breaking news
Guntur District Latest News
-
ఏడుగురు బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు
నెహ్రూనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్న్లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంలో విఫలమైన 7 మంది బీఎల్ఓలకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అరుణ బేజ్జం(25 పోలింగ్ బూత్), నాళి వెంకటేశ్వర్లు, వరప్రసాద్ దాసరి, షేక్ నజీరుద్దీన్ బాషా, బి.వెంకటేశ్వర్లు, కురగంటి కిరణ్, తెనాలి రత్నకుమార్లకు నోటీసులు జారీ చేశామన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి అధికారి తప్పనిసరిగా పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. సంబంధిత బీఎల్ఓలు 24 గంటల్లోగా తమ వివరణ సమర్పించాలని, లేనిపక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. . చిలకలూరిపేటటౌన్: టిడ్కో గృహాల్లో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటున్న సీహెచ్ ఉదయ్సాయి(27) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో సీలింగ్ ఫ్యాన్న్కు లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు వీరయ్య, వెంకటరమణలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
తులసి జ్యోతికి అరుదైన గౌరవం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని జక్కంపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో తుపాకుల దుర్గాభవానీ, యేసుబాబు(31) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కాగా, యేసు బాబు ట్రాక్టర్ నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం ఉదయం పనికి వెళ్లిన యేసుబాబు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో ఆలస్యం ఎందుకయ్యిందని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన దుర్గాభవానీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న యేసుబాబు నిద్రలేచి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో మనస్తాపం చెంది విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో యేసుబాబు బావమరిది దుర్గారావు విషయాన్ని గమనించి వెంటనే 108 ద్వారా కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. దుర్గాభవానీ ఆసుపత్రికి చేరుకునే సరికే యేసుబాబు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఘటనపై కొత్తపేట పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన నున్నారు. 4న ట్రస్ట్ బోర్డు సమావేశం... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఉద్యమం
నష్టపోయిన పసుపు రైతులకుపరిహారం వెంటనే చెల్లించాలి లక్ష్మీపురం: దుగ్గిరాల శుభం పసుపు కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన బాధిత పసుపు రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం క్వింటాకు రూ.7 వేలు చొప్పున నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 296 మంది రైతులకు చెందిన(404 బాండ్లు) పసుపు కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదానికి గురైందన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.7 వేల చొప్పున పరిహారం ఇప్పిస్తామని రైతులతో ఒప్పందం చేసుకుంది. రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంత వరకు సింగిల్ పైసా నష్టపోయిన బాధిత రైతులకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి క్వింటాకు రూ.5 వేలు మాత్రమే ఇస్తామని కూటమి నేతలు చెప్పటం చాలా దారుణం అన్నారు. ఒప్పందం చేసుకున్న మేరకు క్వింటాకు రూ.7 వేలు చొప్పున తక్షణమే చెల్లించాలని, రైతులను మోసగించి నష్టపరిచిన శుభం మహశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యానికి పసుపు మార్కెట్లో ఉన్న లైసెన్స్ రద్దు చేయాలని, దాంతో పాటు రాష్ట్రంలోఎక్కడా వ్యాపారం చేయకుండా శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
రోడ్డెక్కిన చిరు వ్యాపారులు
మున్సిపల్ ఉద్యోగుల తీరుపై నిరసన తెనాలిఅర్బన్: మున్సిపాలిటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని మార్కెట్ సెంటర్లోని చిరువ్యాపారులు నిరసన గళం విప్పారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం తమ నిరసన తెలిపారు. తరచూ వేధిస్తుంటే తాము వ్యాపారాలు ఎలా చేసుకోవాలని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నిలదీశారు. తెనాలిలో మున్సిపల్ మార్కెట్ సెంటర్.. ఎందరో చిరువ్యాపారులకు నిలయం. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పండ్లు విక్రయించుకుంటూ ఎంతోకొంత సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడ వ్యాపారాలు చేసేవారున్నారు. వీరిలో 50– 60 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. మామూళ్లు ఇస్తే ఒకరకం... లేకుంటే మరోరకం అన్నట్టుగా మున్సిపాలిటీ ఉద్యోగులు వీరిపై జులం ప్రదర్శిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనీ, ట్రాఫిక్కు అవరోధమని రకరకాలుగా చెబుతూ తోపుడుబండ్లు, వాటిపై సరుకులు, కాటాలు, లైట్లు తీసుకెళ్లి, మున్సిపాలిటీలో పడేస్తున్నారు. అవి తిరిగి ఇవ్వమంటే నానా బూతులూ తిడుతున్నారు. ప్రతిసారి ఇలా చేయటంతో విసిగిపోయిన వ్యాపారులు శుక్రవారం మున్సిపాలిటీ ఎదుట నిరసనకు దిగారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసి వెంకట్రామయ్య అనే ఉద్యోగిపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో డబ్బులు ఇచ్చేవాడినని, ఇప్పుడు వ్యాపారాలు సరిగా లేక ఇవ్వకపోవడంతో తమపై దౌర్జన్యం చేస్తున్నట్లు జేమ్స్ అనే వ్యాపారి ఆరోపించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపై ఇంత చిన్నచూపు ఎందుకంటూ ప్రశ్నించారు. మంగమ్మ మాట్లాడుతూ కొందరూ మున్సిపల్ ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందికరంగా తయారైందని, సరిగా వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా మంత్రి మనోహర్, ఉన్నతాధికారులు స్పందించి తమపై జూలుం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. -
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
మంగళగిరి టౌన్: విద్యార్థులు నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి పట్టణం రత్నాల చెరువు జాతీయ రహదారి వెంబడి ఉన్న ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతు గ్రేహౌండ్స్ తరహాలోనే ఈగల్ టాస్క్ఫోర్స్ కూడా భవిష్యత్లో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ను సాకారం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈగల్ టాస్క్ఫోర్స్ ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీ పనితీరును చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈగల్ తరహా మోడల్ను అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నాయని తెలిపారు. గడిచిన రెండేళ్లలో సుమారు 1,20,300 కేజీల గంజాయిని డిస్ట్రాయ్ చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏజన్సీ ఏరియాల్లో పల్లెనిద్ర కార్యాక్రమాన్ని చేసి గంజాయి సాగు నిర్మూలనపై గిరిజనులకు ధైర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యవంతమైన సమాజ స్ధాపనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఈగల్ వెబ్సైట్ను ప్రారంభించామని, ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలోని గంజాయి, డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు చేరవేయవచ్చని వెల్లడించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఈగల్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీలు మహేశ్వరరాజు, నగేష్బాబు, స్వరూపారాణి, ఎన్సీబీ ప్రతినిధి త్రివేది, ఈగల్ స్పెషల్ పీపీ శైలజ, డీఎస్పీలు త్రినాథ్, దుర్గా ప్రసాద్, సింగయ్య పాల్గొన్నారు. -
టీడీపీలో హోటల్ వ్యాపారం గోల
● మిగిలిన వారి వ్యాపారాలను దెబ్బతీస్తున్న కొత్త హోటల్ యాజమాన్యం ● మంత్రి పేషీలోని వ్యక్తి ఫోన్లతో నిత్యం దాడులపర్వం ● రంగంలోకి ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జీఎస్టీ, సివిల్ సప్లైస్ అధికారులు ● మండిపడుతున్న ఇతర హోటల్ యజమానులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇటీవల కొత్తగా ఒక హోటల్ ప్రారంభమైంది. దానిని మంత్రి నారా లోకేష్ ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ హోటల్ యాజమాన్యంలో ఒకరికి లోకేష్ పేషీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తితో బంధుత్వం ఉంది. దీంతో వారు వ్యాపారం ప్రారంభించగానే తమకు పోటీగా ఉన్న హోటళ్లపై ఫిర్యాదులు చేయడం, అధికారులతో దాడులు చేయించడం మొదలు పెట్టారు. గుంటూరు నగరంలో ముఖ్యమైన హోటళ్లు 70 శాతానికిపైగా ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. మిగిలిన కొద్ది హోటళ్లు మాత్రమే ఇతర సామాజిక వర్గాల చేతిలో కొనసాగుతున్నాయి. వరుస ఫిర్యాదులు.. ఆపై దాడులు కొత్త హోటల్ ప్రారంభం కాగానే అదే ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్పై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన చికెన్ ఉందంటూ హడావిడి చేశారు. తర్వాత బిర్యానీకి పేరొందిన మరో హోటల్పై దాడులు చేశారు. ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్లే ఈ దాడులు చేస్తే ఇబ్బంది వస్తుందనుకుని జీఎస్టీ, సివిల్ సప్లయిస్ శాఖ వారితో కూడా దాడులు చేయించడం మొదలు పెట్టారు. జీఎస్టీ అధికారులు ఇటీవల వరుసగా హోటళ్లపై దాడులు చేస్తూ 12 హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. సివిల్ సప్లయిస్ విభాగం వారు నాలుగు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం అక్రమమని నోటీసులు జారీ చేశారు. ఆదేశాలు అక్కడి నుంచే... అధికారులకు కూడా లోకేష్ పేషీలో ఉన్న వ్యక్తి స్వయంగా ఫోన్లు చేసి ఈ దాడులు చేయిస్తున్నారని ఇతర హోటల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్దతి కొనసాగితే తాము చూస్తూ ఊరుకోబోమని వారు అధికార పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. కక్ష గట్టి దాడులు చేయించడంపై ప్రశ్నిస్తున్నారు. కొందరు నగరంలో జరుగుతున్న వ్యవహారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లగా అందరిని కూర్చొబెట్టి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. లోకేష్ పేషీ నుంచి జోక్యం ఆగకపోతే తమ నిర్ణయం తాము తీసుకుంటామని హోటల్ యజమానులు స్పష్టం చేస్తుండటంతో ఈ వ్యవహారం అధికారపార్టీలో చర్చకు దారితీసింది. ఎవరైనా కొత్తగా వ్యాపారం పెడితే నాణ్యతపై దృష్టి పెట్టి కస్టమర్లను పెంచుకోవాలని ఆలోచిస్తారు. అయితే గుంటూరు బృందావన్ గార్డెన్స్లో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన హోటల్ యజమానులు దీనికి భిన్నంగా ఆలోచించారు. తమ ప్రాంతంలో ఉన్న ఇతర హోటళ్ల వ్యాపారాలను దెబ్బతీయడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకున్నారు. దీనికి రాజకీయ ఒత్తిడి తెచ్చి అధికారులతో దాడులు చేయించడంతో ఇతర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తకాల మోతతో భారంగా మారుతోంది. ఇప్పటికే ఆటలకు దూరమైన చిన్నారులు పాఠశాల గదుల్లోనే ఎక్కువగా మగ్గిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేటు స్కూళ్లపై మోజు పెరిగిపోయింది. దీంతో బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు వీపున వేస్తున్నారు. ఇదే వారి వెన్నెముకకు భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. – డాక్టర్ జె. నరేష్బాబు, సీనియర్ స్పయిన్ సర్జన్, గుంటూరు విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.30 అడుగులకు చేరింది. ఇది 140.4451 టీఎంసీలకు సమానం. -
వైభవంగా నరసింహుని శాంతి కల్యాణం
బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరం శ్రీ వజ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామికి శాంతి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కొండపైన స్వయంభువుగా వెలసిన స్వామి వారికి విశేష అభిషేక, పుష్పాలంకరణ చేశారు. కల్యాణ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో సుదర్శన మహా యాగ పూర్ణాహుతి చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి సన్నిమెళ్ళ కోటిరెడ్డి, ఆలయ అర్చకులు దివి చెన్న కేశవాచార్యులు, ప్రసన్న కుమార ఆచార్యులు పాల్గొన్నారు. నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా డెప్యూటీ డైరెక్టర్గా పి.జ్యోతిలక్ష్మీదేవిని నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గుంటూరులో డీడీగా విధులు నిర్వర్తిస్తున్న యు.చెన్నయ్యను ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్గా పనిచేస్తున్న పి.జ్యోతిలక్ష్మీదేవికి డీడీగా పదోన్నతి కల్పించి గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యలో తన అభ్యున్నతికి మార్గ నిర్దేశం చేసిన నాటి గురువులను ఐపీఎస్ అధికారి శుక్రవారం ఇంటికి వెళ్లి సత్కరించారు. నరసరావుపేటకు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్కేఆర్బీఆర్ మున్సిపల్ స్కూల్ (గాలి కోటయ్య స్కూల్)లో తనకు విద్యాబుద్ధులు నేర్పించిన అప్పటి ఉపాధ్యాయులు వజ్జా సుబ్బారావు, డానియేల్, మౌలాలి, కందిమళ్ల ఆదినారాయణ తదితరుల గృహాలకు వెళ్లి తన ఉన్నతికి వారే కారణమని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. సత్తెనపల్లి: సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ బి. అరుణను యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో 2025 డిసెంబర్లో జరిగిన ఓ గర్భిణి ప్రసవం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇది సక్రమం కాదంటూ అమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు విచారించిన అనంతరం బంక అరుణ బదిలీని రద్దు చేసింది. లేకుంటే సత్తెనపల్లి సమీప వైద్యశాలలో డాక్టర్గా నియమించాలని కూడా సూచించింది. ఆమెను హిందూపురం బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్ రిజిస్టర్లో నిందను కూడా తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్కు రాజధాని భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై ఈ నెల 30వ తేదీన ఉండవల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రైతులు తెలిపారు. రైతుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్కు పొలాలు ఇచ్చి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజధానిలో పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. స్థానిక వర్సిటీల్లో ఈ ప్రాంత పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలన్నారు. నేతలు కృష్ణయ్య, జొన్న శివశంకర్, రవి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పద్మారెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు
నగరంపాలెం: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని విద్యా సంస్థల సమీపాన 724 దుకాణాలు తనిఖీలు చేశారు. వంద కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లోని దుకాణాల్లో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఖైనీ, సిగరెట్లు, ఈ–సిగరెట్లు, నిషేధిత, హానికరమైన ఉత్పత్తులు విక్రయించరాదని దుకాణాల యాజమానులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ పరిధిలో నెలకొన్న పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, కోచింగ్ సెంటర్ల ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని అన్నారు. -
‘క్రిటికల్’గానే పనులు
తెనాలిఅర్బన్: ఒకడుగు ముందుకు రెండు అడగులు వెనక్కి అన్న చందాన తెనాలిలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇటీవల దానిలో పనిచేసే కార్మికుడు వడ దెబ్బ తగిలి మరణించటంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు ఆందోళనతో ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కొద్ది రోజులు పూర్తిగా పనులు నిలిచిపోయాయి. వేసవి తీవ్రత తగ్గడంతో పనులు పునః ప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో వంద పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణం కోసం రూ.45 కోట్ల నిధులు వెచ్చించింది. స్థల కేటాయింపు.. పాత భవనాలు కూల్చివేత వంటి పనులు పూర్తి చేసుకుని 2023 డిసెంబర్లో హైదరాబాద్కు చెందిన ఎలిక్సర్ మిట్ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులు ప్రారంభించింది. ప్రస్తుతం శ్లాబ్లు పూర్తి అయి ప్లాస్టింగ్ స్టేజ్లో భవనాలు ఉన్నాయి. ఇంకా దీనిలో ఫ్లోరింగ్, వాల్ కేర్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు, ఎలక్ట్రిక్ వర్కు, తలుపులు, కిటికీల ఏర్పాటు వంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే వార్డుల ఏర్పాటుకు సంబంఽధించిన కొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉంది. నిధుల కేటాయింపులు ఇలా... క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.45 కోట్లలో రూ.22 కోట్లు భవన నిర్మాణ పనులకు కేటాయించారు. మిగిలిన నిధులు ఆపరేషన్ థియేటర్, క్యాజువాలిటీలలో వస్తువుల కొనుగోలు, వార్డులలో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించనున్నారు. ముందుకు సాగని పనులు భవనాన్ని 2025 ఏప్రిల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పట్లో ఎర్రమట్టి, ఇసుక లభ్యత లేకపోవటం వలన సుమారు ఏడాది పాటు నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేసినా చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు కొంత కాలం నిలిపివేసింది. చేసేది లేక కాంట్రాక్టర్ పనులు ఆపారు. గడువును పొడిగించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు 2026 ఏప్రిల్ వరకు పొడిగించారు. అప్పటి నుంచి పనులు జరుగుతున్న ఆశించిన స్థాయిలో వేగంగా జరగటం లేదు. అంతేకాకుండా రెండు నెలల క్రితం వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు కార్మికుడు మృతి చెందాడు. దీంతో పనులు పూర్తిగా నిలిపివేశారు. కొద్దిరోజుల నుంచి మళ్లీ పనులు పునః ప్రారంభమైయ్యాయి. పనులను ఆగస్టుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటి వరకు పొడిగింపు అనుమతులు లభించలేదు. తెనాలి చేరుతున్న వస్తువులు క్రిటికల్ కేర్ యూనిట్లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఇనుప మంచాలు, పరుపులు, ఆపరేషన్ థియేటర్లో ఏర్పాటు చేసే వస్తువులు వంటివి ఆస్పత్రికి వచ్చేశాయి. ఇంకొన్ని రావాల్సి ఉంది. అవి కూడా భవన నిర్మాణం పూర్తి అయ్యే నాటికి వస్తాయని అధికారులు చెబుతున్నారు. రోగులకు ఉపయోగపడే ఈ యూనిట్ త్వరితగతిన ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం ఇకనైనా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్లో ఇంటిన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) విభాగాన్ని 20 పడకలతో (చిన్నపిల్లలకు అవసరమైన నాలుగు బెడ్లు కలిపి) ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైడిఫినిషిన్ యూనిట్ (హెచ్డీయూ) 20 పడకలు, ఐసోలేషన్ వార్డు 30 పడకలతో, ఐసోలేషన్ గదులు 12, డయాలసిస్ బెడ్లు 4, ఎంసీహెచ్ (బాలింతలకు) 4 బెడ్లు, అత్యవసర విభాగం 10 పడకలతో నిర్మించనున్నారు. ఇవి కాకుండా మూడో అంతస్తులో రెండు ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
భద్రతపై ‘హద్దు’ల్లేని నిర్లక్ష్యం
పట్నంబజారు: మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పొందిన వాహనం మరో రాష్ట్రంలో నడవాలంటే తప్పనిసరిగా ఇంటర్ స్టేట్ పర్మిట్ ఉండాలి. రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందాల ప్రకారం మాత్రమే ఈ అనుమతులు ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ నడిచే వాహనాలపై భారీ జరిమానాలు, వాహనాల స్వాధీనం, పర్మిట్ రద్దు వంటి చర్యలు తీసుకునే అధికారం ఉంది. గుంటూరు జిల్లాలో ఇవి కఠినంగా అమలు కావటం లేదు. జిల్లాలో నాగాలాండ్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలకు చెందిన బస్సులు ఇక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులే నడుపుతున్నారు. ఎంట్రీ ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్స్ చెల్లించాలి. అయితే అనేక ప్రైవేట్ బస్సుల వారు ఈ పన్నులను తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిపోతోంది. చట్టబద్ధంగా నడిచే ఆపరేటర్లకు అన్యాయం జరుగుతోంది. అటకెక్కిన నిబంధనలు మరోవైపు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని, గడువు ముగిసిన బస్సులు రోడ్లపైకి రావడం అత్యంత ప్రమాదకరంగా మారింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి కమర్షియల్ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. బ్రేకులు, టైర్లు, లైటింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు వంటి అంశాలు సరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ తనిఖీలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ల విషయంలోనూ... దూర ప్రయాణాల బస్సులకు కనీసం ఇద్దరు అర్హత కలిగిన డ్రైవర్లు ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క డ్రైవర్తోనే ప్రయాణాలు, రెండో డ్రైవర్కు లైసెన్స్ లేకపోవడం, అలసటతో డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 3, 10 ప్రకారం ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడపాలంటే హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయం లోపించడం, రాత్రి వేళల్లో తనిఖీలు చేయకపోవడం, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు పూర్తిగా వినియోగంలో లేకపోవడం ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. ఇటీవలి ప్రమాదాలు కూడా అధిక వేగం, డ్రైవర్ అలసట, ఫిట్నెస్ లోపాల వల్లే జరిగినట్లు తేలింది. కఠిన చర్యలు ముఖ్యం నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత బస్సుల యజమానులకు భారీ జరిమానాలు, బస్సు సీజ్, పర్మిట్ రద్దు, డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ వంటి చర్యలు నిర్బంధంగా అమలు చేయాలి. ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు చేపట్టడం, ఇతర రాష్ట్రాలతో డేటా సమన్వయం పెంచడం, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేయడం అవసరం. ప్రజలూ బస్సులో ప్రయాణించే ముందు వివరాలు పరిశీలించడం, అనుమానాస్పద పరిస్థితుల్లో అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా రవాణాశాఖ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నా.. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నా, ప్రైవేట్ ట్రావెల్స్ టిక్కెట్ ధరలు భారీగా పెంచినా వారు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకుని వెళితే.. ‘‘మనం ఏం చేస్తాం.. మన చేతిలో ఏముంది..? వాళ్లు మన మాట వినరని’’ చెప్పటం కొసమెరుపు. -
అర్హులందరూ ఓటర్లుగా నమోదు కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అవ్వాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన రాజకీయపార్టీల ప్రతినిధులు, అధికారుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓలు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. డీఆర్వో షేక్ ఖాజావలి ఎన్యుమరేషన్ ఫారాలు ఏ విధంగా పూర్తి చేయాలనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఓలు బీఎల్ఏలతో సమావేశాలు నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు మార్గదర్శకం చేయాలన్నారు. సమావేశపు మినిట్స్ను యాప్లో అప్ లోడ్ చేయాలన్నారు. జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరుకు రెండు ఫారాలను అందించి పూర్తి చేసిన ఫారాలలో ఒక దాని మీద ఓటరు సంతకం చేసిన ఫారాన్ని తీసుకొని, బీఎల్ఓ సంతంకం చేసిన ఫారాన్ని ఓటరుకు అందించాలన్నారు. తర్వాత వాటిని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఇలా చేయడం వలన డెత్, వలసలు, డూప్లికేట్లను గుర్తించవచ్చన్నారు. ఈ వివరాలన్నీ డీఈఓ లాగిన్లో కనిపిస్తాయన్నారు. పోలింగ్ స్టేషన్ల మార్పులు, చేర్పులకు జూలై 14 వరకు ప్రతిపాదనలు పంపవచ్చన్నారు. డ్రాప్ట్ పబ్లికేషన్ను జూలై 21న ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు, ఫిర్యా దులు ఏమైనా ఉంటే జూలై 21 నుండి ఆగష్టు 20 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు జులై 21 నుండి సెప్టెంబర్ 18 పరిష్కరిస్తారని, తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 22న విడుదల చేస్తామన్నారు. తాడికొండ, మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ లొకేషన్ మార్పులు, ప్రతిపాదించిన కొత్త పోలింగ్ స్టేషన్న్స్కు రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయి. పొన్నూరు, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల పరిధిలో మార్పులపై పెండింగ్లో ఉంచామని తెలిపారు. సమావేశంలో గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, శ్రీరమణి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, అధికారులు, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గురువారం వన్ కె వాక్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నుంచి ప్రారంభమైన వాక్ మెడికల్ కాలేజీ రోడ్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మీదుగా జిల్లా కోర్ట్ ఆవరణ వరకు సాగింది. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత భారత్గా మార్చడానికి అవగాహన కలిగించాలన్నారు. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఆఫీసర్ వి.అరుణ కుమారి మాట్లాడుతూ ఎవరికై నా డ్రగ్స్ సమాచారం తెలిస్తే 14405కు కాల్ చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు లీగల్ ఎయిడ్ డిఫనన్స్ కౌన్సెల్ చీఫ్ సురేష్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫన్స్ కౌన్సెల్ మధుబాబులు.. డ్రగ్స్ నివారణకు తీసుకోవాల్సిన పలు చర్యలను వివరించారు. -
ఎడిన్బర్గ్లో మహర్షి శుశ్రుతుని కాంస్య విగ్రహం
తెనాలి: దేశంలో వేల ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ, కాటరాక్ట్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి, పరికరాలు రూపొందించిన మహర్షి శుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఇంగ్లండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఆవిష్కరించారు. దీనితో ‘ఫాదర్ ఆఫ్ సర్జరీ’గా పాశ్చాత్య ప్రపంచం అధికారికంగా గుర్తించి గౌరవించినట్టయిందని, మన వైద్య విజ్ఞానానికి దక్కిన గౌరవంగానూ భావిస్తున్నారు. అయితే ఈ గౌరవానికి కారకుడు తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బేరియాట్రిక్, లాపరోస్కాపిక్ సర్జన్ డాక్టర్ చంద్ర చెరువు కావటం గర్వకారణం. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఈనెల 19వ తేదీన ఏర్పాటుచేసిన 90 కిలోల మహర్షి శుశ్రుతుడు కాంస్య విగ్రహానికి అయిన ఖర్చును ‘చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్’ ద్వారా డాక్టర్ చంద్ర విరాళంగా ఇచ్చారు. తమిళనాడులోని స్వామిమలైకి చెందిన రాఘవానందం స్తపతి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఎడిన్బర్గ్లోని భారత కాన్సుల్ జనరల్ సిద్ధార్థ మాలిక్, రాయల్ కాలేజి ప్రెసిడెంట్ క్లేర్ మెక్నాట్లు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే వేదికపై డాక్టర్ చంద్ర రచించిన ‘మహర్షి శుశ్రుత ఏ కంపెండియమ్ ఫాదర్ ఆఫ్ సర్జరీ’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదే సమయంలో తన తండ్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సీఎస్ శాస్త్రి జ్ఞాపకార్థం రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో రెండు శాశ్వత ట్రావెలింగ్ సర్జికల్ స్కాలర్షిప్స్ను డాక్టర్ చంద్ర ఏర్పాటుచేశారు. రాయల్ కాలేజ్ని 1505లో స్థాపించారు. 140 దేశాలకు చెందిన 33 వేలమందికి పైగా సుభ్యులు ఇందులో ఉన్నారు. తొలి నుంచి ఉదారత .. 2600 సంవత్సరాల తర్వాత మహర్షి శుశ్రుతుడికి ఇంతటి గౌరవాన్ని కల్పించిన డాక్టర్ చంద్ర చెరువు స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని వేమూరు మండల గ్రామం పెరవలి. వీరిది సంపన్న కుటుంబం. వీరి పెద్దలు గ్రామంలో హైస్కూలుకు భూరి విరాళం ఇచ్చారు. చంద్ర తండ్రి డాక్టర్ సీఎస్ శాస్త్రి విజయవాడలో వైద్యునిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన బాటలోనే ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లండ్లో స్థిరపడిన డాక్టర్ చంద్ర, ఇంగ్లండ్లోని నార్త్ మిడ్ల్యాండ్స్లో కన్సల్టెంట్ బేరియాట్రిక్, లాపరోస్కోపిక్, అప్పర్ జీఐ సర్జన్గా చేస్తున్నారు. 1995 నుంచి క్లినికల్ పరిశోధనలు పాలుపంచుకుంటున్నారు. స్టోక్–ఆన్– ట్రెంట్ నగరంలో ఉన్న హిందూ సాంస్కృతిక సంఘానికి డాక్టర్ చందు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే స్టాన్ఫోర్డ్లో తొలి హిందూ దేవాలయాన్ని 2025 ఏప్రిల్లో ప్రారంభించారు. ఆలయానికి కావల్సిన కాంస్య, పాలరాతి, గ్రానైట్ విగ్రహాలన్నింటినీ భారతదేశం నుంచే రప్పించారు. విదేశంలో స్థిరపడినా సొంతూరు రాకపోకలు చేస్తూ, తమ పెద్దలు భూరివిరాళం ఇచ్చిన స్వగ్రామంలోని హైస్కూలుకు కంప్యూటర్లు సహా అవసరమైన సహకారాన్ని ఇప్పటికీ అందిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. -
నృసింహుని సేవలో డెప్యూటీ సీఎం
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో వున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎగువ సన్నిధిలో వున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు. -
నిబంధనలకు విరుద్ధంగా పీజీ పరీక్షల షెడ్యూల్
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలుఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూలై 7వ తేదీ నుంచి పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్యూ శాఖ అధ్యక్షుడు పంతగాని రమేష్ ఆరోపించారు. ఏఎన్యూలో బుధవారం రమేష్ మాట్లాడుతూ సెమిస్టర్ మధ్య దూరం కనీసం 90 నుంచి 100 రోజులు ఉండాలని, అధికారులు 63 రోజుల వ్యవధిలోనే నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం దారుణంగా ఉందన్నారు. సిలబస్ పూర్తి కాకుండానే తరగతులు నిర్వహిండానే పరీక్షల షెడ్యూల్ ఇవ్వడం వలన విద్యార్థిలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడం, చేతిరాతతో ప్రశ్నపత్రం తయారు చేయడం, రెండు సంవత్సరాలుగా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీజీ పరీక్షల అధికారుల నిర్ణయాలు ప్రకారం నోటీపేకేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు. అనంతరం వర్సిటీ తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. నోటీఫికేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు కొమ్మ ప్రవీణ్, కె.జ్యోతి, సురేష్ పాల్గొన్నారు. -
మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు రామలింగాచారి మృతి
తెనాలి: పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్, శ్రీమహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి (69) బుధవారం సాయంత్రం మృతిచెందారు. కొద్దిరోజుల క్రితం శ్వాససంబంధిత అనారోగ్యానికి గురయిన ఆయన్ను, ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఆయనకు భార్య రత్నకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికదేహాన్ని బుర్రిపాలెంరోడ్డులోని ఆశ్రమానికి తరలిస్తామని సోదరుడు వజ్రాల నాగరాజు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. విద్యాధికుడైన రామలింగాచారి డాక్యుమెంట్ రైటర్గా జీవనం సాగిస్తున్నారు. విద్యార్థి దశలో స్కూలు వార్షికోత్సవంలో గాంధీ పాత్రలో నటించారు. తర్వాత కాలంలో మహత్మాగాంధీ ఆత్మకథ చదివి ప్రభావితుడయ్యారు. గాంధీ స్ఫూర్తితో 2004లో స్థానిక కొల్లావారి వీధిలో ఆశ్రమాన్ని స్థాపించారు. కుటుంబ సభ్యులు లేని ఒంటరి వృద్ధుల పోషణ, వైద్యాన్ని చూస్తున్నారు. దాతల సహకారంతో బుర్రిపాలెంరోడ్డులోని ఇంజినీరింగ్ కాలేజి సమీపంలో ఆశ్రమానికి సొంత భవనం నిర్మించారు. 2020లో ఆశ్రమాన్ని అక్కడకు తరలించారు. 30 మందికిపైగా ఆశ్రయం కల్పించారు. అదే ఆశ్రమంలో గాంధీజీ, కస్తూర్బాల విగ్రహాలను ఏర్పాటుచేసి రోజూ పూజలు చేస్తున్నారు. గాంధీజీ సమాజానికి చూపిన శాంతి, అహింస ప్రచారం చేస్తున్నారు. ‘గాంధీ హృదయధారి’తో సహా పలు గౌరవాలను అందుకున్నారు. రామలింగాచారి మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. -
విత్తన చట్టం.. మోసాలకు కళ్లెం
కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో ప్రైవేట్ ఎరువులు, విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు అంటగట్టే ముఠాలు లేక పోలేదు. రైతులను మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఒకటి ఉందని పూర్తిస్థాయిలో రైతులకు తెలియదు. దుకాణంలో ఒక రకమైన విత్తనం ఉంచుకుని రైతులకు మరో రకం విత్తనాలు అంటగట్టే మోసాలకు చెక్ పెట్టేలా విత్తన చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మోసగిస్తే కఠిన చర్యలు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతుకు ఎలాంటి అన్యాయం జరిగినా విత్తన చట్టం ద్వారా సంబంధిత విత్తన డీలర్లపై కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడే వారిపై విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 3 కింద అతిక్రమించినందుకు ఆయా దుకాణాల్లో విత్తనాలను జప్తు చేయడంతోపాటు అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్–ఏ ప్రకారం జరిమానా విధిస్తారు. వీటిలో కొన్ని చట్టాలను గమనిస్తే.. ధరల బోర్డు, స్టాకు బోర్డు ఏర్పాటు చేయాలి.. విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధరలు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. అలా లేకుంటే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అధికారులు వచ్చి ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు. అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే.. విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. రశీదు ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ఆయా దుకాణదారునికి ముందుగా నోటీసు జారీ చేసి దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే ఆయా డీలర్ లైసెన్స్ సస్పెండ్, రద్దు చేయవచ్చు. విత్తనాల బస్తాలపై లేబుల్ లేకపోతే.. ప్రైవేట్ విత్తనాల అమ్మకందారుడి వద్ద కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8ను అనుసరించి డీలర్ లైసెన్స్ సస్పెండ్, రద్దు చేస్తారు. జిల్లాలో ఇలా.. గుంటూరు జిల్లాలో సుమారు 500 ప్రైవేట్ డీలర్ల దుకాణాలు ఉన్నాయి. వాటిలో సుమారు 220 మంది విత్తనాల విక్రయాల డీలర్లు, 230 మంది ఎరువుల విక్రయాల డీలర్లు, మరో 250 మంది పురుగు మందుల విక్రయాల డీలర్లు ఉన్నారు. ప్రైవేట్ విత్తన విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా విత్తన లైసెన్స్లను ప్రదర్శించాలి. విత్తన లైసెన్స్ లేకుంటే ఆయా దుకాణాల్లో విత్తనాల విక్రయాలు చేయకూడదు. అంతేకాకుండా నోటీసులు ఇచ్చి దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు–5 ప్రకారం డీలర్ లైసెన్స్ రద్దు చేయడానికి, సస్పెండ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు పూర్తి అధికారముంది. అలాగే రద్దు కూడా చేయవచ్చు. -
రెడ్డి హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: గుంటూరు నగరం పాలెంలోని ఎస్వీఎన్ఆర్ రెడ్డి వసతి గృహంలో బుధవారం కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ నిర్వాహకులు దశాబ్దాలుగా పేద విద్యార్థులకు వసతి కల్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పించడం అభినందనీయమన్నారు. కొత్త భవనంతో వసతి గృహంలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ కమిటీ అధ్యక్షులు చల్లా అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు సూరసాని వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కార్యదర్శి కంది సంజీవరెడ్డి, కోశాధికారి పనుకూరి వెంకటేశ్వరెడ్డి, మేనేజర్ జంగా సత్యనారాయణరెడ్డి, వణుకూరి సూరారెడ్డి, వైద్యులు జైపాల్ రెడ్డి దంపతులు, వరికూటి అశోక్ రెడ్డి దంపతులు, మార్బుల్ శివారెడ్డి, జంగా రాంబాబు, వీసీఆర్ రెడ్డి, లేళ్ల పెద్ద అప్పిరెడ్డి, కుర్రా సాంబిరెడ్డి, చాగంటి రఘురామిరెడ్డి, వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి, భవనం వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
క్రాంతికుమార్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
తాడేపల్లి రూరల్: గత నెల 21వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే అని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకులు ముదిగొండ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సా ధింపులకు, పోలీసులను వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం తీరువల్లే క్రాంతికుమార్ కుటుంబం రోడ్డున పడిందన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు పలుమార్లు క్రాంతికుమార్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, అతని మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. టాక్సీ నడుపుకొంటూ కు టుంబాన్ని పోషించుకుంటున్న క్రాంతికుమార్ను ఇన్ఫార్మర్గా మారాలని సీఐ వేధించారని, లేకుంటే గంజాయి కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిపారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వెంటనే సీఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాకుండా క్రాంతికుమార్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అర్హులందరికీ ఓటు హక్కే ‘సర్’ లక్ష్యం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం పురోగతి, అమలు తీరుపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ ఏటూరు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మలతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బ్యాంకుల తీరుపై అసంతృప్తి గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పథకాలను అందించడంలో ప్రైవేట్ బ్యాంకులు విఫలం అయ్యాయని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని తెలిపారు. పీఎం సూర్యఘర్, ముద్ర, పీఎంఈజీపీ రుణాలను మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో యూబీఐ డీజీఎం హనుమంత్ రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం కిరణ్, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం శరత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సత్సంబంధాలతోనే వేగంగా కేసుల పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా న్యాయస్థానాలలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తుల స్వాగత కార్యక్రమం బుధవారం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లావు నాగేశ్వరరావు హాలులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు ఎస్.కె. సికిందర్ బాషా (ఫ్యామిలీ కోర్టు), వి. శ్రీనివాసరావు (నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి), జి.దీనబాబు (నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి), డి. విజయసారథి రాజు (అదనపు ఫ్యామిలీ కోర్టు), ఎ. సునీతా రాణి (అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు), సి. రమణారెడ్డి (నాలుగో అదనపు సబ్ కోర్టు), రాజశేఖర్ (పీడీఎం కోర్టు), వి. రఘునాథ్ (మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు), ఎల్.అంజయ్య (రైల్వే కోర్టు)లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... న్యాయమూర్తులు– న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు అవసరం అన్నారు. పరస్పర గౌరవంతో ఇవి కొనసాగినప్పుడే కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. న్యాయవాదుల వృత్తి నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టుల నిర్వహణను క్రమశిక్షణతో, పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదులు కూడా తమ వృత్తి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు వీర మణీంద్ర, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మూత్రపిండ రోగులకు అండేదీ?
గుంటూరు మెడికల్: కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్ సందీప్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాలని 2023 అక్టోబర్లో గుంటూరు జీజీహెచ్కు పంపించారు. జీజీహెచ్ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించి, సందీప్ తల్లి పద్మావతి కిడ్నీ దానం చేయడంతో 2023 డిసెంబరు 19న ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. సుమారు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఈ ఆపరేషన్ను ఉచితంగా చేశారు. అయితే, నాటి నుంచి నేటి వరకు దాదాపు రెండున్నరేళ్లుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయకుండా జీజీహెచ్ వైద్యులు మిన్నకుండిపోతుండటం పేద రోగుల పాలిట శాపంగా మారింది. నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఆపరేషన్లు నిలిపివేశారు. ఫలితంగా పేద రోగులు గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుందని, అంత మొత్తం భరించలేక జీజీహెచ్కు వస్తుంటే వైద్యులు ఆపరేషన్లు చేయకుండా వాయిదా వేస్తున్నారని పలువురు వాపోతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా అంతే.. ఎంతో ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు 2023 డిసెంబరు వరకు కొనసాగినా, ఆ తర్వాత ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. కిడ్నీ రోగులు ఆపరేషన్ల కోసం జీజీహెచ్కు వస్తున్నప్పటికీ, వైద్యులు స్పందించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఒక్క కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా చేయకుండా నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల వైద్యులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరికి డయాలసిస్ ద్వారా సమస్య నియంత్రణలోకి వస్తుంది. అయితే డయాలసిస్తోనూ ఆరోగ్యం మెరగుపడని వారిలో సుమారు 30 శాతం మందికి తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎంతో ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్లో నిర్వహించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడవచ్చు. 2016 నుంచి కిడ్నీ ఆపరేషన్లు... గుంటూరు జీజీహెచ్లో 2016 ఫిబ్రవరి నుంచి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. 2016 నుంచి 2023 డిసెంబరు వరకు మొత్తం 24 మందికి విజయవంతంగా నిర్వహించారు. తద్వారా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ నిధులు కూడా అధికంగా లభించడంతో కిడ్నీ, యూరాలజీ వార్డులు అభివృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి సమయంలో రెండేళ్లకుపైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తిరిగి ఆపరేషన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. దీంతో 2023 డిసెంబరులో తిరిగి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. ఆయన అనంతరం సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యశస్వి రమణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దృష్టి సారించకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని ప్రకటించారు. ఆయన వైద్యుల నిర్లక్ష్యంపై దృష్టి సారించి, నిలిచిపోయిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను తిరిగి ప్రారంభించి పేద, మధ్యతరగతి రోగులకు భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోవడంతో జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకునే వారు తప్పనిసరిగా గుంటూరు జీజీహెచ్లోని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ వైద్యుల అనుమతి తీసుకోవాలి. తొలుత గ్రామంలోని రెవెన్యూ, పోలీసు అధికారుల ధ్రువీకరణలు పొందిన తర్వాత జీజీహెచ్ కమిటీ అనుమతి కోసం రోగులు వస్తుంటారు. ఇలా ప్రతినెలా సుమారు 15 మందికి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసినప్పటికీ, కొంత మేరకు రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. మందులకు ప్రత్యేకంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. జీజీహెచ్లో ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడంతో పాటు ఏడాది పాటు ఆరోగ్యశ్రీ ద్వారా మందులు కూడా ఉచితంగా అందిస్తారు. అందువల్ల ఎక్కువ మంది రోగులు జీజీహెచ్లోనే ఆపరేషన్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. -
క్రీడా పాఠశాలకు ఎంపిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాల నిమిత్తం బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో 4 నుంచి 6వ తరగతి ప్రవేశాలకు శారీరక, వైద్య పరీక్షలతోపాటు వివిధ క్రీడాంశాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెనాలి అర్బన్: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నూరు శాతం జరిగే విధంగా చూడాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు మాట్లాడుతూ పోలియా రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు పాల్గొన్నారు. తెనాలిటౌన్: తెనాలి డివిజనల్ పంచాయతీ అధికారిణి(డీఎల్పీఓ) వి.స్వరూపారాణిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతిబసు బుధవారం సాయంత్రం తెనాలిలోని డీఎల్పీఓ కార్యాలయానికి వచ్చారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన అంశాలపై స్వరూపారాణిని విచారించారు. రూరల్ మండలం నందివెలుగుకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త బొప్పన సురేంద్ర చేసిన ఫిర్యాదులపై పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం విచారణ చేపట్టారు. వీరితో జిల్లా పరిషత్ కార్యాలయ పరిపాలన అధికారి జె.పూర్ణచంద్రారెడ్డి కూడా ఉన్నారు. పిడుగురాళ్ల రూరల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల, హాస్పిటల్ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్టర్ల బృందం బుధవారం సందర్శించింది. ఓపీ విభాగం, జనరల్ వార్డు, ల్యాబ్, గైనిక్ వార్డు, మెడికల్ కళాశాలలోని అనాటమీ, బయోకెమిరిస్టీ, ఫిజియాలజీ, తదితర వార్డులు పరిశీలించారు. మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్టర్ల బృందం మాట్లాడుతూ కళాశాల 80 శాతం పూర్తయిందని, జూలై 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్బాబు పాల్గొన్నారు. -
పెమ్మసాని ప్రోద్బలంతోనే అక్రమ కేసులు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రోద్బలంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తనపై అక్రమ కేసులు మోపిన పోలీసులు హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ లీగల్సెల్ టీమ్తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా వ్యవహరించిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ మధుపవన్తో పాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లును ఈ నెల 30వ తేదీలోగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత వైఖరితో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాకప్డెత్లు, కస్టోడియల్ టార్చర్లతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. సిట్ విచారణతో గాదె సాయికృష్ణ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కృష్ణలంక సీఐ నాగరాజును కాపాడేందుకే సాక్ష్యాధారాలను తుడిచి వేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని, పోలీసులే హంతకులుగా మారి హత్యలు చేస్తుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. నాగరాజు నోరు మెదిపితే పెద్దలకు ముప్పు తప్పదన్నారు. ఎవ్వరినైనా అక్రమంగా అరెస్టు చేసి, చంపేసే ధోరణి సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం, డీసీఎం, హోంమంత్రి విఫలమయ్యారని, వాస్తవాలు మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పవన్ కల్యాణ్కు కోపమెందుకని అంబటి ప్రశ్నించారు. సాయికృష్ణను హత్య చేశారంటే అతనికి నేరచరిత్ర ఉందని మాట్లాడని పవన్ కల్యాణ్... సాయికృష్ణను హత్య చేసిన సీఐ నాగరాజును సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ లాకప్డెత్పై ఈనెల 29న హైకోర్టులో ఏం చెప్పబోతున్నారని, ఈ కేసులో విచారణ లోపభూయిష్టంగా జరుగుతోందని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ స్టేషన్లో లేకుంటే కమిషనర్ దగ్గర సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్లో ఉంటుందని, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము సీబీఐ దర్యాప్తు చేయిస్తామని అంబటి చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో తనను తిట్టించేందుకు శిక్షన ఇస్తున్నారని, తాము అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు అవసరం లేదని, నోటీసు ఇచ్చి పంపేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ తనను అరెస్టు చేసి, హింసించారని చెప్పారు. తన ఇంటిపై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయం కోరుతూ ఇప్పటికే పలుదఫాలుగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించానని, జూలై 29న డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళతానని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, ప్రధాన కార్యదర్శి మొండితోక శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, యేటి కోటేశ్వరరావు, రమావతు లలిత, ఇందిర, పి.వెంకటేశ్వర్లు, వి.బ్రహ్మారెడ్డి, కాసు వెంకట రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భాను పాల్గొన్నారు. -
భారీ నష్టాల్లో 117 పీఏసీఎస్లు
కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు జిల్లాలో 117 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్లు) భారీ నష్టాల్లో కూరుకుపోయాయని, ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ) చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వెల్లడించారు. బుధవారం బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలన భవనంలో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సంఘాల సిబ్బందికి వేతనాల నిమిత్తం సహకార బ్యాంకు, ఆప్కాబ్ సంయుక్తంగా డీఎల్ఎస్ఏ ఫండ్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వనుందని వెల్లడించారు. రానున్న మూడేళ్లలో ఆయా సొసైటీల అధ్యక్షులు, సీఈఓలు సంఘాలను బలోపేతం చేసుకునే దిశగా కృషి చేయాలని, లేకుంటే సంఘాల మనుగడ కష్టమని స్పష్టం చేశారు. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ ఆడిట్ పూర్తి కావడంతో నివేదికను మహాజన సభ ఆమోదం తెలిపింది. సమావేశంలో జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, బ్యాంక్ సీఈఓ వీవీఎస్ ఫణికుమార్, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ జేవీ సుబ్బారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా పీఏసీఎస్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
చేబ్రోలు బాలుర ఆచూకీ ఢిల్లీలో లభ్యం
చేబ్రోలు: చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు బాలురను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీలో కనుగొన్నారు. మంగళవారం వారిని సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన షేక్ ఆషియా తన కుమారుడు షేక్ జమీర్ అహ్మద్ (13) కనిపించడం లేదని ఈ నెల 21న చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్ (12), గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల వెంకట గోపి (15)లు కూడా ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. మంగళవారం సాయంత్రం చేబ్రోలు పోలీసు స్టేషన్లో పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, చేబ్రోలు ఎస్ఐ పి. వీరనారాయణలు మాట్లాడుతూ తెనాలి డీఎస్పీ జనార్దనరావు పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. ఇంటి నుంచి బ్యాగ్లో దుస్తులు, రూ. 22 వేల నగదుతో ముగ్గురు బాలురు ఢిల్లీ వెళ్లినట్లు తేలింది. సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణ, సెల్ఫోన్ కాల్ డీటెయిల్స్ విశ్లేషణ, లొకేషన్ ట్రేసింగ్ ద్వారా బాలుర కదలికలను పోలీసులు పసిగట్టారు. వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
ఉద్యోగులపై కక్ష.. విధులంటేనే శిక్ష !
● బీఎల్ఓ పనులు, రెగ్యులర్ విధులకు తోడు అదనపు భారంతో సతమతం ● లక్ష్యాలు ఇచ్చి మరీ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు ● ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల ఓ సచివాలయ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్ తీవ్ర ఒత్తిడి అనారోగ్యంపాలు చంద్రబాబు సర్కారు అక్కసు – ఆర్.అనిల్కుమార్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా చైర్మన్, జీడబ్ల్యూఎస్ఈఏ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సచివాలయ ఉద్యోగులపై పనిభారం రోజురోజుకీ పెరిగిపోతోంది. రెగ్యులర్ డ్యూటీలతోపాటు బీఎల్ఓ విధులు, ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు టార్గెట్లతో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 162 సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ నాగూర్బాబు బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రి పాలయ్యారు. ఇదే విధంగా చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. -
జిల్లాలో సగటు వర్షపాతం 7 మి.మీ.
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 10 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా తుళ్లూరు మండలంలో 24.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా చేబ్రోలు మండలంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. సగటున ఏడు మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 22.4 మి.మీ., తాడికొండ 22, పెదకాకాని 20, మంగళగిరి 16.6, ప్రత్తిపాడు 8.4, దుగ్గిరాల 7.6, తాడేపల్లి 2.4, పొన్నూరు మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. జూన్ 23వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 74.4 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 87 మి.మీ వర్షపాతం నమోదైంది. -
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
గుంటూరు రూరల్: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని నల్లపాడు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భాస్కర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన పెరికల సాగర్ గుంటూరు నగరంలోని కేవీపీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పలుచోట్ల ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల నల్లపాడు పోలీస్స్టేషన్లో నమోదైన ద్విచక్రవాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో నిందితుడిని గుర్తించారు. హౌసింగ్ బోర్డు ఆర్చి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాగర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలను ఒప్పుకున్నాడన్నారు. అతని వద్ద నుంచి తొమ్మిది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు గుంటూరు నగరం, నల్లపాడు, కొత్తపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు. చోరీ చేసిన వాహనాలను లాలుపురం గ్రామ శివారులోని ఓ పాడుబడిన రేకుల షెడ్లో దాచిపెట్టినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా గుంటూరు, కొత్తపేట పోలీస్స్టేషన్లలో పలు వాహన చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించి చోరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన నల్లపాడు సీఐ పి.భాస్కర్, ఎస్ఐ ఎ. మధుపవనన్తోపాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
నేటి నుంచి మంగళగిరిలో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు
మంగళగిరి రూరల్: మంగళగిరి క్రికెట్ స్టేడియంలో బుధవారం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభం కానున్నాయి. స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తొలి రోజు మ్యాచ్ తిలకించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్చరణ్, మంత్రి నారా లోకేష్, తదితరులు రానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం కెపాసిటీ 26 వేలు ఉన్నప్పటికీ 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్ అమరావతి, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం, రాయలసీమ జట్లు పోటీలలో తలపడనున్నాయని ఆయన తెలిపారు. తాడికొండ: రాజధాని అమరావతిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు మంగళవారం పరిశీలించారు. అమరావతి పర్యటన సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఏపీసీఆర్డీఏ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమరావతి–రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ – డైరెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వి.విజయరామరాజు, అదనపు కమిషనర్లు ఎ.భార్గవతేజ, అభిషేక్ కుమార్, ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.సునీల్కుమార్రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.అనిల్కుమార్రెడ్డితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర సహాయ మంత్రి టోఖన్ సాహు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, రాజధాని నిర్మాణ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంట్లో సామగ్రి, నగదు దగ్ధం తాడేపల్లి రూరల్: ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు వ్యాపించడంతో ఇంట్లో నగదు, సామగ్రి దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి తాడేపల్లిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని జామాయిల్తోటలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ కుటుంబంతో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించాయి. వస్తున్న మంటలను అదుపుచేయలేక మంగళగిరి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సరికే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంతమేర వ్యాపిస్తున్న మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బందికి బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇంట్లో సుమారు లక్షల రూపాయల నగదు, 8 గ్రాముల బంగారం ఉందని, వీటితో పాటు పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్లు, ఆధార్ సంబంధిత కార్డులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలిపారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026హద్దు దాటిన కూటమి దందాసాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్లలో టీజీఎండీసీ ఇసుక రీచ్ను ఏర్పాటు చేసింది. దీన్ని ఓ కాంట్రాక్టర్కు అప్పగించడంతో ఆయనే నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గుంటూరుకు చెందిన తెలుగు తమ్ముడు అడుసుమిల్లి శ్రీధర్ మరికొందరితో రెండు కార్లలో తుమ్మిళ్ల ఇసుక రీచ్ దగ్గరకు చేరుకుని, అక్కడున్న వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. సినీనటుడు, హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్య అనుచరుడిగా ఉండే గుత్తికొండ ఠాగూర్ పేరు చెప్పి దాడి చేయడమే కాకుండా ఇసుక రీచ్ స్టాక్ బుక్కులతోపాటు, రూ.4 లక్షల నగదు తీసుకువెళ్లారు. ఆంధ్రాకు చెందిన వీరికి తెలంగాణ ఇసుకరీచ్లతో సంబంధం ఏంటనే అంశంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నార్సింగ్లో రూ.కోట్ల విలువైన భూమికి నకిలీ పత్రాలను సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించిన ముఠాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అందులో కూడా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెడికల్ వ్యాపారి, జనసేన పార్టీలో కీలకంగా ఉండే కమ్మెల శ్రీనివాసరావు కూడా అరెస్టు అయ్యారు. నాదెండ్ల మనోహర్ అనుచరుడిగా శ్రీనివాసరావు ఉన్నారు. హైదరాబాద్ బృందావన కాలనీలో రూ.450 కోట్ల విలువైన 30 వేల గజాల స్థలానికి ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించింది. మంచి పార్టీని చూసి అమ్మకానికి పెట్టింది. కొనుగోలు చేసేందుకు వచ్చినవారు, ఎందుకై నా మంచిదని తమకు ఇచ్చిన డాక్యుమెంటుతో అసలు ఓనరును కలిశారు. పరిశీలించిన స్థల యజమాని అది నకిలీపత్రమని తేల్చారు. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సూచనపై ముఠా సభ్యులకు కబురు పెట్టారు. ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కమ్మెల శ్రీనివాసరావుపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషనులో మరో కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలో భూమి ఇప్పిస్తానని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతును నమ్మించి శ్రీనివాసరావు పలుమార్లు రూ.70 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ భూమి ఇవ్వటం లేదని రైతు ప్రశ్నించటంతో కురగల్లులోని ఓ భూమికి జీపీఏ సృష్టించి, భూమి హక్కు పత్రం పేరిట ఆ రైతుకు అప్పగించాడు. రైతు ఆ భూమిని బేరం పెట్టారు. స్థల యజమానికి ఈ విషయం తెలిసింది. ‘నా భూమిని మీరు అమ్మటం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇది నా భూమి అంటూ అనంతపురం రైతు తన దగ్గరున్న జీపీఏ పత్రాన్ని చూపారు. దీనితో స్థల యజమాని, ఇతరులు మంత్రి లోకేశ్ కార్యాలయానికి సమాచారమిచ్చారు. ఆ ప్రకారం రిజిస్ట్రేషన్ ఐజీ విచారించారు. అనంతపురం రైతు దగ్గర ఉన్నది నకిలీ జీపీఏగా తేల్చారు. కమ్మెల శ్రీనివాసరావు డబ్బుపై ఆశతో తప్పుడు పత్రాలతో ‘ఎనీవేర్’లో భాగంగా మొవ్వ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపీఏ చేసినట్టు గుర్తించారు. ఆ జీపీఏను రద్దు చేశారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషనులో కేసు నమోదు చేశారు. ఇది విచారణలో ఉండగానే శ్రీనివాసరావును నార్సింగ్ పోలీసులు రిమాండ్కు పంపారు. తెలంగాణకు వెళ్లి మరీ దౌర్జన్యం చేసిన తెలుగుదేశం నేత బాలకృష్ణ ముఖ్య అనుచరుడి పేరు చెప్పి ఇసుక రీచ్ ఉద్యోగులపై దాడి తిరుమల దర్శనాలు అంటూ జనసైనికుడి మోసం 60 మందిని తిరుమల తీసుకువెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో తెనాలి జనసైనికుడు తాజాగా మరో జనసైనికుడు గుంటూరు భక్తులను నకిలీ సిఫారసు లేఖలతో రూ.4.22 లక్షల మేరకు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సుప్రభాత సేవ దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానని నమ్మబలికిన గుంటూరుకు చెందిన నిమ్మల శ్రీనివాస్ నగరానికి చెందిన 60 మంది భక్తుల నుంచి రూ.4.22 లక్షలు వసూలు చేశారు. వారికి దర్శనాలు కల్పించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఘటన తిరుమలలో సోమవారం చోటుచేసుకుంది. తనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కోటా ద్వారా సుప్రభాత సేవ దర్శన టికెట్లు మరియు తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో భక్తుల నుంచి వివిధ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా రూ.4.22 లక్షలు వసూలు చేశారు. కొంతసేపు ఫోన్ ద్వారా మాట్లాడి, తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. నిందితుడు అందజేసిన సిఫారసు లేఖలను టి.టి.డి. అధికారులకు చూపగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. టి.టి.డి. విజిలెనన్స్ అధికారుల సూచన మేరకు బాధితులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. అచ్చంపేట: ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎగువ నుంచి 400, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. కూటమి నేతల అరాచకం హద్దులు దాటుతోంది. జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలు, జనసైనికుల అరాచకం తెలంగాణ వరకూ పాకింది. తెలంగాణలో దాడుల నుంచి, భూ కబ్జాల వరకూ సాగింది. మరొకరు ఏకంగా తిరుమల దర్శనాల పేరుతో భక్తులను మోసం చేశారు. వీరందరూ గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కావడం గమనార్హం. -
కృష్ణలంక స్టేషన్లో సీసీ ఫుటేజీ మాయం
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ కేసులో చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో తొలి నుంచీ సాక్ష్యాధారాలను పక్కా ప్రణాళికతో మాయం చేస్తున్నారన్నారు. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ మాయం కావడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనన్నారు. సాయికృష్ణ కేసు వెలుగులోకి వచ్చాక పోలీసు అధికారులు ఓ కానిస్టేబుల్ను భయపెట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని తొలగింపజేశారన్నారు. కృష్ణలంక పీఎస్ నుంచి స్వర్ణపురి వరకు దాదాపు 30కి పైగా హైరిజల్యూషన్ సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిలో ఎక్కడా ఫుటేజీ లభ్యం కాకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పారు. సాయికృష్ణ కేసులో చట్టపరమైన కనీస నిబంధనల్ని కూడా పాటించలేదన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ఉండాల్సిన అరెస్ట్ మెమో, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు చేయించిన మెడికల్ చెకప్ రిపోర్టులు గానీ, సీసీటీవీ ఫుటేజీల బ్యాకప్ ఏవీ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక వ్యక్తిని చంపేసి, కాల్చి బూడిద చేసిన తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రమేయం లేకుండా, ఆయనకు సమాచారం తెలియకుండానే టాస్క్ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్లి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? కేవలం సీఐ నాగరాజును మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ రోజు కృష్ణలంక స్టేషన్లో ఉన్న మొత్తం సిబ్బందిని నిందితులుగా చేర్చాలి. విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో బాధ్యులను చేయాలి. వారందర్నీ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఇంతటి దారుణమైన ఘటన జరిగినా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డీజీపీ ఎందుకు ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒక రౌడీషీటర్ విషయంలో స్పందించాలా అనడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. చిత్తూరులో రాము అనే బీసీ వ్యక్తిపై దాడి జరిగినా, విజయనగరంలో కళావతి, కర్నూలు జిల్లాలో గంగమ్మ, శ్రీకాకుళంలో తిరుపతమ్మపై దాడి జరిగినా పవన్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఎన్నికల ముందు సుగాలీ ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అది తన శాఖ పరిధిలో లేదని చెప్పడం అనైతికం. ఆ కేసులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారని చెప్పడం అత్యంత హేయం. అంతకంటే పచ్చి అబద్ధం, దిగజారుడుతనం మరొకటి ఉండదు. సుగాలి ప్రీతి ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆ కేసులో సాక్ష్యాధారాలన్నీ మార్చేసింది కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పవన్కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. కళ్లెదుట ఇన్ని వాస్తవాలు ఉన్నా పవన్కళ్యాణ్ సీఎం చంద్రబాబు మాదిరిగానే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’ అని నరేంద్ర మండిపడ్డారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయులు జూలై 10లోగా దరఖాస్తు చేయాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్టీటీపీ://నేషనల్అవార్డ్స్టూటీచర్స్.ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. జూలై 13న తుది గడువు ముగియనుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్పై పోక్సో కేసు తెనాలిరూరల్: బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసిన ఆటో డ్రైవర్పై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కొలకలూకు చెందిన 14 ఏళ్ల బాలిక స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఉన్నం ఇమ్మానియేల్ వెంట పడుతూ ఉండేవాడు. కొద్ది రోజులకు మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భిణి అని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులను సోమవారం ఆశ్రయించగా, కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. పోలీస్ శాఖ ఔదార్యం మంగళగిరి రూరల్: క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న తోటి ఉద్యోగి కుమారుడి వైద్య చికిత్స కోసం పోలీస్ శాఖ భారీ ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకుంది. మంగళగిరి ఆరో బెటాలియన్కు చెందిన డి.సి.హెచ్.కాంతారావు కుమరుడు క్యాన్సర్తో బాధ పడుతుండంతో అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీఎస్పీ ఐజీపీ బి.రాజకుమారి పిలుపునివ్వగా చందాల రూపంలో రూ.12.96 లక్షల నిధులు సేకరించారు. కాంతారావుకి చెక్కుని అందించారు. రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక యడ్లపాడు: బోయపాలెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్– 23 బాలుర ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో ఆర్.శివాజి, పి.సాగర్, ఎన్.శ్రీకర్ప్రసాద్, జె. శ్రీకాంత్, బి.అభినవ్, ఎం.అఖిల్, ప్రదీప్, ఎస్. బాలకోటేశ్వరరావు, చంటి, టి.రవితేజ, జి.ఇస్సాక్, కె.ప్రభాకర్ ఎంపికయ్యారు. ఎంపికను రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.భూషణం, ప్రిన్సిపాల్ డి.ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ కె.శిరీష్బాబు పర్యవేక్షించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27, 28 తేదీల్లో చిత్తూరులో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
కేర్ డెంటల్ పీజీ కోర్సులు ప్రారంభం
లక్ష్మీపురం: కేర్ దంత వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సులను 2026 సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు కేర్ విద్య, వైద్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్ తెలిపారు. గుంటూరు పొత్తూరులోని కేర్ డెంటల్ కళాశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్ షేక్ హాజరయ్యారు. సయ్యద్ రసూల్ మాట్లాడుతూ జాతీయ దంత వైద్య కమిషన్ గుర్తింపు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుమతులతో దంత వైద్య విద్యలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని చేరిందన్నారు. కళాశాల డైరెక్టర్ మీర్ రహమత్ మొహీయుద్దీన్, ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ కేర్ డెంట్ కళాశాల ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అత్యాధునిక సాంకేతికత, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో కూడిన మా సంస్థ దేశంలోని ప్రముఖ దంత వైద్య, విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పీజీ డీన్గా డాక్టర్ మెహబూబ్ షేక్కు పదోన్నతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్ -
రమాదేవికి ఇంటర్నేషనల్ బంగారు తల్లి అవార్డు ప్రదానం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు, రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవికి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ ఈ నెల 21న తెలంగాణలోని సారస్వత్ పరిషత్ భవన్లో పలువురు ప్రముఖులు చేతులు మీదుగా ఇంటర్నేషనల్ బంగారు తల్లి అవార్డును ప్రదానం చేసింది. రమాదేవి సాహిత్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుతోపాటు మెమోంటో, సర్టిఫికెట్, కిరీటం ఇచ్చి సత్క రించారు. డాక్టర్ సరికొండ రమాదేవిని సత్తెనపల్లిలోని వివిధ కళా సంస్థల బాధ్యులు, సాహితీ ప్రియులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, బీ–ఫార్మసీ, ఫార్మా డీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఈడీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 6162 మంది హాజరు కాగా వారిలో 5631 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు రీవాల్యుయేషన్కు జులై 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను జులై 7వ తేదీలోగా పీజీ పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బీ–ఫార్మసీ నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 365 మంది హాజరు కాగా వారిలో 219 మంది, ఏప్రిల్లో జరిగిన బీ–ఫార్మసీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 283 మంది హాజరు కాగా వారిలో 174 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్లో జరిగిన ఫార్మా డీ 3వ సంవత్సరం పరీక్షలకు 299 మంది హాజరు కాగా వారిలో 276 మంది, మార్చి నెలలో జరిగిన ఫార్మా డీ నాల్గవ సంవత్సరం పరీక్షలకు 277 మంది హాజరు కాగా వారిలో 255 మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. నెహ్రూనగర్ : ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా హాజరై సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల కార్మికుల ఉపాధి, ప్రజారవాణా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు మురళి, పత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షుడు బాబు, గుంటూరు కోఆర్డినేటర్ సింగూ నరసింహారావు, పోకల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం సార్వత్రిక దూర విద్యా కేంద్రం ద్వారా రైతులు, మహిళలు, యువతకు దూరవిద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు చేసేందుకు ఆఖరు తేదీని పొడిగిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 3వ తేదీనుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం కోర్సులు 8 వారాల కోర్సులకు చివరి తేదీని ఈనెల 30 వరకూ పొడిగిస్తున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి కోర్సుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్లలో ఏదో ఒకటి కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను కానీ 7036689346, 8096085560, సెల్ నంబర్లను ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకూ సంప్రదించవచ్చన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026పంట భూముల్లో మళ్లీ క్వారీయింగ్ 7తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4200, మోడల్ ధర రూ.3600 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.3600 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 515.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త వి.పద్మావతి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అరకొరగా పంపిణీ చేస్తున్న విషయమై సోమవారం ‘ఇదేమీ బ్యాగులేదు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్త వి.పద్మావతి స్పందించారు. పాఠశాలలు తెరిచి 10 రోజులు గడిచినా ఒక్క విద్యార్థికి సైతం బ్యాగులను అందజేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను సమగ్ర వివరాలతో అందించిన కథనంపై స్పందించిన ఏపీసీ జిల్లాలో ఇప్పటివరకూ పంపిణీ జరిగిన తీరును వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,187 మంది విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటివరకు 63,220 బ్యాగులు వచ్చాయని, వాటిని 11 మండలాలకు పంపినట్లు తెలిపారు. మిగిలిన సామగ్రి సైతం మండలాలకు పంపుతామని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తెనాలి: తెనాలి రూరల్ మండల గ్రామం అనుమర్లపూడికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఖిల్ ఆదివారం కొలకలూరు – అనుమర్లపూడి గ్రామాల మధ్య గల క్వారీ చెరువులో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు క్వారీయింగ్ చేసిన ప్రాంతమది. నిబంధనలకు పాతరేసి తవ్వేసిన పంటపొలం ఇప్పుడు లోతెంతో తెలియని చెరువుగా మారింది. అదే ఇప్పుడు మృత్యుకుహరంగా మారి తొమ్మిదో తరగతి చదువుతున్న నిఖిల్ను బలితీసుకుంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు అక్కడకు సమీపంలోనే మళ్లీ ఓ రైతు పంటపొలంలో క్వారీయింగ్కు చంద్రబాబు సర్కార్ అనుమతించింది. కొలకలూరుకు చెందిన రైతు పొలంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెనిగళ్ల గోపీకృష్ణకు అయిదేళ్లకు అనుమతించింది. పొక్లెయిన్లతో నిత్యం రబ్బిష్ తవ్వేస్తూ, అమ్మకాలు సాగిస్తున్నారు. అనుమతించారు సరే...నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు ‘మామూలు’గానే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీనితో తవ్వకం లీజుదారుడి ఇష్టారాజ్యమైంది. గతంలో నలుగురు కూలీలు మృత్యువాత... క్వారీలో భారీ గోతులు తవ్వి మట్టి తీస్తుండటంతో సమీప పొలాల రైతులు కూడా తమ పంటపొలం గట్లు విరిగిపడతాయనే భయంతో ఆ పొలాలను కూడా క్వారీయింగ్కే అనివార్యంగా అమ్మాల్సి వస్తోంది. ఇదే ఆసరాగా క్వారీ నిర్వాహకులు లాభాల పంట పండించుకుంటున్నారు. ఎటా కొంత భూమిని కొనటం, మట్టిని తోడేయటం కొనసాగించారు. కాలం మారినట్టే కూలీఈల స్థానంలో యంత్రాలు ప్రవేశించాయి. 1997–98లో క్వారీ తవ్వకాల్లో మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఇక అప్పట్నుంచి మొత్తం యంత్రాలనే వినియోగిస్తున్నారు. తాటిచెట్టు ఎత్తుకు పైగా తీస్తున్న గోతుల కారణంగా అక్కడ వర్షపునీరు నిలిచి చెరువుల్లా మారుతున్నాయి. ఎక్కడెంత లోతుందో తెలియని పరిస్థితి. అలా 2014–19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు తవ్వకాలు చేసిన క్వారీలోనే అనమర్తపూడికి చెందిన బాలుడు నిఖిల్ మృత్యువాత పడ్డాడు. ఇప్పటికై నా అధికారులు నిబంధనల కొరడా తీస్తారా? లేదా? అనేది చూడాల్సివుంది. కొలకలూరు గ్రామంలో దక్షిణంపైవు అనమర్లపూడి వెళ్లే రోడ్డులో పంటభూములు గరప నేలలు. నీటిసౌకర్యం లేని పూర్వకాలంలో ఎకరా రూ.7 వేలకు మించేది కాదు. కాలక్రమంలో బోర్లు వేసుకోవటంతో సాగునీటి వసతి లభించింది. వరితో సహా వేరుశెనగ పంటలను సాగుచేయటం ఆరంభించారు. అదే సమయంలో అక్కడి భూముల్లోని ప్రత్యేకతపై కొందరి కన్ను పడింది. పై లేయరు ఇసుక, తర్వాత ఎర్రమట్టి, మూడో లేయరుగా రబ్బిష్, నాలుగో లేయరుగా చట్టు లభ్యమవుతుంది. వాటిని తవ్వేసి విక్రయించుకుంటే పంటలను మించి లాభాల పంట పండుతుందని భావించారు. ప్రారంభంలో ఒక రైతుకు చెందిన కొంత భూమిని కొనుగోలు చేసి మట్టితవ్వకం చేశారు. లాభాలు రావడంతో మరికొందరు రంగప్రవేశం చేశారు. -
రూ.3 వేల కోసం ఇక్కట్లు
పాతగుంటూరుకి చెందిన ఓ ఆటో యాజమాని వద్ద అద్దెకు ఆటో తీసుకునే వాడిని. అతనికి ఆటో అద్దె రూ.5 వేలు చెల్లించాలి. నా మొబైల్ఫోన్ను ఆటో యాజమాని వేరోక వ్యక్తి వద్ద తనఖా పెట్టించి రూ.2 వేలు తీసేసుకున్నాడు. రూ.3 వేలు బాకీ చెల్లిస్తానని యాజమానికి చెప్పగా, అప్పటికే నాపై స్థానిక పోలీస్స్టేషన్(పీఎస్)లో ఫిర్యాదు చేశాడు. ఈలోగా పోలీసులు పీఎస్కు తీసుకెళ్లారు. భార్య నిండు గర్భిణి అని చెప్పిన అలకించలేదు. రాత్రి వరకు లాకప్లోనే ఉంచారు. ఈలోగా స్టేషన్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, ఆటో యాజమాని వైపు మాట్లాడారు. అయితే 15 రోజుల్లో బాకీ చెల్లిస్తానని యాజమానితో ఒప్పందం చేసుకున్నా. ఈనెల 12న భార్య జీజీహెచ్లో మగ శిశువుని ప్రసవించగా, డబ్బులు చెల్లించలేకపోయా. ఇక రూ.3 వేల కోసం ఇటీవల కానిస్టేబుల్, యాజమాని సంగడిగుంటలోని అద్దె ఇంటి వద్దకు వచ్చి హడావుడి చేశారు. దీంతో ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యాజమాని చెప్పగ్గా, ప్రస్తుతం చుట్టుగుంటలో అద్దెకు ఉంటున్నా. అయినా పోలీసులు, యాజమాని నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. భార్య ప్రసవించగా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది. త్వరలో బాకీ చెల్లిస్తాను. న్యాయం చేయగలరు. – ఎం.నాగార్జున, భవానీ, చుట్టుగుంట -
ఎంటీఎస్ టీచర్లంటే అలుసా !
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక లోపించిన పనులతో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి గుంటూరుజిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులను కొనసాగించేందుకు గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో గత విద్యాసంవత్సరంలో ఎంటీఎస్ పద్ధతిపై పని చేసిన వారిలో 297 మంది ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించేందుకు కౌన్సెలింగ్కు రావాల్సిందిగా పిలిచారు. అయితే కనీసం ఒక్క రోజు ముందుగా సమాచారం ఇవ్వకుండా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు రావాలని, రెండు గంటల ముందు అంటే మధ్యాహ్నం 12 గంటలకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో గుంటూరు జిల్లాతో పాటు రేపల్లె, మాచర్ల, దుర్గి, దాచేపల్లి, వెల్దుర్తి వంటి మారుమూల ప్రాంతాల నుంచి అభ్యర్థులు గుంటూరుకు హడావుడిగా బయలుదేరి వచ్చారు. ఒక్కరోజు ముందుగా సీనియార్టీ జాబితా ప్రకటించకుండా, కౌన్సెలింగ్ ఉందని అప్పటికప్పుడు పిలవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు డీఈఓ షేక్ సలీమ్ బాషా ఆధ్వర్యంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల సమయానికి 150 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ పూర్తయింది. కౌన్సెలింగ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు డీఈఓ కార్యలయంలో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కనీసం ఒక్కరోజు ముందుగా కౌన్సెలింగ్ సమాచారాన్ని పంపి, ఉదయయే కౌన్సెలింగ్ ప్రారంభించి ఉంటే దూర ప్రాంతాల అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేవని అభ్యర్థులు వాపోయారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పరిశీలించారు. డీఈఓ కార్యాలయ ఏడీ శైలజాబాయి, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎంఈఓలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, సూపరింటెండెంట్లు డి.రాంబాబు, ఏ.జగదీష్, ఎం.నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
యోగాంధ్ర కాదు.. ఉద్యోగ ఆంధ్ర కావాలి
లక్ష్మీపురం: రాష్ట్రంలో యువకు యోగాంధ్ర కాదని ఉద్యోగ ఆంధ్ర కావాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఈమేరకు సోమవారం అర్జీ అందజేశారు. తొలుత కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై ప్రభుత్వం పట్టినట్టు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు పిల్లలను అంటే రూ.30 వేలు ఇస్తామని, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని చెప్పారని, మీరు చెప్పినట్లు చేస్తే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేల, మంత్రుల విద్యాలయాలలో ఉచితంగా చదువు చెప్పిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే భవిష్యత్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని హితవు పలికారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మరియదాసు, నాయకులు సుభాని, ఖాసిం వలి, కోటి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శశి, శివ, నాయకులు వెంకటేష్, కిరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ట్ వద్ద ఏఐవైఎఫ్ నిరసన -
అర్జీదారులకు అన్నదానం
నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) జరగ్గా, ఫిర్యాదిదారులకు గుంటూరు సాయినగర్కు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న నేతృత్వంలో సుమారు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు, వృద్ధులు, పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. సామాజిక సేవలో భాగస్వామ్యమైన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను జిల్లా ఎస్పీ అభినందించారు. చేబ్రోలు: మండల పరిధిలో రెండు రోజుల కిందట అదృశ్యమైన ముగ్గురు బాలుర ఆచూకీ సోమవారం లభించినట్లు తెలిసింది. స్థానికంగా సంచలనం కలిగించిన 7వ తరగతి చదువుతున్న గుండవరం, వేజండ్ల, సుద్దపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత మాయమయ్యారు. పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారివద్ద ఉన్న సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్, వరంగల్లు తదితర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. ఏడవ తరగతి చదువుతున్న గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల గోపి, సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్, వేజండ్ల గ్రామానికి చెందిన జమీద్ అహ్మద్లు అదృశ్యమయ్యారు. వీరిలో ఒక బాలుడు స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేయటంతో ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఽఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న బాలురను ఒక షాపు అతను పట్టుకొని స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు, బాలురు తల్లిదండ్రులు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం చేబ్రోలు పోలీసుస్టేషన్కు తీసుకువచ్చే అవకాశం ఉంది. బాలుర ఆచూకీ లభించటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. లైంగికదాడికి యత్నించిన యువకుడికి రిమాండ్ దాచేపల్లి: నాయనమ్మపై మనవడు లైంగికదాడికి యత్నించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జీ.పాపారావు సోమవారం తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారాయణపురంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల ఓ వృద్ధురాలు తన ఇంటి ముందు ఆరు బయట పడుకున్నది. ఈ క్రమంలో 25 సంవత్సరాల వయస్సున్న మనువడు వరుసైన జీ.వెంకట్ ఆమైపె లైంగికదాడికి ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయటంతో ఇంటిలో ఉన్న వాళ్లతోపాటుగా ఇంటి పక్కల వారు కూడా బయటకు వచ్చారు. దీంతో వెంకట్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకట్ని నడికుడి వద్ద అరెస్ట్ చేశారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఏదైనా అర్జీ నిర్దేశించిన గడువు దాటితే ఆయా శాఖల అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కలెక్టర్ స్వయంగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వచ్చిన 347 అర్జీలను కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, గంగరాజు, జిల్లా అధికారుల స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలి
నాబార్డు డీడీఎం శరత్బాబుకొరిటెపాడు(గుంటూరు): రైతులు పండించిన పంటలకు దళారుల ప్రమేయం లేకుండా సరైన మద్దతు ధర అందేలా ఎఫ్పీవోలు, బయ్యర్లు సంయుక్తంగా కృషి చేయాలని నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్(డీడీఎం) సీహెచ్ శరత్బాబు పిలుపునిచ్చారు. సెర్చ్ (సోషల్ ఎకనామిక్ ఆల్టర్నేటివ్స్ రీసెర్చ్ కమ్యూనిటీ అండ్ హ్యుమానిటీ) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక తాలూకా కాంపౌండ్లోని పెన్షనర్స్ సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అమ్మకం–కొనుగోలుదారులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. శరత్బాబు మాట్లాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా పండించిన మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చేయడమే సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 16 నుంచి 18 శాతం కాగా, 45 శాతం మంది జీవనాధారం వ్యవసాయమేనని తెలిపారు. వ్యవసాయ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందన్నారు. విదేశాల్లో వ్యవసాయ యాంత్రీకరణ 90 శాతం ఉంటే మన దేశంలో కేవలం 40 శాతం మంది రైతులే ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారని, వారిలో 64.5 శాతం మంది మహిళలేనని వివరించారు. మిర్చి పంటల్లో రసాయనిక మందులకు బదులు సేంద్రీయ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర పొంది ఆర్థికంగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వం, నాబార్డ్డు అందిస్తున్న పథకాలు, రాయితీలపై ఎఫ్పీవోలు రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. నేషనల్ కమోడిటీ డెలివరీ టు ఎక్స్ఛేంజ్ మేనేజర్ అడపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ మార్కెటింగ్ విధానాలను వీడి పెద్ద కంపెనీలతో నేరుగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. సత్య ఇంటెక్స్ వ్యవస్థాపకులు తోట రామకష్ణ మాట్లాడుతూ నాణ్యమైన మిర్చికి విదేశాల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుందని, రైతులు నాణ్యతపై దృష్టి సారించాలని కోరారు. సెర్చ్ సంస్థ అధ్యక్షులు మన్నవ హనుమంత్ ప్రసాద్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్డు పథకాలను ప్రచారం చేస్తూ ఎఫ్పీవోలు, స్వయం సహాయ సంఘాల ద్వారా రైతులు, కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. సదస్సులో ప్రోగ్రాం కోఆర్డినేటర్ శీలం మల్లికార్జున, శివకుమార్ పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో ప్రత్యేక టీకా కార్యక్రమం
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లాలో జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమం ఈనెల 28వ తేదీ ఆదివారం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో పల్స్ పోలియో ప్రత్యేక పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుండి ఐదేళ్ల వయస్సు గల 1,44,673 మంది చిన్నారులన్నారన్నారు. అందులో 1,42,336 మంది పిల్లలు, 2,337 మంది వలస చిన్నారులు ఉన్నారన్నారు. ప్రత్యేక దృష్టి అవసరమైన 384 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు ఏడు కోర్ గ్రూప్ అధికారులు, 913 టీకా కేంద్రాలు, 78 మొబైల్ బృందాలు, 156 రూట్లలో 156 రూట్ సూపర్వైజర్లు ఏర్పాటు చేయగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి 4,012 మంది వ్యాక్సినేటర్లు సేవలు అందించనున్నారని తెలిపారు. ప్రయాణికులు, వలస కుటుంబాల పిల్లలకు టీకాలు అందించేందుకు జిల్లాలో 24 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, ప్రతిపాడు, పొన్నూరు, కొల్లిపర, తెనాలి ఆసుపత్రి, మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి, డీవీఎస్ గుంటూరు కేంద్రాల్లో మొత్తం 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ విజయలక్ష్మి మట్లాడుతూ కార్యక్రమం కోసం జిల్లాకు 2,57,980 ఓపీవీ డోసులు (12,899 వయల్స్) అవసరమవుతాయని అంచనా వేయగా, జూన్ 19 నాటికి 2,16,000 డోసులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్వో ఖాజావలి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది జిల్లాలో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడానికి, రెవెన్యూ, భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక కలక్టరేట్లోని వీసీ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ –2026 కార్యక్రమం కింద ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్నారు. బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఈనెల 23 నాటికి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కే.శ్రీనివాసరావు, శ్రీరమణి, డిప్యుటీ కలెక్టర్ గంగరాజు, సీపీఓ పి.శేషశ్రీ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి జిల్లా అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
వివాహ వయసుపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: వివాహ వయస్సుపై ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మాతృమరణాలపై కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే నెలలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నుదురుపాడు, జాగర్లమూడిలో జరిగిన రెండు మాతృ మరణాలపై సమీక్షించారు. నివారించదగిన కేసులని కమిటీ సభ్యులు తీర్మానించారు. డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది, వివాహ వయస్సు విషయంలో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగ పిల్లలకు 21 సంవత్సరాలపై ప్రజలలో సామాజిక కోణంలో అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత త్వరగా గర్భిణులను గుర్తించి, నమోదు చేయడం, ప్రమాదకరమైన గర్భిణులను ముందుగా గుర్తించి, అవసరాన్ని బట్టి పైస్థాయి ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు. వారు కాన్పు అయ్యేంతవరకు, సకాలంలో, వైద్య సేవలు, సలహాలు, అందిస్తూ, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణ చర్యలు, ధనుర్వాత నిరోధక టీకాలు, ప్రతి నెల జరిగే ప్రధానమంత్రి మాతృత్వ, సురక్షిత యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసీజీ, స్కానింగ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో మాతృమరణాల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అమర్తలూరి శావణ్ బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఇన్చార్జి హెచ్ఓడీ గైనకాలజీ డాక్టర్ అనూరాధ, న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఆదిత్య ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డీపీహెచ్ఎన్ఓ ఇన్చార్జి డాక్టర్ ప్రియాంక, డెమో బి.శివసాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి -
ప్రతి ఫిర్యాదును నిశితంగా విచారించాలి
నగరంపాలెం: ‘ఆటో అద్దె డబ్బులు రూ.3 వేలు చెల్లించాలని యాజమాని, పోలీసులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని రోజులు నిండని శిశువుతో వచ్చిన భార్యాభర్త వాపోయారు. ఇద్దరి మధ్యలో ఉన్నందున, చెల్లించిన రూ.25 లక్షలు తిరిగి ఇవ్వాలని ఓ మహిళ ఇబ్బందులకు గురిచేస్తోందని మరో బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్ఎస్(గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కరించడంలో పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా విచారించి, న్యాయమైన పరిష్కారం చేయాలని సూచించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్న్లైన్ ద్వారా సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు తెలియకుండా ఎలాంటి ఫిర్యాదు మూసివేయద్దని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఏ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్)లు కూడా అర్జీలు స్వీకరించారు. -
పీఎండీఎస్ కిట్లతో రైతులకు ఎంతో ఉపయోగం
గుంటూరు రూరల్: ప్రకృతి వ్యవసాయంలో 30 రకాల విత్తనాలు కలిపి పచ్చి రొట్ట పైరుగా వేసుకుంటే అధిక దిగుబడు సాధించవచ్చని ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ రాజకుమారి తెలిపారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని రైతు నేస్తం ఫౌండేషన్లో నాబార్డు సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై రైతు శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పీఎండీఎస్ కిట్లలో 30 రకాల విత్తనాలు ఉంటాయని చెప్పారు. పప్పు జాతి గింజలు, నూనె గింజలు, ధాన్యపు గింజలు, సుగంధ ద్రవ్యాలు, పచ్చి రొట్ట విత్తనాలు(జనుము, జీలుగ, అవిశ, గ్లైరిసీడియా) ఉంటాయన్నారు. వీటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని పొలంలో విత్తుకోవాలని సూచించారు. వర్షం పడేదాకా ఆగకుండా ముందుగానే విత్తనాలకు బూడిద, మట్టి, ఘనజీవామృతంతో విత్తనాలకు కోటింగ్ ఇచ్చి పొడిలోనే వేసుకోవచ్చన్నారు. ఈ విధంగా విత్తనాలకు కోటింగ్ ఇవ్వడం వలన వర్షాలు ఆలస్యమైనా విత్తనాల పాడు కావని, వర్షం పడిన తర్వాత బాగా మొలకెత్తి ఎటువంటి చీడపీడలు ఆశించకుండా పంట బాగా వస్తుందని చెప్పారు. కార్యక్రమలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వర రావు, రైతు నాగ మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి -
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి సిద్ధం
మంగళగిరి రూరల్: ఆంద్ర ప్రిమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్లు జూలై నెల 31 నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని శివనాథ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొలుత మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శివనాథ్ మాట్లాడుతూ బీసీసీఐ నిబంధనల ప్రకారం 175 రోజులు అంతర్జాతీయ షెడ్యూల్కు సరిపోయేలా మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరచినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్లకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ అవసరం లేదని పూర్తిగా ఉచితం అన్నారు. రాబోయే రోజుల్లో అంర్జాతీయ స్థాయి మ్యాచ్లు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎంఎస్ కుమార్, ఏపీఏ ట్రెజరర్ దండమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాగునీటి సమస్య పరిష్కారానికి ఉద్యమం
లక్ష్మీపురం: సాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30వ తేదీన చలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ గుంటూరు హై లెవెల్ చానల్ లో పూడికను తీయాలని, దాంతో పాటు ముళ్ళుకంపను తొలగించి చానల్ కట్టలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జల్లవాగులో పూడిక తీయకపోవటం వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాల్లో పంటలు ముంపుగురై రైతాంగం నష్టపోతున్నారని ఈ వాగును ప్రక్షాళన చేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల కాలవల నిర్మాణం తక్షణమే చేపట్టాలని, పంట కాలవలలో ఉన్న పూడిక, గురపు డెక్క, తూడికాడ తొలగించి సాగునీటి వ్యవస్థను మేరుగు మర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడం చాలా దారుణమన్నారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలు రైతుల కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం నాయకులు కోటా మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పచ్చల సాంబశివరావు, ముప్పాల సాంబశివ, సూర్యనారాయణ, కూసం నాగిరెడ్డి, కొల్లి శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు
నెహ్రూనగర్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం అరండల్పేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 జనవరి 1 నుంచి 2026 జూన్ 19 వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బహిరంగ మద్యపానంపై మొత్తం 1,136 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో 599 కేసులు, 604 మంది నిందితులుగా గుర్తించామన్నారు. పల్నాడు జిల్లాలో 537 కేసులకు గాను 561 మంది నిందితులుగా ఉన్నారన్నారు. జూన్ 19 ఒక్కరోజే రెండు జిల్లాల్లో కలిపి 45 కేసులు నమోదు చేసి 46 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇకపై కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు, గుంటూరు–1 స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి.లత తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కేఎల్యూ విద్యార్థిని ప్రతిభ
ఏపీజీఈఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా మంగళగిరి టౌన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీజీఈఎస్ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వేలాదిమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందలేదని అన్నారు. దీంతో వారి కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీపై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ అంశాన్ని తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరారు. క్రమబద్దీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు గ్రాస్ శాలరీ వర్తింపజేస్తే వారి కుటుంబాలకు కొంత ఊరట లభిస్తుందని అన్నారు. ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి తెనాలి: పట్టణ రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధిలో ప్రత్యేక యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ సహిత మహాసుదర్శన యాగంలో శనివారం సాయంత్రం ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి పాల్గొన్నారు. పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. సినీనటుడు వేమూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన మహాసుదర్శనయాగం ఆరంభించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం సుప్రభాతంతో మొదలై సుదర్శన యాగం, నవగ్రహారాధన, శ్రీవేంకటేశ్వర హోమం, శ్రీలక్ష్మీనారాయణ హోమం, మంగళహారతితో రాత్రి ఏడు గంటలకు ముగిసింది. లోకకళ్యాణార్ధం విజయభాస్కర్ చేపడుతున్న మహాసుదర్శనయాగం మంచి ఫలితాలను ఇస్తుందన్నని తనికెళ్ల భరణి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
4న దళిత క్రైస్తవుల భారీ నిరసన
బాపట్లటౌన్: దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జూలై 4న బాపట్లలో దళిత క్రై స్తవుల భారీ నిరసన ప్రదర్శనకి జిల్లా నలుమూలల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని దళిత క్రైస్తవ ఐక్య వేదిక కన్వీనర్ దేవతోటి సుందరయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో శనివారం సాయంత్రం నిరసన కార్యక్రమం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సుందరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం తమకు నచ్చిన మతం స్వీకరించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించారని, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా నిరాకరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునర్విచారణ చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్నారు. కార్యక్రమంలో సమాజ సేవకులు మోపర్తి జాన్, అంబేడ్కర్ సేవా సమాజం గౌరవాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, మండే విజయకుమార్, గుదే రాజారావు, కురగంటి శ్యామ్ రాజు, పాస్టర్లు మేజర్ చల్లాపల్లి ఏలియ రాజు, మేజర్ దాసరి మైఖేల్ పాల్గొన్నారు. కారంచేడు: మండలంలోని పోతినవారిపాలెం గ్రామానికి చెందిన పోతిన వెంకట్రావుకు డాక్టరేట్ విత్ ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డు వరించింది. ఆయన 1990 నుంచి గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అనేక రకాల వంగడాలను సాగు చేసి ఉత్తమ రైతుగా అవార్డులు తీసుకున్నారు. అంతర పంటలతో పాటు, శనగ, పత్తి, పొగాకు, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. తాజాగా శనివారం ఢిల్లీలో సోక్రేట్స్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ ట్రస్ట్ వారు వెంక్రట్రావుకు డాక్టరేట్తో పాటు ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డును అందించారు. 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు, 2010లో ప్రకాశం జిల్లా ఉత్తమ రైతు, 2011లో పర్చూరు డివిజన్ ఉత్తమ రైతు, 2018లో గుంటూరు లాంఫాం కాలేజీ నుంచి ఉత్తమ రైతు అవార్డు, 2021లో జాతీయ ఆదర్శరైతు, 2024లో సేవానంది జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వెంకట్రావును రైతులు, గ్రామస్తులు అభినందించారు. -
అక్రమ కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగ నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి అన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తేజ్రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితులపై వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించామని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెడుతోందని, తాము అక్రమ కేసులు, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఎంత నిర్బంధించాలని చూసినా, ఎదురిస్తామని, టీడీపీ అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీకి ఒక రూల్, కూటమి నేతలకు ఒక రూల్ అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ తరపున ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులు మోపుతున్న పోలీసులు టీడీపీ నేతలు ఎంత పెద్ద తప్పు చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతున్నారని ఆరోపించారు. యువజన విభాగ నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యనిర్వహక అధ్యక్షుడు కారుమూరి సునీల్ యాదవ్ను అక్రమ కేసులో అరెస్టు చేయించారని ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీసీలను అణగదొక్కుతోందన్నారు. పార్టీ వెస్ట్ యువజన విభాగ అధ్యక్షుడు కానూరి శశిధర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో యువ నాయకుడిగా ఎదుగుతున్న కారుమూరి సునీల్ యాదవ్ను చంద్రబాబు అక్రమ అరెస్టు చేయించారని ఆరోపించారు. యువతను అణగదొక్కేందుకు, వైఎస్సార్ సీపీ కోసం పనిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయడం, తప్పుడు కేసులో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. సునీల్ కుమార్కు అండగా ఉంటామని, వైఎస్ జగన్ వచ్చాక అందరికీ శిక్షలు పడతాయని అన్నారు. నగర ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ వెలుగు చూసిందని, పర్మిట్ రూమ్స్కు అనుమతులు ఎవరిచ్చారని అన్నారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. సమావేశంలోతూర్పు విభాగ అధ్యక్షుడు షేక్ సుభానీ కొండా కోటిరెడ్డి(ప్రత్తిపాడు), వెంకటరెడ్డి (తాడికొండ) పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్ట్
పర్చూరు(చినగంజాం): మహిళపై లైంగికదాడి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. శనివారం పర్చూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 36 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివశిస్తోంది. ఆమె ప్రతి రోజూ చిలకలూరిపేట పట్టణం చుట్టు పక్కల ప్రాంతాల్లో కూలి పనులకోసం వెళ్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎప్పటి లాగానే కూలి పనుల కోసం చిలకలూరిపేట గాంధీ పార్కు వద్ద ఎదురు చూస్తోండగా.. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి మార్టూరులో ఒక అపార్ట్మెంట్లో శుభ్రం చేయడానికి పనిమనిషి కావాలని చెప్పి తన మోటారు సైకిల్పై ఎక్కించుకున్నాడు. ఒంగోలు వైపు వెళుతూ మార్గమధ్యంలో తాతపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద నుంచి సూరావారిపల్లె వెళ్లే రోడ్డులోకి తీసుకు వెళ్లాడు. ఆమెను గట్టిగా పట్టుకొని, కొట్టి కింద పడేసి ఆమైపె లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె సెల్ఫోన్ లాక్కొని అక్కడి నుంచి మోటార్ సైకిల్పై పరారయ్యాడు. ఆ మహిళ ఈవిషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి అదే రోజు రాత్రి యద్దనపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ చోరీ చేసి వస్తూ దొరికిన నిందితుడు ఈమేరకు సీఐ నాగభూషణం 20వ తేదీ శనివారం ఉదయం తన సిబ్బందితో పర్చూరు వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగతనం చేసిన మోటార్ సైకిల్ పై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తూ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అతనిని పట్టుకొని విచారించారు. సదరు యువకుడు బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన కుంభా వెంకట్(19)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పెద్ద పరిమి గ్రామంలో ఉంటున్నాడన్నారు. పోలీస్ల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించడంతో శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితురాలి సెల్ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు క్రిమినల్ కేసులున్నట్లు వారు గుర్తించారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్ఐ డి.వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ ఉమామహేశ్వర్.. మహిళపై లైంగికదాడి కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి, నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి, మార్టూరు సీఐ బి.నాగభూషణం, యద్దనపూడి ఎస్ఐ డి.వెంకటరత్నం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, పీసీలు కుమార్, నాగూరు, హోం గార్డు అనిల్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివరాలు వెల్లడించిన సీఐ నాగభూషణం -
ప్రైవేటు పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. గుంటూరు నగరం కేవీపీ కాలనీలోని సిద్దార్థ స్కూల్, శ్రీనివాసరావుపేటలోని సుజాత స్కూల్ను డీఈఓ శనివారం తనిఖీ చేశారు. పాఠశాల గుర్తింపు ధ్రువపత్రం, రికార్డులను పరిశీలించారు. నిబంధనలు పాటించడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను వసూలు చేయాలని ఆయా పాఠశాలల యాజామాన్యాలకు సూచించారు. క్యాంపస్లలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయించరాదని స్పష్టం చేశారు. నగరంపాలెం: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాలలో 7,312 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద పోలీస్ అధికార, సిబ్బందిని నియమించామని అన్నారు. పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసేయాలని దుకాణదారులకు సూచించారు. మొబైల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదని అన్నారు. పరీక్ష నిబంధనలు ఉల్లంఘించినా, అనుమానాస్పదంగా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగితే డయల్–112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. -
జాతీయ క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య విద్యార్థి సత్తా
గుంటూరు మెడికల్: జాతీయస్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల డెర్మటాలజీ పీజీ వైద్య విద్యార్థి సత్తా చాటారు. వారం క్రితం ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ క్విజ్ పోటీల్లో డెర్మటాలజీ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థి డాక్టర్ బండారు రాకేష్ ప్రతిభ చాటి మూడో బహుమతి సాధించారు. మొదటి బహుమతిని గుజరాత్, రెండవ బహుమతిని ఒడిశాకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు గెలుపొందారు. దేశ వ్యాప్తంగా పీజీ వైద్యులకు స్కిన్ బ్యారియర్స్ అనే అంశంపై ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన డాక్టర్ రాకేష్ను శనివారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరచారి , గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్లు అభినందించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ డీఎస్ఎస్ శ్రీనివాసప్రసాద్, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సంఘం జిల్లా 17వ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
లక్ష్మీపురం: అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. జొన్నా శివశంకర్, వి.భారతి, ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత రైతు సంఘం పతాకాన్ని సీనియర్ నాయకులు ఆళ్ల సాంబరెడ్డి ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ అమెరికాకు మనం చేసే ఎగుమతులపై 18 శాతంపైగా పన్నులు విధిస్తూ, అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం పన్నులు పూర్తిగా ఎత్తివేయటం వలన మన రైతుల ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోతాయని, రైతులు దివాళా తీస్తారన్నారు. కంపెనీలకు అనుకూలంగా చట్టాలు సవరించారని తెలిపారు. రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం దివాళా తీయిస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ తాళ్లూరి వెంకటరత్నం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్, సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, రిటైర్డ్ డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రామకృష్ణ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిష్టీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, కొత్త వెంకటశివరావు, ఎం.వెంగళరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, చింత భాస్కరరావు, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థులకు గాయాలు యడ్లపాడు: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై యడ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు... కోండ్రుపాడులోని కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థులు వైద్యపరమైన సేవలు ప్రజలకు అందించటానికి శనివారం రెండు బస్సులో యడ్లపాడు వచ్చారు. విధులు ముగించుకున్న అనంతరం వారు తిరిగి వెళ్లే క్రమంలో గ్రామంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిపి ఉన్న బస్సుల్లోకి ఎక్కుతున్నారు. ఇంతలో గుంటూరు వైపు నుంచి వచ్చిన నాలుగు చక్రాల ఆటో బస్సు పక్కనే ఉన్న ఐస్క్రీం బండిని, బస్సు ఎక్కుతున్న విద్యార్థులు ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యార్థులు హరీష్, ఎం బాలాజీ, సాల్మాన్, సిద్ధ్దార్థ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
భూ సమస్యలకు రీసర్వేతో శాశ్వత పరిష్కారం
రోణంకి కూర్మనాథ్ కొరిటెపాడు(గుంటూరు): వినియోదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ అదాలత్ ఎంతగానో ఉపయోపడుతోందని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవనం ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం విద్యుత్ వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్ బిల్లుల్లో తప్పులు, స్తంభాల మార్పు, మీటర్ రీడింగ్లో లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, లో–ఓల్టేజీ, సోలిర్ పేమెంట్ క్రెడిట్ కాకపోవడం తదితర సమస్యలపై 12 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వివరాలతో స్పాట్లోనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదాలత్కు వచ్చిన 12 ఫిర్యాదుల్లో 10 పరిష్కరించినట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులు, విద్యుత్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, ఎస్ఈ చల్లా రమేష్, అకౌంటెంట్ రామిరెడ్డి, డీఈఈలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: అమృత భారత్ స్టేషన్ స్కీము(ఏబీఎస్ఎస్) కింద కోట్ల వ్యయంతో చేస్తున్న రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ణసేన్ శనివారం పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా ఏర్పాటుచేసిన రెండో ప్లాట్ఫామ్ పైకప్పు, ప్లోర్ పనులు, మొదటి ప్లాట్ఫామ్ పొడిగింపు, హైలెవల్ బ్రిడ్జి, స్టేషన్ ముందు పనులను పరిశీలించారు. ఈనెలాఖరుకు ప్లాట్ఫామ్ పనులను పూర్తిచేస్తామని ఇంజినీర్లు చెప్పారు. లింగంగుంట్ల వైపు స్టేషన్సమీపంలో నివాసం ఉంటున్న గృహాలను పరిశీలించారు. నూతన రైల్వేట్రాక్, స్టేషన్ కొలతలను కొలిపించి పరిశీలించారు. అసిస్టెంట్ డీఆర్ఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాదాసీదాగా సాగిన సీఎం పర్యటన
● టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా కరువు ● దూరం పాటించిన జనసైనికులు ● నియోజకవర్గానికి లభించని హామీలు చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాదాసీదాగా సాగింది. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోయింది. కూటమిలో భాగస్వాములులైన కొద్దిమంది బీజేపీ నాయకులు నామమాత్రంగా హెలిప్యాడ్ వద్దకు సీఎంను కలిసి వెళ్లారు. మరోవైపు జనసైనికులు పూర్తి దూరంగా ఉండిపోయారు. మొత్తంగా శనివారం అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంఽధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటనకు స్పందన అంతంతే కనిపించింది. మధ్యాహ్నం 12.20 ప్రాంతంలో ముఖ్యమంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టౌలు, పాత్రలను అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడి కేంద్రానికి అందించారు. రాగి జావ కాచే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. ప్రకృతి వ్యవసాయక్షేత్ర పరిశీలన... అనంతరం రైతు గుడిపల్లి నాగభూషణం సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి తగ్గి భూసారం పెరిగి దిగుబడులు అధికంగా వచ్చాయని సీఎంకు రైతు వివరించారు. ఎద్దు గానుగ ద్వారా నూనె తీయడం పరిశీలించి, నూనె కొనుగోలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి సాయంత్రం 4.15 గంటలకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్ యోజన ప్రసంగాన్ని ఎల్ఈడీపై వీక్షించే కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమయ్యాక ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పావుగంట గడిచాక ప్రధాని ప్రసంగం హిందీలో కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్ల నుంచి అసహనం వ్యక్తం అయింది. ప్రసంగం నిలిపివేయాలని అరుపులు, కేకల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారికి నచ్చచెప్పాల్సి వచ్చింది. ప్రధాని ప్రసంగం 5.30 వరకు కొనసాగిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగం మొత్తం పరనింద, ఆత్మస్తుతికే పరిమితమైంది. పేరుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అయినప్పటికీ ఎక్కువగా టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విశేషం. వివిధ రకాల టెక్నాలజీలను తన పరిపాలన కాలంలో తెచ్చానని, ఇంకా తెస్తున్నానని వల్లెవేశారు. కూటమిలో భాగస్వాములైన బీజేపీ నాయకులు కొద్ది మంది మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వచ్చి ముఖ్యమంత్రిని కలసి వెళ్లారు. మరో భాగస్వామి అయిన జనసేన నాయకులు మాత్రం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరూ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పురపాలక సంఘం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వంటి వాటిలో జనసేనకు చెందిన వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించకపోవడం, నామినేటెడ్ పదవులు కట్టబెట్టకపోవడమే వారి అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు కేవలం ఇండోర్లో ఏర్పాటు చేసిన సీట్లకు మాత్రమే ప్రజలు పరిమితమయ్యారు. అంతకు మించి ఎక్కడా క్యాడర్లో ఉత్సాహం కనిపించిన దాఖలాలు కానరాలేదు. తీరా నియోజవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నోట ఎటువంటి హామీలు లభించకపోవడం మరింత నిరాశ కలిగించింది. -
బ్లాస్టింగ్కు నిరసనగా పేరేచర్లలో ధర్నా
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్లలో శనివారం సాయంత్రం పేరచర్ల గ్రామవాసులు బ్లాస్టింగ్ పూర్తిగా నిలుపుదల చేయాలని కోరుతూ గుంటూరు– హైదరాబాదు ప్రధాన రహదారిపై మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించకుండా బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో నిర్వహించడం వలన తమ ఇల్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇల్లు నిర్మించుకున్న తమకు బ్లాస్టింగ్ వలన ఇళ్లకు పగుళ్లు ఏర్పడి రాళ్లు మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. రేకుల ఇల్లు నిర్మించుకున్న వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, క్వారీలో బ్లాస్టింగ్ దాటికి రాళ్లు ఎగిరిపడి రేకులపై పడి ఇల్లు పూర్తిగా దెబ్బతినటమే కాకుండా టీవీలు, ఇంటి సామగ్రి సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరేచర్ల ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేడికొండూరు పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు. -
పోక్సో కేసులో నిందితుడికి జైలు
తెనాలిరూరల్: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక 2023 నవంబర్ 7వ తేదీ రాత్రి స్నానం చేస్తుండగా వారి గ్రామానికే చెందిన బడుగు మెతుషెల్ దడిలో నుంచి చూస్తున్నాడు. గమనించిన బాలిక తల్లి కేకలు వేసి తన భర్తతో కలసి పట్టుకునేందుకు ప్రయత్నించగా మెతుషెల్ పరారయ్యాడు. ఇదే విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పి చందోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ ఎస్.రాజశేఖర్ కేసు నమోదు చేశారు. కేసు తెనాలి పోక్సో కోర్టులో శుక్రవారం విచారణకు రాగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. -
సదరం సర్టిఫికెట్పై తప్పుడు ఆరోపణలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఆటిజంతో బాధపడుతున్న చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి వెల్లడించారు. శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటిజం సమస్యకు 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే శాశ్వత సర్టిఫికెట్ ఇవ్వడం కుదురుతుందని వివరించారు. గుంటూరుకు చెందిన గోపి తన ఐదేళ్ల కుమారుడికి ఆటిజం సర్టిఫికెట్ ఇచ్చేందుకు వైద్యులపై ఒత్తిడి చేశాడని, రూ.50 వేలు లంచం అడిగినట్లు తప్పుడు ఆరోపణలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లవాడికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, పీజీ వైద్యులకు సెల్ఫోన్లో మెసేజ్లు పంపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వనందువల్లే గోపి జీజీహెచ్ వైద్యులపై బురద జల్లేందుకు లంచం ఆరోపణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జీజీహెచ్ వైద్యుల మనోధైర్యం దెబ్బతినేలా, ఆస్పత్రి పరిస్థితిని భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేసిన గోపిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి మాట్లాడుతూ రాత్రిబవళ్లు కష్టపడి రోగులకు సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు వారి వద్ద వివరాలు సేకరించిన తరువాత వార్తలు ప్రచురించాలని కోరారు. వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతిసేలా వార్తలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. -
మత్తులో యువకుల వీరంగం
మంగళగిరి టౌన్: పట్టణంలోని టిడ్కో గృహసముదాయంలో శుక్రవారం రాత్రి మత్తులో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక ద్విచక్ర వాహనం ధ్వంసం చేయడంతో పాటు చిరువ్యాపారుల టిఫిన్ బండ్లను నాశనం చేశారు. టిడ్కో గృహసముదాయానికి చెందిన ఇద్దరు యువకులు మత్తుపదార్థాలు తీసుకుని ఈ ఘటనలకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో రక్షక్ వాహనం ఘటనా స్థలానికి చేరింది. పోలీస్సిబ్బంది ఆ ఇద్దరు యువకుల్ని అదుపు చేయలేకపోవడంతో ఎస్ఐకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ అక్కడకు చేరుకుని ఇద్దరు యువకులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గంజాయి, సొల్యూషన్ గానీ తాగి ఉండవచ్చని, ఇద్దరిలో ఒకరిని గతంలోనే ఇక్కడ ఉండవద్దంటూ పోలీసులు హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు యువకులు మైనర్లు అని, వీరు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు సమాచారం. -
జూలై 30, 31న కలెక్టరేట్ వద్ద ధర్నా
లక్ష్మీపురం: పారిశ్రామిక కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ జూలై 30, 31 తేదీలలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు తెలిపారు. సంఘం జిల్లా కార్యాలయంలో విస్త్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 73 రకాల షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెద్దలకు రాయితీలు ఇస్తూ, పనిచేసే కార్మికులకు మాత్రం వాతలు పెడుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చే రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగి అని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపివేయడం దుర్మార్గం అని అన్నారు. తక్షణమే అంగన్వాడీలకు ఇతర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ జీ రమణ, జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు, ఏబీఎన్ కుమారి, జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ వలి, వై.నేతాజీ, ఎన్.శివాజీ పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
హారన్ మోగింది.... రెండు గ్రామాల మధ్య ఘర్షణ
మేడికొండూరు: కారు హారన్ ఆపకుండా మోగించిన డ్రైవర్కు భీమినేనివారిపాలెం గ్రామ యువకుడు హారన్ కొట్టొద్దు అని చెప్పడం తప్పుగా అనిపించింది. ఫలితంగా కారు డ్రైవర్ తన సొంత గ్రామమైన పెదకూరపాడు నుంచి సుమారు 20 మంది పైగా యువకులను పిలిపించుకొని భీమినేనివారిపాలెం గ్రామంలో యువకునిపై దాడికి దిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నుంచి సిరిపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు భీమినేనివారిపాలెం క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిప్పి బస్సులో నుంచి దిగే ప్యాసింజర్లను ఎక్కించుకునే క్రమంలో బస్సు ఆపారు. పెదకూరపాడు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుకు హారన్ ఆపకుండా మోగిస్తున్నారు. దీంతో భీమినేనివారిపాలెం యువకుడు బస్సు నుంచి ప్యాసింజర్లు దిగుతున్నారని ఒక్క నిమిషంలో బస్సు వెళ/్లపోతుందని కనుక మీరు హారం మోగించవద్దంటూ కోరాడు. హారన్ కొట్టడం వల్ల నీకు ఇబ్బంది ఏంటని కారు డ్రైవర్ యువకుని ప్రశ్నిస్తుండగా కోపంతో ఊగిపోతున్న కారులోని మహిళ భీమినేనివారిపాలెం గ్రామ యువకుడిపై చేయి చేసుకుంది. గొడవ పెద్దదవుతుండటంతో గ్రామస్తులు సర్ది చెప్పి ఇరువురిని పంపించారు. అయితే పెదకూరపాడు గ్రామం నుంచి సుమారు 25 మంది పైగా బైకులపై కరల్రతో భీమినేనివారిపాలెం గ్రామం వచ్చారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆ యువకుడిని క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న షాపులో ఉంచి తలుపులు వేశారు. పెదకూరపాడు గ్రామస్తులు షాపు ధ్వంసం చేసి తలుపులు నెట్టుకొని లోపల ఉన్న యువకుడిని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని తమను ఎవరు ఏమి చేయలేరని దుర్భాషలాడుతూ గ్రామంలో వీరంగం వేశారు. విషయం తెలుసుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదర కొట్టారు. భీమినేనివారిపాలెం గ్రామ యువకుడి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
కర్లపాలెం: హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. కర్లపాలెం మండల పరిధిలోని పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన పులుగు రామకృష్ణారెడ్డిపై ఇద్దరు మహిళల హత్య కేసులు ఉన్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాలసిన రామకృష్ణారెడ్డి 36 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంతో గాలించి శుక్రవారం కర్లపాలెం రూరల్ ఏరియాలో అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి నుంచి డాక్టర్ దుర్గాప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. మే 31న డాక్టర్ యశస్వి రమణ పదవీ విరమణ చేయడంతో ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్.వి.సుందరాచారిని డీఎంఏ నియమించారు. రెండు వారాలు గడవకముందే డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్కు ఎఫ్ఏసీ సూపరింటెండెంట్గా డీఎంఈ ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల కొరత అధిగమిస్తామని పేర్కొన్నారు. ఓపీ సేవలకు ప్రత్యేక యాప్ తెస్తామన్నారు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. దుర్గాప్రసాద్ను అడ్మినిస్ట్రేటర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైర్టెర్ పూసల శ్రీనివాసరావు, పరిపాలనా అధికారి గోపవరపు స్టాన్లీరాజ్కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వి.రావు అభినందించారు. జిల్లా కలెక్టర్తో భేటీ గుంటూరు వెస్ట్: డాక్టర్ జి.దుర్గాప్రసాద్ శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. -
కాపు నేతపై తమ్ముళ్ల కక్ష
సుగాలి ప్రీతి తల్లి ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున స్పందించిన నాయకుడు ఆయన. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కోసం నిలబడింది కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవినీతిని, జనసేన పార్టీకి చెందిన కాపులపై జిల్లాలో జరుగుతున్న దాడులపై ప్రశ్నించడమే ఆయనకు శాపంగా మారింది. జనసేన జిల్లా అధ్యక్షునిగా ఉన్న గాదె వెంకటేశ్వరరావుకు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజి చిరంజీవిలలో ఒకరిని జిల్లా అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గాదె వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే ఆయన జనసేన పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండాను భుజాన మోస్తూ వచ్చారు. పార్టీ కోసం ఇప్పటి వరకూ జిల్లాలో నిలబడిన చరిత్ర ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మిర్చి యార్డు చైర్మన్ పదవి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కుర్రా అప్పారావుకు ఇచ్చారు. నామినెటేడ్ పదవుల్లో కూడా చోటు దక్కలేదు. అయినా అసంతృప్తి చెందకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవల జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనిపై గట్టిగా నిలదీశారు. గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా, ఒక్కటీ ఆమోదించకపోవడంపై కూడా ఎమ్మెల్యేని నిలదీశారు. అంబటి రాంబాబుపై అక్రమలు కేసులు మోపి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన తరఫున తాను 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసుకొచ్చారు. తమను ఇబ్బంది పెట్టారన్న భావన కూడా గాదె వెంకటేశ్వరరావులో ఉంది. కాపు నేతలే లక్ష్యంగా... ఓబులనాయుడుపాలెంలో చిన్నారి క్వారీ గుంతలో పడి మృతి చెందడంపై గాదె వెంకటేశ్వరరావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా గాదె వెంకటేశ్వరరావు ప్రతి విషయాన్ని నిలదీస్తుండటాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. దీంతో ఆయన జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గాదెను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
సమస్యలపై కలెక్టర్కు ఉద్యోగుల ఏకరువు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ఎదుట ఏకరువు పెట్టారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, ఎన్జీవోలకు చెందిన 14 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. హెల్త్కార్డులపై వైద్యం అందని తీరును వివరించారు. నగదు రహిత వైద్యం అందించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడాలని కోరారు. కారుణ్య నియామకాలపై తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అదనపు క్వాంటమ్ పెన్షన్ అమలు పర్చాలని పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని విభజించి, తూర్పు నియోజకవర్గంలో కొత్తగా ఎంఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. నలుగురు ఎంఈవోలు ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తించడం వలన ఘర్షణ వాతావరణం నెలకొంటోందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయలను విద్యాశాఖలో విలీనం చేయడంతో జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన పీఎఫ్ సొమ్మును చెల్లించారని, నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పీఎఫ్ డబ్బులు చెల్లించలేదని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్తో పాటు యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల సుబ్బారావు, కె.నరసింహారావు కలెక్టర్కు సమస్యలపై వినత్రి పత్రం అందజేశారు. -
నేడు లింగంగుంట్లకు సీఎం చంద్రబాబు రాక
చిలకలూరిపేట: అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ పథకం ప్రభుత్వం విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లింగంగుంట్ల గ్రామానికి శనివారం రానున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలసి శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారన్నారు. అనంతరం 12.50 నుంచి 1.20 వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. 2.15 నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని, సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల గ్రామం నుంచి బయలు దేరి వెళతారని వివరించారు. యడ్లపాడు: ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు ఆచరించటం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి చెప్పారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ సెంటర్ ప్రతినిధులు ఉషారాణి, శ్వేతబెనర్జీ, అభిషేక్ సింగ్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతు మానం శ్రీకాంత్, మహిళా రైతు గల్లా మల్లేశ్వరి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ మునగ పంటలో దొండ, గోంగూర, తోటకూర, క్యారెట్ వంటి అంతర పంటలు సాగు చేయటం ద్వారా ప్రధాన పంటల ఖర్చు తగ్గటమే కాక చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబం ఈ విధానాన్ని అనుసరిస్తే వలసలు అవసరం లేకుండా జీవనోపాధి భద్రత లభిస్తుందన్నారు. అనంతరం గ్రామ సంఘ సమాఖ్య సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాలని, అవసరమైన వనరులను గ్రామ సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సంఘసభ్యులు వినియోగించుకుని మిగిలిన ఉత్పత్తులు సమష్టిగా మార్కెటింగ్ చేసుకోవాలని అమలకుమారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది అప్పలరాజు, మేరి తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 516.20 అడుగులకు చేరింది. ఇది 142.4378 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి నీటి చేరిక నిలిచిపోయింది. రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్లో జరుగుతున్న నాన్–ఇంటర్లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం –ఖరగ్పూర్ (22604), 24న తిరునెల్వేలి –పురూలియా (22606), 25న టాటానగర్ –యర్నాకులం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
అవినీతి క్యాన్సర్ను నయం చేస్తారా?
క్యాన్సర్ కణం కంటికి కనిపించకుండా శరీరంలో దాగి ఉండి ట్యూమర్స్లాగా మారి కొన్నిసార్లు మనిషి మరణానికి దారితీస్తుంది. ఈ మహమ్మారిపై గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతో మంది రోగులకు చికిత్సలు అందించి నయం చేశారు ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్. ఆయన శుక్రవారం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన జీజీహెచ్లో పాతుకుపోయిన అవినీతి క్యాన్సర్పైనా ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుంటూరు మెడికల్: వ్యాధి నిర్ధారణకు అవసరమైన సర్టిఫికెట్లు మెడికల్ బోర్డు, కిడ్నీ బోర్డు, సదరం బోర్డుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఇస్తున్నారు. ఇలా ఇచ్చేందుకు అధిక మొత్తంలో లంచాలు అడిగినట్లు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. జిల్లా అధికారులకు సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో ఆస్పత్రి పరువు బజారున పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు జిల్లాలకు చెందిన లక్షల మంది పేద, మధ్య తరగతి రోగులకు ఉచిత వైద్యసేవలు జీజీహెచ్లో అందించాలి. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తుంటారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఇలా జీజీహెచ్కు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. కొంతమంది అవినీతి, అక్రమార్జన వల్ల ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. అత్యవసర సేవల విభాగంలో రోగి సహాయకులతో చికిత్సకు వినియోగించే సర్జికల్ ట్రే క్లీనింగ్ చేయించిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారి జిల్లా అధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. కిందిస్థాయిలో కొంత మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అత్యవసర సేవల నిమిత్తం చేరే వారికి కనీసం వీల్చైర్స్ ఉంచకుండా, రోడ్డు ప్రమాద బాధితులను, తీవ్ర అనారోగ్యంతో చికిత్సకు ఎమర్జన్సీ వార్డుకు వచ్చే రోగులను చికిత్సకు తీసుకెళ్లకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భిణికి వీల్చైర్ ఇవ్వకపోవడం, స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లపోవడంపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విధులకు సీనియర్లు డుమ్మా సీనియర్ వైద్యులు కొంత మంది సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్లో అందుబాటులో ఉండాలి. పలువురు మధ్యాహ్నం కల్లా సొంత క్లీనిక్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి సరిపుచ్చుతున్నారు. జూనియర్ వైద్యులే రోగులకు ఓపీ చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి బెడ్సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఓపీ రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లి పోతున్నారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. మామూలు ఇస్తేనే... జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒకరేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూలు ఇవ్వాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి వసూలు చేస్తారు. మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. పరిపాలనా కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా అదే దుస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి ఎంతోకొంత ఇస్తేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు. నర్సింగ్ కార్యాలయంలో మామూళ్ల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. క్యాన్సర్ చికిత్సతో పేరు... పొన్నూరు మండలం కొండబాలివారిపాలెంకు చెందిన డాక్టర్ దుర్గాప్రసాద్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అనంతరం హైదరాబాద్ వెళ్లి ఉస్మానియాలో పీజీ చేశారు. రేడియేషన్ ఆంకాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేసి మన్ననలు అందుకున్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు 2020లో వచ్చారు. క్యాన్సర్ చికిత్సల్లో విజయం సాధించిన ఆయన పరిపాలనాపరమైన పోస్ట్లోకి డెప్యూటీ సూపరింటెండెంట్గా ప్రవేశించి, నేడు నేరుగా సూపరింటెండెంట్ అయ్యారు. -
కాపు వర్గం దూరం?
● మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ తీరుతో నేతల రాజీనామా ● జనసేన నాయకులను దూరం పెడుతున్న టీడీపీ నేతలు ● సొంత సామాజిక వర్గం నుంచే మంత్రికి వ్యతిరేక పవనాలు ● పచ్చ పార్టీకి దూరమవుతున్న కాపు వర్గానికి చెందిన నేతలు రేపల్లె: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధ వాతావరణం నెలకొంది. బయటకు కూటమి, అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ లోపల మాత్రం విభేదాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ వ్యవహార శైలి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని స్వయంగా టీడీపీ వర్గాలే అంటున్నాయి. వీరిద్దరి వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన పలువురు నాయకులు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్క కుటుంబం చేతుల్లోనే పార్టీ అనే విమర్శలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్థానిక నాయకులను పట్టించుకోకుండా, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకోవడం, తమ అనుచరులకే ప్రాధాన్యం ఇవ్వడం, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని పక్కనబెట్టడంపై నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పే దిశగా కదులుతున్నారు. నాయకుల రాజీనామాలు ఇప్పటికే పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, 17వ వార్డు ఇన్చార్జి మల్లికార్జునరావు రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే విధంగా నగరం మండలం సిరిపూడమ్మ ఆలయ కమిటీ చైర్మన్ వీరంకి వీరరాఘవయ్య సహా పలువురు స్థానిక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది కేవలం ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. జనసేనతో దూరం పెరుగుతోందా? మరోవైపు మిత్రపక్షమైన జనసేన పార్టీతో సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయనే ప్రచారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన నాయకులను పట్టించుకోకపోవడం, కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టడం వంటి చర్యలు కూటమికి బీటలు వారేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే కూటమి బలహీనపడటం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత వర్గం నుంచే వ్యతిరేకత ఇదిలా ఉంటే మంత్రి సత్యప్రసాద్కు ఆయన సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, నిర్ణయాలలో ఏకపక్ష ధోరణి కారణంగా ఈ అసంతృప్తి పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక కాపు నేతలతోపాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు అదుపులోకి రాకపోతే పార్టీ మరింత బలహీనపడొచ్చని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రేపల్లె నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చైతన్యం, అవగాహన, పోరాట స్ఫూర్తి పరంగా ఈ ప్రాంతం ముందంజలో ఉంటుంది. ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపిన గొప్ప చరిత్ర రేపల్లె సొంతం. రాజకీయంగా ముదిరిన చర్చలు, సిద్ధాంతపరమైన పోటీలు, ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు ఈ నేల ప్రత్యేకతగా నిలిచాయి. అలాంటి ఘన చరిత్ర కలిగిన రేపల్లె మూడుసార్లు వరుసగా టీడీపీని గెలిపిస్తూ బలమైన కేడర్ను నిర్మించుకుంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలంగా పాతుకుపోయిందన్న భావన ఏర్పడింది. అదే సమయంలో పార్టీ ఇప్పుడు విభేదాలకు వేదికగా మారుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026పసుపు వైపు.. రైతు చూపు లంక గ్రామాల్లో ఆరంభం దాడి చేసిన నేత కారుకు మంత్రి ప్రారంభోత్సవం ● విత్తన పసుపునకు గిరాకీ ● కొనుగోళ్లతో తూములూరు కళకళ ● కొత్త రకాలపైనా రైతుల ఆసక్తి 7తెనాలి/కొల్లిపర: తొలకరి చినుకుల సవ్వడితో మెట్ట రైతులు పసుపు సాగుకు సమాయత్తం అవుతున్నారు. అడపాదడపా వర్షాలతో నేల పదునుతో లంక ప్రాంతాల్లో పసుపు విత్తటానికి శ్రీకారం చుడుతున్నారు. మిగిలిన చోట్ల నేలను సిద్ధం చేసుకోవటం, విత్తన సేకరణ సన్నాహాల్లో ఉన్నారు. ఎండు పసుపునకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కొంత విస్తీర్ణం పెరిగేలా ఉంది. దీంతోపాటు కొందరు రైతులు తమ చేలల్లో 5–10 సెంట్ల విస్తీర్ణంలో సొంత అవసరాలకు మిరప, టామాటా, వంగ నారుమళ్లు చేస్తున్నారు. ఏటా పసుపు సాగుకు ముందు కడప జిల్లా నుంచి రైతులు, మధ్యవర్తులు పచ్చి పసుపును తీసుకొచ్చి కొల్లిపర మండల గ్రామం తూములూరులో నిల్వచేయటం తెలిసిందే. తొలకరి వర్షం రాగానే జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లోని రైతులు ఇక్కడి నుంచి విత్తనం పసుపు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పసుపు విత్తనం పుట్టి (225 కిలోలు) ధర రూ.7,500 నుంచి రూ.8,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఎండు పసుపు ధర రెండేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.7 వేల వరకు ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లో పసుపు ధర క్వింటా రూ.10– రూ.14 వేల వరకు కొనుగోళ్లు జరిగాయి. గత ఆరు నెలల నుంచి ధర కాస్త అటూఇటుగా నిలకడగా ఉంది. రానున్న సీజనులో ధర బాగుంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో పచ్చి పసుపు ధర పుట్టి రూ.8 వేల వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి సాగుకు సమాయత్తం అవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 2026–27 సీజనులో పసుపు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచనా ఉంది. అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంట సాగు కోసం రైతులు నూతన రకాలపై ఆసక్తి చూపుతున్నారు. తెగుళ్లను, తేమను తట్టుకొనే పసుపు రకాలైన నిజామాబాద్, మైదుకూరు, సేలం, టేకూరుపేట వంటి రకాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటితోపాటు కుర్కుమిన్ శాతం అధికంగా ఉండే పసుపు విత్తన సేకరణకూ సన్నాహాలు చేస్తున్నారు. కొల్లిపర మండలం లంక గ్రామాల్లో ఇప్పటికే కొందరు రైతులు పసుపు విత్తటం పూర్తి చేశారు. టీఢీపీలో అసంతృప్తి సెగ గుంటూరు జిల్లాలో పసుపు సాగు సాధారణ విస్తీర్ణం 4,500 ఎకరాలు ఉంది. 2024లో 3,616 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. 2025లోనూ కొంచెం విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో అత్యధికంగా పసుపు సాగు తెనాలి వ్యవసాయ సబ్ డివిజనులోనే చేస్తుంటారు. ఇందులోనూ కొల్లిపర మండలంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. గతేడాది కొల్లిపర మండలంలో 1,950 ఎకరాలు, దుగ్గిరాలలో 234, తెనాలిలో 133 , మంగళగిరిలో 405, మేడికొండూరులో 222, తాడేపల్లిలో 365 ఎకరాలలో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ 20 ఎకరాలలోపు సాగు చేశారు. దీంతో మొత్తం సుమారు 3,343 ఎకరాల్లో పంట సాగయింది. 2024లో మార్కెట్లో ఎండు పసుపు సరైన ధర లేకపోవటంతో కొందరు రైతులు ఇతర పంటలకు మళ్లారు. ఫలితంగా 2025లో కొంత మేర సాగు విస్తీర్ణంం తగ్గింది. ఈ సారి మార్కెట్లో పసుపు రేటు బాగానే ఉంది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 516.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.05 టీఎంసీలు. ఎగువ నుంచి 4130 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.2300, మోడల్ ధర రూ.1800 వరకు పలికింది. -
పెదకాకానిలో చోరీ
పెదకాకాని: గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు మాయం చేసిన ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని శివాలయం రోడ్డులోని న్యూఇండియన్ పబ్లిక్ స్కూల్ వెనుక బజారులో బత్తుల సుబ్బయ్య కుటుంబం నివశిస్తుంది. వారు రోజూ మాదిరిగానే ఇంటికి తలుపులు వేసి వరండాలో నిద్రించారు. ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గుండా గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులులోనికి ప్రవేశించి, బీరువా తెరచి అందులో ఉన్న 7 గ్రాముల బంగారు వస్తువులు, పిల్లలు దాచుకున్న మట్టి ముంత(కిడ్డీ బ్యాంక్)లో ఉన్న నగదు, సుమారు 200 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ చోరీలో వరండాలో పడుకున్న వారు ఇంటిలోపలికి రాకుండా ఇంట్లో ఉన్న తలుపునకు లోపల గడియపెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచి తలుపు తీస్తుండగా ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే వెనుక ఉన్న కిటికీ తొలగించి ఉంది. బీరువా తెరచి వస్తువులు చిందర వందరగా పడి ఉంటడం, కిడ్డీ బ్యాంక్ పగులగొడ్డడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించారు. నిందితులు బంగారు వస్తువులతో కలసి ఉన్న రోల్డ్గోల్డ్ వస్తువులను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. కిటికీ నుంచి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు -
గజాల్లోనే భూములను గుర్తించాలి
సత్తెనపల్లి: గుంటూరు–బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ సత్తెనపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి సేకరించే భూమిని గజాల ప్రకారం గుర్తించాలని రైతులు కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగముగా సత్తెనపల్లి మండల పరిధిలోని రైతులతో అవార్డు ఎంక్వయిరీ సమావేశం కంపిటెంట్ అథారిటీ(భూసేకరణ) – రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. భూసేకరణలో భాగమైన అబ్బూరు, గుడిపూడి, భీమవరం, కంకణాలపల్లి, సత్తెనపల్లి, ధూళిపాళ్ల గ్రామాల పరిధిలోని నోటిఫైడ్ రైతులు హజరై తమ భూమికి సంబంధించిన హక్కు పత్రములను అందించారు. రైతులు మాట్లాడుతూ సబ్రిజిస్టార్ కార్యాలయంలో భూమి గజాలలో ఉన్నందున గజాలలోనే లెక్కించి పరిహరం అందించాలన్నారు. అలా కాకుండా సెంట్లలో లెక్కిస్తే పరిహరం తక్కువ వస్తుందన్నారు. అంతేగాక చిన్న రైతులు 5 సెంట్లు ఉంటే కేవంల 3 సెంట్లు మాత్రమే తీసుకోవడం వల్లన మిగిలిన రెండు సెంట్లలో ఏ పనులు చేసుకోవటానికి అనువుగా ఉండదని, ఆ భూమికి దారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. భూసేకరణ అధికారులు ఈ అవార్డ్ ఎంక్వయిరీకి హాజరైన రైతులం దరికీ పరిహారమునకు గురించిన పూర్తి సమాచారంను వివరించారు. సత్తెనపల్లి మండ ల పరిధిలోని గుంటూరు –బీబీనగర్ మధ్య రైల్వే డబ్లింగ్ లైను నిర్మాణానికి గానూ భూసేకరణలో భాగమైన వివిధ గ్రామాలలోని భూ విస్తీర్ణం వివరములు ఇలా ఉన్నాయి...అబ్బూరు ఎ.0.375 సెంట్లు, గుడిపూడి ఎ.0.610 సెంట్లు, భీమవరం ఎ 0.871 సెంట్లు, కంకణాలపల్లి ఎ.5.595 సెంట్లు, సత్తెనపల్లి ఎ.7.310 సెంట్లు, ధూళిపాళ్ల ఎ.11.960 సెంట్లుగా తేల్చారు. ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 193 మంది రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆర్డీఓ కార్యాలయ ఏవీపీ చంద్రారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ నేలటూరి రవికుమార్, ఆర్ఐ భోస్బాబు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు. భూ సేకరణ సమావేశంలో రైతుల డిమాండ్ -
తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలకు సిద్ధం
బాపట్లటౌన్: బీచ్ షాక్ పేరుతో తీరంలో మద్యం విక్రయిస్తే ఉద్యమాలు తప్పవని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగయ్య తెలిపారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గంగయ్య మాట్లాడుతూ బాపట్లకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.97 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, దీనిని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే గోవా తరహాలో సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయాలని బీచ్ షాక్ పేరుతో సూర్యలంకలో రెండు వైన్ షాపులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుండి అహ్లాదకరంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి కుటుంబ సభ్యులతో వేల సంఖ్యలో పర్యాటకులు సూర్యలంక బీచ్కు వస్తున్నారని, ఇక్కడ బార్ షాపులు ఓపెన్ చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐద్వా కార్యదర్శి సుభాషిణి, పార్టీ బాపట్ల నాయకులు కె.శరత్ పాల్గొన్నారు. -
జ్యుయలరీ షాపులో చోరీ
తెనాలిరూరల్: తెనాలి గంగానమ్మపేట శివాలయం వెనుక గేటు రోడ్డులోని శ్రీ విజయలక్ష్మి జ్యుయలర్స్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జోరున కురుస్తున్న వర్షంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రాడ్లతో తాళాలను ధ్వంసం చేశారు. లోనికి వెళ్లిన వారికి, బంగారు ఆభరణాలున్న మరో గది తాళం తీయడం చేతకాలేదు. ముందు గదిలో ఉన్న 50 గ్రాముల వెండి వస్తువులతో ఉడాయించారు. షాపు తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని యజమానులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్కు సమాచారం ఇచ్చారు. నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నేడు ఎస్సీ నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నెహ్రూనగర్: జిల్లా పెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం, గుంటూరు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, గుంటూరు జిల్లా వారి సహకారంతో ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఈడీ దుర్గాబాయి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఈ కార్యక్రమం శుక్రవారం 9.30 గంటలకు, ఫిరంగిపురం మండలం, మెయిన్ రోడ్, వేలంకని మాత చర్చి ఎదురు, గ్లోబల్ ఫౌండేషన్న్లో అవగాహన కార్యక్రమంతోపాటు జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 10 కంపెనీలు పాల్గొని 315 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని చెప్పారు. మరిన్ని వివరాలకు 89195 08017 నెంబర్ను సంప్రదించాలని కోరారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పెదకాకాని: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు ఆటోనగర్లో చో టు చేసుకుంది. అగతవరప్పాడు ఏవీఎన్ కాలనీకి చెందిన షేక్ మీరావలి(26) కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్లో లారీలకు బాడీ అమర్చే పనులకు వెళుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఆటోనగర్లోని వర్క్షాప్కు వెళ్లి లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీరావలి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ తెలిపారు. -
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి టౌన్: నేడు మంగళగిరిలో జరిగే ఉప ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్వహించనున్న ‘అరణ్యరామం’ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపధ్యంలో కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టచర్యలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఎఫ్ఓ హిమశైలజ తదితర అధికారులు పాల్గొన్నారు. నేడు డిప్యూటీ సీఎం పర్యటన.. తాడేపల్లి రూరల్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ శుక్రవారం తాడేపల్లిలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ కన్వీనర్ తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురం వద్ద రాష్ట్ర అటవీశాఖ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. -
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.2500 నుంచి రూ.3వేలకు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెనూ బాగా పెంచామని హంగులు ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు ఏ మాత్రం కూడా పెంచలేదని అన్నారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు నెలకు రూ.1200, ఇంటర్మీడియట్కు నెలకు రూ.1600లు బడ్జెట్ కేటాయిస్తే 30 రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టడానికి ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు, హేమంత్, యశ్వంత్, మధు ,హర్ష, చరణ్ పాల్గొన్నారు. -
సాయికృష్ణ కుటుంబానికి పరామర్శ
పొన్నూరు: విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసులే చంపి, బూడిద కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబాన్ని గురువారం వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఘటనపై నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చలో విజయవాడకు తరలిరండి
అఖిల భారత కిసాన్ సభ నాయకులు లక్ష్మీపురం: రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని ఏఐకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని వారు విమర్శించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కవులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంజుల విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు స్కూటీని, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలకేంద్రంలోని చెక్పోస్టు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గరుడాచల పాలెంకు చెందిన శ్రీకాంత్(40) పెయింటర్గా పనిచేస్తుంటాడు. శాంతిపేటలో బంధువుల ఇంటికి వచ్చి తరువాత వేములూరిపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ముందు వెలుతున్న స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు మరలడంతో దానిని శ్రీకాంత్ ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి చికిత్సకోసం తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్రీకాంత్ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య కిరణ్మయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో సత్తా చినగంజాం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ గ్రాండ్ మాస్టర్లతో పోటీ పడి మూడో స్థానం సాధించాడు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పర్వతరెడ్డి అజయ్ సంతోష్. ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన 360 వన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్లతో పోటీలో పాల్గొన్న అజయ్ సంతోష్ 9కి 6 పాయింట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాడు. అజయ్ సంతోష్ ఈ పాటికే 2500 ఫిడే రేటింగ్ను దాటి తన మొదటి జీఎం నార్మ్ను సాధించాడు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించడానికి అతడు ఇంకా కేవలం 2 నార్మ్లు మాత్రమే సాధించాల్సి ఉంది. అజయ్ వచ్చే వారం మరో జీఎం టోర్నమెంట్ కోసం చైన్నె వెళ్ళనున్నాడు. అటు తరువాత మరిన్ని నార్మ్స్ సాధించేందుకు యూరప్లోని చెక్ రిపబ్లిక్, పారిస్.. ఫ్రాన్స్ దేశాలకు ప్రయాణం కానున్నట్లు అజయ్ తాతయ్య పర్వతరెడ్డి కాంతారావు తెలిపారు. అజయ్ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. -
సుస్థిర సాగు విధానాలతో ముందుకెళ్లాలి
గుంటూరు వెస్ట్: రైతుల ఆదాయం పెంచడమే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల అంతిమ లక్ష్యం కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధికారులతో కలసి నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగిస్తూ, ఉత్పాదకత పెంచేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. సమావేశంలో ఆచార్య వర్సిటీ వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత
వినుకొండ: వినుకొండ మండలంలోని వెంకుపాలెం గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు అలియాస్ చిన్న బుజ్జి (29) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి బాలకోటయ్య, యలగాల శ్రీను, చెన్నుబోయిన కోటయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. వ్యవసాయ పొలంలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఘటనలో... శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో సాయంత్రం ఊరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన మల్లపరపు చిన కోటేశ్వరరావు (55) గేదెలు మేత కోసం పొలానికి వెళ్లాడు. పొలంలో గేదెలు మేత మేస్తుండగా అకస్మాతుగా పిడుగుపాటుకు గురై సంఘటన స్థలం మృతి చెందాడు. గేదెలు మాత్రం యథావిధిగా ఇంటికి వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా పొలంలో మృతదేహం గుర్తించారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం కలరు. కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. పది గొర్రెలు కూడా... వినుకొండ: పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో కూడిన భారీ వర్షంతోపాటు పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో నాగమయ్య పుట్ట వద్ద చెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కింద ఉన్న మేకల నరేంద్ర, మేకల శ్రీనుకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్షకుపైగా ఉంటుందని బాధితులు తెలిపారు. గుడిపాటి కోటేశ్వరరావు, మల్లవరపు చిన కోటేశ్వరరావు మృతదేహాలు మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
మాజీ సైనికోద్యోగుల నిరసన
నెహ్రూనగర్: దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడు కృపారావుపై ఎకై ్సజ్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ చట్టబద్ధంగా కొన్న మద్యం బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నా కృపారావును స్టేషనుకు తీసుకెళ్లి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్లకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ప్రసాద్, సలాం, నాగేశ్వరరావు, నాగభూషణం, చిన్న వీరయ్య, సత్తయ్య, మాణిక్యాలరావు, అప్పారావు, వేణుగోపాలరావు, రాకేష్, వెంకటరెడ్డి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైద్యులకు అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాల సహకారంతో జిల్లాలోని ప్రైవేట్ వైద్యులకు గురువారం అంటువ్యాధుల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐఎంఏ హాల్లో సాయంత్రం 7 నుంచి 10 గంటల సదస్సు ఉంటుందని చెప్పారు. ప్రైవేట్ వైద్యులందరూ హాజరు కావాలని కోరారు. నరసరావుపేట: ఎస్సీ నిరుద్యోగులకు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన కింద మేళాతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి: శ్రీలక్ష్మీనారాయణసహిత శ్రీసుదర్శనయాగ మహోత్సవం బుధవారం వైభవంగా ఆరంభమైంది. సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ చేపట్టిన భారీ యాగశాలలో వేదాంతం నాగమారుతి పర్యవేక్షణలో 20 మంది రుత్వికులు ఉదయం ఏడు గంటలకు సూర్యనమస్కారాలు, దీక్షతో ఆరంభించారు. వేమూరి విజయభాస్కర్, సీత దంపతులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. తొలిరోజున సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, తాడిబోయిన హరిప్రసాద్ యాగాన్ని సందర్శించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చని చెప్పారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్, సబ్ జూనియర్ బాల బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరేచర్ల ఫుట్బాల్ మైదానంలో జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ బాయ్స్ విభాగాలకు సంబంధించి ఆదివారం ఉదయం సెలక్షన్ జరుగుతాయని తెలిపారు. జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ గర్ట్స్ సంబంధించి 22వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7337585790 సంప్రదించాలని కోరారు. పెడన: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి తమ ఆధ్వర్యంలో ఈ నెల 22న రాష్ట్రస్థాయిలో కలె క్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెడన పట్టణంలోని సర్వోదయ సొసైటీలో బుధవారం జరిగిన కృష్ణా జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అమలుపై చర్చించారు. -
రైతుల న్యాయ పోరాటానికి మద్దతు
అండగా ఉంటామన్న వైఎస్సార్సీపీ లీగల్సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి తాడేపల్లి రూరల్: దేశానికి వెన్నెముక రైతు అని, ప్రభుత్వాల స్వలాభాల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం భూములు లాక్కుంటే రైతులు న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి అన్నారు. వారికి ఎప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు. బుధవారం రాజధాని గ్రామమైన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో రైతులకు న్యాయ సలహాలు అందించేందుకు న్యాయవాదులతో కలసి ఆయన పర్యటించారు. భూములను పరిశీలించాక గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఏ గ్రామంలో అయినా ఇన్ని పంటలు పండే భూములను ప్రభుత్వం తీసుకోవడం సాధ్యపడదని, అధికారులు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు మాట్లాడుతూ తనకు 40 సెంట్ల భూమి ఉంటే రికార్డుల్లో 25 సెంట్లు చూపిస్తున్నారని తెలిపారని వివరించారు. ఇలాంటి సమస్యలపై న్యాయ పోరాటం చేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీహరి, జి.ఎల్. నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి, జి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ నష్టాలను తగ్గించండి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో విద్యుత్ లైన్ లాసెస్ తగ్గింపుతో పాటు రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను సాధించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ కార్పొరేట్ కార్యాలయంలో గుంటూరు జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, ఈఈలు, ఆపరేషన్స్ అధికారులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ పనుల పురోగతి, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, పీఎం సూర్య ఘర్, యూఎల్ఏ, పీఎం–కుసుమ్, ఆర్డీఎస్ఎస్, జీఐఎస్ మాపింగ్, ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి తదితర అంశాలపై సీఎండీ సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ వసూళ్లలో సర్కిల్ లక్ష్యాలను తప్పనిసరిగా అందుకోవాలని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ ఎ.మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం గుంటూరులోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, బీసీ సంఘాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి మయూరి, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా నిర్వహించి, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా దామాషా మేరకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు. -
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వ్యక్తి ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆయన అవయవదానంతో ఐదు కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండింది. ఎకై ్సజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పామర్తి నాగ వెంకట దుర్గ శ్రీనివాస్ (48) విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ నెల 10న బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. వెంటనే సహచర సిబ్బంది ఆయన్ను గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆరు రోజులపాటు వైద్య చికిత్స అందించినా బ్రెయిన్ స్ట్రోక్తో ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ నెల 16న బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆయన భార్య వెంకట నాగలక్ష్మి, తల్లి పి.వి.జయలక్ష్మి తదితర కుటుంబసభ్యులు దుఃఖంలో ఉండి కూడా అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో వారు ముందుకొచ్చారు. బుధవారం రెండు నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ ఇనిస్టిట్యూట్కు, ఒక కిడ్నీఎన్నారై హాస్పిటల్కు తరలించారు. మరో కిడ్నీ, లివర్ను ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు మాట్లాడుతూ అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. -
కీలక పోస్టులూ ఖాళీ
నగరంపాలెం: జిల్లా పోలీస్ శాఖలో డీఎస్పీల కొరత ఏర్పడింది. నెలలు గడిచినా ఇదే పరిస్థితి. దీంతో ఇన్చార్జ్లతో పోలీస్ సబ్ డివిజన్లను నెట్టుకొస్తున్నారు. రాజధాని ప్రాంతమని ప్రగల్భాలు పలికే కూటమి ప్రభుత్వంలో గుంటూరులో డీఎస్పీలను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆమడ దూరంలో రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. డీఎస్పీల నియామకాలు చేపట్టకపోవడంతో ఆయా పోలీస్ సబ్ డివిజన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు కీలక పోస్టులూ ఖాళీ.. జిల్లాలో గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ, నార్త్, తెనాలి, తుళ్ళూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో తెనాలి, నార్త్, తుళ్లూరు సబ్ డివిజన్ల మినహా గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ సబ్ డివిజన్ల డీఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జనవరిలో గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీగా కె.అరవింద్, గుంటూరు దక్షిణ డీఎస్పీగా భానోదయ బాధ్యతలు స్వీకరించారు. సుమారు 13 నెలలు విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న కె.అరవింద్, భానోదయను రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే 2018 గ్రూప్–1లో సెలక్ట్డ్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఇద్దరు డీఎస్పీలు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోజుల వ్యవధిలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ ఇన్చార్జ్గా ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, గుంటూరు దక్షిణ డీఎస్పీ ఇన్చార్జ్గా గుంటూరు సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఎస్పీలు నియమించక సుమారు నాలుగు నెలలైంది. వారం క్రితం గుంటూరు తూర్పు డీఎస్పీ పోస్ట్ సైతం ఖాళీ ఏర్పడింది. డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. దీంతో గుంటూరు నగరానికి కీలకమైన మూడు సబ్ డివిజన్లకు డీఎస్పీలు నియమించకపోవడం కూటమి ప్రభుత్వం పనితీరుకి అద్దం పడుతోంది. ఎందుకీ జాప్యమో... గతేడాది సెప్టెంబర్లో డీఎస్పీలుగా బెల్లం శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో బెల్లం శ్రీనివాసరావును వెంటనే గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా నియమించారు. ఇటీవల గుంటూరు ఎస్బీ –1 సీఐ అలహరి శ్రీనివాస్ డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందగా, జిల్లా ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన కొందరికి ఇప్పటికీ ఏ జిల్లాలోనూ నియమించలేదు. ఆఖరికి ఇటీవల డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన అనేక మంది పోస్టింగ్లు కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇటీవల ఓ డీఎస్పీకి మంత్రి నుంచి పిలుపు రావడం.. బదిలీ అయి బాధ్యతలు స్వీకరించడం వెంటనే జరిగాయి. పలుకుబడి, పరపతి ఉన్న డీఎస్పీలకే కీలకమైన పోస్టులకు బదిలీ చేస్తున్నారనే వాదన లేకపోలేదు. డీఎస్పీల నియామకాలు జరగకపోవడంతో సబ్ డివిజన్లలో ప్రధాన సమస్యగా మారింది. ఒక్కొక్క సబ్ డివిజనల్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. డీఎస్పీలను నియమించకపోవడంతో పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా భారీ మోసం, నేరం జరిగితే దిశా నిర్దేశం చేసే డీఎస్పీలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీలు ఉంటే సీనియారిటీ ఆధారంగా నేరస్థులను పట్టుకునేందుకు, ఏవైనా కొట్లాటలు ఇతరత్రా నేరాల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్చార్జ్ డీఎస్పీలు నియామకంతో వారి సబ్ డివిజన్లను పర్యవేక్షించడమే సరిపోతుంది. శంకర్విలాస్ రైల్వే ఓవర్బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల దృష్ట్యా గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది, రాజధాని ప్రాంతంలోనూ అదే పరిస్థితి. ఇక వాహనాల క్రమబద్ధీకరణ, ముఖ్య అధికారులు, పాలకుల రాకపోకల వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇక జిల్లాలో నేరాలు కట్టడి చేసేందుకు, చోరులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో సబ్ డివిజన్లకు ఇన్చార్జ్లను నెలల తరబడిగా నియమించడంతో విధుల భారం ఎక్కువైంది. గుంటూరు నగరంలో కీలకమైన మూడు డీఎస్పీల పోస్టులు ఖాళీ ఏర్పడటంపై పలువురు డీఎస్పీలు వారి ప్రయత్నాలలో వారు నిమగ్నమయ్యారు. కూటమి నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. -
విద్యుత్ షాక్తో బాలుడు దుర్మరణం
పెదకాకాని: విద్యుత్ షాక్కు గురైన బాలుడు మరణించిన సంఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి రత్నాల చెరువు చెందిన క్రోసూరి రవికిరణ్(17) గత కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్లోని షెడ్లో లారీలకు బాడీలు అమర్చే పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు మంగళగిరి నుంచి గుంటూరు ఆటోనగర్ వచ్చి పనులు చేసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఎప్పటి మాదిరిగానే మంగళవారం లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రవికిరణ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ నుంచి మంగళగిరికి కనకదుర్గ వారధి మీదుగా వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని కారు బుగ్గిపాలైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టి.వందనంరాజు కారులో నగరానికి వచ్చి మంగళవారం రాత్రి తిరిగి వెళ్తుండగా వారధిపై ఏడో నంబర్ పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగరావడం గమనించాడు. వెంటనే అతను అప్రమత్తమై కారును ఆపి బయటకు దిగిపోయాడు. చూస్తుండగానే ఒక్కసారిగా కారంతా మంటలు వ్యాపించాయి. ప్రయాణ సమయంలో కారులో ఒక్కరే ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనతో వారధిపై ట్రాఫిక్జామైంది. -
లారీ ఢీకొని దంపతులు మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన మండలంలోని వేములూరిపాడు గ్రామ శివారులో మల్కాచెరువు వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన ఉమ్మడిదల కోటేశ్వరరావు(65), పద్మావతి(60)లు విజయవాడలోని పెనుమలూరులో కుమారుడివద్ద ఉంటున్నారు. కాగా గుంటూరులోని కుమార్తెను చూసి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దేచవరం వెళుతుండగా మండలంలోని మల్కాచెరువు వద్ద గుంటూరు నుంచి వస్తున్న లారీ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాడికొండ: రాజధాని అమరావతిలో లింగాయపాలెం – ఉద్ధండరాయునిపాలెం గ్రామాల మధ్య ఎన్ – 10 సీడ్యాక్సెస్రోడ్డు (ఈ–03) కూడలిలో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 34 ప్రధాన రహదార్లకు ఇరువైపులా సుమారు 700 కి.మి. మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సెంట్రల్ నర్సరీలో 45 వేల మొక్కలను పెంచాలని ఏడీసీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి వెల్లడించారు. బుధవారం ఆమె సెంట్రల్ నర్సరీలో మొక్కలు నాటి నర్సరీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 18 ఎకరాలలో ఈ నర్సరీని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ – 1లో తొలుత 10 ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టారు. దఫాల వారీగా తక్కిన విస్తీర్ణంలో కూడా నర్సరీని తీర్చిదిద్దుతారు. ఏడీసీ ఉద్యనవన, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
‘గోల్ రీచ్ కాలేకపోతున్నాను.. క్షమించండి’
తండ్రి సెల్ఫోన్కు మెసెజ్ పెట్టి విద్యార్థిని అదృశ్యం లక్ష్మీపురం: గుంటూరు ఓ కళాశాలలో ఇంటర్ సీఎంఏ చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయి.. మనస్థాపంతో తండ్రికి మెసెజ్ పెట్టి ఓ కుమార్తె అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చిల్లర అనురాధ అనే విద్యార్థిని గత మూడు సంవత్సరాలుగా గుంటూరు బ్రాడీపేటలోని హాస్టల్లో ఉంటూ మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఇంటర్ సీఎంఏ చదువుతోంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయింది. ఈక్రమంలో పది రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్ళిన రోజు తన తండ్రికి ‘నన్ను క్షమించండి.. నేను గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను.. నేను జాబ్ కోసం వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి సాధించి వస్తాను’ అని సెల్ఫోన్కు మెసేజ్ చేసింది. దీంతో అప్పటి నుంచి చుట్టు పక్కన బంధుమిత్రుల వద్ద విచారించినా ఎంతకు ఆచూకీ తెలియక పోవడంతో దిక్కుతోచక అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అనురాధ తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈశాన్య ప్రాంత ప్రజలకు న్యాయసేవలు
గుంటూరు లీగల్: ఈశాన్య ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజల కోసం ఇన్చార్జి చైర్మన్ ఒకటో అదనపు జిల్లా జడ్జి వీఏఎల్.సత్యవతి చేతులమీదుగా లీగల్ ఎయిడ్ క్లినిక్ను జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ క్లినిక్ ద్వారా న్యాయ సేవలు మరింత విస్తృతం చేయవచ్చని పేర్కొన్నారు. న్యాయవాదులను, పారా లీగల్ వలంటీర్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక క్లినిక్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంచడమేనన్నారు. ప్యానెల్ అడ్వొకేట్స్, పారా లీగల్ వలంటీర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
లింకురోడ్డు రద్దుతో తెనాలికి అన్యాయం
తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చుట్టూ ఏర్పాటుచేయనున్న ఔటర్ రింగ్రోడ్డుకు తెనాలి ప్రాంతాన్ని అనుసంధానించే లింకు రోడ్డును రద్దు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. లోక్సభ స్థానాన్ని కోల్పోయి జిల్లా హోదాకు నోచుకోని తెనాలి, ఇప్పుడు ఓఆర్ఆర్కు లింకురోడ్డును కోల్పోతే వెనుకబాటుకు గురవుతుందని, ఈ ప్రాంతవాసులకు తీరని అన్యాయం జరిగినట్టు కాగలదని హెచ్చరించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలి ప్రాంతానికి మేలు చేకూర్చేందుకే గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు తెనాలి–విజయవాడ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. అయితే పశ్చిమ బైపాస్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాల్లో ఉన్నందున, తన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం, కొన్ని మార్పులతో ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనను ఓఆర్ఆర్ డీపీఆర్లో చేర్చిందని చెప్పారు. సీఐ అక్రమ సంబంధాలపై విచారించాలి... నెలవారీ మామూళ్లు కాకుండా అప్పుల పేరుతోనూ కలెక్షన్లు చేస్తున్న తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ను వీఆర్కు పంపుతూ తక్షణం నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వకుళ్జిందాల్కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఇది కేవలం ఒక వ్యాపారి సమస్య మాత్రమే కాదనీ, పట్టణంలోని పలువురు వ్యాపారులకు ఇదే సమస్యగా ఉందన్నారు. వీఆర్కు పంపిన సీఐపై మహిళలను లొంగదీసుకుని, అక్రమ సంబంధాలు నడుపుతున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైనా విచారించాలని ఎస్పీని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో తెనాలిలో పోలీసుల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. మారీసుపేటలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఖాళీచేయటం లేదని ఓ వృద్ధమహిళ మీవరకు వచ్చి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఎస్పీ నుద్దేశించి అన్నారు. పైగా ఆమైపెనే దౌర్జన్యం చేశారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, కఠారి హరీష్, కాలిశెట్టి ఫణికుమార్, కాకి దేవసహాయం, రావి శ్రీనివాసరావు, షేక్ దుబాయ్బాబు, కొర్ర యశోద, మైలా విజయ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై 50శాతం సీలింగ్ ఎత్తివేయాలి
గుంటూరు వెస్ట్: రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని హైకోర్టు న్యాయవాది, సామాజిక న్యాయ కేంద్రం తరఫున వై.కోటేశ్వరరావు (వైకె) ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతం సీలింగుని రద్దు చేయించవలసిందిగా తమ నివేదిక ద్వారా సిఫారు చేయవలసిందిగా కమిషన్ని కోరారు. అలాగే, రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిరక్షించే విధంగా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ చట్టాన్ని చేర్చాలని కూడా సూచించారు. బీసీ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విధంగా జనాభా దామాషా ప్రకారం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో కల్పించే బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలకు అందే విధంగా, ఏబీసీడీఈలుగా వర్గీకరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 50 శాతం సీలింగుని ఎత్తివేయించే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గం సాంబశివరావు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఓర్సు ప్రేమ రాజు, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి, హైకోర్టు న్యాయవాది రాచర్ల కాంత్ తదితరులు ఉన్నారు. -
‘పది’కి రోజువారి పరీక్షలు ఉపసంహరించుకోవాలి
డీఈఓకు వినతి గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు పునః ప్రారంభమైన తరుణంలోనే పదో తరగతి విద్యార్థులకు రోజువారి పరీక్షలను నిర్వహించాలనే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిపాటిదాస్, మొహమ్మద్ ఖాలిద్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీమ్బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యాంశాలను చాప్టర్ వైజ్గా బోధించాల్సిన సమయంలో రోజువారి పరీక్షలు నిర్వహించడం వలన ప్రశ్న, సమాధానాలుగా తరగతులు మారిపోతాయని అన్నారు. రోజువారి పరీక్షలను ఉపసంహరించుకుని వారంతపు పరీక్షలు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీ టీఎఫ్ ఫిరంగిపురం, పొన్నూరు మండల శాఖల అధ్యక్షులు జహంగీర్, వి.కిషోర్షా, పేరేచర్ల హైస్కూల్ హెచ్ఎం పి.రంగరాజు ఉన్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
నకరికల్లు: హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి అన్నారు. మండలంలోని కుంకలగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీహెచ్సిలోని మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంజీవని కార్యక్రమం, ఎలక్ట్రానిక్ హెల్త్కార్డుల నిర్వహణపై వాకబు చేశారు. పీహెచ్సీ పరిధిలోని గర్భిణుల వివరాలు నూటికి నూరుశాతం నమోదు చేయాలన్నారు. పీహెచ్సీలో చేస్తున్న రక్తపరీక్షలు గురించి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఎం.పూజశ్రీ, ఆరోగ్య విస్తరణ అధికారి కొంపల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రాధాకృష్ణమూర్తి, స్టాఫ్ నర్స్ శివకుమారి, ఫార్మాసిస్ట్ కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి -
విత్తన ఎంపిక కీలకం
కొరిటెపాడు(గుంటూరు): విత్తనం మంచిదైతే పంట బాగా పెరుగుతుంది. దిగుబడులు మెరుగ్గా ఉంటాయి. కొంతమంది రైతులు విత్తనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరు. దొరికింది కదాఅని ఏదో ఒకటి కొని విత్తుకుని నష్టపోతుంటారు. వ్యవసాయంలో రాణించడానికి, అధిక దిగుబడులు పొందడానికి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. రైతులు సరైన విత్తనం ఎంపిక చేసుకోకుండా ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు. విత్తన ఎంపిక, కొనుగోలులో కొన్ని మెళకువలను తప్పనిసరిగా పాటంచాలి. మరో వారం, పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు తమ పొలాలను సీజన్కు సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాల కొనుగోలు, ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ఎం.పద్మావతి సూచిస్తున్నారు. మంచి దిగుబడి విత్తనం ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవేంటో చుద్దాం. -
కాపర్ కేబుల్స్ దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో కాపర్ కేబుల్స్ అపహరించిన వ్యక్తిని తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు మంగళవారం అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ యూనివర్సిటీలో లక్షల రూపాయల విలువ చేసే కాపర్ కేబుల్స్ దొంగతనానికి పాల్పడిన మానిగల మంగయ్యను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 30 కేజీల కాపర్కేబుల్స్, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మంగయ్య పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ సమావేశంలో తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యువతిపై లైంగిక దాడికి యత్నం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తెనాలిరూరల్: యువతిపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటనలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విశ్వసనీయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినరావూరుకు చెందిన యువతి ఇక్కడి వహాబ్ చౌక్లోని సోలార్ సిస్టమ్ షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ఇదే షాపులో మేనేజర్గా పనిచేసే రాజేష్ నెల రోజులుగా యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. గాంధీచౌక్లోని షాపు గోడౌన్కు సోమవారం మధ్యాహ్నం పిలిచాడు. యువతి రాగానే తలుపు వేసి లైంగిక దాడికి యత్నించాడు. యువతి తప్పించుకుని వెళ్లింది. విషయం యువతి బంధువులకు తెలియడంతో సుమారు 20 మంది, రాజేష్కు దేహశుద్ధి చేసేందుకు మంగళవారం ఉదయం సోలార్ షాపు వద్దకు వెళ్లారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఐదు ఇసుక టిప్పర్లు సీజ్ కొల్లిపర: ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం కేసు నమోదు చేసినట్లు కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. చిలుమూరు లంక నుంచి గుంటూరు ఎటువంటి వే బిల్లు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండల పరిధిలోని తూములూరు అడ్డ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఐదు టిప్పర్లను ఆపి పరిశీలించగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు, వే బిల్లు లేకపోవడంతో సీజ్ చేశారు. తహసీల్దార్ జి సిద్ధార్థకు నివేదిక సమర్పించారు. ఒక్కొక్క టిప్పర్కి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 జరిమానా విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎటువంటి బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై నిరసన
మేడికొండూరు: గ్రామ పునర్నిర్మాణ సంఘం (వీఆర్ఓ)లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు తమకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇతర చట్టబద్ధ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ఎన్నో సంవత్సరాలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 2018 సంవత్సరం నుంచి తమకు రావలసిన బకాయిల కోసం నిరంతర పోరాటం చేస్తున్నామని తెలిపారు. పీఎఫ్ కమిషనర్ సహకారంతో పలుమార్లు సంఘ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించడం, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, చర్చలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ సంఘ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు ప్రాంత ప్రతినిధి టి.మురళి, కమిటీ సభ్యులు రమేష్బాబు, మోహన్, ఏసోబు, విజయలక్ష్మి, సునీల్ తదితరులు పాల్గొని మాజీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. -
రేపు దుగ్గిరాల బంద్
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్ల పసుపు కాలి బూడిదైనా గాని ప్రభుత్వం పట్టించుకోవకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, అధికారులు చేసిన ఒప్పందానికి విలువ లేకపోతే రైతులకి ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కనీసం 179 సార్లు మంత్రులు, అధికారులు చుట్టూ అగ్ని బాధిత పసుపు రైతులు ప్రదక్షిణలు చేసినా కరుణించలేదన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయని కూడా గుర్తుచేశారు. ఈ నెల 8న తెనాలిలో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 10న దుగ్గిరాల పసుపు వ్యవసాయ మార్కెట్ యార్డు ముట్టడి చేసినట్టు తెలిపారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 18వ తేదీన దుగ్గిరాల బంద్కు అగ్ని బాధిత పసుపు రైతులు కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. దుగ్గిరాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, రైతు శ్రేయోభిలాషులు కార్మికులు, విద్యా వాణిజ్య సంస్థలు అందరూ బంద్కు సహకరించాలని కోరారు. వీరితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు కూడా ఉన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం పట్నంబజారు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం.. కొత్తపేట పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ సోమవారం రాత్రి ఈదురుగాలులకు పేలింది. నిప్పులు చెలరేగడంతో అక్కడ ఉన్న మూడు ద్విచక్రవాహనాలు తగలబడినట్లు సమాచారం. అయితే పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు సైతం పోలీసులు రోడ్డుపైనే పార్కింగ్ చేసిన పరిస్థితుల్లో, వాటితోపాటు ఇతరుల వాహనాలు కూడా తలగబడినట్లు తెలుస్తుంది. గంజాయి కేసులో నిందితులు అరెస్టు పట్నంబజారు: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, కొత్తపేట సీఐ వీరయ్య వివరాలు మీడియాకు మంగళవారం వెల్లడించారు. నెహ్రూనగర్కు చెందిన గుర్రం శివకుమార్, బత్తుల శశాంక్, శ్రీనగర్కు చెందిన చెన్నంశెట్టి రుద్రబాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డితోటకు చెందిన దాసరి గురవయ్యలు నెహ్రూనగర్లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిందితుల నుంచి ఐదు కిలోల 360 గ్రాముల గంజాయి స్వాధీనం చసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. రైతులు నష్టపోకుండా చూస్తాం రాజుపాలెం: రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, సకాలంలో నష్ట పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ రైతులకు భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయే రైతులకు అవార్డు ప్రకటించే ముందుగా మంగళవారం రైతుల అభిప్రాయాలను సేకరించారు. మండలంలో అనుపాలెం, చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాలకు సంభందించిన 249 మంది రైతులకు సంబంధించిన సుమారు 20 ఎకరాల సాగు భూములను రైల్వే అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి అవార్డు ప్రకటించే ముందుగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంతమంది రైతులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఇప్పుడు బయట మార్కెట్ రేటు ఎకరం రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం చాలా తక్కువ నష్ట పరిహారం ఇస్తుందని వాపోయారు. దీంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రేటుతో కలిపి రెండున్నర రెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మీ పొలాల్లో ఉన్న బోర్లకు, బావులకు పెద్ద చెట్లకు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇది సమంజసం కాదనిపిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తహసీల్దార్ దుర్గేశ్వరరావు, ఆర్ఐ గోపి, వీఆర్వోలు పుల్లయ్య, దుర్గాభాయి, శాంతి, తదితరులు పాల్గొన్నారు. -
రాంజీ చట్టంతో ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం
లక్ష్మీపురం: జూలై 1 నుంచి అమలులోకి రానున్న వీబీపీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. మంగళవారం గుంటూరులోని సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లతోందన్నారు. గ్రామాల్లో ఫేస్ యాప్ వలన ఉపాధి కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికి మస్టర్ వేసే దాంట్లో భాగంగా ఫొటో మ్యాచ్ అయితేనే పని చూపుతున్నారని, ఇది కూడా పని ప్రారంభంలో ఒకసారి పని పూర్తయిన తర్వాత రెండవసారి ఫొటో తీస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్వర్ పనిచేయక ఫొటో మ్యాచ్ కాక ఉపాధి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కార్మికులకు పని చేసిన 15 రోజుల్లోపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో వేతనం ఇచ్చేటప్పుడు పే ిస్లిప్పులు ఇచ్చే వారిని, దానిలో ఎంత పని చేసింది ఎంత డబ్బులు పడుతుంది వివరంగా అర్థమయ్యేదన్నారు. ప్రస్తుతం ఎక్కడా ప్లే స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ చట్టం ప్రకారం వంద రోజులు పనిని కల్పించాలని కోరారు. జూలై ఒకటిన గ్రామ సచివాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు బి.కోటేశ్వరి, సహాయ కార్యదర్శి జి.అజయ్, ఎస్.కె ఖాదర్ బాబా, మేరీ, పాలేటి అప్పారావు, భద్రయ్య, కాటమరాజు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026ఓట్లకు ఎసర్ పెడుతున్నారా? ● గుంటూరు నగరంలో ప్రక్రియ తీరుపై అనుమానాలు ● బీఎల్ఓతోపాటు తిరుగుతున్న టీడీపీ నాయకులు ● వైఎస్సార్ సీపీ వారి ఓట్లను తొలగించేందుకు ఒత్తిడి? అధికారం అండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లకు టీడీపీ నాయకులు ఎసరు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ముఖ్యంగా గుంటూరు నగరంలో అడ్డదిడ్డంగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్ఓను వెంటపెట్టుకుని అధికార పార్టీ నేతలు ఓటర్ల వద్దకు వెళ్లి సర్ దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల బీఎల్ఏలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు గుంటూరు నగరంలో అనుమానాలకు తావిస్తోంది. సోమవారం ప్రారంభం అయిన ప్రక్రియను సంబంధిత సచివాలయాలవారీగా బీఎల్ఓను నియమించారు. 2025 ఎన్నికల ఓటరు జాబితాల ఆధారంగా గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో ఉన్న పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 291 బూత్లు, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 256 బూత్లకుగాను మొత్తం 547 మందిని బీఎల్ఓలుగా నియమించారు. బీఎల్ఓలతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్ఏలను కూడా ఆయా పార్టీ నాయకులు నియమించారు. నగరంలోని పలు డివిజన్లలో బీఎల్ఓలతోపాటు వారి వద్ద ఉన్న ఓటరు జాబితాలతో తెలుగుదేఽశం పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షులు, స్థానిక తృతీయ శ్రేణి నాయకులు పాల్గొంటున్నారు. అధికారపార్టీకి చెందిన వారికి మాత్రమే సర్ ప్రక్రియలో భాగంగా సంబంధిత దరఖాస్తులను బీఎల్ఓలు అందజేస్తున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. బీఎల్ఓలతోపాటు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, తృతీయ శ్రేణి నాయకులు కలసి సర్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను అందజేసి ఫొటోలు దిగుతున్నారు. నిబంధనల మేరకు నిర్వహించాల్సిన సర్ ప్రక్రియ అధికార పార్టీల నేతలకు అనుకూలంగా మారిందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఎల్ఏలను రానివ్వకుండా నగర వీధుల్లో బీఎల్ఓలను తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్లో బీఎల్ఓతో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు, మైనార్టీ నాయకుడు అక్కడే ఉన్నారు. 34వ డివిజన్లో కోబాల్డ్పేట 2వ లైనులోని మున్సిపల్ స్కూల్లో బీఎల్ఓ నుంచి సర్ దరఖాస్తు స్థానిక మహిళకు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు అందజేయడంపై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులు ఈ బీఎల్ఓలపై నియమించిన సూపర్వైజర్లు కూడా ఆయా ప్రాంతాలలో తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఈ సర్ ప్రక్రియను నిర్వహించాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. ఇదే తరహాలో బీఎల్ఓలు తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులతో కలసి సర్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు అందజేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై న జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సర్ ప్రక్రియలో పార్టీలకు అతీతంగా నిర్వహించాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే బీఎల్ఏలతో కలసి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఓటరుకు దరఖాస్తులు అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి 4,130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలో నియమించిన బీఎల్ఓలు కొన్ని డివిజన్లలో పాత డోర్ నంబర్లకు బదులు కొత్త డోర్ నంబర్లలో ఉన్న వారికి సంబంధించి సర్ ప్రక్రియను నిర్వహించడం లేదని తెలుస్తోంది. కొంతమంది ఓటరు జాబితాలోని వరుస సంఖ్య ప్రకారం తిరుగుతూ సర్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుత కొత్త డోర్ నంబర్ ప్రకారం నిర్వహించాల్సిన సర్ ప్రక్రియను సమర్థంగా చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులతో తాము మాట్లాడతామని బీఎల్ఓలను కొన్ని డివిజన్లలో అధికార పార్టికి చెందిన నాయకులు బెదిరిస్తున్నారని సమాచారం. దిక్కుతోచక బీఎల్ఓలు సర్ ప్రక్రియను అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిగరెట్ దుకాణాలే లక్ష్యంగా చోరీలు
కొల్లూరు: చోరులు కొత్త తరహా దొంగతనాలకు తెరతీశారు. దుకాణాల్లోని సిగరెట్ ప్యాకెట్లు, నగదుతో ఉడాయిస్తున్నారు. దొంగల పంథాను నిశితంగా పరిశీలిస్తే ముందస్తుగా రెక్కీ చేసి, ఎంపిక చేసుకున్న దుకాణాలలో రూ. వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు చోరీ చేస్తున్నారు. కొల్లూరులో వారం క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్లు దొంగతనం చేశారు. అదే తరహాలో మండలంలోని దోనేపూడిలో దుకాణం తాళాలను నిమిషం వ్యవధిలోనే తొలగించి షట్టరు కింద నుంచి షాప్లోకి చొరబడి సిగరెట్ ప్యాకెట్లను మూటగట్టుకుని ఉడాయించాడు. దోనేపూడికి చెందిన వెనిగళ్ల సుధాకర్ అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయం వెనుక ప్రాంతంలో రేపల్లె–తెనాలి ప్రధాన రహదారి వెంబడి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున రూ.30 వేలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు, రూ. 3 వేల వరకు నగదును చోరుడు దొంగిలించాడు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్కడే వేచి ఉన్నాడు. తర్వాత ఇద్దరూ దోనేపూడి కరకట్ట వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. పక్కా ప్రణాళికతో దుండగులు చోరీలు చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. కొండలరావు తెలిపారు. కొల్లూరు ప్రాంతంలో రేయింబవళ్లు దుకాణాలు తీసి ఉండటంతో రాత్రి సమయంలో కొత్త వ్యక్తుల సంచారం అధికంగా ఉంటోంది. రాత్రి వేళ పోలీసుల గస్తీ సన్నగిల్లడం సైతం దొంగతనాలు చోటుచేసుకోవడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాన్షాప్లో సరుకులు చోరీ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో పాన్షాపులో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. వినుకొండ నియోజకవర్గం, నూదెండ్ల మండలం, ముప్పరాజు గ్రామానికి చెందిన గోరంట్ల సునీల్ కుటుంబ పోషణ నిమిత్తం వలస వచ్చి తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్లో పాన్షాపు అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. సోమవారం రాత్రి మూసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున 5 గంటలకు షాపు తీద్దామని వచ్చి చూడగా అప్పటికే తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించారు. దొంగలు చోరీ చేశారని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సుమారు రూ.50 వేల సరుకులతోపాటు, సెంటు బాటిళ్లు, ఇతర వస్తువులను చోరీ జరిగాయని తేల్చారు. ప్రముఖులు తిరిగే ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడంపై ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాలతో వ్యాపారుల బెంబేలు -
‘బకాయిలకు’ చికిత్స చేసేదెవరు?
● జీజీహెచ్లో అడ్డగోలుగా పలువురు వ్యాపారుల తీరు ● అద్దెలు చెల్లించక, కరెంటు బిల్లులు కట్టక ఖజానాకు గండి ● ప్రజాప్రతినిధుల అండకు తోడు అధికారుల మద్దతు గుంటూరు జీజీహెచ్లో కొందరు అడ్డగోలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో దుకాణానికి నెలవారీ అద్దె చెల్లించాల్సిన పనిలేకుండా.. కరెంటు బిల్లులు కూడా కట్టనవసరం లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. ప్రజాప్రతినిధుల మద్దతు, ఆస్పత్రి పరిపాలన అధికారులను ప్రసన్నం చేసుకుని ఇలా పలువురు ఆర్జిస్తున్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పాలు, పాల ఉత్పత్తుల షాపులు , ఫొటో స్టాట్ షాపు, టీ స్టాళ్లు, జనరిక్ మందుల షాపులు ఉన్నాయి. వీరు జిల్లా కలెక్టర్ అనుమతితో వ్యాపారాలు చేస్తున్నారు. కొంత మందికి అనుమతులు లేవని ఇటీవల జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందింది. నామినల్గా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ అద్దెతో జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెల అద్దె ఇవ్వడం లేదు. కరెంటు బిల్లులు సైతం చెల్లించడం లేదు. ఆసుపత్రి అధికారులు కూడా ఏళ్ల తరబడి ఇలా చేస్తున్న వ్యాపారులపై కనీస చర్యలు తీసుకోకపోవడం లేదు. హెచ్డీఎస్ ఆదాయానికి గండి ఆస్పత్రికి ఆదాయం వచ్చేలా పనిచేయాల్సిన పరిపాలన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. సొంతంగా లబ్ధి పొంతుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్డీఎస్) చైర్మన్గా జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతినెలా, లేదా మూడు నెలలకొకసారి హెచ్డీఎస్ సమావేశాలు నిర్వహించి. ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం అలాంటి సమావేశాల్లోనైనా ఈ మొండి బకాయిల గురించి అజెండాలో పెట్టకుండా, చర్చించకుండా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారు. ఆసుపత్రిలో నిధుల కొరతతో హెచ్డీఎస్ అకౌంట్ ఎన్నడూ లేని విధంగా అల్లాడుతోంది. ఆసుపత్రిలో వ్యాపారాలు చేసేవారి వద్ద నుంచి సకాలంలో నిధులు సేకరించడం ద్వారా హెచ్డీఎస్ అకౌంట్కు నిధులు సమకూరుతాయి. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కుడికాలువకు నీరు నిలుపుదల
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. గత నెల 25న తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు 10 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తి అవ్వటంతో కుడికాలువకు పూర్తిగా నీటిని నిలుపుదల చేశారు. కార్యక్రమంలో డీఈఈ టి మురళీధర్, ఏఈఈ సుధ, డ్యాం సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని: సినీ నటుడు వడ్డే నవీన్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ట్రానన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం వీవీఐటీయూలో సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కార్యక్రమంలో హీరో వడ్డే నవీనన్తో పాటు హీరోయిన్ రాశి సింగ్ పాల్గొన్నారు. చిత్రబృందానికి వీవీఐటీయూ ప్రో–ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ స్వాగతం పలికారు. నవీన్ మాట్లాడుతూ ఈ చిత్రం బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్రబృందం విద్యార్థులతో కలసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేసింది. బాపట్లటౌన్: బైండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నిందితుడిగా ఉన్న స్టువార్టుపురం గ్రామానికి చెందిన మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పప్పును వెదుళ్లపల్లి పోలీసులకు సోమవారం కోర్టుకు అప్పగించారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు అనుమతితో సోమవారం రామచంద్రకుమార్ను బాపట్ల సబ్జైల్కు తరలించారు. గుంటూరు లీగల్: వృద్ధులకు ఏమైనా న్యాయపరమైన సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు సోమవారం ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని దాక్షిణ్య మానసిక వికలాంగుల స్కూల్, ఓల్డ్ ఏజ్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తొలుత దాక్షిణ్య స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అక్కడవున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కోయవారిపాలెం, గుంటూరులోని నవీన్ ఆదర్శ్ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నలందా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హైవే రోడ్డుపై గుర్తు తెలియని పాప తిరుగుతుండటాన్ని సత్తెనపల్లి పోలీసులు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పాప తన పేరు షేక్ జాన్, తండ్రి గౌస్ అని, గుంటూరు క్లబ్ వద్ద చినపలకలూరు గ్రామంగా చెబుతుందని ఎస్ఐ అమిరుద్దీన్ తెలిపారు. పాప ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ, ఎస్ఐ, పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
డైయేరియాతో బహుపరాక్
అతిసార ప్రాణాంతకం గుంటూరు మెడికల్: డయేరియా సోకినప్పుడు పెద్దవారు చేసే కొద్దిపాటి నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అతిసార వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించని పక్షంలో ప్రాణాలు పోతాయి. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏడాది 4.3శాతం చిన్నారులు అతిసార వ్యాధితో చనిపోతున్నారు. జిల్లాలో 2024లో 93 మంది ఐదేళ్లలోపు చిన్నారులు , 2025లో 105 మంది, 2026 జనవరి నుండి మే నెల వరకు 66 మంది అతిసార వ్యాధి బారిన పడ్డారు. పిల్లల్లో డయేరియా మరణాలను నివారించడమే లక్ష్యంగా ఈనెల 16 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా డయేరియా (అతిసారవ్యాధి) నియంత్రణ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సాధారణ విరేచనం కంటే ఎక్కువ నీరు లేదా, పూర్తిగా నీళ్ల విరోచనం అవుతూ ఉంటే పిల్లలకు అతిసార వ్యాధి సోకినట్లు గుర్తించాలి. ఐదేళ్లలోపు పిల్లలకు రోజులో మూడు సార్లుకంటే ఎక్కువ సార్లు మోషన్స్ అవడం, విరేచనంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే దానిని అతిసారగా గుర్తించి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అతిసార వైరస్ద్వారా సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. బిడ్డకు చంచలత్వం, చిరాకు, మైకం, అపస్మారక స్థితి, కళ్లు లోపలికి వెళ్లినట్లు ఉండటం, చర్మం స్థితిస్థాపకత లేకపోవడం, సున్నితంగా నొక్కడం వల్ల చర్మం చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవడం, బిడ్డ చాలా దాహంతో ఉండటం, నీరు తాగులేకపోవడం, లక్షణాలు కనిపిస్తే తక్షణమే డయేరియాగా నిర్ధారించుకుని వైద్యులను సంప్రదించాలి. జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణ, డయేరియా మరణాల నివారణే లక్ష్యంగా 15 రోజులపాటు స్టాప్– డయేరియా పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందిస్తున్నారు. హ్యాండ్ వాష్పై ఆసుపత్రుల్లో, ఇళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, గుంటూరు డయేరియాను ఓఆర్ఎస్తో పూర్తిగా కట్టడి చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. శుభ్రమైన పాత్రలో ఒక లీటరు తాగునీటిని పోసి నీటిని కాచి చల్లార్చి అందులో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను పోయాలి. పరిశుభ్రమైన స్పూన్తో ఓఆర్ఎస్ పొడిని కాచిచల్లార్చిన నీటినిలో కలిసిపోయేలా తిప్పాలి. పిల్లవాడి వయస్సు, శరీర బరువును బట్టి ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. రెండు నెలలకంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుకు ప్రతి విరేచనం తరువాత ఐదు స్పూన్ల ద్రావణం పట్టించాలి. రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత అరకప్పు, రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి విరేచనం తరువాత ఒక కప్పు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. అతిసార వ్యాధి మొదలైన నాటి నుంచి విరేచనాలు తగ్గే వరకు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వాలి. తల్లులు పాలు తాగుతున్న పిల్లలకు తప్పనిసరిగా మోషన్స్ అవుతున్నా కూడా బ్రెస్ట్మిల్క్ ఆపకూడదు. దాంతోపాటుగా, గంజి, కొబ్బరి నీరు, పలుచని పప్పుచారు ఇవ్వడం మంచిది. ఓఆర్ఎస్తోపాటుగా జింక్ మాత్రలను కూడా పిల్లలకు ఇవ్వాలి. అతిసార వ్యాధి తీవ్రతను జింక్ మాత్ర తగ్గిస్తోంది. డయేరియా సోకిన చిన్నారులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాం. డయేరియా వ్యాధిపై అవగాహన, చికిత్స ఏవిధంగా అందించాలనే విషయాలపై అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ – జింక్ కార్నర్లు ఏర్పాటు చేశాం. డయేరియా సోకిన చిన్నారులకు ఏవిధంగా వైద్యం అందించాలనే విషయాలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 1,45,000 మంది ఉన్నారు. వీరికి 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ మాత్రలు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాం. అదనంగా రిజర్లు స్టాక్ను ఆయా ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ స్టోర్స్ విభాగంలో సిద్ధంగా ఉంచాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి
తెనాలి టౌన్: గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రధాన పంట కాలువలు వాటి పరిధిలోని బ్రాంచ్ కెనాళ్లను ఈ నెలాఖరులోగా శుభ్రం చేసి రైతులకు జూలై మొదటి వారంలో సాగునీరు అందివ్వనున్నట్టు గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. సుధాకర్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఈ ఆయకట్టు పరిధిలో 5,72,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్నట్టు చెప్పారు. మొత్తం 10 ప్రధాన పంట కాలువలు, వాటి కింద 50 పైబడి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నట్టు వివరించారు. వీటి మెయింట్ నెన్స్కు ప్రభుత్వం రూ. 13.64కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రధాన పంట కాల్వలో గురప్రు డెక్క తొలగిస్తున్నట్టు తెలిపారు. బ్రాంచ్ కెనాల్స్కు అవసరమైనచోట్ల నూతన షట్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 20 సెక్షన్ల పరిధిలో 284 వర్కులు.. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ పరిధిలో 20 సెక్షన్లు ఉండగా మొత్తం 284 వర్కులు చేపట్టారు. ఇవన్నీ సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఐదు వర్కులు, బాపట్ల జిల్లాలో 162, గుంటూరు జిల్లాలో 117 వర్కులు జరుగుతున్నాయన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పంటకాలువలను అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. అయితే గురప్రు డెక్కతో నిండిన ప్రధాన పంట కాలువల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ ఈఈ ఎస్.సుధాకర్ -
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై సోమవారం ‘ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి జిల్లావిద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్ట ప్రకారం విడుదల చేసిన జీఓ నెం.53లో నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అదేవిధంగా క్యాంపస్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు వంటి సామగ్రి విక్రయించరాదని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు, యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తే యాజమాన్యంపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సర్చూసుకునేందుకు సిద్ధమా...
నెహ్రూనగర్: ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)’పై అందరిలోనూ ఆందోళన నెలకొంది. సర్వేలో భాగంగా బీఎల్ఓలు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబం 23 ఏళ్లగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘సర్’ హాట్ టాపిక్గా మారింది. ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి. 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు... గుంటూరు జిల్లాలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలతో కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 8,69,950 మంది, మహిళలు 9,31,668, ట్రాన్స్జెండర్స్ 165, మొత్తం 18,01783 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14 వరకూ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఫారం–2లో ఏం నింపాలి.. ‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం–2 నింపి, బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేరు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి / సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య / భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్ఓకు అందజేస్తే ఇందుకు రశీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. ‘సర్’లో ముఖ్యమైన తేదీలు బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర.. సర్ విషయంలో రాజకీయ పార్టీలు, వారి పార్టీల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) అప్రమత్తంగా ఉండాలి. తమ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎంత మంది ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి.. ఎంత మందివి మ్యాపింగ్ కాలేదు... అనే వివరాలు తెలుసుకుని ఉండాలి. మ్యాపింగ్ కాని ఓటర్ల వద్దకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండేలా చూడాలి. బీఎల్ఓ వచ్చినపుడు వివరాలను సమర్పించేలా చూసి మ్యాపింగ్ చేయించాలి. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆ ఇంటిలో లేకపోతే.. ఇంటిలో ఉన్న ఓటరు తాలూకా బంధువుల నుంచి వివరాలు ఇప్పించి మ్యాపింగ్ చేయించాలి. ఈ విషయంలో తప్పులు దొర్లితే ఓట్లు గల్లంతు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ నెల 15 నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటరు వివరాల సర్వే చేస్తారు. వారు అప్పుడు అడిగే ఎపిక్ కార్డు (ఓటరు గుర్తింపు కార్డు), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 2002 ఓటరు జాబితా వివరాలు, తల్లిదండ్రులు లేదా తాతల ఎపిక్ కార్డులు ప్రజలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. ఒకటి నింపి వారికిచ్చి, మరొకటి రశీదుగా తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శక ఓటరు జాబితా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కె.మయూర్ అశోక్, జీఎంసీ కమిషనర్ -
దర్జాగా బళ్లబాట కబ్జా
చేబ్రోలు: చేబ్రోలు గ్రామంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘బళ్ల బాట’ మూసివేతపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో జీబీసీ రహదారి పక్కన సర్వే నెంబర్ 963–1బి లో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అధికార పార్టీ పొన్నూరు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు పరుచూరి సత్య కిషోర్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమను కొంతకాలం క్రితం నిర్మించాడు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో బళ్లదారికి ఇరువైపులా ఉన్న రైతులందరితో సదరు యజమాని అనుకూలంగా మాట్లాడాడు. ప్రధాన రహదారి రోడ్డు నుంచి రైతులకు అనుకూలంగా ‘బళ్ల బాట’ (రైతుల రాకపోకలకు దారి) వదులుతానని నమ్మబలికాడు. అయితే కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత మాట మార్చడమే కాకుండా, ప్రస్తుతం రైతులకు ఉన్న ఏకై క దారిని సైతం మూసివేస్తూ అక్కడ శాశ్వత రక్షణ గోడను నిర్మించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘నేను దారి ఇచ్చేది లేదు, మీకు చేతనైంది చేసుకోండి, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి’ అంటూ సదరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 600 ఎకరాలపై ప్రభావం.. రైతుల పంట పొలాలకు ట్రాక్టర్లు, పంట ఉత్పత్తులు తరలించటానికి రాకపోకలకు ఉపయోగించే బళ్ల బాట మూసుకుపోవడం వల్ల దాదాపు 600 వందల ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. పొలాల్లో పండిన పంటను ఇంటికి లేదా మార్కెట్కు తరలించడానికి, వ్యవసాయ సామగ్రిని పొలాల్లోకి తీసుకెళ్లడానికి ఈ దారి తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు వైపు ప్రహారీ నిర్మాణం, ఉత్తరం వైపున ప్రహరీ నిర్మాణాలను కొంత భూమి బళ్లబాట కోసం రైతులకు ఉపయోగపడే విధంగా వదలకుండా పనులు పూర్తి చేస్తుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు మాగాణి భూమిలో నిర్మాణం జరిగిన ప్లాస్టిక్ బకెట్లు, వస్తువుల తయారీ కంపెనీ వలన చుట్టుపక్కల భూములకు ముప్పు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బళ్లబాట సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కంపెనీ ముందు భాగంలో ఉన్న సాగునీటి కాలువ పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు తూము వేసి పరిశ్రమలోకి రాకపోకలు చేస్తున్నారు. కాలువలోకి గ్రావెల్ జారిపోవటంతో కాలువ పూడిపోయింది. సిమెంటు తూమును తీసివేసి వంతెన కల్వర్టు నిర్మాణం చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. -
రెయిన్ట్రీ పార్క్ విల్లాలో భారీ చోరీ
సుమారు 475 గ్రాముల బంగారం చోరీ మంగళగిరి టౌన్: మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మంగళగిరి మండలం కాజ గ్రామం రెయిన్ట్రీపార్క్లోని ఓ విల్లాలో అడ్వకేట్ శైలేంద్ర నివాసముంటున్నాడు. ఆయన భార్య చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. శైలేంద్ర నివాసముంటున్న విల్లా సెకండ్ ఫ్లోర్లో అతడి తల్లిదండ్రులుంటున్నారు. శైలేంద్ర భార్య శనివారం రాత్రి ఆస్పత్రిలో నైట్ డ్యూటీకి వెళ్లింది. స్నేహితులను కలిసేందుకు శైలేంద్ర శనివారం సాయంత్రం విజయవాడ వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున తను విల్లాకు చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న గదికి వెళ్లగా.. అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పాటు, ఆల్మరాలు తెరిచి ఉన్నాయి. మెయిన్ బెడ్రూమ్లో ఉండాల్సిన ఐరన్ సేఫ్ కనిపించలేదు. సెకండ్ ఫ్లోర్లో శైలేంద్ర తల్లిదండ్రులు ఆ సమయానికి నిద్రపోతున్నారు. వారి గది తప్ప విల్లాలోని అన్ని గదుల్లో ఉన్న ఆల్మరాలు తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని నిర్ధారించుకుని వెంటనే భార్యకు సమాచారం ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ సేఫ్ లాకర్, డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 475.5 గ్రాములు, రూ.3 లక్షల విలువైన పలు వస్తువులు, 350 యూఎస్ డాలర్లు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం విల్లాను పరిశీలించారు. పోలీసు జాగిలాల బృందం సాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తించాలని, సీసీ టీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ!
గుంటూరు ఎడ్యుకేషన్ :‘‘గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన శ్రీరామ్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.22 వేల ఫీజుతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం అదనంగా రూ.4,500 వేలు చెల్లించాలని స్కూల్లో చెప్పారు. అదే విధంగా రెండో తరగతిలో చేర్పించిన కుమార్తెకు ఫీజు రూపంలో రూ.24 వేలతోపాటు పుస్తకాలు, యూనిఫాం కోసం రూ.6 వేలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికీ రూ.500 లోపే కదా అని అడిగితే ప్రభుత్వ పుస్తకాలను మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన పుస్తకాలను క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం దబాయించింది. ఫలితంగా చిరుద్యోగం చేస్తూ నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్న శ్రీరామ్ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించడం పెనుభారంగా మారింది. వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించడంతోపాటు పిల్లలను ఏ విధంగా చదివించాలని ఆవేదన చెందుతున్నారు.’’ చంద్రబాబు పాలనలో పట్టించుకునే దిక్కేది? టీడీపీ పాలనలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కరువైన ఫలితంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. గతేడాదితో పోల్చితే ఫీజులను 20 శాతం నుంచి 30 శాతం మేరకు అడ్డగోలుగా పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.20 నుంచి రూ.22 వేల మధ్యలో ఉంది. కార్పొరేట్ స్కూల్లో అది రూ.30 వేలు చేశారు. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.40 వేల నుంచి రూ.45 వేలు, పదో తరగతికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు ఉన్నాయి. అదే విధంగా 6వ తరగతి నుంచి ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్న వివిధ ప్రోగ్రామ్లకు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 60 వేల మొదలు రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్లతో కూడిన పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60 వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధనకు బదులుగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్యపుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించి, ముద్రించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు తమ వద్ద లేవని, వాటిని బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన చేస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు విద్యార్థులకూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పత్తా లేని యాజమాన్య కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేందుకు నిబంధనలు అంగీకరించవు. పాఠశాల యాజమాన్య కమిటీ ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి, బడిలో కల్పిస్తున్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత విద్యాసంవత్సరంలో వసూలు చేసిన ఫీజులకు ఐదు శాతమే పెంచాల్సి ఉంది. కానీ ఇవేమీ అమలు కావడం లేదు.విద్యార్థుల నుంచి ఫీజులు మొదలు ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను క్యాంపస్లలోనే దుకాణం తెరిచి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కనపెట్టి, ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి విక్రయిస్తున్న పుస్తకాల ధరలో కనీసం 50 శాతం మేరకు లాభాలను ఆర్జిస్తున్నారు. వివిధ పాఠశాలలు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు యూనిఫాం, బెల్టు, టై సహా అన్ని రకాల సామగ్రిని క్యాంపస్లలోనే విక్రయిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తెనాలిరూరల్: పట్టణ సుల్తానాబాద్లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు.. తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. -
వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేటర్గా సైతం గెలవని పిల్లి మాణిక్యరావుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేవని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర అన్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబుకు ఆ సామాజిక వర్గానికి రాజ్యాంగ పదవుల్లో సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్తో పోలికా అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకు రాదని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఆరోపించారు. యూటర్న్కు, వెన్నుపోటుకు, క్రెడిట్ చోరీకి ఆయన చిరునామా అన్నారు. మహానేత వైఎస్సార్ వేసిన పునాదులతో పైకి వచ్చిన వైఎస్ జగన్ రెండుసార్లు ఎంపీగా గెలవడంతోపాటు 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించారని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకుని, రూ.కోట్ల అవినీతికి పాల్పడిన డీఎస్సీ వ్యవహారంపై పిల్లి మాణిక్యరావుకు దమ్ముంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో హామీలు అమలు చేయని ఫలితంగా రాష్ట్ర ప్రజలు రూ.లక్షన్నర కోట్లు నష్టపోయారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అని తప్పుడు విమర్శలు చేస్తున్న పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సైతం అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్సార్ సీపీ తరఫున తాము చేసిన ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేక పిల్లి మాణిక్యరావుతో పదే పదే అబద్ధాలు, ఆరోపణలు చేయిస్తున్నారా అని మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ విభాగంలో టాపర్లుగా వచ్చిన అభ్యర్థులకు డీఎస్సీలో పోస్టులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకుని అనర్హులకు పోస్టింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ విభాగ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ మాట్లాడుతూ మాణిక్యరావు పదే పదే వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని, కార్పొరేటర్గా గెలుపొందని మాణిక్యరావుకు ఆ అర్హత లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా గెలుపొందని మాణిక్యరావు లిడ్క్యాప్ చైర్మన్గా ఎస్సీల సంక్షేమం కోసం పని చేయడం మాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నిత్యం వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని మాణిక్యరావు తమపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని 66 లక్షల పెన్షన్లలో ఆరు లక్షల పెన్షన్లు ఎత్తేశారని, పిల్లి మాణిక్యరావు దళితుల్లో ఏ ఒక్కరికై నా పెన్షన్ ఇప్పించారా అని ప్రశ్నించారు. డీఎస్సీపై లోకేష్తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ మాణిక్యరావు అదే పనిగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మూతబడిన 400 చర్మకారుల కుటీరాలను తెరిపించడంలో లిడ్క్యాప్ చైర్మన్గా ఉన్న పిల్లి మాణిక్యరావు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
వందేళ్ల బళ్లబాటకు పరిశ్రమ నిర్మాణంతో సమస్య
వందేళ్ల నుంచి రైతుల రాకపోకలకు ఉపయోగించే బళ్లబాటకు ప్రస్తుతం నిర్మించిన ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల సమస్య వచ్చింది. నిర్మాణ సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అడుసుమల్లి నరసింహారావు, రైతు, చేబ్రోలు పరిశ్రమ నిర్మాణంతో రాకపోకల కోసం ఉన్న బళ్లబాట మూసుకునిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కంపెనీ ప్రతినిధులు, రైతులతో మాట్లాడి పొలాల్లో బళ్లబాటకు ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి పరిష్కరిస్తాం. – కె.శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ వల్ల బళ్లబాట సమస్య, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. నేను రైతును తోటి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హమీ ఇచ్చిన కంపెనీ యజమాని నిర్మాణం పూర్తి దశలో మీకు చేతనైంది చేసుకోండి అంటూ అహకారంతో చిన్న చూపుతో మాట్లాడుతున్నాడు. కంపెనీ ముందు ఉన్న సాగునీటి కాలువ మీద సిమెంటు తూము వేసి పూడ్చివేయటంతో సాగునీటి సమస్య ఏర్పడింది. రైతుల వాహనాలు, పంట ఉత్పత్తులు రాకపోకలు సాగించే బళ్లబాటకు ఆటంకం కలిగించే విధంగా ప్రహరీ నిర్మిస్తుండటంతో సుమారు 600ఎకరాల్లోని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – శరణం మల్లికార్జునరావు, రైతు, చేబ్రోలు -
జాతీయ ఈత పోటీలకు టెక్నికల్ అధికారిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్ కోచ్గా కొనసాగుతున్న సురేష్ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్లో సురేష్కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్ దాస్ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్, బాపట్ల రూరల్ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఘటనలో.. చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తెనాలి: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. -
క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి
ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్ తదితరాలు పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. ‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అసోసియేషన్ కార్యక్రమాలు సరైన రీతిలో జరగలేదని దానివల్ల పంచాయతీరాజ్శాఖలో జరిగిన పరిపాలన సంస్కరణలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్కు సరైన న్యాయం జరగలేదని పలువురు జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దశాబ్దాలు గా పదోన్నతులు లేక అన్యాయానికి గురైన రికార్డు ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 సంవత్సరాల పైన ఒకే క్యాడర్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు ఒక్క ప్రమోషన్ కూడా లభించకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్ నాన్ టెక్నికల్ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్ చేస్తున్నారని, ఈ ప్రక్రియను వెంటనే ని లుపుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యచరణకు వెళ్లా లని కార్యవర్గంలో తీర్మానించారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి శామ్యూల్ పాల్,ఉద్యోగులు పాల్గొన్నారు. పైపుల వ్యాపారి బలవన్మరణం గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పైపుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఏటుకూరుకు చెందిన ఎ.రాంబాబు(60) గ్రామంలోని బొంతపాడు రోడ్డులో పైపుల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. ఇటీవల వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తన ఆఫీసులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
టెట్పై ప్రభుత్వం స్పందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ 50 ఏళ్లుపైబడి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, పాఠశాలలో అననుకూల పరిస్థితుల మధ్య ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ ఇతర ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఇన్ సర్వీస్ పరీక్ష పెట్టడం తగదన్నారు. ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించడంపై ధ్యాసపెడితే బోధనకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ టెట్ రద్దు కోసం యూటీఎఫ్ చేపట్టే కార్యాచరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన టెట్లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఇబ్బందికరమన్నారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, సాంబశివరావు, ఆంజనేయులు, అడవి శ్రీను, కె. కేదార్నాథ్, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కె.కామాక్షి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణం
గుంటూరు మెడికల్: అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణమే ప్రాణాధారమని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ప్రతి సంవత్సరం అతిసారం వల్ల ఐదు సంవత్సరాల పిల్లల్లో 4.3% మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. డయేరియా నివారణకు ముందస్తు గుర్తింపు, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రల వినియోగం ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చన్నారు. అతిసార వ్యాధి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం స్టాప్ – డయేరియా క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. డయేరియా నివారణకు పరిశుభ్రత ఓఆర్ఎస్ పాకెట్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 15 వ తేదీ వరకు సన్నద్ధత దశ అని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 31 వ తేదీ వరకు కార్యాచరణ దశ అన్నారు. జూన్ 16 వ తేదీ నుంచి జరిగే కార్యాచరణ దశలో భాగంగా చంటి బిడ్డలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించుట, రోటా వైరస్ వ్యాక్సిన్ అందజేయుట, చేతుల పరిశుభ్రత, రక్షిత తాగునీరు అందజేయుట, ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్, జింకు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1,45,000 మంది ఐదేళ్లలోపు చంటిబిడ్డలకు అందజేయుటకు 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ టాబ్లెట్లు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. -
2004 ఎన్నికల ముందు కేసుల సంగతేంటి?
తెనాలి: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ తెనాలిలో భారీగా విజయవంతం కావటంతో బెంబేలెత్తిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో తనను అహంకారిగా వ్యాఖ్యనించటాన్ని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఖండించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి శివకుమార్ మాట్లాడారు. హైదరాబాద్లో ఉంటున్న తెనాలికి చెందిన వ్యక్తి ఎన్నికలకు ముందుగానే ఇక్కడకు వచ్చి జనసేన/టీడీపీకి ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్ సమయంలో తనను అసభ్యంగా మాట్లాడటంతో ఇష్యూ జరిగిందని చెబుతూ ‘అదంతా నీవల్లే జరిగింది... ఆర్గనైజ్డ్గా చేయించావు’ అని మనోహర్ను ఉద్దేశించి అన్నారు. అయినా తాను కేసు పెట్టలేదని గుర్తుచేశారు. అదే తన అహంకారమైతే ఎన్నికల ముందు మనోహర్పై ఏడు కేసులు ఉన్నాయని, అవన్నీ 2004 ఎన్నికల అఫిడవిట్లో ఆయనే స్వయంగా ప్రకటించినట్టు ఆ పత్రాలను చూపారు. అందులో 420తో సహా సేవాట్రస్ట్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాల కోసం ఆడపిల్లల్ని నిర్బంధించటమనే 372–కే సెక్షన్ కూడా ఉందని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు కరపత్రాలను కూడా పంచారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంజాయి వీధివీధినా దొరికిందన్న మనోహర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘ఇప్పుడు నీ హయాంలో గంజాయితో పాటు డ్రగ్స్, న్యూడ్కాల్స్ సెంటర్ నడిచాయి’ అని చెప్పారు. హామీలు అమలు చేయలేని మంత్రి ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ ద్వారా తెనాలి ప్రజలకు ఇప్పించిన హామీలను మంత్రి హోదాలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎందుకు అమలు చేయటం లేదని శివకుమార్ ప్రశ్నించారు. కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్డ్యామ్ నిర్మిస్తామని, వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెనాలిలో పంటకాలువలను లాస్వెగాస్లా సుందరీకరిస్తామని హామీలనిచ్చినట్టు నాటి వీడియోను ప్రదర్శిస్తూ చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆరంభించి యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని కూడా గుర్తు చేశారు. తెనాలి– విజయవాడ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మనోహర్ చెప్పారని వివరించారు. ఆ హామీల ప్రతిపాదనలున్నా చూపాలని డిమాండ్ చేశారు. తెనాలి వచ్చినప్పుడు పంటకాలువల వెంట తిరుగుతూ అధికారులు తన మాట వినటం లేదని మనోహర్ అనటాన్ని ఏమనాలని శివకుమార్ ప్రశ్నించారు. సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్ సీపీ హయాంలో ఎమ్మెల్యేగా తాను రూ.1800 కోట్ల సంక్షేమంతో పాటు 26 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు. 170 రోడ్లు నిర్మించానని గుర్తుచేశారు. మార్కెట్ ధర లేనపుడు జొన్న/మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పే మంత్రి మనోహర్, గత రబీలో జొన్న, మొక్కజొన్న ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ న్యాయవాదులు చింకా సురేష్చంద్ర యాదవ్, మైలా విజయ్నాయుడు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వర్లు, కాకి దేవసహాయం, కొర్ర యశోద, కొంగర రాగమంజరి, షేక్ జకీరా, ఎం.ఇందిరా ప్రియదర్శిని, సిద్దాబత్తుని శాంతి, నీలి అజయ్, మల్లెబోయిన రాము, యలవర్తి సాంబశివరావు, ఉన్నం అనీష్, పొట్లూరి అశోక్, పల్లె రోహిత్శామ్యూల్, పిల్లి వీరయ్య, యాతాటి అనిల్, కాళిదాసు సత్యం, చుక్కా ఆనంద్, అక్కిదాసు కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత ఉర్దూ శిక్షణ
పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్ కళాశాలలో డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్ బ్లాక్ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో ఎస్బీఐలో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొన్నప్పుడు ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కడంతోపాటు మంచి ఆరోగ్యం కూడా సొంతం అవుతుందని నా నమ్మకం. -
విజ్ఞాన్లో ఘనంగా ఆన్లైన్ ‘వాక్స్–2026’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విజ్ఞాన్ ఆన్లైన్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక వార్షిక విద్యార్థుల సమావేశం ‘వాక్స్–2026’ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 180 మంది ఆన్లైన్ విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు హాజరై విద్య, విజయాలు, పరస్పర అనుబంధాలను వేడుకగా జరుపుకున్నారు. వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిశోర్ మాట్లాడుతూ ఆన్లైన్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ వార్షిక సమావేశం ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై బ్యాచ్ల టాపర్లను సత్కరించారు. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
మంగళగిరి టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతోనే సాధ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహర్షి పతంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యోగా సాధన పట్ల ఆసక్తిని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని కోరారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా, డీఎంహెచ్ఓ శాఖ అధికారులు, యోగా శిక్షకులు, సాధకులు, మహిళ, యువత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
సహజ సంపదలను కొల్లగొడుతూ అక్రమార్జనకు అలవాటు పడ్డ పెదకూరపాడు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ఏమాత్రం పట్టించుకోకుండా నదీగర్భాన్ని చీల్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకాసురులు బరితెగించి దోచుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత విర్రవీగిపోతున్నారు. సాక్షి కథనానికి స్పందించి ఇసుక రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా దారికి గాడి కొట్టిన అఽధికారులు సాక్షి, నరసరావుపేట: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కృష్ణా తీరంలో ‘మాన్సూన్ హాలీడే’ జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉండటంతో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులోకి వచ్చింది. వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. నది జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం. అచ్చంపేట, అమరావతి మండలాల్లో జూన్ 1, 2వ తేదీలలో సైతం రాత్రీపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్న ఫొటోలతో ‘సాక్షి’ పత్రికలో జూన్ 3వ తేదీన ‘చెలరేగిపోతున్న ఇసుకాసురులు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందించి చర్యలకు ప్రారంభించారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి మండలం పొందుగల ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా గాడి కొట్టించారు. రీచ్లలో ఇసుక రవాణా జరిపేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. గాడి పూడ్చి అక్రమ రవాణా... ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా అధికారులు కొట్టిన గాడిని మాఫియా పూడ్చివేసింది. గత రెండు రోజులుగా చింతపల్లి, పొందుగల–2 రీచ్లలోకి నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పంపి తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు దారికి గాడి కొట్టిన తరువాత నది సమీపంలో భారీ యంత్రాలను అక్కడ నుంచి పంపేయాలి. వాటిని అక్కడే ఉంచడంతో రాత్రిపూట, సెలవు రోజుల్లో గాడిని పూడ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నా మైనింగ్, ఇరిగేషన్, పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్నా అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అడ్డుకుంటాం... పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇసుక రీచ్లలోకి వాహనాలు వెళ్లకుండా కొట్టిన గాడిని పూడ్చి ఇసుక రవాణా చేయడంపై పల్నాడు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ నాగయ్యను వివరణ కోరగా... గాడిని పూడ్చి ఇసుక తరలిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. అచ్చంపేట, అమరావతి మండలాల తహసీల్దార్లను ఇసుక తరలింపును అడ్డుకోమని ఆదేశిస్తానని తెలిపారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదన్నారు. టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, వారు అక్రమ రవాణాను అడ్డుకుంటారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించాలి. ఈ టాస్క్ఫోర్స్ టీంలో మైనింగ్, రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్, రవాణా శాఖల అధికారులు ఉంటూ కృష్ణానది తీరప్రాంతాల్లో నిఘా ఉంచాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇవేవీ పెదకూరపాడు నియోజకవర్గంలో జరగడం లేదు. అచ్చంపేట, అమరాతి మండలాల్లో నిషేధ సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా టాస్క్ఫోర్స్ టీం స్పందించి అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకోవడం లేదు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
రూ. ఐదు వేల నగదు, కారు స్వాధీనం తెనాలిరూరల్: పట్టపగలు ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం నిందితుడు కారులో పరారయ్యాడన్న ఆధారంతో సాంకేతికతను వినియోగించి అరెస్ట్ చేయడం గమనార్హం. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంతో సీఐ నాయబ్ రసూల్ శనివారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని హాఫ్ఫేట గ్రామానికి చెందిన రెడ్డి వెంకట రవికిరణ్ తన తల్లి లక్ష్మీసామ్రాజ్యంను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. 11.50 గంటల సమయంలో అతని రెండో అక్క తోటకూర సామ్రాజ్యం ఫోన్ చేసి ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చాడని, తనను చూసి వేగంగా వెళ్లి సమీపంలో ఉన్న తెల్ల కారులో పరారయ్యాడని చెప్పింది. రవికిరణ్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 25 వేలు అపహరించుకెళ్లాడు. ఇదే విషయాన్ని రవికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైన సమయంలో ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి కారు నంబరును గుర్తించగలిగారు. సాంకేతికతను వినియోగించి కారు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కారు విజయవాడ నుంచి తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి నందివెలుగు ప్రధాన జంక్షన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం మదుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. నిందితుడి నుండి రూ.ఐదు వేల నగదు, కారును స్వాధీన పర్చుకున్నారు. నిందితుడిపై తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు ఉన్నాయని, మరో 20 కేసులు కోర్టు కొట్టివేసిందని సీఐ తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితుడిని అతి త్వరగా అరెస్ట్ చేసిన ఎస్ఐ ఆనంద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32.92 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ.. -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు. -
పాఠశాల హెచ్ఎంకు సంజాయిషీ నోటీసు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గుంటూరు కొరిటెపాడులోని ఆర్సీఎం పాఠశాలలో విద్యార్థినులు చీపుర్లు పట్టుకుని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సంఘటనపై ‘చిట్టి తల్లులకు చీపురు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురించిన వార్తకు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జరిగిన సంఘటనపై ఎంఈవోతో విచారణ జరిపించామని, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థినులు పాఠశాలను పరిశుభ్రం చేశారని తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సంజాయిషీ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా చూడాలని ఆదేశించామని చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 4,040 సీట్లకు కౌన్సెలింగ్ నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికవ్వగా, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నుంచి 188 మంది ఎంపికవగా, బాపట్ల జిల్లా నుంచి 120, గుంటూరు జిల్లా నుంచి 79 మంది ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని భవిరెడ్డి దివ్యతేజశ్రీ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 517.30 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలు మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గుంటూరు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 20267ర్యాలీలో పార్టీ గుంటూరు అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పోతిన మహేష్, శ్యామలప్రత్తిపాడులో జరిగిన నిరసన ర్యాలీలో బలసాని, పార్టీ శ్రేణులు పొన్నూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నాయకులు రెండేళ్ల మోసాలపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ నిరసన గళం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజాగ్రహ జ్వాల రేగింది. పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులువిజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. మరోవైపు రాజధాని జిల్లాలో నిరసనలకు ప్రజలు రాలేదని చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. గతం వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం నాయకులు దహనం చేస్తుంటే దగ్గరుండి కాపలా కాసిన పోలీసులే... ఈరోజు డీఎస్సీ దిష్టిబొమ్మను తగులబెట్టకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్తిపాడులో ఎస్ఐ నరహరి ఓవరాక్షన్ చేసి తగలబడుతున్న దిష్టిబొమ్మను కార్యకర్తల మీదకు వేయడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. -
నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది. ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ బాధ్యతల స్వీకారం తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అభిషేక్ కుమార్ అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్లోని ఆయన చాంబర్ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత ఏపీ సీఆర్డీయే ఆఫీస్ మేనేజ్మెంట్ విభాగ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస్, కమ్యూనికేషన్న్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అభిషేక్ కుమార్కి ఏపీ సీఆర్డీయేలోని పలు విభాగాల ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నేటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులు గుంటూరు వెస్ట్: చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే చట్టరీత్యా నేరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీతో పాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చిన్నారులందరూ విధిగా పాఠశాలలకు వెళ్ళి విద్యనభ్యసించాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు ఉప కార్మిక శాఖ కమీషనర్ ఎ.గాయత్రీ దేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో మూడేళ్లుగా బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి వైద్యులు పునర్జన్మిచ్చారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేసి యువకుడికి నూతన జీవితం ప్రసాదించారు. వివరాలు.. గుంటూరు శారదాకాలనీ 25వలైనుకు చెందిన గుండిమెడ వేద ప్రకాష్, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిందట గుండె జబ్బు సోకింది. 2023 మార్చిలో తీవ్రమైన ఛాతీనొప్పి, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ట్కు అరెస్టు సంభవించింది. వైద్యులు తక్షణమే కార్డియో పల్మనరీ రీసెర్చ్స్టేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడారు. కార్డియాక్ట్ ఎమ్మారై పరీక్షలో గుండె ఎడమ జటరిక తీవ్రంగా బలహీన పడినట్లు, గుండె పంపింగ్ సామర్ధ్యం 30 నుంచి 35 మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త ప్రవాహం మందగించినట్లు గుర్తించి 2024 మే నెలలో ఆటోమ్యాటెడ్ ఇంప్లాంట్బుల్ కార్డియో వర్కర్ ట్యూబ్లర్ (ఏఐసీడీ) పరికరాన్ని వేద ప్రకాష్కు అమర్చామన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా గుండె పనితీరు మెరుగు పడలేదని, గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించామని వివరించారు. విజయవాడ మాచవరానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతూ అవయవదానం చేయగా ఆ యువకుడి గుండెను వేద ప్రకాష్కు మే 26న అమర్చి విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేశామన్నారు. వేద ప్రకాష్ మాట్లాడుతూ తనకు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మిచ్చారని చెప్పారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హార్ట్ ఫెల్యూర్తో బాధపడేవారికి నేడు అత్యాధునిక వైద్య చికిత్సలు వచ్చాయన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, హాస్పిటల్ చైర్మన్ ఎంఎస్ రామోహన్రావు, మెడికల్ డైరెక్టర్ రవికాంత్, వైద్యులు నవీన్, కృష్ణ, రామారావు, మృత్యుంజయకుమార్, శ్రీకాంత్, అశోక్కుమార్, శివప్రసాద్, జయరామ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం
గుంటూరు రూరల్: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్, ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ బోర్డు చైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని కోరారు. -
అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా!
నెహ్రూ నగర్: డీఎస్సీ రాత పరీక్ష లేకుండానే క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయులను నియమించడం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీఓ నంబరు 4, 47 ద్వారా రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ప్రతిభ ఆధారంగా 421 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేపట్టిందని తెలిపారు. అస్మదీయులకు దొడ్డిదారిన 382 మందికి క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరి అని, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని, నకిలీ లేదా వివాదస్పద సర్టిఫికెట్లపై పూర్తి పరిశీలన జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. అన్ని క్రీడలకు సమాన అవకాశాలు లభించాయా అనేది ప్రశ్నార్థకమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి బోధనా నైపుణ్యం కూడా అవసరమని, కేవలం ఆటల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి నియామకాలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత కరువైందని, ఇది వ్యవస్థాకత కుంభకోణమని అభివర్ణించారు. రాత పరీక్ష లేకుండా 382 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలు పూర్తయిన వెంటనే భవిష్యత్లో రాత పరీక్షల ఆధారంగానే స్పోర్ట్స్ కోటా నియామకాలు జరపాలని ఉత్తర్వులు ఇవ్వడం తమ తప్పులను సరిదిద్దుకోవడానికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు. -
నిరసనపై పోలీస్ జులుం
ప్రత్తిపాడు: ౖవెఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే పేరుతో మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల వైపు ఎస్ఐ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించారు. వివరాలు.. ప్రత్తిపాడులో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బస్టాండు సెంటరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులు డీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేసి, చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రత్తిపాడు ఎస్ఐ ఎన్.నరహరి మంటల్లో దహనమవుతున్న దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. అంతటితో ఆగకుండా మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని గుంపుగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల వైపు దూసుకొచ్చారు. ఎస్ఐ చేతిలో ఉన్న దిష్టిబొమ్మను లాక్కుని కింద పడేసేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలానికి చెందిన పార్టీ నాయకుడు రాంబాబు చేయికి అంటుకుని బొబ్బలు రావడంతో పాటు చొక్కాకు నిప్పు అంటుకుంది. అదే విధంగా గుంటూరు రూరల్ మండలానికి చెందిన లక్ష్మి చీరకు కూడా మంటలు అంటుకోవడంతో చీర కాలిపోయింది. పార్టీ శ్రేణులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అత్యంత దుర్మార్గంగా ఎస్ఐ తీరు.. ప్రత్తిపాడు ఎస్ఐ తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో పాతమద్రాసు రోడ్డుపై వైఎస్సార్ కాంస్య విగ్రహం ఎదుట బైఠాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం.. పోలీసుల జులుం నశించాలి.. డౌన్ డౌన్ పోలీస్.. ఉయ్వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు కిరణ్కుమార్ వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ పోలీసులు ఇంత సెన్స్లెస్గా చేసిన పని వలన ఒక నాయకుడికి చేయి కాలిందని, మరో మహిళా నాయకురాలికి చీర కాలిందని, పొరబాటున ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే బాధ్యులు ఎవ్వరని ప్రశ్నించారు. ఎస్ఐ నరహరి అసభ్య పదజాలంతో పార్టీ నాయకులు, శ్రేణులను దూషించడం బాధాకరమన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఎస్ఐపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బలసాని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ మాట్లాడుతూ ఏమైనా తప్పు జరిగితే పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలే గానీ, ఇలా హత్యా ప్రయత్నం చేయడం ఏమటని ఎస్ఐ నరహరిని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా అని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించాలంటూ.. అంతకుముందు కూడా ప్రత్తిపాడు ఎస్ఐ గ్రామంలో రోడ్డుపై కట్టిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ హడావుడి చేశారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులో విద్యుత్ స్తంభాలకు చిన్న చిన్న కట్టడంతో అసలు ఎవరిని అడిగి కట్టారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. ఆ సమయంలోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
పరీక్ష నోటిఫికేషన్లతో విద్యార్థుల్లో అయోమయం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారులు పరీక్షల నిర్వహణ తేదీల నోటిపికేషన్ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇవ్వకుండానే రెండవ సెమిస్టర్ పరీక్షల తేదిలను ప్రకటించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ ఆరు రోజులపాటు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. పరీక్షలు జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా పరీక్ష ఫలితాలు ప్రకటించని వర్సిటీ అధికారులు 2026 మే 20వ తేదీ నుండి 23 వరకూ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బీఈడీ కళాశాలల నిర్వాహకులు జోక్యంతో ఆ పరీక్షల తేదీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. అదే రెండవ సెమిస్టర్ పరీక్షలను జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకూ నిర్వహిస్తున్నట్లు మే 2వ తేదీన ప్రకటన చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం సెమిస్టర్కి మరొక సెమిస్టర్కు మద్య కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. వర్సిటీ అధికారులు ఇటీవల ప్రకటిస్తున్న పరీక్షల తేదీలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్ల సిలబస్ పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరీక్షలకు వర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి దాదాపు 6000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికై నా వర్సిటీ ఉన్నతాధికారులు విద్యార్థుల భవిష్యత్ను, ఇబ్బందులను దృష్టి పెట్టుకుని పరీక్ష తేదీలను ఖరారు చేయాలని, పరీక్ష నిర్వహణ గడుపు పొడిగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఎన్యూ పరిధిలోని పలు కళాశాలల నిర్వాహకులు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి డీఆర్వో షేఖ్ ఖాజావలి గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఏపీఎం సోమశేఖర్కు రిమాండ్ కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
నాలుక కోస్తాం..
పిల్లి కూతలు కూస్తే .. గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్పీఎస్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో చుక్కలు
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. సన్నాహాక కార్యక్రమంలో భాగంగా గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆమె.. మాట్లాడుతూ ఈ నెల 28 బూత్ స్థాయిలో, 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వెల్లడించారు. సుమారు 1,49,054 మంది 0 నుండి 5 ఏళ్ల పిల్లలు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 12,899 పోలియో వ్యాక్సిన్ వైల్స్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 584 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు , డబ్ల్యుహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ జి.భవాని, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సురేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి, డీపీవో సైమన్, సూపర్వైజర్ శాస్త్రి పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్య మిథ్యే
నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల్లో సేదదీరి తిరిగి వచ్చే విద్యార్థులకు టీడీపీ సర్కారు తీరుతో తీవ్ర నిరాశే మిగలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా పంపిణీ చేయాల్సిప విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ను సిద్ధం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చతికిలపడింది. అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. స్టూడెంట్ కిట్తోపాటు ఇవ్వాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాల పంపిణీకే పరిమితం కానుంది. గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లో భాగంగా పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయాలి. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల రోజులకుపైగానే పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగలా విద్యాకానుక పంపిణీ నిర్వహించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం గుంటూరు జిల్లాలోని 18 మండలాల పరిధిలో 89,157 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇవ్వనున్నారు. కిట్లో భాగంగా అందించే పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు బుక్స్, వర్క్బుక్స్, బ్యాగులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, పిక్టోరియల్ డిక్షనరీలు రావాల్సి ఉంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. వైఎస్ జగన్ చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన గత వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య 1,730 జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 3.49 లక్షలు ప్రభుత్వ బడుల సంఖ్య 1,074 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 89,157 ప్రైవేటు పాఠశాలల సంఖ్య 656 ప్రైవేటు బడులలోని విద్యార్థుల సంఖ్య 2,60,354 ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్యపుస్తకాలు: 15,26,181 -
నాడు–నేడు పనులపై నిర్లక్ష్యం
2014–19 మధ్య టీడీపీ పాలనలో సమస్యలతో కునారిల్లిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన వైఎస్సార్సీపీ సర్కారు నాడు–నేడు ద్వారా సకల వసతులతో పాఠశాలలను ఆధునికీకరించింది. ఈ విధంగా నాడు–నేడు మొదటి దశలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్లతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 పాఠశాలలను రూ.202 కోట్లతో 10 కాంపొనెంట్ల వారీగా చేపట్టిన పనులు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన 600 తరగతి గదుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే నాడు–నేడు పనులను అటకెక్కించింది. ఒక్కో పాఠశాలకు కేవలం రూ.ఐదు లక్షలు ఖర్చు పెడితే పూర్తయ్యే అవకాశమున్నచోట సైతం పట్టించుకోలేదు. అదనపు తరగతి గదులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకపోవడంతో సివిల్ పనులు మధ్యలోనే అగిపోయాయి. నాడు–నేడు మొదటి దశలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం పంపిణీ చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక, వినియోగంచకుండా పక్కన పడేశారు. రెండో దశలో పాఠశాలలకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా రెండేళ్ల కూటమి పాలనలో కరువైంది. -
వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలోఊదరగొట్టి తర్వాత హామీలు అమలు చేయకపోవడం ఆయన నైజమని మరోసారి తేలింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెనాలి, పొన్నూరు, గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు సభలతోపాటు బీసీ ఘర్జనలో పాల్గొన్ని సూపర్ సిక్స్ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూపర్సిక్స్ పథకాల గురించి తమ అనుకూల పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. మంత్రి అనుమతితోనే కేసులు గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లోకేష్ అండ్ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి గుంటూరు జిల్లాలో నడుస్తోంది. ముఖ్యంగా సోషల్మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్ మీడియా కేసులు, వైఎస్సార్సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారలేదు. చినబాబు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక దాడులు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడున్నర గంటలసేపు చేసిన దౌర్జన్యం, హింసాకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో కూటమిలోని ఇతర పార్టీ నేతలతోపాటు ముఖ్యంగా కాపు సామాజికవర్గం వారిపై జరుగుతున్న దాడులతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పేరుకే పథకాలు తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15 వేలు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల తాలూకు డబ్బులు జమ కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నా ఇప్పటికీ సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా అరకొర మాత్రమే ఉన్నాయి. కొత్త బస్సులు లేవు. దీనివల్ల మహిళా ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. యువతకు అన్యాయం ‘యువతకు ఉపాధి కల్పిస్తాం. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ’ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే భృతి కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పాలన సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం... మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చింది. గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై అడుగు ముందుకు పడలేదు. ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామంటూ’ గుంటూరు పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ ఆస్తులు, అంజుమన్ ఆస్తులను ఏపీఐఐసీకి ధారాదత్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. నగరం నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని కూడా తక్కువ నిధులు వచ్చాయని ఫ్లైఓవర్ బదులుగా మళ్లీ బ్రిడ్జినే కడుతూ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలను రోడ్డున పడేశారు. ఈ రెండేళ్లలో తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. గుంటూరు చానల్, కొండవీటి వాగుల వల్ల పూర్తిగా మునిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి రాజ్యమేలుతోంది. భూములు ఇవ్వని రైతులను వేధిస్తుండటంతో వారందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు రెండోవిడత భూసమీకరణను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. -
రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి
గుంటూరు వెస్ట్: రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతివారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ్ , కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలసి రాజధాని భూసేకరణ గురించి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాల గురించి చర్చించారు. భూసేకరణ ప్రక్రియలోని ప్రతి అంశానికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్న్డ్ భూములు, పట్టా భూములు విషయంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ సర్వే విషయంలో సంయుక్త తనిఖీలు త్వరగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, సీఆర్డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ అత్యంత కీలకం ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం రాత్రి కలక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ


