breaking news
Guntur District News
-
మాదకద్రవ్యాలతో యువత నిర్వీర్యం
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారని ఏపీ పోలీస్ ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నివారణపై ఆదివారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యా లు, మత్తు పదార్థాల వలన నేరాలు అధికంగా ఉన్నాయని, అరికట్టేందుకు ప్రభుత్వం తమ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మత్తుకు బానిసలు కావడం దురదృష్టకరమని తెలిపారు. కళాశాలల్లో అవగాహన సదస్సుల ద్వారా దుష్పరిణామాలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ యువతలో బాధ్యత పెంచేలా ఈగల్ వింగ్ తో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను పురుషుల కంటే మహిళలు అధికంగా వాడటం దురదృష్టకరమని, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలని తెలిపారు. మాస్టర్మైండ్స్ విద్యార్థులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆకే రవికష్ణ ప్రారంభించారు. ఈగల్ పోలీస్ వింగ్ ఎస్పీ నగేష్ బాబు, డీఎస్పీ అరవింద్, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ జయపాలరెడ్డికి అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జయపాలరెడ్డి వెలగల ఎంపికయ్యారు. ప్రపంచ వైద్య రంగంలో ముఖ్యంగా సర్జికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే బిరుదు ఆయనకు లభించింది. ఈ విషయాన్ని ఏసీఎస్ డైరెక్టర్ మైఖేల్ ఇ–మెయిల్ ద్వారా డాక్టర్ జయపాలరెడ్డికి తెలిపారు. చికాగోలో అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు క్లీనికల్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. 10 వేల మందికిపైగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ జయపాలరెడ్డి ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన ఆయన విశాఖపట్నంలో 2004లో ఎంబీబీస్ చదివారు. పాండిచ్చేరి జిప్మర్లో 2012లో జనరల్ సర్జరీలో పీజీ చేశారు. కేరళ కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జపాన్లో ఫెలోషిప్ చేశారు. కొచ్చిలో ఐదేళ్లపాటు, ముంబయి కోకిలా బెన్ హాస్పిటల్లో ఏడాదిపాటు పనిచేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పెద్దపేగు క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, ప్యాంక్రియాస్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు చేశారు. ఎన్నారై మెడికల్ కాలేజ్లో 2021 నవంబర్ నుంచి సంబంధిత వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. 1500కుపైగా ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. ఈ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ జయపాలరెడ్డి తెలిపారు. వైద్య కళాశాల, హాస్పిటల్ యాజమాన్యం, సర్జన్లు ఆయన్ను అభినందించారు. -
తెలుగు తమ్ముళ్ల అరాచకపర్వం
మేడికొండూరు: తొలి ఏకాదశి పర్వదినాన పేరేచర్ల సింగరయ్య స్వామి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరుగుతాయి. మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో పేరేచర్ల గ్రామంలో వరదరాజస్వామి దేవస్థానం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ ఊరేగింపుగా వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరేగింపును అడ్డగించారు. టీడీపీ జెండాలతో, పాటలతో ప్రభను అడ్డగించి గొడవకు ది గారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సర్ది చెప్పినా మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అరాచకాలు అంతా ఇంతా కాదని ప్రజలు మండిపడుతున్నారు. -
హక్కుల కోసం పోరాటానికి సిద్ధంకండి
నెహ్రూనగర్: హక్కుల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ ఏకమై పోరాడేందుకు రాష్ట్రస్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ డీజీపీ, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం గుంటూరులోని శ్రీనగర్లో మండల్ స్టడీ సర్కిల్లో ఆగస్టు నెలలో నిర్వహించే భారీ రాష్ట్ర మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడంపై నిలదీసి అడగాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలన్నదే ఏకై క లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పోరాటానికి సన్న ద్ధం కావాలన్నారు. తమిళనాడు తరహాలో ఇక్కడా బ్లాక్ షర్ట్ ఉద్యమం మొదలవ్వాలని పేర్కొన్నారు. జనాభాలో అత్యధిక వాటా ఉన్నా బీసీలకు రాజ్యాధికారం తదితర విషయాల్లో న్యాయం జరగడం లేదన్నారు. వారికి రిజర్వేషన్లు కూడా అదే దామాషాలో ఉండాలన్నా రు. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షె డ్యూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నా, అధికారం నామమాత్రంగానే ఉంటోందని చెప్పారు. నిజమైన అధికారం ఎప్పుడూ కొన్ని వర్గాల చేతు ల్లోనే ఉంటోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం రావాలన్నారు. అందుకోసం పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకం కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యం మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు -
సెల్ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేటి కాలంలో పిల్లల విద్యాభివృద్ధికి సెల్ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్ఫోన్తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్లోడ్, డౌన్లోడ్తో, ఆన్లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలని, అతిగా ఆధారపడి, దానికి బానిసగా మారితే కర్తవ్యం మరుగునపడి వ్యవస్థ పతనం అవుతుందని అన్నారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్లు ధరించి హార్డ్వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలగొట్టి లోపలకు దూరారు. అక్కడి నుంచి 2.45 గంటల వరకు షాపులో ఉండి పలు వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లో వున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్లు ధరించి ఉండడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేల నగదు చోరీ అయినట్లు యజమాని తెలిపారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం రూ.3 లక్షల సామగ్రి దొంగతనం -
దేశం గర్వించదగ్గ నేత బాబూ జగ్జీవన్రాం
పట్నంబజారు: దేశం గర్వించదగ్గ మహోన్నతుడు భారతరత్న బాబూ జగ్జీవన్రాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కొనియాడారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్రాం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బిహార్లో జన్మించిన బాబు జగ్జీవన్రాం యావత్ దేశానికి సేవలు అందించారన్నారు. దేశంలో కరువు సమయంలో ఆహార శాఖ మంత్రిగా సవాళ్లను అధిగమించి పరిపాలన అందించిన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. రక్షణ శాఖ మంత్రి సైతం ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆయన కారులో ప్రయాణం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. నేటితరం ప్రజాప్రతినిధులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పేదల పక్షాన పోరాడిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రాం కృషి ఎనలేనిదని తెలిపారు. వారి ఆశయాలను వైఎస్సార్ సీపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. జగ్జీవన్రాం స్ఫూర్తితో ముందుకు సాగుతాం.. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ జగ్జీవన్రాం వంటి మహనీయులను చూసి గర్వపడాలో, కూటమి ప్రభుత్వంలో హత్యలకు గురవుతున్న దళిత నేతలను చూసి బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో జగ్జీవన్రాం స్ఫూర్తితో ఎదిగిన నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు. బలహీన వర్గాలు పైకి రాకూడదని, దళిత వ్యతిరేకిగా ధూళిపాళ్ల నరేంద్ర పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు చేసినా జగ్జీవన్రాం వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వైఎస్సార్ సీపీ మాత్రమే చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలకు అందిసుందని పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) కూడా ప్రసంగించారు. నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, నందేటి రాజేష్, తాడిబోయిన వేణుగోపాల్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, పిల్లి మేరీ, ప్రభు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళి -
ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యునియన్ ప్రెసిడెంట్గా వాసుబాబు
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన శిరసాల వాసుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గోల్డ్ అప్రైజర్ల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తనను రాష్ట్ర ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాసుబాబు నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. ఆయనను సత్కరించారు.అప్రైజర్ కుటుంబానికి ఆర్థిక సాయంఏపీ గ్రామీణ బ్యాంక్ తిరుపతి బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ మస్తాన్ కిడ్నీ ఫెయిల్ అయి అనారోగ్యంతో చైన్నె వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నుంచి రూ.1.05 లక్షలు నగదు ఆదివారం ఆర్థిక సాయంగా అందించారు. మస్తాన్ భార్య జాన్బీకి నగదును అందించినట్లు యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శిరసాల వాసుబాబు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బాధ్యులు, తదితరులు ఉన్నారు.శిలాఫలకం ధ్వంసం చేసిన టీడీపీ నాయకులునరసరావుపేటటౌన్: రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామంలో సాగు నీటి సంఘం కార్యాలయ శిలాఫలకాన్ని టీడీపీ గ్రామ నాయకులు శనివారం ధ్వంసం చేశారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భవన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీన్ని గ్రామ టీడీపీలోని వ్యతిరేక వర్గం ధ్వంసం చేసింది. దీంతో టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ధ్వంసం చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వీరవట్నం గ్రామ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు వెలగమూరి వెంకటనారాయణ రొంపిచర్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. -
కొనసాగిన నాటికల పోటీలు
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ – తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు రెండవ రోజైన ఆదివారం కొనసాగాయి. ప్రదర్శనలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేశారు. సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలిగా చైతన్య కళాస్రవతి–ఉక్కునగరం, విశాఖ వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. సుధ మోదుగు మూలకథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించగా పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. తదుపరి న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి ‘ఐ యేట్ ఇండియా’ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్.చౌదరి. చివరిగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘అనుకున్నదొకటి అయినదొక్కటి’ హాస్యనాటికను ప్రదర్శించారు. గోపి వల్లభ రచనకు ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. మే నెలలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించి, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ధ్రువపత్రాలు అవసరమంటే.. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన ధ్రువపత్రాల జాబితాను నోటిఫికేషన్లో పొందుపర్చారు. ఏపీఈఏపీసెట్–2025 ర్యాంక్ కార్డ్, హాల్ టిక్కెట్, ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్ సర్టిఫికెట్, టీసీ, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, 2025–26 సంవత్సరపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేటు విద్యార్థులకు రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు, శారీరక వైకల్యం గల విద్యార్థులకు సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం అని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుతో మొదలు ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సెట్స్.ఏపీఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏపీఈఏపీసెట్ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ● రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఇదే వెబ్సైట్లో క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఏపీఈఏపీసెట్ డీటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్ల పరిశీలన ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈఏపీసెట్కు దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వెబ్ బేస్డ్ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ‘రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి’ అనే చోట క్లిక్ చేయాలి. తద్వారా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయిన విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్పై కేండెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తే, విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధం కావచ్చు. ఈ విధంగా కాకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హెల్ప్లైన్ కేంద్రంలో పురోగతిలో ఉన్న పక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. సమీప కేంద్రం ఎంపిక ఇలా.. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలు అసంపూర్తిగా ఉండటం, వివరాలు అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో కాంటాక్ట్ హెల్ప్లైన్ సెంటర్ (హెచ్ఎల్సీ) అని డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఆన్లైన్లో పొందుపర్చిన హెల్ప్లైన్ కేంద్రాల జాబితా నుంచి తమకు సమీపంలోని కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అసమగ్రంగా ఉన్న సర్టిఫికెట్ల వివరాలు ప్రత్యక్షమవుతాయి. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్థులు తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత హెచ్సీఎల్లో అధికారులు వాటిని పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి ఏపీఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి 17 వరకు హెల్ప్లైన్ కేంద్రాల వారీగా ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన 13 నుంచి 18వ తేదీ వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు హెల్ప్లైన్ కేంద్రాలు ఇక్కడున్నాయి.. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఆయా హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 17వ వరకు పరిశీలిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 19న తుది అవకాశం ఉండగా, ఈ నెల 22న సీట్ల కేటాయింపు జరుపుతారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కళాశాలల్లో చేరికలు, ఆగస్టు 4వ తేదీ నుంచి బీటెక్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. -
హత్యాయత్నంలో ఎమ్మెల్యేపై అనుమానాలు
నగరంపాలెం: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావుపై పాశవికంగా జరిగిన హత్యాయత్నంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాత్రపై అనుమానం ఉందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆరోపించారు. నాగ మల్లేశ్వరరావు కేసు పూర్వపరాలను ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి మోదుగులతోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బాధితుని సోదరుడు అమరేంద్ర, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఈ హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా పోలీసుల దర్యాప్తు నత్తనడకగా సాగుతోందని ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గుర్ని అరెస్ట్ చేశారని, పాత్రధారుల కంటే సూత్రధారులు ముఖ్యమని అన్నారు. జంట హత్య కేసుల్లో సీసీ టీవీ ఫుటేజీలో పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఉన్నారా? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ రూల్ను ఇక్కడ స్థానిక శాసనసభ్యునికి వర్తింపజేయరా అని అన్నారు. రైతులను పరామర్శించేందుకు మిర్చియార్డుకు వెళ్తే మాజీ సీఎం వైఎస్ జగన్, ఇతర నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రెడ్బుక్ ప్రకారమే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ సీటులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ స్థానంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూర్చుంటే సరిపోతుందని మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర సూచనల్లేకుండా బాబురావు కుటుంబం ఈ హత్యాయత్నం చేయదని ఆరోపించారు. హత్యాయత్నం బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసుల నమోదులో పోలీసుల దూకుడు కూటమి నేతలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం దాడి సూత్రధారి అయిన ఎమ్మెల్యే ధూళిపాళ్లపై కేసు నమోదు చేయాలి గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు ఎఫ్ఐఆర్లో చేర్చే వరకు ఎంతవరకై నా పోరాడతామని స్పష్టీకరణ -
భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి
మంగళగిరి/ మంగళగిరి టౌన్: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కింది. ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిశాయి. భక్తులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళగిరి నగర పరిధిలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. పూజారులు ముందుగా స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గరుడ వాహనంపై వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అడిషనల్ కమిషనర్ సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయాల్లో విశేష పూజలు గరుడ వాహనంపై దర్శనమిచ్చిన నృసింహస్వామి కిటకిటలాడిన దేవాలయాలు -
ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించండి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ సిబ్బందికి సూచించారు. ఓవర్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపును ఎస్పీ ఆదివారం స్వయంగా పరిశీలించారు. శంకర్విలాస్ బ్రిడ్జి వద్ద (బ్రాడీపేట వైపు), కంకర గుంట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద, మూడు వంతెనల మార్గం వద్ద, కొత్తపేట శివాలయం వద్ద చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపు చర్యలను పరిశీలించి ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి, మూడు వంతెనల మార్గం వద్ద నీరు ఎక్కువగా చేరడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ట్రాఫిక్ అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ఎం.రమేష్, వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, ట్రాఫిక్ ఈస్ట్, వెస్ట్ సీఐలు ఏ.అశోక్, సింగయ్య, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, నగరంపాలెం సీఐ నజీర్బేగ్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్ ఎస్సైలు రవీంద్రబాబు, సాంబశివనాయక్ తదితరులు పాల్గొన్నారు.భారీగా రేషన్ బియ్యం స్వాధీనంప్రత్తిపాడు: రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్ క్షమారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.పటాలంలో తొలి ఏకాదశి పూజలుమంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాడెంట్ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంగల వలి వీరారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చిత్రాల ఓబేదు, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు, పెదకూరపాడుకు చెందిన కొండవీటి కోటేశ్వరరావు, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, ఏ అంజిరెడ్డి, కొమ్మిరెడ్డి గురవారెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సామ్రాజ్యంను అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈపూరి రమేష్ (ఆదాం)ను పార్టీ పంచాయతీరాజ్ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఘనంగా జగన్నాథ రథయాత్ర మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలో శనివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. గౌడియా మఠం ఆధ్వర్యంలో నగర పరిధిలోని ఘాట్రోడ్ వద్ద నుంచి మెయిన్రోడ్ మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్లో ఇది కొనసాగింది. కేరళ డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ హరేకృష్ణ.. హరేరామ.. రామరామ హరేహరే అంటూ భక్తులు ముందుకు సాగారు. ప్రతి కూడలిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీడీఓలకు శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్: క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఎంతో కీలకమని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు పేర్కొన్నారు. శనివారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక 2.0 వెర్షన్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) వార్షిక ప్రణాళిక రూపకల్పనపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయి కుమార్, రాష్ట్రస్థాయి శిక్షకుడు డి.రవీంద్రబాబు, డీపీఎం సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులు పాల్గొని శిక్షణ కల్పించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. సెవెన్త్ జనరేషషన్ బై ప్లేస్ క్యాథ్ ల్యాబ్ను శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో అహంతెమ్ శాంత సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు గుండెకు సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సుమారు రూ. 11 కోట్లు ఖరీదు చేసే అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అనంతరం ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కడియాల వికాస్, ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘డొంక’ తిరుగుడు లేకుండా
రియల్ ఎస్టేట్ వెంచర్కు దారి కోసం ఎమ్మెల్యే సోదరుడి దందాసాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మా వెంచర్లకు రోడ్డు వేసుకుంటాం.. డొంక రోడ్డును ప్రభుత్వ రేటుకు ఇచ్చేయండని’ కూటమి ఎమ్మెల్యే సోదరుడు ప్రతిపాదన పెట్టడం ఆలస్యం చిన్నబాబు అంగీకారం తెలపడంతో ఆ భూమికి రెక్కలొచ్చేశాయి. ఆగమేఘాలపై ఫైలు కదిలింది. తమ పొలాలకు దారి ఉండదని రైతులు అభ్యంతరం చెబుతున్నా రూ. 10 కోట్ల విలువైన భూమిని రూ. 2 కోట్లకే అప్పగించడానికి రంగం సిద్ధమైంది. దీనిపై అభ్యంతరాలు తెలపాలంటూ తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నోటీసులు కూడా అంటించారు. పొలాల దారి మూసేసి.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైల్వే ట్రాక్, ఐఓసీ వెనుక ఉన్న 99 ఎకరాల భూమిని 36 మంది రైతులు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి 33 మంది రైతుల నుంచి 94 ఎకరాలను సేకరించారు. ఈ వెంచర్ కోసం రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్డు తీసుకోవడానికి ఎమ్మెల్యే సోదరుడు సిద్ధమయ్యారు. సర్వే నంబర్ 255, 275/1ఏ, 302, 316–1లోని 2.04 ఎకరాల డొంక రోడ్డు భూమిని తమకు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఎల్ ఆకారంలో ఉండే ఈ డొంక రోడ్డు ఒక భాగం పంట పొల్లాలోకి వెళ్తుంది. మరో భాగంలో తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు పోయేందుకు కాలువ ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్కెట్ విలువ రూ. 10 కోట్లు ఉండగా, ప్రభుత్వ రికార్డుల్లో ధర రూ.2 కోట్లకు ఎమ్మెల్యే సోదరుడు కోరడం, చినబాబు అండతో ఆ ఫైలు చకచకా కదలడం జరిగిపోయాయి. అభ్యంతరాలు వింటేగా... డొంక రోడ్డు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అభ్యంతరాలు ఉంటే తెలపాలని తహసీల్దార్ పేపరు ప్రకటన ఇచ్చారు. ఎంటీఎంసీ కార్యాలయం, తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయంలోని బోర్డుల్లో కూడా ఈ నోటీసులు పెట్టారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. డొంక రోడ్డు వెంచర్లకు ఇస్తే తమ పొలాలకు దారి ఉండదని చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్కు ఆవల ఉన్న 55 ఎకరాలకు ఇదే దారి. వీటిని వివరిస్తూ, తమ అభ్యంతరాలతో పలువురు రైతులు జిల్లా కలెక్టర్, జేసీ, తాడేపల్లి తహసీల్దార్, ఎంటీఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈలోగా ఎమ్మెల్యే సోదరుడు రోడ్డు పనులు వేగంగా చేసుకుపోతున్నారు. మిమ్మల్ని రైల్వే అధికారులు వెళ్లనివ్వడం లేదు కదా.. ఇక మీకు ఈ దారి ఎందుకు అంటూ ఎమ్మెల్యే సోదరుడు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ వారైనందున తాడేపల్లి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేశారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదించిన కూటమి ఎమ్మెల్యే బంధువు సర్కారు పెద్దల ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన ఫైలు రూ.10 కోట్ల భూమి రూ.2 కోట్లకే అప్పగింత! తమకు దారి లేకుండా చేస్తున్నారని రైతుల ఆందోళన డ్రైనేజీని సైతం పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ డ్రైనేజీని కూడా కలిపేస్తారా?తాడేపల్లి తహసీల్దార్ డొంక రోడ్డులో ఒక వైపు మాత్రమే ఉన్న రెండెకరాలను ఎమ్మెల్యే సోదరుడికి అతి తక్కువ ధరకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా 20 అడుగుల వెడల్పు డొంక, 10 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ డ్రైనేజీని మూసేస్తే తాడేపల్లి పట్టణం సలాం హోటల్ సెంటర్, ముగ్గురోడ్డు, పోలకంపాడు నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లదని పేర్కొంటున్నారు. ఇది తాడేపల్లికి ప్రమాదకరమని రైతులు అంటున్నారు. అయినా.. చినబాబు, ఎమ్మెల్యే అండదండలు, అధికారుల దన్నుతో డొంక రోడ్డును వెంచర్ రోడ్డుగా మార్చడానికి రంగం సిద్ధమై పోయింది. -
కోటప్పకొండపై తొలి ఏకాదశికి ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రత్యేక క్యూలైన్లలో ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలను కల్పించనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇవిగో.. హత్యారాజకీయాలకు సాక్ష్యాలు
వైఎస్సార్ సీపీకి బలం ఉన్న చోట దాడులు చేయిస్తున్నారని, పార్టీ నేతలు, కార్యకర్తలను భయపెడుతున్నారని మురళీకృష్ణ మండిపడ్డారు. చింతలపూడి గ్రామంలో సొసైటీ సెక్రటరీ కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన మరణ వాంగ్మూలంలో ధూళిపాళ్ల పేరు రాయలేదా... యలవర్తి నాగేశ్వరరావును హత్య చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వెల్లలూరును ఫ్యాక్షన్ గ్రామంగా మార్చింది ధూళిపాళ్లేనన్నారు. అనేక మందిపై దాడులు చేయించిన చరిత్ర ఉందన్నారు. మినీ మహానాడు సాక్షిగా వైఎస్సార్ సీపీ నేతలను భూస్థాపితం చేయాలని, లేని పక్షంలో తానే రంగంలోకి దిగుతానని మండల టీడీపీ అధ్యక్షుడు బాబూరావును ఉద్దేశించి ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అన్నారు. -
నృసింహుని ఆదాయం రూ.57.59 లక్షలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ కానుకలను శనివారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లో ఉన్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 57,59,764 వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 25,52,133, దిగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 30,57,173, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 87,409 తోపాటు అన్నదానానికి రూ. 63,049 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. గతంలో కంటే రూ.11,95,012 అధికంగా వచ్చినట్లు ఆయన వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు శ్రీ జగన్నాథస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థ్ధానాల సహాయ కమిషనర్ డి.సుభద్ర పర్యవేక్షించారు. ఎయిమ్స్లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్ మంగళగిరి: ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన పలు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. -
కూటమి సర్కార్కు తీరని రక్త దాహం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వానికి రక్త దాహం తీరినట్టులేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావును శనివారం సుధాకర్రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ , వనమా బాల వజ్రబాబులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంతమందిని పొట్టనపెట్టుకుంటారు? పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట జరిగే ఈ రక్త దాహానికి అంతులేకుండా పోతోందని అన్నారు. నాలుగేళ్లలో వైఎఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని మండిపడ్డారు. ఇప్పటి వరకు అనేక మందిని హతమార్చారని ఆరోపించారు. ఏ ఒక్కరి రక్తపు బొట్టు చిందినా వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అన్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లా చూసుకున్నారని తెలిపారు. నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడికి పాల్పడటం దారుణమని అన్నారు. ీసీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు వైరల్ అయి, ప్రజల్లోకి వెళ్లడంతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యేను కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలి పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహ ంతోనే ఈ హత్యాకాండకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల మినీ మహానాడులో జరిగిన వీడియో ఆధారంగా ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పారు. నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడి దారుణం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఈ కేసులో విచారించాలని డిమాండ్ -
గుంటూరు పోస్టల్ ఉద్యోగులకు పురస్కారాలు
లక్ష్మీపురం: గుంటూరు డివిజన్ పోస్టల్ ఉద్యోగులకు ప్రాంతీయ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా పురస్కారాలను అందజేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు డివిజన్కు చెందిన పోస్టాఫీసుల సూపరింటెండెంట్ యు. యలమందయ్యకు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్’, సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పఠాన్ కరిముల్లా ఖాన్కు ‘సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్’ను అందించారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్, విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్షల చేతుల మీదుగా ఈ పురస్కారాలను వారు అందుకున్నారు. ఉద్యోగుల అంకిత భావం, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం అని యు.యలమందయ్య చెప్పారు. -
హైవేలో భారీగా మద్యం స్వాధీనం
ప్రత్తిపాడు: జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఆబ్కారీ స్పెషల్ టీంలు స్వాధీనం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల పదహారవ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో మురుగన్ హోటల్ వెనుక ఖాళీ ప్రదేశంలో అక్రమంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసి, విక్రయాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, ఎస్ఐ రెహమాన్, ఈఎస్టీఎఫ్ సీఐ నయనతార, ఎస్ఐ సత్యనారాయణ బృందాలు స్థానిక ఆబ్కారీ స్టేషను సీఐ అశోక్, ఎస్ఐ రవీంద్రబాబులతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించాయి. దాడుల్లో వివిధ బ్రాండ్లుకు చెందిన 2,598 మద్యం సీసాలు, 246 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సీజ్ చేసి ప్రత్తిపాడు ఎకై ్సజ్ స్టేషనుకు తరలించారు. ఈ మేరకు ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ల ప్రసాదరావుపై శనివారం కేసు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ అశోక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 7 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ –తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు ప్రముఖ సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా అధ్యక్షత వహించారు. డీఎల్ కాంతారావు పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, రంగస్థల, సినీనటుడు వేమూరి విజయభాస్కర్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలిగా హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ‘సారీ...రాంగ్ నెంబర్’ నాటికను ప్రదర్శించారు. చింతల మల్లేశ్వరరావు రచనను మహ్మద్ ఖాజావలి దర్శకత్వంలో ప్రదర్శించారు. అనంతరం కళాంజలి, హైదరాబాద్ వారి ‘వీడేం మగాడండీ బాబు’ హాస్యనాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావులు పర్యవేక్షించారు. -
20న వైద్య కళాశాలలో రాష్ట్ర సదస్సు
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్)లు సంయుక్తంగా వైద్యులలో శాసీ్త్రయ అవగాహనే లక్ష్యంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై వైద్య విద్యా సదస్సు నిర్వహించనున్నాయి. ఈ పోస్టర్ను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై రాష్ట్రస్థాయి సద స్సు నిర్వహించటం అభినందనీయం అన్నా రు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ జూలై 20వ తేదీన గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ‘శాసీ్త్రయ అవగాహనతో.. వైద్యరంగం బాధ్యతతో.. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై యుద్ధం చేద్దాం – విజయం సాధిద్దాం’ పేరిట ఈ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోగంటి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరి రావు, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం. సుభాష్ చంద్రబోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ తాతా సేవకుమార్, ఏపీఎంసీ సభ్యులు డాక్టర్ కేశవరావు బాబు, ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ జె.సి.నాయుడు, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మారుమోగిన హరేకృష్ణ నామస్మరణ
నగరంపాలెం: గుంటూరు నగర వీధుల్లో హరేకృష్ణ నామస్మరణ మారుమోగింది. హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చంద్రమౌళినగర్లోని మాజేటి రామ కల్యాణ మండపం వద్ద శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. కొరిటెపాడు, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ మీదగా మరలా రామ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామి వారి రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కృష్ణ జన్మాష్టమి వరకు సహస్ర కోటి హరినామ జప యజ్ఞం నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు వంశీధర్ దాస తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎస్ఎల్వీ రాజు, క్రేన్ వక్కపొడి సంస్థల డైరక్టర్ గ్రంధి కాంతారావు పాల్గొన్నారు. -
బాభౌయ్.. ర్యాభౌస్..!
గుంటూరు మెడికల్: కుక్కకాటుతో ర్యాబీస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి 2011లో రాష్ట్రాన్ని వణికించింది. ప్రతి ఏడాది ర్యాబీస్తో జిల్లాలో పది నుంచి 15 మంది మరణిస్తున్నారు. మున్సిపాలిటీలలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవటం లేదని, కుక్కలు రోజూ గాయపరస్తున్నాయని గుంటూరు కార్పోరేషన్తోపాటుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది వేలల్లో కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లో 2023లో 34,931 మంది, 2024లో 37,202, 2025 జూన్ వరకు 13,002 కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ... ప్రతి కుక్కలోనూ ర్యాబీస్ వైరస్ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ర్యాబీస్ వ్యాధి సోకిన కుక్క నాలుక బయటకు చాపి, చొంగ కారుస్తూ మతి స్థిమితం లేకుండా తిరుగుతుంది. తన యజమానిని గుర్తించలేక పోవటం, కన్పించిన ప్రతి వస్తువును కరిచేందుకు ప్రయత్నిస్తుంది. నడిచేటప్పుడు తడబడుతూ, తూలుతూ తోకను ఆడించలేని స్థితిలో ఉంటుంది. అరుపులో మార్పు వస్తుంది. నీటిని కూడా తాగలేని స్థితిలో అంటు డొక్కలు పడి ఊపిరి పీల్చుకోలేక ఐదు నుంచి ఏడు రోజుల్లో మరణిస్తుంది. మనుషులు ర్యాబీస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాలలో రోగి నీటిని చూసినా ,నీటి శబ్దం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి, ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు. కుక్కకాటుతో ర్యాబిస్ వ్యాధి ప్రతి ఏడాది జిల్లాలో 15కుపైగా మరణాలు వ్యాక్సిన్తో కచ్చితమైన రక్షణ నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను ‘జూనోసిస్’ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, గుర్రాలు, పందులు, పిల్లులు, పక్షులు, ఎలుకలు తదితర పశుజాతుల నుంచి సుమారు 280 రకాల వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. వీటిల్లో క్షయ, మెదడువాపు, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, ర్యాబిస్ ముఖ్యమైనవి. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 6 జూలై 1885లో పిచ్చికుక్కకాటుకు గురైన బాలుడికి ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా వేసి రక్షించారు. నాటి నుంచి జూలై 6ను ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
సీఎం చంద్రబాబు దళిత ద్రోహి
తాడేపల్లి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చులకన భావన ఉంది.. బహిరంగ ప్రాంతాల్లోనే ఎస్సీలను దూషిస్తూ అవమాన పరుస్తున్నారు.. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ సమావేశంలో సింగయ్య మృతిని కుక్కతో పోల్చారని దళిత సంఘ నాయకులు, బీసీ నాయకులు శుక్రవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారని తెలిపారు. బహిరంగ సభల్లో, విలేకరుల సమావేశంలో దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్త సింగయ్య మృతి చెంది వారి కుటుంబం బాధల్లో ఉంటే మృతిని కుక్కతో పోల్చి అవమానించారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులు, బీసీలు జరిగిన సంఘటనపై చాలా బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పోలీస్శాఖ వెంటనే నిజాయితీగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కేసులు పెడుతున్నామని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు గద్దేటి సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎస్టీ నాయకులు లక్ష్మీపతి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూదాల శ్రీను, శ్రీరాంశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నలకుర్తి రమేష్, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షులు బొందిలి నరేంద్ర సింగ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి కలపాల అజయ్, మల్లవరపు సుధారాణి, సుభాషిణి, కొమ్ము చంటి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, కాపు సంఘం నాయకులు మిరియాల రాంబాబు, చిట్టిమల్ల సుబ్బు, దర్శి రమేష్, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. ఎస్సీలంటే చులకన భావన అదే బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు సింగయ్య మృతిని కుక్కలతో పోల్చడం దారుణం ముఖ్యమంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తాం వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు -
మనవరాలిని చంపిన తాత అరెస్ట్
తాడేపల్లి రూరల్ : మండలంలోని కుంచనపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి మనవరాలిని నీళ్లలోకి విసిరేసి, మృతికి కారణమైన తాతయ్యను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఓ వృద్ధుడు బాలికను తీసుకువచ్చి బలవంతంగా కాలువలోకి విసిరి వేశాడని తెలిపారు. 100కు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కాలువలో గాలించి, బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలికను తాడికొండ మండలం బడేపురానికి చెందిన కూరపాటి హేమగా గుర్తించామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక తాతయ్యను తాడికొండ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలైన హేమ తల్లి, తండ్రి చనిపోయారన్నారు. తాతయ్య మాధవరావు, నాయనమ్మ సుమతి పెంచుతున్నట్లు చెప్పారు. నాయనమ్మ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఈ మధ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నారు. హేమకు కూడా అక్కడే వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు అనారోగ్యం కుదుటపడదని చెప్పడంతో తాతయ్య, నాయనమ్మ ఆందోళన చెందారు. ఇద్దరికీ మందులు ఖర్చులకు డబ్బులు లేకపోవడం, తాము లేకపోతే మనవరాలు ఏమవుతుందనే ఆందోళనతో కాలువలోకి పడవేసి హత్య చేశాడని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మాధవరావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మృతి నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ -
వైద్య విద్యార్థులతో కూటమి సర్కార్ చెలగాటం
పట్నంబజారు: వైద్య విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్. వినోద్ ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా రూ.8,500 కోట్లతో వైద్య విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన ముందుకు సాగారని చెప్పారు. ఏడాది పాలనలో కనీసం విద్యార్థుల కోసం ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం, వారి జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతో వైభవోపేతంగా నడిచిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కూటమి సర్కార్ దుర్బుద్ధితో తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యార్థి సంఘ నేతలు రవి, గంటి, జగదీష్, అజయ్, కోటి, అజయ్, అరుణ్, సన్నీ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
గుంటూరు మెడికల్: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును శుక్రవారం మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఎప్పటి నుంచో నియోజకవర్గంలో మంచి పేరు ఉందని తెలిపారు. గ్రామంలో అడ్డగోలుగా టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకే త్రీవంగా దాడి చేశారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మెదడు బాగా దెబ్బతిందని, అవయవాలు పని చేయడం లేదని తెలిపారు. టీడీపీ కూటమి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఒక టీమ్ పెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులపై దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మృతి చెందిన సింగయ్య కేసు విషయంలో కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సింగయ్య మృతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కారుకు సంబంధం లేదని చెప్పారన్నారు. మళ్లీ జగన్ కారుపై కేసు పెట్టడంపై కోర్టు కూడా తీవ్రంగా ప్రభుత్వానికి , పోలీసులకు అక్షింతలు వేసిందని తెలిపారు. సింగయ్య మృతి గురించి సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ కుక్కలతో పోల్చారని, ఇది ఎస్సీలను తీవ్రంగా అవమానించటమేనని పేర్కొన్నారు. అనంతపురంలో 13 ఏళ్ల బాలికపై 18 మంది రేప్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఎస్సీలంతా వైఎస్ జగన్ వెంట ఉంటారు కాబట్టి వారిని భయపెట్టేలా, అంతం చేసేలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు దాడి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, రిటైర్డ్ జడ్డితో విచారణ చేయించాలని నాగార్జున డిమాండ్ చేశారు. పోలీసుల సహకారం లేకుండా ఇలాంటి దాడులు జరగవని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యులు -
బాబు మోసాలను ఎండగడదాం !
మంగళగిరి టౌన్ /మంగళగిరి: ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని బైపాస్ రోడ్డులో గల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాబు మోసపూరిత హామీలను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వివిధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనను ప్రజలకు వివరించండి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికీ ప్రచారం క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం కార్యాచరణ సిద్ధం అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని వారి తరఫున పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలసి పోరాటం చేస్తాం. నిస్వార్థంగా వైఎస్సార్ సీపీ తరఫున కష్టపడుతున్న కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. వారికి ఏ అవసరం వచ్చినా పార్టీ ముందుంటుంది. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ -
కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు: టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. హాస్పిటల్కు వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించే విధంగా పర్యవేక్షిస్తున్నారు. స్పెషలిస్టులతో మాట్లాడి ఎప్పటికప్పుడు నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని అంబటి మురళీకృష్ణతో పాటు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడిని అంబటి మురళీకృష్ణ తీవ్రంగా ఖండించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా టీడీపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. పచ్చగా ఉండే పల్లెల్లో ఎర్రటి రక్తాన్ని చిందిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నడూ చూడని హత్యా రాజకీయాలను నేడు టీడీపీ చేస్తోందని విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అణచివేయడమే లక్ష్యంగా మన్నవ గ్రామంలో కుల రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ స్థానికంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే లక్ష్యం కుల, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే నరేంద్ర మన్నవలో ఒకే సామాజిక వర్గాన్ని అణచి వేయడమే లక్ష్యంగా కుట్ర -
అల్లూరికి నివాళి
గుంటూరు వెస్ట్: విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక నాజ్ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి త్యాగాలను నేటి యువత నిత్యం మననం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్టెప్ సీఈఓ చంద్రముని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.మురళి, అధికారులు పాల్గొన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో... తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛను అందించేందుకు ప్రజల్లో చైతన్యం నింపి, స్వాతంత్య్ర ఉద్యమానికి దివిటీగా మారిన సమరయోధుడు అల్లూరని కొనియాడారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎవో శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!
పట్నంబజారు: గుంటూరు నగరం వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తుతోంది. నగరంలో సుమారు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బుల్లెట్ల సంఖ్య 40 వేలకు పైమాటే. లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు రోడ్డు, అరండల్పేట, బ్రాడీపేట, ఈస్ట్ పరిధిలోని కొత్తపేట, ఎత్తురోడ్డు సెంటర్, నల్లచెరువు, ఆర్టీసీ బస్టాండ్, నాజ్సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డు, ఓల్డ్క్లబ్ రోడ్డు, అరవై అడుగుల రోడ్డు ప్రాంతాల్లో విచ్చలవిడిగా బైక్ సైలెన్సర్లు మార్చి ఆకతాయిలు ఇబ్బందులు పెడుతున్నారు. అధిక శబ్దాన్నిచ్చే హారన్లు, సైలెన్సర్లతో దూసుకెళ్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. వాహనం ఏదైనా కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ తప్ప మరొకటి వాడకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. కేంద్ర మోటార్ వెహికల్ (ఎంవీఐ) చట్టం 1988 రూల్ నెంబర్ 120 ప్రకారం వాహనాల్లో వాడే సైలెన్సర్ నిర్దిష్ట నాయిస్ లిమిట్ కంటే ఎక్కువ శబ్దం చేయకూడదు. భారతీయ శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం (నాయిస్ పొల్యూషన్, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) 2000 ప్రకారం భారీ సౌండ్ వచ్చే సైలెన్సర్లు నిషిద్ధం. ఎంవీఐ రూల్ 190(2) ప్రకారం చట్టబద్ధమైన రీతిలో వాహనాలు నడపకపోతే రూ.1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఎన్విరాల్మెంట్ ప్రోటెక్షన్ యాక్ట్ 1986, నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం సైలెన్సర్ల నుండి వచ్చే శబ్దం నిబంధనలకు లోబడి ఉండాలి. ఆరోగ్యానికి చేటు శబ్ద కాలుష్యం 100 డెసిబుల్స్కు మించి ఉండటం వలన వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. శబ్ద కాలుష్యం వలన ఆరోగ్యానికి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులకు హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుమతులు లేని మార్పులు ట్రాఫిక్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. పోలీసులకు సదరు వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంది. ఇన్సూరెన్స్ క్లైయిమ్ తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం పలు సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) రద్దు చేయటంతోపాటు వాహనాన్ని సీజ్ కూడా చేయొచ్చు. కనీస తనిఖీలు తూచ్... రూ.15 వేల నుంచి రూ. 40 వేల వరకు విలువైన సైలెన్సర్లను ఆకతాయిలు వాడుతున్నారు. మరోవైపు నగరంలో వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను విక్రయించే వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిల్లపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ఇలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బైక్ సైలెన్సర్లు మారుస్తున్న ఆకతాయిలు రహదారులపై తిరుగుతూ భారీ శబ్దాలతో హల్చల్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వ్యాపారులు కనీస చర్యలు తీసుకోవడంలో పోలీసుల ఉదాసీనత భరించలేని భారీ శబ్దాలతో బుల్లెట్, ఇతర ద్విచక్రవాహనాలపై ఆకతాయిలు హల్చల్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లేవారే కాదు.. ఇళ్లలోని వారి చెవులు కూడా చిల్లులు పడేలా, గుండె గుభేల్మనేలా దూసుకుపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో శబ్ద కాలుష్యం కలిగించేలా బైక్ సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా వాహనాలు సీజ్ చేయటంతోపాటు కోర్టుకు హాజరుపరుస్తాం. పరిమిత స్థాయికి మించి సైలెన్సర్లు ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధం. సైలెన్సర్లను విక్రయించే వారితోపాటు వాహనాలకు అమర్చుకునే వారిని కూడా ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తిస్తాం. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. శబ్దకాలుష్యం లేకుండా చూస్తాం. – ఎం. రమేష్, డీఎస్పీ, ట్రాఫిక్ విభాగం, గుంటూరు -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన శ్యామ్ సునీల్ కొల్లూరులో రేషన్ బియ్యాన్ని ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకొని రాత్రి సమయంలో తరలించటానికి ప్రయత్నించాడు. సుమారు 76 బస్తాల రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరు మండలంలోని రైస్ మిల్లుకు తరలించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని వివిధ కంపెనీలకు చెందిన గోతాలలో ప్యాక్ చేసి ఆటోలో తరలించే యత్నం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన శ్యాం సునీల్, బుల్లెద్దు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక రీచ్లలో లారీలు నడపలేం
ప్రత్తిపాడు: అధికారుల వేధింపులు తాళలేమని, ఇసుక రీచ్లలో లారీలు నడపలేమని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గుంటూరు అమరావతి రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో లారీలను నిలిపివేసి జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ అధికారులు ఓవర్ టన్నేజీ తోలేందుకు అభ్యంతరం తెలుపుతున్నారని, అందుకు సమ్మతమేనని, కానీ దీనివల్ల వినియోగదారుడికి రూ.700కే ఇసుక అందించగలమని పేర్కొన్నారు. గతంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, అందుకు అంగీకరించారని చెప్పారు. ఇప్పుడు ఆర్టీవో అధికారులు జరిమానా విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లారీలకు ఈఎంఐలు కట్టలేక, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక ఇసుక లారీలను ఆపివేసినట్లు తెలిపారు. ఇసుక రీచ్లలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 40 టన్నులు ఇసుక ఎత్తి 20 టన్నులకే బిల్లులు ఇస్తున్నారని, ఆర్టీవో అధికారులు వాహనాలను నిలిపి ఓవర్ టన్నేజీ కింద రూ. 50 వేలు ఫైన్ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో లారీ ఓనర్లు, డ్రైవర్లు ధర్నా -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. -
ఎల్ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు జూలై 9వ తేదీన ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమ్మె జరగనుందని తెలిపారు. 85 శాతానికిపైగా ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్సూరెనన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెలో భాగస్వామిగా ఉందన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74 శావాతం నుంచి వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజల పొదుపును ప్రోత్సహించాలని, విదేశీ పెట్టుబడులు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని చెప్పారు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయం దేశ ప్రయోజనాలకు హానికరం అని స్పష్టం చేశారు. ఎల్ఐసీలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, క్లాస్ 3, 4 క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లకు తరలించడం నష్టదాయకమని పేర్కొన్నారు. ఎల్ఐసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఫెడరేషన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం పాలసీదారులపై ఆర్థిక భారాన్ని మోపడమేనని, పైగా ఇది ప్రజలకు బీమాను దూరం చేయడమేనన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఈ సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలిపాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఆర్వీఎస్ శ్రీనివాస్, డి.సైదులు, ఐ.వెంకట్రావు, శివరామకృష్ణారావు, రాజశేఖర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ -
హాస్టల్ వార్డెన్కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు. వెంటనే వార్డెన్కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు. ఎస్ఐ వెంకటాద్రి దీనిపై మాట్లాడుతూ.. కొల్లిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్.కిషోర్ బాబు(12), వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్ (13), రేపల్లె ఓల్డ్ టౌన్కు చెందిన ఎ.జితేంద్ర దర్శన్ (14) స్థానిక నాజరుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని తెలిపారు. స్కూలుకు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు చెప్పారు. వెంటనే వార్డెన్కు సమాచారం అందించి బాలలను అప్పగించినట్లు తెలిపారు. వార్డెన్ ఆదినారాయణను వివరణ కోరగా.. వారిలో ఇరువురికి ఇంకా స్కూలులో అడ్మిషన్ కాలేదన్నారు. హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని, చెప్పులు కొనుక్కునేందుకు ముగ్గురు స్టేషన్ సమీపంలోని షాపునకు వచ్చారన్నారు. అక్కడి నుంచి నీరు తాగేందుకు స్టేషన్లోకి వెళ్లగా పోలీసులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు -
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను పోలిన నియామక పత్రాలను సృష్టించి, బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాంజలి సంస్థ పేరుతో కొంత మంది వ్యక్తులు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, యోగా టీచర్లు, అటెండర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తప్పుడు నియామక ఉత్తర్వులను సృష్టించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా విద్యాంజలి సంస్థ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులోని జెడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ట్రైనర్ను నియమిస్తున్నట్లుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం పంపుతున్నట్లుగా సిద్ధం చేసిన నియామక ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. జెడ్పీ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ నియామక విషయమై సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇదంతా బోగస్ అని, ఎవ్వరూ నమ్మవద్దని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని సమాచారం పంపారు. ప్రధానోపాధ్యాయులు కూడా తప్పుడు నియామక ఉత్తర్వులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఢిల్లీలోని విద్యాంజలి సంస్థ పేరుతో నియామక ఉత్తర్వులు నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచన -
మోకాళ్లపై కార్మికుల నిరసన
మంగళగిరి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. మంగళగిరి నగర పరిధిలోని ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వై. కమలాకర్, ఎం. బాలాజీ, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, కేదారనాథ్, దుర్గారావు, ప్రకాష్, రాము పాల్గొన్నారు. -
బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: కుంచనపల్లి జాతీయ రహదారిపై గల బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి బాలికను నీటిలోకి విసిరేసి హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే బుధవారం తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఓ మహిళ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు మూడు గంటలు కష్టపడి బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వెంటన్ నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్, పెదకాకాని సీఐ, ఎస్ఐలతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుంచనపల్లి బ్రిడ్జి వద్ద, జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తి నడిపించుకుంటూ బ్రిడ్జి ఎక్కినట్లు నమోదైంది. మృతి చెందిన బాలిక, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న బాలిక ఒకరే కావడంతో ఫొటోలను కృష్ణా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు పంపారు. వివరాలు సేకరించాలంటూ కోరారు. తాడికొండ మండలం బడేపురానికి చెందిన పాపగా గుర్తించడంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించా రు. పేరు కూరపాటి హేమ అని, మతిస్థిమితం లేదని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాపను పెంచలేక తాతయ్య ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి తోసిన వ్యక్తి సరిగ్గా కనిపించకపోవడంతో పాటు లుంగీ ధరించి ఉన్నాడు. హత్య చేసింది తాతయ్య లేక ఎవరన్నా ఉన్నారనే విషయాలను లోతుగా తాడేపల్లి సీఐ వీరేంద్ర దర్యాప్తు చేశారు. చివరికి తాత కూరపాటి మాధవరావే కాల్వలోకి తోసేశాడని పోలీసులు నిర్ధారించారు.ప్రత్యేక దృష్టి సారించిన డీఎస్పీ 24 గంటల్లోపు వివరాల సేకరణ -
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే !
ప్రత్తిపాడు:రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రత్తిపాడు వైఎస్సార్ కాలనీలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చల్లగిరి నాగరాజు కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు రైతు నాగరాజు పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు, కౌలు రైతు కార్డు లేకపోవడం, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ప్రైవేటు సంస్థల నుంచి వందకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎకరం ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, తిరిగి నూతనంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పొగాకు సాగు చేసిన 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు కె. ఆదినారాయణ, నల్లమోతు రాజేంద్ర ఉన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబానికి పరామర్శ -
భూముల సమీకరణ ఉపసంహరించుకోవాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ప్రభుత్వం రాజధాని కోసం మరో దఫా 44వేల ఎకరాలు భూమిని సమీకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబూరావు మాట్లాడారు. 11 సంవత్సరాల కిందట తీసుకున్న 34వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములతో కలిపి 54వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోలేదని పేర్కొన్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారని, అది ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. రాజధాని కొలిక్కి రాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇప్పుడు వేల ఎకరాల భూములు సమీకరించడం సబబు కాదని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.న్భావన్నారాయణ, ఈమని అప్పారావు, కె.నళీనికాంత్, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు -
ఖరీఫ్లో ‘ముంపు’ ముప్పు
రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పాలకులు, అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్కు ముందే డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రేపల్లె సబ్ డివిజన్లో ఇలా... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఆర్ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. నియోజకవర్గంలో34,060 హెక్టారులలో ఖరీఫ్లో వరి సాగు అవుతుంది. వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. పంట చివరి దశ నవంబర్, డిసెంబరు మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది. -
గుంటూరు
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025కూటమి మోసాలపై పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ నరసరావుపేట: క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ పంటల బీమా పథకం పోస్టర్లను కలెక్టర్ పి.అరుణ్బాబు ఆవిష్కరించారు.శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం నగరం: జిల్లేపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు.సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం తెనాలి అర్బన్: సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్స బుధవారం ఐతానగర్లోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గేరా థామస్, సీయోను కుమారిలు జెండా ఎగురవేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ప్రథమం కాదని తెలిపారు. 1999 నుంచి ఆయన పొత్తులతో గెలిచి ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి, గెలిచిన తరువాత ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తామంటూ చంద్రబాబు పవన్ కల్యాణ్లు హామీ ఇచ్చారని, అమలు చేసే సమయానికి మాట దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమని సూచించారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన గురించి, చంద్రబాబు ఇప్పుడు వైద్యరంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో వివరించాలని చెప్పారు. పెన్షన్లు పెంచామని చెప్పి ఎంతమందికి అందడం లేదనేది కూడా వివరించాలని పేర్కొన్నారు. – వై.వి. సుబ్బారెడ్డి , వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ తాడేపల్లి రూరల్: ‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మరొకసారి వంచించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు కూటమి మోసాన్ని, దగాను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి’’నట్లు వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్లోని కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో గుంటూరు, పల్నాడు జిల్లాల వైఎస్సార్సీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్రెడ్డి, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భాస్కర్రెడ్డి, మాజీ శాసనసభ్యులు, తెనాలి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు,పల్నాడు జిల్లాల వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న వై.వి. సుబ్బారెడ్డి , వేదికపై పార్టీ నేతలు 7సెల్ఫోనే ఆయుధం న్యూస్రీల్ 1999 నుంచి హామీలు ఇవ్వడం.. మరవడం బాబుకు మామూలే ! వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి టీడీపీ ఇవ్వని వాటిని ఇంటింటికీ వెళ్లి వివరించాలి వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి -
కూటమి విష ప్రయోగం
పెదకాకాని: ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం పంట కాలువల శుభ్రం చేపట్టింది. పెదకాకాని మండలంలో రెండు పంట కాలువల ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలోని సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్త కాలువ) వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వరకూ 47 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కాలువ పొడవునా 33 గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగు అవుతోంది. నీటి సంఘాల క్కుర్తి ఏటా కాలువల్లో పేరుకు పోయిన గుర్రపుడెక్క, నాచు, తూటికాడ తొలగించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. అయితే, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం నీటి సంఘాల నాయకులకు అప్పగించింది. మంగళగిరి రూరల్ మండలం కాజ శివారు ప్రాంతం నుంచి బుడంపాడు వరకూ 17 కిలోమీటర్ల పొడవునా గుర్రపుడెక్క, తూటికాడ, నాచు తొలగించేందుకు రూ. 24 లక్షలు కేటాయించింది. యంత్రాలు, కూలీలను ఉపయోగించి చేయాల్సిన పనుల్లో నీటి సంఘాల నాయకులు కక్కుర్తి పడ్డారు. డబ్బులు మిగుల్చుకునే పనిలో భాగంగా కాలువ పొడవునా గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో తూటికాడ, గుర్రపుడెక్క ఎండి కుళ్లిపోతోంది. నీరు దుర్వాసన వెదజల్లుతోంది. అధికారుల పర్యవేక్షణ కరువు గుంటూరు చానల్ నీటిని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి వినియోగిస్తున్నారు. కలుషిత నీరు వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం గడ్డి మందు పిచికారీ చేయకూడదు. నిధులు మాత్రం మంజూరు చేసి సాగునీటి శాఖ అధికారులు పనుల పర్యవేక్షణ మరిచిపోయారు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు. గుంటూరు చానల్లో గడ్డి మందు పిచికారీ పట్టించుకోని అధికారులు కుళ్లిపోతున్న గుర్రపు డెక్క, తూటికాడ కలుషితమవుతున్న నీరు సాగు, తాగునీరుగా ఉపయోగిస్తున్న పలు గ్రామాల ప్రజలు -
ప్రగతి.. అధోగతి
తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలి జిల్లాలోని ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ. అభివృద్ధిలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుందని నమ్మబలికారు. మున్సిపల్ నిధులతో కొన్ని పనులను ఆర్భాటంగా ఆరంభించారు. ఏడాది తర్వాత చూస్తే బిల్లుల చెల్లింపు సున్నా...కొత్తగా ఆమోదం తెలిపిన పనులకు నెలలు గడుస్తున్నా టెండర్లూ పిలవడం లేదు. కౌన్సిలర్ల ఆందోళన ప్రభుత్వ విధానంపై మున్సిపాలిటీలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి కూడా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతోనే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రకటించడం గమనార్హం. రూ.8.50 కోట్ల బిల్లులు పెండింగ్ పట్టణంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 105 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.8.50 కోట్ల బిల్లులను మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగలేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ బ్యాంకు ఖాతాల్లో నిధులున్నా నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. పేరుకే అజెండాలో నిధులు ప్రతి నెలా జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారులు వివిధ అభివృద్ధి పనులను అజెండాలో పొందుపరుస్తున్నారు. కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్నప్పటికి వాటిలో ఎక్కువ భాగం టెండర్ల దశకు వెళ్లడం లేదు. ఇందుకు నిధుల కొరతను సాకుగా అధికారులు చూపుతున్నారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై కౌన్సిలర్ల నిరసనతో వాడివేడిగా కొనసాగింది. సుమారు ఎనిమిది నెలలు గడచినప్పటికీ, ఇప్పటికీ టెండర్ల దశకు పనులు చేరుకోకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. తెనాలి పట్టణంలో రూ.7.70 కోట్ల విలువైన 46 పనులను చేపట్టేందుకు కౌన్సిల్ అనుమతించినా, ఆయా పనులు ఇప్పటివరకు టెండర్ల దశకు వెళ్లలేదు, కౌన్సిల్లో అధికారులు ఇదే విషయాన్ని సభ్యులకు తెలియజేశారు. తొలి ఏడాది ఆంధ్రా ప్యారిస్లో కుంటుపడిన అభివృద్ధి చేసిన పనులకు చెల్లింపు నిల్ కౌన్సిల్ ఆమోదించిన పనులకు టెండర్లు పిలవడంలో ఉదాసీనత బిల్లుల చెల్లింపుల్లో మార్పులు కూటమి ప్రభుత్వం ఇటీవల బిల్లుల చెల్లింపుల్లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో చేసిన తరువాత వర్కింగ్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ, ఎంఈ, కమిషనర్లు ఆయా పనులను పరిశీలించి బిల్లులు రూపొందించేవారు. అందరి ఆమోదంతో ఆడిట్కు పంపేవారు. వారి అనుమతి తరువాత కాంట్రాక్టర్ల అకౌంట్లో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడా విధానం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నిఽధి యాప్లో బిల్లులను ఆప్లోడ్ చేయాల్సి ఉంది. అధికారుల అనుమతి తరువాత చెల్లింపులు జరగాల్సి ఉంటుంది. అయితే, నిధి యాప్లో లోపాలతో బిల్లులు పెట్టడానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు. యాప్లోని సమస్యలను పరిష్కరించే వరకు బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. -
మోసాన్ని వివరించాలి
కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో సంవత్సరంలోపే ఇచ్చిన హామీలన్నీ 90 శాతం అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వైఎస్.జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పి మోసం చేసింది. అమలు చేసిన పథకాల్లో సైతం కోత విధించింది. అనర్హులుగా తేల్చి పలువురి పెన్షన్లు, తల్లికి వందనం తీసివేశారు. సూపర్సిక్స్ను అమలు చేస్తారా లేదా అన్నది కూడా నమ్మకం లేదు. వైఎస్సార్ సీపీలో జరిగిన మంచిని, కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే మన లక్ష్యం. –మురుగుడు హనుమంతరావు, శాసనమండలి సభ్యులు -
విద్యుత్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి
సుందరయ్యనగర్లో సీపీఎం నేతల ప్రచారం తెనాలి: అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని ప్రజలు స్పష్టంగా తిరస్కరించాలని, చూస్తూ ఊరుకుంటే తరతరాలుగా ఇరుక్కుపోతారని సీపీఎం నాయకులు ప్రజలను హెచ్చరించారు. సీపీఎం నాయకులు కేబీ ప్రసాద్, శెట్టి ఏసోబులు మంగళవారం తెనాలి సుందరయ్యనగర్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదానీ కంపెనీ ప్రతినిధులు వినియోగదారుల సమ్మతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా బలవంతంగా విద్యుత్ మీటర్లు మార్చుతున్నారని కేబీ ప్రసాద్ చెప్పారు. స్మార్ట్ మీటర్లుగా పిలుచుకునే ఆ మీటర్లలో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అందులో ఉండే ‘అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్’ (ఏఎంఐ) ద్వారా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని, వైర్లెస్ ద్వారా ఆ మీటర్ అదాని కంపెనీకి కనెక్ట్ చేయబడి ఉంటుందన్నారు. ఎక్కడో ఉండి ఆ మీటర్ను ఆపరేట్ చేయొచ్చని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. రెండోది ‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ (ఏఎంఆర్) అని చెబుతూ ఏ సమయానికి ఎంత విద్యుత్ వాడుకున్నదీ రికార్డు చేస్తుందన్నారు. పీక్ అవర్స్లో 6–10 గంటల వరకు అధిక చార్జీలు వసూలు చేస్తారని వివరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మాట్లాడుతూ వాడుకున్న విద్యుత్కు తర్వాత డబ్బులు చెల్లించే ప్రస్తుత పద్ధతికి భిన్నంగా, ముందుగానే డబ్బులు చెల్లించి సెల్ఫోన్లో ఛార్జింగ్ చేయించితేనే విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. విద్యుత్ను సౌకర్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, సరుకుగా మార్చి ప్రజలను పిండుకోవటానికి వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వి.బాబూరావు, యు.బుజ్జి, శెట్టి పౌలు, వి.సూరిబాబు, ఎస్.బాలస్వామి, మేరి, శెట్టి సలోమి, ఎస్.సింధు, కె.మరియమ్మ, ఎస్.అరుణప్రమీల, పి.జ్యోతి, కె.లక్ష్మమ్మ, నరసమ్మ పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చిన జీఎస్టీ
● సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్ ● ఘనంగా జీఎస్టీ దినోత్సవం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జీఎస్టీతో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జీఎస్టీ అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జీఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి. దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. జి ఎస్.టి. చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో జీఎస్టీ ప్రారంభమైన ఏడాది రూ.2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అలాగే గుంటూరులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది ఉండగా, ఇప్పుడు 75 వేల మందికి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ జీఎస్టీతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎండీ దాసరి రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు. సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జీఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహూకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.కార్యక్రమంలో జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మినారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు ఆర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణసాయి పాల్గొన్నారు. -
‘మిషన్ ఉన్నతి’తో రైల్వే ఉద్యోగులకు మేలు
లక్ష్మీపురం: ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాచరణ కొనసాగింపునకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పట్టాభిపురం కార్యాలయంలో మంగళవారం ‘మిషన్ ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మిషన్ ఉన్నతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా కీలకమైన స్థానాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులు స్వయంగా వారి జూనియర్లకు పదోన్నతి ఉత్తర్వులను అందజేయిస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఆయా విభాగాలలో ఆరుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా వారి చేతుల మీదుగా వారి తరువాత విధులు నిర్వహించే సిబ్బంది పదోన్నతులు పొందడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్ఎం సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎఫ్ఎం అమూల్య బి.రాజ్ పాల్గొన్నారు. ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె గుంటూరు ఎడ్యుకేషన్: మందుల కన్నా ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె తెస్తుందని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులోని చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్, ఇండియన్ ఇంటలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి ఆధ్వర్యంలో సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అనే అంశంపై జూమ్ వేదికగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉన్నత వృత్తులలో వైద్య వృత్తి ఒకటని, దేవుని తర్వాత ప్రాణం నిలిపే అవకాశం వైద్యునికే ఉండడం ఒక అద్భుతమైన వరం వంటిదని అన్నారు. జేబును చూసి వైద్యం చేయడం కన్నా రోగి జబ్బు చూసి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా వైద్యులు ఉండాలని, కార్పొరేట్ల మాయాజాలం, కాసుల కక్కుర్తి అవాంఛనీయమైనవని, మందుల కన్నా మృదువైన మాటలు, మానవీయ స్పర్శ అత్యున్నత ఫలితాలను అందిస్తాయని అందుకే వైద్య వృత్తికి మానవీయ దృక్పథం మకుటంలా నిలుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాఖ్యాత కోపల్లి జయకర్ బాబు, జి. శాంతమూర్తి మాట్లాడారు. జూమ్ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వాడకుప్ప సుధాకర్, ఏలీ, ఎం.స్వాములు, ప్రియా జాన్, బాలకృష్ణారెడ్డి, కవి, రచయిత కాపిరెడ్డి కృష్ణారెడ్డి, గునుకూరు రత్నరాజు, శ్రీ విష్ణు, గాలి శాంత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: జిల్లాలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, అరకొర దిగుబడులు, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి విలయ తాండవం.. అన్నీ గట్టెక్కినా చివరి గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలకు తెచ్చిన అప్పులు రెట్టింపు అవుతుండటం, వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూటమి గద్దెనెక్కిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతులు బలిపీఠం ఎక్కారు. అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడి ఊపిరి తీసుకున్నారు. నిండా ముంచేసిన పత్తి, మిర్చి, పొగాకు గత ఏడాది జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటను రైతులు సాగు చేశారు. గులాబీరంగు పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో పత్తి రైతులు నిలువునా నష్టపోయారు. అదేవిధంగా మిర్చిని నల్లి తామర ముంచెత్తడంతో పంటను మధ్యలోనే పీకేయాల్సిన పరిస్థితి. పత్తికి, మిర్చికి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టారు. ఆరుగాలం ఽశ్రమించి పండించుకున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి సాగు చేసి నట్టేట మునిగిపోయిన రైతులు పంటను పీకేసి, నల్లబర్లీ పొగాకు సాగుచేశారు. తీరా పంట దిగుబడులు చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది క్వింటా రూ.15వేల వరకు అమ్మిన నల్లబరీని మొన్నటివరకు రూ.3 వేలకు కూడా కొనే వారులేక నానాఅగచాట్లు పడ్డారు. ప్రస్తుతం పొగాకు కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం చెబుతున్నా వాటి ద్వారా కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. రైతుపేరు ఊరు ఆత్మహత్య చేసుకున్న తేదీ పుట్టా నాగరాజు (40) చినకోండ్రుపాడు 2024 జూన్ 30 ధూపాటి శివయ్య (56) ప్రత్తిపాడు 2024 జూలై 27 గడ్డం గోపాలకృష్ణ (31) చినకోండ్రుపాడు 2024 అక్టోబరు 17 యనగందలు వీరారావు (54) ప్రత్తిపాడు 2024 అక్టోబరు 23 జొన్నలగడ్డ అశోక్ (36) కోయవారిపాలెం 2024 నవంబరు 13 గేరా ప్రసాద్ (32) తిక్కిరెడ్డిపాలెం 2024 నవంబరు 23 వరగాని బాబూరావు (59) వంగిపురం 2025 ఫిబ్రవరి 13 కావూరి శివశంకరప్రసాద్ (46) పుసులూరు 2025 జూన్ 7 చిమటా శేషయ్య (52) కొర్నెపాడు 2025 జూన్ 13 చల్లగిరి నాగరాజు (42) ప్రత్తిపాడు 2025 జూన్ 28 జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలిపీఠం ఎక్కుతున్న అన్నదాతలు భరోసా దక్కక, గిట్టుబాటు ధర లేక బలవన్మరణాలు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతుల ఆత్మహత్య మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయని కూటమి ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించే దిక్కుకూడా లేని దుస్థితి గత ప్రభుత్వం పంటలు సాగు చేసుకునే సమయంలో రైతన్నకు ఆదరువుగా ఉండేందుకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 13,500లను వారి ఖాతాలకు నేరుగా జమ చేసింది. అదే పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం రైతుల ఖాతాలకు జమచేస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కూటమి నేతలు తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. ఈ ఏడాది అదిగో ఇదిగో అని ఊరిస్తూ ఇప్పటి వరకు నగదు జమ చేయలేదు. -
ముగిసిన ఇస్కాన్ మందిర జగన్నాథస్వామి ఉత్సవాలు
తెనాలి: తెనాలి నాజరుపేటలోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న జగన్నాథస్వామి ఉత్సవాలు నాలుగో రోజైన మంగళవారం రాత్రితో ముగిశాయి. సోమవారం రాత్రి జగన్నాథ రథయాత్ర ముగిసిన తదుపరి, ఇక్కడి బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాతను అక్కడ కొలువు ఉంచిన విషయం తెలిసిందే. చివరి రోజు రాత్రి పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున పాల్గొని సుభద్రాదేవికి చీర, సారె, పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ వేడుకల సందర్భంగా గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన వివిధ కళాసాంస్కృతిక పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వేలమంది పాల్గొన్నట్టు ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సింహ గౌరదాసు చెప్పారు. సుభద్రాదేవికి సారె సమర్పణ అనంతరం ఆయా పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను బహూకరించారు. అత్యధికంగా 28 జ్ఞాపికలను గెలుచుకున్న స్థానిక వెస్ట్బెర్రీ స్కూలుకు ఓవరాల్ ఛాంపియన్గా ట్రోఫీని బహూకరించారు. మందిర ఉత్సవాలకు సహకరించిన బలరాం గోవింద ప్రభు, వైష్ణవి, భార్గవ్, వెంకటేష్, అపూర్వ, ఆశ్రిత, గాయత్రి, వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం, శివశంకర్, పావని, తేజ, మురళి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత పినపాడుకు చెందిన కోదాడ బృందం వాయిద్యాల నడుమ మహిళలు ఊరేగింపుగా సారెను తీసుకొచ్చారు. సుభద్రాదేవికి సారె సమర్పించిన మహిళలు వైభవంగా జగన్నాథ రథయాత్ర పెదకాకాని: విశ్వ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వీవీఐటీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రథయాత్ర విద్యార్థుల భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి విశ్వవిద్యాలయం వరకు సుభధ్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథయాత్రను వివా వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు జయ జయహే జై జగన్నాథ నినాదాలతో యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో గోళ్లమూడి గ్రామ ప్రజలు హారతులు, పూలు జల్లుతూ రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు యూనివర్శిటి వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహా హారతి నిర్వహించి, విద్యార్థులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం
చినగంజాం: ఉప్పు సాగుకు ఇటీవల కాలంలో ప్రకృతి తీవ్ర విఘాతం కలుగజేస్తోంది. అయినా ఉప్పు రైతు వాటిని తట్టుకొని నెగ్గుకు రాగలుగుతున్నాడు. వేసవి ఉష్టోగ్రతలు పంట దిగుబడిని, నాణ్యతను పెంచుతాయి. ఉప్పు సాగు ముమ్మరంగా సాగే అనుకూల సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఉప్పు రైతు కోలుకోవడం కష్టమే. గత నాలుగు సీజన్లుగా ఇదే పరిణామాలు ఉప్పు సాగు విషయంలో చోటు చేసుకుంటున్నాయి. సీజన్లో భారీగా పడిపోయిన ఉప్పు ఉత్పత్తి రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సీజన్లో ఉప్పు ఉత్పత్తి భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఉప్పు పరిశ్రమల్లో మొత్తం 22 వేల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి కొనసాగుతుంది. తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఉప్పు రైతు నష్టపోక తప్పడం లేదు. ఉప్పు సాగు ప్రతి ఏడాది నవంబరు నెల నుంచి తరువాత ఏడాది జూన్ వరకు దాదాపు 8 నెలలపాటు కొనసాగుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉప్పు సాగును ప్రారంభించి తొలి తీత సంక్రాంతి పండుగ నాటికి తీయాల్సి ఉంది. 2024–25 సీజన్లో నవంబరు, డిసెంబరు నెలలో ప్రకృతి అనుకూలించక ఆలస్యంగా రైతులు సాగును ప్రారంభించాల్సి వచ్చింది. ఉప్పు కొఠారుల్లో భారీగా వర్షపు నీరు నిలిచి సాగుకు భూములు అనుకూలత లేక జనవరి నెలలో సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో ఉండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 30 శాతం మాత్రమే ఉప్పును రైతులు తీయగలిగారు. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి ఉప్పు దిగుబడికి అనుకూలంగా ఉండే మే, జూన్ నెలల్లో తుఫాన్లు, అకాల వర్షాలతో సాగు పూర్తిగా నిలిచిపోయింది. ఉప్పు రైతుకు ఎన్నడూ లేని విధంగా తీవ్ర విఘాతం కలిగింది. సొంత భూములున్న రైతులు, లైసెన్స్దారులు పరిస్థితి ఎలా ఉన్నా ముఖ్యంగా కౌలుదారులకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉమ్మడి ప్రకాశంలోఉపాధి కోల్పోయిన వేల కుటుంబాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊళ్లపాలెం, కనపర్తి, కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో ఉప్పు సాగు కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలో చినగంజాం, పెదగంజాం గ్రామాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు మొత్తం 3,600 ఎకరాల్లో ఉప్పు సాగు చేసే భూములున్నాయి. వాటిలో ప్రభుత్వ భూములు 2,400 ఎకరాలు కాగా, 500 ఎకరాలు స్నోవైట్ సాల్ట్ భూముల్లో సాగు సాగడం లేదు. ప్రభుత్వ భూమిలో 620 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మరో 1200 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. చినగంజాం మండల పరిధిలో చిన్న, పెద్ద రైతులు సుమారు 1050 కుటుంబాలు ఉండగా వారితో పాటు ఉప్పు కొఠారుల్లో పనులు నిర్వహిస్తూ కూలీలుగా సుమారు 8 వేల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చినగంజాం సాల్ట్ వర్కర్స్ కో ఆపరేటివ్ ప్రొడక్షన్స్ సేల్స్ సొసైటీ (ఎల్ నంబర్ 73 అండ్ 86)లో 400 ఎకరాలు సుమారు 700 కుటుంబాలు, రాజుబంగారుపాలెం సాల్ట్ సొసైటీలో 120 ఎకరాలు 350 కుటుంబాలు మొత్తం 1050 కుటుంబాలు ఉప్పు సాగు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఊళ్లపాలెం గ్రామ పరిధిలో ఎస్సీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద 500 ఎకరాలు, ఓసీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద మరో 350 ఎకరాలు ఉప్పు సాగు చేస్తుండగా, కొత్తపట్నం మండలంలోని సాల్ట్ సొసైటీ కింద 275 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. వీటితో పాటు సుమారు మరో వెయ్యి ఎకరాలు ప్రైవేట్ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉప్పు సాగుకు అవాంతరం కలగడంతో వేల కుటుంబాలు ఈ సీజన్లో తమ ఉపాధిని కోల్పోయారు. సీజన్లో భారీగా పడిపోయిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్న రైతు రైతుల ఆశలపై నీరు చల్లిన అకాల వర్షం ఉమ్మడి ప్రకాశంలో రైతులకు కోలుకోలేని దెబ్బ రైతుల కష్టం పట్టించుకోనికూటమి ప్రభుత్వం -
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని ఒడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్కుమార్ కర్లపు, రేష్మి పిళ్లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలపై ఆరా తీశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాన నీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడు చేయకపోవడం వలన పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై పథకాలపై చర్చించారు. -
వర్షాల నేపథ్యంలో ఇసుక ప్రత్యేక డంప్
గుంటూరు వెస్ట్: వర్షాకాలం నేపధ్యంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ముందుగానే ప్రత్యేకమైన డంప్ యార్డుల్లో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్ఓ షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరపాలన్నారు. ఇసుక విక్రయాలు జరిగే ప్రాంతాల్లో ధరల బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత తహసీల్దార్లు తనిఖీ నివేదకలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం జిల్లాలో 2021–24 మధ్యలో జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్విన ఏజెన్సీలకు నోటీసులివ్వాలన్నారు. వర్షాకాలం నేపధ్యంలో ఏర్పాటు చేస్తున్న ఇసుక స్టాక్ పాయింట్లు ప్రధాన రహదారులకు సమీపంలో ఉండాలన్నారు. స్టాక్ పాయింట్ల నుంచి వసూలు చేసే రవాణా చార్జీల విషయంలో వినియోగదారుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి డి.వెంకట సాయి, జిల్లా భూగర్భ వనరుల శాఖ డీడీ వందనం, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ క్లస్టర్లు.. గుంటూరు వెస్ట్: జిల్లాలో వ్యవసాయంతో పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించాలన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్, హ్యాండ్లూమ్ క్లస్టర్ పనులు వేగవంతం చేయాలన్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో మాడ్యూలర్ కిచెన్ క్లస్టర్ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్ఐపీబీ, ఎస్ఐపీసీలో జిల్లాకు అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో 45 ఎస్ఎంఎస్సీ పరిశ్రమలకు సంబంధించి రూ.2,52,74,672 మంజూరు చేస్తూ కలెక్టర్ సమావేశంలో ఆమోదించారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, తెనాలి ఆర్డీఓ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ప్రజా సమస్యలపై పోరుబాట
తాడేపల్లిరూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి రూరల్లోని కుంచనపల్లి ప్రాతూరురోడ్లో ఉన్న ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశ ఏర్పాట్లను ఆయన గుంటూరు ఈస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడుతో కలసి పరిశీలించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, మండల, పట్టణ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులతో బాబు ష్యూరిటీ – మోసాలు గ్యారెంటీ అనే అంశంపై సమావేశం నిర్వహిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో బాబు మోసాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశం.. క్యూఆర్ కోడ్ వినియోగంపై ఈ సమావేశం ఉంటుందని తెలిపారురు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, కుంచనపల్లి అధ్యక్షుడు మిరియాల రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నేడు వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల విస్తృత స్థాయి సమావేశం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం వివరాలు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
ప్రతి పౌరునికి అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి కొరిటెపాడు(గుంటూరు): ప్రతి పౌరునికి బ్యాంకింగ్, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేలా చేయడమే జన సురక్ష శిబిరాల లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జన సురక్ష మూడు నెలల శిబిరాలను తెనాలి మండలం, కొలకలూరు గ్రామంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయిలో ఆర్థిక సేవలను విస్తరించేందుకు చేపట్టిన జన సురక్ష సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శిబిరాల్లో జన్ ధన్ ఖాతాల ప్రారంభం, జీవన్జ్యోతి, సురక్ష బీమా పథకాలలో నమోదు, అటల్ పెన్షన్ యోజన సభ్యత్వం, పాత ఖాతాలకు ఈకేవైసీ చేయించడం, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏపీఎం జయశ్రీ, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్చార్జి శ్యామ్ ప్రసాద్, కొలకలూరు యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా బ్రాంచి మేనేజర్ హర్ష, పంచాయతీ కార్యదర్శి కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ఘనంగా డాక్టర్స్ డే
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో మంగళవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలోని శుశ్రుతాహాల్లో జరిగిన ఈ వేడుకలకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వైద్యులను సత్కరించి మాట్లాడారు. జీజీహెచ్లో పేద రోగులకు వైద్యులు ఎంతో కష్టపడి సేవలందిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో పచ్చదనం బాగా పెంచారని అభినందించారు. వైద్యులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుని రోగులకు ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ మాట్లాడుతూ ఆస్పత్రిలో దాతల సహాయంతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. రోగులకు ఓపీ రద్దీని తగ్గించేందుకు నూతనంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది వైద్యులను ఘనంగా సత్కరించారు.సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన్, ఏపీ ఫిషరీస్ వర్సిటీల ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ – విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్యూ)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావుమంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్తో విజ్ఞాన్ రిజిస్ట్రార్ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల జలజీవుల ఆరోగ్యం, డయగ్నొస్టిక్స్లో భాగస్వామ్య పరిశోధన చేస్తామన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆక్వా రైతులకు సాంకేతిక శిక్షణ కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా అధ్యాపకులు, సిబ్బంది మార్పిడి, ప్రయోగశాల వనరుల వినియోగం , వివిధ నిపుణుల సేవలు అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టుల కోసం సంయుక్తంగా ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన కోసం నిపుణుల నియామకం, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ప్రాజెక్ట్లను సులభతరం చేయవచ్చునన్నారు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ (ఏపీఎఫ్యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ అధ్యాపకులను, విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, డీన్లు, తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రగతిలో సీఏల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ప్రగతిలో సీఏల పాత్ర ఎంతో కీలకమని క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రంథి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సీఏ విద్యకు గుంటూరు నగరం కేంద్రంగా ఉందని, వివిధ రాష్ట్రాల విద్యార్థుల ఇక్కడికి వస్తున్నారని అన్నారు. విద్యార్థులు సీఏ విద్యను ఎంపిక చేసుకోవడం ద్వారా ఉన్నత భవిష్యత్ అందిపుచ్చుకోగలరని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్ కుందుల, సీఏ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ గుంటూరు చాప్టర్ చైర్మన్ చింతా వీఎన్ఎస్ రఘునందన్, వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షేక్ బాజీ, దేసు సంపత్ పాల్గొన్నారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు -
కనుల పండువగా జగన్నాథ రథయాత్ర
తెనాలి: ఇస్కాన్ తెనాలి ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్ర సోమవారం కన్నులపండువగా జరిగింది. రథ్ఫెస్ట్–2025 పేరుతో నాలుగు రోజుల పాటు చేపట్టిన ఉత్సవాల మూడో రోజు రథయాత్ర నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుంచి మధ్యాహ్నం రథయాత్రను ఆరంభించారు. గాంధీ చౌక్, నెహ్రూ రోడ్డు, రజక చెరువు, ప్రకాశం రోడ్డు, గంగానమ్మపేట, గాడి బావి సెంటర్, బోసు రోడ్డు, చినరావూరు పార్కుకు వెళ్లి, తిరిగి బోసు రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాతను కొలువుదీర్చి, ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు జగన్నాథుడు, రథయాత్ర విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఒకటో తేదీ సాయంత్రం వరకు జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాత అక్కడే కొలువై ఉంటారు. సుభద్ర దేవీకి సౌభాగ్య సారె కార్యక్రమం నిర్వహిస్తారు. రథయాత్రకు ముందు విజయవాడకు చెందిన జిజ్ఞాస సాంస్కృతిక సంస్థ వారి క్యూరేషన్లో పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. ఇస్కాన్, తెనాలి మేనేజరు హెచ్జీ సింహగౌరదాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల్నుంచి కళాకారులు పాల్గొన్నారు. విదేశీ భక్తులు కమలకాంత దాస్, జిజ్ఞాస నుంచి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహనకృష్ణ పాల్గొన్నారు. రథ్ ఫెస్ట్లో భాగంగా 28, 29 తేదీల్లో పిల్లలకు, యువతకు సాంస్కృతిక పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘ఉపాధి’లో అక్రమాలపై విచారణ చేయించాలి
లక్ష్మీపురం: ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకర్ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రరెడ్డి సూచనల మేరకు తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. సర్పంచులకు కూడా తల్లికి వందనం పథకాన్ని తక్షణమే వర్తింపజేయాలని విన్నవించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.1,150 కోట్లను స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలని కోరారు. కార్యక్రమంలో తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ అధ్యక్షులు పూసపాటి వెంకటరామిరెడ్డి , ఈపూరు రమేష్, దొడ్డా రాంజీ అంబేడ్కర్, ఫిరంగిపురం మేడుకొండూరు మండలాల పంచాయతీరాజ్ అధ్యక్షులు గుత్తికొండ ప్రతాపరెడ్డి, షేక్ హాజీ, తాడికొండ, మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, తాళ్లూరి వంశీ, తాడికొండ మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ బాబావలి, పార్టీ నాయకులు గుత్తికొండ అంజిరెడ్డి, పెరికల చిన్న, గంపల గంగాధర్ యాదవ్, బాకీ వెంకటస్వామి, మాదాసు ధర్మరాజు, షేక్ మీర్జావలి షేక్ సలీం, గుంటి రఘువరన్ గోల్డు బాబు, రాయపూడి ఇమ్మానియేలు పాల్గొన్నారు. ‘సదరం’ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి లక్ష్మీపురం: సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ కేంద్రాల్లో దివ్యాంగులకు మౌలిక వసతులు కల్పించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్రాజ్ కోరారు. వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పటిష్టంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్, సదరం సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బొక్క అగస్టీన్ మాట్లాడుతూ పెన్షన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకువచ్చి ఆరోగ్య కేంద్రాల చుట్టూ దివ్యాంగులను తిప్పుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు నాగుల్ మీరా, నాయకులు గణేష్, కిరణ్ పాల్గొన్నారు వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు -
ఏసీబీకి చిక్కిన దేవదాయ శాఖాధికారి
కొల్లూరు : లంచాల కోసం వ్యాపారులను వేధిస్తున్న దేవదాయ శాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మత్తే మహేంద్ర కథనం మేరకు... బాపట్ల జిల్లా కొల్లూరు దేవాలయాల సమూహ ఈఓగా పనిచేస్తున్న నాగిశెట్టి శ్రీనివాసరావు కొద్ది రోజులుగా ఆలయ దుకాణాదారులను లంచాలు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొల్లూరుకు చెందిన వంకాయల సాయి తన తండ్రి లక్ష్మినారాయణ మరణించడంతో శ్రీ అనంతభోగేశ్వరాలయం పరిధిలో ఉన్న 6వ నంబర్ దుకాణాన్ని తన సోదరుడు రమేష్ పేరుమీదకు మార్చాలని శ్రీనివాసరావును పది రోజుల క్రితం కోరాడు. దుకాణం పేరు మార్పుకు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇచ్చుకోలేనని తెలపడంతో రూ.70 వేలు చెల్లించాలని లేని పక్షంలో దుకాణం స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారి హెచ్చరికలు చేశాడు. ఆలయ అధికారి అర్ధరాత్రి సమయాలలో సైతం ఫోన్లు చేసి లంచం నగదు కోసం వేధిస్తుండటంతో ఆయన అడిగిన మొత్తం సోమవారం ఇస్తానని సాయి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కొల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలోని ఈఓ కార్యాలయంలో దుకాణదారుడు సాయి ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఈఓకు రూ.60 వేలు నగదు చెల్లింపులు జరుపుతుండగా, అకస్మాత్తుగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దుకాణదారుడి నుంచి లంచంగా తీసుకున్న రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఈఓ కార్యాలయంలోనే రసాయనాలతో పలు పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి దేవాదాయ శాఖాధికారి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈఓ శ్రీనివాసరావును మంగళవారం విజయవాడలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు మహేంద్ర వెల్లడించారు. దాడులలో ఏసీబీ సీఐలు నాగరాజు, మన్మదరావు, సురేష్, సుబ్బారావు, ఎస్ఐలు చిచ్చా ఉరుకొండ, సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టవద్దని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఇన్చార్జి కలెక్టర్ ఏ.బార్గవ్ తేజ, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రజల నుంచి 260 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని ఫిర్యాదును సరిగా ఎండార్స్ చేయడం లేదని, సంబంధిత శాఖలో సరైన అధికారికి పంపడం లేదన్నారు. ఉన్నతాధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా కిందిస్థాయి అధికారులే పరిష్కరిస్తున్నారని తెలిపారు. సరిగా స్కాన్ చేయకుండా అప్లోడ్ చేస్తున్నారని, గ్రీవెన్స్ అధికారులే సమస్యను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అర్జీదారుడికి సమస్యను పరిష్కరించిన విధానాన్ని క్షుణ్ణంగా తెలియ జేయాలని చెప్పారు. అధికారుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ అందించాలని తెలిపారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి తగ్గుతోందని, దాన్ని పెంచడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కమిషన్, కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉన్నతాధికారులకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశం -
గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తాం..
జే.పంగులూరు: కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా, వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తూ మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెంకటమురళి అన్నారు. మండల పరిధిలోని మార్కెట్ యార్డులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 18 పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం పంగులూరు, పర్చూరు, ఇంకొల్లు మూడు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారన్నారు. పొగాకు కొనుగోలుకు ప్రభు త్వం రూ.270 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు సరుకును బట్టి రూ.6 వేలు నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు కాజేశారు
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలాది రూపాయలు కాజేసి, మోసగించారంటూ బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ నిర్వహించారు. అర్జీదారుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (క్రైం), రమేష్ (ట్రాఫిక్) కూడా అర్జీలు స్వీకరించారు. నకిలీ నియామక పత్రాలతో మోసం గతేడాదిలో తెలిసిన వ్యక్తి పరిచయమయ్యారు. నేషనల్ హెల్త్ అథారిటీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ముగ్గురం కలిసి అతనికి సుమారు రూ.16.80 లక్షలు చెల్లించాం. గతేడాది నవంబర్ 4న ఢిల్లీ వెళ్లగా, అవి నకిలీ గుర్తింపు కార్డులు, నియమాక పత్రాలను అధికారులు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో అటువంటి సంస్థ లేదని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించాం. దీంతో డబ్బులు అడగ్గా, రూ.3.80 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగతా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. – ఓ యువకుడు, రావెల, తాడికొండ మండలం పొలం ఇప్పించాలి గుంటూరు రూరల్ పరిధిలోని వెంగళాయపాలెంలో మాకు 46 సెంట్లు పొలం ఉంది. 2006లో మాజీ ఎమ్మెల్యే సోదరుని వద్ద దాన్ని రూ.5 లక్షలకు తనఖా పెట్టాం. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి మాకు డబ్బు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేకు అప్పగించాడు. పొలం తనఖాకు సంబంధించి డబ్బులతో పాటు అదనంగా చెల్లిస్తామని, కాగితాలు ఇవ్వాలంటూ ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. మాకు పొలం ఒక్కటే జీవనాధారం. గతంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. న్యాయం చేయాలి. – సీహెచ్.భాగ్యలక్ష్మి, రామారావు, వెంగళాయపాలెం ఎస్పీ సతీష్కుమార్కు బాధితుల మొర -
దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు విశేషంగా తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి ప్రారంభమైన సారె సంబరం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ కుటుంబం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. నగరంతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారె సమర్పించేందుకు తరలివవచ్చారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
సుప్రీం ఆదేశాలను అమలుచేయాలి
కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ నాగరాజన్ వినూత్న ప్రచారం తెనాలి: మహాత్మా గాంధీజీ ఆదర్శంగా ఆయన సూత్రాలను ప్రచారం చేస్తున్న పట్టణానికి చెందిన గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గాంధీ నాగరాజన్ సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. గాంధీ వస్త్రధారణతో కళ్లకు గంతలు కట్టుకుని, పోలీస్ సంస్కరణలపై సుప్రీం తీర్పుకు సంబంధించిన అంశాలను ప్రచారం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసు సంస్కరణలపై ఐపీఎస్ అధికారి ప్రకాష్సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పోలీస్ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం పెంచటానికి జారీ చేసిన ఏడు ముఖ్యమైన ఆదేశాలను గాంధీ నాగరాజన్ ప్రస్తావించారు. పోలీస్ విధులను రాజకీయ జోక్యం నుంచి రక్షించడానికి, పోలీసులకు మార్గదర్శకత్వం వహించడానికి రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు ఆయన కోరారు. ఎస్పీ, డీజీపీలకు రెండేళ్ల పదవీ కాలం నిర్ణయించాలని, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవించారు. పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఏర్పాటు, దర్యాప్తు, శాంతిభద్రతల విభజన వంటి అంశాలను అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆచార్య లింగరాజు ఏఎన్యూ: డాక్టర్ వైఎస్సార్ ఏఎన్యూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా యూనివర్సిటీ సైన్స్ ఫిజిక్స్ విభాగాధిపతి సీహెచ్. లింగరాజు నియమితులయ్యారు. వీసీ కె. గంగాధరరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జి. సింహాచలం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్గా నియమితులైన లింగరాజుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్స్ కల్పన, నైపుణ్య లక్షణాల పెంపొందింపు లక్ష్యంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. -
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
లక్ష్మీపురం: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 6వ రాష్ట్రస్థాయి అండర్ 10,12 విభాగాల్లో ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. జిల్లా బాలబాలికలు 4వ స్థానం సాధించారని జిల్లా ఫెన్సింగ్ అనానిమిషన్ ప్రధాన కార్యదర్శి డి. అశోక్బాబు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జులై 5 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. బాలికల 11–12 విభాగంలో డి.జోష్ని, బి.శ్రీలక్ష్మి, యు.శ్వేత, ఫాఈల్లో ఎం.శ్లోక, ఆర్షియా హస్నా, సేబార్లో జి.హన్సిత, నాగశ్రీ ఎంపికై నట్లు తెలియజేశారు. అండర్– 12 విభాగం సేబార్లో ఎం.చైతన్య సాయి, జె.పృథ్వి, వినయ్, బాలికల అండర్– 10 ఇప్పిలో బి.దీక్షిత, రాథోడ్, జి.తన్మయిశ్రీ , ఎం.స్నేహశీ, సేబార్లో సి.అరోహి, అండర్– 10 కేటగిరి బాలురు ఫాఈల్లో పి.రిశాంక్ శర్వాన్, పి.రిత్విక్ ఎంపికై నట్లు అశోక్బాబు వెల్లడించారు. -
ఈ నగరానికి ఏమైంది?
● అదనంగా విధుల్లోకి తీసుకున్న కార్మికులు ఎక్కడ ? ● నగరంలో గ్రీనరీతో ఒక్క రోడ్డు కూడా లేదు ● 10వేల మొక్కలు కార్పొరేషన్కు వస్తే కనిపించేది 305 మాత్రమే.. ● సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ● కౌన్సిల్లో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గుంటూరులో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం సంతృప్తి ఇవ్వదు: కమిషనర్ కార్పొరేటర్లు, ప్రజారోగ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ అనేది వంద శాతం సంతృప్తి ఇవ్వదని, మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.. అదనంగా 150 మందిని విధుల్లోకి తీసుకున్నా వారు ఎక్కడ పని చేస్తున్నారో కూడా తెలియదు.. ట్రాక్టర్లు డివిజన్కు ఒకటి కేటాయించామని అధికారులు చెబుతున్నా, ఎప్పుడు వస్తున్నాయో తెలియడం లేదంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులు, మాజీ కార్పొరేటర్ కారసాని సామ్రాజ్యానికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. సోమవారం కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ఉదయం 10.47గంటలకు ప్రారంభమైంది. సభ్యుల 35 ప్రశ్నలకు, 105 కార్పొరేషన్ ప్రియాంబుల్స్, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ● పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో వీఐపీలు తిరిగే ప్రధాన రహదారి ఐటీసీ రోడ్డులో ఉన్న మూడు చోట్ల చెత్త పాయింట్లను శుభ్రపరచడంలో అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రధాన రాహదారే అధ్వానంగా ఉందని, ఇక నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నగరంలోని సచివాలయాల్లో ఒక్కరే ఉద్యోగి పని చేస్తున్నారని, అతడు కూడా వాచ్మెన్గా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏదైనా సమాచారం అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులైన తమకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. పర్మిషన్ లేని భవనాలు స్వయంగా చూపించినప్పటికీ ఇంత వరకు చర్యలు లేవని తెలిపారు. 21వ డివిజన్లో రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్ కడితే దాన్ని కూల్చాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశిస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ● తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చెత్త వేయకుండా గ్రీన్ మ్యాట్లు కట్టినా ఉపయోగం లేకుండా ఉందని తెలిపారు. అక్కడే చెత్త వేస్తున్నారని చెప్పారు. నగరంలో గ్రీనరీతో కూడిన బ్యూటిఫికేషన్ రోడ్డు ఒక్కటీ లేదని, కనీసం కార్పొరేషన్ కార్యాలయం ముందు కూడా చేసుకోలేకపోతున్నామని విమర్శించారు. పక్కనే ఉన్న తెనాలి, పొన్నూరులో గ్రీనరీ బాగుందని, కలెక్టరేట్ రోడ్డును కూడా అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు 10వేల మొక్కలు వస్తే అందులో నాటింది 305 మాత్రమేనని, మిగిలిన వాటి సంరక్షణ ఏంటని? ఆయన ప్రశ్నించారు. సచివాలయాల్లో సక్రమంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదని, పనుల మీద వచ్చిన ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు ఇంటర్నెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా ?అని నిలదీశారు. ● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ సుబ్బారెడ్డి నగర్లో రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ఎందుకు అతని బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. 25వ డివిజన్లో అనధికార లే అవుట్స్ పెరిగిపోతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ● గతంలో మా వార్డులో 60 మంది పారిశుద్ధ్య కార్మికులుంటే ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారని..కాలువలు తీయడానికి మనుషులు లేరని కార్పొరేటర్ వెంకట కృష్ణ తెలియజేశారు. ● అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను కుదించే ప్రయత్నంలో ఉందన్నారు. నగరంలోని ఉన్న 207 వార్డు సచివాలయాలను 103 క్లస్టర్స్గా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అయిపోగానే సిబ్బంది రేషనలైజేషన్ చేస్తామని వెల్లడించారు. ● గుంటూరు నగరంలో 1256 హోర్డింగ్స్ ఉంటే అందులో 250కి మాత్రమే స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉందని.. ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, షేక్ రోషన్, దూపాటీ వంశీ కౌన్సిల్లో టౌన్ప్లానింగ్ అధికారులను నిలదీశారు. ● 17వ వార్డులో కాలువలు, డ్రైన్లపై కూడా భవన నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మణస్వామి అనుమతులు ఇస్తున్నారని.. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ ఫర్జానా డిమాండ్ చేశారు. వార్డులో టీడీపీ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, దీన్ని కట్టడి చేయాలని ఆమె కోరారు. ● వార్డులో అభివృద్ధి పనుల్ని కార్పొరేటర్కు చెప్పకుండానే అభివృద్ది పనులు ప్రారంభించారని...జేసీబీతో పనులు చేస్తున్న క్రమంలో వృద్ధుడి కాలు విరిగిందని..అసలు సిబ్బంది ఎవరూ లేకుండా పనులేలా చేస్తారంటూ కార్పొరేటర్ మల్లవరపు రమ్య నిలదీశారు. ● కార్మిక శాఖ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పాపతోటి అంబేడ్కర్ కౌన్సిల్ అధికారులను కోరారు. మాటలు సరిగా మాట్లాడు ! పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు చెప్పే మాటలు మాత్రమే మేయర్ నమ్ముతున్నారని.. తమ మాటలు నమ్మడం లేదని టీడీపీ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ ప్రశ్నించారు. మాటలు సరిగా మాట్లాడు.. ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలో, నమ్మకూడదో తనకు తెలుసని, పని చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ రవీంద్ర చెప్పారు. సమ్మె చేస్తున్న వారిపై చర్యలు: మేయర్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నారని, వీధి లైట్లు వెలగనీవ్వడం లేదని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మేయర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు. -
చిల్డ్రన్స్ హోం సందర్శన
గుంటూరు లీగల్: క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు బాలిక సదన్లోని చిల్డ్రన్స్ హోంను సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. సదుపాయాల గురించి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. హోంలో ఆహారం, విద్య, వైద్యంతో పాటు రూములను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట బాలిక సదన్ సూపరింటెండెంట్ కవిత, సిబ్బంది ఉన్నారు. -
కులం పేరుతో దూషణ, దాడి
దుగ్గిరాల: కులం పేరుతో దూషించి, స్పృహ కోల్పోయేటట్లు కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యానాది యూత్ ఫెడరేషన్ నాయకులు సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది కులానికి చెందిన కన్నం మాధవి, కన్నం మరియమ్మ, వి.నరేంద్రబాబులు ఆదివారం కె.ఆర్. కొండూరు గ్రామంలో షాపింగ్ చేసుకొని వస్తుండగా ఇద్దరు చిన్న పిల్లలు తగువులాడుకుంటూ ఉండగా గొడవ ఎందుకని వారికి సర్ది చెప్పి వెళుతున్నారు. ఈ సమయంలో నలుగురు ముస్లిం యవకులు పెద్దగా అరుస్తూ వారిని కులం పేరుతో తిట్టి, కొట్టి గాయపరచారు. కేసు పెట్టేందుకు వెళుతుంటే అడ్డగించి బెదిరించారు. విషయాన్ని యానాది యూత్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులతో కలసి సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది యూత్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కొమరగిరి సూరిబాబు, రావూరి గోపి, అశోక్, మరియమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆగని మట్టి దందా
అంతా షాడో కనుసన్నల్లోనే.. తాడికొండ: అధికారుల అలసత్వం, నాయకుల పైరవీల కారణంగా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మట్టిదందా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గ్రామంలోని మంచినీటి చెరువులో తవ్వకాలు చేస్తూ టన్నుల కొద్దీ మట్టిని ట్రాక్టర్లు, లారీలలో రాత్రీ, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు గుంటూరు కలెక్టరేట్కు వెళ్లి మరీ ఫిర్యాదు చేసినా ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మట్టిదందా అంతా నియోజకవర్గ ముఖ్య నేతకు చెందిన కార్యాలయంలో ఉంటున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతా ఆయనే అయి షాడో ఎమ్మెల్యేగా వ్యవహారం నడిపిస్తూ జేబులు నింపుకొంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప తామేం చేయలేకపోతున్నామంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అధికారులను సైతం బెదిరించి తన వశం చేసుకున్న సదరు వ్యక్తి.. ప్రజా సమస్యలు పక్కన బెట్టి మట్టి దందాకు నియోజకవర్గంలో భారీగా తెరలేపాడు. ఇక్కడ అక్కడ అనే బేధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా తమవారిని తెరపైకి తెచ్చి భారీగా మట్టి దందా నిర్వహిస్తున్నాడు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్లో మరింత బరి తెగించి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో భారీగా తవ్వకాలు జరపడం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉందని ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి దందాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాడికొండ మండలం ఫణిదరంలో నెల రోజులుగా యథేచ్ఛగా మట్టి దోపిడీ చేస్తున్న కూటమి నేతలు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహారం చెరువులో ఏర్పడిన భారీగుంతలు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు గుంటూరుతో సహా పరిసర గ్రామాలకు భారీగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్న వైనం -
వైభవంగా పునీత పేతురు మహోత్సవం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని బాల ఏసుదేవాలయంలో ఆదివారం శ్రీసభ కార్యక్రమం నిర్వహించారు. పునీత పేతురు, పాల్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయ విచారణ గురువులు ఎం.ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి కార్యక్రమం నిర్వహించి వాక్యోపదేశం చేశారు. పునీత పేతురు, పాల్లు తమ జీవితంలో భగవంతుడిపై విశ్వాసాన్ని ఏవిధంగా చూపి నిలుపుకున్నారో దానిని విశ్వాసులు తెలుసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఒకే కుటుంబంగా కలిసి ప్రార్థనలు చేయాలని చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. కార్మెల్ మాత మహోత్సవం జూలై 14,15,16 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సహాయ విచారణ గురువులు, మఠకన్యలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు. -
బోనభాగ్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): తెలంగాణ హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. -
ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని యూఎల్బీ పరిధిలో పనిచేస్తున్న వార్డు ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల బదిలీల కు సంబంధించిన కౌన్సె లింగ్ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరిగిన కౌన్సెలింగ్లో ఎటువంటి సీనియార్టీ లిస్ట్ పెట్టకుండానే నచ్చిన సచివాలయాలను మూడు ఆప్షన్లుగా ఎంచుకుని ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోండి ఈనెల 30న మీకు సచివాలయం కేటాయిస్తామని అధికారులు చెప్పిన విషయం విధితమే.. దీనిపై ‘సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రెండో రోజు ఆదివారం జరిగిన వార్డు ఎమినిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీలకు కౌన్సెలింగ్కు సంబంధించిన సీనియార్టీ లిస్ట్ను ప్రచురించారు. దీంతో ఆయా సెక్రటరీలు ఊపిరి పీల్చుకున్నారు. వార్డు అడ్మిన్లు వర్సెస్ బిల్ కలెక్టర్లు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు/గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయాలకు వార్డు అడ్మిన్ సెక్రటరీలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లుకు కూడా వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా అవకాశం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. 2019లో బిల్ కలెక్టర్లకు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా ముందు ప్రాధాన్యత కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం బదిలీల కౌన్సెలింగ్ జరగుతున్న నేపథ్యంలో బిల్ కలెక్టర్లు వారు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాల్లోనే ఉండేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని హోల్డ్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో వార్డు అడ్మిన్ సెక్రటరీలు అలా హోల్డ్ చేసుకోవడం కుదరదంటూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 23 మంది బిల్ కలెక్టర్లు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. వీరంతా తాము ఐదేళ్ల నుంచి వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నామని, తమకు ప్రాధాన్యత ఇచ్చి నచ్చిన సచివాలయం కేటాయించాలని కోరుతుండగా.. అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల కౌన్సెలింగ్ ఒక కొలిక్కి రావాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందేనని జీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీనియార్టీ లిస్టులు లేకుండానే శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో కదలిక ముగిసిన బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, బిల్ కలెక్టర్ల వ్యవహారం -
చేరికలు
ముందుచూపు179 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలే ఇందుకు ఉదాహరణ. పల్నాడు జిల్లావ్యాప్తంగా 179 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కనీసం ఒక్క విద్యార్థి సైతం చేరకుండా ఉండటం విద్యారంగ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనావస్థలో ప్రభుత్వ విద్య విలీనం పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపేయడం, మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు అంటూ ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు విద్యను దూరం చేయడం వంటి కారణాలతో ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లేక పాఠశాలలు దీనావస్థలోకి వెళ్లిపోయాయి. ఈ విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పరిశీలిస్తే ఒక పల్నాడు జిల్లాలోనే 179 పాఠశాలలు ఉండటం గమనార్హం. వికటించిన ప్రయోగాలు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంబంధిత పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేసిన కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పేరుతో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేసింది. గ్రామంలోని వేర్వేరు కాలనీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాలుగైదు ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటే పాఠశాల ఉండాలనే ప్రభుత్వ విధానంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే దూరమయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్నాడు జిల్లాలోని 179 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థీ చేరని వైనం పాఠశాల విద్యలో ప్రభుత్వ ప్రయోగాల ఫలితం మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రభావంతో గ్రామాల్లో ప్రైమరీ పాఠశాలలు మూత పడే ప్రమాదం వైఎస్సార్ సీపీ పాలనలో సజావుగా కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు -
నిధులు పంచాయతీలకు జమ చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమస్యపై సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సర్పంచులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పంచాయతీలకు రావాల్సిన జనరల్ ఫండ్స్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించారని చెప్పారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న సర్పంచులు 80 శాతం మంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు కావటం వలన పంచాయతీలకు నిధులు ఇవ్వడంలేదని అన్నారు. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితి పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకంలో ఉన్న కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సగం కూలీ డబ్బులు తమకి ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని విమర్శించారు. మీకు ఇంత, మాకు అంత అనే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పేద వాళ్లకు పనిలేకుండా చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడా ల చక్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించిన నిధులు తల్లికి వందనం వంటి పథకాలకు దారి మళ్లించడం అన్యాయమని అన్నారు. దీనివల్ల ఒక పంచాయతీలో కూడా చిన్నపని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం కూడా సర్పంచులకు వర్తింపజేయకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. రొంపిచర్ల మండల పార్టీ కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ -
వ్యాపారవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
గుంటూరు మెడికల్: వ్యాపార వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరు భాస్కరరావు అన్నారు. ఇటీవల నవ్యాంధ్ర ప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్, కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, కోశాధికారి వై.బి.శివారెడ్డిల ప్రమాణ స్వీకారం ఆదివారం పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పొట్లూరు భాస్కరరావు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. అసోసియేషన్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్తులో అసోసియేషన్ తరఫున నూతన భవంతిని నిర్మించి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. -
విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
చీరాల అర్బన్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చీరాలలో పట్టణశాఖ 20వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ఎస్.పురుషోత్తం, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఈఓ ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల బలోపేతం చేయడానికి ఎన్రోల్మెంట్ పెరుగుదలకు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ఉపాధ్యాయుల కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. అనంతరం పేరాల్లోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసిన నాగళ్ల రమణారావు దంపతులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా బాధ్యులు గడివాడ అమర్నాథ్, బడుగు శ్రీనివాస్, కె.ఎర్రయ్య, వి.ప్రఽభాకరరావు, ఎం.ఏసురత్నం, టి.వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పార్వతి, అపర్ణ, రమేష్, సుబ్బారెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
గుంటూరు ఎడ్యుకేషన్: బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రత్యేకమైన కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లపై సమాజానికి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులు తమ పని విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. ● రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో ఉన్న అసంబద్దాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేసామని తెలిపారు. ● రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలు, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘంగా యూటీఎఫ్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఈసందర్భంగా ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామని వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి గయాసుద్దౌలా, నాయకులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, ఎండీ షకీలాబేగం, టి.ఆంజనేయులు, ఎ.శ్రీనివాసరావు, బి.ప్రసాద్, కె.కేదార్నాథ్, కె.కామాక్షి, ఎం.కోటిరెడ్డి, పి.ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం పాత్ర కీలకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి లీగల్ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటిని ఆదివారం సత్కరించారు. అరండల్పేటలోని లీగల్ విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ముందుగా న్యాయవాదులు, లీగల్ విభాగం నేతలు అంబటిని సత్కరించి, అభినందనలు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన నేపథ్యంలో లీగల్ విభాగం సన్మానించటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లీగల్ విభాగం కృషి ఎనలేనదన్నారు. 2024 ఎనికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి పెట్టే ప్రతి అక్రమ కేసుపై లీగల్ విభాగం ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైతం న్యాయవాదుల కృషి ఎంతగానో ఉండబోతోందన్నారు. మహత్తర శక్తిగా లీగల్ విభాగం ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి కుట్రలను చేధిస్తూ.. వైఎస్సార్ సీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు తామున్నామనే ధైర్యాన్ని కలిస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత జరుగుతున్న దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక మహత్తర శక్తిగా లీగల్ విభాగం పనిచేస్తోందన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయవాదులకు మంచి చేసేలా వైఎస్ జగన్ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. గుంటూరు పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురువేసేందుకు న్యాయవాదుల ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కూటమి పాలనలో అనేక అక్రమ కేసులు చూస్తున్నామని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సయ్యద్ బాబు, సోమసాని ఝాన్సీ, మంజుల, పోకల వెంకటేశ్వర్లు, హబీబుల్లా, వాసం సూరిబాబు, లలిత, వరదాయని, శ్యామల, ఇందిరా, శ్రీనివాసరెడ్డి, కళ్లం రమణారెడ్డి, సింగ్, బొమ్మనబోయిన శ్రీను, వజ్రాల రాజశేఖరరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్, స్వదీప్తి, తార, అబ్రహాం లింకన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు లీగల్సెల్ ఆధ్వర్యంలో అంబటికి సత్కారం -
జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు బాబు కుట్ర
చుండూరు(వేమూరు) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. చుండూరు మండలంలోని కారుమూరివారి పాలెంలో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకటరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామకం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీసులకు తనకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, తన ఆస్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తలేనని చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా ఎదురు నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన కార్యకర్తలకు ఎప్పడూ గౌరవం ఉంటుందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఈపూరు గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్ సిక్స్లు అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే పథకాలు అమలు చేసిన ఘనత దక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కక్ష సాధించే పరిపాలన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి చలంచర్ల సుధారాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పాలన సాగిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు ఉయ్యూరి అప్పిరెడ్డి, మండల అధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి, వేమూరు, అమర్తలూరు మండలాల పార్టీ అధ్యక్షులు దాది సుబ్బారావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, ఎంపీపీ జాలాది రూబేను, రాపర్ల నరేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగంటి లవకుమార్, జెడ్పీటీసీ సభ్యులు దాట్ల సౌజన్య మోహన్రెడ్డి, బి. నాంచారమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
సిఫార్సు బదిలీలు!
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఈ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా, కేవలం సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. సిఫార్సు ఉన్నవారికే ప్రథమ ప్రాధాన్యం 2019లో సచివాలయ మహిళా పోలీసులకు వచ్చిన ర్యాంకు, వారి అర్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వారికి ఆయా సచివాలయాల్లో పోస్టింగ్ కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేవలం వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే బదిలీలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ విధంగా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికై నా బదిలీ చేస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖరాకండిగా చెబుతుండంతో సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని మహిళా పోలీసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒక్కో లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు ! ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1100 మంది దాకా మహిళా పోలీసులు ఉన్నారు. వీరందరికీ ఆదివారం కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఇందులో రూరల్ ప్రాంతంలో పనిచేసే మహిళా పోలీసులు అర్బన్ ప్రాంతానికి వచ్చేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ఒక్కో మహిళా పోలీసు 5 నుంచి 10 దాకా వారి వారి పలుకుబడిని బట్టి సిఫారసు లేఖలు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్తో పనిలేదు? ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ ఛాలెంజడ్, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగులతో పాటు, స్పౌజ్ కేటగిరి వారికి ప్రథమ ప్రాధ్యానం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ అమలు జరగడం లేదు. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలే పనిచేస్తుండడంతో అర్బన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు రూరల్కు బదిలీ అవుతామేమోననే భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే ప్రాధాన్యం! గుంటూరు సిటీకి వచ్చేందుకు ఒక్కో లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఆందోళనలో మహిళా పోలీసులు -
అయితానగర్ను భయపెట్టేందుకే దాడి
తెనాలి: పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని ఎప్పుడు.. ఎవరిని వేధించాలని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ దృక్పథాన్ని, సంస్కృతిని తీసుకురావాలని, ప్రశ్నించే తత్వానికి ఈ సదస్సు వేదిక కావాలని శనివారం రాత్రి తెనాలిలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత చైతన్యానికి, ఉద్యమాలకు గుండెకాయ వంటి అయితానగర్ను భయభ్రాంతులను చేసేందుకు యువకులపై బహిరంగ దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరునూ, వారిని సమర్థిస్తున్న పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ తెనాలి అయితానగర్లోని కమ్యూనిటీ హాలులో జరిగిన సదస్సుకు సమన్వయకర్త పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ దళిత, ప్రజాసంఘాలు మొత్తం 24 పైగా నిర్వాహక కమిటీగా జరిపిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే కేసు పెట్టి, తీర్పులిచ్చి, శిక్షలు వేసేస్తుండటం దారుణమని పేర్కొన్నారు. తెనాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనను సీపీఎం ఖండిస్తోందని తెలిపారు. మానవ హక్కులను కాపాడుకోవడమే మనముందున్న సమస్యగా స్పష్టం చేశారు. ● సీపీఐ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల దారుణంపై ప్రజాప్రతినిధులు, చివరికి హోం మంత్రి సహా సిగ్గుపడకపోగా సమర్థిస్తారా? అంటూ నిలదీశారు. ● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా శిక్షించమని ఏ చట్టం చెబుతోందని అన్నారు. ● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు, వాస్తవంగా పెట్టీ కేసు మాత్రమేనని తెలిపారు. దీనిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు. ● రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ అయితానగర్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోనే కుట్ర మొదలైందని చెబుతూ అందుకే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషనులో స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరును చేర్చినట్టు తెలిపారు. ● ఏపీ ఎమ్మార్పీయస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులు ఐకమత్యంగా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ● విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల చర్య కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని చెప్పారు. ● వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యా సాగర్ మాట్లాడుతూ పోలీసుల దాడివెనుక పోరాట స్ఫూర్తి కలిగిన అయితానగర్ను భయభ్రాంతులను చేయాలనే పాలకుల కుట్ర ఉందని తెలిపారు. ● మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిశోర్ మాట్లాడుతూ ఇంత ఆందోళన జరిగినా కనీసం పోలీసులపై చర్య తీసుకోలేదంటే దళితులపై ప్రభుత్వ చులకనభావమేనని పేర్కొన్నారు. ● సభాధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నేత జి.శాంతకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వై.నేతాజీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ , కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, మాల ఉద్యోగుల సంఘం నేత కిశోర్బాబు, కులనిర్మూలన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ నేత మణి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకా చంద్రశేఖర్, భగత్సింగ్, వేముల మురళి, నీలాంబరం, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రం, ఆర్పీఐ పార్టీ అంబేడ్కరైట్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవిప్రసాద్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడారు. దళిత బహుజన ఫ్రంట్ కొరివి వినయ్కుమార్ స్వాగతం పలికారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో వక్తలు పోలీసుల తీరు, సమర్థిస్తున్న పాలకుల వైఖరిపై ఆగ్రహం తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు -
సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు పారదర్శకతకు పాతర వేశారు. అసలు ఖాళీలు చూపించకుండానే నిర్వహించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని యూఎల్బీస్(అర్బన్ లోకల్ బాడీస్) అయిన గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీల్లో పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన శనివారం మందిరంలో జరిగింది. ఇందులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఉన్నారు. పారదర్శకతకు పాతర మామూలుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఖాళీలను బట్టి నడుస్తుంది. ముందుగా దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజెడ్, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత సీనియార్టీ, ర్యాంక్ని బట్టి ఉంటుంది. అయితే, అధికారులు ఇవేమి పాటించలేదు. సచివాలయ వివరాలను మూడు ఆప్షన్స్గా చూపించి, ఫారం ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్లిపోండంటూ చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ఈ నెల 30వ తేదీలోగా అలాట్ అయిన సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ కేటాయిస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. అసలు తాము ఇచ్చిన ఆప్షన్స్ ఫాం అయిన ఉంటుందా ? లేక చెత్త బుట్టలో వేస్తారో ! అని ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. వార్డు టూ వార్డు ట్రాన్స్ఫర్లపై మండిపాటు వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే ట్రాన్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా యూఎల్బీ టూ యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కు ట్రాన్ఫర్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొంత మంది మహిళా సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. వార్డు టూ వార్డు పెట్టుకోవడం ద్వారా ఇంకా దాన్ని ట్రాన్ఫర్లు అనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఖాళీలు చూపించకుండా బదిలీలు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోవాలని సూచన 30న సచివాలయం ఎలాట్మెంటు అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల మండిపాటు ఎమ్మెల్యేల లెటర్లకే ప్రాధాన్యత ? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు జరిగింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,082(అర్బన్, రూరల్లకు కలిపి) మంది సెక్రటరీలు ఎంపికయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్కు పోస్టింగ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, పలువురు ఒకే సచివాలయానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫార్సుల లెటర్లు తీసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లే ఆధారంగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ కొంత మంది సీనియర్ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు మిన్నకుండిపోయారు. -
‘చలపతి’లో చదరంగం పోటీలు ప్రారంభం
ప్రత్తిపాడు: గుంటూరు రూరల్ మండలం లాంలోని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో శనివారం ఆల్ ఇండియా అండర్–19 చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలను చలపతి కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ డైరెక్టర్ ఎం. గోపీనాథ్ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాలకు చెందిన 220 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉత్సాహంగా చదరంగం ఆడారు. మొదటి రోజు విజేతలుగా నిలిచిన వారికి చలపతి విద్యా సంస్థల చైర్మన్ వై.వి. ఆంజనేయులు, ప్రిన్సిపాల్ ఎన్. రామారావు, గోపీనాథ్ నగదు బహుమతులు, షీల్డ్లు అందించి, అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో చెస్ టోర్నమెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు రూ.1.20 లక్షల వరకు నగదు బహుమతులు అందించనున్నట్లు ఆయన చెప్పారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం
ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ముత్యాలనగర్లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. జూలై 1న అన్ని పట్టణాలలో మున్సిపల్ కార్మికులతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జూలై 4న ధర్నా చౌక్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే 20 శాతం నుంచి 30 శాతం మేరకు పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.18 నుంచి 20 వేల మధ్యలో ఉండగా, కార్పొరేట్ స్కూల్లో అది రూ. 28 వేలుగా ఉంది. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.35 వేలు, టెన్త్కు రూ.40వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పబ్లిషర్లతో డీల్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టేశాయి. ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని, ఎమ్మార్పీలకు ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్సులు విక్రయిస్తున్నాయి. వీటితో పాటు యూనిఫాం, బెల్టు, టై సహా అన్నీ వారి దగ్గరే తల్లిదండ్రులు కొనాలి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని, యూనిఫాంను ఫలానా దుకాణంలో కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. నాణ్యమైన విద్య..మిథ్య ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధన జరిగాలి. అయితే, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్య పుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ద్వారానే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, వాటిని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తూట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోఽధిస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడించింది. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా క్యాంపస్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆన్లైన్లో పుస్తకాలకు ఆర్డర్ పెట్టాలి. పుస్తకాలను కొనుగోలు చేసే విధానాన్ని విద్యాశాఖాధికారులు పక్కాగా పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆన్లైన్ విధానానికి స్విస్తి పలకడంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉండగా, అధిక లాభాలను ఆర్జించిపెట్టే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలనే విక్రయిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ అకడమిక్ కేలండర్కు విరుద్ధ్దంగా సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఫీజులు నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు పుస్తకాలు, యూనిఫాం కొనడానికి అప్పులు క్యాంపస్లలోనే యథేచ్ఛగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తక విక్రయాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే బోధించాలనే నిబంధనకు తూట్లు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను కొనుగోలు తప్పనిసరి చేసిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానంతో విద్యాశాఖాధికారులతో పర్యవేక్షణ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేందుకు వీల్లేదు -
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
తెనాలి అర్బన్: విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తుందని జిల్లా అదనపు స్కిల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ వీసీహెచ్. ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంచుకుని, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేళాలో 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. మేళాలో 279మంది రిజిస్టర్ చేయించుకున్నారని, వారిలో 112 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిౖకైనట్లు చెప్పారు. ఎంపికై న వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కె.శ్యామ్సుందర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం.రామారావు, కె.కమలకుమారి, జెఏఏ ఎ.శ్రీదేవి, జిల్లా ప్లేస్మెంట్ అధికారి పి.ఈశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా అదనపు స్కిల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ -
గుంటూరు
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు నగరంలోని అరండల్పేటకు చెందిన జగదీష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.20వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం అదనంగా రూ.4 వేలు, రెండో తరగతిలో చేర్పించిన అమ్మాయికి రూ.22వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం రూ.5వేలు చెల్లించాలని చెప్పడంతో గుండె గుభిల్లుమంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికి రూ.500లోపే కదా అని జగదీష్ అడిగితే వాటిని మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన వాటిని క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం సూచించింది. నెలకు రూ.15వేలు సంపాదిస్తున్న జగదీష్కు ఇద్దరు పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివించడం భారంగా మారింది. ఇది ఒక్క జగదీష్కే పరిమితమైన సమస్య కాదు.. పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు పడుతున్న సమస్యలకు ఇది ఒక ఉదాహరణ. 7న్యూస్రీల్ -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి రక్షించారు. రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో దిగింది. బయటకు వచ్చి తమ్మిలేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. సమీపం నుంచి గమనిస్తున్న కార్మికులు వెంటనే స్పందించి రక్షించి ఏలూరు జీజీహెచ్కు తరలించారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్పాల్, మహిళ అన్న ఇద్దరూ ఏలూరు చేరుకున్నారు. ఏలూరు రైల్వే పోలీసులు జీజీహెచ్కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్పాల్కు అప్పగించారు. -
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే వాటిని సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి అని ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి శత జయంతి వర్ష సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు మల్లాది రామనాఽథశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందని తెలిపారు. ● శనగవరసు రామ్మోహనశర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు. ● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారని కొనియాడారు. ● ప్రముఖ ప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్ మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి -
సి‘ఫార్సు’ల బది‘లీలలు’
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్ లోకల్ బాడీస్లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్వెంట్ సెక్రటరీలు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రాధాన్యత వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్డ్ సిబ్బందికి, మెడికల్ గ్రౌండ్స్ కింద క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్ ఉన్నవారికి రిక్వస్ట్ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్ రాదు. రూరల్ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11082 మంది సెక్రటరీలు గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్ల దందా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి సెక్రటరీల బదిలీలకు కౌన్సెలింగ్ నచ్చిన సచివాలయంలో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు లెటర్లు ఇప్పిస్తామంటూ కార్పొరేటర్లు నగదు వసూలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్న సెక్రటరీలు -
రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదవి విరుస్తున్న రైతులు ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. త్యాగం చేసిన రైతులకు నష్టం ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. రైతుల్లో పలు సందేహాలు ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్న రైతులు ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం. రైతుల్లో వ్యతిరేకత పరిధి విస్తరణ పేరుతో 43వేల ఎకరాల సమీకరణ భూముల రేట్లు అధికంగా ఉండటంతో ఇచ్చేందుకు రైతుల విముఖత అవసరాల మేరకే తీసుకోవాలంటూ సీఎంని కోరిన అధికార పార్టీ నేతలు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో తమ భూములకు గండికొట్ట వద్దంటున్న రైతులు రెండు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోతాయని భయపడుతున్న గ్రామస్తులు తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టెండర్లలో తిరకాసు
గుంటూరుశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. అమ్మవారికి బోనాలు పిడుగురాళ్ల: ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని భవానీనగర్లో గల శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.ముగిసిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: రూసా 2.0 కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూ. 10కోట్లతో హబ్ సెంటర్, రూ. 4 కోట్లతో ఎకామిడేషన్ బ్లాక్ ఫర్ ఎంప్లాయిబిలిటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ భవనం నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ ఈ ఏడాది మే 2న విజయవాడకు చెందిన ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. నిర్మాణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు, ఆసక్తి ఉన్న సంస్థలు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశాయి. రూ. 10కోట్లతో భవన నిర్మాణానికి ఏడు, రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గడువు కూడా మే 30తో ముగిసింది. ఒకే సంస్థ టెండర్ ఆమోదం టెండర్లను వెంటనే తెరవాల్సి ఉన్నా 20 రోజుల వరకు ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాత్సారం చేశారు. తెరిచిన తర్వాత రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి దాఖలు చేసిన ఆరు సంస్థల బిడ్లను తిరస్కరించారు. ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి దాఖలైన నాలుగు బిడ్లలో మూడింటిని తిరస్కరించారు. ఒక బిడ్కు అర్హత ఉన్నట్లు తేల్చారు. విచిత్రమేమంటే రెండు భవనాల నిర్మాణానికి ఒకే సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత ఉన్నట్లుగా పొందు పరిచారు. మిగితా వారందరికీ అర్హత ఉన్నా ఎందుకు తిరస్కరించారనేది అం తుచిక్కని విషయం. ఈ అంశాన్ని బయటకు కూడా వెల్లడించడం లేదు. ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఫోన్లు ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా విషయం అడగగానే కట్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహించే శాఖలో, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల టెండర్లలో అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. విస్తుపోతున్న కాంట్రాక్టర్లు రూ.10కోట్లతో నిర్మించే భవనాల కోసం జరిగే టెండర్ల ప్రక్రియలో సాధారణంగా అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక వేళ పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేకపోతే ఒకటి, రెండు సంస్థలు తిరస్కారానికి గురవుతాయి. కానీ ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ఆరు తిరస్కారానికి గురవ్వడంపై కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. మరో భవన నిర్మాణానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే, మూడు తిరస్కారానికి గురవ్వడం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 7న్యూస్రీల్నచ్చిన వారికి కట్టబెట్టేందుకే.. తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనల, ప్రక్రియ ప్రకారం అంతా చేపట్టామని చెప్పుకునేందుకు టెండర్లు ఆహ్వానించారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగానీ, నిధులు వెచ్చిస్తున్న యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విభాగం, ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని పేర్కొంటున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. విద్యలకు నిలయమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల పిలిచిన టెండర్ల వ్యహారంలో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. సొమ్మొకరిది.. పెత్తనమొకరిది అన్నట్లుగా టెండర్లను పర్యవేక్షిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు వ్యవహరించారు. అస్మదీయులుకు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారు. నిర్మా ణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలున్న కాంట్రాక్టర్లను పక్కన బెట్టారు. యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులపై ఏపీఈడబ్ల్యూఐడీసీ పెత్తనంపై కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు తడిపినట్లు ఆరోపిస్తున్నారు. ఏఎన్యూలో నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు అన్ని అర్హతలూ ఉన్న కాంట్రాక్టర్ల దరఖాస్తులు తిరస్కారం నచ్చినవారికి కట్టబెట్టేందుకే నాటకం కాంట్రాక్టర్ల మండిపాటు చిన్నబాబు ఇలాకాలో ఇష్టారాజ్యం ఏపీఈడబ్ల్యూఐడీసీ తీరుపై తీవ్ర విమర్శలు -
కమిటీ సభ్యుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక)చట్టం, పారిశుద్ధ్య పనివారల నిషేధం, పునరావాస చట్టం కింద జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ(అనధికార)లో సభ్యుల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ యు. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సామాజిక సృహ, అవగాహన కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటలో ఉన్నాయని, సంబంధిత ధ్రువపత్రాలతో (రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీలు) జూలై 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని ఆయన సూచించారు. పవర్ లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్ లక్ష్మి చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 69 కేజీల జూనియర్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. స్క్వాడ్లో 177 కేజీలు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంచ్ప్రెస్లో 77.5 కేజీలు, డెడ్లిఫ్ట్లో 155 కేజీలు కలిపి మొత్తం 410 బరువులు అలవోకగా ఎత్తి ఓవరాల్గా మూడో స్థానంలో చాంపియన్గా నిలిచి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ అన్నదాత ప్రసాద్, సంఘ అధ్యక్షులతో పాటు సహచరులు ఆమెను అభినందించారు. -
జీతాల పెంపు, పింఛన్ పునరుద్ధరణ కోరుతూ నిరసన
తాడికొండ: జీతాల పెంపుతో పాటు పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ తుళ్లూరు సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయం ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ.21 వేలు జీతం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అందరికీ రూ.21 వేలు ఇస్తూ, రాజధాని కార్మికులకు మాత్రం రూ.12 వేలు ఇవ్వడం అన్యాయమని ఖండించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు స్పందించి కార్మికుల జీతాలు పెంచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం. భాగ్యరాజు, కార్మిక సంఘం కార్యదర్శి కుంభా గోపిరాజు, నాయకులు లేళ్ల సుఖవేణి, నల్లగొండ వీర్లంకమ్మ, మేకల మేరి, జెట్టి లక్ష్మీతిరుపతమ్మ, వి. బుజ్జి, శిరీష, సీఐటీయూ నేత పేరం బాబూరావు పాల్గొన్నారు. -
ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జీఎం హనుమా నాయక్
దేశ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలే కీలకం గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హనుమా నాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ మహోత్సవ్ను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమా నాయక్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఐసీఏఐ సంయుక్తంగా నూతన పరిశ్రమలను నెలకొల్పడంలో సహాయ, సహకారాలను అందిస్తాయని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను మెరుగుపరచడంలో సహాయపడతారని వివరించారు. 2018–19 ప్రభుత్వ వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఆరు మిలియన్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పని చేస్తున్నాయని ఆయన వివరించారు. ఎంఎస్ఎంఈలో రకాలు, పెట్టుబడి పరిమితి, నమోదు కోసం ప్రమాణాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఐసీఏఏ బ్రాంచ్ చైర్మన్ చింతా వీఎన్ఎస్ రఘునందన్ వివరించారు. సర్టిఫికెట్ పొందే విధానం, చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు, చెల్లింపులు వంటి అంశాలను తెలియజేశారు. కార్యక్రమంలో సీఏ తిరుమలేశ్వరరావు, ఐసీఏఐ వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షైక్ బాజీ, దేసు సంపత్, సీఏలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా జరపాలి
గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -
ఆభరణాల కోసం వియ్యపురాళ్లు హత్య
పట్టణ శివారులో ఈనెల 19న జరిగిన జంట హత్యల కేసులో ప్రైవేటు బీమా కంపెనీ ఏజెంటు కుసుమకుమారిని ఏ–1 ముద్దాయిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒంటరిగా ఉంటున్న వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70)ను పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో వారు నివాసముంటున్న ఇంటి కిందిభాగంలోనే హత్యకు గురయ్యారు. వారి ఒంటిపై బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. సీసీ కెమెరా నిందితులను పట్టిచ్చింది. ఈ కేసులో కుసుమకుమారితోపాటు ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా, మరొకడు మైనర్ కావడం గమనార్హం. మారీసుపేట రెండుగేట్ల మధ్య ఒక ఇంటిలో వీరు ప్రణాళిక రచించుకోవడం, రెక్కీలు నిర్వహించడం, ఆ ప్రకారం నేరాలకు పాల్పడుతూ వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. -
కేంద్ర ఆరోగ్య పథకం ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి
లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ జీఎస్టీ పెన్షనర్ల సంఘ నేతలు టి.వివేకానంద, గద్దె తిలక్, పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, కె.సామ్రాజ్యం పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులు బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో గల సీడీఎంఏ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వంలో స్పందన లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, జీతం పెంచే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వని కారణంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. 30వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జోన్ల చైర్మన్లు బాబా ఫకృద్దీన్, మధుబాబు, సత్యం, శ్రీనివాసులు, రాజేష్బాబు, ఏసుబాబు, జిల్లా కన్వీనర్లు సతీష్కుమార్, మురళీకృష్ణ, ముకుందం, సురేష్, ప్రసాద్, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మిక జేఏసీ నాయకులు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమెను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు.అప్పు ఎగ్గొట్టేందుకు హత్యమార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు.భార్యతో చేతులు కలిపి హత్యకు పథకంతెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు. -
ప్రణమిల్లిన భక్త జనం
అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమ ర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది. కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను నోడల్ అధికారి టి.చంద్రకుమార్ పరిశీలించారు. ఆయన వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు ఉన్నారు. -
రాజధాని రైతుల సమస్యలపై అలసత్వం వద్దు
తాడికొండ: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ అధికారులకు సూచించారు. రాజధానిలో రైతులు, రైతు కూలీల పరిష్కారం కోసం తుళ్లూరు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్డేకి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు, రిటర్నబుల్ ప్లాట్లు, వీధిపోటు సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొత్తం 27 ఫిర్యాదులు అందాయని, వాటిలో భూ వ్యవహారాలు– 17, ఇన్ఫ్రా–3, సామాజిక సంక్షేమం –3 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి. శ్రీనివాస నాయక్, ఎం. శేషిరెడ్డి, కె.ఎస్. భాగ్యరేఖ, పి. పద్మావతి, ఏజీ చిన్నికృష్ణ, కె. స్వర్ణ మేరి, జి.రవీందర్, జి.భీమారావు, సీఆర్డీయే సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి. పాండురంగారావు, రామకృష్ణన్, సామాజిక సంక్షేమ విభాగ డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ 27 ఫిర్యాదులు అందజేసిన రాజధాని రైతులు -
బతుకే చిత్తు
ముంచెత్తే మత్తు.. కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్ -
శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బృందావన శ్రీనివాసుడిని గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులను, భక్తులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టర్ సాదియాకు బంగారు పతకంమంగళగిరి: ఈ నెల 22వ తేదీ నుంచి కర్ణాటకలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, షేక్ సంధానిలు గురువారం తెలిపారు. 57 కేజీల స్క్వాడ్ విభాగంలో 200.5 కేజీలు, డెడ్ లిఫ్ట్లో 185.5 కేజీల బరువులు ఎత్తి ఆల్మాస్ రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్మాస్ను పలువురు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు వెల్లడించారు. మొహరం వేడుకలు ప్రారంభంపొన్నూరు: మొహరం పండుగ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. హాజరత్ మొహమ్మద్ వారి మనుమలు హాజరత్ ఇమామే హసన్, హాజరత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ పట్టణంలోని మొల్లా దహెరా మసీదు వద్ద పీర్ల చావిడిలో పీర్లను పూలతో అలంకరించారు. మేళతాళ వాయిద్యాలతో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా హైదర్, మొల్లా గబ్బర్ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్, మొల్లా ఖలీల్ బాషా, మొల్లా జలీల్, మొల్లా బాజి, మొల్లా నసీర్, మొల్లా రహంతుల్లా, షేక్ గౌస్, మొల్లా అసద్, మొల్లా ఆర్షద్, మొల్లా ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మొల్లా కరీమ్ పర్యవేక్షించారు. జూలై 4వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీడీఏగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు (డీడీఏ)గా ఎ. నాగేశ్వరరావు గురువారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగేశ్వరరావు వైఎస్సార్ కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు(జేడీఏ)గా పనిచేస్తున్న యు.నరసింహారావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నరసింహారావు రిటైర్ అయ్యాక ఎ.నాగేశ్వరరావు ఆయన స్థానంలో కొనసాగనున్నారు. సత్య సాయిబాబా ప్రచార రథానికి స్వాగతం తెనాలి: పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ప్రచార రథం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. శ్రీసత్య సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో బుధవారం రాత్రి తెనాలి వచ్చిన ప్రచార రథానికి ఘన స్వాగతం లభించింది. భక్తులు పలువురు హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి విఠలేశ్వర్, కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇస్కాన్ రథయాత్ర
ఆటోనగర్(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ వారి జగన్నాథస్వామి రథయాత్ర ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని స్థానిక ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ తెలిపారు. గురువారం 16వ డివిజన్లోని పాత వీబీఎం కాలేజీలోని ఇస్కాన్ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్లతో పాటు టీషర్ట్లు, టోపీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధారిదాస్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు చెప్పారు. జూన్ 27 నుంచి 29 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 3.5 ఎకరాల విస్తీర్ణంలో రథయాత్ర మేళా మహోత్సవం జరగనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా జూన్ 29న సుమంగళి సుభద్ర అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు 1000 మందికి పైగా మహిళలు సుభద్ర అమ్మవారికి 4 ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చి సారె సమర్పించనున్నట్లు చెప్పారు. భవానీపురంలోని సితారా గ్రౌండ్స్, స్వాతి థియేటర్, కనకదుర్గ అమ్మవారి గుడిరోడ్డు మీదుగా రథం సెంటరు సీతమ్మవారి పాదాలు వరకు రథయాత్ర సాగుతుందన్నారు. వారాహి ఉత్సవాలకు శ్రీకారం నాగాయలంక: స్థానిక కృష్ణానదీ తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం సముదాయంలోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో గురువారం శ్రీవారాహి అమ్మవారి ద్వితీయ ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత కనకదుర్గమ్మకు విశేషపూజ, ప్రత్యేక అలంకారం చేశారు. తెల్లవారుజామున వారాహి అమ్మవారి విగ్రహానికి శాస్త్రోక్త పూజలు చేసి కనకదుర్గమ్మ ఎదుట ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ప్రతిష్ఠించారు. వారాహిమాతను పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషే కించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు సమర్పించారు. తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హోం శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి గురువారం ఉదయంఆషాఢ సారె సమర్పించారు. -
స్థానికులనూ బయటకు రానివ్వలేదు...
ద్వారకానగర్, ముత్యాలరెడ్డినగర్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే చోదకులు, పాదచారులు అమరావతి రోడ్డుపైకి రాకుండా నిలిపివేశారు. ఆయా రహదారుల వద్ద ఒక్కొక్క కానిస్టేబుల్ను నియమించి, రాకపోకలను నియంత్రించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ర్యాలీ ముగిశాక వర్షం పడటంతో విద్యార్థులు పరుగులు తీశారు. దగ్గర్లోని దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థులను తరలించిన ప్రైవేట్ బస్లు దూరంగా నిలిపివేయడంతో వర్షంలోనే ముద్దగా తడుస్తూ ముందుకెళ్లారు. కొందరైతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు తలపై పెట్టుకుని బయలుదేరారు. మహిళలు తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు ముగిసే సమయానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన తీరుపై నగరవాసులు మండిపడ్డారు. తీరుతెన్ను లేకుండా ఏర్పాట్లు ఉండటం, వర్షం కూడా కురవడంతో గంటల తరబడి రోడ్డుపైనే నానా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
ఇవేం కష్టాలు బాబోయ్!
నగరంపాలెం, నెహ్రూనగర్: గుంటూరు నగరంలో గురువారం;సీఎం చంద్రబాబు పర్యటన, అవగాహన ర్యాలీ దెబ్బకు ‘ఇవేం కష్టాలు బాబోయ్’ అని ప్రజలు, వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పేరుతో కార్యక్రమం జరిగింది. దీంతో సాయంత్రం వేళ విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ వరకు వాకథాన్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అమరావతి రోడ్డు నుంచి ఫీవర్ ఆసుపత్రి, వయా చిల్లీస్ వరకు రెండు వైపులా రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఎటు తిరిగి వెళ్లినా బారికేడ్లే అమరావతి రోడ్డుకు మొదట ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో చోదకులు, పాదచారులు నాయుడుపేట, శ్రీనగర్ వైపు చుట్టూ తిరిగి వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ అమరావతి రోడ్డు మీదుగా వెళ్తే కొద్దిదూరం బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. కనీసం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నివాసాలలో ఉండే వారిని కూడా వాహనాలు సహా ఆవేశారు. దీంతో పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్తున్న చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే బారికేడ్లకు సమీపాన ఉన్న పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుంటామని ప్రాధేయపడినా పోలీసులు తొలగించలేదు. ఇద్దరు సీఐలు మాత్రం మరింత అత్యుత్సాహం చూపారు. ద్విచక్ర వాహనం ముందుకు వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఓ సీఐ మొబైల్ ఫోన్ చేత్తో పట్టుకుని హల్చల్ చేశారు. పిల్లలను తీసుకొని వచ్చిన ఓ మహిళైతే ఇల్లు దగ్గరే అని చెప్పినా, అర్ధగంట తర్వాత మాత్రమే పంపిస్తానని పోలీసులు చెప్పారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు. సీఎం రాకతో అమరావతి రోడ్డులో అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనదారుల నిలిపివేత ఆమడ దూరంలోని ఇళ్లకు వెళ్లేందుకూ ప్రజలకు ఇక్కట్లు వర్షంలో తడిసి ముద్దయిన విద్యార్థులు, మహిళలు నేడు ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ ప్రారంభం సీఎం చంద్రబాబు రాక ప్రత్తిపాడు: ఏఐ ఉపయోగించి వినూత్న పోలీసింగ్, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ పోలీస్ శాఖ ‘ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్’ను ప్రారంభించనుంది. గుంటూరు రూరల్ మండలం చౌడవరంలోని ఆర్వీ ఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరగనున్న హ్యాకథాన్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇప్పటికే 60కుపైగా బృందాలు దేశ విదేశాల నుంచి పలు విద్యాసంస్థలు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చాటిన బృందానికి రూ. 10 లక్షల నగదు బహుమతి, ఏపీ పోలీసు శాఖ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ఒక్కో ఎకరాకు విత్తన పసుపు పుట్టి లెక్కన విత్తుతారు. ఒక్కో పుట్టి 225 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం తూములూరు కేంద్రంలో విత్తన పసుపు పుట్టి రూ.5,800 నుంచి రూ.6,000 వరకు పలుకుతోంది. గతేడాదితో పోల్చితే ధర తగ్గింది. గతేడాది పుట్టి రూ.10 వేల వరకు విక్రయించారు. రైతులు ఒక్కో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది పుట్లు విత్తన పసుపు వినియోగిస్తారు. అంటే ప్రస్తుత ధరల ప్రకారం పసుపు విత్తనానికి ఎకరాకు రూ.36 వేల నుంచి రూ.48 వేల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. పసుపు విత్తేందుకు ముందుగా చేలలో ట్రాక్టరుతో సాళ్లు తీసేందుకు రూ.4 వేలు, తర్వాత కూలీలతో పసుపు విత్తటానికి రూ.3 వేల చొప్పున ఖర్చవుతుంది. అంటే కేవలం పసుపు విత్తేవరకు మాత్రమే రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మొత్తం పంట చేతికొచ్చేసరికి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు అనివార్యం. పసుపు సాగుకు కౌలుకు తీసుకుంటే మరో రూ.55 వేలు అదనం. దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డునపడే అవకాశం ఉంది. కానీ చేతికొచ్చేసరికి ఏ ధర ఉంటుందో తెలీని పరిస్థితి. గిట్టుబాటు ధర సంగతి అటుంచి క్వింటా ధర కనీసం రూ.11 వేలు ఉండాలని రైతులు తమ ఆకాంక్ష వెల్లడించారు. -
అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికల సంఘాల జేఏసీ చైర్మన్ మధుబాబు తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో కలిసి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేదని వాపోయారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం సీడీఎంఏ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు నేడు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
చిన్నారులు పోటీతత్వాన్ని పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్. బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా. ● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్ ఎప్పి విభాగం: హర్షవర్ధన్. బాలికలలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ● విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ● తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. ● అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. ● గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ● కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
రేపు సీఎం చంద్రబాబు రాక
ఏర్పాట్లను పరిశీలించిన అధికారుల బృందం ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలకు రానున్నారు. ఏపీ పోలీస్ శాఖ ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో బుధవారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పాటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హ్యకథాన్ జరిగే కార్యక్రమ వివరాలపై ఐటీ రంగ నిపుణులతో, కళాశాల సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి, ఐజీ శ్రీకాంత్, ఎస్పీ పి. సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ సంజన సింహా, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ పి. వెంకటేశ్వరరావు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డీఎంహెచ్వో కె.విజయలక్ష్మి, ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అండ్ ఆర్డీ డైరెక్టర్ కె.రవీంద్ర, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో 16.4 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16.4 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 2.6 మి.మీ. పడింది. సగటున 6.9 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలంలో 10 మి.మీ., కొల్లిపర 9.2, తుళ్ల్లూరు 8.8, చేబ్రోలు 8.2, ప్రత్తిపాడు 7.8, తాడేపల్లి 7.6, మంగళగిరి 7.4, తాడికొండ 6.4, పెదకాకాని 6.2, గుంటూరు తూర్పు 6, గుంటూరు పశ్చిమ 5.6, పెదనందిపాడు 5.6, వట్టిచెరుకూరు 5, ఫిరంగిపురం 4.4, కాకుమాను 4, మేడికొండూరు మండలంలో 3.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. డెప్యూటీ తహసీల్దార్లు బదిలీ నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్ సాల్మన్ను నాదెండ్లకు, ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సు బ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్ నాయక్ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్ను ముప్పాళ్లకు, ఎన్.అనూరాధను యడ్లపాడుకు, షేక్ బాషా ను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్.లక్ష్మీప్రసాద్ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్ను కారంపూడికి బదిలీ చేశారు. -
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు. న్యాయవాదుల విశిష్టతకు పుస్తక రూపం అభినందనీయం తెనాలి: న్యాయవాదుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని పలువురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన ‘తెనాలి లాయర్స్ డైరీ–2025’ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తెనాలి కోర్టు ప్రాంగణంలోని మహిళా న్యాయవాదుల భవనంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. 11వ అదనపు జిల్లా జడ్జి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.పవన్కుమార్, ఫస్ట్ ఏఎంఎం వివేక్వర్ధన్లు పాల్గొన్నారు. తెనాలి లాయర్స్ డైరీతో ఈ ప్రాంత న్యాయవాదుల ప్రాముఖ్యతను, సమాచారాన్ని పొందుపరచడం ఉపయోగకరమని జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, నాయయవాదులు వెలినేని రాఘవయ్య, మద్ది మల్లికార్జునరావు, ఎం.జగదీశ్వరాంబ, ఎ.విజయలక్ష్మి, గుమ్మడి రవిరాజ్ మాట్లాడారు. తెనాలి లాయర్స్ డైరీ రూపకల్పన చేసిన గుంటూరు కృష్ణను సత్కరించారు. -
రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్ !
పత్తి, మిర్చి విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రత్తిపాడు: కొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలు సమయంలో రైతులంతా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ● వ్యవసాయశాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ● కొనే సమయంలో వ్యాపారి నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ● జిన్నింగ్ లేదా లూజుగా ఉన్న పత్తి విత్తనాలు, కంపెనీ పేరు లేని ప్యాకెట్లు కొనకూడదు. ● పగిలిన ప్యాకెట్లు, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబరు, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీ, నికర తూకం, నికర ధరతో పాటు కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పై వివరాలన్నీ ఉంటేనే రైతులు బిల్లును తీసుకోవాలి. ● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సంచులపై కంపెనీ సీలు ఉన్నదో లేదో గమనించుకోవాలి. ● విక్రయదారుడు ఇచ్చిన బిల్లును పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరుచుకోవాలి. ● అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లును మాత్రం కచ్చితంగా అడిగి తీసుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని పరిశీలించాలి. ● సంతృప్తిగా ఉన్న విత్తన రకాలనే వాడాలి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే వీలుంటుంది. గతంలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు 2019కు ముందు వరకు నకిలీల బెడద రైతులను తీవ్రంగా వెంటాడేది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే వాటి ద్వారా భరోసా, గ్యారెంటీ ఇస్తూ నాణ్యమైన, రాజీలేని ఉత్పత్తులను అందించింది. దీంతో రైతులు ఆయా కేంద్రాల ద్వారానే పత్తి, మిర్చి విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత రైతుభరోసా కేంద్రాల పేరును మార్చి రైతు సేవ కేంద్రాలుగా నిర్వహిస్తున్నప్పటికీ అందులో సేవలు మాత్రం శూన్యమనే చెప్పాలి. లైసెన్సు ఉన్న వారి నుంచే కొనాలి విత్తనాలను కచ్చితంగా లైసెన్సు ఉన్న అధీకృత డీలరు వద్దే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకుని డీలరుతో సంతకం చేయించుకోవాలి. రైతు కూడా బిల్లుపై సంతకం చేయాలి. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లుతో పాటు విత్తనాల ప్యాకెట్ కవరును భద్రపరుచుకోవాలి. రైతులు నకిలీల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం. దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడతాం. – షేక్ సుగుణా బేగం (ఏవో, ప్రత్తిపాడు) -
సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట
కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన లక్ష్మీపురం: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం వీఆర్ఏలు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పేరుతో హామీలు అమలు చేశామంటూ పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ ఉత్సవాలు చేసుకుంటోందని విమర్శించారు. వాటిలో వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాడు నిర్వహించిన యువగళం, పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులతో సమావేశం జరిపి, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది నేటికీ అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు వేతనాలు ఇస్తోందని, ఇక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఎందుకు ఆలోచించట్లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలకు గతంలో డీఏను వేతనంతో కలిపి ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం విడిగా ఇవ్వడంతో పెరుగుదల లేదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతనాలు పెంపు లేని కారణంగా వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీఆర్ఏలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఉంటున్నారని, వారి సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేస్తామని లక్ష్మణరావు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నిసా, షేక్ ఆదం షఫీ, ఎన్. రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య పాల్గొన్నారు. -
అవగాహనతోనే మాతృ మరణాలకు అడ్డుకట్ట
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడంతో మాతృ మరణాలు నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మే నెలలో గుంటూరువారితోట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన మాతృ మరణానికి గల కారణాలను కమిటీ సభ్యులు సమీక్షించారు. కూలంకషంగా చర్చించాక ఈ మరణం నివారించలేనిదిగా నిర్ణయించినట్లు డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు సంభవించకుండా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాతృ మరణాలకు గల కారణాలపై గర్భిణులు, బాలింతలతోపాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణులు కూడా క్రమం తప్పకుండా వైద్యాధికారి వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తీసుకోవడం లాంటి చర్యలతో మాతృ మరణాలను పూర్తిగా నివారించవచ్చని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ రంగారావు, డాక్టర్ ఝాన్సీవాణి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ ఆదిత్య ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రాధికా రాయుడు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, శ్రీధర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సైదా ఖాన్ను పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సురసాని వెంకటరెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం
బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మార్క్ఫెడ్ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, యాప్లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు. -
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. తెరపైకి పాత అక్రమ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కారు స్వాధీనం తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల పేరిట బెదిరింపులు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు అధికార పక్షమైతే ఓకే... వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.వాగులో లారీ బోల్తాప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.ఆలయ నిర్మాణానికి విరాళంనరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.భక్తి శ్రద్ధలతో చండీహోమంనగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. -
రెచ్చిపోతున్న
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలులో జాప్యం తగదు
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీ ఎన్నిక సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9న సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు -
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి
ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ -
ఉపాధి హామీ పనుల్లో లోపాలు
రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి సుందర్రావు, టీఏ మాధవి, ఎస్ఆర్పీ బి ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
వైఎస్సార్సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.ఖతార్లో ఉద్యోగావకాశాలుగుంటూరు వెస్ట్/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలో టీఐసీ అండ్ ఏ, ఆర్సీ మల్టీ వెల్డర్ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్ ఏఆర్సీ మల్టీ వెల్డర్కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్ ఏఆర్సీ వెల్డర్కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసంఅభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.27న నిధి ఆప్కే నికత్గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎస్.తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. గుంటూరులోని ఏసీ కళాశాల, కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులోని దీపక్ నెక్ట్స్జెన్ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్ఆర్ పురంలో సౌత్ సెంట్రల్ జోన్ మెటలి ఫెరస్ మైన్స్ గ్రూప్లోని ప్రకాశం వృత్తి శిక్షణ కేంద్రం, విజయవాడలో ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని విజన్ ఎడ్యుకేషన్ సొసైటీ, పల్నాడు జిల్లా గణపవరంలోని శ్రీధనలక్ష్మి కాటన్ అండ్ రైస్ మిల్లు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశాలకు ప్రకటనగుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓగా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పదోన్నతి పొంది రాష్ట్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు పలువురు వైద్యులు అభినందించారు. -
ఇళ్లు కట్టిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
తెనాలి రూరల్: పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా తెనాలి మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, నేలపాడు గ్రామాలలో పలువురికి స్థలాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఆ క్రమంలో ఎస్జీ బిల్డింగ్ వర్క్స్ పేరిట పట్టణ మారీసుపేట 24వ వార్డు శాంతినగర్కి చెందిన కాంట్రాక్టర్ కం ఏజెంట్ ఎం. పున్నారావు తెరపైకి వచ్చాడు. తాను తక్కువ ఖర్చుతో సకాలంలో ఇళ్లు కట్టిస్తానని సుమారు 175 మంది లబ్ధిదారులను నమ్మించాడు. వారి నుంచి అటు ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇటు లబ్ధిదారుల సొంత డబ్బు అందినకాడికి దండుకుని కొద్దిపాటి పనులు మాత్రమే చేశాడు. లబ్ధిదారులను ఇన్నాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 58 మంది బాధితులను విచారించి మంగళవారం పున్నారావును అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో పేదలను మోసం చేసిన మరో ఏడుగురు కాంట్రాక్టర్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. -
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ఎంపిక
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధన లక్ష్మి, ప్రసన్న ఉన్నారు. -
భార్యపై అనుమానంతో వ్యక్తి హత్య
భట్టిప్రోలు(వేమూరు): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి భట్టిప్రోలులో చోటుచేసుకుంది. వేమూరు రూరల్ సీఐ వీరాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన చాగళ్లమర్రి రత్నరాజు, జంపని సురేష్ స్నేహితులు. రత్నరాజు తాపీ పనిచేస్తుండగా, సురేష్ వడ్రంగి పనిచేస్తున్నాడు. రత్నరాజు భట్టిప్రోలు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె భట్టిప్రోలులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి రత్నరాజు భట్టిప్రోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జంపని గ్రామానికి చెందిన జంపని సురేష్ తారసపడ్డాడు. దీంతో రత్నరాజు అతనిని ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రత్నరాజు తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. -
కనకదుర్గ వారధిపై బైకును ఢీకొన్న లారీ
● బైక్పై ఉన్న వ్యక్తి కృష్ణానదిలో పడిన వైనం ● కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు ● పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం తాడేపల్లి రూరల్: జాతీయ రహదారిపైనున్న కృష్ణానది కనకదుర్గ వారధిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఓ లారీ మంగళవారం రాత్రి అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి వారధిపై నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో పడ్డాడు. లారీ రెయిలింగ్ను ఢీకొని ఎదురు క్యాబిన్ వరకూ వారధిపైనుంచి గాలిలో వేలాడింది. సేకరించి వివరాల ప్రకారం.. చైన్నె నుంచి కోలకత్తా వెళుతున్న లారీ కనకదుర్గ వారధి వద్దకు వచ్చాక బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు బైక్పై వెళుతున్న తాజ్ అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తాజ్ గాలిలో ఎగిరి 60 అడుగుల లోతులో ఉన్న కృష్ణానది ఇసుక దిన్నెల్లో పడిపోయాడు. లారీ నడుపుతున్న ఎంపీకి చెందిన మోసిన్ లారీ క్యాబిన్ డోర్ ఓపెన్ అయి వారధిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రోప్ సహాయంతో పై నుంచి కిందకు దిగి ఎస్ఐ నారాయణ, సిబ్బంది కలిసి ఇసుక తిన్నెల్లో పడిన తాజ్ను కిలోమీటర్ మేర మోసుకొచ్చి వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఇతను ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీని రెండు గంటలపాటు కష్టపడి క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వారధిపై ప్రమాదం జరగడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
లోక్ అదాలత్ ఇచ్చేది అంతిమ తీర్పే
సత్తెనపల్లి: లోక్ అదాలత్లో ఇచ్చేది అంతిమ తీర్పుగా భావన చేయాలని మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆధ్వర్యంలో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సెక్షన్లు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఆయా ఎస్.హెచ్.వో లకు సూచనలు చేశారు. ముందు సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు, ఎస్.హెచ్.ఓ లతో గుంటూరు జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియాఉద్దీన్లు వర్చువల్గా జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష చేశారు. అనంతరం స్థానిక న్యాయమూర్తులు స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె. సుజన్ కుమార్, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జాతీయ లోక్ అదాలత్పై ఎస్హెచ్ఓలతో సమీక్ష -
సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం
నగరంపాలెం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) ను సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించారు. ఆయా సమస్యలకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్లో మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంత్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), ఎ.శివాజీ రాజు (సీసీఎస్) కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బెదిరిస్తున్నారు స్థానికంగా ఇంటి వద్ద ఇద్దరు రౌడీషీటర్లు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వారిద్దరు ఏకమై, నన్ను ట్రాప్ చేశారు. బలత్కారం మినహా పనులన్నీ చేశారు. దీని ఆసరా చేసుకుని నా వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి రూ.40 వేలను విడతల వారీగా తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇంట్లో నుంచి తీసుకువచ్చి వారికి ఇచ్చా. మరలా ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. నమ్మకంగా నమ్మించి నగదు కాజేశారు. రౌడీషీటర్ భార్య కూడా నన్ను బెదిరిస్తోంది. ఏదైనా చేస్తారని భయంగా ఉంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నా. – ఓ బాలిక, గుంటూరు సహచర కానిస్టేబుల్ మోసం మంగళగిరి సబ్ డివిజన్లోని ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. సహచర కానిస్టేబుల్ కమీషన్ల కోసం ఓ ప్రైవేటు కంపెనీ పాలసీలు చేయించాడు. వాటికి సంబంధించి నగదు చెల్లించ లేదు. ఈలోగా అతడి భార్య ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు అడగ్గా, రూ.1.20 లక్షలు ఇచ్చాను. సదరు కానిస్టేబుల్ తర్వాత నా బంగారం కూడా తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకున్నాడు. గతంలో ఇచ్చిన డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. న్యాయం చేయగలరు. – బి.అంకరాజు, ట్రాఫిక్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు. అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా బుజ్జిబాబు గుంటూరు ఎడ్యుకేషన్ : న్యూజిలాండ్లో అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం కో–ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్గా న్యూజిలాండ్లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు. ‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు రాజుపాలెం: నడికూడి రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాఽథ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. యువకుడి బలవన్మరణం చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
● రూ. 3 లక్షల విలువైన మెత్ డ్రగ్ స్వాధీనం ● బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తుండగా పట్టుకున్న ఈగల్ టీమ్
టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి, మెత్ డ్రగ్స్ను ఈగల్ టీమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఈగల్ టీమ్ సోమవారం కాజ టోల్ గేట్ వద్ద నిఘా వేసింది. యువకుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలాల్లో అస్థిపంజరం లభ్యం తెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై ‘అమ్మా’నుషం తాడేపల్లి రూరల్ : వ్యభిచారంలోకి దించిన కన్నతల్లిపై మైనర్ కూతురు తాడేపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో సహజీనం చేస్తూ వడ్డేశ్వరం వచ్చి నివసిస్తోంది. 17 ఏళ్ల కూతురిని కూడా అతనితో ఉండాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు వ్యభిచారం వృత్తిలోకి దింపింది. ఈ బాధలు భరించలేక బాలిక పక్కింట్లో నివాసముంటున్న మహిళ సాయంతో తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసింది. -
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి లేదా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు. సీనియార్టీ ప్రకారం సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు, కోశాధికారి నాగిపోగు సుమన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ పాల్గొన్నారు.