రూ.9.34 కోట్లతో 13 మార్గాలలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో గుంటూరు సమగ్రంగా రూపాంతరం చెందనుందని కమిషనర్ పేర్కొన్నారు. -
వినాయక మండపాలకు ఆన్లైన్లో అనుమతులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని నేరుగా పరిశీలించాలని సూచించారు. ప్రజా, అత్యవసర వాహనాల రాకపోకలు, విద్యుత్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు పరిశీలించాక అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, విద్యుద్దీపాల ఏర్పాట్లల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రధాన రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. నిఘా పెంచాలి నిమజ్జన ఊరేగింపు తేదీలు, మార్గాలను ముందుగా సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలు వద్దని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం స్పష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● పరీక్షల్లో అవకతవకలకు కారణమైన వారూ ఉత్తమ అధ్యాపకులేనట! ● ఎవరేమనుకున్నా పట్టనట్టుగా పాలకుల వ్యవహార శైలి ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం వెనుక లోకేశ్, చంద్రబాబులకు ఉన్న ప్రత్యేక సామాజిక ప్రేమను తెలియజేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. విద్యావ్యవస్థ ఏమైతే తమకేంటి, తమ వర్గ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు విపరీతమైన ధోరణిని అవలంబిస్తున్నారని కూడా కొందరు మండిపడుతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. విద్యారంగంలో విశేష సేవలు అందించడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలిచిన వారిని ఉత్తమ గురువులుగా ఎంపిక చేయడం పరిపాటి. విద్యార్థులను తీర్చిదిద్దడం, విద్యార్థుల మన్ననలు అందుకోవడం, విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం, వాటి అమలుకు కృషి వంటివి కూడా ఆయా గురువులకు ఉండాల్సిన లక్షణాలు. ఇతర అధ్యాపకులకూ ప్రేరణ కలిగించేలా ఉత్తమ అవార్డుకు ఎంపికై న వారు ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఉత్తమ అధ్యాపకుల జాబితా చూస్తే అందరూ విస్తుపోవాల్సిందే. పాలకుల సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) అధ్యక్షుడు బీఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అనుబంధ సంస్థగా ఏర్పడిన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్మెంట్లతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అన్ని పోరాటాలకు ఏఐబీఈఏ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రుణాల ఎగవేతపై ఆందోళన.. కొన్ని కార్పొరేట్ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను ఎగవేయడం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభనష్టాల ఒడిదుడుకులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సంస్థలకు తక్కువ మొత్తానికి సెటిల్మెంట్లు చేయడం వలన బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోందని వెల్లడించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. సమావేశంలో మూర్తి, రాధాకృష్ణమూర్తి, నాగపావని, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, వెంకటేష్ తదితర నాయకులు ప్రసంగించారు. నూతన కార్యవర్గం.. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా చైర్మన్గా పీవీ రాఘవరావు, అధ్యక్షుడుగా టి.హరనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.షణ్ముఖరావు, కోశాధికారిగా ఎం.నరహరి ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ బ్యాంకుల బలోపేతం లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
లలిత పీవీఎస్లో వైద్య విద్యకు ప్రాధాన్యం
గుంటూరు మెడికల్: లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైన నాటి నుంచి అకాడమిక్స్, వైద్య వృత్తిపరమైన విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని సంస్థ చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ రాఘవ శర్మ అన్నారు. ఆదివారం గుంటూరు తక్కెళ్లపాడులోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో లలిత సీఎంఈ సిరీస్ లో తొలి కార్యక్రమంలో పెరిఫెరల్ న్యూరోపతిలో ఆధునిక పరిణామాలు అనే అంశంపై సైంటిఫిక్ సీఎంఈ నిర్వహించారు. లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ముంబై బాంబే హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ గౌరవ అతిథిగా , లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు పీజీ వైద్య విద్యార్థుల కోసం లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్లో క్రమం తప్పకుండా అకాడమిక్ సెషన్లు, క్లినికల్ మీటింగ్స్, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, న్యూరో సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధుల ప్రాబల్యం నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. వ్యాధులను ఏవిధంగా గుర్తించి చికిత్స అందించే విషయాలను వివరించారు. సంస్థ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాంబే హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ ‘ఎమర్జింగ్ ల్యాండ్ స్కేప్ ఆఫ్ ఇమ్యూనో– మీడియేటెడ్ న్యూరోపతిస్’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఆర్ మురళీధర్ రెడ్డి ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ డయాబెటిక్ న్యూరోపతిస్ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ నిమ్స్కు చెందిన డాక్టర్ వై.శిరీష ప్రాక్టికల్ అప్రోచ్ టు పెరిఫెరల్ న్యూరోపతి అనే అంశంపై ప్రసంగించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ మధు నాగప్ప ఇన్ఫెక్షయస్ న్యూరోపతిస్ అనే అంశంపై మాట్లాడారు. ముంబైకి చెందిన డాక్టర్ విన్నీ విల్సన్ ఆధ్వర్యంలో పెరిఫెరల్ న్యూరోపతి పై క్విజ్ నిర్వహించారు. సీఎం ఈ కార్యక్రమానికి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డాక్టర్ తారక్నాథ్, డాక్టర్ యు.వీరమ్మ, డాక్టర్ బి.సాయికృష్ణ, డాక్టర్ గాజుల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన వైద్యులు, న్యూరాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు, వివిధ మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్కి చెందిన పి.జి వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
తుళ్లూరు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ప్రమాదం
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యాన ఆదివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజంలో విద్యావ్యాప్తికి ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్పీఎల్టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పయర్థ నాగయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైందని, తమ సంస్థ ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పని చేస్తోందని తెలిపారు. 110 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను సత్కరించి, పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మలినేని విద్యాసంస్థల అధినేత మలినేని పెరుమాళ్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాల తెలుగు సహచార్యులు డాక్టర్ బూసి వెంకట స్వామి, ఏపీ రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు, కాటూరి హైస్కూల్ డైరెక్టర్ కాటూరి వెంకటేశ్వరరావు, ఎస్పీఎల్టీవో కార్యదర్శి ఎం.రాకేష్, పాఠశాల అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, జాతీయ సమన్వయకర్తలు పి.రాజారత్నకుమార్, లేళ్ల కోటేశ్వరావు, జాతీయ ఉమెన్స్ సమన్వయకర్త దాసరి నాగమణి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఆర్.రాము పాల్గొన్నారు. 48 గంటల్లో బాలికను పట్టుకున్న పోలీసులు లక్ష్మీపురం: సాంకేతిక పరిజ్ఞానంతో 48 గంటల వ్యవధిలో బాలికను పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన ఆదివారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్తంభాలగరువు సాయినగర్కు చెందిన కాసిమళ్ల నారాయణ వద్ద మనవరాలైన బాలిక పెరుగుతుంది. బాలిక ఇంటి దగ్గరలోని డ్రై క్లీనింగ్ షాప్లో పనిచేస్తోంది. ఆగస్టు 31వ తేదీ సా యంత్రం 07.30 గంటలకు తన ఇంటిలోని చెత్త పారేసివస్తానని తాతయ్యకు చెప్పి బయ టకు వెళ్లిన అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. నారాయణ చుట్టు పక్కల ఎంత గాలించినా కనిపించకపోవడంతో ఈనెల 3వ తేదీన పట్టాభిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో బాలిక ఇంటి నుంచి విజయవాడ వెళ్లి అక్కడ నుంచి వైజాగ్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక వైజాగ్లో ఉన్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం వైజాగ్ వెళ్లి బాలికను గుంటూరు తీసుకు వచ్చారు. వెస్ట్ తహసీల్దార్ కిరణ్కుమార్ సమక్షంలో బాలికను నారాయణకు అప్పగించారు. బాలిక ఆచూకీని గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
డిసెంబరు 1–3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’
లక్ష్మీపురం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘బడ్లావ్ జరూరీ హై’ నినాదంతో దేశవ్యాప్త పోరాటాలకు సీపీఐ సమరశంఖం పూరించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 12 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రైతులు, కార్మికులు, సామా న్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడం, రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లను నీరుగార్చే విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ విషయంలో అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట చెబు తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై దేశమంతా స్పందిస్తే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబునా యుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏ మాత్రం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగ ర కార్యదర్శి ఆకిటి అరుణ్కుమార్, నాయకులు మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, రాధాకృష్ణమూర్తి, బీవీఆర్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ్ణ -
ప్రతిభకు పట్టం
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం శనివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఎంపిక చేసిన 85 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పాల్గొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
భావితరాలకు గురువులే మార్గదర్శకులు
గుంటూరు ఎడ్యుకేషన్: భావితరాలను సన్మార్గంలో నడిపే బాధ్యత గురువులపైనే ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నెలకొల్పడమే ధ్యేయం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు విలువలు నేర్పాలన్నారు. ఇది సమాజానికి గొప్ప పెట్టుబడి కాగలదని పేర్కొన్నారు. విలువలు అనే పునాదిపై సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఇది ఉపాధ్యాయుల చేతిలో ఉందని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, మంచి సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలో ఉంటారని, వారిని చక్కగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు అందించాలని సూచించారు. విద్యార్థులు అనుకున్నది సాధించే వరకు కృషి చేసేలా ప్రేరణ కల్పించాలన్నారు. ఒత్తిడిని, ఓటమిని తట్టుకునే శక్తి కలిగి ఉండే విధంగా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. గాంధీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లోనే యావత్తు దేశాన్ని మమేకం చేశారన్నారు. భావితరాలకు ఏం కావాలో ఆలోచించి, అందుకు అవసరమైన మెట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఆచార్యుడిగా, తత్వవేత్తగా నిలిచారని తెలిపారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసే వారు ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు విశ్లేషణ శక్తిని కల్పించాలని సూచించారు. ఉన్నతమైన వృత్తి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న పవిత్రమైన వృత్తిలో ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని చెప్పారు. అనంతరం 85 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ విద్యా సంస్థల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ బి. వందనాదేవి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, సమగ్రశిక్ష ఏపీసీ ఐ. పద్మావతి, డీవైఈవోలు జి. ఏసురత్నం, శాంతకుమారి, ఎంఈవోలు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకలకు టీడీపీ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఏడాదికోసారి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకునే కార్యక్రమం వైపు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఉపాధ్యాయులను గౌరవించుకునే కార్యక్రమానికి వారు రాలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో ఉపాధ్యాయులలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. -
మిర్చి యార్డులో ఎగుమతి వ్యాపారుల ఐపీ కలకలం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా సుమారు రూ.కోటి మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 46 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో రూ.కోట్లలోనే నిత్యం లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం విదేశీ మార్కెట్లకు తరిలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు రూ.కోట్ల మేరకు ఐపీ పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం చర్చనీయాంశమైంది. మరో ఇద్దరిపై చర్చ.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు మిర్చి ఎగుమతి వ్యాపారులు కూడా ఐపీ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. వారు కూడా ఐపీ దాఖలు చేస్తే దిగుమతి వ్యాపారులపై ఆర్థిక ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఇదేం... విభజన?
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చిన బహిరంగ కుట్రలా కనిపిస్తోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్లను ఏకంగా 76కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అగ్గి రాజేస్తోంది. క్షేత్రస్థాయి భౌగోళిక సరిహద్దులు, సహజ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం, కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి.. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లే అధికారులు జీ హుజూర్ అంటూ సరిహద్దులను గీసేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన కత్తి దూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రాంతాలను ఒక క్రమపద్ధతి లేకుండా రెండు మూడు డివిజన్లలోకి అడ్డగోలుగా ముక్కలు చేసి పంపించారు. అంతేకాకుండా, పలుచోట్ల సహజ హద్దులైన ప్రధాన రహదారులను కాకుండా నాలుగు అడుగుల సందులను బౌండరీలుగా చూపించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా భారీగా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతుచిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. ఉదాహరణకు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం లాంటి విలీన ప్రాంతాలను అసంబద్ధంగా కలపడం వల్ల స్థానిక ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. జన సైనికుల్లోనూ అసంతృప్తి సెగలు ఈ అశాసీ్త్రయ విభజన కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామి అయిన జనసేన కేడర్లోనూ అసంతృప్తి రగిలిస్తోంది. తమకు పట్టున్న డివిజన్లు, జనసైనికుల ప్రాబల్యం ఉన్న కాలనీలను కూడా అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా చీల్చి బలహీన పరిచారంటూ జనసేన స్థానిక శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. స్వప్రయోజనాల కోసమే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మ్యాపింగ్ చేయించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కమిషనర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీన సీడీఎంఏకు పంపడం, 13న సీడీఎంఏ తుది జాబితా ఖరారు చేసి, 14న ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్యాయంగా మార్చిన సరిహద్దులను సవరించాలంటూ నగరవ్యాప్తంగా నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి. -
వంతెన శిథిలం.. ప్రాణాలే పణం
గుంటూరుఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు కళావైభవం ఉత్సవాల్లో భాగంగా శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరినా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్కభాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా అటు టీడీపీ ప్రభుత్వం, ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో కూలిపోయే పరిస్థితి వచ్చిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన వంతెన 1877వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు కొమ్మమూరు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభమయ్యే పశ్చిమ ప్రధాన కాలువ 20 కిలోమీటర్ల దూరంలోని దుగ్గిరాల లాకుల వద్ద మూడు కాలువలుగా విడిపోతుంది. వాటిలో ఒక్కటైన కాలువపై చేబ్రోలు వద్ద బ్రిటిష్ వారు రాతి కట్టడాలు, ఇనుప రాడ్లతో ఈ వంతెనను నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ప్రమాదాలకు నిలయం గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది సంఖ్యలో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలతో రద్దీగా ఉంటుంది. వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వంతెన ఇరుకుగా ఉండటం, మలుపు వద్ద దారి తప్పడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6న టిప్పర్ లారీ అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్ను ఢీకొని 25 అడుగుల లోతున్న చానల్లో పడింది. ఆ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వంతెనపై నుంచి లారీ కాలువలో పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వంతెన పైభాగంలో పెద్ద గుంతలు పడటంతో బండరాళ్లను అడ్డుగా పెట్టారు. రైలింగ్ కూలిపోతే ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ప్రస్తుతం కూలిపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు మండిపడుతున్నారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం హెవీ లోడ్తో శుక్రవారం వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించడంతో వంతెన కూలిపోయినట్లు సమాచారం. లారీ సహా కాలువలో పడి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది. గతంలో ‘సాక్షి’ హెచ్చరించినప్పటికీ యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ వంతెన దుస్థితిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రూ.42.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆధునిక సాంకేతికతతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2023 ఆగస్టు నెలలో మద్రాసు కాలువపై 40 అడుగుల వెడల్పు రోడ్డు, 1.25 కి.మీ. మేర నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. కనీసం మొదటి దశ పనులు కూడా పూర్తి కాలేదు. పనుల్లో భాగంగా చేబ్రోలు వైపు తారు రోడ్డులో సగం వరకు తవ్వేశారు. దాని పక్కన పెద్ద గొయ్యి తీసి వదిలేశారు. ప్రమాదకరంగా ఉంచడంతో తాత్కాలికంగా కొంత మట్టి పోశారు. సమీపంలో డ్రెయిన్ ఉండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. బ్రిడ్జి రోడ్డు మలుపుగా ఉండటంతో సగం వరకు రోడ్డు కోసుకుపోయి ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తరచుగా ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. తాత్కాలికంగా రాళ్లు, ప్లాస్టిక్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. పురాతన బ్రిడ్జికి పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగితే ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంది. -
వివా వీవీఐటీయూలో ఘనంగా టీచర్స్ డే
పెదకాకాని: వివా, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీయూలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుకొండ సైనిక్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రతిష్టాత్మక రక్షణ మంత్రి ట్రోఫీ గ్రహీత గ్రంథి సర్వరాయుడు, ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కార గ్రహీత దారపనేని చినవెంగాయ, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి గ్రంథి సర్వరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో అత్యుత్తమంగా రాణించడానికి, విజయం సాధించడానికి బలమైన కాంక్షను పెంపొందించుకోవాలని సూచించారు. సంకల్పంతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, నిరంతర ప్రయత్నం కచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. దారపనేని చినవెంగాయ మాట్లాడుతూ విద్యార్థులు నేడు అత్యంత నూతనంగా, సృజనాత్మక కోణంలో ఆలోచనలు చేస్తున్నారని, వారి ఆలోచనా సరళికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు గ్రంథి సర్వరాయుడు, దారపనేని చినవెంగాయలను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గేయాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల విభాగం సభ్యులు, వీవీఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, వివా ప్రిన్సిపాల్ సిహెచ్.సరళ, వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లాకు హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు. మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. -
స్వాతంత్య్ర సమరయోధుల వారసుల ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత
గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుల వారసులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను లబ్ధిదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. వివరాలు.. అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 2010లో అప్పటి ఉన్నతాధికారులు సుమారు 70–80 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. అదే స్థలాలు గతంలో 1985లో వేరే వారికి కేటాయించగా వాళ్లు ఆ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవటంతో 2010లో ఉన్నతాధికారులు విచారించి గతంలో 1985లో ఇచ్చిన వారికి రద్దు చేసి 2010లో స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించి ఇళ్ల పట్టాలను మంజూరు చేసి అందజేశారు. అప్పటి నుంచి కొందరు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టి వదిలేయగా మిగిలిన వారు అక్కడ ఎటువంటి మౌలిక వసుతులు లేకపోవటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ఇటీవల కాలంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు కేటాయించిన స్థలాలకు డ్రెయినేజీ, తాగునీరు వసతులు కల్పించాలని తాము ఇళ్ళు నిర్మించుకుంటామని అభ్యర్థించారు. దీంతో కలెక్టర్ ఉన్నతాధికారులు ముందు ఇళ్లు నిర్మాణాలు చేస్తే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారుల రాకతో.. అనుమతి లేదని టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల అండతో పొక్లెయిన్తో నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లారు. దీంతో నిర్మాణాలు కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నామని లబ్ధిదారులు ఎదురుతిరిగారు. సర్దిచెప్పిన పోలీసులు దీంతో పోలీసులు ఇరువురికి సమన్వయ పరిచి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ కనీసం నిర్మాణాలు నిలిపేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఉన్నతాధికారుల అనుమతులతోపాటు టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్పటంతో లబ్ధిదారులు స్వాతంత్య్ర సమరయోధులకు ప్లానింగ్ అనుమతులు అధికారులే ఉచితంగా ఇవ్వాలని చట్టాలే చెబుతున్నాయని సూచించారు. దీంతో అధికారులు చేసేది లేక కనీసం అర్జీలైనా పెట్టుకోవాలని అనుమతులు ఉచితంగానే ఇస్తామని, చెప్పి అనుమతులు వచ్చే దాకా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పి వెళ్లారు. ఉన్నతాదికారులు విచారించి తమ స్థలాల్లో తాము ఇళ్లు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు. -
సోషల్ మీడియాలో ఫొటోలు పెడతామంటూ బెదిరింపులు
● రూ.87,000 కాజేసిన నిందితులు ● నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు గుంటూరు రూరల్: సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తిని బెదిరించి నగదు కాజేసిన కేసులో ముగ్గురు నిందితులను నల్లపాడు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.87,000 స్వాధీనం చేసుకున్నారు. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. సంగడిగుంటకు చెందిన తూమాటి పాల్, శ్రీరామ్ అరుణ్కుమార్, ఉయ్యాల రితిక్ అలియాస్ హృతిక్లు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలు, ఇతరల పేర్లుతో ట్రాప్ చేసి పర్సనల్గా మాట్లాడి రికార్డింగ్లు, ఫొటోలు సేకరించి బెదిరించి డబ్బు కొట్టేయటం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వారికి పరిచయమైన వ్యక్తిని ఏటుకూరు బైపాస్, బుడంపాడు బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి, అక్కడ నిందితులు బాధితుడిని బెదిరించి, అతనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను తీసి, వాటిని కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి, రెండు బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.87,000 బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. అభినందించిన జిల్లా ఎస్పీ బాపట్లటౌన్: ఉద్యోగంతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026లో పట్టణ సీఐ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో బాపట్ల టౌన్ పోలీస్స్టేషన్ సీఐ రాంబాబు విశేష ప్రతిభ కనబరిచారు. లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని కై వసం చేసుకున్నారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సీఐను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, వివిధ పోలీస్ విభాగాల నుంచి ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇనన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మొత్తం 20 మందికి పైగా లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో పోటీ పడ్డారన్నారు. వారందరినీ అధిగమించి బాపట్ల టౌన్ ఇన్న్స్పెక్టర్ విజేతగా నిలిచి ట్రోఫీని గెలుచుకోవడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. -
ఎస్టీయూ కార్యాలయం ఉద్యమ కేంద్రం
మంగళగిరి టౌన్: ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎస్టీయూ–ఏపీ రాష్ట్ర నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కేవలం సంఘపరమైన అంశాలుగా కాకుండా విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కార్యాలయం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి, సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్టీయూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాలు ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిర్వహించిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ– ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్. సాయిశ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి.సదానందం గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ కె.వి.శేఖర్, మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముర్తి, గాజుల నాగేశ్వరరావు, తిమ్మన్న, రమేష్ పాల్గొన్నారు. -
7వ తేదీ లోగా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోండి
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాడీపేటలోని శ్రీమేధ విద్యాసంస్థల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ నందకిషోర్, కరస్పాండెంట్ అన్నా శ్రీలక్ష్మి శ్రీకృష్ణునికి పూజ నిర్వహించారు. క్యాంపస్ ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందకిషోర్ మాట్లాడుతూ అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు శ్రీకృష్ణావతారాన్ని దాల్చారని అన్నారు. భగవద్గీత ద్వారా సామాన్య జీవితాన్ని ఏ విధంగా జీవించాలో, ధర్మాన్ని పాటించే విధానం, సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలను తీసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని బోధించారని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ (2026)లో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈనెల 1–4 వరకు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఫైరింగ్ విభాగంలో ఎస్బీ సీఐ ఏ.మల్లికార్జునరావు స్టెన్ గన్ ఈవెంట్లో ద్వితీయ, కార్బైన్ ఈవెంట్లో తృతీయ స్థానంలో, వెయిట్ లిఫ్టింగ్్ 85 కిలోల విభాగంలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు గోల్డ్ మెడల్, కబడ్డీలో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి, పట్టాభిపురం పీఎస్ మహిళా కానిస్టేబుల్ తిరుపతమ్మ గుంటూరు రేంజ్ నుంచి రెండో స్థానం సాధించారు. హ్యాండ్ రైజింగ్లో ఎస్బీ మహిళా కానిస్టేబుల్ క్రాంతికుమారి సిల్వర్ మెడల్, కె.వేణుబాబు ఆధ్వర్యంలో గుంటూరు డాగ్ స్క్వాడ్కు చెందిన ‘సింబా’ నార్కోటిక్ టెస్ట్ విభాగంలో రెండో స్థానం సాధించారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలువురు వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి ప్లకార్డులు చేతపట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈనెల 8 నుంచి విధులు బహిష్కరిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ విధులు బహిష్కరించి నిరసన కొనసాగిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్
వాహనదారులపై 501 చలానాలు, రూ.3.33 లక్షల జరిమానా నగరంపాలెం: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమల్లో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకు విస్తృత తనిఖీలు కొనసాగించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 501 చలానాలు నమోదు చేసి, రూ.3.33 లక్షల జరిమానా విధించారు. హెల్మెట్ ధరించని వాహనదారులు, కార్లలో సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లపై 120 కేసులు, ట్రిపుల్ రైడింగ్పై 12 కేసులు, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై 37 కేసులు, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసిన వారిపై ఎనిమిది కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై 16 కేసులు, వాహనానికి సైలెన్సర్ లేని ఒకరిపై ఒక కేసు, 12 మంది మైనర్లపై, మోటారు వాహన చట్ట ఉల్లంఘించిన వారిపై 314 కేసులు నమోదు చేశారు. హెల్మెట్ వాడకంపై 18 రోడ్డు భద్రత అవగాహన, 250 మంది డ్రైవర్లు, 300 మంది విద్యార్థులు, 255 మంది ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. -
నీటి ప్రవాహం మృత్యుపాశమై..
సంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. -
‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో పాల్గొనండి
లక్ష్మీపురం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఏపీసీఓఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రణభేరి–ఇక సమరమే’ సదస్సులో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ బి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే పోరుబాటకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ బి ముత్యాలరావు, సీఐటీయూ కోశాధికారి ఎం.సాంబశివరావు, వివిధ విభాగాల రాష్ట్ర జిల్లా నాయకులు ఎస్ శ్యామ్, వి రమేష్బాబు, సీహెచ్ గోపాలకృష్ణ, పి శ్రీనివాసరావు, రామకృష్ణలు పాల్గొన్నారు. -
పోలీసుల చిత్రహింసలతోనే గోపి మృతి
తాడికొండ: పోలీసుల చిత్రహింసల వలనే ఆటో డ్రైవర్ చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. పొన్నెకల్లులో మృతుడు గోపి కుటుంబాన్ని సీపీఎం, కేవీపీఎస్, రైతు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు దాడి చేయడంతో కొట్టిన దెబ్బల కారణంగా గోపి అనారోగ్యానికి పాలయ్యాడని అన్నారు. చికిత్స నిమిత్తం గోపిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ డాక్టర్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన తెనాలి తరలించి అక్కడ చికిత్స అందించారని చెప్పారు. గోపి ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ గోపి మృతి చెందాడన్నారు. న్యాయవిచారణ చేయాలని డిమాండ్చేశారు. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో పోలీసుల దెబ్బలకు తాళలేక ఒక దళిత యువకుడు చనిపోతే మూడు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా, చర్చ జరుగుతున్నా ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్పందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో పోలీసులు పనికట్టుకొని దళితులపై తప్పుడు నేరారోపణ చేసి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నవీన్ అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కంచమాటి అజయ్ కుమార్, చింతల భాస్కరరావు, బరక వెంకటేశ్వర్లు, ఏరువ అంజిరెడ్డి, బాణావత్ భద్రయ్య, జోషి పాల్గొన్నారు. గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: దళిత సంఘాల డిమాండ్ తాడికొండ: దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి హింసించిన కేసులో చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కుల వివక్ష పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మాల్యాద్రి అన్నారు. శుక్రవారం తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని మృతుడు చీకటి గోపి కుటుంబాన్ని దళిత సంఘాల నాయకులు పరామర్శించి, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల్యాద్రి మాట్లాడుతూ చీకటి గోపీ మరణానికి కారకులైన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్రం మాట్లాడుతూ చీకటి గోపీ అనే దళిత యువకుడిని సీఐ ఉమేష్, ఎస్ఐ జోజి, కానిస్టేబుళ్ళు మురళీ, ముస్తఫాలు తీసుకొచ్చి దొంగతనం కేసులో విచక్షణా రహితంగా కొట్టడంతోనే మరణించాడన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరివి వినయ్ కుమార్, భీమ్ సేన సేవాదళ్ అధ్యక్షుడు నల్లపు నీలాంబ్రం, పాటిబండ్ల కోటేశ్వరరావు, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బెన్నిస్ రాయ్, దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి విల్సన్, చార్వాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ పాల్గొన్నారు. -
అమ్మవారికి ‘వైఎస్సార్ సీపీ’ నగల సమర్పణ
పెదకాకాని: పవిత్ర శ్రావణ మాసంలో శివాలయంలో మాయమైన బంగారు ఆభరణాలను సమర్పించడానికి వెళితే టీడీపీ గూండాలు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకాని శివాలయంలో ఆగస్టు 14వ తేదీన అలంకరించిన బంగారు ఆభరణాలు, మంగళసూత్రాలు, నాన్తాడు మాయమయ్యాయని 19వ తేదీన అర్చకులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు రోజుల పాటు కేసు నమోదు చేయకపోవడంతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. అలాగే 27వ తేదీన నగర సంకీర్తన నిర్వహించి అమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మీదేవి రూపు సమర్పించిన సంగతి విదితమే. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, మంగళగిరి, తాడికొండ, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, వరికూటి అశోక్బాబు, స్థానిక నాయకులతో కలిసి అంబటి మురళీకృష్ణ ఆలయానికి వెళ్లేందుకు సమీపంలో ఉన్న మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మవారి అనుగ్రహంతో ఆలయానికి చేరుకుని నాన్తాడు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎమ్మెల్యే అండతోనే టీడీపీ నేతల ఆగడాలు వైఎస్సార్ సీపీ నాయకులు అమ్మవారికి ఆభరణాలు సమర్పించడానికి శివాలయానికి వెళితే ఆ రోడ్డుపై టీడీపీ వారు పసుపు నీళ్లు చల్లడం దారుణంగా ఉందని అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ, పది రోజుల క్రితం నగర సంకీర్తన చేసి మంగళసూత్రాలు సమర్పించాం. నాన్తాడు శుక్రవారం రోజున సమర్పిస్తామని ప్రకటిస్తే, స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రెస్మీట్ పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యలకు పాల్పడ్డాడన్నారు. ఆలయాల్లో రాజకీయ కుట్రలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఎమ్మెల్యే డైరెక్షన్తోనే టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి చేరి ఆలయానికి వెళుతున్న పార్టీ నాయకులను అడ్డుకోవడం, బైఠాయించడం, గొడవలు సృష్టించారన్నారు. టీడీపీ వాళ్లు కేవలం గొడవలు సృష్టించడానికే రోడ్డుపైకి వచ్చారన్నారు. బెల్ట్షాపు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని పాలకవర్గ సభ్యులుగా కొనసాగిస్తున్న ఘనత టీడీపీకే దక్కిందన్నారు. భక్తులందరి సహకారంతో అమ్మవారి ఆభరణాలు సమర్పించడంతో తన జన్మ సార్థకమైందని భావోద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి, ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పేద రోగుల మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది. అత్యవసర వేళ వెటకారం తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు. ఎంతో కీలక ఆసుపత్రి జీజీహెచ్కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు. సీఎస్ఆర్ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జీజీహెచ్లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నారు. తీరు మార్చుకోని అఽధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. వైద్యం కోసం ఆశగా వచ్చిన పేదరోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా జీజీహెచ్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. -
కొంతమేర కూలిన కొమ్మమూరు చానల్ బ్రిడ్జి
చేబ్రోలు: కృష్ణా డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ, రవాణా రంగంలో మైలురాయిగా నిలిచిన చరిత్రాత్మక కొమ్మమూరు కాలువపై పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చేబ్రోలు వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరింది. శుక్రవారం కాలువకు ఒక వైపు ఉన్న వంతెన పక్క భాగం కొంతమేర కూలిపోయింది. గత జూలై నెలలోనే ఈ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని సాక్షి దినపత్రికలో ‘నాడు మోక్షం.. నేడు నిర్లక్ష్యం’ అనే శీర్షికన కథనం వెలువడింది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఈ రోజు ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పిన పెను ప్రమాదం హెవీ లోడ్తో వెళ్తున్న లారీ వంతెన పైభాగానికి వచ్చే సమయానికి ఎదురుగా వాహనం రావడంతో కొంత పక్కకు వచ్చి పైన ఉన్న కొండరాళ్లను ఎక్కించటంతో బలహీనంగా ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం. త్రుటిలో లారీకి పెను ప్రమాదం తప్పింది. లారీ సహా కాలువలో పడి ఉండే ప్రాణనష్టం జరిగి ఉండేది. వాహనాల రాకపోకల ఒత్తిడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కూలిన వంతెన కొంత భాగం వద్ద అధికారులు ప్లాస్టిక్ బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి పొన్నూరు, గుంటూరు, బాపట్ల, రేపల్లె, చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెనపై ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు ప్రయాణిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. -
నృసింహుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పతకాలు సాధించి ఆల్రౌండర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో రజతం, స్విమ్మింగ్లో 25 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, గుంటూరు: పెదకాకానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సిద్ధమయ్యారు. అంబటి మురళీకృష్ణను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. పెదకాకాని ఆలయానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అంబటి మురళి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారుమల్లాది విష్ణు కారుపై దాడికి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి మంగళసూత్రం మాయం నేపథ్యంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఇవాళ నాంతాడు సమర్పిస్తానని వారం రోజులు క్రితమే అంబటి మురళి ప్రకటించారు. అంబటి మురళితో పాటు కొంతమంది భక్తులు కొత్త నాంతాడు తయారు చేయించారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను ఆలయం వైపు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
భూ సమీకరణకు 14.36 ఎకరాలు అందజేత
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్కు తుళ్లూరు బాలఏసు ఆంధ్రా క్యాపిచున్ సొసైటీ (ఏసీఎస్) తుళ్లూరు పరిధిలోని 14.36 ఎకరాలను ఇచ్చేందుకు సమ్మతించింది. ఏపీ సీఆర్డీఏకు ఇచ్చేందుకు ఈ మేరకు అంగీకార పత్రాలను సంబంధిత తుళ్లూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. పద్మావతికి యూనిట్ కార్యాలయంలో గురువారం అందించారు. సొసైటీ తరఫున కాసు కరుణాకర్ రెడ్డి వాటిన అందజేశారు. నలుగురిపై కేసు నమోదు పెదకాకాని: రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు, సిబ్బంది గురువారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. తక్కెళ్ళపాడు నుంచి అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్కార్ట్గా వెళుతున్న మరో వాహనాన్ని పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన పసుమర్తి వెంకట హనుమంతురావు, తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన భరత్, పెదకాకాని గ్రామానికి చెందిన నాగరాజు, వాహన డ్రైవర్ కుంభా నాగ తిరుపతిరావులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు గురువారం పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. వీరికి వెంకటకృష్ణాపురం రేషన్ డీలర్ చంద్రిక సహకరించినట్లు చెప్పారు. -
ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్
తాడేపల్లి రూరల్: ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లి పట్టణ పరిధిలోని విద్యాశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు నిర్బంధించి తాడేపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేషన్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, యువజన సంఘం నాయకులు డి.వి. భాస్కర్ రెడ్డి, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, పల్నాడు, కోనసీమ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, హరీష్, కాకినాడ జిల్లా సహాయ అధ్యక్షులు నాగమణి, కడప జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి ప్రసాద్, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రమేష్ పాల్గొన్నారు. -
బాలిక ఆచూకీ గుర్తించేందుకు సిట్, టెక్నికల్ బృందాల ఏర్పాటు
త్వరలోనే బాలికను గుర్తిస్తామని వెల్లడించిన జిల్లా ఎస్పీ నగరంపాలెం: అదృశ్యమైన బాలిక ఆచూకీ గుర్తించేందుకు సిట్ ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గురువారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలిక అదృశ్యంపై జూన్ నెల్లో కేసు నమోదైందని అన్నారు. ఈ కేసుని త్వరితగతిన చేధించేందుకు ఇంతకు ముందు కూడా ప్రత్యేక బృందాలతో హార్డ్ వర్క్ చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాలో తిరిగొచ్చాయని అన్నారు. తొలుత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, తర్వాత కొయంబత్తూరు, కేరళ, హైదరాబాద్లోనూ ముమ్మరంగా గాలించారని అన్నారు. అదృశ్యమైన వాళ్లు ఫోన్లు మార్చుకుంటున్నారు, ఫోన్ నంబర్లు మార్చుకుంటూ వెళ్లారని చెప్పారు. ఎక్కడైతే వారిని గుర్తించామో, అక్కడ సీసీటీవీ పుటేజీలు పరిశీలించామని అన్నారు. సీసీటీవీ పుటేజీలో ఒకబ్బాయితో అమ్మాయి వెళ్లిందన్నారు. బాలిక తండ్రి కుమార్తె కనిపించడంలేదనే హైకోర్టులో పిల్ వేశారని అన్నారు. దీనిపై హైకోర్టు కొన్ని సూచనలు చేసిందన్నారు. దీంతో సిట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక సాంకేతిక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అదృశ్యమైన బాలికను గుర్తిస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఙానం ఉన్న రోజుల్లోనూ బాలిక ఆచూకీ గుర్తించకపోవడం ఏంటని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు జిల్లా ఎస్పీ స్పందిస్తూ ప్రతి నేరం డిఫరెంట్గా ఉంటుందని, కండీషన్స్ డిఫరెంట్గా ఉంటాయన్నారు. కొన్ని కేసులు ఒకట్రెండు రోజుల్లో, మరికొన్ని పది రోజులు, ఇంకొన్ని నెల రోజులు, రెండు నెలలు, కొన్ని ఆరు నెలలు కూడా పడతాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఙానం ఉండి కూడా వంద శాతం త్వరగా పట్టుకుంటామనేది ఎక్కడ ఎవరూ కూడా చేయలేరన్నారు. ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసిన పట్టుకోలేరని చెప్పారు. పరారైన వారిలో లవ్ జిహాద్ ఉందా అనే ప్రశ్నకు తెలియదు అని జిల్లా ఎస్పీ బదులిచ్చారు. దానిపై ఎటువంటి కామెంట్ చేయరాదన్నారు. వారిని పట్టుకున్నా తర్వాత ఏంటనేది తెలుస్తోందన్నారు. -
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: పంచాయతీ కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ వీరికి ఇచ్చే జీతాల్లో ఎటువంటి పెరుగుదల లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు జి. రమణి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డీపీఓ కార్యాలయంలో డీఎల్పీఓ శ్రీనివాస్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నేలటూరి రత్నకుమారి అధ్యక్షత వహించగా, యూనియన్ జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాసరావు, పెరవలి శ్రీరాములు, ఇండ్ల అంకమ్మరావు, ఇజి చిన్న ఏడుకొండలు, బెన్నీ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ఆకలి కేకలు పాలకులకు పట్టవా?
ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కిరణ్కుమార్ గుంటూరు వెస్ట్: ప్రభుత్వ విధానాలకు అణుగుణంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించే ఉద్యోగుల ఆకలి కేకలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర శాఖ గుంటూరు జిల్లా చైర్మన్ కిరణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్లో జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నాలుగో రోజు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం నిర్వహించారు. కిరణ్కుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వాగ్దానాలను అమలుచేయకుండా కాగితాలకే పరిమితం చేశారని తెలిపారు. ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు రాకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఆకలి కేకలను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలకించాలనే ఉద్దేశంతోనే ఉద్యమం చేపట్టామని చెప్పారు. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ భువనేశ్వరి మాట్లాడుతూ తాము ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉద్యోగులుగానే పనిచేస్తున్నామని, కనీసం ఈహెచ్ఎస్ కూడా అమలు కావడం లేదని తెలిపారు. గుంటూరు రూరల్: జనసేన కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి కొట్టి, అసభ్య పదజాలంతో దూషించిన సంఘటనపై బాధితులు వట్టిచెరుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన జనసేన సీనియర్ నాయకుల విలేకరుల సమావేఽశంలో ప్రత్తి పాపారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలను తీసుకురావడానికి గుంటూరు వెళ్తున్న ఇద్దరు యువకులను మార్గంమధ్యలో అడ్డగించి, దాడి చేసి చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ముట్లూరు గ్రామానికి చెందిన ఎనుముల శౌరిశంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ముట్లూరు గ్రామ సెంటర్లో కూల్డ్రింక్ షాపు నిర్వహిస్తున్న శౌరిశంకర్ జనసేన పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు గుంటూరులో ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో శౌరిశంకర్, అదే గ్రామానికి చెందిన సంగా కార్తీక్ అలియాస్ సన్నీతో కలిసి ద్విచక్ర వాహనంపై గుంటూరు బయలుదేరారు. లేమల్లెపాడు గ్రామ శ్మశానవాటిక సమీపానికి చేరుకున్న సమయంలో ముట్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తమను వెంబడించి బైకును అడ్డగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బైకును అడ్డగించిన టీడీపీ నాయకులు ఎక్కడికిరా వెళుతున్నారని ప్రశ్నించగా ఫ్లెక్సీల కోసం గుంటూరు వెళ్తున్నామని చెప్పడంతో తమను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు సెల్ఫోన్, బైక్ తాళం తీసుకున్నారని ఆరోపించారు. సంగా కార్తీక్ను టీడీపీ నాయకులు చెంపపై కొట్టారని, అడ్డుకునే ప్రయత్నంలో శౌరిశంకర్ చేతికి గాయమైందని తెలిపారు. గ్రామంలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ, ఫ్లెక్సీలు కడితే చంపేస్తామని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి వట్టిచెరుకూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మాతృ మరణాలపై డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ జూలై, ఆగస్టు మాసాల్లో తెనాలి గంగానమ్మపేట, మందపాడులో ఒకటి మాతృ మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. వీటికి కారణాలు చర్చించి అందులో ఒకటి నివారించదగినదని, మరొకటి నివారించలేనిదని కమిటీ సభ్యులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటివి సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ అరుణ, డాక్టర్ చిట్టి బాబు, డాక్టర్ రాధిక రాయుడు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి , హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలి
జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు గుంటూరు మెడికల్: పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని జిల్లా జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ పిలుపుమేరకు గురువారం ఎన్జీవో రిక్రియేషన్ హాలులో గుంటూరు జిల్లా జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 5న జరగబోయే రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అందరి అభిప్రాయాల ఇవ్వాలని కోరారు. జిల్లా జేఏసీ కన్వీనర్ మొహమ్మద్ ఖాలీద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్లు మాట్లాడారు. జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం నాయకులు రామకృష్ణ (పి.ఆర్.టి.యు), షేక్ బాజీ (ఎస్టీయూ), షేక్ ఫైజుల్లా (డి.టి.ఎఫ్), రబ్బానీ, ఆంజనేయులు (ట్రెజరీ ), కె.కృష్ణయ్య (పెన్షనర్ సంఘం) జిల్లా జేఏసీ నాయకులు సుకుమార్, సయ్యద్ జానీబాషా, అనిల్, విజయ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణ్ కుమార్, కోటేశ్వరరావు, తాజున్నిసా, శ్రీవాణి (మహిళా విభాగం), ప్రోహిబిషన్ ఎక్సయజ్ కానిస్టేబుల్స్ రాష్ట్ర నాయకులు మార్పు కోటయ్య, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సుభాని, నర్సింగ్ అసోసియేషన్, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాస్థాయి గురుపూజోత్సవం
80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 80 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఇద్దరు హెచ్ఎంలు, స్కూల్ అసెస్టెంట్ కేటగిరీలో 32 మంది, ఎస్జీటీలు 44 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారందరూ శనివారం ఉదయం 8.00 గంటలకు హాజరు కావాలని సూచించారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.స్వరూప్కాంత్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్, యూనియన్ నేతలు రాజాకుమార్, శివరామ్, ఉషారాణి, కమల, సునీత, శ్రీదేవి, వినయ్, రవీంద్ర, శివగోపాల్, గాజుల రామకృష్ణ, టి.వి.శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సంతృప్తే ధ్యేయంగా సేవలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ప్రజల సంతృప్తే ధ్యేయంగా వారికి సేవలందించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి పెరగాలన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై సంబంధిత అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు కావాలన్నారు. జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ సక్రమంగా చేయాలని తెలిపారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తద్వారా ప్రజలు లబ్ధి పొందాలన్నారు. ప్రజలకు పథకాలు అమలైనప్పటికీ వాటిపై సంతృప్తి నూరు శాతం ఉండాలని చెప్పారు. సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, మంచి ప్రవర్తనతో మాట్లాడటం వలన సంతృప్తి స్థాయి బాగుంటుందన్నారు. ఇప్పటికీ కొందరు సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు మారడంలేదని తెలిపారు. మనమున్నది ప్రజలకు సేవ చేయడానికనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. అర్జీలు సమర్పించిన వ్యక్తులతో నేరుగా మాట్లాడి తగిన సమాచారాన్ని అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. కుష్టు సర్వే విజయవంతంగా నిర్వహించాలి జిల్లాలో కుష్టు వ్యాధి నియంత్రణకు చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు పక్కాగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. స్పష్టమైన పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ 1174 మంది ఆశా కార్యకర్తలతో పాటు ఏఎన్ఎం, పురుష సిబ్బంది సర్వేలో పాల్గొంటారని తెలిపారు. గతంలో చేపట్టిన సర్వేలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 20 కేసులు బయట పడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతుందని వివరించారు. కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ రమేష్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మార్చురీలో పైసాచికం
‘‘ పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం గుంటూరు జీజీహెచ్లో వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు రూ.5వేలుకు పైగా లంచం అడిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసే వైద్యులు రూ. 2వేలు, మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు మహాప్రస్థానం వాహన సిబ్బంది రూ.2వేలు, మృతదేహాన్ని అప్పగించే మార్చురీ సిబ్బంది రూ. వెయ్యికి పైగా లంచం అడిగినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటన కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద జరుగుతున్న తంతే.’’ మృతదేహం అప్పగించాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందే గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లోని శవాగారంలో మామూళ్లు మామూలయిపోయాయి. శవాలపై పేలాలు ఏరుకునే విధంగా తమ ఆప్తులు కోల్పోయి బాధాతప్త హృదయాలతో బంధువులు, కుటుంబ సభ్యులు ఉంటే.. మేం అడిగినంత సొమ్మిస్తే గానీ మృతదేహాన్ని ఇవ్వమంటూ.. కదలనీయమంటూ మార్చురీ సిబ్బంది చెప్పే మాటలు వారికి మరింత బాధ కలిగిస్తున్నాయి. ఎలాగోలా డబ్బులు పోగిచేసి ఇస్తూ.. మృతదేహాలను తమ ఊళ్లకు తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా.. దీనిపై ఆసుపత్రి అధికారులు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయవు మార్చురీ విభాగంలో గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మృతదేహాలు ఏ సమయానికి మార్చురీకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం ఎప్పుడు చేశారు, ఎప్పుడు మృతదేహాన్ని తరలించారనే విషయాలు సీసీ కెమెరాలు రికార్డయ్యేవి. అంతేకాకుండా మార్చురీలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు సైతం సీసీ కెమెరాల్లో ఆసుపత్రి అధికారులు చూసేవారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు వైద్యులు సకాలంలో చేయడం లేదన్న విమర్శలు వినిపించినప్పుడు మామూళ్లు అడుగుతున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి నిజనిర్దారణ చేసేందుకు ఆసుపత్రి అధికారులకు అవకాశం లేదు. నేడు మార్చురీ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న సీసీ కెమెరా పనిచేయడం లేదు. వెనుక వైపు ద్వారా వద్ద ఉన్న సీసీ కెమెరాలను తొలగించారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారనే విషయాలపై ఎవరికి అజమాయిషీ లేకుండా పోతుంది. మధ్యాహ్నం తరువాతే పోస్టుమార్టం మార్చురీలో మెడికో లీగల్ కేసులకు (ఎంఎల్సీ) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోస్టుమార్టం చేయాలని సమయాలను నిర్ధేశించారు. కాని జీజీహెచ్ మార్చురీలో మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకు ఒక్క పోస్టుమార్టం కూడా చేయరు. పోలీసులు వచ్చి తమకు పంచానామాలు అందించలేదని, అందువల్లే జాప్యం అవుతుందంటూ వైద్యులు బుకాయిస్తున్నారు. నిర్ణీత సమయానికి వైద్యులు రాకుండా సొంత వ్యవహారాల్లో తిరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చురీలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవడంతో తమ ఉద్యోగంపై ఎలాంటి భయాందోళనలు లేకుండా ఇష్టానుసారంగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహాప్రస్థానం వాహనం ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించాల్సి ఉండగా, వారు కూడా ప్రతి ట్రిప్పునకు రూ. 2వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు అంబులెన్సుల్లో తరలిస్తే రూ.10వేల నుంచి రూ. 20వేలకుపైగా డబ్బులు తీసుకుంటారని, వాహనం క్లీన్ చేసుకునేందుకు, తమకు భోజనం ఖర్చుల కోసం మంటూ రూ.2వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడుతున్నా ఆసుపత్రి అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. మరోపక్క వైద్యులు మార్చురీని కార్పార్కింగ్లా మార్చేసి తమ సొంత వాహనాలను ఎన్నడూ లేని విధంగా మార్చురీలోనే పార్కింగ్ చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి మార్చురీలో జరుగుతున్న మామూళ్ల రోగానికి చికిత్స చేసి వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు మెరుగు పడేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. పోస్టుమార్టం చేసేందుకు వైద్యులకు, పోలీసులకు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలంటూ కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. తమకు కూడా ఎంతోకొంత ముట్టజెబితేనే సత్వరం పోస్టుమార్టం చేసేందుకు ముందుకు వస్తున్నారు. లేని పక్షంలో పలు కారణాలు చెప్పి జాప్యం చేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతూ త్వరితగతిన పోస్టుమార్టం చేయాలంటూ మామూళ్లు ముట్టచెబుతున్నారు. -
కష్టాలతో చెలమి!
చెలమలు తవ్వుకుని పంటలు కాపాడుకునే యత్నం యనమదల సమీపంలో పొలాల్లో తవ్విన నీటి చెలమ ఎల్నినో పంజా విసరడం, వానలు జాడలేకపోవడం, సర్కారు కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయకపోవడంతో కర్షకులకు నీటి పాట్లు తప్పడం లేదు. సాగు చేసిన పంటను బతికించుకునేందుకు రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. ప్రత్తిపాడు మండలం యనమదల పరిసర ప్రాంతాల్లో రైతులు పత్తి, మిర్చి పంటలను సాగు చేశారు. నీరు లేక వడబడి ఎండిపోతున్న మొక్కలను కాపాడుకునేందుకు పొలాల్లో నీటి చెలమలు తవ్వుకుని వచ్చిన కొద్ది నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా మొక్కమొక్కకు ప్రాణం పోసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. – ప్రత్తిపాడు -
నిర్లక్ష్యం ఖరీదు..!
బాలిక మిస్సింగ్ ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు.. మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్స్ర్ట్రాగామ్లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్స్ర్ట్రాగామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. జూన్ 21వ తేదీన సికింద్రాబాద్లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం. -
చేనేత సహకార సంఘాలపై సర్కారు నిర్లక్ష్యం
మంగళగిరి టౌన్: చేనేత సహకార సంఘాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితో సహకార రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, మనుగడ సాగించడమే కష్టంగా మారిందని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు, నాయకులను సమాయత్తం చేసి తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఊసేది? ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2013 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్య పాలనకు దూరమయ్యాయని అన్నారు. రాజకీయ పదవులకు కాలపరిమితి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తున్న విధంగానే సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా చేనేత రంగానికి సంబంధించిన ట్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, మార్కెట్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ, రిబేట్ తదితర ఐదు సంక్షేమ పథకాల కింద సుమారు రూ.203 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేసి చేనేత కార్మికులు, సహకార సంఘాలను ఆదుకోవాలని కోరారు. కేడీసీసీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన రూ.46.19 కోట్ల రుణమాఫీ ఫైలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఫైలుకు ఆమోదముద్ర వేసి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం చేనేత రంగానికి రిజర్వు చేసిన వస్తువుల తయారీ, విక్రయాలపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చేనేత దుస్తులపై జీఎస్టీ రీఇంబర్స్మెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆప్కో నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.97 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో ఇప్పటికే సుమారు 300 సంఘాలు మూతపడ్డాయని, మిగిలిన సంఘాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోకన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, దామర్ల మోహన్, దొంతంశెట్టి సత్యప్రకాష్, గొట్టుముక్కల బాలాజీ, ఏ. నారాయణ, డోగిపర్తి రామారావు, పచ్చల థామస్, బండారు మస్తాన్, ఉట్ల సాంబశివరావు, వాసు, విజయ్కుమార్, కట్టా హేమసుందర్రావు, జ్ఞాన శంకరరావు, చింత వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేయండి -
సత్తా చాటిన క్రీడాకారులకు జేసీ అభినందనలు
గుంటూరు వెస్ట్: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పఠాన్ అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జేసీని కలిసి పతకాలతోపాటు సాధించిన కప్ను చూపించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను తమ లక్ష్యంగా మార్చుకోవచ్చన్నారు. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అప్రోజ్ ఖాన్కు ఉత్తమ క్రీడాభివృద్ధి అధికారి అవార్డు లభించడం పట్ల జేసి ప్రత్యేకంగా అభినందించారు. అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన అమరావతి చాంపియన్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు సాధించారు. బాస్కెట్బాల్ అండర్ – 23 పురుషులు, వాలీబాల్ అండర్ – 23 మహిళల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి విజేతలుగా నిలిచారన్నారన్నారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాధ్, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. -
ఫార్మసీ విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించాలి
● ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డెప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ ● చలపతిలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓరియంటేషన్ గుంటూరు రూరల్: ఫార్మసీ రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఔషధ నాణ్యత, భద్రత, తయారీ, పంపిణీ నియంత్రణ వ్యవస్థల్లో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కె.అనిల్ కుమార్ పేర్కొన్నారు. నగర శివారుల్లోని లాంలో చలపతి ఫార్మసీ కళాశాలలో బుధవారం 2026–27 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ, ఫార్మా డీ ఎం.ఫార్మసీ తరగతుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔషధం తయారీ దశ నుంచి రోగికి చేరే వరకు అనేక నాణ్యతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందువల్ల విద్యార్థులు డ్రగ్ రెగ్యులేషన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ వంటి అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఉమెన్న్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బి.వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కళాశాల దశ అత్యంత కీలకమైనదని, ఈ దశలో సంపాదించే జ్ఞానంతో పాటు వ్యక్తిత్వం, ఆలోచనా విధానం విలువలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.లక్ష్మణ్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగిన బాధ్యతాయుతమైన వత్తిలోకి ప్రవేశించబోతున్నారన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, గుంటూరు సీనియర్ మేనేజర్ కిరణ్ విక్టర్, చలపతి యూనివర్సిటీ ప్రో–చాన్సలర్ వై.సుజిత్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు మాట్లాడారు. -
కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట ఈస్ట్: కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లాల ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ‘టీమ్ పల్నాడు– ఏపీ పారా మెడికల్ జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్–2026 నోటిఫికేషన్లో పొందుపర్చిన విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో పూర్తి చేయాలని సూచించారు. ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులై, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీలో ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలి: దుబాయ్లో జరగనున్న సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు తెనాలికి చెందిన పల్నాటి నాగరాజు ఎంపికయ్యారు. చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ ఈ మేరకు సమాచారం పంపారు. గత ఆగస్టు నెలలో తునిలో సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించారు. తొలి సీజనులో ప్రతిభ చాటిన 24 మందిని దుబాయ్లో జరిగే టీ 20, వన్డే మ్యాచ్లకు ఎంపిక చేశామని తెలిపారు. ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రత్తిపాడు: మహిళల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమాలు 15వ రోజుకు చేరాయి. బుధవారం మధ్యాహ్నం రమాదేవి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి.వెంకట నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. నగరంపాలెం: ప్రజలు, ప్రభుత్వ అధికారులకు కొంత మంది వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పేర్లు, హోదాలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి నకిలీ ఫోన్ కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత/ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పీన్లు, ఇతరత్రా రహస్య సమాచారాన్ని తెలియజేయవద్దని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే స్థానిక పోలీస్స్టేషన్లోగానీ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, ఏఎస్పీ 94913 05638, డీఎస్పీ 92465 37807 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తాడికొండ పోలీసులు ● కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూదనరావు
చీకటి గోపి మృతిపై కేసు నమోదు తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్పై వచ్చిన ఓ కానిస్టేబుల్తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్.. గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ స్వరూప్ కాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు. -
పేదల గుండెల్లో వైఎస్సార్ పదిలం
గుంటూరు ఎడ్యుకేషన్/గుంటూరు లీగల్: పేదల కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన పాలకుడని మనసా వాచా కర్మణా విశ్వసించిన మహానేత డాక్టర్ వైఎస్సార్ జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడిగా నిలిచారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈసందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు వినగలిగితే చాలు, నా జన్మ ధన్యమైనట్టే అని భావించి, ఆ దిశగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి, తన సంక్షేమ సంతకంతో చెరిగిపోని జ్ఞాపకం మిగిల్చిన మరణం లేని మహానాయకుడిగా డాక్టర్ వైఎస్సార్ నిలిచారని కొనియాడారు. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో సరికొత్త సంక్షేమ అధ్యాయాన్ని లిఖించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని తెలిపారు. అందుకే సంక్షేమ పాలన గురించి ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా వైఎస్సార్కు ముందు, ఆ తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులతో ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్సార్ ఆశయ సాధనకై మేము సైతం అంటూ జగనన్న అడుగులో అడుగేస్తామని ప్రతినబూనడం ద్వారా ప్రతి ఒక్కరూ రాజన్నకు నిజమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. -
బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
తాడికొండ: తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయాల్సి వస్తుందని ఏపీ జేఏసీ అమరావతి యూనిట్ అధ్యక్షుడు బెజ్జం అశోక్ బాబు అన్నారు. బుధవారం అమరావతి యూనిట్ జేఏసీ సమావేశం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జం అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఏపీ ఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్లలో ఉద్యోగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షుడు దిబ్బయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నెక్కల్లు, తుళ్లూరు, శాఖమూరు, కొండమరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులకు బుధవారంరాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానం ద్వారా 37 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది, ఆ ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ– లాటరీ ద్వారా కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియ చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కెఎస్ భాగ్యరేఖ, సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో కలసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా 17 మంది రైతులకు 37 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 24 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 13 కమర్షియల్ ప్లాట్లు. ఈ సందర్భంగా డైరెక్టర్ కెఎస్ భాగ్యరేఖ మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జీఐఎస్ సిబ్బంది గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ల్యాండ్స్(క్యాపిటల్ రీజియన్) బి.గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.పద్మావతి, బి.సాయి శ్రీనివాస నాయక్, జి.మురళీధర్, ప్లానింగ్, ల్యాండ్స్, జీఐఎస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1976 – 2026 వరకు వివిధ సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు. సహకారం అందించాలి ఈ సందర్భంగా జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో బోధన, బోధనేతర సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. తమకు విద్యనందించిన విద్యాసంస్థకు పూర్వ విద్యార్థులు తిరిగి ఏమి అందించగలరనే ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం తదితర రంగాల్లో పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాలు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జునను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఆర్థిక పరిపుష్టికి తన వంతు సహకారం అందించినట్లు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి విశ్వవిద్యాలయం ఎంతో తోడ్పాటునందించిందని, వర్సిటీలోని గాంధీ అధ్యయన కేంద్రం అభివృద్ధికి కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు. విలువలు నేర్పిన వర్సిటీ మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. ఐదు దశాబ్దాల అనంతరం పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. నేటి విద్యార్థులు విద్యార్హతలతోపాటు మానవతా విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య త్రిమూర్తిరావు, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, పూర్వ విద్యార్థుల కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. చంద్రశేఖరరావు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పూర్వ విద్యార్థులను గుర్తించి ఆల్మునై అవార్డులు అందజేశారు. కళాశాలల వారీగా ఎంపిక చేసిన ఏడుగురిని ఘనంగా సత్కరించారు. ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కళాశాల నుంచి డాక్టర్ రావి వెంకట్రావు, సైన్స్ కళాశాల నుంచి ప్రొఫెసర్ ఎ.వి. దత్తాత్రేయరావు, ఫార్మసీ కళాశాల నుంచి డాక్టర్ టి. వెంకటసుబ్బారావు, ఇంజినీరింగ్ కళాశాల నుంచి జి. చంద్రరాజు, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాల నుంచి పి. తరుణ్కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నుంచి రాజేశ్వరి, దూరవిద్యా కేంద్రం నుంచి ఎం.ఎస్.కె. ప్రసాద్లకు పూర్వ విద్యార్థుల పురస్కారాలను అందజేశారు. -
ఇదేం ‘మాయ’రోగం?
గుంటూరు మెడికల్: దాతలు పెద్ద మనస్సు చేసుకుని రూ.100 కోట్లు విరాళాలు ఇచ్చి, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గర్భిణులు, బాలింతలు, మహిళలు, చిన్నారులు, పసికందులకు సూపర్స్పెషాలిటీ వైద్యం అందించేందుకు ఐదు అంతస్తుల్లో 600 పడకలతో భవన నిర్మాణం చేయించారు. దాతలకు తోడుగా ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందజేసింది. కార్పొరేట్ వైద్యసేవలను పేదలకు ఉచితంగా అందించేందుకు మార్గం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భవనాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. అయితే అందులోని వైద్య పరికరాలు కొన్ని మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి అధికారులు మాత్రం దాతలు, ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. రూ.100 కోట్లు ఇచ్చిన పూర్వ విద్యార్థులు.... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్లో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థులు పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. గుంటూరు జీజీహెచ్కు ఆరు జిల్లాల నుంచి వస్తున్న గర్భిణులు, బాలింతలు, సీ్త్రలు, పిల్లలకు పడకలు సరిపోక, నాణ్యమైన వైద్యం కోసం పడుతున్న అగచాట్లు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించేలా ఈ భవన నిర్మాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో కానూరి–జింకానా మాతా–శిశు సంరక్షణ సూపర్స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించారు. కానీ నేటి వరకు సదరు వైద్య విభాగంలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. డాక్టర్ యశస్వి రమణ సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో ఈ ఏడాది మే నెలలో పాత భవనంలో ఉన్న కాన్పుల విభాగం, పిల్లల వైద్య విభాగాలను ఎంసీహెచ్లోకి మార్చారు. కొన్ని రకాల వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లను సైతం ప్రారంభించారు. పూర్తిస్థాయిలో పరికరాలను వినియోగంలోకి తీసుకురాకుండా బాక్సుల్లోనే ఉంచారు. తీవ్ర ఆరోపణలు.... ప్రభుత్వం రూ.27 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఎంసీహెచ్ వార్డుకు పంపిణీ చేసింది. వాటిల్లో ఎన్ని వార్డుల్లో ఉన్నాయి, ఎన్ని మెడికల్ స్టోర్స్లో ఉన్నాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయి, ఎన్ని మూలన పడి ఉన్నాయనే లెక్కలు ఆస్పత్రి అధికారుల్లో ఎవరికీ తెలియకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వైద్య పరికరాలను తొలుత మెడికల్ స్టోర్స్లో స్టాక్ ఎంట్రీ చేసుకుని నిల్వ చేస్తారు. వార్డుల నుంచి వైద్య పరికరాలు కావాలని ఇండెంట్ పెడితే, స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుని సదరు వార్డుకు పంపిస్తారు. వార్డులో వైద్య పరికరాలు స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో ఉంటాయి. ఏయే వైద్య పరికరాలు వార్డులో ఉన్నాయి, వాటిల్లో ఎన్ని పనిచేస్తున్నాయి, ఏమైనా రిపేర్లకు గురైతే వాటిని వర్క్షాప్కు లేదా బయోమెడికల్ ఇంజినీర్ల వద్దకు పంపి రిపేర్లు చేయించడం వంటి పనులను నర్సింగ్ సిబ్బంది చూస్తారు. నూతన వైద్య పరికరాల గురించి ఎంసీహెచ్ వార్డుల్లో నర్సింగ్ సిబ్బందికి, మెడికల్ స్టోర్స్ ఇన్చార్జ్లకు తెలియకపోవడం పరిపాలనా తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీజీహెచ్లో కాంట్రాక్ట్ బయోమెడికల్ ఇంజినీర్లతోపాటుగా ప్రైవేటు కంపెనీ బయోమెడికల్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. కానీ సదరు కాంట్రాక్టర్ వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పందించాలని బాధితులు కోరుతున్నారు. వినియోగంలోకి తీసుకొస్తాం జీజీహెచ్లో కొన్ని వైద్య పరికరాలను కాంట్రాక్టర్ వినియోగంలోకి తీసుకురాకుండా వదిలివెళ్లిన విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు. కాంట్రాక్టర్తో మాట్లాడి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ సంస్థపై తాడేపల్లి రూరల్: వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేతిలో తాము మోసపోయామని ఆరోపిస్తూ, సదరు సంస్థపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు బుధవారం తాడేపల్లి ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల తరఫున నెల్లూరు నుంచి వచ్చిన ఏజెంట్లు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన మళ్లా విజయ్ ప్రసాద్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంస్థలో తాము కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పటికీ చాలామందికి ఒప్పందాల ప్రకారం రావాల్సిన మొత్తాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ కార్యకలాపాలు, మెచ్యూరిటీ బకాయిలకు సంబంధించి గతంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయినట్లు, సంస్థ వ్యవహారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనకు వెళ్లినట్లు తమకు తెలిసిందన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్నా బాధితుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంస్థ వ్యవహారాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోరారు. సంస్థకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలను గుర్తించి, వాటి విక్రయం ద్వారా వచ్చే మొత్తాలను బాధితుల బకాయిల చెల్లింపులకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బినామీ ఆస్తులపై కూడా విచారణ జరిపి, ఆస్తుల బదిలీలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని, బాధితుల క్లెయిమ్ల కోసం ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధుసూదనరావు, సుభాషిణి, బిల్లా లక్ష్మి దేవి, నాగేంద్ర కుమార్, ప్రసాద్, పద్మమ్మ, షరీఫ్, శ్రీనివాసులు, సుభాషిణి, లక్ష్మీదేవి, ఎస్.శ్రీనివాసులు, బ్రహ్మయ్య, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన మహిళల క్రికెట్ టోర్నీ పెదకాకాని: వీవీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్కే ప్రసాద్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య వీవీఐటీయూ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. మొత్తం 8 కళాశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో వీవీఐటీ వర్సిటీ జట్టు, విష్ణు వర్సిటీ జట్లు తలపడ్డాయి. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో వీవీఐటీయూ జట్టు విజయం సాధించగా, విష్ణు విశ్వవిద్యాలయం జట్టు రన్నరప్గా నిలిచింది. పోటీల ముగింపు కార్యక్రమంలో చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతగా నిలిచిన వీవీఐటీయూ జట్టుకు, రన్నరప్గా నిలిచిన విష్ణు విశ్వవిద్యాలయం జట్టుకు ట్రోఫీలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్.అరుణ్ కుమార్, ప్రకాష్ పాల్గొన్నారు. -
రాజన్నా.. మరువలేమన్నా...
నిత్యం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల జీవితాలను మార్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తొలుత వైద్యుడిగా పేదల బాధలను చూశారు... తర్వాత నాయకుడిగా ప్రజల సమస్యలను విన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం చూపించాలనే తపనతో పాలించారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ మహానేతను మరోసారి గుర్తుచేసుకున్నారు. – సాక్షి నెట్వర్క్ ప్రత్తిపాడులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్, నాయకులు -
వెళుతున్న బైక్పై నుంచి దూకిన యువకుడు మృతి
గుంటూరు రూరల్: ద్విచక్రవాహనంపై వెళుతూ ద్విచక్రవాహనంపైనుంచి దూకే క్రమంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చల్లా నాగవర్థన్రెడ్డి (25), అదే గ్రామానికి చెందిన మస్తాన్లు ఇద్దరు నల్లపాడులోని ఒక బార్లో మద్యం సేవించారు. అనంతరం గుంటూరువైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం నడుపుతున్న మస్తాన్ వాహనాన్ని అతి వేగంగా నడిపిస్తుండగా వెనుక కూర్చున్న నాగవర్థన్రెడ్డి భయపడి ద్విచక్రవాహనంపై నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనంపై నుంచి దూకటంతో స్పీడుకు తట్టుకోలేక రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్నాడు, అక్కడినుంచి పక్కనే ఉన్న పంచర్షాపులోని గాలి సిలెండర్కు ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మస్తాన్ అదేవిధంగా స్పీడు గా వెళుతూ రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. మస్తాన్కు గాయాలయ్యాయి. స్థానికులు మస్తాన్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించగా, నాగవర్థన్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోషకాహారంతో తల్లీబిడ్డలకు ఆరోగ్యం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి ప్రత్తిపాడు: పోషకాహారంతో తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి అన్నారు. ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రిలో పోస్ట్ నేటల్ మదర్స్ (బాలింతలు)కు ‘కాటూరి మాతా శిశు రక్షా కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్వో కిట్లను ప్రారంభించి, బాలింతలకు అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలను మెయిన్ రోడ్డు నుంచి ఆస్పత్రికి చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, ప్రసవం తర్వాత కూడా అన్నే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు పీహెచ్సీలు దత్తత.. కాటూరి యాజమాన్యం సీఎస్ఆర్ కింద గుంటూరు జిల్లాలోని కాకుమాను పీహెచ్సీ, పెదగొట్టిపాడు పీహెచ్సీ, కొండపాటూరు హెల్త్ వెల్నెస్ సెంటర్లను దత్తత తీసుకున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఆయా ఆస్పత్రులకు వారంలో ఒక రోజు ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్ వంటి స్పెషలిస్ట్ డాక్టర్లను పంపిస్తూ వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. ఈ–సంజీవని ప్రాజెక్టు అమలు బాధ్యతతో పాటు, ఆర్ఓ తాగునీటి ప్లాంట్ను కూడా మెడికల్ కాలేజీ తరఫున అందించడం జరుగుతుందని విజయలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా కాటూరి డైరెక్టర్ డాక్టర్ స్వైరారావు చేస్తున్న సేవలను డీఎంహెచ్వో అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. నాగేశ్వరరావు, గైనకాలజీ విభాగాధిపతి డా. బి. వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డా. కె. అరవింద, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. లత, ఆప్తమాలజీ విభాగాధిపతి డా. సి. మోహన్రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. అజయ్ పాల్గొన్నారు. -
గోపి మృతిపై న్యాయపోరాటం
పోలీసులపై చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగేంత వరకు పోరాటం ● విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లి.. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందిన గోపి ● మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు ● బాధితులకు అండగా ఉంటామని హామీ గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి (30) గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన వైనంపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటు వద్ద మృతదేహం పెట్టుకుని ఆందోళన చేశారు. గోపి భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాలవజ్రబాబు, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబులు సందర్శించి నివాళుల ర్పించారు. గోపి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు జ్వరంతో ఉన్న గోపీని వీపుపై, కాళ్లపై బాగా కొట్టారని, జీజీహెచ్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఆక్సిజన్ పెట్టాలని బతిమిలాడినా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే గోపి చనిపోయాడని కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీ నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని, పోలీసులపై కేసు నమోదు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జ్వరంతో ఉన్న గోపిని పోలీసులు భయపెట్టి పోలీసు స్టేషన్కు పిలిపించి చోరీతో సంబంధం లేకపోయినా చావగొట్టారు. పోలీసులు కొట్టారనడానికి వంటి మీద గాయాలే సాక్ష్యం. కొట్టిన అనంతరం అనారోగ్యంతో ఉన్న గోపికి చికిత్స చేయించకుండా ఏమీ కొట్టనట్లుగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈసంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దళితుడు, చిన్న కుటుంబానికి చెందిన గోపి పట్ల పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. దిక్కులేని వ్యక్తిని చూసినట్లుగా గోపిని పోలీసులు చూడడం చాలా బాధాకరం. చోరీతో సంబంధం లేని వ్యక్తిని చావగొట్టి, నడుము కింది భాగం, కాళ్లు పూర్తిగా పనిచేయకపోయినా పట్టించుకోకుండా ఆసుపత్రిలో చేర్పించకుండా కనీస జాలి, దయ చూపించకుండా కుటుంబ సభ్యులకు వదిలేయడం చాలా బాధాకరం. గోపికి మృతికి కారణమైన పోలీసులను తక్షణమే సస్పెండ్చేయాలి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. విజయవాడ లాకప్ డెత్ సంఘటన మరువకముందే మళ్లీ గుంటూరులో పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణం. గోపి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. గోపి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. – వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి గోపిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్లి విచారణ చేసి చావగొట్టారు. పార్టీలకతీతంగా గోపికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. – వరికూటి అశోక్బాబు, వైఎస్సార్ సీపీ వేమూరు ఇన్చార్జి -
రాజముద్ర
అభివృద్ధిపై రాజన్నా.. నిను మరువలేమన్నా సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజకీయ ఖిల్లా గుంటూరు జిల్లాపై దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. గుంటూరు జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆపార్టీకి అడ్రస్సే గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్ కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో పర్యటించి 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా చేశారు. ప్రభుత్వ కూర్పులోనూ జిల్లాకు పెద్ద పీట వేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి జిల్లాను మినీ కేబినెట్గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. రాజకీయ నాయకుల సంగతి పక్కనపెడితే ప్రజలు మాత్రం మహానేతను గుండెల్లో గూడుకట్టుకుని దైవంగా ఆరాధిస్తున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. బుధవారం దివంగత వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా కార్యక్రమాలు నిర్దహించేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. అనేక పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం ముఖ్యమంత్రి హోదాలో దివంత మహానేత వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో 57 సార్లు పర్యటించడం విశేషం. వివిధ గొప్ప పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. రాజీవ్ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. ఏడాదికి సగటున పది సార్లు మహానేత జిల్లాలో పర్యటించారు. ఇందిరప్రభ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా నుంచే ప్రారంభించారు. జిల్లాలో వందలాది మంది కార్యకర్తలను నేతలుగా తీర్చిదిద్దిన ఘనత దివంగత మహానేతదే. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకై క నేతగా, నిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రారంభించడం ఆనందించదగ్గ విషయం. గుంటూరు నగరంలోని సాయిభాస్కర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను మొట్టమొదటగా ప్రారంభించి అప్రతిహతంగా కొనసాగించారు. అలాగే జిల్లాలో ప్రారంభమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షల పై చిలుకు ఆపరేషన్లు జరుగ్గా ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందక నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాకు రాజకీయ ఉన్నతి కల్పించిన మహానేత డాక్టర్ వైఎస్సార్ రాజన్న మరణంతో జిల్లాలో ఆగిన గుండెలెన్నో అనేక రాష్ట్రస్థాయి పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం పులిచింతల ప్రాజెక్ట్ వైఎస్సార్ పుణ్యమే జిల్లా నుంచే ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం జిల్లాతో దివంగత మహానేతకు విడదీయరాని అనుబంధం మహానేత వర్ధంతికి భారీ ఏర్పాట్లు చేసిన అభిమానులు జిల్లా ప్రజలకు చిరకాల స్వప్నంగా నిలిచిన పులిచింతల ప్రాజెక్టును సాకారం చేసింది మహానేత వైఎస్సారే. అనేక అడ్డంకులు, అవరోధాలు దాటుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 అక్టోబరు 15న రూ. 682 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తనదనంతరం పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టు నిలిచిపోతే ప్రత్యేకదృష్టి నిలిపి, పర్యావరణ అనుమతులు సాధించి 2005 జూన్లో పనులను ప్రారంభించి ప్రతినెలా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయన మరణంతో పులిచింతల పనులు నత్తనడకన ఏళ్ల తరబడి కొనసాగాయి. అందుకే పులిచింతల పేరు వినగానే జిల్లా వాసులకు మహానేతే గుర్తుకువస్తారు. -
నేడు ఏఎన్యూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు తెలిపారు. ఏఎన్యూలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి 1976 నుంచి 2026 వరకు వివిధ సంవత్సరాల్లో వర్సిటీలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని చెప్పారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వర్తమానాన్ని అనుసంధానిస్తూ భవిష్యత్కు బలమైన బాటలు వేయడమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రధాన ఉద్దేశమన్నారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని పలు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి తెలిపారు. సెప్టెంబరు 8న నడక కార్యక్రమం, మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 11న నిర్వహించనున్న వర్సిటీ ఫౌండేషన్ డే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇప్పటికే సుమారు 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో సుమారు 1,500 మంది ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉందని వీసీ తెలిపారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించి, ప్రస్తుత విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. విశిష్ట పూర్వ విద్యార్థుల హాజరు.. సమ్మేళనానికి పలువురు ప్రముఖులు, విశిష్ట పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, సీఐడీ డీజీపీ డాక్టర్ ఏఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీఎస్సీహెచ్ఈ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె.రత్నషీలామణి, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్కే రత్నాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మాజీ డీజీపీ బండి మరియా కుమార్, ఏపీఎస్సీహెచ్ఈ ముఖ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.తిరుపతిరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం.ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారని వీసీ వివరించారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, పాలక మండలి సభ్యులు ఆచార్య త్రిమూరి రావు, పూర్వ విద్యార్థుల కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.చంద్రశేఖర్రావు, ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు. -
రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లా రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ధరల పర్యవేక్షక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతు బజార్లలో తగ్గింపు ధరలతో రెండు రకాల బీపీటీ రకం బియ్యం –స్టీమ్, పచ్చి బియ్యం విక్రయించడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ చూపించి 10 కిలోల వరకు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ ఫెడ్ ద్వారా వంట నూనెలు తగ్గింపు ధరలలో రైతు బజార్లలో అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. ఉల్లిపాయల విక్రయాలు విక్రయాలు పట్ల పౌరసరఫరాల కమిషనర్ ను కోరతామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, డీఎస్ఓ కోమలి పద్మ, ఆహార సలహా సంఘం సభ్యులు హరిబాబు పాల్గొన్నారు. గురుకులాల్లో విద్యార్థినులకు రక్షణ కరువు ఐద్వా ఆందోళన తాడేపల్లి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన, దళిత బాలికల గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వరసగా బాలికలు గర్భిణి దాల్చుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అత్యంత తీవ్రమైన విషయమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి రూరల్ కొలనుకొండలోని ఐద్వా కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పరిశీలనలో ఎక్కువ శాతం ఇటువంటి ఘటనలు గిరిజన, దళిత బాలికల హాస్టళ్లలోనే జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం హాస్టల్, కళాశాలల యాజామాన్యలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తి విఫలమవ్వడమేనని తెలిపారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంత పర్యవేక్షణ ఉండాల్సిన వ్యవస్థ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రుతుక్రమం, పోషకాహారం, శారీరక మార్పులు తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ చాలా హాస్టళ్లలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. రెడ్బుక్ నిర్వహణ, నెలవారీ హెల్త్ చెకప్లు, కౌన్సెలింగ్ వంటి ప్రక్రియలు సక్రమంగా లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు లేకపోవడం వలన నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఐటీడనే, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి గురుకులాల్లో బాలికల భద్రతకు ప్రత్యే కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. క్రెడిట్ కార్డు ద్వారా రూ.4.46 లక్షలు నగదు చోరీ లక్ష్మీపురం: క్రెడిట్ కార్డు ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు రూ.4.46 లక్షలు నగదు బదిలీ చేసుకున్న ఘటనపై అరండల్పేట పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్కి చెందిన తిరువీధి చెన్నగిరిరావు వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. చెన్నగిరిరావుకు ఆర్బీఎల్ బ్యాంకులో క్రెడిట్ కార్డు ఉంది. ఆగస్టు 17న క్రెడిట్ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ప్రమేయం లేకుండానే రూ.4.46 లక్షల నగదును బదిలీ చేసుకున్నారు. దీన్ని గమనించిన బాధితుడు చెన్నగిరిరావు దిక్కుతోచక అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ అయిన పాలిష్ వ్యాపారి హత్య
తెనాలిరూరల్: కిడ్నాప్కు గురైన పాలిష్ వ్యాపారి హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం నేపథ్యంలో బావమరిది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య(53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేస్తుంటాడు. 2006లో విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడే కుటుంబంతో నివసిస్తున్న అతడికి రెండేళ్ల కిందట 35 ఏళ్ల దీప్తితో అయిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీప్తితో తెనాలి వచ్చేసి ఇక్కడి నందులపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ తెనాలి ఆటోనగర్లో పాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెల 29వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఆచూకీ లేకుండాపోయాడు. 30వ తేదీ ఉదయం దీప్తి నాగమహేష్ కోసం ఆటోనగర్కు వెళుతుండగా అతడి ద్విచక్ర వాహనం, చెప్పులు సోమసుందరపాలెం శివారులో కనిపించాయి. స్థానికులను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారని చెప్పడంతో కిడ్నాప్కు గురైనట్లు నిర్ధారించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ నాయబ్రసూల్, ఎస్ఐ ఆనంద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించారు. భార్య, బిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తూ తెనాలిలోనే ఉంటున్న నాగవీరయ్యకు విజయవాడలో సుమారు మూడు కోట్ల విలువ ఉన్న ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అందులో కొంత భాగాన్ని విక్రయించి, తాను సహజీవనం చేస్తున్న మహిళ దీప్తికి ఇవ్వాలని లేదా ఆమె పేరున రాయాలని నాగవీరయ్య ప్రయత్నాలు ప్రారంభించిట్లు అతడి బావమరిదికి సమాచారం అందింది. తన సోదరి, ఆమె పిల్లలకు ఆస్తి దక్కకుండ చేస్తున్నాడన్న కోపంతో రేపల్లె సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో బావను హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకుని సుపారీ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నాగవీరయ్యను హతమార్చి ఓలేరు– రేపల్లె ప్రాంతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఇసుక దిన్నెల్లో పూడ్చిపెట్టినట్టు అనుమానిస్తున్నా రు. పూడ్చిపెట్టిన ప్రదేశం ఏ మండలం కిందకు వస్తుందో పరిశీలించి, సంబంధిత మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మృతదేహాన్ని వెలికి తీయించే అవకాశం ఉంది. మృతుడి బావమరిది, హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం! -
విద్యార్థులను ఇన్స్పైర్ చేసి బాల శాస్త్రవేత్తలుగా మార్చండి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్స్పైర్ మానక్ వేదికను ఉపయోగించుకుని అన్వేషణాత్మక ఆలోచనలు కలిగిన విద్యార్థులను ఇన్స్పైర్ చేసి బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో ఇన్స్పైర్ మానక్పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా అధ్యక్షత వహించారు. డీఈఓ మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో గట్టి ఆలోచనలు ఉంటాయని, వాటికి పదును పెడితే బాల శాస్త్రవేత్తలు తయారవుతారని అన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే వినూత్నమైన ప్రాజెక్టులను నామినేషన్లలో చోటు కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ పాఠశాలల నుంచి ఐదు నామినేషన్లు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వినూత్న ప్రాజెక్టులనే ఎంపిక చేసి ప్రాజెక్టు తయారీకి రూ.10 వేలు చొప్పున అవార్డును ప్రకటిస్తారన్నారు. గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించాలని అన్నారు. కార్యక్రమంలో రీసోర్సు పర్సన్లు అప్పారావు, శివ శంకరరావు, మల్లికార్జునరావు, గంగాధర్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, గుంటూరు, తెనాలి డివిజన్ల నుంచి 200 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ సలీమ్ బాషా -
టెట్ రద్దు డిమాండ్తో చలో విజయవాడ రేపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు, నిబంధనల సడలింపు డిమాండ్లతో ఈనెల 3న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం చలో విజయవాడ విజయవంతం కోరుతూ మార్కెట్ సెంటర్లోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఉపాధ్యాయుల బైక్ ర్యాలీని ప్రారంభించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్ను రద్దు, నిబంధనల సవరణ కోరుతూ జిల్లా, తాలూకా కేంద్రాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినా, ఎటువంటి స్పందన లేదన్నారు. ఉపాధ్యాయును తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ప్రత్యేక్ టెట్కు వ్యతిరేకంగా చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్, పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి ఉద్యోగుల జీవితాల్లో చీకటి రోజు అని, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ అమల్లోకి తెచ్చిన రోజు అన్నారు. అధికారంలోకి రాకముందు సీపీఎస్ రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సీపీఎస్ రద్దుతో పాటు ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ పరీక్ష రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ర్యాలీలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు జి.ఆదినారాయణ, గోవిందు, ప్రసాదు, రంగారావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్, వినోద్ పాల్గొన్నారు. -
ఓటుకు వేటు!
పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం వెంటాడుతోంది. పొన్నూరులో రెండేళ్ల పాలనలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో టీడీపీపై అసంతృప్తి భారీగా పెరిగిపోగా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమాన్ని చూసిన ప్రజలు వైఎస్సార్ సీపీ పాలనను కోరుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ‘సర్’ను అనుకూలంగా మార్చుకుని.. నియోజకవర్గంలో పట్టుకోసం గ్రామాలు, పొన్నూరు పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందినవారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో సర్ ప్రక్రియను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కారణాలతో ఫిర్యాదులు చేస్తూ వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలంగా లేని ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం పలు కారణాలతో నోటీసులు తీసుకున్న వారు తమ ఓటును నిలబెట్టుకునేందుకు అన్ని పత్రాలను సమర్పించినా అధికారుల లాగిన్లో నుంచి ముందుకు కదలడం లేదు. తమకు జరుగుతున్న అన్యాయంపై గుంటూరు కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్లో ఓటర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాయకుల ప్రమేయంతో ఓటును రిజెక్టు చేస్తే ఓటర్లకు సమాధానం చెప్పుకోవాల్సి రావడం.. ఓటు ఉంచితే అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సర్ ప్రక్రియకు సమయం తక్కువగా ఉన్న నేపధ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమస్యాత్మక గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి తమ ఓటు హక్కును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నీఛ రాజకీయాలు వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా కుట్రలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
వైద్య సేవలు నిలిపివేసి సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీఏ ఏపీ) గుంటూరు మెడికల్ కాలేజ్(జీఎంసీ) గుంటూరు యూనిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్లో సీనియర్ వైద్యులు అరగంట సేపు ఓపీ వైద్య సేవలు నిలిపివేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం 2016 నుంచి తమకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలన్నారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్, గుంటూరు అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్, యూనియన్ నేతలు డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ అజయ్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ వాసవి, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ శివగోపాల్, డాక్టర్ తబిత పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పౌష్టికాహారం అందించాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రధానమంత్రి పోషణ్ పథకం మరింత సమర్థంగా అమలయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి పోషణ్ పథకంపై జిల్లా స్థాయి స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టిక విలువలతో కూడిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోజనం తయారీలో పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వంటశాలలు, భోజన ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార స్థితిపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని, పథకం అమలులో ఎటువంటి లోపాలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల వారీగా పథకం అమలు తీరును సమీక్షిస్తూ అవసరమైన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ సలీం బాషా, డీఎస్ఓ కోమలి పద్మశ్రీ, సివిల్ సప్లయీస్ డీఎం నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి, ఐసీడీఎస్పీడీ ప్రసూన, అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ -
గుంటూరు
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వైఎస్ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనం ఎవరూ చెరపలేని, మరువలేని, మరపురాని సజీవ సంక్షేమ సంతకం పేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవం అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా శాశ్వతం వైద్యులుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం.. ఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జనసందోహం ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అనిర్వచనీయం.. జిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర అపురూపం నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం -
అమరావతిలో డెన్మార్క్ బృందం పర్యటన
తాడికొండ: భారత్–డెన్మార్క్ ఇంధన భాగస్వామ్య (ఐఎన్డీఈపీ) అమలులో భాగంగా రాజధానిలో మంగళవారం డెన్మార్క్ బృందం పర్యటించింది. రాజధానిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా అభివృద్ధి చేసే అంశాలపై ఏపీసీఆర్డీఏ అధికారులు, డెన్మార్క్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ముఖ్యంగా 33 కేవీ విద్యుత్ గ్రిడ్ ప్రణాళిక, డిజైన్, భవిష్యత్ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చలు చేశారు. అనంతరం అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్రెడ్డి రాయపూడి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఏఐసీసీ)లో డిజిటల్ ట్విన్ ద్వారా అమరావతి అభివృద్ధిని విజువల్ సిమ్యులేషన్ రూపంలో డెన్మార్క్ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస రావు, ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, జనరల్ మేనేజర్ ఎస్.జె.ఎస్.స్టీఫెన్, ఐటీ విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఎల్) ఏ.జెస్సికా రాజేశ్వరి పాల్గొన్నారు. -
రాహుల్కుమార్రెడ్డికి బంగారు పతకం
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్కుమార్రెడ్డికు రాష్ట్ర గవర్నవర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ను మంగళవారం అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాహుల్ కుమార్రెడ్డి మెడల్ అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో రెడ్క్రాస్ సేవల విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్, యూత్ రెడ్క్రాస్ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసినందుకుగాను, రెడ్క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపుగా రాహుల్ కుమార్రెడ్డికు ఈ పురస్కారం లభిందించారు. గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకున్న రాహుల్కుమార్రెడ్డికి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఫిట్నెస్తోనే సమర్థ పోలీసింగ్ మంగళగిరి రూరల్: ఫిట్నెస్, క్రీడలను పోలీసు సిబ్బంది వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని డీజీపీ హరీష్కుమార్ గుప్తా సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసు విధుల్లో కీలకమన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్న్ మైదానంలో మంగళవారం తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను ప్రారంభించారు. శాంతి కపోతాలు, బెలూన్లను గాలిలోకి ఎగురవేసి క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు రేంజ్లు, యూనిట్లకు చెందిన 16 జట్ల నుంచి సుమారు 1,900 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీలకు వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానాలు వేదికలుగా నిలుస్తున్నాయి. కార్యక్రమంలో పలువురు అదనపు డీజీపీలు మధుసూదన్రెడ్డి, ఆకే రవికృష్ణ,, బి.రాజకుమారి, సీహెచ్ శ్రీకాంత్, కేవీ మోహన్రావు, డీఐజీలు అన్బురాజన్, అమ్మిరెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. బోనబోయిన కేసులో నిందితుడి అరెస్టు గుంటూరు రూరల్: తనను ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలేనికి కు చెందిన కొందరు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం బోనబోయిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నల్లపాడు పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు. మరో నిందితుడు కంకర నరేంద్రరెడ్డిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నరేంద్రను కోర్టులో హాజరుపరచగా ఈనెల 11వ తేదీ వరకూ రిమాండ్ విధించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సంతకాలు సేకరించి నిరసన తెలిపిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పలువురు వైద్య సిబ్బంది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులరయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో స్టాఫ్నర్సులు రమాదేవి, రేణుక, భార్గవి, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, సుధ, రమేష్, సుధాకర్, శివలక్ష్మి, ఖాసీం, ఫార్మాసిస్టులు సుజాత, చంద్రకళ, శ్రీలక్ష్మి, సౌజన్యం, నాగుల్మీరా, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రావెల ఆరోపణలు నిరాధారం
గుంటూరు రూరల్: మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ఇటీవల చేసిన ఆరోపణలను రిజిస్ట్రేషన్ శాఖ మాజీ డీఐజీ చావలి బాలస్వామి, అడ్వకేట్ రాయపూడి మాణిక్యారావు, కాకుమాను పున్నారావు ఖండించారు. మంగళవారం అమరావతిరోడ్డులోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాలస్వామిపై నిరాధారమైన ఆరోపణలు రావెల కిషోర్ చేశారని చెప్పారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన కిషోర్బాబుపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల సమయంలో బాలస్వామి ద్వారా డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కిషోర్ బాబుపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. -
గ్రంథాలయంలో తనిఖీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమనేని వందనాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయం పనితీరు, అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలపై పాఠకులతో ఆరా తీశారు. పాఠకులకు అవసరమైన పుస్తకాలను రీడర్స్ ఆన్ డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేయాలని గ్రంథాలయ అధికారి షేక్ నాగుర్ బాషాకు సూచించారు. గ్రంథాలయానికి ఎక్కువ మంది పాఠకులు వచ్చేటట్లు, ఎక్కువ మంది సభ్యత్వం తీసుకునేటట్లు, చదువరులను ప్రోత్సహించాలని నాగుర్ బాషాకు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ స్వర్ణోత్సవాల సందర్భంగా 1976 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం సాగించిన 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్న్ను వర్సిటీ డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఏఎన్యూలో మంగళవారం ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, ప్రొఫెసర్ జి సింహాచలం తదితరులు ప్రారంభించారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాధించిన ప్రగతి, విద్యా, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో నమోదైన విజయాలు, ప్రముఖుల సందర్శనలు, ముఖ్యమైన కార్యక్రమాలు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కీలక ఘట్టాలను అరుదైన ఛాయాచిత్రాల రూపంలో ప్రదర్శనలో పొందుపరిచారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తేజోమూర్తి, ఫొటోగ్రాఫర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా మంగళవారం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయ అవరణను శుద్ధిచేసి భక్తులకు ఎనిమిది గంటలకు స్వామివారి అభిషేకం అనంతరం దర్శనాన్ని కల్పించారు. అనంతరం అర్చకులు ప్రధాన, ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేదపండితులు నవగ్రహామండ పారాధనతో దేవతలను అవాహన చేసి అగ్నిమదనంతో దీక్షాహోమాలు నిర్వహించారు. గురువారం పవిత్రోత్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవన ములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయఅర్చకులు తెలిపారు. మంగళగిరి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షుడు విలాస దాస తెలిపారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రోజంతా ప్రత్యేక దర్శనం, సంకల్ప అర్చన, మహాఅ భిషేకం, హరినామ సంకీర్తనం, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉట్టి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి ప్రత్యేక అభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. -
భూములిచ్చే వారికి రిటర్నబుల్ ప్లాట్లు
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతాడికొండ: రాజధానిలో రెండో విడత భూ సమీకరణలో భాగంగా భూములిచ్చే వారికి రిటర్నబుల్ ప్లాట్లను అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. తుళ్ళూరు మండలం పెదపరిమిలో భూసమీకరణపై జరిగిన గ్రామసభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ నిర్వహించారు. భూములు అందించిన వారికి సంబంధిత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఓటరు జాబితాపై గ్రామ సభలు నిర్వహించాలి గుంటూరు వెస్ట్: గ్రామ పంచాయతీల ఓటరు జాబితాపై గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారరు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది ప్రచురణ విడుదల చేసామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 2వ తేదీ నాటికి విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల పట్ల ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ గుంటూరులో నాటిన ప్రతి మొక్క బతకాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, సీపీఓ పి.శేషశ్రీ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, డ్వామా పీడీ వి.శంకర్, అధికారులు పాల్గొన్నారు. -
సర్కార్పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం మనసుతో ఆలకించాలంటూ వేడుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాలను విధించినా భుజానికెత్తుకునే ఉద్యోగులను పట్టించుకోకపోతే ఉద్యమ జెండా ఎత్తుకుంటామంటూ హెచ్చరించారు. తమకు రావాల్సిన బకాయిలు తమకు ఇప్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని, ప్రభుత్వం స్పందించకపోతే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మొదటి దశ నేటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 1న ‘‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’’ నినాదంతో సెల్ఫోన్ డీపీల ద్వారా నిరసన తెలుపుతామని చెప్పారు. 2 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. లంచ్ అవర్లో నిరసన చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చలు నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ ఉద్యమం ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా వర్క్ టూ రూల్ ఉద్యమం, సోషల్ మీడియాలో ప్రచారం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, నల్ల కండువాలతో నిరసన చేపడతామన్నారు. మానవహారం చేపడతామని తెలిపారు. 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. మా కష్టాలు పట్టవా సారూ.. ఏపీ ఆర్ఎస్ఏ మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ భువనేశ్వరి మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అంటూ నిట్టూర్చారు. కుటుంబంలో నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఉద్యోగులకు అప్పులు చేయనిదే కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఆర్ఎస్ఏ గౌరవ అధ్యక్షుడు కేవీ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఆపరేషన్కూ కునికిపాట్లు
గుంటూరుమంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026తాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ సోమవారం పరిశీలించారు. పేదలకు ఉపయోగపడే వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నానాటికీ దూసుకెళుతోంది. పలు జిల్లాలకు కీలకంగా ఉన్న గుంటూరు జీజీహెచ్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు కూడా బాలింతలకు సమస్యలు తప్పడం లేదు. అటు పాలకులు, ఇటు అధికారుల నిర్లక్ష్య వైఖరితో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్లకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఆ స్థోమత లేని పలువురు బాలింతలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. సమ్మె కారణంగా... గుంటూరు జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు ఆగస్టు మొదటివారంలో సమ్మె చేసిన విషయం విదితమే. ఆగస్టు 25వ తేదీ వరకు సమ్మె కొనసాగింది. సీనియర్ వైద్యులకు జీజీహెచ్లో ఓపీలో, ఇన్పేషెంట్ విభాగంలో, సర్జరీల్లో, ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉండి రోగులకు సత్వర వైద్య సేవలు అందించడంలో జూడాల పాత్ర చాలా కీలకం. సమ్మె వల్ల కుటుంబ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ వైద్యులు ఆపరేషన్లు నిలిపివేశారు. బాలింతలను సమ్మె అనంతరం రావాలని సూచించారు. సాధారణంగా కాన్పు వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. బాలింతలు కూడా ప్రసవం అనంతరం ఇలా చేయించుకోవడం ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిపివేయడం వలన పలువురు బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీల్లోనూ అదే దుస్థితి మరోపక్క జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నెలల తరబడి చేయకుండా వైద్యులు చోద్యం చూస్తున్నారు. పలువురు వైద్యులు శిక్షణ తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు. మరోపక్క ఆరోగ్య కేంద్రాల్లో తగిన వసతులు కూడా లేవని, అందువల్లే చేయడం లేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలు గ్రామీణ ప్రాంతాల బాలింతలు సైతం గుంటూరు జీజీహెచ్కు వచ్చి వెనుదిరుగుతున్నారు. గత నెలలో ఓపీ విభాగంలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగాన్ని నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లోకి మార్చే ప్రక్రియలో భాగంగా నెలకు పైగా ఆపరేషన్లు నిలిపివేశారు. నూతనంగా భవనంలోకి ఆపరేషన్ థియేటర్లు మార్చినప్పటికీ, ఆపరేషన్ థియేటర్ లైట్లు (ఓటీ లైట్లు) ఏర్పాటు చేయలేదన్న కారణంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. కుటుంబ నియంత్రణ విభాగంలో ఓపీ సేవలకు మాత్రం హాజరై బాలింతలకు కౌన్సెలింగ్ చేసి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు -
పరిష్కరించాకే అర్జీలను క్లోజ్ చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత ముగించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతోపాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని తెలిపారు. అనంతరం వచ్చిన 273 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, డ్వామా పీడీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, డీపీఓ సాయి కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, జిల్లా అధికారులు పరిశీలించారు. అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం కృష్ణబాబు కాలనీ 2వ లైనులో సుమారు 30 అడుగుల రోడ్డు ఉంది. ఇటీవల సిమెంట్ రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. అయితే రోడ్డును 14 అడుగులకే వేస్తున్నారు. సైడ్ డ్రైన్స్ కూడా నిర్మించడం లేదు. దీనివల్ల మురుగు అక్కడే నిలిచిపోతోంది. రోడ్డు కూడా వెడల్పు తగ్గడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని పరిశీలించాలి. కాలనీలో పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది. – ఈమని బుచ్చిబాబు, గుంటూరు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో దళితులు, బీసీలకు 42 గృహాలున్నాయి. కేవలం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో 241 సర్వే నెంబర్లో 25 ఎకరాలు భూమి కింద తీసేయగా.. మిగిలిన సుమారు 86 ఎకరాలు వాటర్ ట్యాంకుల కింద వదిలేశారు. ఇది మొత్తం అసైన్డ్లోనే చేరింది. ఇందులోనే 42 మందికి సంబంధించిన ఇళ్లు ఉండడంతో రిజిస్ట్రేషన్స్ కాకుండా అసైన్డ్లో చూపిస్తున్నారు. పీజీఆర్ఎస్ సహా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే వాస్తవాలు గ్రహించి గృహాలు ఉన్న సుమారు 1.12 సెంట్లు అసైన్డ్ నుంచి తొలగించాలన్నారు. అర్జీ ఇచ్చినప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా వస్తున్నారు. అధికారులు చేసిన తప్పులకు సామాన్యులు బలవుతున్నారు. దళితులు, బీసీలు అనే వివక్ష చూపుతున్నారు. అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటానికి దిగుతాం. – వట్టిచెరుకూరు వాసులు నాదెండ్ల రామచంద్రయ్య తదితరులు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1985లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదానికి పంపింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఈ అంశం చేర్చింది. తర్వాత దీనిని విస్మరించింది. 2018లో కూడా అధ్యయన కమిటీ వేశారు. రజకులు ఇప్పటికీ అన్ని రంగాల్లో దారుణంగా వెనుకబడ్డారు. వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు న్యాయం చేయాలి. – ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు, గుంటూరు -
హత్య కేసులో 11 మంది నిందితులు అరెస్ట్
లక్ష్మీపురం: హత్య కేసులో 11 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ సీతారాం, నగరంపాలెం సీఐ రాజేష్ వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో 2006లో బుల్లయ్య అలియాస్ బుల్లిని పెండ్రాల వెంకన్న అలియాస్ చిన్నా హత్య చేశాడు. ఆ కేసులో చిన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు శిక్ష అనుభవించాక చిన్నా రెండో వివాహం చేసుకుని తెలంగాణలోని సూర్యాపేటలో నివాసం ఉంటున్నాడు. చిన్నా(47)ను హతమార్చాలని బుల్లయ్య కుమారుడు పెండ్రాల ఇమ్మానియల్ రాజు, ఇతర కుటుంబ సభ్యులు పగతో రగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్ ముత్తయ్య మృతి చెందాడని తెలిసి చిన్నా శనివారం గుంటూరులోని కె.వి.పి.కాలనీలో గాజుల వారి వీధి 1/12వ లైన్కు వచ్చాడు. చిన్నా వెంట అతని భార్య, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పెండ్రాల ఇమ్మానియల్ రాజు, అతడి సోదరులు అమూల్యరాజు, దేవరాజు, గురవయ్య, శ్యామ్, బాబుజ్జి, జమాలమ్మ, రాజ్ కుమార్ అలియాస్ రాజు, బత్తుల మోషేరాజు అలియాస్ మోషే, దేవరకొండ షాలేమ్రాజు అలియాస్ సలీమ్, ఇరుగుబాబు, మరో ముగ్గురు కలిపి మొత్తం 14 మంది హత్యకు పథకం వేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో కె.వి.పి. కాలనీ 1/7వ లైన్లో భార్య, కుమారుడితో వెళుతుండగా ఒక్కసారిగా వారందరూ కూడా వేట కత్తులు, కర్రలతో దాడి చేశారు. చిన్నాను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు, సీఐ రాజేష్ ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. 14 మందిలో 11 మంది నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి లొంగిపోయారు. హత్యకు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలను, కత్తిని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులలో బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 11 మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హజరు పరిచారు. వారిని రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. -
గోల్ షాట్బాల్ విజేతలకు సత్కారం
తెనాలి: భూటాన్లో జరిగిన ఇంటర్నేషనల్ గోల్ షాట్బాల్ సబ్–జూనియర్స్ బాయ్స్–గర్ల్స్ చాంపియన్షిప్లో భారత జట్లు రెండూ విజయం సాధించాయి. ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఫైనల్స్లో రెండు విభాగాల్లోనూ భూటాన్ జట్లతో తలపడిన భారత జట్లు విన్నర్స్గా నిలిచాయి. స్థానిక సుల్తానాబాద్లోని సెయింట్ ఆన్స్ స్కూల్కు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు చొప్పున రెండు జట్లలోనూ ఏడుగురు క్రీడాకారులు దేశం తరఫున ఆడారు. రెండు జట్లు విన్నర్స్గా నిలిచినందున ఆయా జట్లలో ఆడిన చిల్కా రుత్విక్ కిరణ్, పెదపల్లి సుహాస్, చుండూరు హర్షద్ గౌతమ్ దేవరకొండ అమూల్య, చుండూరు జెస్విత, దాసరి జెన్సినా జాయల్, చిలకా ప్రజ్ఞను సోమవారం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం సత్కరించింది. అంతర్జాతీయ పోటీల్లో ఇంటర్నేషనల్ కోచ్గా స్కూల్ పీఈటీ ఎన్.వినోద్ కుమార్ మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ సౌమ్య, కరస్పాండెంట్ సిస్టర్ లీసా జార్జ్, పీఈటీలు వినోద్కుమార్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.9,69,418 వచ్చినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు బాపట్ల దేవదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. లెక్కింపులో ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు, పలు భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ 99 రోజుల తరువాత అమ్మవారి హుండీ లెక్కించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి రూ.2,03,834 అదనంగా వచ్చినట్లు తెలిపారు. అమరావతి: అమరేశ్వర ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ సోమవారం పేర్కొన్నారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో జరిగే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం వేద పండితులచే ఉదకశాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెండో రోజు బుధవారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం మూడో రోజు గురువారం ప్రాయశ్చిత్తహోమం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం ఉంటాయన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 536.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 6,660, ఎడమ కాలువకు 7,029, ఎస్ఎల్బీసీకి 2 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. మొత్తం ఔట్ఫ్లోగా 15,689 క్యూసెక్కులు వెళుతోంది. శ్రీశైలం నుంచి సాగర్కు 1,259 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
నేటి నుంచి ఓపీ సేవలకు అరగంట విరామం
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్య సేవలకు అరగంటసేపు విరామం ఇచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్లు తెలిపారు. తమ నిరసనలో భాగంగా సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఫ్లెక్సీలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను కలిసి సమ్మె నోటీసు అందజేశామన్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి వారం పాటు రోజూ అరగంటసేపు ఓపీ వైద్య సేవలకు విరామం ప్రకటిస్తామన్నారు. సెప్టెంబరు 8 నుంచి మధ్యాహ్నం ఓపీ సేవలు నిలిపి వేస్తామని, సెప్టెంబరు 15 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో దశల వారీగా నిరసనలు తీవ్రం చేస్తామని వైద్యుల సంఘం నేతలు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా సంఘం నేతలు డాక్టర్ అజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ శివగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు -
వర్క్ ఇన్స్పెక్టర్లే ‘బినామీ’ కాంట్రాక్టర్లు
గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను కొందరు అధికారులు, సిబ్బంది తమ జేబులు నింపుకొనే వ్యాపారంగా మార్చేశారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లే చక్రం తిప్పుతూ ‘బినామీ’ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఉన్నతాధికారుల అండతో సాగుతున్న ఈ వ్యవహారం ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆకస్మిక సోదాలతో బట్టబయలైంది. నెహ్రూనగర్: గుంటూరు నగర పరిధిలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి వార్డు ఎమినిటీ సెక్రటరీలుగా పోస్టింగులు కేటాయించారు. కానీ వారు నిర్దేశిత విధులకు వెళ్లకుండా వారికి నచ్చిన చోటే పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఏఈలు, డీఈలతో కుమ్మకై ్క తమకు నచ్చిన ప్రాంతాల్లో బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. లాగిన్లు వారివే.. పనులూ వారివే! టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారుల లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు సైతం ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోనే ఉండటం గమనార్హం. పనులు చేసేది, ఆన్లైన్లో టెండర్లు అప్లోడ్ చేసేది వీరే కావడంతో రూ.కోట్ల విలువైన పనుల్లో భారీ మాయాజాలం నడిచింది. ఇందులో కొన్ని పదుల సంఖ్యలో వర్కులకు అసలు టెండర్లే లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లెస్సు పర్సంటేజీలు మార్చేసి నగరపాలక సంస్థ ఖజానాకు రూ.కోట్ల మేర గండి పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ నేతల పేరుతో వసూళ్లు నగరంలో సాగే ప్రతి పనికీ అధికార టీడీపీ నేతలకు పర్సంటేజీల రూపంలో కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన ఓ వార్డు ఎమినిటీ సెక్రటరీ మరింత చేతివాటం ప్రదర్శించాడు. సదరు టీడీపీ ముఖ్య నేతకు కమీషన్ ముట్టజెప్పాలంటూ ఓ కాంట్రాక్టర్ నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని తానే కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నేత తన వాటా కోసం ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏఈల బదిలీలు జరగడంతో ఇంజినీరింగ్ విభాగంలో సరికొత్త వివాదం మొదలైంది. గతంలో పనిచేసిన అధికారులకు కాంట్రాక్టర్లు ముందుగానే భారీగా కమీషన్లు ముట్టజెప్పారు. అయితే నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొందరు ఏఈలు ఆ పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయాలంటే తమకు మళ్లీ కమీషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే పాత అధికారులకు ముడుపులు చెల్లించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్లు, మళ్లీ ఇచ్చే స్తోమత లేక లబోదిబోమంటున్నారు. బిల్లుల ఫైళ్లు కదిలేది లేదని అధికారులు భీష్మించుకు కూర్చోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు జరిపి ఈ దోపిడీ నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకోవాలని అసలైన కాంట్రాక్టర్లు, నగర ప్రజలు కోరుతున్నారు. -
భవిత భళా..!
తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠంలో సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధారణంగా విద్యార్థుల్లో కనిపించే లక్షణం. అదే తరహాలో చెట్టు నుంచి ఆపిల్ కింద పడితే అది ఎందుకు కింద పడిందని తనలో తాను ప్రశ్నించుకోవడం ద్వారా భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్న న్యూటన్ గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా నిలిచారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇదంతా గతంగా మారుతోంది. సమాజంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుమరుగు అవుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు తప్ప ఇక ఏవీ లేవనే ధోరణి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భావి శాస్త్రవేత్తలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాల మేధ..ఆసక్తి ఉండాలే కానీ వేల మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, ప్రోత్సాహకాలు మన దేశంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఐఐటీల్లో 10,250 సీట్లు భావి శాస్త్రవేత్తలకు ఉన్నాయి. 31 ఎన్ఐటీల్లో 18,750 సీట్లు ఉన్నాయి. ఇస్రో, నాసాల ద్వారా ఏటా వెయ్యి మందికి 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. దేశంలో పరిశోధనా రంగంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సైన్స్కు విశేష ఆదరణ ఉంది. మరోవైపు శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉంది. అది ఎంతగా అంటే దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే శాస్త్రవేత్తలు ఉన్నారు. నేటి విద్యార్థులు బంగారు భవిష్యత్తు సాధించడంతోపాటు దేశానికి మేలు చేయడానికి ఈ చక్కని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచి భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలను అమలు పరుస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, వివిధ సమస్యలకు తమ మేధస్సుతో పరిష్కారం చూపగలిగే చిట్టిబుర్రల కోసం అన్వేషిస్తోంది. అలాంటి బాల మేధావులకు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదికగా మారుతోంది. దీని ద్వారా ఏటా అందించే నినాదంపై విద్యార్థులు తమ మేధస్సుతో చూపే పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో తయారు చేసుకుని జిల్లాస్థాయిలో జరిగే సెమినార్లో దానిని న్యాయనిర్ణేతల ఎదుట చెప్పాలి. ఇందుకు గాను నేషనల్ సైన్స్ కాంగ్రెస్కు రిజిస్ట్రేషన్ గడువు సోమవారం ముగియనుంది. యువికా యువ శాస్త్రవేత్త యువికా పేరుతో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 9వ తరగతి స్థాయిలో విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మోడల్ రాకెట్రీని నిర్మించడం, రోబోటిక్ కోడింగ్, డ్రోన్ ప్రదర్శనలు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. యువికా యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఖర్చులకు నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సైట్లో యువికా యంగ్ సైంటిస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆవిష్కరణల కేంద్రంగా ఇన్స్పైర్ మానక్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏటా వేలాది చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న భారీ కార్యక్రమంగా దీనిని చెప్పుకోవచ్చు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆలోచనలకు బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి జరిగే మేలు వంటి అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్ టీచర్ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టు తయారీకి రూ.10 వేల చొప్పున నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఓ ఎగ్జిబిషన్లో తాము తయారు చేసిన ప్రాజెక్టులతో విద్యార్థులు (ఫైల్) బడుల్లోనే ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించడం లక్ష్యంగా అటల్ టింకరింగ్ లాబొరేటరీస్ (ఏటీఎల్)ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ల ఏర్పాటుకు పాఠశాలలకు గ్రాంట్లను అందిస్తుంది. విద్యార్థులు భావనాత్మక సిద్ధాంతాలను ఆచరణాత్మక ఆవిష్కరణలుగా మార్చడానికి త్రీడీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్లు, అధునాతన శాసీ్త్రయ కిట్ల గురించి తెలుసుకుంటారు. విద్యార్థినుల్లో శాసీ్త్రయ ఆలోచనలు రేకెత్తించి, ప్రతిభావంతులైన బాలికలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైన విజ్ఞాన్ జ్యోతి. ఈ పథకం ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలు అర్హులు. శాసీ్త్రయ కౌన్సెలింగ్, నిపుణుల ఉపన్యాసాలు, మహిళా శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష సంభాషణ, బాలికల్లో పరిశోధనాసక్తిని ప్రోత్సహించడం, సైన్స్ ల్యాబ్లు, రక్షణ అకాడమీలు, టెక్నాలజీ హబ్లకు పూర్తి నిధులతో కూడిన సందర్శనలు ఇందులో ఉన్నాయి. -
కూటమి సర్కార్వి కక్షపూరిత రాజకీయాలు
నెహ్రూనగర్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేస్తోందని గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో 24 రోజులపాటు రిమాండ్లో ఉండి బెయిల్పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరు నగరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్న ఆయన చుట్టుగుంట, హిందూ కాలేజీ సిగ్నల్స్, పాత బస్టాండు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్సీపీ నగర పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కరిని కూడా అకారణంగా జైళ్లకు పంపలేదని ముస్తఫా గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో కక్షతో అందర్నీ అన్యాయంగా జైళ్లకు తరలిస్తుండటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులకు ఆ భగవంతుడే తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నడూ అన్యాయం చేయలేదని, ఏ పార్టీ వారికి కూడా ఎలాంటి హాని తలపెట్టలేదని స్పష్టం చేశారు. కక్షతో అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. ఇకనైనా కూటమి నేతలు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల కోసం నిలబడతాం పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముస్తఫా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే ఏకై క కారణంతోనే ఇలా వేధించారని మండిపడ్డారు. వ్యాపారాల్లో సాధారణంగా జరిగే లావాదేవీలను సైతం పెద్దవిగా చిత్రీకరించి ఇలా జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం నిలబడే వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి వేధింపులకు గురిచేసినా ప్రజా గొంతుకగా నిలబడటాన్ని ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. తమ అధినేత వైఎస్ జగన్మెహన్రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటామన్నారు. అనంతరం మంగళదాస్ నగర్లోని ముస్తఫా ఇంటి వద్దకు నూజివీడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు వచ్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర బాబు, చదలవాడ వేణు, చిలకా రమేష్, చింక శీను, పల్లా శీను, పూనూరి నాగేశ్వరావు, తుమ్మేటి శీను, తూర్పు, పశ్చిమ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు పోలవరపు జ్యోతి వెంకటేశ్వర్లు, మహమూద్, షేక్ ఆబిద్, ధూపాటి వంశీ, పాపతోటి అంబేడ్కర్, రమణ బోయిన అజయ్, షేక్ ఫర్జానా, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శేషగిరి పవన్ కుమార్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సైదా ఖాన్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆలా కిరణ్, యువజన విభాగం జనరల్ సెక్రటరీ ఉమర్ ఫరూక్, నగర యువజన విభాగం సెక్రటరీ ధూపాటి అనిల్, డివిజన్ అధ్యక్షులు సలీం, జాఫర్, రామయ్య, జబీరా, పుల్లా కిషోర్, గణేష్, సత్యం, ఇషాక్, నజీర్, రాజేష్, తుమ్మెటి కృష్ణ, కోటా రామదాసు, వేణు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మాజీ మంత్రి అంబటిని పరామర్శించిన పిన్నెల్లి
మాచర్ల: ఇటీవల అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంబటి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఉత్సాహంగా కూడో జిల్లా స్థాయి పోటీలుగుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా కూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ స్థానిక బీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్.సిద్ధార్థ వర్మ మాట్లాడుతూ టోర్నమెంట్లో పతకాలు సాధించిన క్రీడాకారులను విశాఖపట్నంలో సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ బ్లాక్ బెల్ట్ 7వ డాన్ డి.ప్రభాకర్ పాల్గొన్నారు. కరాటేతో క్రమశిక్షణ, ఆత్మరక్షణ మంగళగిరి టౌన్: కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మరక్షణ కూడా అలవాటు అవుతుందని ఎయిమ్స్(అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కు చెందిన డాక్టర్ శుభోదీప్ మిత్ర తెలిపారు. మంగళగిరి పట్టణంలోని స్వేచ్ఛ బుద్ధ విహార్లో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్(జేకేఏ) క్యూ లెవల్ బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. శుభోదీప్ మిత్ర మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు జేకేఏ ఏపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ రవిబాబు, జోనల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సాగరిక పాల్గొన్నారు. అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14వ తేదీన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదుగుర్ని సస్పెండ్ కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆభరణాల కోసం సంబంధిత చెత్త వేసే ప్రదేశంలో వెతికారు. ప్రశాంతంగా నీట్ పీజీ గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ పీజీ ఆదివారం గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసిన 804 మంది అభ్యర్థుల్లో 796 మంది హాజరయ్యారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి తదితరులు పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. -
2 నుంచి టెట్పై ఏపీటీఎఫ్ ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఏపీటీఎఫ్ చేపడుతున్న నిరవధిక ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. ఆదివారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. టెట్పై ఇన్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యాయులు ఎంతో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మంగళగిరిలోని విద్యాభవన్ ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీద్, జిల్లా శాఖ కార్యదర్శులు చక్కా వెంకటేశ్వరరావు, పచ్చల శివరామకృష్ణ, కంబా శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ఎస్ఎన్ మూర్తి, జిల్లా కౌన్సిలర్లు కిశోర్ షా, గురుమూర్తి, ఖుద్దూస్, జహంగీర్ పాల్గొన్నారు. -
చివరికి నష్టాలేనా..!
తాడికొండలో ఎండిపోయిన వరి పైరువర్షాకాలం సీజన్ ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆశలు ఆవిరవుతున్నాయి. తాడికొండ ఆయకట్టు ప్రాంతంలో వరి ఈ ఏడాది 700 ఎకరాల్లో సాగవుతోంది. రైతులు వెద పద్ధతిలో సాగు చేశారు. రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పైరు ఎండిపోతోంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టి సాగుకు సన్నద్ధమైతే ఎల్నినో ప్రభావం తమ కొంప ముంచిందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. – తాడికొండ -
గుంటూరు
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 20267తెనాలి: స్థానిక మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.7 వేలు, గరిష్ఠ ధర రూ.11,800, మోడల్ ధర రూ.10 వేల వరకు పలికింది.బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు రూరల్: నగర పరిధిలోని శిల్పారామం – పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్లతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.48 కోట్లతో సుమారు 4.25 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ. 2–3 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎన్ఎస్పీ కెనాల్స్ క్రాసింగ్స్ వద్ద భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అదనపు కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో కల్వర్టుకు సుమారు రూ.10 లక్షలు– రూ.15 లక్షల వరకు అదనపు వ్యయం అవుతుందని తెలిపారు. త్వరలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా పేరేచర్ల జంక్షన్ వరకు ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తయితే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా అమరావతికి మెరుగైన అనుసంధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అదనపు విస్తరణకు సుమారు రూ.15 కోట్లు– రూ.20 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. ఆమోదం లభించలేదన్నారు. డ్రైనేజ్ కవర్లు, సెంటర్ లైటింగ్ వంటి అదనపు సదుపాయాలకు కూడా మరన్ని నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పట్టపగలే అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నా అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చౌక బియ్యం అందకుండా లారీలకు లారీలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. జిల్లాలో చౌక బియ్యం, ఇసుక, మైనింగ్ మాఫియాకు అధికార పార్టీ ముఖ్య నేతలు నేరుగా సహకరిస్తుండటం, కొన్ని చోట్ల వారే చేస్తుండటంతో చీకటి వ్యాపారం నిర్భయంగా కొనసాగిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతూ, తిరిగి ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ.లక్షలు సంపాదిస్తుంటే, వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం రూ.కోట్లు పొందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రేషన్, ఇసుక, గ్రావెల్, మైనింగ్ మాఫియా జోరు సాగుతోంది. విజిలెన్స్ శాఖలో కొంతకాలంగా స్తబ్ధత నెలకొంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు విచారణ నిర్వహించడం మినహా అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే, వారికి అండగా నిలుస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నియంత్రిస్తేనే సాధ్యపడుతుందని విజిలెన్స్ శాఖలో చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతల దోపిడీ ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలు... ఆ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, బినామీలను అడ్డుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని మల్లాది, అంబడిపూడితోపాటు, రాజధాని ప్రాంతంలో సైతం డ్రెడ్జర్ల ద్వారా కృష్ణా నది గర్భాన్ని తవ్వేస్తూ, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్న విజిలెన్స్ అధికారులకు ఇదేమీ కనిపించడం లేదు. చిన్నబాబు బినామీలు, ఎమ్మెల్యేల బావమరుదులు ఇలా అధికార పార్టీ ముఖ్య నేతలే అక్రమ ఇసుక రవాణాకు తెగబడుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు సైతం వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా అందాల్సిన ఇసుకను రూ.వేలు ఖర్చుపెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడి ఇసుకను హైదరాబాద్కు భారీ స్థాయిలో తరలిస్తూ అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా, సరిహద్దు చెక్పోస్టులు దాటుతున్నా విజిలెన్స్ అధికారులకు కనిపించకపోవడం దారుణమైన విషయం. మామూలిస్తే సరి.. అక్రమార్కులకు జిల్లాలో కొందరు విజిలెన్స్ అధికారులు అండగా నిలుస్తూ, నెలవారీ మామూళ్లకు అలవాటు పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్ అంటేనే ప్రభుత్వ ఆదాయాలకు గండి పడకుండా, ప్రజలకు, ప్రభుత్వ పథకాలకు, ఇసుక, మట్టి వంటి సహజ వనరులకు దుర్వినియోగం కాకుండా కాపాడాలి. కానీ ఇప్పుడు గాడి తప్పింది. చేయాల్సిన పని వదిలేసి, కొందరు విజిలెన్స్ అధికారులు బిర్యానీ సెంటర్లు, స్వీట్షాపులు వంటి వాటిపై దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ, భారీ ఎత్తున అవినీతికి పాల్పడున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ రవాణాపై సీరియస్గా దృష్టి సారించి, అక్రమార్కులను అడ్డుకుని విజిలెన్స్పై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ సంపాదనకు ద్వారాలు తెరుచుకున్నాయి. పార్టీ నేతల ఇసుక, గ్రావెల్, గ్రానైట్, చౌక బియ్యం అక్రమ రవాణాపై విజి ‘లెన్స్’ దృష్టి సారించడం లేదు. అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి బినామీల అండదండలు అందిస్తున్నారని తెలిసినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. దీనిపై పూర్తి స్థాయి నిఘా ఉంచి నకిలీలను అరికట్టాల్సిన విజిలెన్స్ అధికారులు వాటిపై కనీస దృష్టి సారించకపోవడంతో రైతులు నకిలీ ఎరువులు, విత్తనాలు వాడి నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి చౌక బియ్యం, ఇసుక, గ్రానైట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియాలను జిల్లాలోని దాచేపల్లి, నాగార్జునసాగర్ వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద సైతం విజిలెన్స్ అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఇదంతా వీరికి తెలిసే జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్రామాల్లో ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు, భారీ స్థాయిలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా ముఠాలను అడ్డుకోలేకపోతున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండటం వల్లే వారి జోలికి వెళ్లాలంటే భయపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వేగ గణితం.. విద్యార్థులకు వరం
గుంటూరు ఎడ్యుకేషన్: వేద గణిత విజ్ఞాన శాస్త్రం శాసీ్త్రయ నామం వేదిక్ మ్యాథ్స్. కఠినమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే ప్రాచీన విధానం. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఒక అస్త్రం. తల్లిదండ్రులు శిక్షణ సంస్థల కోసం అన్వేషిస్తున్నారు. పదో తరగతి తరువాత ఇంటర్తోపాటే విభిన్నమైన పోటీ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. గణితం ఆధారంగా ప్రతిభ చూపాల్సిన విద్యార్థులకు వేద గణితశాస్త్రం ఆయుధంగా మారింది. వేదిక్ మ్యాథ్స్ అంటే.. పూరి పీఠాధిపతి జగద్గురు భారతీకృష్ణ తీర్థస్వామి 1957లో రాసిన వేదిక్ మ్యాథ్స్ పుస్తకం ద్వారా వేద గణితశాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు. వేదాల్లోని పలు సూత్రాలు, సిద్ధాంతాల ఆధారంగా ఆయన రూపొందించిన గణిత పద్ధతులు ఇందులో ఉన్నాయి. పుస్తకంపై ముద్రణా హక్కులు పొందిన ఢిల్లీకి చెందిన మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్స్ ఈ పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో ఒరిజినల్ ఎడిషన్ దొరుకుతోంది. వేదాల నుంచి ... వేద గణితం అంటే వేదాల నుంచి ఆవిర్భవించిన విజ్ఞానం. ఇందులో 16 సూత్రాలు, 13 ఉప సూత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గుణాకారాలు, భాగాహారాలు, కారణాంక విభజన, దశాంశ భిన్నాలు, పాక్షిక భిన్నాలు, ఆవర్తన దశాంశాలు, వర్గాలు, ఘనాలు, ఘనమూలాలు, బీజగణిత సమస్యలకు సులువుగా సమాధానం చెప్పవచ్చు. సింగిల్ లైన్ జవాబుగా మౌఖికంగా చేసే పద్ధతులు, కాలిక్యులస్, త్రికోణమితి వంటి పరిశోధనాంశాలు ఉన్నాయి. విదేశాల్లో ఒక సబ్జెక్టు మనదేశంలో పుట్టిన వేద గణితశాస్త్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. లండన్, హాలెండ్ దేశాల్లో ఇది తప్పనిసరి సబ్జెక్టు. విద్యార్థుల ఆసక్తి మేరకు స్వల్పకాలిక వ్యవధిలో శిక్షణ కల్పిస్తుండగా, పూర్తిస్థాయిలో సబ్జెక్టుగా బోధించాలని గణిత మేధావులు కోరుతున్నారు. వేద గణితం అనగానే ఒక మతానికి సంబంధించిన విషయం అనుకుంటారు. అది తప్పు. భారతీకృష్ణ తీర్థస్వామి తన పుస్తకానికి పెట్టుకున్న పేరే తప్ప, ఇందులో ఉన్నదంతా గణిత విజ్ఞానమే. అసలు వేద గణిత శాస్త్రాన్ని బోధించగలిగే ఉపాధ్యాయులు సైతం వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నారు. వేద గణితంలో కఠిన లెక్కలను సైతం సులభంగా చేయగల నేర్పరితనం అలవడుతుంది. చిరు ప్రాయంలోనే శిక్షణ పొందితే, ఎదిగే కొద్దీ వేద గణితంపై పట్టు నిలుపుకుని అద్భుతాలు ఆవిష్కరించగలరు. వేద గణితశాస్త్రాన్ని సాధన చేయడం ద్వారా మేధస్సు వృద్ధి చెందుతుంది. క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే నైపుణ్యం అలవడుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ అర్హత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగకరం. గణితంలో అవధానాలు చేయాలనుకునే వారికి వేద గణితం తప్పనిసరి. వేదిక్ మ్యాథ్స్ను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని గణితశాస్త్ర మేధావులు కోరుతున్నారు. అబాకస్ శిక్షణ కల్పిస్తున్న పలు సంస్థలు వేదిక్ మ్యాథ్స్ను కూడా బోధిస్తున్నాయి. విశ్వ పునర్నిర్మాణ్ సంఘ్, రాష్ట్రీయ వేద ప్రతిష్ఠాన్, స్పిరిట్యువల్ స్టడీస్ గ్రూప్, విద్యాభారతి, వేద భారతి మొదలైన సంస్థలు దేశవ్యాప్త శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. వేద భారతి ఇంటర్నెట్ ద్వారా శిక్షణ ఇస్తోంది. ఒరిజినల్ పుస్తకాన్ని ముద్రించిన సంస్థ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు వీలుగా పలు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. -
అభివృద్ధితో పాటు వృక్ష రక్షణకు ప్రాధాన్యం
కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జిలు ధరించి మానవ హారంలా నిలబడి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఈనెల 21 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది రమాదేవి, మనీషా, రేణుక, హైమావతి, భార్గవి, ల్యాబ్ టెక్నీషియన్ శైలజ, మోహన్, ఖాశిం, బ్రహ్మం, ఫార్మశిస్టులు శ్రీలక్ష్మీ, నాగుల్మీరా, సౌజన్య, అశ్వని పాల్గొన్నారు. నగరంపాలెం: తెలుగు భాషా పరిశోధన, బాలసాహిత్యం, పాఠ్య గ్రంథాలు, వచన సాహిత్యం తదితర ప్రక్రియల్లో ఎనభైకిపైగా రచనలు చేసి తనదైన ముద్ర వేసిన విలక్షణ రచయిత కవి డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంపాలెం బొమ్మిడాల ఆర్యవైశ్య హాస్టల్ సమావేశ మందిరంలో డాక్టర్ నాగభైరవఆదినారాయణ రాసిన ఆధ్యక్షరం గ్రంథావిష్కరణ, అంకితోత్సవ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన కవి రచయిత డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ, డాక్టర్ గుమ్మ సాంబశివరావు గ్రంథ సమీక్ష గావించారు. ఆద్యక్షరం తొలి ప్రతి గ్రంథాన్ని డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, లక్ష్మీ అన్నపూర్ణమ్మ దంపతులకు అందించారు. డాక్టర్ ఆదినారాయణ, కౌసల్య దంపతులను డాక్టర్ శ్రీకృష్ణమూర్తి దంపతులు నూతన వస్త్రాలతో సత్కరించారు. -
పెళ్లి బృందం బస్సుకు ప్రమాదం
ఎనిమిది మందికి తీవ్రగాయాలు రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో నున్న వై జంక్షన్ వద్ద శుక్రవారం అర్దరాత్రి ఓ వాహనాన్ని పెళ్లి బృందం బస్సు బలంగా ఢీ కొట్టింది. తెలంగాణానికి చెందిన పెళ్లి బృందం బస్సు గుంటూరు నుంచి తిరిగి కల్వకుర్తికి వెళ్తుండగా రాత్రి 11.30 గంటల సమయంలో వై జంక్షన్ వద్ద ఎటు వెళ్లాల్లో తెలియని పరిస్థితిలో ఎదురుగా నాగార్జునసాగర్ నుంచి దాచేపల్లి వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. నాగార్జునసాగర్లో ఓ పాఠశాలలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి గోపిశెట్టి శ్రీనివాసరావు, మేకల వెంకయ్య (వినుకొండ), కేతావత్ నాగరాజు నాయక్ (పాలువాయి), మక్కెన నరేంద్రబాబు(నరసరావుపేట), మురికపూడి రాకేష్ (పౌడిమర్రు), చింతకాయల వెంకయ్య(పెదగార్లపాడు), కత్తుల దుర్గ(దేచవరం), బాణావత్ సైదానాయక్ (భట్రుపాలెం)లు వాహనంలో దాచేపల్లి వస్తున్నారు. ప్రమాదంలో వాహనం బోల్తాపడటంతో వాహనంలో ఉన్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిలో ఏడుగురిని శనివారం నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. మరో వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. బస్సులోని వారికి ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి బస్సును స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
● సీఐటీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ సత్తెనపల్లి: విద్యారంగ పరిరక్షణకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఉద్యమించాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ సత్తెనపల్లి నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రియాజ్, డి. అమూల్య, వెంకీలు వ్యవహరించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు పాలకులు చదువును దూరం చేస్తున్నారన్నారు. క్రీడలకు ప్రైవేట్ విద్యాసంస్థలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్ డి. అమూల్య గత కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ప్రతినిధులు చర్చలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. పలు తీర్మానాలను భువనేశ్వరి, నవీన్లు ప్రవేశపెట్టగా, అమతవర్షిణి బలపరిచారు. మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 22 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ రియాజ్, జె. సాయికుమార్, ఉపాధ్యక్షులుగా భువనేశ్వరి, అమృతవర్షిణి, సహాయ కార్యదర్శులుగా జానీ శంకర్, ఆగస్టిన్, వెంకీ, కమిటీ సభ్యులుగా నవీన్, దిలీప్, వెంకటేష్, సుధాకర్, లక్ష్మయ్య, ప్రశాంత్, లిఖిత, శ్రీవిద్య, ఆంజనేయులు, భార్గవి, దావీదు, నవీన్, బాషా, దిలీప్, అల్తాఫ్, సంజయ్ మనోహర్లను ఎన్నుకున్నారు. పరిశీలకులుగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ సాయి హాజరయ్యారు. కౌలు రైతు సంఘం సత్తెనపల్లి మండల కార్యదర్శి పి. మహేష్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు నీరుకొండ కృష్ణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు గద్దె ఉమాశ్రీలు సందేశం ఇచ్చారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు. నాయకులు అభిలాష్, ఆసిఫ్, సీఐటీయూ సత్తెనపల్లి పట్టణ కన్వీనర్ జె. రాజకుమార్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భవిష్యత్కు మాదక ద్రవ్యాలు అవరోధం
గుంటూరు వెస్ట్: మాదకద్రవ్యాల వలన బంగారు భవిష్యత్కు తీవ్ర అవరోధాలు ఏర్పడతాయని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) నిర్మూలన, గంజాయి విక్రయాల అడ్డుకట్టే ధ్యేయంగా నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వివరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. అప్రమత్తతో ప్రమాదాలను నివారించవచ్చు చిన్నపాటి జాగ్రత్త, అప్రమత్తతతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.శనివారం స్థానిక కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రహదారి ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు. ముందుగా సమావేశ ఉద్దేశాలను ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్టీఓ శ్రీహరి రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి -
బీసీల ఇళ్లకూ ‘సౌర పథకం’
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెనాలిటౌన్: బీసీల ఇళ్లకు కూడా ఉచిత సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. తెనాలిలోని విద్యుత్ ఆపరేషన్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే ఎస్సీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఇందులో భాగంగా తెనాలి డివిజన్కు 9 వేల యూనిట్లు మంజూరు కాగా, మెటీరియల్ కొరత కారణంగా 1,500 మాత్రమే పూర్తి చేయగలిగినట్టు తెలిపారు. బీసీలకు కూడా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలను సబ్సిడీగా సమకూరుస్తుందని చెప్పారు. మూడు నెలల్లోనే సాగు కనెక్షన్లు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. తెనాలి డివిజన్ పరిధిలో శేకూరు, పట్టణ కొత్తపేటలో రెండు నూతన విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు ఇచ్చిన మూడు నెలల్లోనే మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలం మాదిరిగానే విద్యుత్ వినియోగం ఉందని అన్నారు. ఓవర్లోడ్ ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్ఫార్మర్లను మార్చుతున్నట్లు తెలిపారు. సంవత్సరం క్రితం వ్యవసాయ కనెక్షన్లు 150 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 285 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు పగలు 9 గంటల కరెంటు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణయాదవ్, గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, తెనాలి డివిజన్ ఈఈ అక్కల సత్యనారాయణ, డీఈఈ బోరుగడ్డ అశోక్కుమార్, టి.విశ్వనాథం, ఏఈలు బి.సుధీర్, దుర్గారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు పరిశీలన
మాచర్ల: పట్టణంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్ల పనులను రాష్ట్ర స్పెషల్ సెక్రెటరీ, హౌసింగ్ ఎండీ కొర్లపాటి హెప్సీబారాణి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. మాచర్ల వచ్చిన ఆమె ఆయా ప్రాంతాలలో నిర్మాణ దశలోని ఇళ వద్దకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. సీఈ టి.వేణుగోపాల్, పల్నాడు స్పెషలాఫీసర్ శంకరరావు, జిల్లా హౌసింగ్ పీడీ పి.ప్రసాద్, హౌసింగ్ మాచర్ల డీఈ బాలాజీ నాయక్, పల్నాడు జిల్లా డీఈలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, ఏఈలు తదితరులు ఉన్నారు. పిడుగురాళ్ల రూరల్: జాతీయ వైద్య పరిశోధన మండలికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ – చైన్నె ఆధ్వర్యంలో ‘ట్రామా – బర్న్ ఇన్జ్యురి– ఆపరేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్’కు పిడుగురాళ్ల మెడికల్ వైద్య కళాశాల చెందిన డాక్టర్ కోమేరా శివ రామ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఎంపికై న ఎనిమిది మందిలో ఆయన ఒకరు. రోడ్డు ప్రమాద బాధితులపై తాము పరిశోధన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ను ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది అభినందించారు. మంగళగిరి రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎయిమ్స్లో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు. ఎయిమ్స్ సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం, ఫిట్నెస్, శ్రేయస్సును ప్రోత్సహించేలా కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేక వ్యాయామశాలలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (పరిపాలన) కల్నల్ శశికాంత్ తుమ్మ, విభాగాధిపతులు, క్రీడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనల సవరణ కోసం పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లను శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యాహక్కు చట్టంలోని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టెట్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ బైక్ ర్యాలీలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రానున్నారని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది ఉపాధ్యాయుల ఆవేదనను విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అర్థం చేసుకోవాలని, టెట్లో సవరణకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం. కళాధర్, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, ఆది నారాయణ, రంగారావు, ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలపై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం సాంఘిక సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలాచూడాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.దుర్గాభవాని మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు, భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు మాట్లాడుతూ నల్సా పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.ఎల్.హర్షిత, బార్ ప్రెసిడెంట్ ఎం.నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్.వీరమణి, పారా లీగల్ వాలంటీర్స్, ప్యానెల్ అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు. -
నీట్ పీజీ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నగరంపాలెం: జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీన నీట్ పీజీ దృష్ట్యా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరయ్యే 784 మంది అభ్యర్థులు నిర్ణీత వేళకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్త్తోపాటు నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా, పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రశాంతంగా నిర్వహించాలి గుంటూరు వెస్ట్: నీట్ పీజీ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్షించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. -
వైద్య కళాశాలలో సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రావాల్సిన వేతన బకాయిలను(పీఆర్సీ) తక్షణమే విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీఏఏపీ) స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం గుంటూరు వైద్య కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డాక్టర్ స్వరూప్కాంత్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు 2016 నుంచి పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, సెకండరీ హెల్త్ వైద్యులకు టైమ్బాండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, వైద్య అధికారులకు సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. -
రాజ్యాంగ విలువల పరిరక్షణ కీలకం
తాడికొండ: న్యాయాన్ని అందరికీ చేరువ చేయడం, రాజ్యాంగ విలువల పరిరక్షించడం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మెంబర్ సెక్రటరీ(డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి) న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు అన్నారు. వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లా నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని, కొత్తగా చేరిన న్యాయ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ శనివారం ఉత్సాహభరితమైన ఫ్రెషర్స్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ న్యాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాయ వ్యవస్థలోని ఆచరణాత్మక, సామాజిక అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. సమాజంలోని అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించడంలో న్యాయ సేవలు, న్యాయ సహాయం(లీగల్ ఎయిడ్ను) పోషించే కీలక పాత్రను ఆమె వివరించారు. వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయ వైస్–చాన్సలర్ డాక్టర్ పి.అరుళ్మొళి వర్మన్ మాట్లాడుతూ భవిష్యత్ న్యాయ నిపుణులను తీర్చిదిద్దడంలో నాణ్యమైన విద్య, విస్తృత పరిశోధన, నైతిక విలువలతో కూడిన న్యాయ ఆచరణకు ప్రాధాన్యం ఇస్తూ, స్కూల్ ఆఫ్ లా కోసం విశ్వవిద్యాలయం నిర్దేశించుకున్న దార్శనికతను ఆయన వివరించారు. న్యాయమూర్తి హిమబిందు -
నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు కండి
గుంటూరు వెస్ట్: నేత్రదానం ఉద్యమంలో పాల్గొనండి, దృష్టి సందేశ దాత అవ్వండని ప్రజలకు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నేత్రదానం గురించి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ సంక్షేమ సమితిలో అన్నివిధాలా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు చెప్పడం వల్ల ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుందన్నారు. నేత్ర దానం చేయడం ద్వారా మరణించిన అనంతరం కూడా ప్రపంచాన్ని మీ కళ్ళు చూస్తాయన్నారు. డీఎంహెచ్ఓ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ మరణించిన వ్యక్తి తన నేత్రాలను దానం చేస్తున్నట్టు ఇదివరకే ప్రతిజ్ఞ చేసినా, చేయకపోయినా సరే, ఆ కుటుంబం వారి అనుమతితో కూడా కళ్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, అంధత్వ నివారణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
నేడు ఖో–ఖో జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
నకరికల్లు: స్థానిక వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలబాలికల ఖో–ఖో జట్ల ఎంపికలు ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు వీరభద్రారెడ్డి, చింతా పుల్లయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు 2008 అక్టోబర్ 31 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. వయస్సు, ఎత్తు, బరువు కలిపి 250 పాయింట్లు మించకుండా ఉండాలన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న జట్లు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎన్టిఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి 9949533234, 9866925108 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
లక్ష్మీపురం: ఓ బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెదకూరపాడు మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన కంచర్ల వెంకటేష్ ఫొటోగ్రాఫర్. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రస్తుతం గుంటూరులోని ఓ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. జూలై 29వ తేదీన అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి వెంకటేష్ తీసుకెళ్లినట్లు తేలింది. గతంలో కూడా వేధించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి వెంకటేష్ను అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
గుంటూరు మెడికల్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ర్యాలీ సభ జరగనుందని ఏపీ ఎన్జీజీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాస్థాయిలో ఎన్జీవో హోంలో అన్ని సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, సన్నాక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ శ్యామ్ సుందర్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.కె నాగుల్ షరీఫ్లు మాట్లాడుతూ ఏపీసీపీఎస్ఈఏ నిర్వహించ తలపెట్టిన సెప్టెంబర్ 1 ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీపీఎస్ఈఏ గుంటూరు జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు కొమ్మనబోయిన సుకుమార్, సెక్రటరీ రవితేజ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలే ఫలితాలనిస్తాయని పాత పెన్షన్ విధానం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి అని సంఘాలు మద్దతు పలకాలని, వేలాది సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగర అధ్యక్షుడు సీహెచ్ కళ్యాణ్ కుమార్, సిటీ కార్యదర్శి జీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ధర్నాకు తమ శాఖల కార్యకర్తలు వేలాదిగా పాల్గొంటారని తెలిపారు. సీనియర్ సీపీ ఉద్యమ నాయకులు తిరుమలరెడ్డి, దయాసాగర్, ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బాజీ, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాలిద్, ఏపీసీపీఎస్ఈఏ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా బేగ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీవోస్, ఏపీజేఏసీ సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాల నాయకులు, నాయకులు కిషోర్, చంద్రమోహన్, రామచంద్రరావు పాల్గొన్నారు. -
బోనబోయిన హత్యకు కుట్ర కేసులో నిందితుడి లొంగుబాటు
గుంటూరు లీగల్: నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో బోనబోయిన శ్రీనివాస్యాదవ్ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ–2 నిందితుడు కేశన వెంకటేష్ శుక్రవారం మొబైల్ కోర్టు జడ్జి వి.దీప్తి ఎదుట లొంగిపోయారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల నిమిత్తం వెంకటేష్ను గుంటూరు జీజీహెచ్కు పోలీసులు తరలించారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తీసుకెళుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న నరేంద్ర ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నా ఇప్పటి వరకు కోర్టులో హాజరు పరచలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. జిల్లా కోర్టులో బోనబోయిన హల్చల్ లక్ష్మీపురం: జిల్లా కోర్టులో జనసేన పార్టీ నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటు అతడి అనుచరులు కోర్టులో హల్చల్ చేశారు. శుక్రవారం కోర్టులో కేశన వెంకటేష్కు చెందిన న్యాయవాది ప్రకాష్రెడ్డి కోర్టులో లొంగిపోతున్నట్లు న్యాయమూర్తి ముందు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ తన అనుచరులు సుమారు 50 మందికిపైగా రౌడీమూకలను వెంట పెట్టుకుని జిల్లా కోర్టుకు చేరుకున్నాడు. కోర్టు వద్ద బోనబోయిన ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో బోనబోయిన చిన్నగా అక్కడ నుంచి అనుచరులను తీసుకుని జారుకున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని.. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులు కోర్టు వద్ద ఉన్నట్లు కేశన వెంకటేష్, అతడి న్యాయవాదికి సమాచారం తెలిసింది.దీంతో కోర్టు ఆవరణలోనే ఓ కారులో వెంకటేష్ను దాచి పెట్టారు. కోర్టు ప్రాంగణంలో ఎటువైపు వెళ్లినా బోనబోయిన అనుచరులు ఉండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని న్యాయమూర్తి ముందు హాజరయ్యేందుకు ఎదురు చూశారు. సుమారు మూడు గంటల తరువాత బోనబోయిన కోర్టు ఆవరణను వదిలి బయటకు వెళ్లిన మరుక్షణమే న్యాయవాది ప్రకాష్రెడ్డి, కేశన వెంకటేష్ను మొబైల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నెల్లూరు జైలుకు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
మాస్టర్మైండ్స్ విద్యార్థి మోక్షిత్ వంశీకృష్ణకు సీఎం అభినందన
గుంటూరు ఎడ్యుకేషన్: ీసఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్ వంశీకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభినందించినట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ శుక్రవారం తెలిపారు. కామర్స్ విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాలు ఈనెల 5న ప్రకటించారని, దేశవ్యాప్తంగా అత్యున్నత కృషి, ప్రతిభ కనబరచిన మట్టుపల్లి మోక్షిత్ వంశీకృష్ణ అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. మాస్టర్మైండ్స్ విద్యాసంస్థల నిర్వాహకులు మట్టుపల్లి రాధ, మోహన్ కుమారుడైన మోక్షిత్ వంశీకృష్ణ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా మోక్షిత్ వంశీకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు, మాస్టర్మైండ్స్ సంస్థ అందించిన మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగానని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. -
జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన
గుంటూరు మెడికల్: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రజలకు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించి, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ‘కంటికి కన్ను– మీ సంకల్పం కావాలి నేత్రదానం, మనందరికీ ఆదర్శం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరినీ నేత్రదానం వైపు ప్రోత్సహించాలని కోరారు. నేత్రదానం ఒక మహత్తర సామాజిక సేవగా, ప్రజా ఉద్యమంగా మారేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు వచ్చేలా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి చేయాలని డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నేత్రదాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేశారు. -
గంజాయి రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం
ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: గంజాయి రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఏపీ ఈగల్–ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ల మధ్య శుక్రవారం మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఏపీ ఈగల్ నాలుగు సూత్రాల వ్యూహంతో పనిచేస్తోందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా లేదా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సెక్రటరీ, సీఈఓ ఏకే పరిడా మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలను నిరంతర ఉద్యమంగా కొనసాగిస్తామని తెలిపారు. రెడ్క్రాస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ వై.డి.రామారావు మాట్లాడుతూ ఈగల్ నిఘా బలగాలకు రెడ్క్రాస్ విస్తృత వలంటీర్ నెట్వర్క్ తోడైతే సమాజంలో అద్భుతమైన మార్పు తీసుకురావచ్చన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఎస్పీ కేఎం మహేశ్వరరాజు, అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ జి.స్వరూపరాణి, డీఎస్పీలు టి.త్రినాథ్, కె.సింగయ్య, టి.దుర్గాప్రసాద్, సీఐలు రవీంద్ర, విక్టర్, రుద్ర రమేష్, ఆర్ఐలు రాంబాబు, నారాయణ, శివశంకర్ నాయక్, రెడ్క్రాస్ వైస్ చైర్మన్ పి.ఆర్.సి.రాజు, కోశాధికారి డి.శ్రీహరిరావు, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం, స్టేట్ కోఆర్డినేటర్ బీవీఎస్ కుమార్, రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాలచాముండేశ్వరికి శ్రావణ లక్ష్మి అలంకారం
చందోలు(కర్లపాలెం): శ్రావణమాసం మూడవ శుక్రవారం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవారికి నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాల క్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, పండ్లు, పూజా ద్రవ్యాలు ఉచితంగా అందజేసినట్లు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. చీరాల: పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న డిగ్రీ రెండో సెమిస్టర్ పేపర్ వాల్యూయేషన్ను శుక్రవారం అధ్యాపకులు నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు మాట్లాడుతూ 2025–26లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ 1,3,4,5 సెమిస్టర్ యూజీ పేపర్ల వాల్యూయేషన్ను పూర్తి చేశామన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చినా వాల్యూయేషన్ పారితోషకం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ ఏడాది మే నెలలో 47 డిగ్రీల మేర ఎండలు ఉన్నా పేపర్ వాల్యూయేషన్ను పూర్తి చేశామని పేర్కొన్నారు. రావల్సిన పారితోషకం చెల్లించని కారణంగా శుక్రవారం రెండో సెమిస్టర్ పేపర్ మూల్యాంకనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పారితోషకాన్ని త్వరగా విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. నాదెండ్ల: జూనియర్ డివిజన్ సివిల్ జడ్జిల ఎంపికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర న్యాయశాఖ ప్రకటించిన మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఈ జాబితాలో గణపవరం గ్రామానికి చెందిన కాట్రు అప్పయ్య, వెంకటసుబ్బమ్మల మనుమరాలైన నల్లూరి గౌతమి 200 మార్కులకు గాను 189.67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్ష జరగ్గా, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. త్వరలో ప్రభుత్వం వీరికి జూనియర్ సివిల్ జడ్జిగా పోస్టింగ్లు ఖరారు చేయనుంది. గౌతమి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా ఒంగోలులో నివాసం ఉంటుండగా, గౌతమి విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. -
అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
తెనాలి అర్బన్: ప్రజలు అందజేసిన ప్రతి అర్జీని 21–30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని తెనాలి మార్కెట్ ఆవరణ ముందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెనాలి, కొల్లిపర మండలాలతోపాటు పట్టణంలో మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ప్రతి సోమవారం పీజేఆర్ఎస్ ఉంటుందన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తెనాలిలో వాహనాల డ్రైవింగ్ టెస్ట్ నిర్వహణకు స్థలం కేటాయించాలని రవాణాశాఖ అధికారులు వినతిపత్రం ఇచ్చారు. పెన్షన్ల కోసం, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, రోడ్లు, కాల్వలు నిర్మించాలని, పారిశుద్ధ్య నిర్వాహణను మెరుగుపరచాలని పలువురు వినతిపత్రాలు అందించారు. ఆర్డీవో శ్రీరమణి మాట్లాడుతూ మొత్తం 67 అర్జీలు వచ్చాయని చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.పార్థసారథి, జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి.వి.రంగారావు, గ్రామీణ నీటి పారుదల విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కల్యాణ చక్రవర్తి, విద్యుత్శాఖ పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తదితర అధికారులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ పరిశ్రమకు గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేయాలని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్(ఏపీటీఎంఏ) కోరింది. పరిశ్రమకు పోటీ విద్యుత్ ధరలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఆధునికీకరణకు రాయితీలు, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 50 మంది టైక్స్టైల్ మిల్లుల యజమానులు, ప్రతినిధులు శుక్రవారం బృందావన్ గార్డెన్స్లోని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గృహంలో కలసి పలు అంశాలపై చర్చించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి అన్ని చార్జీలతో కలిపి యూనిట్ విద్యుత్ను సుమారు రూ.5 కే అందించే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని టైక్స్టైల్ మిల్లులు సమష్టిగా 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్ను దీర్ఘకాలికంగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 2024–29 పారిశ్రామిక విధానాన్ని టెక్స్టైల్ రంగానికి అనుగుణంగా సమీక్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న మిల్లుల ఆధునీకరణకు ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ తరహాలో పథకాన్ని పునఃప్రవేశపెట్టి, ఆధునిక టెక్స్టైల్ యంత్రాలపై పెట్టుబడి వ్యయంలో 20 శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్(ఎన్టీటీఎం) పథకాన్ని సద్వినియోగం చేసుకుని భవ్య పార్క్తో పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో ఆధునిక సాంకేతిక, అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, కొత్త పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎన్టీటీఎం అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఎంపీని కలసిన వారిలో అసోసియేషన్ నాయకులు డి.బ్రహ్మానందం, ఆర్.సత్యనారాయణ, రాఘవరెడ్డి, కేవీ ప్రసాద్, బి.రామకృష్ణ, జి.కోటేశ్వరరావు, కె.రమేష్, దానారెడ్డి తదితరులున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్బాబుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ శుక్రవారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. కారు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనది కాకుండా, తిరిగి ఉపాధ్యాయుడిపై దాడి చేయడం కారు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందని, ఎవరు బాధ్యులనేది లేకుండాఉపాధ్యాయుడిపై భౌతిక దాడి చేయడం తగదని, తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సైతం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు పూర్తి సంఘీభావం తెలిపారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ వినతి -
పోలీస్ సిబ్బంది సమస్యలకు సత్వరమే పరిష్కారం
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ప్రతి శుక్రవారంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. శాఖ నిబంధనలు ప్రకారం త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది సమస్యలు సకాలంలో పరిష్కరిస్తున్నామని హామీ ఇచ్చారు. బదిలీలు, పదోన్నతులు, ఖాళీలు, పరిపాలనా అవసరాల దృష్ట్యా పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తేవాలన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని అన్నారు. మంగళగిరి టౌన్: ఏపీ గ్రీన్ సొసైటీ (ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ ఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి అరణ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. -
క్షతగాత్రులకు నూరిఫాతిమా పరామర్శ
నెహ్రూనగర్: చిలకలూరిపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం ఉదయం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి బంధువులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రమాదానికి కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఫోర్ లైన్ రోడ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసానివ్వాలి
చిలకలూరిపేటటౌన్: ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని మాజీ మంత్రి విడదల రజిని కోరారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రమాద మృతుల భౌతికకాయాలను ఆమె సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రజిని మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై వేగంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, షేక్ జాన్సైదా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు మండలనేని చరణ్తేజ్, తోటా రాజా రమేష్, నిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, సీపీఐ నాయకులు తాళ్లూరి బాబూరావు, షేక్ సుభాని, చెరుకుపల్లి నిర్మల తదితరులు ఉన్నారు. -
ప్రైవేటు ప్రయాణం.. ప్రాణాలే పణం
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని కోదాడలో జరిగిన ఘటన కళ్ల ముందు నుంచి తొలగకముందే.. చిలకలూరిపేటలో ఆటోను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అతి వేగం.. మద్యం మత్తులో వాహనాలు నడపటం, దూర ప్రాంతాలకు వెళ్తున్న బస్సుల్లో సైతం రెండో డ్రైవర్ లేకపోవటం.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రయాణికుల ప్రాణాలు బలవుతున్నాయి. కాసులే పరమావధిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అటు టీడీపీ సర్కారు కూడా ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసింది. పట్నంబజారు: కోదాడలో ప్రైవేట్ బస్సు డ్రైవరు అతివేగంతో వెళ్లి ప్రయాణికులను బలిగొన్నాడు. ఈ దుర్ఘటన జరిగి 24 గంటలు గడిచేలోపే.. చిలకలూరిపేటలో అతివేగంతో ప్రైవేట్ బస్సు వెళ్లి ఆటోను ఢీ కొంది. ఈ ఘటన చూపరులను సైతం గగుర్పాటు కలిగించింది. శుభకార్యానికి వెళ్లొస్తూ.. ఏడుగురు మంది మృతి చెందారు. ఈ నెల 26వ తేదీ రాత్రి పట్టాభిపురంలోని ఇంటర్సీటీ స్మార్ట్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్కు వెళ్తున్న బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు ఫూటుగా మద్యం తాగి బస్సును ఇష్టానుసారంగా నడిపి పలువురు వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఆ బస్సును నిలువరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు చేరుకుని.. బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించి మద్యం తాగినట్లు నిర్ధారించారు. ఆ ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సే చిలకలూరిపేటలో ఆటోను ఢీకొట్టింది. దీని యజమానులు మాత్రం చైన్నెలో ఉంటారని ఇక్కడి కార్యాలయం సిబ్బంది తెలిపారు. కనీసం సరైన సమాధానం కూడా చెప్పకుండా ‘కేసు పెట్టుకోండి, పోండి అంటూ..’ వాహనదారులతో మాట్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలాంటి ఘటనలతో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ఎంత వరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిన రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అంత దూరమూ ఒక డ్రైవర్తోనే .. దూర ప్రాంత ప్రయాణాల్లో డ్రైవర్ అలసటే ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. డ్రైవింగ్ గంటలపై చట్టపరమైన పరిమితులు, విశ్రాంతి వంటి అంశాలను రవాణా సంస్థలు పాటించాల్సిన అవసరం ఉంది. మోటారు వాహనాల చట్టంలో డ్రైవర్ల పని గంటలను నియంత్రించేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆచరణలో ఒకే డ్రైవర్తో సుదీర్ఘ ప్రయాణాలు సాగుతున్నాయి. ప్రతి సుదూర మార్గానికి తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. సంబంధిత పర్మిట్, మార్గం, రాష్ట్ర నిబంధనలు, డ్రైవింగ్ గంటల పరిమితులకు అనుగుణంగా సిబ్బంది ఏర్పాట్లు ఉండాలి. ఈ అంశాన్ని రవాణా అధికారులు తనిఖీల్లో స్పష్టంగా పరిశీలించాలి. కానీ ఆ దిశగా చర్యలు శూన్యం. స్పందించని యాజమాన్యాలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ట్రావెల్స్ సంస్థలు అంతర్ రాష్ట్ర మార్గాల్లో బస్సులు నడుపుతున్నాయి. కొన్ని సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒక ప్రాంతంలో ఉండగా... బస్సుల నిర్వహణ మరో ప్రాంతం నుంచి సాగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా డ్రైవర్, సిబ్బంది మాత్రమే కనిపిస్తారు. అసలు యజమానులు స్పందించడం కూడా మానేశారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు తనిఖీలు నిర్వహించడం ముఖ్యం. వాహనాల రికార్డులు, డ్రైవర్ల వివరాలు, ఫిట్నెస్, పర్మిట్లు, బీమా, మార్గ నిబంధనలు, వేగ నియంత్రణ, డ్రైవర్ పని గంటలు తదితర అంశాలపై రవాణా శాఖ పర్యవేక్షణ ఉండాలి. కానీ తనిఖీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. బస్సు నడిపే వ్యక్తి మద్యం తాగి ఉంటే అది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన కాదు.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్య. రాత్రి వేళల్లో బస్సులను తనిఖీ చేసే సమయంలో డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాలు, రాత్రి సమయాల్లో ప్రయాణించే సుదూర బస్సులపై ప్రత్యేక నిఘా అవసరం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చట్టపరంగా రవాణా వాహనం పబ్లిక్ ప్లేస్లో నడవాలంటే సంబంధిత పర్మిట్ ఉండాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం పబ్లిక్ వాహనాలకు పర్మిట్ ఉండాలి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యం వద్ద సరైన పర్మిట్ ఉందా? ఆ ప్రకారం వాహనం నడుస్తోందా? అంతర్ రాష్ట్ర ప్రయాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? పర్మిట్ షరతులు ఉల్లంఘిస్తున్నారా? వంటి అంశాలను ఆర్టీఏ అధికారులు నిరంతరం పరిశీలించాలి. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇకనైనా నిబంధనలను పక్కాగా అమలు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


