ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

ఆర్టీ

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు వైభవంగా శ్రీవారి కల్యాణం ఇఫ్తార్‌ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09 పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): చంద్రబాబు సర్కార్‌ రాష్ట్రంలో 750 బస్సులు విద్యుత్‌ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. దానిలో గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు డిపో 2, మంగళగిరి డిపోల నుంచి విద్యుత్‌ బస్సులు నడపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు డిపో 2 నుంచి వంద, మంగళగిరి డిపో నుండి 50 విద్యుత్‌ బస్సులు నడపనుంది. దీనిని ఆసరాగా తీసుకుని డిపో 2 బస్టాండ్‌, గ్యారేజ్‌కి పూణెకు చెందిన పినాకిల్‌ అనే ప్రైవేట్‌ కంపెనీకి నాలుగు ఎకరాలు ఇవ్వనున్నట్లు సమాచారం. సిబ్బంది కూడా పినాకల్‌ సంస్థ వారే ఉంటారు. దీంతో కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గుంటూరు డిపో 2 పరిధిలో 120 ఆర్టీసీ బస్సులు, 22 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే అద్దె బస్సులను నిలిపివేశారు. 120 బస్సులకు సంబంధించి డిపో 1కు 19, తెనాలి డిపో 9, మంగళగిరి డిపో 23, పొన్నూరుకు 4 బస్సులు కేటాయించారు. డిపో 2 కింద ప్రస్తుతానికి 46 బస్సులు మాత్రమే ఉన్నాయి. మిగతా బస్సులను ఏ డిపోలకు కేటాయించాలనేది యోచిస్తున్నారు. డిపోల పరిధిలో సుమారు 485 మంది ఉద్యోగులు ఉన్నారు. డ్రైవర్‌లు, కండక్టర్‌లు కలిపి 300 మంది ఉండగా, సుమారు 100 మంది గ్యారేజ్‌ సిబ్బంది, 85 మంది వరకు హైర్‌ బస్సులను నమ్ముకుని జీవించే వారు ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులను ఇతర డిపోలకు బదిలీ చేసే ప్రక్రియ సాగుతోంది. పినాకిల్‌ కంపెనీకి త్వరలోనే డిపో స్థలాలను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పీఎం ఈ – బస్‌ సేవ కింద విద్యుత్‌ బస్సులను డిపోలకు కేటాయించారు. డిపో 2 గ్యారేజ్‌ని చార్జింగ్‌ పాయింట్ల కోసం, డిపోను మాత్రం బస్సులు నిలిపేందుకు కేటాయించనున్నారు. బస్సుల నిలుపుదల ప్రాంతాన్ని ఆరు అడుగులు మట్టంపైకి లేపి, సుమారు 30 వరకు చార్జింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే ప్రక్రియను ఆర్టీసీ అధికారులకే అప్పజెప్పారు.

న్యూస్‌రీల్‌

రూ. 400 కోట్లకుపైగానే...

పీపీపీ విధానంలో పినాకిల్‌ ప్రైవేట్‌ సంస్థకు కేటాయిస్తున్న డిపో విస్తీర్ణం సుమారు 5 ఎకరాలపైనే ఉందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో నాలుగు ఎకరాలు ప్రైవేట్‌ సంస్థకి కేటాయించారని తెలుస్తోంది. ఎకరం రూ. 100 కోట్లుపైగా ఉంటుందని అంచనా. దీనిని ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపారు.

గుంటూరు
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026

పీపీపీ విధానంలో ప్రైవేట్‌ కంపెనీకి

విద్యుత్‌ బస్సుల నిర్వహణ

అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత

మాత్రం ఆర్టీసీ అధికారులదే..

రూ. 400 కోట్ల విలువైన భూమిని

అప్పనంగా దోచిపెట్టే పన్నాగం

సాగర్‌ నీటిమట్టం

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.

నరసరావుపేట ఈస్ట్‌: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.

బస్సుల తరలింపు..

పనులకు సన్నాహాలు

రూ. కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు మరోసారి చంద్రబాబు సర్కార్‌ తెరలేపింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్టీసీ విద్యుత్‌ బస్సులు నడపాలని నిర్ణయించినా, వాస్తవానికి సంస ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నుతోంది. దీని వలన ఆర్టీసీకి మేలు శూన్యం. పైగా సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

7

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 1
1/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 2
2/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 3
3/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 4
4/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 5
5/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు 6
6/6

ఆర్టీసీపై పినాకిల్‌ పిడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement