breaking news
Guntur District Latest News
-
16న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
తాడికొండ: అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ పనులను శనివారం మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని, స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నెల 16న అమరజీవి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయనున్నామన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి స్మృతివనం పరిశీలించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -
కుటుంబంలో సప్త స్వరాలు
సప్త స్వరాలకు జీవన పయనానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. మాది సంప్రదాయ సంగీత కుటంబం. అమ్మ లలితకు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆమె వీణ, వయోలిన్, గాత్రంలో అద్భుత ప్రతిభాపాటవాలు పొందారు. ఇప్పటికీ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పిస్తుంటారు. ఆమె స్ఫూర్తితో నేను వయోలిన్, వీణ, గాత్రంలో మూడు డిప్లమోలు పూర్తి చేశాను. నేను, అక్క సరస్వతి విఘ్ణుభట్ల సంగీత సిస్టర్స్గా పేరుగాంచాం. నా కుమార్తె ఐఐఎంలో ఎంబీఏ చేసినా సంగీతంలో అద్భుతమైన పట్టు ఉంది. సంగీతం మాకు అద్భుత జీవితాలను ప్రసాదించిందంటే అతిశయోక్తి కాదు. దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు చేసిన సాధన ఎంతో ఉపకరించింది. ముఖ్యంగా మేము రాణించడంలో ప్రతిభతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సీ్త్ర ఒక్క విషయం గుర్తించాలని నా మనవి. స్వేచ్ఛ పేరుతో చేసే విశృంఖలం ఎప్పటికీ మంచిది కాదు. అది చివరకు తననే దహిస్తుంది. సమాజంలో చులకన చేస్తుంది. నిత్యం గమనించుకుంటూ ముందుకు సాగాల్సిందే. తెలీక జరిగిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళపైనే ఉంటుంది. –కృష్ణవేణి విష్ణుభట్ల, ప్రిన్సిపల్, డాక్టర్ బాలమురళీకృష్ణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్, గుంటూరు. -
తల్లిని ఇంటినుంచి గెంటేసిన కూతురు
భర్తతో కలిసి తల్లి ఇంటిని ఫోర్జరీ పత్రాలతో స్వాధీనం మంగళగిరి టౌన్: మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికి మాయని మచ్చలా నిలుస్తున్నాయి. చివరకు కని, పెంచి ప్రయోజకులను చేసిన కన్నవారి పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్న వైనం మనసులను కకావికలం చేస్తోంది. వృద్ధాప్యంలో కాస్తంత ఆదరవుగా ఉండి, ఆశ్రయం ఇవ్వాల్సిన కుమార్తె తన భర్తతో కలిసి ఫోర్జరీ సంతకాలతో కన్నతల్లిని మోసం చేసి ఇంటిని తనపేరిట రాయించుకుని ఆమెను ఇంటినుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన మంగళగిరి మండలం నిడమర్రులో శనివారం జరిగింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు. కొన్ని నెలల క్రితం చిన్న కూతురు, అల్లుడు ఆదిలక్ష్మి ఇంటికి వచ్చి, ఆమెతోపాటు ఉంటూ ఆదిలక్ష్మి ఉంటున్న ఇంటిని ఫోర్జరీ పత్రాలతో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. శనివారం వృద్ధురాలిని ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడంతో మంగళగిరి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. వృద్ధురాలు ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమార్తెను, అల్లుడిని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. -
రేపటి నుంచి ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఏఎన్యూ(పెదకాకాని): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ మార్చి 9, 10 తేదీలలో బాలికలకు, 12,13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందన్నారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిలిపివేత
వేజండ్ల(చేబ్రోలు): మండలంలోని వేజండ్ల గ్రామంలో శుక్రవారం డొంకరోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్పై ‘డొంకనూ దోచేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితం కావటంతో తవ్వకాలు నిలిపివేశారు. వేజండ్ల జడ్పీ హైస్కూల్ పక్కన ఉన్న ప్రభల డొంక రోడ్డును యంత్రాలతో తవ్వకాలు చేసి అధికార పార్టీ నాయకులు ఎర్ర గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకోవటంపై విమర్శలు వచ్చాయి. శనివారం ఉదయం పెద్ద పెద్ద యంత్రాలతో స్థానిక నాయకులు రెండో రోజు తవ్వకాలు మొదలు పెట్టారు. స్థానికులు, గ్రామస్తులు రెవెన్యూ, పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఈఓపీఆర్డీ ఎం.రవిశంకర్ల ఆదేశాలతో డొంక రోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ను నిలుపుదల చేశారు. -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
గుంటూరు రూరల్: గుంటూరు నగరంలోని స్వర్ణభారతినగర్ ఇద్వానగర్ కాలనీలో శనివారం కార్డన్సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ప్రజల భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెగా కార్డన్ డేగా ప్రకటించి ఒకేసారి విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గంజాయి విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే ఏపీ కాల్ సెంటర్ నంబర్ – 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ -
అన్నింటా ఇంతింతై..!
● రాణిస్తున్న మహిళామణులు ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుంటూరు వెస్ట్: ప్రముఖ దర్శకుడు బాపు ఒకాకొన సందర్భంలో సీ్త్ర గురించి చెప్పమన్నప్పుడు సీ్త్ర, పురుషుడు సమానమే. అయితే సీ్త్ర కొంచెం ఎక్కువ సమానం అంటూ మహిళల పట్ల ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. సీ్త్ర, పురుషుడు సమానమా... అయితే ఎలా అవుతారు. అల్లారు ముద్దుగా పెంచిన ఇంటిని, తన పరివారాన్ని ఒక్క బంధం కోసం వదులుకుని సర్వస్వం త్యాగం చేయడంలోనా... సీ్త్ర తన ప్రాణాలను పలుమార్లు ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనివ్వడంలోనా. రక్త మాంసాలు పాలుగా మార్చి పిల్లలను పెంచుతూ మురిసిపోవడంలోనా... బిడ్డల్ని పెంచే క్రమంలో తన ఆకారాన్ని పూర్తిగా కోల్పోవడంతోపాటు ఎన్నో సంతోషాలను ఫణంగా పెట్టడంలోనా. దేన్లో పురుషుడికి సీ్త్ర సమానం. సీ్త్ర అన్నింట్లోనే అగ్రగణ్యమే వహిస్తుంది. అందుకే భగవంతుడు తనకు మారుగా ప్రతి ఇంటిలోనూ సీ్త్రని పుట్టించాడంటారు. ఆమెను ఆదిపరాశక్తిగా మన సమాజం పూజిస్తోంది. చిన్న చిన్న సంఘటనలు ఎన్ని జరిగినా సీ్త్ర ఔన్నత్యం దేదీప్యమానంగా పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఆధునిక సమాజంలో సీ్త్ర పాత్ర కాలాణుగుణంగా మారుతూ వస్తుంది. ఇంటా బయటా ఆమె పాత్ర ఎంత చెప్పినా తక్కువే. అణువు నుంచి ఆకాశం వరకు మహిళలు దూసుకుపోతున్నారు. మహిళలు ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వెనుకడుగు వేయడంలేదు. ప్రతి మనిషికి అవరోధాలు తప్పవు. దాని కోసం భవిష్యత్తును ఫణంగా పెట్టకూడదనే భావనతో రాణిస్తున్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తూ, సహచర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న కొందరు అధికారుల అభిప్రాయాలు.... -
దయతో వైద్య సేవలందించాలి
గుంటూరు మెడికల్: వైద్యులు దయతో రోగులకు వైద్య సేవలందించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఎంబీబీఎస్ 2020 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యూయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ● వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య వృత్తి చాలా ఉన్నతమైందని, సేవ చేసే అవకాశం వైద్యులకే దక్కుతోందన్నారు. మంచిగా సేవ చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. గతేడాది గుంటూరు రూరల్ మండలంలో మెలోడేస్ మరణాలు సంభవించాయని, మంత్రి పెమ్మసాని చెప్పారు. అలాంటి మరణాలను కేస్ స్టడీగా తీసుకుని పరిశోధనలు చేయవచ్చన్నారు. ● వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి మాట్లాడుతూ డాక్టర్ పట్టా పొందడం విజయం కాదని, ఇది విజయానికి ప్రారంభమని చెప్పారు. వైద్యులుగా వృత్తిలో రాణించాలంటే విలువలు పాటించాలని, నిజాయితీగా, హుందాగా ఉండాలని, క్యారెక్టర్ పెంపొందించుకోవాలన్నారు. డాలర్స్ కోసం పరుగులు తీయవద్దని, కుటుంబ సభ్యుల మాదిరిగా రోగులను ఆదరించాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్శ్రీధర్, జింకానా కో ఆర్డినేటర్ డాక్టర్ పి.వి.హనుమంతరావు పాల్గొన్నారు. మధుర క్షణాలతో కళ్లు మెరిశాయి ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా అందుకునే ఆనందంతో పలువురు వైద్య విద్యార్థులు వేడుకలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డాక్టర్ డిగ్రీ పట్టాలు చేతికి అందిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు, బంధువుల కళ్లు ఆనంద భాష్పాలతో మెరిశాయి. ఆ మధుర సన్నివేశాలను చిత్రీకరించేందుకు పలువురు కెమెరాలు తీసుకుని పోటీ పడ్డారు. కళాశాల అంతా గ్రాడ్యుయేషన్ డే కోర్టులు ధరించి కలియతిరిగి వైద్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన కళాశాల బోధనా సిబ్బందితో జీవితాంతం గుర్తుండేలా డిగ్రీ పట్టాలు అందుకున్న 250 మంది వైద్య విద్యార్థులు గ్రూఫ్ ఫొటోలు దిగారు. పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశోధనల వైపు దృష్టి సారించాలి ఘనంగా గుంటూరు వైద్య కళాశాల 2020 బ్యాచ్ గ్రాడ్యూయేషన్ డే వేడుకలు -
సమాజాభివృద్ధిలో కీలకంగా మారిన మహిళలు
గుంటూరుఎడ్యుకేషన్: సమాజాభివృద్ధిలో మహిళలు కీలకంగా మారారని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం గర్వకారణమని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళ్ళగలుగుతున్నారంటే అది వారికున్న ఆత్మ విశ్వాసమన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారు. మైహోం గ్రూప్స్ అధినేత శ్రీమాన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ఆంజనేయుని అనుగ్రహాన్ని, శ్రీస్వామి వారి మంగళశాసనాలని పొందారని పేర్కొన్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరేరామనామ సంకీర్తన, హనుమద్ పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మంగళగిరి టౌన్: మంగ ళాద్రిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు వటపత్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా, అలంకార ఆస్థాన కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన మేళ్లచెరువు సీతామహాలక్ష్మి వ్యవహరించారు. గుంటూరుఎడ్యుకేషన్: జోన్–3 పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. హెచ్టీటీపీఎస్://డీఈఓగుంటూరుబ్లాగ్స్పాట్.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ప్రకాశంస్కూల్ఈడీయూ.కామ్, హెచ్టీటీపీఎస్://డీఈఓనెల్లూరు.50వెబ్స్.కామ్ లో ఉంచిన సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఈనెల 13లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. -
రూ.1700కోట్ల బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం
నెహ్రూనగర్(గుంటూరు తూర్పు): 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.1700,61,81,065 కోట్ల అంచనాలతో నగర పాలక సంస్థ బడ్జెట్ను ఆమోదించామని స్టాండింగ్ కమిటీ చైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో నగర కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన ప్రియాంబుల్స్, బడ్జెట్ తదితర అంశాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ వివిధ విభాగాధిపతులతో కలిసి విపులంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2026–27 సంవత్సానికి రూ.1700,61,81,065 కోట్ల అంచనాలతో బడ్జెట్ను ఆమోదించామని, ప్రారంభ నిల్వ రూ.774,28,13,058 కోట్లు, జమలు రూ.926,33,68,007 ఉన్నాయన్నారు. నగర పాలక సంస్థ సంపరిధిలోని మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్, క్యాంటీన్లకు సంబంధించి టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించడానికి సవరణలు చేసి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, స్థాయి సంఘ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీ దుర్గ, ముప్పవరపు భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలీషా, ఎస్ఈ జి.వెంకటేశ్వర రావు, ఎంహెచ్ఓ లక్ష్మీ నారాయణ, నగర పాలక సంస్థ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగి ఉండాలి
చేబ్రోలు: నాయకత్వం అనేది కేవలం పదవులు పొందడం మాత్రమే కాకుండా బాధ్యత, విలువలు, నిర్ణయ సామర్థ్యం మరియు ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగి ఉండడమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ వివరించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను గివ్ ఫర్ గెయిన్ – బలమైన, సమగ్ర భవిష్యత్తు కోసం మహిళల సాధికారత అనే ఇతివృత్తంతో నిర్వహించారు. మహిళల విద్య, భద్రత, నాయకత్వ సామర్థ్యం, సంక్షేమం వంటి అంశాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు సమాజం మొత్తం పురోగతి, అభివద్ధి మరియు సౌభాగ్యాన్ని పొందుతుందని ఈ ఇతివృత్తం సారాంశమని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ మాట్లాడుతూ విద్యాసంస్థలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు తమ సామర్థ్యాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ జ్యోత్స్న వినుకొండ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కొర్రపాటి వాణిశ్రీ మాట్లాడుతూ మహిళలు జీవితంలో పంచుకోవడం, సహనం, రాజీ పడటం, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం వంటి విలువలు ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం నిర్వహించిన పోటీలలో గెలుపొందిన అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. డీఆర్డీవో జాయింట్ డైరెక్టర్, సైంటిస్ట్ ఎఫ్ – అనిత పూరి మోహింద్ర, పద్మశ్రీ, నారి శక్తి అవార్డీ, ప్రజ్వల ఫౌండర్ డాక్టర్ సునీత క్రిష్ణన్, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. -
అవరోధాలు అధిగమిస్తే విజయమే
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 2004లో డిగ్రీ పుర్తయిన నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించాను. ఈ క్రమంలో 2009లో వివాహం జరిగింది. అయినా పరీక్షలు రాయడం మానలేదు. వివాహం అయిన తర్వాత కొంత విరామం వచ్చినా కుటుంబం, భర్త సహకారంతో వాటిని అధిగమించడంతో 2010లో అటవీ శాఖాధికారిగా ఎంపికయ్యాను. ఆ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉండడంతో 2011లో రెండు సంవత్సరాల శిక్షణ కోసం నెలల బిడ్డను అమ్మ దగ్గర వదిలి డెహ్రడూన్ వచ్చాను. కఠోర శిక్షణ, కుటుంబం, నెలల బిడ్డ చాలాసార్లు నాతో నేనే పోరాడిన సందర్భాలున్నాయి. అయినా వెనుకడుగు వేయలేదు. మానసిక స్థైర్యంతోనే ముందుకు నడిచాను. ఇంట్లో పనులు నేనే చేసుకుంటాను. ఉద్యోగ బాధ్యతల్ని మరో పక్క చూసుకుంటాను. ముఖ్యంగా మహిళలకు సహనం చాలా ముఖ్యం. సహనంతోనే ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని నా జీవితం నాకు నేర్పింది... ఎం.హిమ శైలజ, జిల్లా అటవీశాఖాధికారిణి, గుంటూరు. -
అంజుమన్ భూములపై చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యే నసీర్
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : అంజుమన్ భూముల విషయంలో ఎమ్మెల్యే నసీర్అహ్మద్కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే నసీర్ తాను ఒక మైనారిటీననే విషయాన్ని మరిచిపోయారని విమర్శించారు. మంగళగిరిలో ఉన్న అంజుమన్ భూములు 71.57 ఎకరాల భూమిని దోచుకునేందుకే ఐటీ పార్క్ అనే నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. ఇప్పటీకే ఎమ్మెల్యే నసీర్, వక్ఫ్బోర్డు చైర్మన్, సీఈవోలను కలిసి ఈ సమస్యపై విన్నవించామని, వేలాది మంది ముస్లిం మైనారిటీలు సంతకాలు పెట్టి ఉన్నతాధికారులను కలిసినా, వారి మనోభావాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చిస్తామన్న ఎమ్మెల్యే ఇప్పటీ వరకు ఎవరితో చర్చించారో చెప్పాలన్నారు. అలాగే మల్లాయిపాలెంలోని 232 ఎకరాలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం అభివృద్ధి అనే పదాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజుమన్ భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
కనుమూరి హాస్పటల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు
గుంటూరు మెడికల్: మోకాలి నొప్పి, ఆస్టియో ఆర్థరైటీస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి గుంటూరులోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ గిరిధర్ బోయపాటి తెలిపారు. గుంటూరులోని ప్రముఖ వైద్య సంస్థ కనుమూరి హాస్పటల్లో డాక్టర్ గిరిధర్ బోయపాటి మాట్లాడుతూ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో ఇటీవల వచ్చిన సాంకేతిక అభివృద్ధి వైద్య రంగంలో కొత్త దశను ప్రారంభమాయ్యయన్నారు. అత్యాధునిక జాన్సన్ అండ్ జాన్సన్ 4వ జనరేషన్ వైలెస్ రోబోటిక్ క్ని రీప్లేస్మెంట్ సిస్టమ్ సహాయంతో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో నూతన సాంకేతికతలు, మెరుగైన శస్త్రచికిత్స పద్ధతులపై అధునాతన శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రోబోటిక్ టెక్నాలజీ గుంటూరుకు తీసుకు రావడం మా లక్ష్యం అన్నారు. రోగులకు తక్కువ నొప్పితో, వేగంగా కోలుకునే అత్యుత్తమ చికిత్సను అందించడం కోసం కనుమూరి హాస్పటల్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. -
నాణ్యమైన మానవ వనరులే కీలకం
మాజీ డీజీపీ మాలకొండయ్య ఏఎన్యూ(పెదకాకాని): నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకమని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత మాజీ డీజీపీ మాలకొండయ్య అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘విద్య– పరిశ్రమల సమ్మేళనం–2026’ శుక్రవారం రెండవరోజుకు చేరింది. ముఖ్యఅతిథిగా మాజీ డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సత్సంబంధాలు అవసరం అన్నారు. అప్పుడే విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించటానికి విద్యార్థులకు ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అధ్యాపకులు ప్రయోగాత్మకంగా బోధన చేయాలని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏఎన్యూ రెక్టార్ ఆచార్య ఆర్. శివరాంప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఏడాది 500 కంపెనీలకు తగ్గకుండా సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలోని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామీజీ మాట్లాడుతూ విద్యార్థులు తమ దృష్టిని లక్ష్యం దిశగా కేంద్రీకరించినప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తారన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పరిశ్రమల ప్రతినిధి సాంబశివరావు మాట్లాడుతూ నేడు చదువు, సంస్కారం రెండుగా విడిపోయాయని, దీనివల్ల సమాజంలో దుష్ఫలితాలు ఎదురవుతున్నాయన్నారు. డ్రోన్ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సమ్మేళనం కన్వీనర్ ఆచార్య పి.పద్మావతి, సంచాలకులు ఆచార్య లింగరాజు, ఆర్ట్స్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, సోషల్ సైన్స్ డీన్, దూరవిద్య సంచాలకులు ఆచార్య వి.వెంకటేశ్వర్లు, అవగాహన ఒప్పందాల కమిటీ సభ్యులు, సీడీసీ డీన్ ఆచార్య వి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనంలో భాగంగా శుక్రవారం వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏఎన్యూ అధికారులు పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. -
కేఎల్యూలో ప్రారంభమైన ‘సురభి’
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్శిటీలో శుక్రవారం సురభి – 2026 యువజన సాంస్కృతికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను వర్శిటీ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ప్రారంభించి మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా యూనివర్శిటీలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 15 వేల మంది పాల్గొంటున్నారని తెలిపారు. వర్శిటీ ప్రధాన కార్యదర్శి కోనేరు శివకాంచనలత మాట్లాడుతూ తొలిరోజు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో చదువు, క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎఎస్ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, ఉత్తమ అధ్యాపకులకు అవార్డులను ప్రదానం చేశారు. తొలి రోజు కార్యక్రమంలో వర్శిటీ ప్రధాన కార్యదర్శి కోనేరు నిఖిల, ప్రోచాన్సలర్లు డాక్టర్ కె.ఎస్. జగన్నాథరావు, డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, సురభి 2026 చైర్ పర్సన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, కన్వీనర్ సాయి విజయ్, వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మత్స్య అవతారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి ఆస్థాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో కోగంటి సునీల్కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా హైదరాబాద్కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన వెంకట శ్రీరామచంద్రశర్మ దంపతులు వ్యవహరించారు. -
9 నుంచి జాతీయ సదస్సు
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ రూసా 2.0 సౌజన్యంతో నెక్ట్స్ జనరేషన్ డ్రగ్ డిస్కవరీ లెవరేజింగ్ అండ్ టూల్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ ఇన్నోవేషన్ అనే అంశంపై జాతీయ స్థాయి వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య కె. గంగాధరరావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారన్నారు. సంబంధిత బ్రోచర్ను శుక్రవారం వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధర్రావు, రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలం చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫార్మా కళాశాల ప్రిన్సిపాల్, కార్యక్రమ కన్వీనర్లు ప్రొఫెసర్ కె. తేజ మూర్తి, డాక్టర్ షేక్ మస్తానమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 11 మండలాలలో 40 గ్రామాలలో సుమారు 6 వేల ఎకరాల భూములు సేకరించనున్నట్లు అధికారులు తెలియజేశారని తెలిపారు. ముందుగా ఆయా రైతులకు సమాచారం తెలపకుండా, గ్రామ సభలు జరపకుండా, కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా 250 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మాణం చేయనున్నట్లుగా ప్రకటించడంతో ఆయా మండలాలు గ్రామాలలోని రైతులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువను ఆధారం చేసుకుని నష్టపరిహారం సరికాదని, మూడు పంటలు పండే సారవంతమైన భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జిల్లా, మండల రెవెన్యూ అధికారులకు హైవే అథారిటీ అధికారుల అర్జీల ద్వారా విషయం తెలిపి, తమ ఇబ్బందిని వివరించినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతులలో, పేద ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలిగించే ప్రయత్నం అధికారులు చేయాలని పేర్కొన్నారు. వెంటనే గ్రామ సభలు జరిపి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని తెలిపారు. 70 మీటర్లకు మించి సేకరణ చేయరాదని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి జరిగే ధర్నాలో బాధితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బిక్కి శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకురాలు కె.పద్మావతి, గుంటుపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
26 నుంచి జాతీయ ఆర్చరీ పోటీలు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో శుక్రవారం ఈ పోటీలకు ప్రచార పోస్టర్లను వాసిరెడ్డి విద్యాసాగర్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ... అండర్ 15, 13 (ఓపెన్) విభాగాలలో ఇండియన్ రౌండ్, కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 3 వేల మంది బాల బాలికలు, 300 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. ప్రో చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పోటీలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.వి. రమణ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, వీవీఐటీయూ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖబరస్తాన్ వివాదంపై అంజుమన్ ట్రస్ట్ బోర్డు మౌనం
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని ఖబరస్తాన్ వివాదంపై అంజుమన్ ట్రస్ట్ బోర్డు మౌనం వహిస్తోందని ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు విమర్శించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సిద్ధిక్ మజ్జిద్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంజుమన్ ట్రస్ట్బోర్డు పవిత్ర ఖబరస్తాన్ స్థలం విషయంలో నిర్లక్ష్యం వహించడం ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులు, ఖబరస్తాన్ల వంటి పవిత్ర వక్ఫ్ ఆస్తులను సంరక్షించాలనే మహోన్నత లక్ష్యంతో అంజుమన్ సంస్థను పెద్దలు స్థాపించారని గుర్తుచేశారు. పవిత్ర స్థలాలను కాపాడతామని బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అంజుమన్ ట్రస్ట్బోర్డు సభ్యులు ఖబరస్తాన్ వంటి ధార్మిక విషయాల్లో మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని విమర్శించారు. ఖబరస్తాన్పై ఎలివేటెడ్ బ్రిడ్జి ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు బహిరంగంగా చర్చిస్తున్నప్పటికీ అంజుమన్ నుంచి నేటికీ స్పష్టమైన స్పందన రాకపోవడం ఆందోళనకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఖబరస్తాన్ పరిరక్షణ వ్యక్తిగత, రాజకీయ అంశం కాదని, ముస్లిం సమాజానికి సంబంధించిన ధార్మిక బాధ్యత అని స్పష్టంచేశారు. అంజుమన్ ట్రస్ట్బోర్డు తక్షణమే మౌనం వీడి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, దీనిపై చర్చించేందుకు సభ్యులందరితో కలసి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన స్పందన రాకపోతే తదుపరి ప్రజా కార్యాచరణపై ముస్లిం సమాజంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మహమ్మద్ యూసఫ్, తబ్లీగ్ జమాత్ అధ్యక్షులు రఫీ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్, అహ్లెసున్నతువల్ జమాత్ అధ్యక్షులు మునీర్, జమీయతే అహ్లే హదీస్ అధ్యక్షులు రఫి, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం యువసేన అధ్యక్షులు ఇస్మాయిల్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన వ్యక్తం చేసిన ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ -
దయాక్షేత్రం.. జయ సంకేతం
అమరావతి: పరిశుద్ధ ప్రభువైన ఏసు క్రీస్తు మన వెంట ఉండి నడిపించటానికి ప్రతి ఒక్కరూ నిరంతరం దైవ ప్రార్థన చేయాలని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు అబ్రహాం అన్నారు. అమరావతి మండల పరిధిలోని లేమల్లెలో ఉన్న హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 49వ గుడారాల పండుగ రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. రాత్రి పూట ప్రార్థనలలో ఆయన ఆరాధికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాడైన మన బతుకులను మార్చుకోవటానికి పరిశుద్ధమైన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుని దర్శనం కలుగుతుందన్నారు. ఏసయ్యను నిష్కళంకమైన మనస్సుతో ప్రార్థిస్తే మంచి జరుగుతుందన్నారు. విశ్వాసుల జీవితాలలో సమస్యలు తొలగిపోవాలంటే ప్రభువు ఏసయ్యపై సంపూర్ణమైన నమ్మకం ఉంచాలన్నారు. గుడారాల పండుగ అంటే దేవుని వాక్యాల పండుగ, ఆరాధనల పండుగ, వర్తమానముల పండుగ అన్నారు. తొలుత హోసన్నా సేవకులు, సిస్టర్ల బృందం దేవుని స్తుతి గీతాలు ఆలపించారు. సండే స్కూల్ చిన్నారుల నృత్యాలు విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్వెస్లీ మాట్లాడుతూ మానవునికి, దేవునికి మధ్య సంబంధం ఆరాధన మాత్రమే అన్నారు. దేవని కృప పొందాలంటే నిరంతర ఆరాధన పరిశుద్ధమైన మనస్సుతో చేయాలన్నారు. దేవుని పట్ల విశ్వాసులు భయభక్తులు కలిగి ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే కష్టాలు దరిచేరవన్నారు. రాత్రి ప్రార్థనలలో దైవజనులు రాజన్న ముగింపు ప్రార్థనలు చేశారు. గుడారాల పండుగల రెండో రోజు రాత్రి ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. దయాక్షేత్రం విశ్వాసులతో కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
గుంటూరు
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026జీఎస్టీ మొండి బకాయిల వసూలుకు సహకరించాలి ఇఫ్తార్ సహరి (శని) (ఆది) గుంటూరు 6.22 5.05 నరసరావుపేట 6.24 5.07 బాపట్ల 6.22 5.05విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 538.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 19,672 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. ముగిసిన బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):పెదపులివర్రులో భూ–నీళా సమేత వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూజాదికాలను సృజన్కుమార్ నిర్వహించగా, ఈవో సాంబయ్య పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా I -
● సమీప బంధువు ఆస్తి రాయించుకున్నాడు ● కేసు వేసిన లాయరు 15 ఏళ్లయినా కేసు నంబరు చెప్పడు ● తిరిగి తిరిగి నా తల్లి చనిపోయింది ● కేసు నా పేరు మీద మారుస్తానని చెప్పి ఏడాదవుతోంది ● కానీ నాకు న్యాయం చేయడం లేదు
తెనాలి: స్థానిక కోర్టు ప్రాంగణం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో లాయర్లు, కక్షిదారులతో బిజీగా ఉంది. అక్కడ ఉన్న అరుగు మీద కూర్చున్న మండ్రు కమలమ్మ అనే మహిళ ఉన్నపళంగా వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి పెట్రోలు బాటిల్ తీసి తలపై పోసుకుంది. సమీపంలోని వారు అప్రమత్తమై ఆమె చేతిలో ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్నారు. కేసుల పని మీద వచ్చిన పోలీసులు ఆమెకు నచ్చజెప్పి స్థానిక పోలీసుస్టేషన్కు తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. ‘‘నా తల్లి ఆస్తికి సంబంధించిన కేసులో సమీప బంధువు మోసం చేశాడు.. కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానని చెప్పిన లాయరు మోసం చేశాడు. విసిగిపోయి నా తల్లి చనిపోయింది. తరువాత అయినా న్యాయం చేస్తారనుకుంటే చేయలేదు. అందుకే నా తల్లి సంవత్సరీకం రోజునే నేను కూడా చనిపోవాలనుకున్నా’’ అని మండ్రు కమలమ్మ కన్నీటి పర్యంతమైంది. -
ఖర్చు కోట్లలో.. మురుగంతా చెరువులో!
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అంటూ రూ.కోట్లు ఖర్చు చేస్తూ ప్రచారాన్ని ఊదరకొడుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ మురుగునీటిని తీసుకువచ్చి చెరువులో కలిపేందుకు ఎంటీఎంసీ అధికారులు శుక్రవారం డ్రైనేజీ కాలువ నుంచి చెరువులోకి పైపులైను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని నులకపేటలో ఉన్న చెరువును రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేయాలని పనులు చేపట్టింది. ప్రజల సౌకర్యార్థం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో నులకపేట కృష్ణానగర్ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ చెరువులో పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని కలుపుతున్నారు. చెరువును అభివృద్ధి చేస్తూ పార్కును ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టడంతో చెరువుకు మహర్దశ వచ్చింది, స్వచ్ఛమైన నీరు ఉంటుందని ప్రజలు భావించారు. కానీ అధికారులు దానికి విరుద్ధంగా నులకపేట బాబూ జగ్జీవన్రామ్ కాలనీ, యర్రక్వారీ, మసీదు సెంటర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని తిరిగి అదే చెరువులోకి కలపడానికి పైపు లైను వేస్తున్నారు. రూ.9 కోట్లతో అభివృద్ధి చేసినా మురుగువాసన తప్పదంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంటీఎంసీ అధికారులు నులకపేట చెరువులో మురుగునీటిని కలపకుండా వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని, చెరువును ఇకనైనా పరిశుభ్రంగా ఉంచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
వైభవంగా తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల
కోనూరు(అచ్చంపేట): మండలంలోని కోనూరులో గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు గురువారం అర్ధరాత్రి వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచి ప్రారంభమైన మహోత్సవాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. వైఎస్సార్సీపీకి చెందిన విద్యుత్ ప్రభ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రభను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు తమ్మ విజయప్రతాపరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై విఘ్న విమోచక హనుమాన్ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 108 కలశాలతో పంచగవ్య శుద్ధి, సాయంత్రం విశేష తదీయారాధనతో కార్యక్రమాలు ముగిశాయి. మైహోం గ్రూప్స్ అధినేత జూపర్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిరోజూ సుందరకాండ పారా యణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయ ణ, అఖండ హరేరామ నామ సంకీర్తన, హనుమద్ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం నుంచి అక్రమంగా తరలిపోతున్న మూడు మట్టి లారీలను నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం సీజ్ చేశారు. అనంతరం ఆ లారీ యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. డీఎస్పీ మురళీకృష్ణ ఒక కేసు విషయమై ఉండవల్లి నుంచి వస్తుండగా వరుసగా మట్టి లారీలు పెద్దపెద్దగా హారన్లు కొట్టుకుంటూ అధిక వేగంతో రావడంతో ఆ లారీలను క్రాస్ చేసి ఉండవల్లి సెంటర్ లో నిలిపివేశారు. మూడు లారీల వద్ద సరైన ప త్రాలు లేకపోవడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్ కు పంపించి విచారణ చేయాలని ఆదేశించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని ఇంటర్మీడియెట్బోర్డు కార్యదర్శి, కమిషనర్ పి.రంజిత్బాషా శుక్రవారం పరిశీలించారు. బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆన్సర్ షీట్ల వాల్యూయేషన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్జేడీ జె.పద్మ, ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. -
మహిళల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాడాలి
మంగళగిరి టౌన్: మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారి రక్షణకు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి మండలం యర్రబాలెంలో గురువారం ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మద్యం, మాదక ద్రవ్యాలే నేరాలకు మూలమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతేస్థాయిలో వారిపై అణచివేత, హింస, వివక్ష పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో ఎక్కువ శాతం మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల మత్తులోనే జరుగుతున్నాయని విమర్శించారు. మార్చి 8న గుంటూరులో భారీ ర్యాలీ సదస్సు జరుగనున్నట్లు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే ఈ సదస్సుకు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు హాజరుకానున్నారని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ గతంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి 8 గంటల పనివిధానాన్ని సాధించుకున్నారని, నేటి పాలకులు పని గంటలు పెంచుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకులు ఆదిలక్ష్మి, పార్వతి, మేరి, రమాదేవి, అంజలి, తిరుతమ్మ, రామారావు పాల్గొన్నారు. -
కిల్కారీ సేవల అమలు తీరు పరిశీలన
పెదకాకాని: బాలింతలు, గర్భిణులు ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు అన్నారు. మండలంలోని వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కొప్పురావూరు సబ్సెంటర్ను గురువారం జిల్లా కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు అందుతున్న కిల్కారీ సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిల్కారీ కాల్ నెంబర్ 911600403660 ని గర్భిణీలు మరియు బాలింతలు మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని సూచించారు. మరల వినాలి అనుకుంటే 14423 లేక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కిల్కారి కాల్ని కేంద్ర ప్రభుత్వం మాత శిశు మరణాలు తగ్గించడానికి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కిల్కారి కాల్ నెలకు ఒకసారి వాయిస్ ద్వారా తల్లి బిడ్డల సంరక్షణ గురించి చెబుతారన్నారు. ఈకాల్లో గర్భిణులు, బాలింతలు తీసుకోవలిసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి, హై రిస్క్ గురించి, బర్త్ ప్లాన్, టీకాలు గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, రక్తహీనత గురించి అతి ప్రాముఖ్యమైన సలహాలు, సూచనలు అందజేయడం జరుగుతుందన్నారు. కిల్కారి కాల్స్ గర్భిణి అయిన 4 వ నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకూ వస్తాయన్నారు. డాక్టర్ రామాంజిరెడ్డి, పీహెచ్ఎన్ భవాని, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, ఏఎన్ఎం నాగమణి, ఆశలు పాల్గొన్నారు. -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక వేదికపై దైవజనులు ఆశీనులు కాగా స్తుతి గీతాలు వీనుల విందుగా ఆలపించారు. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రసంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ప్రభువైన క్రీస్తు ఏసు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు పునరుజ్జీవం కలగాని ప్రార్థిస్తున్నామన్నారు. దేవుడు ఒక్కమాట సెలవిస్తే మనజీవితాలలో అద్భుతాలు జరగుతాయని.. అందుకోసం నిరంతరం విశ్వాసులు దేవుని నామాన్ని స్తుతించాలన్నారు. దయాక్షేత్రంలో అడుగుపెట్టిన రోగులు, వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలగాలని క్రీస్తు ఏసును ప్రార్ధిద్దామన్నారు. ఈ నాలుగురోజుల పాటు జరిగే గుడారాల పండుగలో ప్రార్ధనాత్మతో ప్రతి క్షణం దేవుని స్తుతించాలన్నారు. -
ఎయిమ్స్ అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిమ్స్లో సమస్యలను అధిగమించే అంశంపై గతంలో రివ్యూల్లో సమీక్షించామని పేర్కొన్నారు. ఎయిమ్స్ను ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకడమిక్ ఇనిస్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి దాదాపు 500 పోస్టులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఎయిమ్స్లో గతంలో 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా నేడు 87 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలకు ఆలస్యం అవుతుందని, మిగతా అన్ని పరీక్షలు త్వరగానే రిపోర్టులు వస్తున్నాయని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఫార్మసీ కౌంటర్లు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో బస్ షెల్టర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం సాంతాసింగ్, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు. -
సత్తెమ్మతల్లి గుడిబోర్డు మెంబర్ల నియామకంలో అన్యాయం
మాదిపాడు(అచ్చంపేట): సత్తెమ్మతల్లి గుడి బోర్డు సభ్యుల నియామకంలో ఇస్తామన్న మూడు పోస్టులు తమకు ఇవ్వకుండా కేవలం ఒకరికి మాత్రమే అవకాశం కల్పించి, మిగిలిన మొత్తం టీడీపీ సభ్యులు తీసుకున్నారని, తమకు ఇస్తామన్న కోటా ఇవ్వకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని మాదిపాడు జనసేన కార్యకర్తలు గురువారం వీడియో ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ తొలుత అనుకున్నట్లు సత్తెమతల్లి గుడి బోర్డు మెంబర్లుగా జనసేన తరఫున ముగ్గురు పేర్లను సత్తెనపల్లి పార్టీ ఇన్చార్జి యర్రంసెట్టి రామకృష్ణ, మాదిపాడు గ్రామ అధ్యక్షుడు కన్నాశ్రీను, ఉపాధ్యక్షుడు వెంకట్రావుల ద్వారా ప్రతిపాదించినట్లు తెలిపారు. అయినప్పటీకీ ఒక్కరికే అవకాశం కల్పించి మిగతా ఇద్దరికీ ఇవ్వలేదన్నారు. అదీగాక ప్రతిపాదించిన వారి పేర్లు కూడా పెట్టలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న ముగ్గురు సభ్యులకు బోర్డులో అవకాశం కల్పించకపోతే ప్రమాణస్వీకారం రోజున ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు తాడేపల్లి రూరల్: కృష్ణానది కనకదుర్గ వారధిపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళగిరి వెళుతున్న మంగళగిరి డిపో బస్సు 38 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈక్రమంలో కనకదుర్గ వారధి మధ్యలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక అద్దం పగలడంతో పాటు వెనుక సీట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అద్దాల ముక్కలు లోపల పడడంతో లారీ ఢీకొన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై ఆర్టీసీ డ్రైవర్ తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
మహిళా రక్షణ చట్టాల పోస్టర్ల ఆవిష్కరణ
మంగళగిరి టౌన్ : మహిళా రక్షణ చట్టంపై మరింత అవగాహన పెంచాలని, వాటి దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రూపొందించిన మహిళా రక్షణ చట్టాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్నారు. అన్యాయానికి గురైన మహిళలు వెంటనే ఫిర్యాదు చేసేలా చట్టాలను తెలియజెప్పాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు సేవతోపాటు చట్టాలను గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు వివరించి చైతన్యపరచాలని కోరారు. మహిళా భద్రత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. తాడేపల్లి రూరల్ : ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారులు జి. శాంతకుమారి, డి. నాగేశ్వరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాడేపల్లి పరిధిలో రాష్ట్ర సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రవేశానికి 5 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలని, మార్చి 10వ తేదీ వరకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సీఎస్ఇ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. 25 శాతంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ పిల్లలకు 6 శాతం చొప్పున ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శలపాడు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో నాంచారమ్మ తల్లి తిరునాళ్ల గురువారం వైభవంగా జరిగింది. రెండు రోజులుగా గ్రామంలోని మహిళలు, భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పరవశించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారి ఆలయం కళకళలాడింది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణ పరిసరాలలో భారీ విద్యుత్ ప్రభలను అలంకరించి అందర్నీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి అలంకారోత్సవాలు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి మార్చి 18వ తేదీ వరకు స్వామి వారి ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవస్థానం ఆస్థాన మండపంపై ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయని అన్నారు. శుక్రవారం స్వామి వారి మత్స్యవతారం అలంకారంతో ఆస్థాన అలంకారోత్సవాలు ప్రారంభమ వుతాయని, 7న వటపత్రసాయి, 8న రుక్మిణి హరణం, 9న గోవర్ధనోద్ధరణ, 10న గజేంద్ర మోక్షం, 11న పార్థసారథి, 12న శ్రీరంగనాయకులు, 13న రుక్మిణి కల్యాణం, 14న కాళీయ మర్ధనం, 15న స్థంభోద్భవం, 16న పరమపదనాథుడు, 17న శ్రీరామ పట్టాభిషేకం, 18 తేదీ సాయంత్రం కోదండరాముడు అలంకారోత్సవాలు జరుగుతాయని, 19వ తేదీన ఉగాది తిరువంజనోత్సవం, పంచాంగ శ్రవణం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం.రాజామోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. రైల్వే స్టేషన్లో గుండెపోటుతో వృద్ధుడు .. ఈపూరు మండలం గుండే పల్లి గ్రామానికి చెందిన పాతపోతుల మల్లయ్య(85) గురువారం నరసరావుపేట రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆరు బైక్లు స్వాధీనం హుజూర్నగర్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపగా రిమాండ్ విధించారు. సీఐ చరమందరాజు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ మోహన్బాబు తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్ మాబు, గుంటూరు సిటీకి చెందిన షేక్ రిహాజ్గా గుర్తించారు. వారిని విచారించగా బైక్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ టౌన్తో పాటు గుంటూరులోని నగరపాలెం, పట్టాభిపురం, మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఆరు బైక్లు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని రిహాజ్ అమ్మమ్మ ఊరైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో దాచిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
మూగబోయిన నాదస్వరం
చిలకలూరిపేట: దేశ విదేశాల్లో తన నాదస్వరంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సుస్వరాలు మూగబోయాయి. చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం ఉన్న పద్మశ్రీ షేక్ మహబూబ్ సుభాని (71) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రాత్రి తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం నాదస్వర విద్వాంసులకు పుట్టినిల్లు. ఈ విద్వాంసుల కుటుంబానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని పుట్టిన ఊరు ప్రకాశం జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం. పెరిగింది, నాదస్వర విద్య నేర్పించి చిలకలూరిపేట పట్టణంలోని ఆయన తాత నాదబ్రహ్మ, నాదస్వర గాన కళాప్రపూర్ణ బిరుదాంకితుడు షేక్ చినపీరు సాహెబ్ ఇంట. నాదస్వరంలో ఎందరినో విద్వాంసులుగా తీర్చిదిద్దిన చినపీరు సాహెబ్కు మగ సంతానం లేకపోవడంతో ఆయన అల్లుడు మీరాసాహెబ్ చిలకలూరిపేటలోని తన గురువు, మామగారైన పీరుసాహెబ్ ఇంటిలోనే ఉండటంతో సుభాని బాల్యం, నాద విద్యకు తొలి అడుగులు ఇక్కడే పడ్డాయి. అలాంటి మహబూబ్ సుభాని మరణ వార్త స్థానికులను ఎంతోగానోకలిచివేసింది. సంగీత ప్రస్థానం... దక్షిణభారత శైలి కర్ణాటక సంగీతంలో విశిష్ట స్థానం కలిగిన నాదస్వరం అత్యంత మంగళప్రదమైనది. దేవాలయాలు, మత, సామాజిక పరమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉండవలిసిన వాద్యం నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించే వాద్యం కూడా ఇదే. నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చిన ఘనత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నాదస్వర విద్వాంసులకు దక్కుతుంది. దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు. వారి సుమధుర నాదం ఎన్నో దేవాలయాల్లో సుప్రభాత సేవలకు ఆధ్యాత్మిక శోభ సంతరింపజేస్తుంది. ఈ వంశంలో ఎనిమిదో తరానికి చెందిన విద్వాంసులైన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులకు నాదస్వరమే సర్వస్వం. అలాంటి కళకు అంకితమైన ఈ నాద ద్వయానికి కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ ఎనిమిదో తేదీన పద్మశ్రీ పురస్కారం అందజేసి గౌరవించింది. బాల్యం నుంచి .... ఏడేళ్ల వయస్సు నుంచే మహబూబ్ సుభాని ఆయన తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. అలాగే షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్ సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వారి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారద సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె. చంద్రమౌళి వద్ద కొంతకాలం నాదస్వరం అభ్యసించారు. అనంతరం గానకళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద తంజావూర్ బాణీలో పదేళ్లపాటు శిక్షణ పొందారు. కాలం గడిచేకొద్దీ శాసీ్త్రయ సంగీతానికి ఆదరణ తగ్గటంతో శాసీ్త్రయ సంగీతానికి నేటికీ పెద్ద పీటవేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి ఎందరో కళాకారులు తరలివెళ్లిన తీరుగానే మహబూబ్ సుభాని, కాలేషాబీ దంపతులు వెళ్లారు. అక్కడ శ్రీరంగంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు షేక్ ఫిరోజ్బాబు కూడా సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మహబూబ్ సుభాని తన జీవిత కాలంలో ఇప్పటికే విదేశాలతోపాటు భారత దేశ వ్యాప్తంగా కచేరీలు చేసిన ఘనత దక్కించుకున్నారు. -
14న జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బెంచ్ల ద్వారా సివిల్ కేసులు (పార్టిషన్ సూట్స్, మనీ మేటర్స్, పర్మినెంట్ ఇంజక్షన్స్ సూట్స్, స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్), రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన సర్క్యూలర్ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కక్షిదారులు, పోలీస్ శాఖ, స్టేక్ హోల్డర్స్ అందరూ జాతీయ లోక్ అదాలత్లకు హాజరై ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలన్నారు. జాతీయ లోక్ అదాలత్లో సివిల్ కేసులలో అప్పీల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా కక్షిదారులకు, న్యాయవాదులకు సూచించారు. -
ఏఐ గ్లోబల్ లాజిస్టిక్స్ను తిరగరాస్తోంది
లక్ష్మీపురం (గుంటూరు ఈస్ట్): పెద్ద స్థాయి లాజిస్టిక్స్, ఫుల్పిల్మెంట్ నెట్వర్క్లను మార్చడంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ)ను ప్రధానంగా ఉపయోగిస్తున్న అమెరికాలో అమెజాన్.కామ్ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ సంస్థకు చెందిన సప్లయి చైన్ మేనేజర్ తేజా భరత్ నెల్లూరి అన్నారు. గుంటూరు రత్నగిరినగర్కు చెందిన యువకిషోరం తేజా భరత్ నెల్లూరి శివరావు, శ్రీవాణి దంపతుల ఏకై క కుమారుడు. గుంటూరు ఏఎన్యూలో 2010–2014 బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసుకుని 2019–2021లో అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్ ద్వారా అమెరికాలోని అమెజాన్.కామ్ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో సప్లయి చైన్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టి రాణిస్తున్నారు. ఇటీవల గుంటూరుకు రావడంతో ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్లోబల్ సప్లయి చైన్ ఎలా పునర్నిర్మిస్తుందో, భవిష్యత్తులో ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోందో ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రశ్నః ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల మార్పు, సప్లయి చైన్ పై ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతోంది? సమాధానంః ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సప్లయి చైన్ అనేది అత్యంత క్లిష్టమైన నిర్మాణం. మిలియన్ల ఉత్పత్తులు, గ్లోబల్ మార్గాలు, రియల్–టైమ్ అవసరాలు, బాహ్య ప్రమాదాల నేపధ్యంలో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఏఐ డిమాండ్ను అంచనా వేయడం, ఆటోమేట్ చేయడం, వేగంగా స్పందించడం వంటి అంశాలలో సంప్రదాయ వ్యవస్థలను మించిపోతుంది. మీ దష్టిలో ప్రస్తుతం అత్యంత ప్రభావం చూపుతున్న ఏఐ ఇన్నోవేషన్లు ఏవి? నా అనుభవంలో, అత్యంత మార్పు తీసుకొస్తున్న ఐదు ప్రధాన రంగాలు ఆరు. ప్రిడిక్టివ్ ఫోర్కాస్టింగ్, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్, ఆటోమేటెడ్ వేర్హౌసింగ్, డైనమిక్ ట్రాన్స్పోర్టేషన్ రూటింగ్, రిస్క్ డిటెక్షన్. ఈ ఇన్నోవేషన్లు సప్లయి చైన్లో ఖచ్చితత్వం సామర్ాధ్యన్ని పూర్తిగా మారుస్తున్నాయి. ఏఐ నిజంగా సప్లయి చైన్ అంతరాయాలను నివారించగలదా? ఏఐ ప్రతి సమస్యను 100శాతం నివారించలేదు. కానీ ఇది చేసే అత్యంత ముఖ్యమైన విషయం తీవ్ర ప్రమాదాలను ముందే గుర్తించడం. నా పనిలో, వాతావరణం, పోర్ట్ డేటా, రవాణా బాటిల్ నెక్కులు, గ్లోబల్ న్యూస్ వంటి వేలాది సూచనల్ని ఏఐ ఎలా విశ్లేషిస్తుందో చూశాను. ఈ ముందస్తు హెచ్చరికలు కంపెనీలకు రీరూటింగ్, రీషెడ్యూలింగ్, ఇన్వెంటరీ బ్యాలెన్సింగ్ లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఇస్తాయి. ఇది సప్లయి చైన్ను ప్రతిస్పందనాత్మక వ్యవస్థ నుంచి ప్రో–యాక్టివ్ వ్యవస్థగా మారుస్తుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ సప్లయి చైన్ను ఏ దిశలో తీసుకెళ్తుందని మీరు భావిస్తున్నారు? మనం పూర్తిగా కనెక్ట్ అయి, స్వయంచాలకంగా ఆప్టిమైజ్ అయ్యే సప్లయి చైన్ దిశగా కదులుతున్నాం. భవిష్యత్తులో ఏఐ ట్రాన్స్పోర్టేషన్, ఇన్వెంటరీ, లేబర్, రిస్క్ ఆల్ ఇన్ రియల్ టైమ్లో సమన్వయం చేస్తుంది. ఇంటెలిజెంట్ కంట్రోల్ టవర్లు ఆపరేషన్లపై పూర్తి, ఏకీకత దృశ్యం ఇస్తాయి. నేను చూసిన విధంగా, ఈ డిజిటల్ మార్పు ఇప్పుడే ప్రారంభమైంది. దీని ప్రభావం చాలా దీర్ఘకాలికం మరియు శక్తివంతంగా ఉంటుంది. -
వైభవంగా పుష్పయాగం
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్ సహరి (శుక్ర) (శని) గుంటూరు 6.21 5.05 నరసరావుపేట 6.23 5.07 బాపట్ల 6.21 5.05మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 11 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో యాగోత్సవం నిర్వహించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అష్టదిక్పాలకారాధన, విశేష శ్రీ పుష్పయాగోత్సవం, దివ్యమంగళ హారతిని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పుష్పసేవ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన నందం సాంబశివరావు, శాంతికుమారిలు వ్యవహరించారు. ఆలయ ఈవో కె. సునీల్కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. – వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నల్లమోతు రామకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా కొమ్మినేటి అనంతదుర్గాప్రసాద్లను నియమించారు. అదే విధంగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులుగా దాసరి నరసింహారావు, వెల్నాటి జగన్మోహరావు, ప్రధాన కార్యదర్శులుగా నేసు రాఘవులు, నామా భాగ్యరాజు, కంభం పాటి గోపి, కార్యదర్శులుగా ఎం.అనంతయ్య, టి.అశోక్, ఎ.పృద్వీరావు, టి.శ్యామ్బాబు, కుల్లు పవన్కుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా రాయపూడి యోహాను, శ్రీరామ్ మహేష్బాబు, కొమ్మాలపాటి బాలా, మందపాటి సాగర్బాబు, జి.శ్రీకాంత్, లాం అజయ్, పి.ఉత్సన్నలను నియమించారు. మేడికొండూరు మండలం యువజన విభాగం ఉపాధ్యక్షులుగా సయ్యద్ బషీర్, వి.సాంబశివరావు, ప్రధాన కార్యదర్శులుగా షేక్ సాజీద్, లేళ్ల కాశీరెడ్డి, దండా భరద్వాజ్రెడ్డి, కార్యదర్శులుగా దేవరకొండ సునీల్, నూతక్కి సుకుమార్, ఆయాజ్ బాషా, నార్నే శ్రీనివాసరావు, కొక్కిలికొండ శివశంకరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సీహెచ్ రాజేష్, షేక్ పోలూరు లియాఖత్, పి.మోహాన్, పిల్లి బాలస్వామి, కె.రాము, ఎస్.విజయరాజు, పి.ప్రకాశ్రావు, తాడికొండ మండలం మైనారిటీ విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ మెహాబూబ్ సుభాని, షేక్ కరీముల్లా, ప్రధాన కార్యదర్శులుగా షేక్ మెహాబూబ్ సుభాని, షేక్ అమీర్బాషా, షేక్ రబ్బాని, కార్యదర్శులుగా షేక్ సుభాని, షేక్ మెహాబూబ్, షేక్ జాన్సైదా, షేక్ ఆసీఫ్, షేక్ జాకీర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షేక్ మహీబుతా, షేక్ గుజార్, షేక్ మెహాబూద్వలి, షేక్ షహజాన్, షేక్ కరీముద్దీన్, షేక్ జానీ, షేక్ ఇస్మాయిల్ జబీబుల్లాలను నియమించారు. ఫిరంగింపురం మండలం వలంటీర్స్ విభాగం ఉపాధ్యక్షులుగా వజ్రాల కోమలలత, దొడ్డా మల్లిఖార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ఎం.కృష్ణకుమారి, షేక్ ఆదాంషఫీ, షేక్ గుంటూరు హబీబుల్లా, కార్యదర్శులుగా కూరగంటి ప్రేమ్కుమార్, తోక వెంకటేష్, భాణావత్ శివకాలేశ్వరనాయక్, పచ్చల సందీప్, రేపూడి కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మేళం రణదీప్, కూరపాటి హోసన్న, కె.శౌరీలు, పిల్లి షాలేమ్రాజు, గేరా వెంకటకోటేశ్వరావులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ల్యాండ్ ఫూలింగ్ రెండో దశకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చా వేదిక ప్రతినిధి సలీం మాలిక్, సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని సెస్ విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జొన్నా శివశంకర్, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్, అండర్–23 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 9న తేదీ ఉదయం 07.30 గంటలకు అరండల్పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తామని యు.మహతి శంకర్ గురువారం ఒక ప్రటకటనలో పేర్కొన్నారు. అండర్–23 బాలురు 01–09–2003 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్ జట్టుకు వయస్సు పరిమితి లేదన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ బ్యాగ్తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో రిపోర్ట్ తప్పనిసరన్నారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేట పరిసర ప్రాంతాల నుంచి క్రాంతి, హతీబ్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం సేకరించి తరలిస్తుండగా, గురువారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేశారు. ఆటోలో తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఇరువురితోపాటు, డ్రైవర్పై కూడా కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పెదకాకాని రైల్వే హాల్టు వద్ద వ్యక్తి హత్య
పెదకాకాని: పెదకాకాని రైల్వే హాల్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. పెదకాకాని పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.... పెదకాకాని రైల్వేహాల్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే కీమెన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ టి.పి. నారాయణస్వామి తమ సిబ్బందితో వెళ్లి, రైల్వే పోలీసులకు కూడా సమాచారం అందించారు. రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రఘురామ కాలనీలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ వద్దకు జాగిలం వెళ్లి ఆగింది. సంఘటనా ప్రదేశంలో ఒకే బ్రాండ్ కలిగిన షర్టులు మృతుడి శరీరంపై ఒకటి, పక్కనే రక్తగాయాలతో మరొకటి ఉన్నాయి. ఒకే రకమైన రెండు క్యాప్లు, రెండు జతల చెప్పులను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్లోని శవాగారానికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్సీ బి.శైలేష్కుమార్, డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను విస్తృతం చేయాలి
ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి తాడికొండ: గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. బుధవారం తుళ్ళూరు మండలం మందడంలోని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోస్టల్ శాఖలను మరింత బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసకుంటున్నామన్నారు. అనంతరం గోల్డెన్ రూల్ హైస్కూల్ నందు మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 21 బ్రాంచ్ ఆఫీసుల పనితీరును పరిశీలించారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్లు వ్యాపారాభివృద్ధి, ఆదాయ వృద్ధి, వినియోగదారుల చేరువయ్యే కార్యక్రమాలలో చురుకై న పాత్ర పోషించాలన్నారు. తపాలా సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అనంతవరం బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోలు నరసింహారావు, పెనుమాక బ్రాంచ్ పోస్టు మాస్టర్ బానోత్ నాగమణి, వెంకటపాలెం బ్రాంచ్ పోస్టు మాస్టర్ షేక్ హనీఫ్ ఆమె అభినందించారు. -
గుంటూరు
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026ఇఫ్తార్ దావత్ ఏర్పాట్ల పరిశీలన ఇఫ్తార్ సహరి (గురు) (శుక్ర) గుంటూరు 6.21 5.06 నరసరావుపేట 6.23 5.08 బాపట్ల 6.21 5.06తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.9,200 వరకు పలికింది.విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 539.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,324 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.గుంటూరుకు వైఎస్ జగన్ రాక 7 -
సమష్టి కృషితో మాతృ మరణాల నివారణ
గుంటూరు వెస్ట్: జిల్లాలో మాతృమరణాలు నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, వైద్యాధికారులు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేలావిధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. ఎఫ్సీఎం ఇంజెక్షన్ విడుదల జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ సుధారాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి, ఎస్హెచ్ఏ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వఆసుపత్రి పై అనేక ఫిర్యాదులు వస్తున్నందున గత నెల 27వ తేదీ రాత్రి ఆకస్మిక తనిఖీ చేశానన్నారు. ఆ సమయంలో డ్యూటీలో లేని డాక్టర్లను వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని పేర్కొన్నారు. అలాగే నైట్ షిప్ట్లలో విధులు నిర్వహించే డాక్టర్లు, ఇతర సిబ్బంది వివరాలు ఒక వారం రోజుల డ్యూటీ చార్డును అందించాలన్నారు. ఇవే వివరాలు ఆసుపత్రిలోను ప్రదర్శించాలన్నారు. -
వైభవంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అరండల్పేటలోని శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం 31వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకంగా కనకాంబరాలు, మల్లెలు, తులసి మాలలతో కల్యాణమూర్తులను అలంకరించారు. విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్యభారతి స్వామి పుష్పాభిషేకం నిర్వహించి, ప్రత్యేక హారతులతో కల్యాణమూర్తులను సేవించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో చంద్రగ్రహణానంతరం బుధవారం అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయశుద్ధి అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మంటపారాధన, పుణ్యహావాచన నిర్వహించి అనంతరం జలాలతో అమరేశ్వరునికి అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మ వారికి, ఉపాలయాలలో అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనం కల్పించారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి అనంతరం హుండీల లెక్కింపును దేవదాయశాఖ ప్రత్యేక అధికారి దాసరి చంద్రశేఖర్ సమక్షంలో దేవాలయంలో ఉన్న 10 హుండీలతో పాటు తాత్కాలిక హూండీలను తెరచి భక్తులచే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లాడుతూ హుండీల ఆదాయం మొత్తం రూ.41,42,621వచ్చినట్లు తెలిపారు. మంగళగిరి టౌన్: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. కై ంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి దంపతులు వ్యవహరించారు. బుధవారం రాత్రి స్వామి వారికి ధ్వజారోహణం, కేళిగుర్రంపై విహారం, దొంగల దోపిడీ నిర్వహించారు. ఉదయం జరిగిన స్వామివారి చూర్ణోత్సవం అనంతరం స్వామి వసంతోత్సవం జరుపుకొంటూ పురవీధుల్లో విహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
నేటి నుంచి ఏఎన్యూలో విద్య సమ్మేళనం
రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ ఏఎన్యూ (పెదకాకాని): పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్య, పరిశ్రమల సమ్మేళనం–2026ను ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ వెల్లడించారు. ఏఎన్యూలో కమిటీ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శివరాంప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని డైక్మన్ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమ్మేళనంకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు సిలబస్ను రూపొందించడం, విద్యార్థులకు ఇంటర్నషిప్ సదుపాయం కల్పించడంతో పాటు నాలెడ్జి పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. సమ్మేళనంలో పాల్గొనేందుకు 100కు పైగా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. సమ్మేళనం కన్వీనర్ ఆచార్య పి.పద్మావతి, సంచాలకులు ఆచార్య లింగరాజు, కోశాధికారి ఆచార్య త్రిమూర్తిరావు, పరిశ్రమల ప్రతినిధి ఉమామహేశ్వరలు మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఆచార్య జ్యోతిర్మయి, పాలక మండలి సభ్యులు, సమ్మేళనం కో –కన్వీనర్లు ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్లు పాల్గొన్నారు. -
నాపై.. నా కుటుంబంపై టీడీపీ సర్కారు దాడి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): టీడీపీ ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై పాశవికమైన దాడికి పాల్పడిందని... దీనిపై నెల రోజులకుపైగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... భౌతికంగా, చట్టపరంగా కూడా దాడులకు దిగుతున్నారని, ప్రస్తుతం నా ఆస్తులపై కూడా దాడుల పరంపర కొనసాగిన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో 22 ఎకరాల పొలం గతంలో కొనుగోలు చేశానని అన్నారు. దీంతో పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశానని, అందులో వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తనపై బనాయించిన అక్రమ కేసుల్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా, సర్వే పేరుతో రాజుపాలెం మండల ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ఒక నోటీసు (లెటర్) ఇచ్చారని అంబటి గుర్తుచేశారు. పొలాన్ని సర్వే చేయాలని పేర్కొనగా, దానికి బదులిచ్చానని చెప్పారు. అయితే ఆ లెటర్ను రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి పంపించారని తెలిసిందని అన్నారు. ఆ పొలంలో గెస్ట్హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉందని అంటున్నారని, కానీ దిగుడు బావి మాత్రమే ఉందని తెలిపారు. పొలం కొనుగోలు చేసిన సమయంలో ఉన్న రేకుల షెడ్కే మరమ్మతులు చేయించానని స్పష్టం చేశారు. తన పొలానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధం ఏంటని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కృష్ణానది గర్భంలో నివసిస్తుంటే ఏమీ చేయలేదని, తన పొలంలో బావి ఉంటే తప్పు ఏంటని అన్నారు. ఈ నోటీసుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని తెలిపారు. వారికి పనీపాట లేదని విమర్శించారు. అన్నింటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. లీగల్గా సంపాదించిన ఆస్తులని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. టెట్ విధానం రాకముందు ఎంపికై న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. టెట్ నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు ఛలో ఢిల్లీ వాల్పోస్టర్ను మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 8న టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్ లీగ్ పోటీల్లో భాగంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్, డబుల్స్, మిక్సడ్ డబుల్ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్టర్ కావాలని తెలిపారు. రిజిస్టర్ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. -
పోలీసుల సహకారంతోనే అంబటి ఇంటిపై దాడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పోలీసుల సహకారంతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబుని మంగళవారం సాయంత్రం శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాంబాబు నోటి వెంట అనుకోని మాట ఒకటి వచ్చిందని, తప్పుగా వచ్చిన పదాన్ని ఆసరా చేసుకుని దాదాపు ఏడెనిమిది గంటలకుపైగా విధ్వంసకాండ జరపడం దారుణమని అన్నారు. పొరపాటున నోరు జారిన మాటకు వెంటనే క్షమాపణ చెప్పారని తెలిపారు. అయినప్పటికీ అప్పటికప్పుడే ఫోన్ కాల్స్ చేసుకుని, విడతల వారీగా వచ్చేసి దాడి చేయడం ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇంట్లోని మహిళలు, చిన్నారులను చూడకుండా ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని పోలీసులు నిలువరించకపోవడం దారుణమని అన్నారు. పోలీస్ వ్యవస్థ దాడులకు తెగబడిన వారిని ప్రోత్సహించడం ఎక్కడా చూడలేదన్నారు. గుంటూరు –2 ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త స్వయంగా వచ్చి దాడుల్లో పాల్గొనడం దారుణమని మండిపడ్డారు. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, రాష్ట్ర నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి -
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి, వి.భారతి,బి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామరృష్ణ, జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి ,సిఐటియు జిల్లా నాయకులు వై. నేతాజీ, కె. నళినీకాంత్, ఎన్.భావనారాయణ, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి
యూటీఎఫ్ పిలుపు గుంటూరు ఎడ్యుకేషన్ : రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అడ్మిషన్ క్యాంపెయిన్ చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యావర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నాయకులతో కలసి ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవింద్, టి.ఆంజనేయులు, కె.రంగారావు, బి.ప్రసాదు, కె.కేదార్నాథ్, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం తగదని, తక్షణమే సమస్యల పరిష్కారానికి రూట్మ్యాప్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్ 1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నరసింహారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్–1938 రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు వి.సూర్యం, సహాధ్యక్షులు ఓ.నాగార్జున, జిల్లా అదనపు కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జీఎస్ఎస్ ప్రసాద్, నగర నాయకులు వై.మనోజ్ కుమార్, ఎన్.మీనాక్షి, వివిధ మండలాల ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ధర్నా -
13, 14 తేదీల్లో కిట్స్ అక్షర్లో ‘గాల–2026’
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం యనమదల కిట్స్ అక్షర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 13, 14 తేదీల్లో ‘గాల 2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను మంగళవారం స్థానిక కళాశాలలో చైర్మన్ సుబ్బారావు, సెక్రటరీ కోయి శేఖర్, డైరెక్టర్ గోగినేని సాంబశివరావులతో కలిసి ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభ ప్రతిబింబించేలా టెక్నికల్ ఈవెంట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని చెప్పారు. బ్రోచర్లో కార్యక్రమాల పూర్తి షెడ్యూల్తో పాటు ఈవెంట్ వివరాలు, నమోదు విధానం, బహుమతుల సమాచారం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈవెంట్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలవాలని చైర్మన్ ఆకాంక్షించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామకోటయ్య, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు -
కార్ల ధ్వంసం కేసులో నిందితుడికి రిమాండ్
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఫిబ్రవరి 27వ తేదీన చొరబడి రెండు కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్కు పంపినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లు పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నీలాద్రికి 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం తెనాలిరూరల్: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. వన్ టౌన్ సర్కిల్ పరిధిలో బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న ఏడు బస్తాల(50 కిలోల చొప్పున) రేషన్బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. కూలీల ఆటో బోల్తా ఒకరు మృతి.. నలుగురికి గాయాలు తాడికొండ/దుగ్గిరాల: కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్ళడంతో పనులకు వెళుతున్న ముఠా మేసీ్త్ర మృతి చెందడంతో పాటు నలుగురికి గాయాలైన ఘటన తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల నుంచి కూలీ పనుల నిమిత్తం ఆటోలో మహిళలు తెల్లవారుజామున పెదపరిమి గ్రామానికి వస్తుండగా రోడ్డు మార్జిన్లో ఆటో జారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూలీలను తీసుకొని వెళుతున్న ముఠా మేసీ్త్ర వై.వెంకటేశ్వరమ్మ(50) ఘటనా స్థలంలోనే మరణించగా డ్రైవర్తో సహా నలుగురికి గాయాలు కావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు. శివాలయం తలుపులు మూసివేత పెదకాకాని: చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం పెదకాకాని శివాలయం తలుపులు మూసివేశారు. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు అభిషేకాలు యతఆవిధిగా కొనసాగాయి. అనంతరం ఆలయ తలుపులకు తాళాలు వేశారు. బుధవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఉదయం 7 గంటల నుంఛఇ దర్శనం ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలకు అనుమతించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. ఆటోను ఢీకొట్టిన లారీ ఇంకొల్లు(చినగంజాం): ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఘటన ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు దుద్దుకూరు ఉత్తరపు పొలాల్లో శనగ కోసే పనులు పూర్తి చేసుకొని ఒకే ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారికి సమాంతరంగా వస్తున్న సిమెంట్ లోడు లారీ ఆటోను కుడివైపున బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో కుడివైపును కూర్చొన్న ఇరువురు దునిమిద్దుల తిమోతి (25), గుంటూరు గౌరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గాయాలపాలైన వారిలో తిమోతికి అతనికి ఎడమ వైపున మెడ వద్ద పుట్టుకతో వచ్చిన గడ్డ పగలడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు గౌరి కుడి కాలు, కుడి చేయి విరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జీ సురేష్ తెలిపారు. -
సీనియారిటీ జాబితా విడుదల చేయాలి
చిలకలూరిపేట: మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు విడుదల చేయడంలో జాప్యం చేయడాన్ని ఎస్టీయూ తీవ్రంగా విమర్శిస్తుందని వెల్లడించారు. 13 వేల మంది ఉపాధ్యాయులు 59 అర్బన్ లోకల్ బాడిలలో పనిచేస్తున్నారని చెప్పారు. వీరిని 2022లో విద్యాశాఖలో విలీనం చేసినా నేటికీ సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టు లేని కారణంగా పదోన్నతులు, బదిలీల సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వి అక్కయ్య, షేక్ జమీర్బాష, ఎం కోటేశ్వరరావు, వి జయప్రకాశ్, కాలేషా పాల్గొన్నారు. -
నృసింహుని ఆలయం ద్వారబంధనం
మంగళగిరి టౌన్ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం తలుపులకు మంగళవారం ద్వారబంధనం చేశారు. ఎగువ, దిగువ, ఉపాలయాలను రథోత్సవం అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారి సునీల్కుమార్ ఆధ్వర్యంలో దేవస్థాన పురోహితులు తలుపులు మూసివేశారు. గ్రహణ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. నరసరావుపేట రూరల్: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని సిబ్బంది మూసివేశారు. శైవాగమ ప్రకారం సంప్రోక్షణ కార్యక్రామాన్ని నిర్వహించిన అనంతరం బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. -
జంతు సంరక్షణ కోసమే హనుమాన్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకు నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -
గుంటూరు
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026అంగన్వాడీలపై ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.23 5.09 గుంటూరు 6.21 5.07 బాపట్ల 6.21 5.077సత్తెనపల్లి: అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై అరెస్టులా? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగటం అన్యాయమా? అని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్ నుంచి 29 మంది అంగన్వాడీలను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్కు మంగళవారం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆ 29 మంది అంగన్వాడీ మహిళల్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బ రావమ్మలు మీడియాతో మాట్లాడారు. ● సోమవారం విజయవాడ ధర్నాచౌక్లో మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీంతో అంగన్వాడీలు తమ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు. రాత్రి కూడా ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ మహిళలు అధిక సంఖ్యలో పట్టు వదలకుండా అక్కడే ఉండిపోయారన్నారు. అక్కడే నిద్రించారన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఐసీడీఎస్ జేడీ ధర్నా వద్దకు వచ్చి మీరు వెంటనే టెంట్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారన్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వచ్చి హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, పోరాటం విరమించేది లేదని తేల్చి చెప్పామన్నారు. ● ఆ రాత్రి అక్కడే అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు సుమారు 500 మంది పోలీసులు మూకుమ్మడిగా వచ్చి సైడ్ వాల్ క్లాత్తో నిద్రిస్తున్న తమను చుట్టుముట్టి దాడి చేశారన్నారు. కరెంటు తీసివేశారన్నారు. ఆ చీకట్లో అంగన్వాడీల బ్యాగులు ఎక్కడున్నాయో! కళ్లజోళ్లు ఎక్కడున్నాయో! సెల్ఫోన్లు ఎక్కడున్నాయో! చెప్ప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఈ దాడిలో తనకు ఎడమ చేయి విరిగిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి వాపోయారు. ఒక్కొక్కరిని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లో ఎక్కించారన్నారు. ఎవరెవరిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని, 29 మంది అంగన్వాడీలతో ఉన్న మా వ్యాను ముందుగా గుంటూరు తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత నరసరావుపేట తీసుకువెళ్లి అక్కడి నుంచి సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చారన్నారు. టాయిటెట్స్కూ అనుమతించలేదు... సత్తెనపల్లి వచ్చే వరకు ఈ మధ్యలో టాయిలెట్స్కు వెళ్లాలన్నా పోలీసులు అనుమతించలేదన్నారు. మేం చేసిన తప్పేమిటి? అరకొర వేతనాలతో, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరామే తప్ప ఆస్తులు ఇవ్వాలని, పదవులు మాకు ఇవ్వాలని మేం కోరామా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పుడు రాతపూర్వకంగా ఇచ్చిన మినిట్స్ కాపీలో హామీలను అమలు చేయాలని కోరామని వారు తెలిపారు. పోలీసుల దాడిలో చెయ్యి విరిగి ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి రథంపై నృసింహుడు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.9,700, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది. మాచర్ల: రాధాకృష్ణ భక్త బృందం సభ్యులు మంగళవారం మాచర్లలో ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు. భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ పర్యటించారు. తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు అండర్పాస్ వద్ద మంగళవారం జేసీబీ అదుపుతప్పి డ్రైన్లో బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిద్రిస్తున్న అంగన్వాడీలపై తెల్లవారుజామున దాడులు అంగన్వాడీ వర్కర్స్ నాయకురాలిచెయ్యి విరగ్గొట్టిన విజయవాడ పోలీసులు మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఇది.. సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ అరెస్టు చేసి విజయవాడ ధర్నా చౌక్ నుంచి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు 29 మందిని తరలించిన పోలీసులు సత్తెనపల్లి పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు పోలీస్ స్టేషన్కు వచ్చి అంగన్వాడీలను విడుదల చేస్తున్నామని, ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపొమ్మని చెప్పారు. అయితే అంగన్వాడీలు తమను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడకు విజయవాడ తీసుకువెళ్లి వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి సీఐ నాగమల్లేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తాలూకా సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. చిలకలూరిపేట: విజయవాడ ధర్నా చౌక్లో తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లలో సుమారు 30 మంది వివిధ జిల్లాలకు చెందిన వారిని మంగళవారం చిలకలూరిపేట అర్బన్ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు, స్థానిక అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు వారికి సంఘీభావంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపారు. కర్నూలు, తూర్పు గోదావరి, పోలవరం, కోనసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 30 మంది అంగన్వాడీలను విజయవాడ దీక్షా శిబిరంలో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. తెల్లవారుజామున మహిళలను అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు చిలకలూరిపేట పోలీస్స్టేషన్కు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకొనే అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
ప్రకటనల మాయాజాలం
నెహ్రూనగర్ : గతంలో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ ఉండేవి. వీటికి నగరపాలక సంస్థ ద్వారానే విద్యుత్ సరఫరా వసతి తీసుకునే వారు. వీటి మీద నెలకు రూ.వేల నుంచి రూ.లక్షల వసూలు చేస్తుండేవారు. వీటి నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో రూ.కోట్ల బకాయిలు పడుతుండేవి. వాటిని మాఫీ చేసేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు గతంలో పనిచేసిన యాడ్ ఏజెన్సీ పేరుతో కాకుండా మరో పేరుతో తిరిగి కొత్తగా ప్రకటనలు వేయించేలా పావులు కదిపేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గుంటూరు నగరంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ గత కమిషనర్ పులి శ్రీనివాసులు హయాంలో తొలగించారు. శ్రీనివాసులు బదిలీ కావడంతో కమిషనర్గా మయూర్ అశోక్ విధుల్లో చేరారు. దీంతో యాడ్ ఏజెన్సీలు రాత్రికి రాత్రే లాలీపాప్స్ నగరం అంతా ఏర్పాటు చేయించాయి. గ్యాంట్రీ హోర్డింగ్స్లోనూ... నగరంలో పలు ప్రధాన కూడళ్లలో గ్యాంట్రీ(క్రేన్) హోర్డింగ్స్కు 35కి మాత్రమే అనుమతి ఉంది. యాడ్ ఏజెన్సీలు అధికారుల అండదండలతో 40 వరకు ఏర్పాటు చేశాయి. వీటికి ఈ మధ్య ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మరి దోపిడీకి తెరతీశారు. ఏటా రూ.కోట్ల ఆదాయం కాంట్రాక్టర్లు సమకూర్చుకుంటున్నా కార్పొరేషన్కు నామమాత్రంగా చెక్కులు ఇస్తున్నారు. అవి కూడా జీఎంస్ ఖాజానాకు చేరాయో లేదో తెలియని పరిస్థితి. గ్యాంట్రీ బోర్డుల నిర్వహణలో జరుగుతున్న లోపాలను కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిలు ప్రశ్నించినప్పటికీ ఎలాటి ఫలితం లేకుండా పోయింది. రూ.కోట్లలో ఎగనామం ఒక్కో గ్యాంట్రీ బోర్డుకు నెలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఏటా ఒక్కో బోర్డుకు రూ.3.50 లక్షలు జీఎంసీకి చెల్లించాలని ఒప్పందం. కానీ సదరు ఏజెన్సీ నిర్వాహకులు కేవలం 20 బోర్డులకు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్లు తెలుస్తోంది. 40 బోర్డులకు రూ.1.40 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాలి. నగర కమిషనర్ మయూర్ అశోక్ను వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఉంటే తొలగిస్తామన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 202610న చలో ఢిల్లీని విజయవంతం చేయాలి ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.21 5.08 బాపట్ల 6.21 5.08 నరసరావుపేట 6.23 5.10 జాతీయ రహదారి పక్కనే రూ.కోట్ల విలువైన భూమి ఉన్నా ఆహ్లాదం మాత్రం అందనంత దూరంలో ఉంది. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడిన పార్కు.. పాలకులు, అధికారుల చిన్నచూపు కారణంగా కళావిహీనంగా మారింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలోని భూమి నిరుపయోగంగా పడి ఉంది. అదే గుంటూరు నగర శివారులో ఉన్న ఎన్టీఆర్ మానస సరోవరం. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నరసరావుపేట: జిల్లాలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న నలుగురు ఎస్సీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సోమవారం ట్యాబ్లు పంపిణీ చేశారు.మంగళగిరి టౌన్: స్థానికం పలు బడులను డీఈవో డాక్టర్ షేక్ సలీం బాషా సోమవారం సందర్శించారు. వీవర్స్ కాలనీ ప్రైమరీ హెల్త్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు.7 -
వృద్ధుడిపై రెచ్చిపోయిన మట్టి మాఫియా
తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని యర్రబాలెం గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తోలే ట్రాక్టర్ యజమానులు ఓ వృద్ధుడిపై రెచ్చిపోయారు. ఆయనపై దాడి చేయడంతో సోమవారం మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు.. బాధితుడు డోనె సాంబశివరావు తెలిపిన వివరాల ప్రకారం.... ఱ‘మాకు పెనుమాక రోడ్డులో కొంత భూమి ఉంది. ఆ భూమి పక్కనే మరో ప్లాట్ యజమాని నల్లమట్టిని లారీల ద్వారా తోలించుకున్నాడు. నేను కూడా అదే లారీలతో మట్టి తోలించుకుంటుంటే యర్రబాలెంకు చెందిన నాయుడు వెంకటరత్నం నా స్థలం వద్దకు వచ్చి మట్టి ఎవరిని అడిగి తోలుకుంటున్నావు? తోలితే మేమే తోలాలి. ప్లాట్లో మట్టి తోలుతున్న లారీలను అడ్డుకుని గొడవ చేశాడు. ఇదేంటని ప్రశ్నించగా వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా చేతితో నెట్టి కింద పడేసి తొక్కేస్తానంటూ బెదిరించాడు. మట్టిరేటు ఎక్కువగా ఉందని, తక్కువగా వస్తోందని వేరే చోట తోలించుకుంటున్నాని చెప్పినా దుర్భాషలాడారు. నియంతృత్వంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే విషయం అర్థం కావడం లేదు. రాజధాని చెరువు తవ్వకాల్లో వచ్చిన మట్టిని ఎవరికై నా తోలించుకోవచ్చంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ మాత్రం ట్రాక్టర్ యజమానులు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక ట్రాక్టర్ మట్టిని రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు విక్రయిస్తున్నారు. మాకు లారీ మట్టి రూ.5 వేలకు వస్తోంది. తోలించుకోవద్దని చెప్పడానికి వెంకటరావు ఎవరు.? జరిగిన సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా. ఫిర్యాదు చేసిన వెంటనే అదే గ్రామానికి చెందిన ఓ నాయకుడు పోలీసులతో మంతనాలు జరిపి మట్టితోలే ట్రాక్టర్ యజమానులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయం జరగకపోతే మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తా’’ బాధితుడు ఆరోపించాడు. -
చూచిన కనులదే భాగ్యం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం నృసింహుని దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి అట్టహాసంగా జరిగింది. సోమవారం ఉదయం అశ్వవాహనంపై విహరిస్తూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. అశ్వవాహనంపై స్వామిని దర్శించినవారికి జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుందని భక్తులకు అర్చకులు వాహన విశిష్టతను వివరించారు. కొబ్బరి కాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారు కళ్యాణ వేదిక వద్దకు వచ్చే సమయంలో ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పూలతో కళ్యాణ వేదికను అలంకరించి స్వామివారిని అధిష్టింపజేశారు. అర్చకులు స్వామి దివ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా కనుల విందుగా జరిపించారు. స్వామి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. అశ్వవాహన ఉత్సవానికి నిడమర్రు గ్రామానికి చెందిన మండేపూడి పానకాల రావు, రూపకళ కై ంకర్య పరులుగా వ్యవహరించగా, కళ్యాణమహోత్సవానికి శాశ్వత కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం తరఫునన అవ్వారు వాచ్ కంపెనీ అధినేత శరత్బాబు మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఉత్సవాలకు ఆలయ ఈవో కె. సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా మంగళగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ, దిగువ సన్నిధితో పాటు ఉపాలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నామని, తిరిగి బుధవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
8న ఉమెన్ పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గోరంటల్లోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుంటూరు ఓపెన్ ఉమెన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా పికిల్ బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కె.అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను స్కూల్ ఆవరణలో వైజయంతి డెంటల్ కేర్ అధినేత డాక్టర్ వైజయంతి, శశిధర్, నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కె.శ్రీకాంత్ బాబు, కె.శ్రీవిద్య, జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్లు ఆవిష్కరించారన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో అండర్–15 బాలికలు, ఓపెన్ కేటగిరి, సింగిల్స్, ఓపెన్ డబుల్ ఈవెంట్లు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్కే మన్సూర్ వలి, ఆనంద్ కుమార్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జి.జె.కిషోర్ తదితరులు పాల్గొన్నారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: వైజాగ్లో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా గుంటూరుకు చెందిన మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైజాగ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.మంగాకుమారి, వైజాగ్ ఆర్జేడీ విజయకుమార్ సమక్షంలో మంజు సెబాస్టియన్ను పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు. నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్న్స్లోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిత్యపూజలు, వేంకటేశ్వర సహస్రనామ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందం చేపట్టారు. సుమారు 400 మందికిపైగా సువాసినులతో విష్ణుసహస్ర నామపారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, లక్ష్మీ అష్టతోత్తర పారాయణం చేయించి పుష్పాలతో సత్కరించారు. భక్తులకు అన్నసంతర్పణ చేయగా, సువాసినులకు చీరల పంపిణి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆధ్యాత్మిక సభలో భాగంగా విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు (హంపి) విద్యారణ్య భారతిస్వామి, శృంగేరి విరూపాక్ష పీఠం నుంచి పరమశివానంద భారతీస్వామి, మాత శివచైతన్యానంద స్వామి (తపోవనం నులకపేట) నిర్వికల్పానందస్వామిలు అనుగ్రహభాషణం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ డి.ఎన్.దీక్షితులు, ముప్పవరపు సింహాచలశాస్త్రి ఉపన్యాసించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె.జి.శంకర్, పూర్వ ఆచార్యులు డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంక విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు. -
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయం చుట్టూ రైతులు తమ పశుసంపదను ప్రదక్షణలు చేయించారు. భక్తులు పొంగళ్లు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. వీరబ్రహ్మేద్రస్వామి వారి భజన కార్యక్రమాలు చేశారు. రాత్రికి గ్రామస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు బండి మల్లేశం నిర్వహించారు. పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. పెదపులివర్రు(భట్టిప్రోలు): శ్రీ భూ–నీళా సమేత శ్రీ వరద రాజ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామి వార్లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, బలిహరణ జరిగింది. రాత్రి మూజు వాణి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కార్యక్రమంలో భాగంగా దివ్య రథోత్సవం జరిగింది. తెనాలి: స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు, ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. గత రెండురోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపుగౌరి అలంకారంతో నగర సంచారం జరిగింది. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాలపొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పించి, పసుపు గౌరీ దర్శనం చేసుకున్నారు కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారీ జరిపారు. అనంతరం నృత్యప్రదర్శనలు జరిగాయి. గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు దాదాపు ఐదు వేల మందికిపైగా పాల్గొని ప్రతిష్ఠామహోత్సవ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మల్లెల రాజు (37) ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాజుకు భార్య శ్రీనిధి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఫిట్స్ వస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ. 5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాక కుమారుడికి కూడా నిత్యం జ్వరం వస్తుండడంతో కొంత అప్పులు అయ్యాయి. వీటికి తోడు బ్యాంకులో గృహ నిర్మాణ లోన్ రూ. 10 లక్షలు తీసుకోవడంతో ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో రెండు ఈఎంఐలు పెండింగ్లో ఉండడంతో ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఆత్మహత్య శరణ్యమంటూ భావించాడు. గత నెల 27న ఊరి చివర పురుగుల మందు సేవించి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో భార్య ప్రశ్నించింది. దీంతో అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదని, దీనికి తోడు కుమార్తె, కుమారుడు అనారోగ్యం అర్ధంకాక గడ్డి మందు సేవించానని భార్య శ్రీనిధికి చెప్పి విలపించాడు. ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య శ్రీనిధి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోవుల అక్రమ రవాణా అడ్డగింత
యడ్లపాడు: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు సోమవారం అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్న్కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, యడ్లపాడు మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ నేతృత్వం వహించగా, వంకాయలపాటి వంశీధర్, వి. నాగేశ్వరరావు, పి. మహేష్, బందెల శ్రీనివాసరావు, నక్క శ్రీనివాసరావు, నేలటూరి ఏసురత్నం, షేక్ సుభాని, తోట చందు, శ్రీరామ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అర్జీలు వెల్లువెత్తాయి. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు ఆలకించారు. అర్జీలను పరిశీలించి, బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలంటూ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితుల నుంచి మొత్తం 165 ఫిర్యాదులను స్వీకరించారు. డీఎస్పీ అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్రావు (సీసీఎస్) లు కూడా అర్జీలు స్వీకరించారు. నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయింది. భర్త ఓ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించేవాడు. మా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను పట్టాభిపురంలో మరో మహిళతో ఉంటున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి నన్ను మరింతగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ ఇటీవల నోటీసులు పంపించాడు. అదేమని అడిగితే గొడవక’ు దిగి, దాడికి పాల్పడుతున్నాడు. చేత్తో కొట్టడం, చాకుతో బెదిరించడం చేస్తున్నాడు. ఇటీవల కుమార్తెను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇప్పటికై నా నా భర్తతో కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నా. న్యాయం చేయగలరు. – బాధిత మహిళ, చుట్టుగుంట, గుంటూరు -
బాణసంచా గోదాములపై మెరుపు దాడులు
చిలకలూరిపేటటౌన్: ఇటీవల సామర్లకోట వేట్లపాలెంలో జరిగిన బాణసంచా దుకాణాల్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీపీ, పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి చిలకలూరిపేట పరిధిలోని బొప్పూడి, చినపసుమర్రు ప్రాంతాల్లోని పలు బాణసంచా హోల్సేల్ దుకాణాలు, గోదాములపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పల్నాడు ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు నేతృత్వంలో సుమారు 8 దుకాణాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.2లక్షల విలువైన బాణసంచా నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉండగా, మెజారిటీ గోదాముల్లో అంతకు మించి భారీగా నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించామన్నారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం ఆయా దుకాణాలకు తాళాలు వేశారు. వీటికి సంబంధించిన మిగిలిన శాఖల జిల్లా అధికారులు, బాణసంచాకు సంబంధించిన నిపుణులను తీసుకువచ్చి నిల్వలను లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ట్రైనీ డీఎస్పీ నిరంజన్, డీఎస్పీ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా బాణసంచా దుకాణాలు పరిశీలించామని, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతికి మించి అక్రమంగా నిల్వలు ఉంచితే వాటిని వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, ఆర్డీఓల సమక్షంలో సమగ్ర తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిల్వలు ఉంచనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అర్బన్ సీఐ పి.రమేష్, రూరల్ ఎస్ఐ జి.అనిల్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ మంత్రి అంబటికి పరామర్శ
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. అంబటితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంభం విజయరాజుతో పాటు ఆ నియోజకవర్గ మండల అధ్యక్షులు, పలువురు ఎంపీటీసీలు రాయకుల సత్యన్నారాయణ, శాంతారావు, తమ్మిశెట్టి గిరిజ, బొల్లు వెంకట సత్యన్నారాయణలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అంబటి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ టీడీపీ గూండాలు రాజకీయంగా అంబటిని ఎదుర్కోలేక భౌతిక దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. దివ్యాంగుల విభాగం నేతల పరామర్శ వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్రాజు, నాయకులు కొమ్మిరెడ్డి శివారెడ్డి, శంకర్, కొండరాజు, షేక్ బాబ్జీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు రాంబాబును పరామర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై పోలీసులు మోపిన అక్రమ కేసులో ఎలాంటి అరెస్టు చేయవద్దని సూచిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సోమవారం అందాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 31వ తేదీన గుంటూరు సిద్ధార్థనగర్లోని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెందిన ఇల్లు, కార్యాలయంపైనా, ఆయనపైనా టీడీపీ గూండాలు దాడి చేశారు. అనంతరం పోలీసులు రాంబాబుపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు నగరానికి విచ్చేశారు. ఆ పర్యటనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసు యాక్ట్ 30ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా జనాన్ని సమీకరించారని, రోడ్డు దిగ్బంధం చేశారని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అభియోగం మోపుతూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన మురళీకృష్ణ హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న ఏ కేసులోనూ అరెస్ట్ చేయడానికి వీలులేదని, నోటీసు ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎటువంటి అరెస్ట్లు చేయవద్దని స్పష్టంగా పేర్కొన్నారు. -
వసతులు కల్పిస్తే ఆహ్లాదం
మారిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి కోసం, కాసేపు ఆహ్లాదంగా గడపాలని భావిస్తున్నారు. ఇందుకు పార్కులను ఆశ్రయిస్తున్నారు. కానీ దాదపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు పాలకుల తీరుతో నిరుపయోగంగా మారింది. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. పలు ప్రదేశాలు మద్యం సీసాలు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. పార్కులు వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయిని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పచ్చదనంతో నింపాలని, చిన్న పిల్లలకు ఆట వస్తువులు, పెద్దలు వ్యాయామం చేయడానికి పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునేలా ట్రాక్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను తొలుత సంబందిత అధికారులు పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్నారు. పరిష్కార చర్యలకు నిర్దేశిత సమయాన్ని తెలియజేయాలన్నారు. పరిష్కారం కాని సమస్యల గురించి అర్జీదారులకు వివరించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి చర్యలు తీసుకొని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 350 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
లక్ష్మీపురం: కేంద్ర ప్రభుత్వం పోస్టల్ ఉద్యోగుల సమస్యలను మానతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ అన్నారు. గుంటూరు పోస్టల్ డివిజన్లో ఆదివారం నేషనల్ యూనియన్ పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం జరిగింది. వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ 8వపే కమిషన్లో జీడీఎస్ ఉద్యోగులను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఉన్న సేవల్లో కొన్ని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చెంది కొత్తవి రావాలని, ఇంకా వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు, పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ, డిప్యూటీ సర్కిల్ సెక్రెటరీ నవీన్ కుమార్, రిటైర్డ్ ఎంప్లాయిస్, జీడీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీ యోగేశ్వరరావు, సీనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ -
ఎర్ర బుక్లు.. పసుపు బుక్లకు ఎవ్వరూ భయపడరు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్)/ నగరంపాలెం: నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్ర బుక్ పాలనకు.. పసుపు బుక్ పాలనకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే రోజులు పోయాయని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకర రావులు పరామర్శించారు. కొడాలి నాని మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై, కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని వదిలేశారని మండిపడ్డారు. కానీ అంబటి రాంబాబును 18 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని ధ్వజమెత్తారు. అంబటిని రెచ్చగొట్టినప్పుడు నోరు జారి ఒక మాట మాట్లాడారని, దానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కావాలనే టీడీపీ వారు ఇలా దాడి చేయించారని అన్నారు. జగన్తో పెట్టుకుంటే లోకేష్కే ప్రమాదం రెడ్బుక్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉందో లేదో మీకు త్వరలో తెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ బుక్లో వైఎస్ జగన్ పేరు రాస్తే లోకేష్కే ప్రమాదమని, వైఎస్ జగన్ ఏదైనా బుక్లో లోక్ష్ పేరు రాసినా లోకేష్కే ప్రమాదమని హెచ్చరించారు. సిగ్గు ఉంటే ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంపై పాలకులు దృష్టి సారించాలన్నారు. అరెస్టులతో మరింత పట్టుదల అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైఎస్సార్ సీపీలోని అన్ని స్థాయిల నాయకుల్లో మరింత పట్టుదల పెరిగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారనే ఇంగితజ్ఞానం లేకుండా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి ఇలా దాడులు చేస్తే వాళ్లకి మద్దతు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దుస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. 2014–19 మధ్య కాపు నాయకులు ముద్రగడ పద్మనాభంపై దాడి చేశారని, వారి కుటుంబ సభ్యుల్ని హింసించారని, ఇప్పుడు కాపు నాయకుడైన అంబటిపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం కొందరికి అలవాటుగా మారిపోయిందని స్పష్టం అవుతోందన్నారు. కక్ష సాధింపు మానుకోకుంటే ఇబ్బందులే ఎవరైనా కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపితే వారి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. కేసులు పెట్టినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళతామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోని ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు పలికారు. జై జగన్, జై అంబటి, కాపుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా అంబటి నివాసానికి తరలివచ్చారు. -
ఉపాధ్యాయుల మెడపై కత్తి
గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కాలాన్ని హరించి వేస్తున్న యాప్లతోపాటు ఉన్నతాధికారుల నుంచి అర్జెంట్ పేరుతో అడిగిందే తడవుగా సమాచారాన్ని పంపాలంటూ పెడుతున్న ఒత్తిడిని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భరించలేకపోతున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందేనంటూ చేస్తున్న హెచ్చరికలతో రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి, ఏ విధంగా మాట్లాడుతారో, క్రమశిక్షణా చర్యల పేరుతో ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారో అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు రాసేది విద్యార్థులు అయితే అంతకు పదింతలు తీవ్ర ఒత్తిడితో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అధికారంలోకి వస్తే జీవితాలను మార్చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, పదింతలు పని ఒత్తిడితో ఉపాధ్యాయుల మెడపై కత్తి పెట్టింది. ఉపాధ్యాయ సంఘాల పరామర్శ డీఈవో హెచ్చరికలతో ఆస్పత్రి పాలైన హెచ్ఎం శ్రీనివాసరావును పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. అధికారులు వ్యహరిస్తున్న తీరు సరికాదని, పరీక్షల పేరుతో తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడంతోపాటు పాఠశాలల సందర్శన సమయంలో వ్యక్తిగతంగా దూషించడం మానుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల ముందే తిట్టడం, అరవడం వంటి సంఘటనలపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనకు దిగిన విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సంఘాల నాయకులు చెబుతున్నారు. గుంటూరు కేవీపీ కాలనీలోని కేఎస్సార్టీ నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాసరావు శనివారం గుండెపోటుతో లలితా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయన గత గురువారం వ్యక్తిగత పనులపై అధికారికంగా సెలవు పెట్టారు. అదేరోజు పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు ?. అయితే ఆయన సెలవు పెట్టారని చెప్పినప్పటికీ, పాఠశాలకు రావాలంటూ హడావుడిగా ఫోన్ చేసి పిలిపించారు. డీఈఓ పిలిచారని తెలియడంతో సదరు హెచ్ఎం శ్రీనివాసరావు పాఠశాలకు హడావుడిగా వచ్చారు. హెచ్ఎం వచ్చిన సమయానికి డీఈఓ సలీమ్ బాషా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తరగతి గదిలోకి వచ్చిన హెచ్ఎంపై విద్యార్థుల ఎదుటే అకారణంగా సీరియస్ అవడంతోపాటు వెళ్లి ఆఫీస్ రూమ్లో వేచి ఉండాలని డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ రూమ్కు వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా సెలవులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈఓ ఏకవచనంతో మాట్లాడటంతో సంబంధిత హెచ్ఎం తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఎదుట ఏకవచనంతో సంబోధించడంతోపాటు అధికారికంగా లీవ్ యాప్లో సెలవు నమోదు చేసినా, వ్యక్తిగత పనులపై ఉన్న హెచ్ఎంను పాఠశాలకు పిలిపించిన సంఘటన ఆయనలో తీవ్ర ఆవేదన కలిగించింది. అదే రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన హెచ్ఎం శ్రీనివాసరావు జరిగిన సంఘటనపై తీవ్రంగా కలత చెందారు. మనోవేదనతో గుండెపోటకు గురి కావడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెచ్ఎంను పరీక్షించిన వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. -
న్యాయ విచారణ చేపట్టాలి
గడిచిన మూడు నెలల్లో సుమారు 40 మందికిపైగా సచివాలయ ఉద్యోగులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్ల వయస్సు గలవారే. ఈ మరణాలకు కారణం తీవ్రమైన పని ఒత్తిడే. సచివాలయ శాఖలో సుమారు 15 వేల మందికిపైగా ఉద్యోగులు వివిధ శాఖలకు, అధికారుల వద్ద డెప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వీరందరి భారం మిగిలిన వారిపైనే పడి వారు తీవ్రమైన పని ఒత్తిడితో మరణిస్తున్నారు. సర్వేలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతోపాటు సచివాలయ ఉద్యోగుల మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం -
ఢిల్లీని ఫిదా చేసిన గుంటూరు ఆతిథ్యం
● ‘వేదిక’అంకితభావానికి దక్కిన అభినందన ●నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రశంసలుయడ్లపాడు: తెలుగు నాటక రంగానికి.. గుంటూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అసాధారణ విజయాన్ని సాధించింది. గుంటూరులో 25వ భారత్రంగ్ మహోత్సవ్–2026 అంతర్జాతీయ నాటకోత్సవం దిగ్విజయ నిర్వహణకు దేశ రాజధాని ఢిల్లీ ఫిదా అయింది. ఈ వేడుకల విజయవంతంపై న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఎన్ఎస్డీ డైరెక్టర్ చిత్తరంజన్ త్రిపాఠి ప్రత్యేక అభినందన పత్రాన్ని పంపించారు. ఆ విషయాలను ఆదివారం ముత్తవరపు మీడియాతో పంచుకున్నారు. కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర... గత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీవరకు గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన ఈ అంతర్జాతీయ నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక గొప్ప సాంస్కృతిక పండుగలా సాగాయని ఎన్.ఎస్.డి కొనియాడిందని సురేష్బాబు తెలిపారు. ముఖ్యంగా దేశ, విదేశీ కళాకారులకు కల్పించిన వసతులు, సాంకేతిక తోడ్పాటు ఉత్సవం నిర్వహణలో ప్రదర్శించిన క్రమశిక్షణ అద్భుతమని ప్రశంసించిందన్నారు. ఈ గౌరవం ‘వేదిక’ బృందం అంకితభావానికి, రెండు తెలుగు రాష్ట్రాల నాటక రంగ పెద్దలకు, గుంటూరు నగరవాసుల సహకారానికి దక్కిన ప్రతిఫలమన్నారు. దేశ, విదేశీ నాటక బృందాల మధ్య వేదిక ఒక వారధిగా నిలిచిందన్నారు. ఐదు రోజుల పాటు ఎక్కడా ఆటంకాలు లేకుండా పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో వేదిక కలిసి వేసిన ఈ తొలి అడుగును సుదీర్ఘ ప్రయాణంగా కొనసాగిస్తామని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. -
సచివాలయాల్లో నిత్య నరకం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాబ్చార్ట్ ప్రకారం ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి పనులు అప్పగించలేదు. ఆ తర్వాత నుంచి క్షణం తీరిక లేకుండా పనులు అప్పగించి తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా అది సచివాలయ ఉద్యోగులే చేయాలనే దుస్థితి నెలకొంది. నెహ్రూనగర్: ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే–2025, పీ–4 సర్వే (పేదరిక నిర్మూలన), అక్షరాంధ్ర, ఈకేవైసీ, పల్స్ సర్వే.. ఇలా ప్రతిదీ సచివాలయ ఉద్యోగుల నెత్తినే పడుతోంది. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి వెళ్లాల్సి వస్తోంది. వీటితోపాటు ట్యాప్ కనెక్షన్లు, బాత్రూమ్ ఫొటోలు తీయడం, ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు అప్పగిస్తున్నారు. వార్డు కార్యదర్శులకై తే సర్వేలతోపాటు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి, సమీక్షల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. రాజకీయ విమర్శలు అధికార కూటమి నేతలు సచివాలయాలను ’దరిద్రాలయాలు’ అని, ఉద్యోగులను ‘ఎందుకూ పనికిరారు’ అని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీరా చూస్తే ప్రభుత్వ ప్రచారాలకు, ప్రతి నెలా సర్వేలకు సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వాడుకుంటోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని పేర్లు మార్చి ఉద్యోగుల విధులను మాత్రం అస్తవ్యస్తం చేసింది. జిల్లాలో 568 సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేరువ చేసే ఉద్దేశంతో 2019 ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 543 రకాల ఈ– సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 568 సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 5,563 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అగమ్యగోచరం గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. సంబంధం లేని పనులన్నీ సచివాలయ సిబ్బంది నెత్తిన రుద్దుతుండటంతో పనిభారంతో వారు అల్లాడిపోతున్నారు. ఒక వైపు గతంలో వలంటీర్లు చేసిన పనులు, మరో వైపు రోజుకో కొత్త సర్వేతో సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మార్చుకోవాలని కోరారు. సర్వీసుపరంగా ఏడో ఏట అడుగుపెడుతున్నా సచివాలయ ఉద్యోగులకు నేటికీ ఎలాంటి పదోన్నతులు లేవు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేరలేదు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనులు పురమాయిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలు దాటిన తర్వాత కూడా డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు గంటల తరబడి మీటింగులు పెడుతుండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా వీరికి మాత్రమే బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడం గమనార్హం. రాష్ట్రంలో 75 శాఖలు ఉండగా, అత్యధికంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష్యాలు చేరుకోలేక, అధికారుల చీవాట్లు పడలేక కొందరు రాజీనామా చేస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ట్విట్టర్ క్యాంపెయిన్ ప్రకారం.. ఒత్తిడి తట్టుకోలేక సుమారు 40 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఒక సమయంలో ఒకే పని ఇవ్వాలని, సీనియారిటీ జాబితా రూపొందించి ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించిన చైతన్య
గుంటూరు మెడికల్: పెళ్లీడుకొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కళ్లెదుటే చనిపోయాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డ ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే అకాల మృత్యువుకు లోనయ్యాడు. యువకుడైన బిడ్డ చనిపోయి గుండెలు పిండేసే బాధలో ఉన్న తల్లిదండ్రులు తమ బాధను దిగమింగుకుంటూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి నూతన జీవితాలను ప్రసాదించేందుకు అవయవ దానం చేశారు. తల్లిదండ్రుల గొప్ప నిర్ణయంతో ఓ యువకుడి అవయవాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆదివారం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో జరిగిన మహత్కర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నల్లపనేని వెంకటశివ, ఆదిలక్ష్మిల దంపతుల కొడుకు చైతన్య (25) శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 27న ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో తాటపూడి గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చైత్యన్య మెదడుకు తీవ్ర గాయాలు అవ్వటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో చికిత్స కోసం చేర్పించారు. చైతన్యకు ఆసుపత్రిలో వైద్యుల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయేసరికి 28న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ జీవన్దాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు కొడాలి అనూష, చింతమనేని అఖిలేష్లు చైతన్య తల్లిదండ్రులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. దీంతో యవకుడి తల్లిదండ్రులు బిడ్డను పొగొట్టుకున్న బాధలో ఉండి కూడా తమ బిడ్డ అవయవాలు వేరొకరికి నూతన జీవితాన్ని ఇస్తాయని తెలుసుకుని ముందుకొచ్చి అవయవదానం చేశారు. తల్లిదండ్రుల పెద్దమనస్సు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు హాస్పటల్లో చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయస్సులోనే రోడ్డు ప్రమాదంలో చైతన్య చనిపోవటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పెంచి పెద్దచేసిన బిడ్డను కోల్పోయిన బాధలో ఉండి కూడా వెంకటశివ, ఆదిలక్ష్మి దంపతులు అవయవదానం చేయటం చాలా మంచి పని అని, వారి మంచి మనసుకు అభినందనలు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు చైతన్య కుటుంబ సభ్యులను అభినందించి, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. చైతన్య అవయవదానంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్లో తీవ్ర అనారోగ్యంలో ప్రాణాపాయస్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఇరువురు బాధితులకు ఆస్పత్రి వైద్య బృందం లివర్, కిడ్నీ అవయవాలు అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీని విజయవాడ, రెండు నేత్రాలు ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. -
అశ్లీల ఓటీటీలను నిషేధించిన కేంద్రం
తెనాలిటౌన్: అసభ్యకర, అశ్లీల కంటెంటులను ప్రదర్శిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లు ఇకపై భారతదేశంలో కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించినదని మా– ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వీటికి సంబంధించిన 57 సోషల్ మీడియా ఖాతాలు, 10 యాప్లు, 19 వెబ్సైట్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందన్నారు. స్థానిక మా–ఏపీ కార్యాలయంలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో 13 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఉంకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శృంగార కంటెంటులను 16 ఏళ్ళ లోపు పిల్లలకు దూరంగా ఉంచేలా చట్టం చేయవలసిందిగా ప్రభు త్వానికి ఆయన సూచించారు. ఇక రోగుల ప్రాణాలతో సోషల్ మీడియ చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఒకరు తినగూడదని చెపితే మరొకరు తినొచ్చు అని వీడియోలు పెట్టడం వలన ప్రజలు లేని రోగాలను తెచ్చుకుంటున్నారని దిలీప్ రాజా వాపోయారు. శాశ్వత నివారణ లేని వ్యాధుల ను సైతం తగ్గిస్తామని వైద్యశాస్త్రం చదవని వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పటం వలన ప్రజలకు ఎంత ప్రాణాంతకమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేశారు. సమావేశంలో పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. మా – ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా -
ప్రతి పల్లెలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలి
మేడికొండూరు: ప్రతి పల్లెలోనూ వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేయాలని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మండలంలోని సిరిపురం గ్రామంలో వివిధ విభాగాల కమిటీ అభ్యర్థులతో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి పునాదులని వివరించారు. పార్టీ కోసం పనిచేసే గ్రామ, మండలస్థాయిలోని వివిధ విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని టీడీపీ దౌర్జన్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ కంకణ బద్దులుగా కావాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరు వంశీకృష్ణ, సిరిపురం గ్రామ పార్టీ అధ్యక్షులు కంకణాల పరమేశ్వరరావు, జోసఫ్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు కాసు విజయమ్మ రాయప్ప రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు, స్టేట్ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి ప్రదీప్ గొంది రవి, మిరియాల శివరామకృష్ణ, ఏరా బాబు, కన్నయ్య, అబ్దుల్లా, హబీబుల్లా, ఇక్బాల్, కరిముల్లా, విద్యాసాగర్, తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్రబాబు -
కల్పవృక్ష వాహనంపై నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతూ మాడ వీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి సునీల్కుమార్ పర్యవేక్షించగా, ఉత్సవ కైంకర్యపరులుగా తిరుపతికి చెందిన గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సమయంలో స్వామిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామి కృపకు పాత్రులు అవుతారని భక్తుల నమ్మకం. పొన్న వాహన కై ంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేడు కల్యాణ వేడుక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం అశ్వ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారని, రాత్రి ఎదురుకోలు ఉత్సవం కోలాహలంగా జరగనుందని పేర్కొన్నారు. కల్యాణ వేదికపై వేంచేసి దర్శనమిస్తారు. కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం వేదిక మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. -
రేపు శివాలయం మూసివేత
పెదకాకాని: శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయంలో చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటలలోపు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం, అభిషేకాలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు, ఇతర అన్ని ఆర్జిత సేవలకు అనుమతి ఉంటుందన్నారు. అన్నప్రసాదం నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చి 4న బుధవారం ఉదయం ఆలయ ప్రోక్షణ తర్వాత భక్తులకు ఉదయం 7 నుంచి స్వామివారి దర్శనం, ఇతర అన్ని ఆర్జిత సేవలకు యథావిధిగా అనుమతి ఉంటుందని తెలిపారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆదిపరాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. రేపల్లె: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన చంద్రకళ తన భర్తతో గొడవల కారణంగా మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి పెనుమూడి పులిగడ్డ వారధి వద్దకు చేరుకుంది. వారధిపై నిలబడి రోదిస్తూ కృష్ణా నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని తల్లి, పిల్లలను సురక్షితంగా స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
6 నుంచి విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా 5వ తేదీ సాయంత్రం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షా బంధనం, అంకురారోపణ, 6వ తేదీ ఉదయం అరణిమథనం, అగ్ని ప్రతిష్ఠ, మన్యుసూక్త హవనం, పంచగవ్య శుద్ధి, పూర్ణాహుతి, అష్టోత్తర శత కలశాభి షేకం, సాయంత్రం అగ్నిముఖం, వాస్తు పూజ, హనుమద్వైభవ ప్రవచనం, పూర్ణాహుతి, 7వ తేదీ ఉదయం మన్యుసూక్త హవనం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి, అదే రోజు సాయంత్రం అగ్నిముఖం, తత్త్వన్యాస హోమం, పూర్ణాహుతి, సామూహిక హనుమద్ పూజ, ఈనెల 8వ తేదీ ఉదయం 10.55 గంటలకు విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, అనంతరం తీర్థప్రసాద గోష్ఠి, విశేష తదీయాధన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 6 నుంచి 8వ తేదీ వరకు రోజూ సుందరకాండ పారాయణ, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయణ, అఖండ హరేరామ నామ సంకీర్తన, హనుమద్ పూజలు, విశేష తదియారాధన జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు. -
ఏపీజేఏసీ చైర్మన్ గా ఘంటసాల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని ఏపీ ఎన్జీజీవో సంఘ కార్యాలయంలో శనివారం జేఏసీ భాగస్వామ్య సంఘాలన్నీ కలిసి గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సంఘ ఐక్యత, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఘంటసాల శ్రీనివాసరావు.. గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్గా ఘంటసాల శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీజీవో గుంటూరు జిల్లా అధ్యక్షుడు) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, జేఏసీ సెక్రటరీ జనరల్గా మహమ్మద్ ఖలీద్ (ఏిపీటీఎఫ్–257 జిల్లా అధ్యక్షుడు) ఎంపికయ్యారు. సమావేశంలో కో–చైర్మన్లు గా ఎం.శ్రీనివాసరెడ్డి (ఆర్టీసీ సంఘం), షేక్ బాజీ (ఎస్టీయూ ), ఎస్వీ రమణారావు ( కమర్షియల్ టాక్స్ సంఘం) వైస్ చైర్మన్ లుగా ఎం.కళాధర్ ( యూటీఎఫ్), కె.నరసింహారావు(ఇరిగేషన్ సంఘం) యశోదర దేవి (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్) కె.పిచ్చయ్య ( పెన్షనర్స్ సంఘం), జె.పూర్ణచంద్రారెడ్డి ( ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘం), జాయింట్ సెక్రటరీలుగా టి.మహేష్ (స్వర్ణ వార్డ్ స్వర్ణ గ్రామ ఎంప్లాయ్ అసోసియేషన్), ఎం వెంకయ్య ( ఆర్ అండ్ బీ సంఘం ), పి.సుజాత ( ఏపీ ట్రెజరీ అసోసియేషన్ ), కె.రాంబాబు ( వెటర్నరీ సంఘం), చింతల కళ్యాణ్ కుమార్ (కమర్షియల్ టాక్స్ సంఘం), వెల్లంపల్లి పద్మజ (నర్సింగ్ అసోసియేషన్), జి. సుకుమార్ (సీపీఎస్ ఎంప్లాయిస్ సంఘం), కె. సాంబశివరావు (పంచాయతీ సెక్రటరీ సంఘం ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.శ్యాంసుందర్ శ్రీనివాస్ ( ఏపీ ఎన్జీజీవో జిల్లా కార్యదర్శి ), ట్రెజరర్ గా ఎల్.శ్రీధర్ రెడ్డి( ఏపీ ఎన్జీజీఓ ) ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా జి.వేళాంగిణి రాజు (ఏపీటీఎఫ్ 1938 ), డి.శ్రీనివాసరెడ్డి (పిఆర్టియు ), టీవీ మోహన్ రాజు (రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం), సిహెచ్.అంజనీ దేవి (పే అండ్ అకౌంట్స్), వై సి హెచ్ కోటేశ్వరరావు (స్టాటిటిక్స్ సంఘం), ఎం శ్రీనివాసరావు (అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ సంఘం), జె.వెంకటేశ్వరరావు(గ్రంథాలయాల శాఖ), ఎం కోటయ్య(ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ), ఎం శ్రీనివాసరావు (డీఈఓ ఆఫీస్), పి కోటేశ్వరరావు(క్లాస్ ఫోర్ అసోసియేషన్) నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వైభవంగా నృసింహుని హంస వాహనోత్సవం
మంగళగిరి టౌన్ : మంగళాద్రితో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారు శనివారం ఉదయం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి రంగురంగు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం దేవస్థానం వద్దనుంచి ప్రారంభమై సాధుసోడా సెంటర్, పూలమార్కెట్ సెంటర్మీదుగా మిద్దెసెంటర్ వరకు సాగింది. ఈ ఉత్సవంలో మహిళలు కోలాటం చేస్తూ స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రి గజవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వగా అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా, హంసవాహన సేవా కై ంకర్యపరులుగా వేదాంత గోపాలసత్యవతి, వేణుగోపాల వాసుదేవ భట్టర్, అరుణ ప్రియలు వ్యవహరించగా, గజవాహన సేవా కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీపద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. రాత్రి గజవాహనంపై విహరించిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించనున్నారు. రాత్రి పొన్నవాహనం ఉత్సవం జరుగుతుందని ఆలయ ఈవో సునీల్కుమార్ తెలిపారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
నేడు సీజేఐ సూర్యకాంత్ రాక
తాడికొండ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి తెలిపారు. ఆదివారం ఏపీ జ్యూడీషియల్ అకాడమి, క్లబ్ హౌస్ శంకుస్థాపన, హైకోర్టు అతిథి గృహాల ప్రారంభోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ప్రముఖుల పర్యటనకు రాజధాని రహదారులను ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాజధానిలో ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్రోడ్డులో రాయపూడి, దొండపాడు వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు పనులు, ప్రధాన కూడళ్ల వద్ద బీటీ లేయర్ పనులను ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ఎన్–16, ఎన్–17, ఈ– 4 రహదారులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా వాటిని బీటీ రహదారులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీరు బి.నరసింహమూర్తి, టి.మోజెస్ కుమార్ పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలి
భూములు కోల్పోతున్నఅమరావతి: తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, భూసేకరణ విధానాలపై రైతులకున్న సందేహాలకు సహేతుకమైన విధానంలో వివరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగాపురం, ధరణికోట గ్రామాలలో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రైతు సంఘాలతో ప్రభుత్వం అవగాహన కార్యక్రమం నిర్వహించి స్పష్టమైన విధానాన్ని తెలియపరచాలన్నారు. ఆయా గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారన్నారు. ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భూములు కోల్పోతున్న రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం స్పష్టంగా ప్రకటించలేదని, భూములు కోల్పోతున్న రైతుల పేర్లు, సర్వే నెంబర్లు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. తమ భూమి ఎంతపోతుందో అని ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో ఆరు నెలలు కిందట అధికారులు వచ్చి మాట్లాడటమే తప్ప మళ్లీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. ధరణికోట, లింగాపురం గ్రామాల్లో రైతులతో అభిప్రాయ సేకరణ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, వెంకటేశ్వరరాజు, రైతు సంఘం నాయకుడు దర్శి శేషారావు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, మొహద్దీన్ వలి పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య -
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
గుంటూరుఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026● పీపీపీ విధానంలో ప్రైవేట్ కంపెనీకి విద్యుత్ బస్సుల నిర్వహణ ● అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మాత్రం ఆర్టీసీ అధికారులదే.. ● రూ. 400 కోట్ల విలువైన భూమిని అప్పనంగా దోచిపెట్టే పన్నాగం సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. నరసరావుపేట ఈస్ట్: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. బస్సుల తరలింపు.. పనులకు సన్నాహాలు రూ. కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు మరోసారి చంద్రబాబు సర్కార్ తెరలేపింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్టీసీ విద్యుత్ బస్సులు నడపాలని నిర్ణయించినా, వాస్తవానికి సంస ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నుతోంది. దీని వలన ఆర్టీసీకి మేలు శూన్యం. పైగా సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 7 -
విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి
‘గ్యాస్’ వసూళ్లు మానుకోవాలి గుంటూరు వెస్ట్: విభిన్న ప్రతిభావంతుల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీలు అందించడానికి వచ్చిన విభిన్న ప్రతిభవంతుల వద్దకే జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. కదలలేని స్థితిలో ఆటోలో తీసుకువచ్చిన మంగళగిరికి చెందిన సింధు సాయి ఆటో వద్దకు వెళ్లి అర్జీ స్వీకరించారు. పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 46 అర్జీలు అందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయం సంచాలకులు వెంకటరవణప్ప, జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కల్తీపాలను ఇంట్లోనే గుర్తించవచ్చు గుంటూరు వెస్ట్: గ్యాస్ సిలిండర్ల డెలివరీ బాయ్స్ ఖాతాదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేయడంతోపాటు అమర్యాదగా మాట్లాడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయని అటువంటి వారిని విధుల నుంచి తొలగించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మిని శంకరన్ సమావేశ మందిరంలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
అమరేశ్వరస్వామి సేవలో ఇస్రో మాజీ చైర్మన్
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామిని శనివారం ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్ను దేవా లయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వర స్వామి, ,బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయఅర్చకులు ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్కుమార్కు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. వైద్య కళాశాలకు ‘భాష్యం’ రూ. 4.50 లక్షల విరాళం గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కళాశాలకు రూ.4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం సంబంఽధిత మొత్తాన్ని చెక్కు రూపంలో భాష్యం రామకృష్ణ కుమార్తె భాష్యం జనని, భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ బి.హరిబాబు చేతుల మీదుగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారికి అందజేశారు. గతేడాది సైతం ఇదే ఇదే విధంగా ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్కు ఐదు శీతలీకరణ యంత్రాలను అందజేసినట్లు హరిబాబు తెలిపారు. సేవా భావంతో భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు, భాష్యం పూర్వ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎన్యూ నూతన డైరీ ఆవిష్కరణ ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నూతనంగా ముద్రించిన విశ్వవిద్యాలయం డైరీ–2026ను ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్టార్ ఆచార్య సింహాచలంలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయంలోని విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమాచారాన్ని డైరీ రూపంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజిస్టార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సొంతగా ముద్రించిన డైరీ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. డైరీ ముద్రణ కమిటీ కన్వీనర్ ఆచార్య పద్మావతి మాట్లాడుతూ ఎంతో విలువైన సమాచారంతో అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ముద్రించామన్నారు. -
చంద్రబాబు, లోకేష్ డైరక్షన్లోనే విధ్వంసకాండ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్)/నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : నాలుగు వారాల క్రితం తన ఇల్లు, కార్యాలయం, కారు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అంతా చంద్రబాబు, లోకేష్ల డైరక్షన్లోనే జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన కార్యాలయం వద్ద శనివారం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుకు పరామర్శ.... ● రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ ఎర్రి పరిపాలన ఆపి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణయాదవ్లు పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే అంబటిపై దాడి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించారు. అంబటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రక్షించాల్సిన వారినే అడ్డుపెట్టుకుని దాడులు చేయటాన్ని చూసి రాష్ట్ర ప్రజలంతా ఉలిక్కిపడ్డారన్నారు. ఇది కూటమి పతనానికి నాంది అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు దేవుడిపై భక్తి, గౌరవం రెండు లేవని తేలిపోయిందన్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకున్నారని అంటున్నారని, ఏదైనా సభలకో, ఎక్కడైనా వెళ్లినప్పుడు వారు ఇస్తే పట్టుకోవటం తప్పా అని ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచే భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. పరమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిపోయిందని, ఆ ఘోరాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించాలని చూశారన్నారు. దీనిని ప్రజలతో పాటు భగవంతుడు కూడా చూశాడని కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్లు మూల్యం చెల్లించుకునే రోజు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు. అంబటిని పరామర్శించిన లక్ష్మీపార్వతి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో నారా లోకేష్, చంద్రబాబునాయుడు డైరెక్షన్లో నీచమైన పాలన కొనసాగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం రాంబాబును పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లను తగలబెట్టే దృశ్యాలను సినిమాల్లోనే చూసేవాళ్లం..కాని ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు పాలనలో చూస్తున్నామన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు చూస్తుంటే ఎవరో ఒకరిని చంపేసే ఉద్దేశంతోనే చేసినట్లుగా ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన తండ్రి, కొడుకుల పీడ విరగడ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
ముగిసిన ఆయేషా మీరా అవశేషాల అంత్యక్రియలు
తెనాలిరూరల్: తెనాలికి చెందిన ఆయేషామీరా హత్య కేసును మూసివేసిన సీబీఐ కోర్టు దర్యాప్తు కోసం తన దగ్గరున్న ఆమె అవశేషాలను శుక్రవారం విజయవాడలో తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం అవశేషాలను తెనాలిలోని ఈద్గాలో గల ఆయేషా మీరా సమాధిలో అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. అవశేషాలు తీసుకువస్తున్న కాన్వాయ్ను వీఎస్సార్ కళాశాల వద్ద నుంచి తోడ్కొని ఈద్గా మైదానానికి తీసుకువచ్చి వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆమె మృతదేహానికి 2019లో రెండో సారి పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెనాలి చెంచుపేటలోని కబరస్తాన్లోని ఆయేషా సమాధిని తవ్వించి, కేసు దర్యాప్తుకు అవసరమవుతాయన్న భావనతో కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)కి అప్పట్లో తరలించారు. హైదరాబాద్ గాంధీ వైద్యశాల ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. అనంతరం ఈనెల 20న కేసును మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దర్యాప్తు అధికారి, మృతురాలి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ ప్రకారం విజయవాడలోని సీబీఐ కోర్టుకు వెళ్లిన ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషద్ బేగం, ఇక్బాల్ బాషాలకు వారి కుమార్తె అవశేషాలను అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారుల బృందం భారీ భద్రత నడుమ తెనాలికి తరలించారు. వీఎస్సార్ కాలేజి దగ్గర నుండి ప్రజలు, ఆయేషా బంధువులు, ముస్లింలు ర్యాలీగా అవశేషాలను చెంచుపేటలోని ఈద్గా మైదానానికి తీసుకువచ్చారు. ముస్లింల ఆచారం ప్రకారం మత పెద్దలు దువా నిర్వహించిన అనంతరం కబరస్తాన్లో అప్పటికే తవ్వించి ఉంచిన ఆయేషా సమాధిలో అవశేషాలను సీబీఐ, రెవిన్యూ అధికారుల సమక్షంలో ఖననం చేశారు. దారి పొడవునా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు బందోబస్తును పర్యవేక్షించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పంచనామా నిర్వహించారు. మేం బతికుండగా ఆయేషా కేసు ముగియదు.. ఆయేషా అవశేషాలను ఖననం చేసిన అనంతరం ఆమె తండ్రి ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయేషా కేసు ముగిసిందంటున్నారని, తల్లిదండ్రులమైన తాము బతికి ఉన్నంత వరకు కేసు ముగియదన్నారు. ఆయేషాకు సీబీఐ, సిట్ అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసులో ఆధారాలు లేవంటున్నారని, దర్యాప్తు చేసిన అధికారులే ఆధారాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలుస్తామని, ఆయన ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడినప్పుడే ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలుగుదుందని స్పష్టం చేశారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి
● విద్యుత్ సరఫరా ఉన్న స్తంభం ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు ● లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్ ● మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంట్రాక్టర్ లక్ష్మీపురం: విద్యుత్ శాఖకు సంబంధించిన లైనుల మరమ్మతులు చేపడుతున్న సమయంలో విద్యుత్ షాక్కు గురైన యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పగటిపాటి అనిల్కుమార్ (22) ఎలక్ట్రీషియన్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య శ్రావణి, ఒక బాబు ఉన్నారు. రెండు సంవత్సరాలుగా విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద అనిల్కుమార్ పని చేస్తున్నాడు. అరండల్పేట 15/2వ లైనులో గురువారం విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఒక ట్రాన్సఫార్మర్ నుంచి సరఫరా ఆగిపోయినా, రెండో ట్రాన్సఫార్మర్ నుంచి సరఫరా అయింది. అనిల్కుమార్ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ అక్కిరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సంబంధిత సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంట్రాక్టర్ వచ్చి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తానని కాంట్రాక్టరు హామీ ఇచ్చారు. మృతుని భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కుటుంబ సభ్యులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే జీజీహెచ్కు చేరుకున్నారు. పోస్ట్మార్టం చేసిన వైద్యులు అప్పటికే వెళ్లిపోయారు. మృతుని కుటుంబ సభ్యులు జీజీహెచ్లో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు వచ్చి వైద్యులతో మాట్లాడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
శతాధిక వృద్ధుడు మృతి
తెనాలి: రూరల్ మండల గ్రామం అంగలకుదురుకు చెందిన శతాధిక వృద్ధుడు కన్నెగంటి పెదపాములయ్య(110) శుక్రవారం ఉదయం మృతిచెందారు. 1915లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన వ్యవసాయం చేస్తూ, తనకున్న పరిజ్ఞానాన్ని తోటి రైతులకు పంచుతూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా నూట పదేళ్లు జీవించారు. ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ 22 ఏళ్ల క్రితమే మృతిచెందారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె, మనవ సంతానం ఉన్నారు. కుటుంబసభ్యులు వీరరాఘవయ్య, వెంకటేశ్వరరావు, కుమార్తె విజయలక్ష్మి, మనవలు, మునిమనవలు అంతా కలిసేవున్నారు. పాములయ్య మేనల్లుడు అశోక్ బాటిల్ కంపెనీ అధినేత ఉన్నవ శాయిబాబు. తదితర గ్రామపెద్దలు పాములయ్య అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. -
ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి
11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు తెనాలిరూరల్: మార్చి 14వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డి. శ్రీనివాసులు న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. మోటారు వాహన చట్టంలో సుప్రీంకోర్టు చేసిన సవరణల గురించి వివరించారు. సివిల్ అప్పీల్ 9322/2022 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు రోడ్డు ప్రమాద బాధితులకు, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా, కేసులు సత్వర పరిష్కారినికి దోహపడుతోందని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ చక్కటి వేదిక అని, తద్వారా కక్షిదారుల సమయం, ధనం ఆదా అవుతుందని చెప్పారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలకు మేలు జరుగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా న్యాయవాదులు చొరవ చూపాలని కోరారు. మంగళగిరి టౌన్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్రావు కాలనీ బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. కాంక్రీట్ పిల్లర్లపై స్టీలు గడ్డర్లు ఏర్పాటు చేస్తున్న పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. 88 గడ్డర్లకు గానూ 20 గడ్డర్ల ఏర్పాటు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం రూ.70 కోట్ల వ్యయంతో 110 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పుతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు హైవేకు అనుసంధానం చేస్తూ నాలుగు లైన్ల రహదారిగా ఈ బ్రిడ్జి రూపుదాల్చనుందని పేర్కొన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ శనివారంతో ముగియనుంది. ఫిబ్రవరి 4న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ప్రారంభం నుంచి ప్రతిరోజూ పలువురు ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఎగ్జిబిషనన్ను సందర్శిస్తూ, వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ప్రతి రోజూ ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడుతూ ఉత్సాహభరితంగా సాగింది. ఇప్పటి వరకు సుమారు 80 వేల మంది ఈ ఎగ్జిబిషనన్ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులు మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఎగ్జిబిషనన్ను సందర్శించి, విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి. సుందరాచారిని అభినందించారు. ఫిబ్రవరి 28 చివరి రోజు కావున గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి విజ్ఞప్తి చేశారు. -
టెన్త్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
● మార్చి 16 నుంచి పరీక్షలు ● 149 కేంద్రాల్లో 26,699 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు ● జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాలకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులకు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేది నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 149 పరీక్ష కేంద్రాల్లో 26,699 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూముల నుంచి ఎస్కాట్స్ ద్వారా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలు తీసుకురావడంతో పాటు నిర్ణీత సమయంలో ఇన్విజిలేటర్లకు సక్రమంగా పంపిణీ జరిగేలా చీఫ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో వదంతులు వ్యాప్తి చెందకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజూ పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సక్రమంగా ప్యాకింగ్ చేసి పూర్తి భద్రత మధ్య సకాలంలో పోస్ట్ ఆఫీస్కు అందించాలన్నారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా శిక్షణలో తెలిపిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ పదో తరగతి పరీక్షల విధులు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్షలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు నిర్వర్తించాల్సిన ప్రక్రియలపై రిసోర్స్ పర్సన్స్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ప్రాంతీయ సంచాలకులు లింగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాష, డైరెక్టర్ కామన్ బోర్డు తిరుమలేష్, ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
● గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు ● ఉదయం చిన శేషవాహనంపై విహరించిన నారసింహుడు మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసిన యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గ్రామోత్సంలో స్వామివారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంలో కొలువుతీరిన బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గలవారిని హింసించేవాడు నారసింహుడు. నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. సాధు జనులకు అభయాన్నిస్తూ దుర్మార్గాన్ని పారద్రోలుటకు స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పక్షుల్లో గరుత్మంతుడు, మృగాల్లో సింహం తానేనని స్వామివారు చెప్పినట్లు అర్చకులు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు. ఉదయం చిన్నశేషవాహనంపై.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కై ంకర్య పరులుగా దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు హంస, గజ వాహన సేవలు గ్రామోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. -
గుంటూరులో ఏపీటీఎఫ్ ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉగ్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిల చెల్లింపుతో పాటు 12వ పీఆర్సీ కమిటీ నియామకం, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం బ్రాడీపేటలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ● ఈ సందర్భంగా బసవలింగారావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపులో భాగంగా అన్ని పాత తాలుకా కేంద్రాల్లో ఉపాధ్యాయులతో ధర్నా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ● టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో సాచివేత ధోరణిని అవలంబిస్తూ ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, సీపీఎస్ బకాయిలు అరకొరగా చెల్లించి పండగ చేసుకోమనడం దారుణమన్నారు. ● 12వ పీఆర్సీ జీతాలు పొందాల్సిన సమయంలో కనీసం చైర్మన్ నియమించుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి, మధ్యంతర భృతితో పాటు 11వ పీఆర్సీ బకాయిలు అన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ● ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు గత 20 నెలలకు పైగా గ్రాట్యుటీ చెల్లించలేదని, ఉద్యోగ విరమణ రోజునే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయడంతో పాటు నాలుగు పెండింగ్ డీఏలు చెల్లించలన్నారు. ● ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే 10వ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రాష్ట్ర స్థాయిలో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు. ● ఏపీటీఎఫ్ జీఓ కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవిధంగా చట్ట సవరణ చేసేందుకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 10న చలో ఢిల్లీ చేపట్టామన్నారు. ● ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ విద్యాశాఖాధికారుల విచిత్ర పోకడలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ● టెన్త్ పబ్లిక్ పరీక్షల సీఎస్, డీవోల నియామకంలో కొత్త పోకడలు అవలంబిస్తున్నారని, గతంలో ఎన్నడూ ఇన్విజిలేషన్ విధులను చేయనివారిని నియమించారన్నారు. జూనియర్లను కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్గాను, సీనియర్లను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ● అనంతరం తహసీల్దార్ సుభానీకి మెమోరాండం సమర్పించారు. ధర్నా కార్యక్రమంలో ఏపీటీఎఫ్ గుంటూరు జోన్ కన్వీనర్ పి.నాగశివన్నారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జి.దాస్. పి.లక్ష్మీనారాయణ, చక్కా వేంకటేశ్వరావు, పి.శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్లు కె.రమేష్, బి.సాయి లక్ద్మీ, , కిశోర్, బాలరాజు, మూర్తి, జహంగీర్, భాస్కర్, అప్పారావు, కృష్ణారావు, కోటయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు తప్పవని ఐదో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కె.లత అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సాయికళ్యాణ్చక్రవర్తి ఆదేశాల మేరకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో ట్రాఫిక్ రూల్స్పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.లత మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. లైసెన్న్స్లు, బీమా లేకున్నా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా నేరాలుగా పరిగణిస్తారని అన్నారు. లైసెన్స్ లేనివారికి వాహనాలు అప్పగించడం నేరమని స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టంలోని నేరాలు, శిక్షలు, మద్యం/ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. సదస్సులో ఏపీపీ అల్లంశెట్టి పవన్ కుమార్, గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సింగయ్య పాల్గొన్నారు. అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కె.లత -
డ్యామెక్కిన హామీ
గుంటూరు ఇఫ్తార్ సహరి (శని) (ఆది) గుంటూరు 6.20 5.09 నరసరావుపేట 6.22 5.11 బాపట్ల 6.20 5.09ఎన్నికల్లో గెలుపు కోసం సూపర్ సిక్స్ హామీల తరహాలోనే కూటమి నేతలు నియోజకవర్గాల్లోనూ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు వాగ్దానాలు చేశారు. అందులో కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్డ్యామ్ నిర్మాణం ఒకటి. అధికారంలోకి వచ్చి ఇరవై నెలలవుతోంది. కూటమి నాయకులు కీలకమైన ఆ హామీ ఊసే ఎత్తటం లేదు. నియోజకవర్గం నుంచి కేంద్రం, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులున్నా చెక్డ్యామ్ గురించి మాట్లాడితే ఒట్టు...అన్నట్టు ఉన్నారు. – తెనాలి 7తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 539.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక బాలాజీరావు పేటలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హామీలు గెలిచిన వెంటనే కొల్లిపర వద్ద కృష్ణానదిపై చెక్డ్యామ్ నిర్మిస్తామంటూ నాడు వాగ్దానం ఇరవై నెలలవుతున్నా పట్టించుకోకుండా మౌనం -
అవయవదానంతో పునర్జన్మ
మంగళగిరి టౌన్: విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన అజయ్కుమార్ (48) ఈనెల 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 24వ తేదీన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అజయ్కుమార్కు 25వ తేదీన వైద్యులు బ్రెయిన్డెడ్గా ప్రకటించారు. కుటుంబ సభ్యులు అజయ్కుమార్ అవయవాలు దానం చేసేందుకు గురువారం ముందుకు వచ్చారు. జీవన్దాన్ చైర్మన్ కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కాలేయం, కిడ్నీ మణిపాల్ హాస్పిటల్కు, మరొక కిడ్నీని విజయవాడ కామినేని హాస్పిటల్కు, కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. అజయ్కుమార్ కుటుంబసభ్యులను అభినందించారు. -
ఏఐ రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు
చిత్ర దర్శకుడు దిలీప్ రాజా నగరంపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) రాకతో చిత్ర పరిశ్రమకు కష్టాలు తప్పవని మా–ఏపీ వ్యవస్థాపకులు, చిత్ర దర్శకుడు దిలీప్రాజా అన్నా రు. గురువారం అరండల్పేటలోని ఓ హోటల్లో మా–ఏపీ 24 విభాగాల యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి దర్శకుడు అచ్చన శ్రీనివాస్యాదవ్ అధ్యక్షత వహించారు. దిలీప్రాజా మాట్లాడుతూ సాంకేతిక వర్గం అవసరం లేకుండా ఏఐతో చిత్రాలను రూపొందించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సంగీత దర్శకులు లేకుండానే కృత్రిమ మేధ పాటలకు ట్యూన్లు వస్తు న్నాయని అన్నారు. సన్నివేశాలు చెబితే సంగీతం వస్తుందని చెప్పారు. భవిష్యత్లో సాంకేతిక వర్గం అవసరం లేకుండానే చిత్రాలు విడుదలవుతాయ న్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మహేష్బాబు, దర్శకుడు రాజమౌళి ఫైటింగ్ దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయని చెప్పారు. దీన్ని ఏఐ రూపొందించిందని తెలిసి సంబరపడాలా? లేదా ఎవరి ప్రమేయం లేకుండా వచ్చిన వీడియోతో భవిష్యత్ ప్రమాదకరమో ముందస్తుగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని హెచ్చరించారు. ఏ చిత్రంలో అయినా ఏఐ దృశ్యాలుంటే సెన్సార్ చేయకుండా నిర్దిష్టమైన నియమాలను ఆచరణలోకి తేవాలన్నారు. సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, 24 విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలి
లక్ష్మీపురం: ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచి, అంగన్వాడీల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే బాబు ప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదన్నారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత చట్టాలు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే పేద పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి రమణ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 2న విజయవాడలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ వలి, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, లాయర్స్ యూనియన్ నాయకులు శేషగిరిరావు, డీవీఆర్సీ నాయకులు సురేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు జయ శ్రీలక్ష్మి, సుభాషిణి, స్వర్ణలత, రోజమ్మ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాదారుడి కుటుంబానికి రూ. కోటి బీమా అందజేత
కొరిటెపాడు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యడ్లపల్లి బ్రాంచ్కు చెందిన ఖాతాదారుడు పి. కామేశ్వరరావు డిసెంబర్ 2022లో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కామేశ్వరరావు అకస్మాత్తుగా మృతిచెందాడు. మృతుని భార్య పి.శివ కు ఖాతాదారుడి పాలసీకి సంబంధించిన రూ. కోటి బీమా పరిహారాన్ని గురువారం బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్ అందజేశారు. ప్రమోద్ మాట్లాడుతూ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తక్కువ ప్రీమియంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే బీమా పథకాలను అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు రాజశేఖర్, జనార్ధన్ రావు, రఘునాథ్ రెడ్డి, ఇండియా ఫస్ట్ లైఫ్ ఆర్బిహెచ్ మదన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కళ్లద్దాలు పంపిణీ
నగరంపాలెం: సమాజ సేవాభావనతో ముందుకు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుంటూరు ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అందించిన 150 రక్షణ కళ్లద్దాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని సమావేశ మందిరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎండలో, అధిక వేడి, ధూళిలో బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రక్షణకు గ్లాసులను అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉపాధ్యక్షుడు (ఆపరేషన్స్) శ్రీకాంత్ మాట్లాడుతూ సాంకేతిక సదుపాయాలతో సమగ్ర నేత్ర వైద్య సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకై ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రెటినా వైద్య నిపుణురాలు కల్పనారెడ్డి, వైద్యులు సులోచన, శివాని, ప్రసన్న, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జయకుమార్ పాల్గొన్నారు. -
యార్డులో రైతులకు ఉచిత భోజనం ప్రారంభం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం.చంద్రికలు గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని రైతులకు అందించనున్నట్లు వెల్లడించారు. ఉచిత భోజనంతోపాటు ఉదయం అల్పాహారం కూడా రైతులకు అందిస్తామని తెలిపారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం సోనా మసూరి రైస్, పప్పు, స్వీటు, గుడ్డు, వేపుడు, సాంబారు, ఇగురు కూర, గడ్డ పెరుగు, అప్పడాలతో కూడిన భోజనాన్ని రైతులకు పెట్టడం జరుగుతుందన్నారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ రెండు, చెట్నీ, కారంపొడితోపాటు సోమ, బుధ, శుక్రవారాల్లో సాంబారుతో కట్టె పొంగలి, మంగళ, గురువారాల్లో టమాటా బాత్, ప్రతి రోజూ ఒక టీ కప్పు అందిస్తారని తెలిపారు. ప్రతి రోజూ నాణ్యతను పర్యవేక్షించనున్నట్లు వారు వివరించారు. యార్డు వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, పాలకవర్గ సభ్యులు, యార్డు ఇన్చార్జి సుబ్రహ్మణ్యం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల టౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించడంతో పాటుగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చూడాలన్నారు. వేటపాలెం: శ్రీశైలం ద్వితీయ పీఠానికి పీఠాధిపతిగా వేటపాలేనికి చెందిన చల్లా రామారావుకు పట్టాభిషేకం చేశారు. శుక్రవారం శ్రీశైలంలో ఉమా రామలింగేశ్వర దేవాంగ నిత్య అన్నదాన సత్రంలో పడవీడు గాయత్రీ పీఠం పీఠాధిపతులు చెన్న కోటిలింగమూర్తి ద్వితీయ పీఠాధిపతికి పట్టాభిషేకం చేయించి కిరీటం, నంది ధ్వజం ఏర్పాటు చేశారు. ద్వితీయ పీఠాధిపతులుగా పట్టాభిషేకం చేసిన చల్లా రామారావుకు దేవాలయ పరబ్రహ్మ స్వామిగా నామకరణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ప్రతినిధులు, కుల సేనాధిపతులు పాల్గొన్నారు. వేమూరు: అమర్తలూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అంబటి వెంకట సుబ్బమ్మ (108) గురువారం మృతిచెందారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చారు. ఆమెకు కుమారుడు అంబటి రామమోహన్రావు, కోడలు, మనవరాళ్లు ఉన్నారు. అంబటి రామమోహన్రావు వైఎస్సార్సీపీలో ఉన్నారు. వెంకటసుబ్బమ్మ భౌతికాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు, పెద్దలు సందర్శించి నివాళులు అర్పించారు. -
కల్యాణం.. వైభోగం...
రేపల్లె: ఉప్పూడి రోడ్డులో వేంచేసియున్న శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ అర్చకులు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి, దేవేర్లుకు మంగళస్నానాలు చేయించి పట్టువస్త్రాలు, పువ్వులతో వధువరులుగా అలంకరించారు. వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి కల్యాణం చేశారు. స్వామివారి పరిణయ ఘట్టాలను భక్తులకు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
నీట్కు జిల్లాలో 20 కేంద్రాలు
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో 20 కేంద్రాల్లో నీట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశాసామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మే 3న నిర్వహించే నీట్కు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. 1650 మంది వరకు పరీక్షకు హాజరు అవుతున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, నీట్ కన్వీనర్లు పాల్గొన్నారు. తప్పులు లేని మ్యుటేషన్ లక్ష్యం తప్పులు లేని మ్యుటేషన్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో శం గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి ఇదనే అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఏ తప్పు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 8 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పుస్తకాలు ముద్రణలో ఉన్నాయని, పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. 35 గ్రామాల్లో నాలుగవ దశ రీ సర్వే జరుగుతోందని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు. జనాభా లెక్కల సేకరణలో ముందంజలో ఉండాలి జనాభా లెక్కల సేకరణలో ముందంజలో ఉందామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జనాభా లెక్కల సేకరణ – 2027 – ఇళ్ల జాబితా తయారీ, కుటుంబ జనాభా గణన అంశంపై జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గురువారం ముగిసింది. కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో అవగాహన పొందిన పరిజ్ఞానంతో మంచి డేటా సేకరణ చేయాలన్నారు. జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. -
నృసింహుడు
యాలి వాహనంపైమంగళగిరి టౌన్ : మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు యాలివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. వ్యాళి వాహనాన్నే యాలి వాహనం అంటారు. హింసించే స్వభావం ఉన్న క్రూరులను శిక్షించి సాధువులను రక్షించేందుకు తానున్నానని తెలియజేసేందుకు లక్ష్మీనరసింహస్వామికి యాలివాహన ఉత్సవం నిర్వహిస్తారు. యాలివాహన రూఢుడైన స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వల్ల కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ముత్యాల పల్లకి వాహనంపై.... స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ముత్యాల పల్లకి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్య పరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి శుక్రవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి ఏడు గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. -
రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది
అంబటిని పరామర్శించిన పలువురు ఎమ్మెల్సీలు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, టి.మాధవరావు, బొమ్మి ఇజ్రాయేల్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఇస్సాక్ బాషా, వంకా రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, కాసు మహేష్ రెడ్డి, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), వినుకొండ, పెదకూరపాడు పార్టీ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే..సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బిహార్ రాష్ట్రం కంటే దిగజార్చి చంద్రబాబు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ అంబటి ఇంటిపై దాడిని దేశం అంతా చూసిందన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ అంబటిపై కావాలనే చంద్రబాబు ప్రభుత్వం దాడి చేయించిందన్నారు. -
నేడు ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు
తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసును సీబీఐ కోర్టు ఇటీవల మూసివేయడంతో ఆమె అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 20న కేసు మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు షంషద్బేగం, ఇక్బాల్బాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఉదయం తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. భద్రత నడుమ గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించారు. ఆమేరకు శుక్రవారం కోర్టులో పంచనామా జరిపిన అనంతరం అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించనున్నారు. చెంచుపేటలోని ఖబరిస్తాన్లో అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఈనెల21వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు, శ్రీ యోగాంజేయ స్వామివార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, ప్రథమారాధన, మంగళాశాసనం, ఋత్విక్ సమ్మానం, ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరు చోరుల అరెస్టు
సుమారు రూ.38 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం నగరంపాలెం (గుంటూరు వె స్ట్): చోరీ కేసుల్లో ఇద్దరు పాత నేరస్తులను దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు రూ.38 లక్షల విలులైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... దుగ్గిరాల గ్రామం బ్రాహ్మణబజార్కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగిందన్నారు. దీనిపై దుగ్గిరాల పీఎస్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ వెంకటరవి కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, సాంకేతిక ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి పాత నేరస్తుడైన చిప్పాడ కేదారేశ్వరరావు(40)ని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. ఐదు కేసులకు సంబంధించి రూ.16.32 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అతనిపై నలభైకిపైగా చోరీ కేసులు ఉన్నాయని అన్నారు. మరో ఘటనలో... చింతలపూడి గ్రామానికి చెందిన కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో వారింట్లో సుమారు రూ.20 లక్షల ఖరీదైన బంగారు, వెండి వస్తువులు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో నెహ్రూనగర్ వాసి ఇమడాబత్తిని గోపి (38)ని మంగళగిరి షరాఫ్బజార్లో అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. విచారణలో నేరం రుజువుకావడంతో రూ.20.40 లక్షల విలువైన బంగారం, రూ.1.11 లక్షల ఖరీదైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. గోపీ కార్పెంటర్ అని, అతనిపై కొత్తపేట పీఎస్లో ఒక కేసు ఉందని తెలిపారు. కేసులను త్వరగా ఛేదించిన మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి, బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసాపత్రాలు అందించారు. -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
చీరాల: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం 167ఏ వాడరేవు– పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని అనంతపూర్కు చెందిన బోయ సహస్ర (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం బోయ సహస్ర మరో యువకుడు అఖిల్ ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి చీరాల వస్తున్నారు. నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిపై విజయనగర్కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలం సమీపంలోని వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి టూటౌన్ సీఐ నాగభూషణం, సిబ్బంది చేరుకుని తీవ్రగాయాలైన సహస్ర, అఖిల్ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సహస్ర మరణించింది. తీవ్రగాయాలైన అఖిల్ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గుంటూరు నుంచి చీరాలకు రావడానికి కారణాలు, అసలు ప్రమాదానికి గల కారణాలను తెలియరావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం -
ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ఏఓగా రామకృష్ణ
గుంటూరు మెడికల్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం (ఫిమేల్) పరిపాలనా అధికారిగా సూరె రామకృష్ణ గురువారం విధుల్లో చేరారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణను గుంటూరు జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సభ్యులు టి.శ్రీనివాసరావు, తిరుపతిరావు, సీనియర్ అసిస్టెంట్ సురేష్, మనోజ్, రఫిక్, తదితరులు బొకే అందజేసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రామకృష్ణకు ఈనెల 13న పరిపాలనా అధికారిగా పదోన్నతి లభించింది. ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మిని కలిసి రామకృష్ణ జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. నూతనంగా ఏఓగా విధుల్లో చేరిన రామకృష్ణకు శిక్షణా కేంద్రం సిబ్బంది అభినందనలు తెలిపారు. -
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి పోస్టర్ విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7,8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రవేశ పరీక్షల కన్వీనర్, గుంటూరు ఏపీ ఆర్.జె.సి (ఉర్దూ బాలురు) కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ఆధ్వర్వంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రామాణిక విద్య, వసతి సౌకర్యాలు కలిగిన ఈ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ–బీ, బీసీ–సీ విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏపీఆర్జేసీ సెట్, డీసీ సెట్ 2026 పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పోస్టర్లు విడుదల చేసిన కలెక్టర్ -
జనసేన నాయకుల ఘర్షణ
వినుకొండ: పల్నాడు జిల్లా పరిశీలకులు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలోనే జనసేనలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. జనసేన సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వినుకొండకు వచ్చిన పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. సభలో నూజెండ్ల మండల కన్వీనర్ వేముల వెంకటేశ్వర్లను వేదికపైకి పిలవకుండా ఉపాధ్యక్షుడు రాజబాబును పిలవడంతో వివాదం మొదలైంది. వినుకొండలో జనసేన నాయకుడు నిశంకరరావు శ్రీనివాసరావు, నాగశ్రీను రాయల్ ఇరువురు ఎవరికి వారు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వెల్లటూరు రోడ్డులో కొణిజేటి నాగశ్రీను రాయల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి నిశంకరరావు శ్రీనివాసరావు తన అభిమానులతో హాజరయ్యారు. ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. పంతం నానాజీ సభ్యత్వ కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. -
సమాచారం తెలుసుకోండి
లక్ష్మీపురం (గుంటూరు వె స్ట్): అధికార పార్టీ అండతో కొందరు రెచ్చిపోతున్నారు. కబ్జాలకు పాల్పడుతున్నారు. నగరంలోని అంజుమన్ ఆస్తులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు నగరంలోని నగరంపాలెం వద్ద ఈద్గా స్థలం ఉంది. ప్రతి ఏటా రంజాన్, బక్రిద్ పర్వదినం రోజున నగరవాసులు భారీ సంఖ్యలో చేరుకుని ఇక్కడ నమాజ్ చేయడం ఆనవాయితీ. పండుగ సమయాలు మినహా రోజుల్లో కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ అంజుమన్కు నెలవారీ అద్దె చెల్లిస్తున్నారు. పండుగ రోజుల్లో ఈద్గా స్ధలం పూర్తిగా ఖాళీ చేసి నమాజ్ చేయడం ఆనవాయితీ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈద్గా స్థలంపై తూర్పు ఎమ్మెల్యే కన్నుపడింది. చిరు వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ ప్రదేశంలో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి పక్కనే ఓ టీ బంక్ ఉండేది. దానిని ఖాళీ చేయించారు. ఇటీవల నూతనంగా శాశ్వతంగా టీ స్టాల్ నిర్మాణం చేయడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. కొత్తగా షెడ్ నిర్మాణం.. సుమారు ఏడాది క్రితం ఈద్గా స్థలంలో పెద్ద షెడ్ నిర్మించి దానిలో ఏపీ కార్స్ పేరుతో సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలు జరిపే వారికి అద్దెకు ఇచ్చారు. ఈ విషయంపై ముస్లిం సంఘాలు వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గత ఏడాది రంజాన్, బక్రీద్ పండుగులకు షెడ్ను తొలిగించకుండానే నగర ముస్లింలు పవిత్ర పండుగ నమాజ్ను పూర్తి చేసుకున్నారు. సంబంధిత వక్ఫ్, అంజుమన్ కమిటీలపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ కొట్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ముస్లిం సంఘాలు అడ్డు పడ్డాయి. నిర్మాణ పనులు నిలిపి వేశారు. గత కొన్ని రోజులుగా ఆ పనులు పునఃప్రారంభం అయ్యాయి. ఈ సారి టీ కొట్టును శాశ్వతంగా నిర్మించారు. టీ కొట్టులో టైల్స్, లైటింగ్లతోపాటు ఈద్గా స్థలంలో సుమారు 50 గజాల విస్తీర్ణంలో సిమెంట్ ఫ్లోరింగ్ చేశారు. దీన్ని గమనించిన నగర వాసులు పవిత్ర రంజాన్ మాసంలో ఇంతటి ఆక్రమణకు పాల్పడితే ఉపవాస దీక్షలు పూర్తి అయిన తరువాత నమాజ్ ఏవిధంగా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కనీస బాధ్యతగా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ వ్యవహరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై కనీస దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రతి శుక్రవారం మాత్రం గుంటూరు కాకానిలోని హజ్రత్ బాజీ బాబా దర్గాలో విధులు నిర్వహిస్తున్నారు. దర్గా హుండీ కానుకలపై ఉన్న శ్రద్ధ ఈద్గా స్థలం పరిరక్షణకు లేకపోవడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈద్గా స్థలంలో నూతన షాపు నిర్మాణానికి వక్ఫ్బోర్డు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం కుదరదు. ఎప్పుడు బడితే అప్పుడు ఫోన్ చేస్తే వీలుకాదు. అంతగా సమాచారం కావాలంటే వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్కు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని వివరాలు తీసుకోవచ్చు. – ఖాజా, గుంటూరు జిల్లా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ -
ఏఎన్యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్షలపై వస్తున్న వరుస కథనాలకు స్పందించిన పీజీ కోర్సుల సమన్వయకర్త ఆచార్య మన్నం సుబ్బారావు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కొన్ని లోపాలను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఓ విభాగంలో సదరు అధ్యాపకులు ఉన్నప్పటికీ పరిశోధక విద్యార్థులతో పరీక్షల పరిశీలన చేయించడం గుర్తించామన్నారు. ఎవరికి కేటాయించిన డ్యూటీలను వారే చేయాలని, సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రశ్నపత్రాల్లో తప్పులపై స్పందించకపోవడం గమనార్హం. చీరాల: ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్ అమ్మాయి ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన యార్లగడ్డ వెంకట సుబ్బారావు కుమారుడు సాయి సూర్య, సింగపూర్ దేశానికి చెందిన ఎన్జీ షా చ్యూ–వాంగ్ క్వీయిన్ దంపతుల కుమార్తె రోయని ఎన్జీలువో యాన్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి బుధవారం చీరాల్లో వివాహం చేసుకున్నారు. బుధవారం ఉదయం 10.29 నిమిషాలకు తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. -
విజయకీలాద్రిపై ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా సీతా నగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూనీళా సమేత వైకుంఠనాథ్ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ యోగాంజేయ స్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం శ్రీ నారసింహ హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : జెడ్పీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ (డీపీఆర్సీ) భవనాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన సుశీల్ కుమార్ లోహాని డీపీఆర్సీ నిర్మాణ పనుల ప్రగతి, నిర్మాణ వ్యయం తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీపీవో నాగ సాయి కుమార్, డ్వామా పీడీ వి.శంకర్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్–1కు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల పరిధిలో 35,306 మంది హాజరయ్యారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఎస్ఆర్ కళాశాల, అయ్యప్పస్వామి గుడి ఎదుట ఉన్న నారాయణ జూనియర్ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. ఆయా కేంద్రాలలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మారుతీనగర్లోని కంచి కామకోటి పీఠ మారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి. శ్రీబ్రహ్మానంద సరస్వతి స్వామి (విజయవాడ) జ్యోతిప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. సామూహిక తులసి పూజలు చేపట్టారు. శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
అత్యవసర వైద్య సేవల కోసం మొబైల్ యాప్
●కార్డియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున ●ఘనంగా శ్రేష్ట హాస్పటల్స్ రెండో వార్షికోత్సవం గుంటూరు మెడికల్: రోగులకు అత్యవసర సమయంలో వైద్య సహాయం వెంటనే అందేలా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సౌకర్యంతో రోగుల కోసం మొబైల్ యాప్ తీసుకొస్తున్నామని శ్రేష్ట హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి నాగార్జున చెప్పారు. బుధవారం గుంటూరు గుజ్జనగుండ్లలోని శ్రేష్ట హాస్పటల్స్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి నాగార్జున మాట్లాడుతూ రెండేళ్లుగా రోగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆధునిక అత్యుత్తమ వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి నమ్మకాన్ని సొంతం చేసుకున్నామని చెప్పారు. హాస్పటల్ ఫౌండర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ యడ్లపల్లి లక్ష్మణస్వామి సమాజానికి అవసరమైన మంచి వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రేష్ట హాస్పటల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. ప్రజలందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఆరోగ్య అవగాహన పోస్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జవాబు కాదు
విమర్శలకు దాడి నగరంపాలెం (గుంటూరు వెస్ట్)/ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు సాకే శైలజానాఽథ్, పార్టీనేత వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పీవీవీ సూర్యనారాయణ, అనంతబాబు, రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్, సినీ నటుడు జోగినాయుడు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ● సాకే శైలజానాఽథ్ మాట్లాడుతూ, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ, దాడులు చేయడం మంచి విధానం కాదని అన్నారు. పోలీసుల సమక్షంలో ఏడు గంటలకు పైగా అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి జరగడం బాధాకరమని చెప్పారు. అన్యాయాన్ని ఎదురించేందుకు ఉన్నానని అంబటి వ్యాఖ్యానించడం మంచి మాటగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నోట్ఫైల్ ప్రకారం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. లడ్డూలో అసలు కల్తీలేదని, అయినప్పటికి దుర్మార్గంగా మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ● వైఎస్సార్ సీపీ నేత వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వం అడ్డగోలు అరెస్ట్లు, శిక్షలు జరుగుతాయనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అయినా మేమంతా కలిసి కట్టుగా ఉన్నామని, టీడీపీ చేసిన తప్పులను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ● మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇల్లు, కార్యాలయంపై దాడి గురించి చెప్పేందుకు రాష్ట్ర డీజీపీ, ఏడీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అనేకసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వారు క్రిమినల్స్ కాదని, చంద్రబాబు, లోకేష్, డీజీపీ, ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీ క్రిమినల్స్ అని మండిపడ్డారు. ఆ రోజు మా ఇంటి దగ్గర వరకు జిల్లా ఎస్పీ వచ్చి వెనక్కి వెళ్లారని అన్నారు. చంద్రబాబుకి టచ్లో ఉండే పనిలో జిల్లా ఎస్పీ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ● రేపల్లె సమన్వయకర్త ఈవూరు గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం అంబటి రాంబాబుపై దాడి చేయించారనీ, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267 వైభవంగా బ్రహ్మోత్సవాలు మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. నేడు యాలి వాహనంపై..... బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు. – మంగళగిరి టౌన్ తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5500, గరిష్ట ధర రూ.7000, మోడల్ ధర రూ.6200 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 538.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 40,593 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు. -
‘ఎర్ర’ బంగారానికి ‘సౌర’ రక్షణ
తాడికొండ: ఈ ఏడాది మిర్చి పంటకు తెగుళ్ల బెడద లేకపోవడంతో నాణ్యత కలిగిన కాయలు కోతకు వస్తున్నాయి. దీంతో ధరలు కూడా రూ.20 వేలు– రూ.23 వేల వరకు వివిధ రకాలు పలుకుతుండటంతో రైతులు తమ ఎర్ర బంగారాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాడికొండ మండలం రావెల గ్రామంలో ఓ రైతు సౌర విద్యుత్తుతో వెలిగే దీపాలు, సీసీ కెమెరాను స్తంభానికి ఏర్పాటు చేయించారు. ఏటా మిర్చి కల్లాల్లో కాయలు చోరీకి గురవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతుండే వారు. దీనికి చెక్ పెడుతూ రైతు తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది. రావెల, మందపాడు తదితర గ్రామాల్లో పనుల కోసం కర్నూలు ప్రాంతం నుంచి వలస కూలీలు రాక పెరగడంతో పొలాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏటా అంధకారంలోనే గడిపేవారు. ఇప్పుడు వారుంటున్న ప్రాంతాల్లో రైతులు సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రివేళ పొలాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. -
కన్నీటి వెతనం
విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రణాళిక ● పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా అందని జీతాలు ● అప్పులు పుట్టక.. ఆకలి తీరక నానా కష్టాలు ● జీతాలివ్వాలని మొర పెట్టుకుంటున్నా ఫలితం శూన్యం ● గత్యంతరం లేక విధుల బహిష్కరణ ● ఊరంతా పేరుకుపోయిన చెత్త ● నిలిచిపోయిన తాగునీటి సరఫరా ● సర్కారు తీరుతో ప్రజలకు తప్పని వెతలు వారంతా పారిశుద్ధ్య కార్మికులు.. నిత్యం చెత్తలోనే బతుకు పయనం.. వారికి నెల నెలా సక్రమంగా వేతనాలివ్వకున్నా ఆకలి బాధలు భరిస్తూ నిత్యం ‘స్వచ్ఛ’మైన బతుకు పోరాటం చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ, అటు అధికారులుగానీ కనీసం వారిపై కనికరం కూడా చూపడం లేదు. వారి నిరసన ప్రభావంతో స్థానికులకూ ఇబ్బందులు తప్పడం లేదు. తడిస్తే జారే.. ఎండితే బేజారే! జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా – సీహెచ్ థామస్ (పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు) – వి. భాస్కర్ (నీటి సరఫరా ఆపరేటర్) -
రోడ్డుప్రమాదంలో జేఎల్ఎం మృతి
నకరికల్లు: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో నరసరావుపేట రోడ్డులో బుధవారం జరిగింది. నకరికల్లుకు చెందిన జూపల్లి రాజారత్నం (38) గత ఆరేళ్లుగా గుండ్లపల్లి గ్రామంలో గ్రేడ్–2 జేఎల్ఎం (ఎనర్జీ అసిస్టెంట్)గా పనిచేస్తున్నాడు. కాగా నరసరావుపేటలోని అక్కయ్య వాళ్లింటికి వెళ్లాడు. మండలంలోని త్రిపురాపురం గ్రామంలో విద్యుత్బిల్లుల డ్యూటీ ఉండడంతో విధుల్లో హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై నకరికల్లుకు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దేచవరం మిద్దె సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.సతీష్తో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్శాఖ ఈఈ రాంబొట్లు, డీఈఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ సుచరిత, పలువురు లైన్మెన్లు మృతదేహానికి ఘననివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వక్కపట్లవారిపాలెం వద్ద ఘటన నాగాయలంక: మండలంలోని నాగాయలంక – అవనిగడ్డ మెయిన్ రోడ్డుపై వక్కపట్లవారి పాలెం సమీపంలో బుధవారం ప్రయాణికులతో వస్తున్న ఆటోలో సాంకేతిక లోపాల కారణంగా ఆకస్మికంగా పల్టీ కొట్టిందని ఎస్ఐ కలిదిండి రాజేష్ తెలిపారు. బాపట్ల జిల్లా అల్లపర్రు గ్రామం నుంచి నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పాలెం సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై పంటకాలువ వైపు బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వర్రే శివయ్య(60)కు కాలు విరిగిందని, బండ్రెడ్డి రాఘవమ్మ(60) మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ అలపర్రుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులని, ఆటో కూడా ఆ సభ్యుల్లో ఒకరిదని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. రేపల్లె: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి జహీరుద్దీన్ (55) నేషనల్ హైవే రహదారి పేటేరు బస్సు షెల్టర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జహీరుద్దీన్ను పరిశీలించగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. క్రిమిసంహార ముందు తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ధాన్యంకు సంబంధించిన నగదు చెల్లింపులపై ఇటీవల పోటుమేరక గ్రామానికి చెందిన రైతులు బలవంతం పెట్టి అతని కుమారుడు జాఫర్వలిపై దాడిచేసి బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగదు చెల్లించి కుమారుని తీసుకువెళ్లాలని ఒత్తిడి చేయడంతో జహీరుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. -
● జిల్లాలో 87 కేంద్రాల ఏర్పాటు ● పరీక్షకు 31,777 మంది విద్యార్థులు హాజరు ● గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీయెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 87 కేంద్రాలలో 32,287 మంది విద్యార్థుల్లో 31,777 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో ఆర్ఐవో జి.సునీతతోపాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుత్ను తీరుతోపాటు తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాట్లు పరిశీలించారు. విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు బస్సు సదుపాయం వంటి అంశాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పటిష్టంగా అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో తప్పుడు వదంతులకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని సూచించారు. ఆర్ఐవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్న తీరు, తెన్నులను పరిశీలించారు. ఆర్ఐవో జి.సునీత ఉన్నారు. -
అనైతిక రెడ్బుక్ రాజ్యాంగం అమలు
మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, వేమూరు సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, అద్దంకి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డిలు మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ దాడులు చూస్తుంటే రక్తం మరుగుతోంది... అంబటిలో నాకొక హీరో కనపడ్డారు -
పటిష్ట ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శాప్ లీగ్ పోటీల్లో భాగంగా సైక్లింగ్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్ స్టేడియం వద్ద జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలను కార్పొరేటర్ షేక్ మీరావలి, ఏఎస్ఐ షేక్ నజీర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ ప్రతిభకనబరచిన వారిని గుర్తించి ఈ నెల 28 నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నాయకులు లింగినేని శ్రీనివాసరావు, భాను ప్రసాద్, కోచ్ వి.కనకారావు పాల్గొన్నారు. -
ఐసీఏఐ గుంటూరు శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇనిస్టిట్యూట్ అఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా (ఐసీఏఐ) గుంటూరు శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంగళవారం అమరావతిరోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఏఐ గుంటూరు శాఖ చైర్మన్గా రుద్రవరపు భరద్వాజ్, వైస్ చైర్మన్గా వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శిగా కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాధికారిగా నాగబీరు రాజశేఖర్, సికాసా చైర్మన్గా షేక్ బాజీతో పాటు కమిటీ సభ్యులు దేసు సంపత్, చింతా రఘు నందన్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దక్షిణ భారత చాప్టర్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ, ఎస్ఐఆర్సీ ప్రతినిధులు డి.ప్రసన్నకుమార్, మండవ సునీల్ కుమార్, దీపక్ లడ్డా, ఎర్ర తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్లో రేడియాలజీ విభాగం ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక వైద్య రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, పీఈటీ–సీటీ వంటి చిత్రీకరణ పద్ధతుల గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. రేడియాలజీ విభాగం వైద్యులు, వైద్య విద్యార్థులు కలిసి ఎగ్జిబిషన్ను తిలకించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులకు యంత్రం ఎలా పనిచేస్తుందో, శరీరంలో బయటికి కనిపించని సమస్యలను ఎలా గుర్తిస్తారో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా వింటూ పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రత్యేకంగా సీటీ స్కాన్ ద్వారా ఎముక విరుగుడు, మెదడు గాయాలు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వ్యాధులను ఎలా గుర్తిస్తారో ప్రత్యక్ష చిత్రాలతో చూపించారు. ఆధునిక సాంకేతికత వైద్య నిర్ధారణలో ఎంత ముఖ్యమో విద్యార్థులు అవగాహన కల్పించారు. గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి రేడియాలజీ విభాగం ప్రదర్శనలను పరిశీలించి, విజ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అందించే విధంగా ఏర్పాటు చేసినందుకు అభినందించారు. తాడికొండ: తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నామి ఐలాండ్, సియోల్ జాతీయ యూనివర్సిటీ(దక్షిణ కొరియా) బృందం సోమవారం రాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా రాయపూడిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి గురించి సీఆర్డీయే అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబుతో బృందం భేటీ అయ్యింది. రాజధాని అమరావతి ప్రాంత సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించే వివిధ వస్తువులు కలిగిన గిఫ్ట్ బ్యాగ్ను కమిషనర్ బృందంలోని సభ్యులకు అందజేశారు. అమరావతిలో పర్యాటక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను కమిషనర్ చర్చించారు. దక్షిణ కొరియా బృందంలో నామి ఐలాండ్ (విద్య – కళలు విభాగం) బృందంలోని సభ్యలు సీఈఓ కయాంగ్ వూ మిన్ సీనియర్ ప్రొడ్యూసర్ జిన్వూక్ వోన్, కల్చరల్ ప్రాజెక్టు విభాగం ప్రొడ్యూసర్ జాలాది చిరాగ్ శేషు, సియోల్ జాతీయ యూనివర్సిటీ (ఆసియా సెంటర్) బృందంలోని సభ్యులు డైరెక్టర్ సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ సంగ్ యాంగ్ కాంగ్, సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ సీనియర్ రీసెర్చర్ సియాంగో చోయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల
ప్రత్తిపాడు/గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరులో కొలువుదీరిన పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని ఏప్రిల్ 7వ తేదీన వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె.శ్రీనివాసరావు తెలిపారు. కొండపాటూరు లోని పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం తిరునాళ్ల ఏర్పాట్లుపై తహసీల్దార్ వెంకటస్వామి అధ్యక్షతన తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 31వ తేదీన మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, ఏప్రిల్ 7వ తేదీన తిరునాళ్లతో పాటు సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖలతో పాటు ఆయా శాఖల అధికారులతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ అధికారులు చర్చించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఎదురువనున్న రోడ్డు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తిరునాళ్లకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయా లని సూచించారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ జి.శ్రీనివాసరావు తదితరులుపాల్గొన్నారు. వైభవంగా గోపుర కలశ స్థాపన తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్స్వామి స్వీయ పర్యవేక్షణలో లక్ష్మీ నరసింహస్వామి, భూనీళా సమేత వైకుంఠ నాధ పెరుమాళ్, లక్ష్మీ హయగ్రీమస్వామివారు,యోగాంజేయస్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని తెలిపా రు. మంగళవారం ఉదయం మృత్తికా స్నపనం, నయనోన్మీలనం, మన్యుసూక్త హవనం, శయ్యాధివాసం, త్రిదండి అహోబిల రామా నుజ జీయర్స్వామి వార్ల వారి చేతుల మీదుగా గోపురం కలశ స్థాపన, అనంతం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేసి ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొని పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొందారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈలపాట రఘురామయ్యకు ఘన నివాళి సుద్దపల్లి(చేబ్రోలు): ఈలపాట ద్వారా ప్రజల మన్ననలు పొందిన రఘురామయ్య అందరికి ఆదర్శనీయమని ఈలపాట రఘురామయ్య కమిటీ అధ్యక్షులు కల్యాణం సత్యనారాయణ అన్నారు. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం ఈలపాట రఘురామయ్య వర్థంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ మండపం సమీపంలోని ఆయన విగ్రహానికి గ్రామస్తులు, పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన కల్యాణం రఘురామయ్య ఈలపాటనే ఇంటిపేరుగా చేసుకున్న గొప్ప కళాకారుడని, వెండితర నటుడుగా కూడా ఖ్యాతి గాంచారని నేతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డుతో మరింత గౌరవం పొందారన్నారు. గోవాడ మోహనరావు, మట్టుపల్లి పోతురాజు పాల్గొన్నారు. -
పచ్చమూకల పైశాచికం
పిడుగురాళ్ల రూరల్/పిడుగురాళ్ల: అధికారం అండతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి.. విచ్చలవిడిగా హత్యాయత్నాలు, హత్యలకు పాల్పడుతూ రక్త దాహం తీర్చుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా జూలకల్లులో ఓ వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. జూలకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బీరవల్లి రామిరెడ్డి వర్షం పడేలా ఉండటంతో సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న కండెలపై పట్టాలు కప్పి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే ఆయనపై నిఘా పెట్టిన టీడీపీ గూండాలు ఇనుముక్కల సామేలు, షేక్ దాదాసాహెబ్, చల్లా మోజెస్, సింహాద్రి మరికొందరు ఒక్కసారిగా రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రామిరెడ్డి స్పృహ కోల్పోవడంతో.. వారంతా వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి అటుగా వెళ్లిన కొందరు.. రామిరెడ్డిని చూసి కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని రామిరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రామిరెడ్డి కాళ్లు, ఎడం చేయి విరిగినట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బీరవల్లి రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి పరామర్శించారు. గురజాల నియోజకవర్గంలో గూండా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జూలకల్లులో ఇప్పటికే ఆరుగురిపై టీడీపీ గూండాలు దాడి చేశారని చెప్పారు. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉందని.. దాడులు చేసే వారు, చేయించే వాళ్లు ఇంతకింతా అనుభవించే రోజులు వస్తాయన్నారు. చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గురజాలలో రౌడీ రాజ్యం పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న బీరవల్లి రామిరెడ్డిని ఆయన పరామర్శించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ పాపం పండే రోజు త్వరలోనే వస్తుందన్నారు. జూలకల్లు గ్రామంలో ఇప్పటికే ఆరుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారని, ఏ కారణం లేకపోయినా కేవలం బెదిరించటానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు గుర్తు పెట్టుకోవాలని, ఇంకా మూడేళ్లు మాత్రమే ఉందని ఆ తర్వాత ఇంతకంతకు అనుభవించే రోజులు వస్తాయని, చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. -
జనాభా లెక్కల శిక్షణ అత్యంత కీలకం
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరువెస్ట్: జన గణనలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లను పర్యవేక్షించే చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్ల బాధ్యతలు చాలా కీలకమైనవని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో పట్టణం, మండలాలను యూనిట్గా తీసుకొని పట్టణాల్లో డిప్యూటీ కమిషనర్లు చార్జ్ ఆఫీసర్లుగా, టౌన్ ప్లానింగ్ అధికారులు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా, మండలాల్లో తహసీల్దార్లు చార్జ్ ఆఫీసర్లుగా, ఎంపీడీవోలు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా నియమించారన్నారు. వీరికి మొదటి విడత శిక్షణను మూడు రోజులు అందిస్తున్నామన్నారు. జేసీ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు
గుంటూరు లీగల్: బాలికను మోసగించి, బలవంతంగా పెళ్లి చేసుకుని, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.49 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి అజయ్ లైంగిక దాడి, వేధింపులు, బెదిరింపులు, బాల్య వివాహానికి పాల్పడ్డాడు. అజయ్ 2021 సంవత్సరంలో మార్చి 24న కనకదుర్గమ్మ ఆలయానికి బాలికను తీసుకెళ్లి బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక భయంతో మౌనంగా ఉంటూ, ఒంటరిగా ఉండటం చూసిన తల్లిదండ్రులు ఆమెను నిలదీసి అడగగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో 2021 జూన్ 2న పోలీలసుకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసును లోతుగా దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసు పూర్వ పరాలను పరిశీలించిన న్యాయమూర్తి మహమ్మద్ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడి ప్రతివాదనలు విన్న తరువాత దోషిగా గుర్తించి తీర్పు చెప్పారు. బాధితురాలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి కె.రవికుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్, కానిస్టేబుల్ ఎం.ఖాజామొహిద్దిన్, హెడ్కానిస్టేబుల్ ప్రకాష్ తదితరులు కేసు దర్యాప్తులో కృషి చేశారు. విద్యార్థిని ఆత్మహత్య కేసులో పురోగతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం పోలకంపాడులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని మరో విద్యార్థి అసభ్య వీడియోలు చూపించి బెదిరించిన సంఘటనలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్ఐ వెంకటసాయి విద్యార్థిని మృతికి కారణమైన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రహీమ్ను మంగళవారం అరెస్ట్చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట సాయి మాట్లాడుతూ కేసు నమోదు చేసిన అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డిఎస్పీ మురళీకృష్ణ, ఆదేశాల మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు దర్యాప్తు చేపట్టారన్నారు. యర్రబాలెంలోని మంచాల హోటల్ వద్ద సంచరిస్తున్న విద్యార్థి రహీమ్ను అదుపులోకి తీసుకుని విచారించి కోర్టుకు హాజరుపరిచామన్నారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు. అనంతరం రహీమ్ను జిల్లా సబ్జైలుకు తరలించినట్లు వివరించారు. పోలీసుల అదుపులో బెట్టింగ్ రాయుళ్లు తాడేపల్లి రూరల్ : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి పెనుమాకకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మంగళవారం తాడేపల్లి పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పెనుమాకకు చెందిన ఆ వ్యక్తితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు కేసులు లేకుండా పోలీసులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. -
హనుమంత వాహనంపై నృసింహుడు
మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో మహిళల కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవానికి తిలకించి, సేవించిన వారందరికీ సత్బుద్ధిని, అభయాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో కె. సునీల్కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు. – మంగళగిరి టౌన్బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
నగరంపాలెం: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీకి పాల్పడిన వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసి, సుమారు రూ.69.25 లక్షల ఖరీదైన బంగారం/ వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, కారు, మోటారుసైకిల్ను పొన్నూరు గ్రామీణ పీఎస్ పోలీసులు సీజ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ధూళిపాళ్ల ప్రమీలాదేవి చింతలపూడి గ్రామంలో నివసించేది. గత మూడు వారాలుగా ఆమె గుంటూరులోని కుమారుని ఇంట్లో ఉంటోంది. ఈనెల 16న తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా తాళం పగులకొట్టి 42 సవర్ల బంగారం, 10.5 కిలోల వెండి, రూ.లక్ష నగదు దొంగలించారు. దీనిపై ప్రమీలాదేవి పొన్నూరు రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ పి.కృష్ణయ్య ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. వేలిముద్రల ఆధారాల మేరకు కారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు జిల్లా పడపాడు వాసి సత్తెనపల్లి రాకేష్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఈతముక్కలపాలెం గ్రామవాసి కె.ఆశ్వీరాదం, ఏలూరు కండ్రిపాడుకి చెందిన జేడీ కుమార్, ఏలూరు మొండికొడు గ్రామ వాసి నక్క దుర్గప్రసాద్, ఏలూరు చాటపర్రుకి చెందిన జి.రఘు, దగ్గుమల్లి చినబాబు, పి.కృపసామ్యేలను గుర్తించారు. వీరంతా రాత్రిళ్లు తాళాలు వేసిన ఇళ్లల్లో ఖరీదైన వస్తువులను దొంగిలించి, విక్రయించిన సొమ్ముతో జల్సాలు చేసే వారని గుర్తించారు. దీంతో ఆరుగుర్ని అరెస్ట్ చేయగా, చిన్నబాబు, పి.కృపసామ్యేల్ను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. చోరీ చేసిన కారులోనే చోరీకొచ్చారు.. 35 ఏళ్ల సత్తెనపల్లి రాకేష్పై పలు జిల్లాల్లో 34 చోరీ కేసులున్నాయి. అతనికి ప్రకాశం జిల్లాకు చెందిన విక్కీ ద్వారా ఆశీర్వాదం పరిచయమయ్యారు. వీరిద్దరు తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈనెల 16న చింతలపూడి గ్రామంలో రాకేష్, ఆశిష్, ఆశీర్వాదం రెక్కీ చేశారు. చీరాలలో దొంగలించిన కారులో వచ్చి, అర్థరాత్రి 1.30 నుంచి 2.30 మధ్యలో చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.69.25 లక్షల ఖరీదైన 42 సవర్ల బంగారం, కరిగించిన వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, కారు, మోటారుసైకిల్ను సీజ్ చేశారు. ఏడు రోజుల్లో కేసుని చేధించిన తెనాలి డీఎస్పీ జనార్ధన్రావు, పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు శ్రీహరి (పొన్నూరు రూరల్ పీఎస్), ఎస్ఐ వీరనారాయణ (చేబ్రోలు పీఎస్), ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెచ్సీ నరేష్, కానిస్టేబుళ్లు రవి, శివయ్య, సుధీర్, గోవిందరాజు, హోంగార్డు రాజేష్లను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. -
మేలుకో.. రిజిస్ట్రేషన్ చేసుకో!
ఇంకో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండటంతో.. సిబ్బంది హడావుడి చేస్తున్నారు. రైతులకు ఫోన్ చేసి రైతు సేవా కేంద్రాలకు రావాలని.. లేకుంటే ఆధార్, ఓటీపీలు చెబితే నమోదు చేస్తామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పంటల బీమా, నష్ట పరిహారం, ఇన్ఫుట్ సబ్సిడీలు, రైతు సేవా కేంద్రాల సేవలు వంటి అన్ని అంశాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధారంగానే అమలు చేయనున్నారు. ఇప్పుడు నమోదు చేసుకోకపోతే భవిష్యత్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతుల భవిష్యత్తుకు కీలకం. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. –ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కొరిటెపాడు(గుంటూరు): అక్టోబర్ మాసంలో మొదలైన రబీ సీజన్ ఫిబ్రవరి ఆఖరుకు దాదాపుగా ముగిసింది. ఈ సారి 65,295 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, చివరకు 131.73 శాతంతో 86,015 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల చివరి నాటికి ముగియనుంది. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం 1,37,143 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,16,950 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మిగిలిన 20,193 మంది తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా జరిగే ఉపయోగాలను వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఇంకా 20,193 మంది.. అందుబాటులో లేక.. -
గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ
తాడేపల్లి రూరల్: టీడీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి జరగకుండా, పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యాలయంలో పంచాయతీ కమిషనర్కు సర్పంచ్ల సమస్యలపై ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అడుగులు వేస్తూ పరిపాలన సాగించారు. కానీ టీడీపీ ప్రభుత్వం సర్పంచ్లపై మీద కక్షకట్టి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అధిక శాతం వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది’ అని విమర్శించారు. ఏప్రిల్ 2న సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, గ్రామాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల మేరకు చేసిన ఎంబుక్లో రికార్డు అయిన బిల్లులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తూ వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. సర్పంచుల పదవీ కాలం తర్వాత స్పెషల్ ఆఫీసర్ల నియామకం పేరుతో ఆ నిధులను దోచుకోవాలని కుట్ర జరుగుతుందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు ఫిరోజ్ఖాన్, నామా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి
లక్ష్మీపురం: భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి, వెంటనే పంట రుణాలు మంజూరు చేయాలని, అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింపచేసి రూ.20 వేలు ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు బొట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సాగు భూమిలో 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పలు హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కౌలురైతుల ప్రస్తావనే లేదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని, జిల్లాలోని లంక భూములను సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలివ్వాలని కోరారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా భూ సేకరణ చేస్తోందని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నాయకులు ప్రకాశరావు, రాజేంద్ర, పల్లె కృష్ణ, పాల్గొన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు -
ఎన్ని రోజులు జైలులో పెట్టారు..?
నా ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి వారినిగుంటూరు ఎడ్యుకేషన్: సీఎం చంద్రబాబును దూషించాననే ఆరోపణలతో తనను 18 రోజులు జైలులో పెట్టించిన టీడీపీ ప్రభుత్వం, తన ఇంటిపైనా, కార్యాలయంపైనా దాడి చేసిన వారిని ఎన్ని రోజులు జైలులో పెట్టించారో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులోని తన నివాసం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎంకు సంధించారు. ● తన ఇంటిపై దాడికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ స్థాయిలో కుట్రలు జరిగాయన్నారు. పోలీసుల ప్రేక్షక పాత్రకు కారణం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కావా అని ప్రశ్నించారు? ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలన్నారు. ● తమ ఆదేశాలతో పంపిన టీడీపీ రౌడీ మూకలు ఏం చేసినా మౌనంగా ఉండాలని చెప్పడం వలనే దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు లేదా ఆయన కుమారుడు లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ● సీఎంను దూషించానని తనను అక్రమ కేసులతో జైలుకు పంపిన ప్రభుత్వం, తన ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఎన్ని రోజులు జైల్లో ఉంచారో చెప్పాలన్నారు. ● తాను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించానని, రిమాండ్ రిపోర్టులో తనపై అభాండాలు వేశారన్నారు. సీఎం సామాజిక వర్గాన్ని తాను దూషించానని రిపోర్టులో పొందుపర్చారని, అందు వలనే సీఎం కులానికి చెందిన వారిని తన ఇంటిపైకి పంపించారా అని ప్రశ్నించారు ? ● రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతుంటే, తన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతో వారు పోలీసు శాఖకు ఇచ్చిన ఆదేశాలతోనే తన ఇల్లు, కార్యాలయాలపై దాడి జరిగిందని తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేకుంటే తన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లే భావించాల్సి వస్తుందన్నారు. కూటమి నేతలు ఫోన్లో పరామర్శించారు ● తన ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరిగి, తనను అక్రమంగా జైల్లో పెట్టించిన తరువాత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని అన్నారు. తాను జైల్లో ఉన్న రోజుల్లో ఎంతో మంది వైఎస్సార్సీపీ నేతలు ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యుల్లో నింపిన ధైర్యం, వారు ఇచ్చిన ఓదార్పును మర్చిపోలేమని చెబుతూ వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ● తనపై మోపిన అక్రమ కేసులను టీడీపీ, జనసేన నేతలు తప్పుపట్టారని చెప్పారు. టీడీపీ, జనసేనలో రాజ్యాంగాన్ని గౌరవించే పలువురు నేతలు తనకు ఫోన్ చేసి పరామర్శించారన్నారు. ● దేశంలోని 10 రాష్ట్రాల్లో శాంతి, భద్రతలు, పరిపాలనలో కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఏపీ చివరిస్థానంలో ఉందని, భవిష్యత్తులో 29 రాష్ట్రాలస్థాయిలో సర్వే చేసినా టీడీపీ ప్రభుత్వ తీరుతో మన రాష్ట్రానికి చివరి స్థానం వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు. ● వైఎస్సార్ సీపీ రైతు విభాగ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రాజకీయ దాడులు, కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఈ 20 నెలల కాలంలో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు, పోలీసు కేసులు, భౌతిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. -
పట్టించుకోరా!
గుంటూరుమంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026రాజధాని కోసం భూములిస్తే తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,000, గరిష్ట ధర రూ.7,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 539.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 24,222 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.మా భూమి రెండెకరాలు ల్యాండ్ ఫూలింగ్కు ఇచ్చాం. తొలి మూడేళ్లు మాకు జరీబు కింద కౌలు చెల్లించారు. ఎనిమిదేళ్లుగా ఆపేసారు. మా భూమిలో బోరు, కరెంట్ ఉన్నాయి. అన్ని రకాల పంటలు పండించే వాళ్లం. ఇప్పుడు కొత్తగా అధికారులు డ్రై ల్యాండ్ అంటున్నారు. రాజధాని కోసం భూమిలిచ్చిన మాలాంటి వాళ్లను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తారా, మరీ ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలి. – తోట శివకుమారిమేము ఎకరా పొలం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. నిబంధనల ప్రకారం మాకు ప్లాటు ఇచ్చారు. ఇప్పుడు మీది మెట్ట భూమి మీకు జరీబు భూమి హక్కుదారులకు ఇచ్చినట్లు ఇవ్వడం కుదరదని ఇచ్చిన ప్లాటు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. బంగారం లాంటి భూమిని తీసుకుని ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదు. – టి.ధనలక్ష్మి గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని నిర్మాణం కోసం విలువైన తమ భూములిచ్చిన కొండమరాజు పాలెం గ్రామ నిర్వాసితులు ఇప్పుడు బోరుమంటున్నారు. అధికారులు కూడా కనీసం స్పందించడం లేదు. భూములు తీసుకున్న ప్రారంభంలో జరీబు కింద నమోదు చేసుకుని కౌలిచ్చిన అధికారులు ఇప్పుడు జరీబు కాదు మీది కేవలం మెట్ట భూమి మాత్రమే అని చెబుతున్నారు. దీంతో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, స్థలంలో సుమారు 200 చ.గ. భూమిని కోల్పోవాల్సి వస్తుంది. బాధితులు సోమవరం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్ (పీజీఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సకు వినతిపత్రం అందజేశారు. తాము చేసేదేమీ లేదని జేసీ ఖరాఖండీగా చెప్పేశారు. తుళ్లూరు మండలంలోని అబ్బరాజుపాలెం, బోరుపాలెం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోని 71 మంది భూములిచ్చిన రైతులకు జరీబు కింద నమోదు చేసిన అధికారులు సమీపంలోనే ఉన్న కొండమరాజు గ్రామానికి చెందిన 17 మంది బాధితుల భూములు జరీబులో లేవని చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆవేదన వారి మాటల్లోనే... పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెంలో ప్రభుత్వ భవనంలో గ్రామ సచివాలయం 7 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ గ్రామంతోపాటు అబ్బినేనిగుంటపాలెం ప్రజలకు ఇది సౌలభ్యంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి సమాచారంగాని, నిబంధనలు పాటించకుండా కొంతమంది ఈ సచివాలయాన్ని అబ్బినేనిగుంటపాలెంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలి. – గొరిజవోలు గ్రామ ప్రజలు జిల్లాలో అసంఖ్యాకంగా ఉన్న దివ్యాంగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. మూడు చక్రాల వాహనాలు అందజేయాలి. – బొక్కా ఆగస్టీన్, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు రెండెకరాల భూమి ఇచ్చి చందాల కోసం తిరిగినట్లు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మా గ్రామంలో 17 మందికి మాత్రమే ఇలా మెట్ట అని రాశారు. దీనిని వెంటనే మార్చాలి. మాకు న్యాయం చేయకపోతే మేము ఇచ్చిన భూములు మాకు ఇచ్చేయాలి. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా. భూములు సర్వే చేయించిన జేసీ అశుతోష్ శ్రీవత్సకు వినతిపత్రం ఇస్తే ఏమీ చేయలేమని చెబుతున్నారు. – కె.నాగభూషణం మా భూమిలో మూడు పంటలు పండేవి. రాజధాని అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు. పైన నాయకులు చెప్పే మాటలకు కింద స్థాయిలో అధికారుల వ్యవహార శైలికి సంబంధం లేకుండా ఉంది. న్యాయమైన మా సమస్యలను పరిష్కరించకుండా మా భూముల్లో వీఐపీ టవర్స్ కడుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం. దీనిని న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం. – కె.లావణ్య7 -
వైభవం... ధ్వజారోహణం
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలో వేంచేసిన యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధృజారోహణం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు సోమవారం రాత్రి ఋత్వికరణ, అంకురారోపణాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కళ్యాణోత్సవానికి భక్త జనులను, దేవతలను ఆహ్వానానికి భక్తాగ్రేస్వరుడైన గరుత్మంతుని ధ్వజంపై ప్రతిష్టించారు. అష్టాంగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దలు అన్న పేరుతో సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ద్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్ కుమార్ పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. నేడు హనుమంత వాహనంపై... లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం రాత్రి శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. -
జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్
పట్నంబజారు: గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది బాధితులు, ఫిర్యాదుదారులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పీజీఆర్ఎస్లో మొత్తం 215 అర్జీలను అధికారులు స్వీకరించారు. ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, ఈస్ట్ సబ్డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావులు ఫిర్యాదులు స్వీకరించారు. నేను చుట్టుగుంటలో నివాసం ఉంటూ.. జేకేసీ కళాశాల రోడ్డులో పౌల్ట్రీ ఫాం నిర్వహిస్తున్నా. ఈ నెల 12వ తేదీ రాత్రి సుమారు 20 మందిపైగా వచ్చి మా చికెన్ షాపుపై దాడి చేశారు. కోడిగుడ్లు, రూ.19 వేల నగదు ఎత్తుకెళ్లారు. షాపు గేటు పగులకొట్టి, దుకాణాన్ని సర్వనాశనం చేశారు. ప్రొక్లయినర్తో వచ్చి పక్కనే ఉన్న నివాసాలను కూడా ధ్వంసం చేశారు. దీనిపై 13వ తేదీన పట్టాభిపురం సీఐకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ప్రాణహాని కూడా ఉంది. వారిని కఠినంగా శిక్షించటంతోపాటు మాకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – నేరెళ్ళ దుర్గానాగమల్లేశ్వరరావు (చుట్టుగుంట) -
కాటూరిలో గుండె ఆపరేషన్లకు రంగం సిద్ధం
గుంటూరు మెడికల్: ఏపీలోనే తొలిసారిగా గుండె చికిత్సలు చేసే అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ సీమెన్స్ క్యాథ్ల్యాబ్ (గుండె వ్యాధుల చికిత్స)ను రూ. 6 కోట్లతో ఏర్పాటు చేసినట్టు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి గుండె శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్ ప్రారంభిస్తారని చెప్పారు. గుంటూరులోని కాటూరి అర్బన్ క్లీనిక్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాథ్ ల్యాబ్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందన్నారు. ఈ విధమైన ల్యాబ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో తమ వద్ద మాత్రమే ఉందన్నారు. రేపు గవర్నర్ చేతుల మీదుగా ఆధునిక క్యాథ్లాబ్ ప్రారంభం -
దళారుల చేతిలో మోసపోకండి
ప్రత్తిపాడు: రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎం. పద్మావతి అన్నారు. విత్తనాలు నుంచి పంటి విక్రయం వరకు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పెదనందిపాడు మండలం పాలపర్రులోని జీడీసీఎంఎస్లో సోమవారం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.పద్మావతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పద్నాలుగు శాతం తేమ ఉండేలా చేసుకోవాలన్నారు. తొలుత రైతులు రైతు సేవ కేంద్రాల్లో ఈకేవైసీ చేయించుకుని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం ఎకరానికి పన్నెండు క్వింటాళ్ల చొప్పున, ఒక రైతు 40 క్వింటాళ్ల వరకు విక్రయించుకోవచ్చని వివరించారు. ఈ క్రాప్ ఆధారంగా జీడీసీఎంఎస్ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర రూ. 5,870కు శనగలు విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డీఎం టి. నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎన్. మోహన్రావు, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి -
మోసగించిన వారికి జైలుశిక్ష
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ముగ్గురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. మంగళగిరి ఏజేసీజే కోర్టు న్యాయమూర్తి ఎం. ప్రసన్నలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణానికి చెందిన దొంతిరెడ్డి అనుదీప్రెడ్డి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జమ్మిలిదిన్నె బసిరెడ్డి, దేవిరెడ్డి తిరుపతి రెడ్డి, జమ్మిలిదిన్నె ప్రవళికలు కస్టమ్స్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.40 లక్షలు తీసుకుని పరారయ్యారు. దీనిపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో బాధితుడు 2019 ఆగష్టు 2వ తేదీన ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ ఆర్ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి అందించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా కె. శివలీల వ్యవహరించారు. విజిలెన్స్ దాడుల్లో భారీగా సిగరెట్లు పట్టివేత సత్తెనపల్లి: అనుమతులకు విరుద్ధంగా బిల్లులు లేకుండా సిగరెట్లు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని అందిన సమాచారం మేరకు గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఇ.సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక బజార్లో 15వ వార్డుకు చెందిన నోముల కోటేశ్వరరావు గృహంలో సోమవారం అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా అనధికారికంగా సిగరెట్లను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ సిగరెట్లపై చిత్రపరమైన ఆరోగ్య హెచ్చరిక లేకపోవడం, ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకపోవడాన్ని గుర్తించారు. నోముల కోటేశ్వరరావును విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా పట్టణంలో నివసించే ఉయ్యూరు సుబ్బారావు గుప్తా నుంచి ఈ సిగరెట్లను కొనుగోలు చేస్తున్నట్లు అంగీ కరించారు. మొత్తం రూ. 3,31,060 విలువైన మొత్తం ఆరు రకాల అనధికార విమల్, బ్లాక్, గోల్డ్ విమల్, విమల్, గోల్డ్శాండ్, పలాస్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నోముల కోటేశ్వరరావు, ఉయ్యూరు సుబ్బారావు గుప్తాపై సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుందన్నారు. తనిఖీలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ అనిల్బాబు, సబ్ ఇన్స్పెక్టర్ అమీర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైలు కింద పడి మహిళ బలవన్మరణం గురజాల: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... గురజాలలో నివాసం ఉంటున్న వీరిశెట్టి వైష్ణవి (39) స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంటుంది. భర్త కిషోర్ లెక్చరర్గా పనిచేస్తాడు. ఈక్రమంలో తెల్లవారు జామున మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు కింద పడి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో వైష్ణవి కొన ఊపిరితో ఉండటంతో స్థానికులు 108 సహాయంతో గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. రైల్వే పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేపడుతున్నారు. వైద్యశాల ఎదుట బంధువుల ఆందోళన.. సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైష్ణవి బంధువులు ఆందోళన చేపట్టారు. వైష్ణవి మృతికి భర్త కిషోర్ కారణమని కిషోర్ వైష్ణవిని ఎప్పుడు కట్నం కోసం వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైష్ణవిని పక్కంటి ఆడవాళ్లతో మాట్లాడినా అనుమానించి, అవమానించేవాడని.. గత కొంత కాలంగా చిత్రహింసలు పెడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వైద్యశాల వద్ద వైష్ణవి కుమారుడు విలపించిన తీరు పలువురిచే కంట తడి పెట్టించింది. చలో విజయవాడ విజయవంతం చేయాలి చిలకలూరిపేట: ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పి.శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ (సమరశంఖం) పోస్టర్ను పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మౌనం వహిస్తే సహించేది లేదని, ఇది హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి కల్పించలన్నారు. -
దంపతుల మధ్య గొడవ
● భర్తపై మరో వ్యక్తి దాడి● చికిత్స పొందుతూ బాధితుడి మృతి మంగళగిరి టౌన్: భార్యాభర్తలు గొడవ పడుతుండగా మరో వ్యక్తి వచ్చి భర్తపై దాడి చేయడంతో గాయాలపాలైన చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా, ఈపూరు మండలం, అంగలూరు తండాకు చెందిన జరపాల వెంకటేశ్వర నాయక్ (30), భార్య ప్రియాంక బాయితో మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి పనుల నిమిత్తం వచ్చారు. ఓ ప్రైవేటు కంపెనీలో లేబర్ వర్క్ చేస్తూ ఆ కంపెనీ ఇచ్చిన ఇంటిలో ఉంటూ రోజూ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వర నాయక్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. భర్తను ప్రతిఘటిస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర నాయక్ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. అతడు కింద పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు గాయాలపాలైన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. వెంకటేశ్వర నాయక్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వాక్యా నాయక్ ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి గుణదల(విజయవాడ తూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన గడ్డం సుమంత్(28) గత కొంత కాలంగా మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వీట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం పరిచయమైన రామలక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తూ.. ఇద్దరూ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య వ్యక్తి గత విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచీ ఇంట్లోనే ఉన్న సుమంత్ ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటికి అక్కడకు వచ్చిన రామలక్ష్మి అతనిని చూసి కంగారు పడి కేకలు వేసింది. అంతలో అక్కడకు చేరుకున్న స్థానికులు మృతుడిని కిందకి దించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
ఏఎన్యూ పీజీ ప్రశ్నపత్రంలో తప్పులు
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో పీజీ పరీక్షల నిర్వహణ అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 19 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. తొలిరోజు బుధవారం ఆంగ్ల పరీక్ష పేపరు, సోమవారం జరిగిన బయాలజీ విభాగాల పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పులను చూసి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తొలిరోజు తప్పులతో కూడిన ప్రశ్నపత్రం ఇస్తే సోమవారం అసలు సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. బ్యాక్టీరియాలజీ ప్రశ్నపత్రంలో 50 శాతానికిపైగా సిలబస్లో లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. నాలుగు, ఐదు యూనిట్లకు చెందిన ప్రశ్నలుగా మూడవ సెమిస్టర్కు చెందిన వైరాలజీ విభాగ ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా మరో రెండు కళాశాలల్లో సైతం ఇదే ప్రశ్నపత్రాన్ని వర్సిటీ అధికారులు విద్యార్థులకు అందించారు. తప్పులను పరిశీలకుల నుంచి తెలుసుకున్న పీజీ కో ఆర్డినేటర్ మన్నం సుబ్బారావు వచ్చి విద్యార్థుల చేతులలో నుంచి తప్పుగా వచ్చిన ప్రశ్నపత్రాలను తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన బీఈడీ పరీక్షలో కూడా పలు సెంటర్లలో ఒక దానికి బదులుగా మరొక పేపరు ఇవ్వడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్ష నిర్వహణ ఆలస్యంగా మారింది. మూడో సెమిస్టర్ పరీక్షల కూడా తప్పులతో కూడిన పశ్నపత్రాలు, ఒక ప్రశ్నపత్రంతో ఒకే ప్రశ్న మూడు సార్లు ఇవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరుతున్నారు. -
సుబ్రమణ్యేశ్వరునికి వెండి నెమలి తొడుగు ఆభరణం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రమణ్యేశ్వరస్వామికి దాతలు సోమవారం వెండి నెమలి తొడుగు ఆభరణం సమర్పించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యార్లగడ్డ పవన్కుమార్, పూర్ణిమ సౌభాగ్యలక్ష్మి దంపతులు ఈ ఆభరణం సమర్పించారు. సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన వెండి నెమలి తొడుగు ఆభరణానికి అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రేఖ, అర్చకులు శంకరమంచి రాజశేఖర్ పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారంతో మూడవ రోజుకు చేరుకున్నాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూత్రిదండి చిన్నజీయర్స్వామి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్స్వామి వార్ల స్వీయ పర్యవేక్షణలో ఈనెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం ఛాయాధివాసం, శ్రీ హయగ్రీవ ఇష్టి, జలాధివాసం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తెనాలి: పట్టణానికి చెందిన శ్రీవిఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేట లోనీ కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో జరుగుతున్న శ్రీ మహా సుదర్శన హోమం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. తొలుత స్వామివారికి విశేష తులసి దళార్చనను వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ట్రస్టు నిర్వాహకులు ఆర్వీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గానామృతం అయిదో పర్యాయం ముగింపు సందర్భంగా శ్రీమహా సుదర్శన హోమం నిర్వహించినట్టు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్టు ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం నిర్మిస్తామని తెలిపారు. వైఖానస పండితులు మేడూరి శ్రీనివాసమూర్తి భూదాన విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ ,రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


