breaking news
Guntur District Latest News
-
తురకపాలెం బాధితులకు న్యాయం చేయాలి
గుంటూరు రూరల్: గడిచిన ఏడాదిలో నిత్యం భయం భయంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికిన తురకపాలెం గ్రామంలో జరిగిన మిస్టరీ( మెలియాయిడిసీజ్) మరణాల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గతంలో నేషనల్ హ్యూమన్రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలో జరిగిన మిస్టరీ మరణాల నివేదికను ఎన్హెచ్ఆర్సీకి ఈ నెల ఆఖరుకు ప్రభుత్వం అందించాల్సి ఉండగా నిష్పక్షపాతంగా నివేదికను అందించాలని కోరుతూ విదసం ఆధ్యర్యంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గతేడాది తురకపాలెం మిస్టరీ మరణాల సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసి చర్యల నివేదిక కోరిన నేపద్యంలో మిస్టరీ మరణాలు ఎటువంటి పక్షపాతం లేకుండా రాజకీయాలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా మళ్లీ లెక్కించి అందరికీ రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదవిధంగా బాదిత కుటుంబ సభ్యులకు ప్రత్యేక డిజాస్టర్ పింఛను ఇవ్వాలని డిమాండ్ కోరారు. కార్యక్రమంలో బాధిత గ్రామస్తులు, సుదర్శనం బ్రహ్మయ్య, విదసం జిల్లా నాయకులు నల్లపు నీలాంబరం, మూర మహేశ్, కొప్పుల సురేష్, దార్ల అర్జున్, ఆనంద, అనీల్, వినోద్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డులోని వైఫై రూంమ్స్పై టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడిచేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరుకు చెందిన ఫణి పేకాటస్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఈశ్వరరావుతో పరిచయం అయింది. ఇరువురు కలిసి నగర శివారుల్లో ఖాళీగా ఉన్న హోటల్స్, రూంమ్స్లో పేకాట నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్– 1లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు ఇద్దరితో పాటు మరో 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 27 సెల్ఫోన్లు, ఒక టూ వీలర్, రూ.23,771 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కృష్ణాజిల్లా, గుడివాడ, నూజివీడు, ఏలూరు, పెనమలూరు, గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న జూదరులను నల్లపాడు పోలీసులకు అప్పగించారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి జూదరులను కోర్టుకు అప్పగించనున్నారు. -
ఉద్యోగులను వడ్డీలతో పీడిస్తున్నాడు...
లక్ష్మీపురం: పోలీస్ గ్రీవెన్స్(పీజీఆర్ఎస్)కు అర్జీలు వెల్లువెత్తాయి. బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సమస్యలను అధికారులకు విన్నవించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 199 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి, జిల్లా మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, ఈస్ డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, బి.సీతారాం, జీఆర్ఎస్ సీఐ, బిలాలుద్దీన్ పాల్గొన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాది చేబ్రోలు మండలం, మంచాల. చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. నాకు భార్య ఇద్దరు సంతానం. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. నాలుగేళ్లగా భార్య జ్యోతితో విడిగా ఉంటున్నా. అయితే ఇద్దరు పిల్లలు నా వద్దనే ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన తల్లి వందనం పథకంలో నగదు నా భార్య జ్యోతి ఖాతాలో జమా అయ్యాయి. అయితే ఇద్దరు పిల్లల పోషణ కోసం తల్లికి వందనం నగదు ఇవ్వమంటే ఇవ్వక పోగా బెదిరింపులకు దిగుతోంది. –వి.నాగభూషణం, వికలాంగుడు మా కుటుంబ ఖర్చుల నిమిత్తం గుంటూరు గౌతమినగర్, ముత్యాలరెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కె.రత్నారెడ్డి వద్ద అప్పుగా తీసుకున్నాం. రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నాడు. అప్పు తీసుకునే సమయంలో మా వద్ద మూడు ప్రామిసరీ నోట్లు, మూడు ఖాళీ చెక్కులు, ఏటీఏం, బ్యాంక్ పాస్ బుక్లను తీసుకున్నాడు. అప్పు పూర్తిగా జమా అయినప్పటికి ఇంకా వడ్డీ రావల్సి ఉందంటూ వేధించడం, బెదిరించడంతో పాటు రత్నారెడ్డి బినామి పేర్లతో మాపై కోర్టులో కేసులు వేయించడం వంటివి చేస్తు వేధింపులకు గురి చేస్తున్నాడు. రత్నారెడ్డి పై 2019లో కాల్మనీ కేసు ఉంది. ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద రత్నారెడ్డి అనుచరులను పంపించి బెదిరింపులకు దిగుతున్నాడు. న్యాయం చేయాలి. –గన్నెపల్లి శ్రీనివాసరావు, వెంకటప్రసాద్, విజయ్బాబు,మిసాల శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగులు నాకు వేమవరంలో ఏడు ఎకరాలు, విశదలలో 4 ఎకరాల పొలం ఉంది. గతంలో మా పొలాలను దౌర్జన్యంగా బోల్లా చౌదరి ఆక్రమించుకున్నాడు. గతంలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశా. మేడికొండూరు అతడిని పిలిపించారు. దీంతో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తావా అంటూ ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగాడు. రక్షణ కల్పించాలి. –కళ్లం శేషమ్మ, వృద్ధురాలు, శ్యామలానగర్ నా భర్త వసంతరావు 2020లో మృతి చెందాడు. నా పేరు మీద 1.65 సెంట్ల పొలం ఉంది. నా భర్త మొదటి భార్య మనమడు సురేష్ 2024లో నా పొలాన్ని గజాల్లోకి చేయాలని లేదంటే పొలానికి విలువ లేదని నా పేరు మీద చేయిస్తానని, సురేష్తో పాటు బెజవాడ రమేష్ కూడా వచ్చి నమ్మబలికి మందడం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకునివెళ్లి వేలిముద్రలు వేయించారు. పొలాన్ని అమ్ముకున్నాడు. అడుగుతుంటే గ్రామానికి వస్తే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. గతంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బెజవాడ రమేష్, పులి సురేష్ వలన నాకు ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించాలి. –పులి సువార్త, కుమార్తె పులి అమూల్య, ఉద్దండ్రాయపాలెం, తుళ్లూరు మండలం, గుంటూరు లీగల్: న్యాయవాదులపై దాడులు అరికట్టాలని పోలీస్ గ్రీవెన్స్లో న్యాయవాదులు అర్జీ అందించారు. తెనాలికి చెందిన న్యాయవాది ఖాదర్ హుస్సేన్, సత్తెనపల్లికి చెందిన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. న్యాయవాది తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం ఫిర్యాదు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించాలే తప్ప, దాడులు చేయడం లేదా కక్షపూరిత చర్యలకు పాల్పడటం చట్టబద్ధం కాదన్నారు. కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావుతో పాటు తెనాలి న్యాయవాదులు పాల్గొన్నారు. -
లోకేష్ తప్పుకో!
తప్పు ఒప్పుకో..మంగళగిరిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న దొంతిరెడ్డి, మురుగుడు, చిల్లపల్లి ప్రత్తిపాడులో డీఎస్సీ అక్రమాలపై భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, నాయకులు డీఎస్సీ అక్రమాలపై దగా పడ్డ యువత పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. రోడ్డున పడ్డ నిరుద్యోగులకు అండగా నిలిచి, వారి గొంతుకై అన్యాయాన్ని ప్రశ్నించింది. రూ.లక్షలు తీసుకుని తమ అనుయాయులకు, అర్హత లేనివారికి పప్పూ బెల్లాల్లా ఉపాధ్యాయ ఉద్యోగాలు పంచిపెట్టి, అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. డీఎస్సీ స్కాంపై వెంటనే సీబీఐ విచారణ జరగాలని, జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తప్పు ఒప్పుకొని.. మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని నినదించారు. డీఎస్సీ అక్రమాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీలు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన గళమై.. జన ప్రభంజనమై టీడీపీ సర్కారు అవినీతిని నలుదిశలా చాటాయి. – సాక్షి నెట్వర్క్ గుంటూరులో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, పానుగంటి చైతన్య -
గుంటూరు
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 20267తెనాలిలో జరిగిన ర్యాలీలో అగ్రభాగాన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తాడికొండలో ర్యాలీనుద్దేశించి మాట్లాడుతున్న వనమా బాల వజ్రబాబు పొన్నూరులో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న అంబటి మురళీకృష్ణ, నాయకులుఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ సాయికాంత్ వర్మ నల్లబ్యాడీలతో జీజీహెచ్ వద్ద నిరసన తెలియజేస్తున్న జూడాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.70 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది. మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని సోమవారం ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని పూజలు నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది. -
చెన్నారెడ్డి హత్యపై నిష్పక్షపాత దర్యాప్తు
సాక్షి, నరసరావుపేట: నవులూరి చెన్నారెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు పల్నాడు జిల్లా అడిషన్ ఎస్పీ రోహిత్కుమార్ చౌదరిని కోరారు. ఈమేరకు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సమన్వయకర్తలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు, డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తదితరులు సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి హత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. హత్యకు పాల్పడిన అసలు నిందితులను త్వరితగతిన గుర్తించి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యెల్లో మీడియా, పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలను, ఆధారం చేసుకొని పార్టీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. అడిషనల్ ఎస్పీకి వైఎస్సార్ సీపీ నేతల వినతి రెంటాల హత్య కేసులో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి హాజరైన సమన్వయకర్తలు పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డి, బొల్లా, గజ్జల -
శత్రు దేశాల యుద్ధ తంత్రమే దేశంలోకి డ్రగ్స్ సరఫరా
ఈగల్ విభాగం ఇన్చార్జి ఆకే రవికృష్ణ పెదకాకాని: నిషేధిత మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కొంతమంది విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకోవటమే కాకుండా వారి కుటుంబాలను, యావత్ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఈగల్ విభాగం రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ సెమినార్ హాలులో ఏపీ ఎగైనెస్ట్ డ్రగ్స్ అవేర్నెస్ టు యాక్షన్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆకే రవికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల తల్లిదండ్రులు వారు తిన్నా తినకపోయినా పిల్లల చదువు కోసం వారి ఆస్తిపాస్తులను అమ్మి వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని భావిస్తుంటారని చెప్పారు. కానీ తెలిసి తెలియని యవ్వనపు వయస్సులో విద్యార్థులు చెడు స్నేహాల బారిన పడి గంజాయి, హెరాయిన్ వంటి సైకో డ్రిక్స్, సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడి ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలను అనుభవిస్తున్నారని వివరించారు. శత్రు దేశాలు మనపై నేరుగా గెలవలేక అనైతిక విధానాలు ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి దేశ భవిష్యత్ను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మాజీ అధికారి డాక్టర్ గుత్తికొండ కొండలరావు మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా పెడదోవ పడుతున్న సమాజానికి కనువిప్పు కలిగేలాగా నేటి యువత మరీ ముఖ్యంగా న్యాయ విద్యార్థులు ఈ సందిగ్ధ వ్యవస్థలో సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. న్యాయ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ యూఎన్ఓ నిర్వహించిన సర్వే ప్రకారం12 నుంచి 17 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులో ఎక్కువమంది ఇలాంటి మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారని తెలిపారు. ఈగల్ టీం అధికారులు విద్యార్థులతో డ్రగ్స్ ఉపయోగించమని ప్రతిజ్ఞ చేయించారు. -
అదనపు కోర్టు కోసం జెడ్పీ అతిథి గృహం పరిశీలన
అమరావతి: 2026–2027 ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన అదనపు కోర్టు ఏర్పాటు నిమిత్తం సోమవారం స్థానిక జెడ్పీ అతిథి గృహం శాంతిథామం భవనాన్ని పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి భవనాన్ని పరిశీలించి కోర్టు ఏర్పాటుకు భవనంలో చేయాల్సిన పలు మార్పులను అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతిలతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: ఆగష్టు 13వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయా ప్రాంతాలను అమరావతి అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లను ఏడీసీ చీఫ్ ఇంజినీర్ మోజెస్ కుమార్ ఉన్నతాధికారులకు వివరించారు. బకింగ్హామ్ కెనాల్ వద్ద బ్యూటిఫికేషన్, సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, కొండవీటి వాగు, గుంటూరు చానల్ వద్ద జరుగుతున్న తుది నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, మంగళగిరి స్టేషన ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తాడికొండ ఆర్ అండ్ బీ డీఈఈ లక్ష్మీనారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలి రైల్వేస్టేషన్ను దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజనీకుమార్ సిన్హా సోమవారం సందర్శించారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి అప్పికట్ల వరకు ఆర్పీఎఫ్ పరిధిలో చేపడుతున్న రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును ఐజీ పరిశీలించారు. ఇటీవల పలు కీలక చోరీ కేసులను ఛేదించడంలో తెనాలి ఆర్పీఎఫ్ సిబ్బంది చూపిన ప్రతిభను ఆయన అభినందించారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన జీఆర్పీ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రైల్వే పరిధిలో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయనున్నట్లు ఎస్పీ షణ్ముక్ వడివేలు తెలిపారు. అమరావతి: అమరావతి పోలీస్ స్టేషన్ను ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సోమవారం సాయంత్రం సందర్శించారు. ఆయన స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. పలు రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతోపాటు, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సిబ్బందికి ఐజీ సూచించారు. తొలుత ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠికి సీఐ అచ్చియ్య ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పొన్నూరు ఎమ్మెల్యే మనుషులమంటూ బెదిరిస్తున్నారు
పొన్నూరు మండలం, చింతలపూడి గ్రామంలో నాకు 77 సెంట్లు భూమి ఉంది. దీనికి సంబంధించి పాస్బుక్తోపాటు అడంగల్ కూడా ఉంది. అందులో 33 సెంట్లు మా మామగారికి తమలపాకు తోటకు కౌలికిచ్చాను. ఆయన కొందరితో కుమ్మకై ్క ఆ భూమి తనదని వేరొకరికి విక్రయించారు. దీనికి పొన్నూరు తహసీల్దార్తోపాటు సిబ్బంది కూడా సహకరించి పేర్లు మార్చేస్తున్నారు. అడుగుతుంటే పొన్నూరు ఎమ్మెల్యే మనుషులమని బెదిరిస్తున్నారు. నా భూమి నాకు ఇప్పించి, న్యాయం చేయండి. – త్రిపురనేని వెంకటస్వామి, చింతలపూడి, పొన్నూరు మండలం -
కేఎల్యూలో ఏఐ బిల్డ్ 2026 హ్యాకథాన్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏఐ బిల్డ్ 2026 హ్యాకథాన్ కార్యక్రమం ఆదివారం రాత్రితో ముగిసింది. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 75కు పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఏజెంటిక్ ఏఐ, జెనరేటివ్ ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్కు సంబంధించిన రియల్ వరల్డ్ ఇండస్ట్రీ సమస్యలపై పరిష్కారాలను రూపొందించారు. విద్యార్థుల్లోని సాంకేతిక, విశ్లేషనాత్మక, సృజనాత్మక సామర్ాధ్యలను పరిశ్రమ ప్రముఖల సమక్షంలో ప్రదర్శించే ఈ పోటీని 42 లెర్న్ రూపొందించింది. ఏఐ బిల్డ్ 2026 కార్యక్రమానికి సూపర్ మనీ చీఫ్ హూమన్ రీసోర్స్ ఆఫీసర్ డాక్టర్ వరదరాజు, సూపర్ మనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కౌషిక్, ఫ్లిప్కార్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్ హనుమంతరావు, బజార్ వాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిబసవ, నార్తర్న్ ట్రస్ట్ సీనియర్ వైప్ ప్రెసిడెంట్ రాయడన్, బ్రిల్లియో ఆసియా పసిఫిక్ టాలెంట్ ఎక్విజిషన్ హెడ్ రితూ, రేజర్ పే ప్రపంచ లాలెంజ్ ఎక్విజిషన్ హెడ్ సుమిత్ ప్రేమీ సభ్యులుగా వ్యవహరించారు. 42 లెర్న్ ప్రెసిడెంట్ కోగంటి రాజశేఖర్ మాట్లాడుతూ ఏఐ బిల్డ్ 2026 ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ప్రతిభ ఎంత విస్తృతంగా ఉందో చాటిచెప్పిందన్నారు. వర్సిటీ వీసీ డాక్టర్ జి.పార్థ్ధసారథి వర్మ మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రథమ విజేతగా కేఎల్ విశ్వవిద్యాలయం(టీమ్ మెంబర్లు ఎం.శేష్మ, సయ్యద్ మస్తాన్ వలి, ఎల్. శ్రామ్య), ద్వితీయ విజేతలుగా డీఎన్ఆర్ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమవరం, విజ్ఞాన్ నిరులా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, గుంటూరు, తృతీయ విజేతలుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) కర్నూలు, నదింపల్లి సత్యనారాయణ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రో వీసీలు డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ పవన్కుమార్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సూపర్ మనీ కౌషికర్, ఎస్విపీఎల్ అండ్ డీ నోర్తర్న్ ట్రస్ట్ బ్యాంక్ డాక్టర్ రోయ్డాన్ గోన్సల్ వెజ్, గ్లోబల్ టీఏహెడ్ రీతు శర్మ బ్రిలియో, ప్రముఖ ఆర్కిటెక్ట్ వీపీ ఫ్లిక్కార్డ్ హనుమంతరావు, వర్సిటీ ప్లేస్మెంట్ విభాగం సీనియర్ డైరెక్టర్ శరవణ బాబు, 42 లెర్న్ సీఈఓ కోగంటి రాజ్ తదితరులు విజేతలను అభినందించారు. రూ.11.80 లక్షల అపరాధ రుసుం విధింపు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ చౌర్యం, అక్రమ విద్యుత్ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగాలు గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, పాతగుంటూరు, బాలాజీనగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్లలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 52 మంది అధికారులు, 156 మంది సిబ్బంది, 52 బృందాలుగా ఏర్పడి 4,069 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 243 మందికి రూ.11.72 లక్షలు, అనుమతించిన కేటగిరీకి కాకుండా ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటన్న ఒక్కరికి రూ.8 వేలు మొత్తం కలిపి రూ.11.80 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ మాట్లాడుతూ విద్యుత్ను అక్రమంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడుతుందని తెలిపారు. వినియోగదారులు నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ సర్వీసులను వినియోగించాలని సూచించారు. అక్రమ విద్యుత్ వినియోగానికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యం, అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 9440812263, 9440812361 నంబర్లకు ఫోన్ చేయవచ్చని, వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, విజిలెన్స్, ఆపరేషన్ విభాగాల డీఈఈలు పి.రమేష్, ఎన్.మల్లికార్జునప్రసాద్, కె.రవికుమార్, ఏఈలు షేక్ మస్తాన్, యు.ఉమాశంకర్, ఎం.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: పట్టణ చినరావూరుకు చెందిన యువతి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు చేరగా, నిజాంపట్నంలో చెరువులకు కాపలా ఉంటున్న దుర్గ, ఆమె భర్త చిన్నారావు యువతిని తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిన్నారావు మహిళపై లైంగికదాడికి పాల్పడిన సంగతి విదితమే. త్రీ టౌన్ పోలీసులు కిడ్నాప్, రేప్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసును ఆదివారం రాత్రి నమోదు చేశారు. అప్పటికే ఈ కేసులో నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గ ఏడు నెలల గర్భిణి కావడంతో తనకు నొప్పులు వస్తున్నాయని పోలీసులకు ఆదివారం రాత్రి చెప్పడంతో వైద్యశాలకు పంపగా, పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో పోలీసులు తిరిగి తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్ వద్ద ధర్నా
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు లక్ష్మీపురం: దళితులపై దాడులు, సామాజిక సమానతలు, వివక్ష విడనాడాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి దళితుల నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సీపీఎం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో ఆగస్టు 24న గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఈమని అప్పారావు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్నాకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఎం.రవి, బి.వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు యు.దుర్గారావు, ఎల్.అరుణ, డి.లక్ష్మీనారాయణ, కె.అజయ్కుమార్, బి.ముత్యాలరావు, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో అర్జీలకు పరిష్కారం
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం చాలా ముఖ్యమని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్ఓ మాట్లాడుతూ కొన్ని అర్జీల పరిష్కారం రెండు, మూడు శాఖల సహకారంతో ఉంటాయన్నారు. సమన్వయం లేకపోతే అర్జీలు పరిష్కారం కావన్నారు. అర్జీలకు నిర్దేశిత కాలపరిమితిలో నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్న దృష్ట్యా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన అర్జీలను డీఆర్ఓతోపాటు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, డేవిడ్, డీఈఓ సలీం బాష, జిల్లా అధికారులు పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి -
లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు
తాడేపల్లి రూరల్: ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో 2025, ఏప్రిల్, 16వ తేదీన రాత్రి సమయంలో కనకపూరి లంకబాబు తన బావమరిది కుమార్తెలు ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడంతో అతడిపై బాలికల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన అప్పటి ఎస్ఐ ఖాజావలి గుంటూరు పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జి షమీమ్ పర్వీన్ సుల్తానా బేగం ముద్దాయి కనకపూరి లంకబాబుకు జైలు శిక్ష, జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. గుంటూరు ఎడ్యుకేషన్: సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఛలో గుంటూరు నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుమలరెడ్డి, దయానంద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ర్యాలీ, ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్దరణ హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన దాదాపు ఐదువేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితం ఎంతో దుర్భరంగా మారిందని, వారికి సీపీఎస్ పెన్షన్ రూపంలో నెలకు రూ.వెయ్యి, 1,200 చొప్పున వస్తోందన్నారు. ఇది సామాజిక పెన్షన్ కంటే తక్కువగా ఉందన్నారు. సెప్టెంబర్ ఒకటిన గుంటూరులో తలపెట్టిన సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. విజ్ఞాన్ను సందర్శించిన తైవాన్ ఏషియా వర్సిటీ ప్రతినిధి బృందం చేబ్రోలు: ఇండియా– తైవాన్ విద్యా సహకారానికి మరింత బలం చేకూర్చే దిశగా తైవాన్కు చెందిన ఏషియా యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం విజ్ఞాన్ యూనివర్సిటీను సందర్శించింది. ఈ పర్యటన ఇండియా– తైవాన్ అకడమిక్ కోలాబరేషన్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. తైవాన్ ప్రతినిధి బృందంలో ప్రొఫెసర్ లిన్ చున్–వెయ్, ప్రొఫెసర్ డాక్టర్ చార్లెస్ సి.ఎన్.వాంగ్, ప్రొఫెసర్ డాక్టర్ చింగ్–హ్సియన్ హ్సు, మిస్ జిల్ లై, డాక్టర్ యింగ్–రాంగ్ హో పాల్గొన్నారు. సమావేశంలో ఇరు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు సంయుక్త పరిశోధనలు, సెమీకండక్టర్, కృత్రిమ మేధ(ఏఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సంయుక్త విద్యా కార్యక్రమాలు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఇంటర్న్షిప్లు, విద్యార్థుల గ్లోబల్ మొబిలిటీ, ద్వైపాక్షిక డిగ్రీ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ తైవాన్ సాంకేతిక నైపుణ్యాన్ని భారత యువత ప్రతిభతో కలిపితే ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,115 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్లోని హైలెవెల్ చానల్కు 126 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్కు 759 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 273, పశ్చిమ కాలువకు 117, నిజాంపట్నం కాలువకు 176, కొమ్మమూరు కాలువకు 1,310 క్యూసెక్కులు విడుదల చేశారు. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 47.6 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 2.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 15.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 37.6 మి.మీ., తెనాలి 36.4, పెదకాకాని 30.2, మేడికొండూరు 25.8, గుంటూరు తూర్పు 24.6, గుంటూరు పశ్చిమ 18.2, చేబ్రోలు 15.8, మంగళగిరి 9.4, ఫిరంగిపురం 9, పెదనందిపాడు 8.4, తుళ్లూరు 6.8, తాడేపల్లి 3.4, తాడికొండ 3.2, కాకుమాను 3.2, పొన్నూరు మండలంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆగస్టు 9వ తేదీ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 47.8 మి.మీ కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 43.3 మి.మీ వర్షపాతం నమోదైంది. గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో ‘అభయ డే’ గుంటూరు మెడికల్ ఫాగ్సి, గుంటూరు ఆబ్స్ట్రిక్స్ – గైనకాలజికల్ సొసైటీ (జీఓజీఎస్)సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు నగరంలో ‘‘అభయ డే’’గా పాటిస్తూ వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రాజకుమారి, డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ అనిత, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ అన్నె, పీడియాట్రీషియన్ డాక్టర్ సాహితి, కేర్ డెంటల్ కాలేజ్ వైద్యులు, గైనకాలజీ వైద్యుల సంఘం సభ్యులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. అహల్య ట్రస్ట్ నిర్వాహకులు, ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ... వైద్య విద్య పూర్తయిన రోజున హిపోక్రటిక్ ప్రమాణం చేసి రోగి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతిజ్ఞ చేసే వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై దాడి చేసినా, బెదిరించినా, ఆసుపత్రిని ధ్వంసం చేసినా కఠినమైన, వేగవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడే చేతులను కాపాడుకుంటూ సురక్షితమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. -
ఘనంగా జనార్ధనమూర్తి జన్మదిన వేడుకలు
తాడేపల్లి రూరల్: సోనోవిజన్ అధినేత పొట్లూరి జనార్ధనమూర్తి 89వ జన్మదిన వేడుకలను ఆదివారం అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆక్వా డెవిల్స్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణించిన జనార్ధనమూర్తి అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జీవిత ప్రస్థానంలో వ్యాపారవేత్తగా సాధించిన విజయాలు, సమాజ శ్రేయస్సు కోసం చూపి దాతృత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పలువురు ప్రముఖులు జనార్ధనమూర్తి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యను సామాజిక మార్పుకు ఆయుధంగా మలచడంలో ఎస్ఎఫ్ఐ కీలక పాత్ర పోషిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతోపాటు పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలను బలోపేతం చేయాలని, విద్యార్థి ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కే ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, హాస్టల్ సౌకర్యాలు, మెస్ చార్జీ లు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తది తర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎన్.భావనారాయణ మాట్లాడారు. జిల్లా కన్వీనర్గా షేక్ సమీర్ ఎన్నిక ప్లీనరీ సమావేశాల్లో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా షేక్ సమీర్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా రాజ్కుమార్, దాసరి కిరణ్, డి.పీ.నాయక్, జాషువా, మరియమ్మ, కిన్నెర, యశ్వంత్, సూర్జిత్, ఉమామహేశ్వరరావు, ధీరజ్, జాన్ రాజ్ గణేష్, వినయ్, హనీఫ్, రూబెన్, ఇషాంత్రెడ్డి ఎన్నికయ్యారు. -
మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం
దుగ్గిరాల: ఆషాఢ మాసం చివరి ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పూలంగి సేవలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చిలువూరుకు చెందిన రంగిశెట్టి జగదీష్ చండీ హోమం నిర్వహించారు. దాతల సహాయంతో మహిళలకు ఉచితంగా పొంగలి సామగ్రి అందించారు. పెద్ద సంఖ్యలో ఆలయ ఆవరణలో మహిళలు కట్టెల పొయ్యిలపై పొంగలి వండారు. మేళతాళాలు, కనక తప్పెట్లు మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ నిర్వహణ కమిటీ పర్యవేక్షించింది. ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్) ఆధ్వర్యాన ఇంటర్జోన్ వాలీబాల్ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఇంటర్ జోన్లో భాగంగా ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎన్టీటీపీఎస్, ఎయిర్పోర్ట్ యూనిట్, విజయవాడ గార్డ్స్, హెడ్ క్వార్టర్ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు స్వాతంత్య్ర దినోత్సవాన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్ కమాండెంట్ కె.రమేష్ తెలిపారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.30 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 13,435 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గుంటూరు వెస్ట్: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది ఆదివాసి నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బీర్సా ముండా, మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది పోరాట యోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధి, సహకారం గురించి లోతుగా ఆలోచించి, సరైన సమయంలో సహాయం అందించిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పట్టణాలు ఎంత అందంగా ఉంటాయో అంతకుమించి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీబీ జీ రామ్ జి పథకం ద్వారా అందరికీ సకల సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్ప సంపదలన్నారు. గిరిజన ప్రాంతంలో పనిచేశానని, అప్పటి ఉద్యోగ జీవితం గొప్ప సంతృప్తిచ్చిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు నిజమైన వారసులని కొనియాడారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గళ్లా మాధవి, శ్రీను నాయక్, మేడా రామకృష్ణ, బాపట్ల ఏసుబాబు, చంద్రనాయక, కట్ట వెంకటేశ్వర్లు, కే కోటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 20267పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మకు ఆదివారం లక్ష పసుపు కొమ్ములతో విశేష అర్చన, అలంకరణ చేశారు. భక్తులు బోనాలు, పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.7570 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. నగరంపాలెం: నృత్యం మనోవికాసానికి దోహదపడుతుందని ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్రావు అన్నారు. గుంటూరు బృందావన్గార్డెన్న్స్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నృత్యాలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో నృత్య కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురామ్ నిర్వహణలో వేడుకలు జరిగాయి. అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన నాట్య మయూర శిష్య బృందం ప్రదర్శించిన ‘ఇల వైకుంఠం’ కూచిపూడి నృత్య కీర్తనలకు మద్దాళి సౌందర్య నృత్య దర్శకత్వం వహించారు. నాట్యాచార్యులు ఎస్కే.ఖలీల్ రాధామాధవ నాట్యక్షేత్రం శిష్య బృందం ‘అచ్యుతం– కేశవం’ రాధాకృష్ణుల బృంద నాట్యం ప్రదర్శించారు. నృత్య కిన్నెర యాభై ఏళ్ల ప్రస్థానంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి అభినందించారు. సభలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ప్రభాకరరావు, నిర్వాహకులు పి.విజయకుమార్, కోశాధికారి కేవీ సుబ్బారావు పాల్గొన్నారు. అతిథులను, కళాకారులను సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏకాదశి, వరస సెలువులు, ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చెంత భక్తజన జాతర కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. అంతరాలయ దర్శనాలను నిలిపివేసి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను రద్దు చేశారు. వందకుపైగా భక్త బృందాలు సారె సమర్పించాయి.గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి దాతల సాయం మరువలేనిది. వైద్య కళాశాలను దేశంలో టాప్ పది కళాశాలల్లో నిలబెట్టడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పూర్వ వైద్య విద్యార్థులు, నగరానికి చెందిన ప్రముఖులు విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. బోధనలోనూ, వసతుల్లోనూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతా. నేను ఇక్కడే చదువుకున్నాను. మాతృ సంస్థకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 50వ ర్యాంక్ రావడం మాటల్లో చెప్పలేని అనుభూతిని మిగిల్చింది. – డాక్టర్ ఎన్వీ సుందరాచారి, ప్రిన్సిపాల్, జీఎంసీగుంటూరు మెడికల్: దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య కళాశాలలకు ర్యాంకింగ్స్ అందజేసే ప్రతిష్ఠాత్మక ఐఐఆర్ఎఫ్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్స్–2026ను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 144 వైద్య కళాశాలలకు ర్యాంకింగ్స్ ప్రకటించగా, ఫలితాల్లో గుంటూరు మెడికల్ కాలేజ్కు జాతీయ స్థాయిలో 50వ స్థానం లభించింది. గుంటూరు వైద్య కళాశాల 1946లో ప్రారంభమైంది. ర్యాంకింగ్స్ అందజేసేందుకు నిర్దేశించిన ప్రమాణాల పరీక్షల్లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 953 మార్కులతో దేశ వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవగా, గుంటూరు వైద్య కళాశాలకు 920 మార్కులు వచ్చాయి. రూ.10 కోట్లతో రూపురేఖలు మార్చి... గుంటూరు వైద్య కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.10 కోట్లతో దాతల సాయంతో వైద్య కళాశాలను అభివృద్ధి చేసి, రాష్ట్రం అంతటా గుంటూరు వైద్య కళాశాల గురించి చర్చించుకునేలా రోల్మోడల్గా తీర్చిదిద్దారు. గుంటూరు వైద్య కళాశాల 1999 బ్యాచ్కు చెందిన డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్రులు రూ.80 లక్షల విరాళంతో రెండు బస్సులు అందించారు. హాస్టళ్లలో క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, వైద్య విద్యతోపాటు విద్యార్థుల్లో క్రీడల్లో రాణించేలా చొరవ చూపించారు. కళాశాల లోపలి రోడ్లను 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ నలమోతు శరత్చంద్రకుమార్ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం ఇచ్చిన రూ.6 లక్షల విరాళంతో నిర్మించారు. కళాశాల ప్రధాన ద్వారాన్ని పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ చెరుకూరి పవన్కుమార్ ఇచ్చిన రూ.7 లక్షలతో నిర్మించారు. ప్రముఖ స్పైన్ సర్జన్, గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ జె. నరేష్బాబు కుటుంబం రూ.25 లక్షలు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి రూ.10 లక్షలు, డాక్టర్ శారద రూ.6 లక్షల విరాళం ఇవ్వడంతో కళాశాలలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 1980 బ్యాచ్ విద్యార్థులు రూ.60 లక్షలు విరాళం ఇవ్వడంతో పలు లెక్చర్ గ్యాలరీలను ఆధునికీకరించారు. రూ.10 లక్షలతో ఎగ్జామినేషన్ హాలు ఏర్పాటు చేశారు. వాటర్ కూలర్లు, పలు విభాగాల ఆధునికీకరణ పనులకు పలువురు దాతలు సహకరించారు. కళాశాలలో పలు వైద్య విభాగాలను ఆధునీకరించారు. విద్యుత్ వ్యవస్థ మెరుగుదల, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు, చెట్ల సంరక్షణ, గెస్ట్ ఫ్యాకల్టీ భవనం ఆధునికీకరణ, లైబ్రరీ ఆధునికీకరణ, విగ్రహాలతో పాటు ఫౌంటెన్ల అభివృద్ధి, వైద్య విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రత్యేక వెల్నెస్ క్లినిక్ను ఏర్పాటు వంటివి చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులు సైతం మెచ్చుకునేలా గుంటూరు వైద్య కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రిన్సిపల్ ప్రత్యేక కృషి ‘గుంటూరు వైద్య కళాశాలను దేశంలోని టాప్ 100 కళాశాలల్లో ఒకటిగా నిలుపుతాను’ అని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి బాధ్యతలు చేపట్టిన 2024 నవంబర్ 1న మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే నేడు గుంటూరు వైద్య కళాశాలను దేశంలోనే 50వ స్థానంలో నిలిపి అందరి మన్ననలు పొందారు. దక్షిణ భారతదేశంలోని వైద్య కళాశాలల్లో 10వ స్థానంలో, ఏపీలోని మెడికల్ కాలేజీల్లో మూడో స్థానంలో కళాశాలను నిలిపి రికార్డు సృష్టించారు. ఉత్తమ బోధనకు 2023లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 2022లో ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీగా డాక్టర్ సుందరాచారి ఎంపికయ్యారు.స్టాల్స్ వద్ద సందర్శకులు -
మల్లిక స్పయిన్ సర్జన్కు అంతర్జాతీయ గుర్తింపు
● రోగితో మాట్లాడుతూనే వెన్నెముక ఎండోస్కోపీ శస్త్రచికిత్స ● అవేక్ స్పైన్ ఎండోస్కోపీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు గుంటూరు మెడికల్: గుంటూరులోని మల్లిక స్పయిన్ సెంటర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. చైన్నెలో జరిగిన మిస్సాబ్కాన్ 2026 సదస్సులో పాన్ ఏషియన్ సొసైటీ ఆఫ్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పయిన్ సర్జరీ, చైన్నె స్పయిన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మినిమల్లీ ఇన్వేసివ్ స్పయిన్ సొసైటీ ఆఫ్ భారత్( మిస్సాబ్) ఇన్నోవేషన్ అవార్డు 2026ను గుంటూరు మల్లిక స్పయిన్ సెంటర్ చీఫ్ స్పయిన్ సర్జన్ డాక్టర్ జె.నరేష్బాబు అందుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్ సెంటర్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ బృందం మొత్తం పది శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను సమర్పించింది. వీటిలో నాలుగు పత్రాలు వివిధ అవార్డు విభాగాలకు ఎంపికై అవార్డులు గెలుచుకున్నట్లు తెలిపారు. పూర్తి మత్తు లేకుండానే వెన్నెముక శస్త్రచికిత్స వెన్నెముక శస్త్రచికిత్సకు సాధారణంగా అవసరమయ్యే పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేకుండా, సరైన రోగులను ఎంపిక చేసి, తగిన మత్తు విధానాలతో రోగి మెలకువగా ఉండి వైద్యులతో మాట్లాడుతూనే వెన్నెముక ఎండోస్కోపీ శస్త్రచికిత్స నిర్వహించే ‘అవేక్ స్పయిన్ ఎండోస్కోపీ’ అనే వినూత్న విధానాన్ని అభివృద్ధి చేసి, సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన సాంకేతికతలు, మెళకువలను ప్రతిపాదించినందుకు డాక్టర్ నరేష్బాబుకు ఈ అవార్డు లభించింది. ధ్వని తరంగాలతో వెన్ను ఒత్తిడి తొలగింపు వెన్నెముక శస్త్రచికిత్సలో సంప్రదాయంగా ఉపయోగించే మోటార్ డ్రిల్స్, బోన్ కట్టర్స్, బర్స్ వంటి పరికరాలకు భిన్నంగా, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ (అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు) ఆధారంగా పనిచేసే సాంకేతికతను ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలో ఉపయోగించడం ఈ విధానంలోని ప్రత్యేకత. ధ్వని తరంగాలు వెన్నులోని నరాలకు హాని కలిగించకుండా వెన్ను ఒత్తిడిని నివారించే ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా నరాలు, ఇతర సున్నితమైన నిర్మాణాలకు సమీపంగా పనిచేసే సమయంలో ఈ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుంది. తొలిసారి ఆపరేషన్కు అవార్డు మొదటిసారిగా ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలో అల్ట్రాసోనిక్ టెక్నాలజీని ఉపయోగించి, కేవలం సుమారు 4 మిల్లీ మీటర్ల. చిన్న కోతల ద్వారా మెడ, వీపు, నడుము వెన్నెముకలకు శస్త్రచికిత్స నిర్వహించే ‘ఎండోస్కోనిక్ సర్జరీ’ విధానాన్ని ప్రతిపాదించి అభివృద్ధి చేసినందుకు ఈ పరిశోధనకు ఇన్నోవేషన్ అవార్డు లభించింది. -
చిత్రకళా వీధితో కళాకారులకు ప్రయోజనం లేదు..
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి చిత్రకళా వీధి పేరుతో రోడ్లనే మూసేసి కార్యక్రమాలను నిర్వహించడం వలన కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మినహా, ప్రజలకు, కళాకారులకు ఎటువంటి ప్రయోజనం లేదని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి రఘుమహంతి వరలక్ష్మీదేవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు సిద్ద వెంకాయమ్మ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమవేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బూసి రాజులత, జిల్లా మహిళా విభాగ నాయకులు సూదా తులసి కుమారి, ఇంటూరి శశికళ, వజ్రాల విజయ, మలిరెడ్డి కల్పన రెడ్డితో కలసి వారు మాట్లాడుతూ చిత్రకళా వీధి కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను ఎంచుకోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నగరంలో ఎన్టీఆర్ స్టేడియం, బీఆర్ స్టేడియం, చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుంటూరు గ్రౌండ్ వంటి ప్రజాదరణ పొందిన, కార్యక్రమాలకు అనుకూలమైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నప్పటికీ రహదారులనే కార్యక్రమం కోసం ఎంచుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు? శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధాన రహదారులను మూసివేయడం వలన ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని అన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారిని మూసి వేసి, స్టాళ్లను, వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు గుజ్జనగుండ్ల నుంచి కొరిటెపాడు వరకు ప్రధాన రహధారిలోకి వచ్చే మిగిలిన రోడ్లను మూసి వేయడం వలన ప్రజలు తీవ్రు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రధాన రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆ మార్గంపై ఆధారపడి చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనాన్ని గడుపుతున్న చిరు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, దుకాణాలు, తాత్కాలిక స్టాల్స్ ఏర్పాటు చేసుకుని రోజువారీ ఆదాయంపై ఆధారపడే వారు రహదారి మూసివేతతో తమ జీవన విధానాన్ని కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ వేదికలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ప్రధాన రహదారులను ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటో అధికారులు ప్రజలకు స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
గుంటూరు మెడికల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుంటూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర 200 మీటర్ల జాతీయ జెండాతో మార్కెట్ సెంటర్ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం నుంచి మార్కెట్ సెంటర్ మీదగా లిబర్టీ, కృష్ణమహల్ థియేటర్ రోడ్డులో నుంచి నాజ్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ జెండా కోసం లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. ప్రతి భారతీయుడి ఇంటిపై జెండా ఎగరాలకోరారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్ మాట్లాడుతూ యువత చేతిలో జాతీయ పతాకం ఉంటే దేశ భవిష్యత్ భద్రంగా ఉంటుందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించినప్పుడే నిజమైన దేశభక్తి నిరూపితమవుతుందన్నారు. ర్యాలీలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, మాజీ డెప్యూటీ మేయర్ షేక్ సజీల, తిరంగా ర్యాలీ రాష్ట్ర కన్వీనర్ గుడిసె దేవానంద్, కో– కన్వీనర్లు శివారెడ్డి, సాయి లోకేష్, ఈదర శ్రీనివాసరెడ్డి, వెలగలేటి గంగాధర్, పాలపాటి రవికుమార్, డాక్టర్ టి.వి.రావు, తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ డాక్టర్ చరక కుమార్గౌడ్, కో– కన్వీనర్లు క్రిష్టిపాటి నారాయణరెడ్డి, మేడూరి యశ్వంత్, నడ్డి నాగమల్లేశ్వరి, భజరంగ్ రామకృష్ణ, కంతేటి బ్రహ్మయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ -
అమరావతి చిత్ర కళా వీధి అట్టర్ ఫ్ల్లాప్
నగరంపాలెం: అమరావతి ‘చిత్ర కళా వీధి’ అట్టర్ ఫ్ల్లాప్ షోగా మిగిలింది. గుంటూరు రింగ్రోడ్డు వెంట తలపెట్టిన అమరావతి చిత్ర కళావీధి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఏర్పాట్లు అథమంగా ఉన్నాయి. విద్యార్థులను భారీగా తరలించారు. అసలే ఉక్కపోతతో అల్లాడుతుంటే నడి వీధిలో షామియానాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రసంగాలు చేయడంతో చెమటలుపట్టాయి. సుమారు పదిన్నర నుంచి నాయకుల ప్రసంగాలు మొదలవ్వగా, ఎర్రని ఎండల్లో భరించక తప్పలేదు. వేదికపై ఉన్న నాయకులు ఇబ్బంది పడ్డారు. ఇక వేదిక ముందు కుర్చీలపై ఓ ప్రైవేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎర్రని ఎండల్లో ఉండిపోయారు. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడే సమయంలో ఎండలో కూర్చున్న విద్యార్ధులు అందరూ ఒక్కసారిగా లేచి వేదిక ముందున్న నీడలోకి వచ్చేసి నిలబడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ శంకర్విలాస్ బ్రిడ్జి పునః నిర్మాణ పనులు జరుగుతున్నాయని తద్వారా ట్రాఫిక్కు ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. వచ్చే ఏడాదిలో చిత్రకళా వీధి నిర్వహించాలని నిర్వాహకులకు సూచించినట్లు చెప్పుకొచ్చారు. అయినా నగరంలో ట్రాిఫిక్ క్రమబద్ధీకరిస్తామని హామీ మేరకు అనుమతిచ్చామని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైన అర్థం చేసుకుంటారని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పైన ఎండ తాకిడి ఎక్కువగా ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వెస్ట్, ఈస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, నసీర్ విద్యార్థుల గురించి ఆరా తీశారు. – ఆదివారం కూడా ఏర్పాట్లు.. అమరావతి చిత్ర కళా వీధికి కళాకారులు, చిత్రకళాకారులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. కొందరు నిర్వాహకులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం చిత్ర కళా వీధికి చేరారు. చిత్రలేఖన ఫొటోలు, పెయింటింగ్లు ఇతరత్రా సామాన్లతో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కూటమి నాయకులు విఫలమయ్యారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఇబ్బందులు తప్పలేదు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కష్టాలు పడ్డారు. ఇప్పటికే శంకర్విలాస్ రైల్వేఓవర్బ్రిడ్జి పునః నిర్మాణ పనుల దృష్ట్యా రింగ్ రోడ్డు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంది. ట్రాఫిక్ మళ్లించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డీ మార్ట్ నుంచి సాయిబాబా రోడ్డు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ప్రకటన చేయడంతో మరింత ఇబ్బందులకు గురిచేశాయి. శనివారం రింగ్రోడ్డు మీదగా వికాస్నగర్, జేకేసీ కళాశాల రోడ్డు, రాజేంద్రనగర్ వైపు వెళ్లేందుకు స్థానికులు, చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. అడ్డరోడ్ల మీదగా వయా రింగ్రోడ్డు వైపు వచ్చే ప్రదేశాల్లో బారికేడ్ల ఏర్పాటు చేయగా పోలీసులతో చోదకులకు స్వల్ప వాదనలు చోటుచేసుకున్నాయి. అప్పటికే కొందరు వాహనదారులు తెలియక రింగ్ రోడ్డు వైపు రాగా, రహదారి పక్కనే దుకాణాలు ఉండటంతో వెనుదిరిగి వెళ్లారు. కళ తప్పిన వ్యాపారాలు.. ఇక రింగ్రోడ్డు డీ మార్ట్ నుంచి సాయిబాబా గుడి వరకు ఇరువైపులా నెలకొన్న పెద్ద రిటైల్, హోల్సేల్ వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్, కల్యాణ మండపంలో నిర్వహించే ఎక్స్పో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పలేదు. ఇక సాయంత్రం వేళ రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్ల వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ఆదివారం కూడా నగర వాసులు, చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పవు. కూటమి ప్రభుత్వంపై చోదకులు నిప్పులు చెరిగారు. ఏదైనా పెద్ద ఎత్తున్న స్టాల్స్ నిర్వహించేటప్పుడు ఏదైనా ఖాళీ మైదానాలు, శివారు ప్రాంతాలను ఎంచుకుంటారని, నగరానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకై క రింగ్రోడ్డును రెండు రోజులు ట్రాఫిక్ మళ్లించడం ఎంతవరకు సమంజసమని ఆందోళన వ్యక్తం చేశారు. -
డీఎస్సీ అభ్యర్థులకు దగా
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా గత మూడు రోజుల పాటు సాగిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. శనివారం ప్రచార కమిటీ, ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్న వారికి, వారితో సహా దీక్షల్లో కూర్చున్న పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమాకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీ పార్వతి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. నిరద్యోగుల జీవితాలతో చెలగాటం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కష్టపడి ఒక్క పరీక్ష కూడా రాయని లోకేష్, ఏళ్ల తరబడి కష్టపడిన నిరుద్యోగుల జీవితాలతో వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు. కష్టపడి మెరిట్ సాధించిన పేద అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా రూ.15 లక్షలు ఇచ్చిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. మెరిట్ సాధించిన అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ బయటపెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. భారతంలో కొడుకుపై అతిప్రేమతో వంశాన్ని నాశనం చేసుకున్న ధృతరాష్ట్రుడిలా చంద్రబాబు ఉన్నారని, అవినీతిపరుడైన లోకేష్ చేస్తున్న దందాలను కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన శాంతియుత నిరసన టెంట్లను తొలగిస్తూ పోలీసులతో ప్రజా గొంతును నొక్కుతున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో 400 ఉద్యోగాలు అమ్మారని, అసలైన అభ్యర్థులకు కాకుండా ఇతరుల పేర్లతో కాల్ లెటర్లు పంపారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతూ స్థలం, సమయం ఖరారు చేయడం లేదన్నారు. వారి స్థాయికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాకా ఎందుకు వైఎస్సార్ సీపీ చెందిన ఏ మాజీ మంత్రితోనైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. గోల్డ్ మెడలిస్టులను పక్కన పెట్టేశారు వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ప్రశ్నపత్రాల లీకేజీ, క్రీడా కోటా అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్టులను పక్కనపెట్టి అక్రమ మార్గాల్లో వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే సీబీఐ విచారణకు అప్పగించడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, 12 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ వివిధ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముగిసిన వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్షలు రూ.15లక్షలకు డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు! నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి టీచర్ పోస్టులు : అంబటి రాంబాబు ధృతరాష్ట్రుడిలా చంద్రబాబు.. ఉత్తర కుమారుడిలా లోకేష్ : లక్ష్మీ పార్వతి ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి : టీజేఆర్ సుధాకర్ బాబు -
ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మెడికల్ కాలేజీకి 50వ స్థానం
గుంటూరు మెడికల్ ప్రతిష్ఠాత్మక ఐఐఆర్ఎఫ్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్స్ 2026లో గుంటూరు మెడికల్ కాలేజీ జాతీయ స్థాయిలో 50వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య కళాశాలలకు సంబంధించిన ఈ ర్యాంకింగ్స్లో గుంటూరు మెడికల్ కాలేజీకి లభించిన స్థానం కళాశాల వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. శనివారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 144 ప్రముఖ వైద్య కళాశాలల జాబితాను ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్కు సంబంధించిన వార్తను ప్రముఖ వైద్య, ఆరోగ్య వార్తా వేదిక మెడికల్ డైలాగ్స్ ప్రచురించింది. అందులో గుంటూరు మెడికల్ కాలేజీకి అఖిల భారత స్థాయిలో 50వ ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో 50వ స్థానంలో నిలవటంతో శనివారం గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జున కొండ వెంకటసుందరాచారి హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు కళాశాల అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది , గుంటూరు జీజీహెచ్కు చెందిన ప్రతి ఒక్కరి సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 50వ స్థానం సాధించడం గుంటూరు జిల్లా ప్రజలకు, వైద్య కళాశాల విద్యార్థులకు ఆనందకరమైన విషయమని తెలిపారు. దీనిని ఒక ప్రారంభ విజయంగా మాత్రమే భావిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని టాప్ 10 మెడికల్ కాలేజీల్లో గుంటూరు మెడికల్ కాలేజీకి స్థానం కల్పించడమే తమ లక్ష్యం అని డాక్టర్ సుందరాచారి తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలను దేశంలోని అగ్రశ్రేణి వైద్య విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని డాక్టర్ ఎన్.వి.సుందరాచారి పిలుపునిచ్చారు. -
బిరబిరా కృష్ణమ్మ..!
● మొదలైన కృష్ణానది పరవళ్లు ● ఈ ఏడాది తొలిసారి నాగార్జునసాగర్కు చేరుకున్న వరదనీరు ● ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● కృష్ణానది పరివాహక ప్రాంత రైతుల్లో చిగురిస్తున్న ఆశలు సాక్షి, నరసరావుపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ పరవళ్లు నాగార్జునసాగర్కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమై తొమ్మిది వారాలైనా సరైన వర్షాలు పడక, సాగర్ డ్యాం నిండక ఆందోళనలో ఉన్న రైతులకు ఊరటనిస్తూ కృష్ణా జలాలు సాగర్ వైపు వడివడిగా పరుగులు ప్రారంభించాయి. ఎగువన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే శ్రీశైలం డ్యాంకు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వదర నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం నాగార్జునసాగర్కు 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామఽర్థ్యానికి గాను శనివారం మధ్యాహ్ననికి 173.87 టీఎంసీలు చేరింది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు 2,15,782 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అవుట్ ఫ్లో 15,726 క్యూసెక్కులుగా నమోదైంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో మరో రెండు రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని క్రస్ట్ గేట్ల ద్వారా వరద నీటిని కిందకు వద లడంతో సాగర్ డ్యాం నీటిమట్టం ఆశించిన మేర పెరిగే అవకాశముంది. దీంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న సుమారు 14.83 లక్షల ఎకరాల భూముల రైతుల్లో సాగు ఆశల చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను శనివారం ఉదయానికి 171.2 టీఎంసీ నీరు చేరింది. -
తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు విద్యానగర్లోని సక్సెస్ స్కూలులో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లాస్థాయి తైక్వాండో చాంపియన్షిప్– 2026 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి కాశీనాథ్రెడ్డి మాట్లాడుతూ పోటీలకు దాదాపు 300 మంది పైగా పాల్గొన్నారన్నారు. పోటీలకు అబ్జర్వర్గా న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ రసూల్, టెక్నికల్ సపోర్ట్గా స్టేట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ అంకమ్మరావు వ్యవహరించారు. వయస్సుల వారీగా జిల్లా జట్లను ఎంపిక చేసి ఈ నెల 21, 22, 23 తేదీలలో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్బాబు, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ సాయి మల్లికార్జున్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, సాయి, రామకృష్ణ, వలి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు కొల్లిపర: మండల పరిధిలోని అన్నవరం గ్రామానికి చెందిన నలుగురికి రోడ్డు ప్రమాదంలో గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం గ్రామానికి చెందిన తాతా శివమ్మ, ఏమినేని గోవిందమ్మ, తాతావెంకటసుబ్బారావు, ఏమినేని అనిత లంక పొలం పనులు ముంగిచుకుని కృష్ణానది కరకట్ట మార్గంలో బైకుపై ఇంటికి వస్తున్నారు. అతివేగంగా కారు వచ్చి బైకులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయాలైన వారిని స్థానికులు సీహెచ్సీకి తరలించారు. వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలైన వారిలో శివమ్మ, ఏమినేని గోవిందమ్మలకు తీవ్రగాయాలు అవటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్ధరాత్రి పంట పొలం దున్నిన గుర్తు తెలియని వ్యక్తులు తాడికొండ: అస్తి వివాదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పంటను దున్నిన ఘటన తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తలశిల గోపి, చైతన్య అనే రైతులకు నిడుముక్కల గ్రామంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల పంట భూమి ఉంది. 1990 నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గోపి, చైతన్యల పెద్దమ్మ తలశిల ఇందిర వచ్చి ఆ పొలంపై తనకు హక్కు ఉందని, ఎటువంటి చట్ట పరమైన ఆధారాలు చూపకుండా ఆ పొలంలో సర్వే చేయించి హద్దు రాళ్లు వేశారు. దీంతో బాధితులు ఇందిర తీరుపై కలెక్టర్, తహసీల్దార్, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలంలో పాతిన హద్దు రాళ్లను తొలగించాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించగా పోలీసుల సమక్షంలో వాటిని తొలగించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఇందిర, ప్రణీత్కుమార్లు కిరాయి పనులు చేసే వారితో పంట చేను దున్నించి, కౌలు రైతును బెదిరించారన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు ఇందిర వలన ప్రాణహాని ఉందని, ప్రాణ రక్షణ కావాలని వారు కోరారు. -
అంతా సీఎం వస్తున్నారనే..
బైపాస్ సర్వీస్రోడ్లో హైవేటవర్స్ వద్ద మురుగునీటిని, వర్షపు నీటిని తొలగిస్తున్న సెప్టిక్ ట్యాంక్ తాడేపల్లి రోడ్డులో మురుగునీటిని తొలగిస్తున్న దృశ్యంతాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కార్పొరేషన్ అధికారులు హడావుడి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి రూరల్ ఆత్మకూరు వరకు జాతీయ రహదారి వెంబడి, పాత జాతీయ రహదారి వెంబడి తాడేపల్లి రోడ్లపై, గుంతల్లో నిలిచిన మురుగునీరు, వర్షం నీటిని అప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేశారు. సుమారు 4–5 సెప్టిక్ ట్యాంక్లను ఏర్పాటు చేసి బీటీ రోడ్డుపై పల్లంగా ఉన్న ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద, ఎన్టీఆర్ కరకట్ట నుంచి బైపాస్ వెళ్లే మార్గంలో, జాతీయ రహదారి సర్వీస్రోడ్డులోని హైవే టవర్స్ వద్ద వున్న వర్షం నీటిని, మురుగునీటిని తొలగించారు. సీతానగరం బోటుయార్డు, రైల్వే అండర్పాస్, బైపాస్రోడ్ అండర్పాస్లతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటిని హడావుడిగా కార్పొరేషన్ అధికారులు తొలగించారు. హడావుడి చూసి ఆ ప్రాంతవాసులు నవ్వుకున్నారు. -
ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం
గుంటూరు వెస్ట్: ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అన్నివిధాలా అండగా నిలవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతులు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రైతులకు వీలైనంత కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరుల లభ్యత, సాగునీటి అవసరాలను సమగ్రంగా పరిశీలించి రైతులకు సాధ్యమైనంత మేరకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటి వనరులతో సమగ్ర ప్రణాళికతో రైతులకు ఎక్కువ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ -
ప్రధాన రహదారులు మూసివేత పబ్లిసిటీ స్టంట్
సాక్షి, ప్రతినిధి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి పేరుతో గుంటూరు నగరంలోని రింగ్రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డు వద్ద నుంచి కిలోమీటరు మేర రోడ్డు మొత్తాన్ని దిగ్బంధం చేశారు. క్రీడా ప్రాంగణాల్లో పెట్టుకోవాల్సిన కార్యక్రమాన్ని పబ్లిసిటీ కోసం నడిరోడ్డుపై పెట్టి రెండు రోజులపాటు ట్రాఫిక్కు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలిగించారు. అసలే అరండల్పేట ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పేరుతో ఉన్న బ్రిడ్జి కూల్చి వేసి ఏడాది దాటుతుండటంతో నగర ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పట్టాభిపురం రోడ్డు, లక్ష్మీపురం రోడ్డు, రింగ్రోడ్డు వంటి మూడు ప్రధాన రహదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమవుతుంటే వారి కష్టాలు తీర్చాల్సిన అధికారులే రోడ్లను బ్లాక్ చేసి పబ్లిసిటీ కోసం ఈవెంట్లు నిర్వహించడంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు రెండు రోజులపాటు జరిగే ఈవెంట్కు రూ.కోట్లలో ఖర్చు చేయడంతోపాటు, నగర ప్రజలను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
జెడ్పీలోనూ అదే వరివడి
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026 వరికి నీరు ఇవ్వలేమని తెగేసి చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు● ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఉచిత సలహాలు ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల వైఖరి ● నాగార్జున సాగర్, కృష్ణా ఆయకట్టు పరిధిలోని రైతుల ఆశలపై నీళ్లు చల్లిన టీడీపీ ప్రభుత్వం ● విత్తు వేశాక సాగునీరు ఇవ్వబోమని చెబితే రైతులు ఏమైపోవాలని జెడ్పీటీసీ సభ్యుల ఆగ్రహం ● ముగిసిన చివరి సర్వసభ్య సమావేశం ● పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గైర్హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: రైతులెవ్వరూ వరి పంట వేయవద్దు... ప్రభుత్వం చెప్పినట్లు వినకుండా వరినాట్లు వేస్తే సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదని టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం తేల్చి చెప్పారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయంగా సాగునీటితో సంబంధం లేని పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ప్రధానంగా సాగునీటిపై చర్చ జరిగింది. నాగార్జునసాగర్, కృష్ణానది ఆయకట్టు పరిధిలోని రైతాంగం 12 లక్షల ఎకరాల పంటలు సాగు చేస్తున్నారని అయితే కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయకుంటే రైతుల పరిస్థితి ఏంటని అధికారులను సభ్యులు నిలదీశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్, కృష్ణానది ఆయకట్టు పరిధిలో వరి పంటకు సాగునీటిని ఇచ్చే పరిస్థితులు లేవని, చెరువులు నింపేందుకు, తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరులు, వ్యవసాయశాఖాధికారులు చెప్పడం రైతాంగం ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీ సమావేశాల్లో సభ్యులు ఒక సమస్యపై పదే, పదే మాట్లాడుతున్నారంటే పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యను వచ్చే సమావేశంలోపు పరిష్కరించాలని, ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీలో సభ్యులు అడిగే ప్రశ్నలను నమోదు చేసుకుని, పరిష్కరించాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ చైర్పర్సన్గా తాను ఇద్దరు సీఎంల హయాంలో ఐదేళ్ల పాలన పూర్తి చేశానని అన్నారు. తనకు సహాయ, సహకారాలు అందించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల కాలంలో రూ.175 కోట్లతో 710 పనులు పూర్తి చేయడంతో పాటు 127 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. రెండు ప్రభుత్వాల్లో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయింత్ వర్మ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు సాగునీటిని ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. వరికి అనుబంధంగా పప్పు దినుసులను సాగు చేయడం ద్వారా వరికి నీరు అందించలేని పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉంటారని, ప్రత్యామ్నాయ పంటల దిశగా ముందుకు వెళ్లాలని, వ్యవసాయ శాఖతో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ● ప్రత్తిపాడు జెడ్పీటీసీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గుంటూరు చానల్ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మధ్యలో ఉన్న రైతులకు ఇవ్వకుండా చివరిగా ఉన్న వారికి చెల్లిస్తున్నారన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు మాట్లాడుతూ రూ.38.43 కోట్లు నష్ట పరిహారంగా అందించామని, భూములు ఇచ్చిన రైతులందరికీ నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. ● అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు మాట్లాడుతూ అమరావతిలో శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములు వున్నాయని, వాటికి ఎన్ఓసీ ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడబెడుతున్నారని, దేవాలయ భూమి ఒక సెంటు పోయినా న్యాయ పోరాటం చేస్తామన్నారు. ● కో ఆప్షన్ సభ్యుడు హస్మీ మాట్లాడుతూ అమరావతి – సత్తెనపల్లి రహదారి అధ్వానంగా ఉందని, కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కుడా లేదని సభలో ఫొటోలను ప్రదర్శించారు. జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు మాట్లాడుతూ ఏసీబీ రైడ్లో అరెస్టయిన చిలకలూరిపేట ఎంఈఓకు తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇచ్చారని, దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. ● గత ప్రభుత్వంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎంతో ప్రాధాన్యతతో ప్రారంభించిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వకాలతో విద్యార్థులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. తమ పదవీ కాలం పూర్తవుతున్నా టూర్కు తీసుకెళతామని ఇచ్చిన హామీ నెరవేరలేదని జెడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి జెడ్పీ సమావేశానికి బాపట్ల ఎంపీ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. కేంద్రమంత్రి పెమ్మసాని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కొత్తగా రాజ్యసభకు ఎన్నికై న భాష్యం రామకృష్ణ గైర్హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు మినహా మిగిలిన వారు గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు, నరసరావుపేట డీఆర్వోలు ఖాజావలి, అద్దయ్య పాల్గొన్నారు. జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులుమాట్లాడుతున్న జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, చిత్రంలో కలెక్టర్ వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వర్షాభావం దృష్ట్యా వరి పంట వేయవద్దని సీఎం చంద్రబాబు రైతాంగాన్ని హెచ్చరించారని, వద్దన్నా వరి పంట వేసిన రైతాంగం సాగునీరు ఇవ్వలేదని ప్రభుత్వంపై నింద మోపడం తగదన్నారు. వర్షాలు లేకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, రైతులే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని, అయినా సాగునీటి కోసం రైతాంగం ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. వర్షాలు కురుస్తాయని, పంటలకు సాగునీరు వస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్పై ఆధారపడి 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకు దిగిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు? శ్రీశైలం, సాగర్కు ఎగువ నుంచి వస్తున్న నీటిని సాగునీటి అవసరాలకు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్న రైతాంగం గతేమి కావాలన్నారు. ఖరీఫ్కు ముందుగా రైతులను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం వరినాట్లు వేసిన తరువాత నీరు ఇవ్వబోమని చెబితే రైతులకు దిక్కెవరని, అన్నం పెట్టే రైతన్నలపై ఈ విధంగా కక్ష గట్టడం తగదన్నారు. గతంలో సాగర్ డెడ్ స్టోరేజీకి వెళ్లినప్పుడు సైతం సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. మంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని, ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. -
జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 12.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తెనాలి మండలంలో 0.6 మి.మీ. వర్షం పడింది. సగటున 2.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకాని మండలంలో 10.2 మి.మీ., మంగళగిరి 6.8, పెదనందిపాడు 6.2, కొల్లిపర 4.2, ఫిరంగిపురం 2.6, పొన్నూరు 2.6, తాడికొండ 2.2, కాకుమాను 2.2, తాడేపల్లి 1.2, తుళ్ళూరు మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆగస్టు మాసం 8వ తేదీ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 42.5 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 27.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడికొండ: రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి నుంచి దొండపాడు వరకు జరుగుతున్న పనులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి శనివారం పరిశీలించారు. మూడు దశల్లో జరుగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభం చేయనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. సీడ్ యాక్సెస్రోడ్డుపై ఉండవల్లి వద్ద కొండవీటివాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఏడీసీ చీఫ్ ఇంజినీరు టి.మోజెస్కుమార్ను ఆదేశించారు. రాయపూడి గ్రామంలో నిర్మించిన సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీరు టి.వైకుంఠరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీధర్రెడ్డి, డీఈఈ వై.అప్పాజి, ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీని కలసిన భాష్యం రామకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగా ఇచ్చిన అల్పాహార విందులో భాగంగా నూతనంగా ఎన్నికై న రాజ్యసభ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈసందర్భంగా భాష్యం రామకృష్ణ ప్రధాని మోదీతో సంభాషించారు. చిలకలపూడి (మచిలీపట్నం): గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని శుక్రవారం కృష్ణా జిల్లా బందరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం కింద నూజివీడు పట్టణ పోలీస్స్టేషన్లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా, బుధవారం ఆయనను గుజరాత్లో అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. నగరంపాలెం: భవిష్యత్లో మరెన్నో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో విజయాలు సాధించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బయో ఇండోర్ స్టేడియంలో గతనెల 23– 30 వరకు 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీలు జరగ్గా, పెన్కక్ సిలట్ 110 కేజీల విభాగంలో చేబ్రోలు పీఎస్ కానిస్టేబుల్ పోతురాజు రజత పతకం (ద్వితీయ స్థానం) సాధించి ప్రతిభను చాటారు. ఈ మేరకు అతన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి, సర్టిఫికెట్, మెడల్తో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. ● ఐఈఈఈ గుంటూరు సబ్ సెక్షన్ చైర్ డాక్టర్ ఎన్ ఉషారాణి ● చలపతి యూనివర్సిటీలో ఘనంగా ఐ ఈఈఈ– ఉద్గమా 2026 సదస్సు తాడికొండ: ఆవిష్కరణ, నాయకత్వం ద్వారా భావి ఇంజినీర్లుగా ఎదగవచ్చని ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ కార్యదర్శి, సిలికాన్ ల్యాబ్స్ సీనియర్ డైరెక్టర్ ఎన్ వెంకటేష్ అన్నారు. చలపతి యూనివర్సిటీలో ఐ ఈఈఈ హైదరాబాద్ సెక్షన్ స్టూడెంంట్ యాక్టివిటీస్ కమిటీ, ఐఈఈఈ గుంటూరు సబ్ సెక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్గామా 2026 సదస్సు నిర్వహించారు. ఎఫ్ట్రానిక్స్ కంపెనీ ఎండీ డి రామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్ వ్యవస్థలు– వ్యవస్థల సమాహారం అనే అంశంపై వివరించారు. కార్యక్రమంలో ఎడ్జి ఇంటెలిజెన్స్ పరిష్కారాలు–విద్యార్థుల ఆవిష్కరణలు విజయవంతమైన ఉత్పత్తులుగా మలచడంపై వివరించారు. ఐఈఈఈ గుంటూరు సబ్ సెక్షన్ ఇన్చార్జి డాక్టర్ ఎన్ ఉషారాణిలు అంశాలపై వివరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె నాగ శ్రీనివాసరావు, చలపతి వర్శిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నరసరావుపేట: పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లిలో గల మెడికల్ కళాశాల వరకు నరసరావుపేట, పిడుగురాళ్ల బస్టాండ్ల నుంచి సింగిల్స్టాఫ్ బస్సులను నిర్వహించాలని పట్టణ వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు కుంచాల స్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలో రవాణాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. గతంలో స్థానిక ఆర్టీసీ జిల్లా రవాణా అధికారిని కోరుతూ వినతిపత్రం సమర్పించామని, అయితే ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. బస్సుల ఏర్పాటు వలన బోధనా సిబ్బంది, చదువుకునే విద్యార్థులు, హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాన్య, మధ్య, పేదతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. -
దీక్ష సంకల్పం
సంకల్పం సడలలేదు. నిర్బంధాలను లెక్కచేయలేదు. అడుగడుగునా అడ్డుకున్నా ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్తో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి రెండోరోజుకు చేరాయి. పెదకాకానిలో దీక్ష శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు. –సాక్షి నెట్వర్క్ ప్రత్తిపాడులో రెండు రోజు నిర్వహించిన దీక్షలో కూర్చున సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్పెదకాకాని.. దీక్షలో కూర్చున వైఎస్సార్ సీపీ నాయకులుతెనాలి.. దీక్షలో ప్లకార్డు చూపుతున్న సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్గుంటూరు నగరంలో దీక్షలో కూర్చున మహిళా నేతలుమంగళగిరి.. దీక్షలో కూర్చున సమన్వయకర్త వేమారెడ్డి -
‘ఏసీఏ’ సెంట్రల్ చాంపియన్గా కృష్ణా జట్టు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ (అండర్–23) మహిళల అంతర్ జిల్లాల చివరి లీగ్ మ్యాచ్లు మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగాయి. తొలి మ్యాచ్ కృష్ణా జట్టు, పశ్చిమ గోదావరి మధ్య జరిగింది. పశ్చిమ గోదావరి జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 (47.3 ఓవర్లు) స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు 32.5 ఓవర్లలోనే 151/3 స్కోర్ చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేరేచర్లలోని క్రికెట్ మైదానంలో ప్రకాశం, గుంటూరు మధ్య రెండో మ్యాచ్ జరిగింది. గుంటూరు జట్టు 50 ఓవర్లలో 233/6 స్కోర్ చేసింది. ప్రకాశం జిల్లా జట్టు 45.1 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేసింది. 62 పరుగుల తేడాతో గుంటూరు జట్టు విజయం సాధించింది. కృష్ణా జిల్లా జట్టు 12 పాయింట్లు సాధించి అండర్–23 మహిళల టోర్నమెంట్ సెంట్రల్ జోన్ చాంపియన్గా నిలిచింది. గుంటూరు జిల్లా జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
నేడు జెడ్పీ చివరి సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. జెడ్పీ పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ను వైఎస్సార్సీపీ అత్యధిక మెజార్టీతో కై వసం చేసుకుంది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు కొలువుదీరనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులు హాజరు పాల్తొననున్నారు. నాడు అభివృద్ధి, నేడు సంక్షోభం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జెడ్పీని చేజిక్కించుకున్న అనంతరం ముమ్మరంగా కొనసాగించిన అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో అటకెక్కాయి. జెడ్పీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేసి, ఇష్టారాజ్యంగా పనులు కేటాయిస్తుండటంతో ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. జెడ్పీ ఆదాయానికి మించి ఎడాపెడా పనులకు ఆమోదం తెలుపుతుండటంతో పూర్తి చేసిన పనులకు చెల్లించేందుకు నిధులు లేక జెడ్పీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది. -
పేట్రేగిపోతున్న అరాచకశక్తులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అరాచక శక్తులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దొంగలు, దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. హత్యలు, అరాచకాలు పెరిగిపోయాయి. రౌడీ మూకలు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నాయి. ఏం చేసినా పోలీసులు తమను ఏమీ చేయరనే ధీమాతో ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నడిరోడ్డుపై హత్యలు చేసినా, మహిళల దుస్తులు రోడ్లపైనే చించి అమానుష చర్యలకు పాల్పడినా, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లపై దాడులు చేసి వీరంగం సృష్టించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఏ తప్పు చేసినా అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు వదిలేస్తారనే ధీమాతో అరాచక శక్తులు రెచ్చిపోయి అమానుష ఘటనలకు దిగుతున్నాయి.సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒక్క రోజులో మూడు హత్యలు జరిగాయి. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారంటే లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతల అండతో రౌడీమూకలు రెచ్చిపోయి ప్రత్యర్థులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో నడిరోడ్డుపై యువకుడిని నరికి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వినుకొండలో వరుస దొంగతనాలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో నలుగురు మృతి చెందిన టనలు జరిగినప్పటికీ పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజమైన నిందితులను గుర్తించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఇంతటి దారుణ ఘటనలు జరిగే పల్నాడు జిల్లాకు నెలలుగా ఎస్పీని నియమించని పరిస్థితి ఉందంటే ప్రభుత్వం శాంతిభద్రతలపై ఏ స్థాయిలో చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర స్థాయిలో స్పందించి, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ రాత్రికి రాత్రే అరెస్టులు చేసేందుకు పోలీసులు పరిమితం అవుతున్నారు. హత్యలు, అరాచకాలు, దోపిడీలు, దాడులు చేసే రౌడీమూకలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యం.. జిల్లాలో ఆందోళన కలిగించే అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ వాటిపై సీరియస్గా స్పందించే తీరిక పోలీసులకు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్నిగానీ, ప్రభుత్వ పెద్దలనుగానీ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై మాత్రం సుమోటోగా కేసులు నమోదు చేసేంత సీరియస్గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగర నడిబొడ్డున నివాసం ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకలు యథేచ్ఛగా ఏడు గంటల పాటు దాడులు చేసి బీభత్సం సృష్టించిన వారిని పోలీసులు అరెస్టు చేయలేదు. అంబటి రాంబాబును మాత్రం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాలు దాడులు చేసి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులు నమోదు చేసి ప్రభుత్వంపై పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకున్న విషయం తెలిసిందే. పోలీసులదే కీలక పాత్ర ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతల అరాచకాలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ, తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నియంత్రణ తప్పింది. పోలీసులు అంటే ఎవరికి భయం లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలతో సిఫార్సు చేయిస్తే ఏం చేసినా మనకేం కాదనే ధీమా అరాచక శక్తుల్లో ధైర్యాన్ని నింపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సానుకూల స్పందన పొందే విధంగా ఎప్పుడూ పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. శాఖాపరమైన సూచీలకు అనుగుణంగా కచ్చితమైన, నాణ్యమైన గణాంకాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలోనూ, 32 రైస్ మిల్లుల ప్రాంగణాలలోనూ తక్కువ ధర బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ ముడి బియ్యం కిలో రూ.58, స్టీమ్ బియ్యం కిలో రూ.62 వరకు ఉందన్నారు. ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా బీపీటీ ముడి బియ్యం కిలో రూ.50 చొప్పున, స్టీమ్ స్టీమ్ బియ్యం కిలో రూ.52 చొప్పున అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బియ్యం కొనుగోలుదారులు కార్డుకు 5 కిలోలుగానీ, 10 కిలోలుగానీ ప్రకటించిన ధరకు పొందవచ్చన్నారు. -
పులిచింతలు
తెలంగాణ ఎత్తిపోతలతోఅచ్చంపేట: జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కృష్ణా డెల్టా రైతుల కోసం 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు 2004లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2013 నుంచి ప్రాజెక్టు ద్వారా కృష్ణా, డెల్టా రైతులకు సాగునీరు అందుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 84, 85 సెక్షన్ల ప్రకారం పులిచింతల ప్రాజెక్టుకు దిగువకు వదిలే ప్రతి నీటి చుక్కపై ఆంధ్రప్రదేశ్కే పూర్తి హక్కులు కల్పించారు. తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు. ఒకవేళ ప్రాజెక్టుకు దిగువకు వదిలే నీటి ద్వారా ఏవైనా స్కీములు చేపట్టాలంటే కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉండే అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో కృష్ణా బోర్డు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 51 స్కీములకు నీటి కొరత తెలంగాణ భూభాగంలో రాజీవ్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ఉన్న పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలోని కృష్ణా నదీ తీరంలో ప్రస్తుతం రైతుల వినియోగంలో ఉన్న 51 ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందే అవకాశాలు సన్నగిల్లుతాయి. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజధాని అమరావతి పనులకు కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు. పులిచింతల దిగువ నీటిని తరలించే విధంగా అవసరమయ్యే కాలువలు, పైప్లైన్లు నిర్మిస్తున్నారు. మరో ఎత్తిపోతల పథకం తెలంగాణలోని మేళ్లచెరువు మండలం వెల్లటూరు వద్ద 53 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,470 కోట్లతో మరో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. కృష్ణానది తీరంలో కురిసిన వర్షాలకు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే మిగులు నీటితో మాత్రమే పులిచింతల ప్రాజెక్టు నిండుతుంది. ఆ మిగులు నీరు వెల్లటూరు వద్ద నిర్మించే ప్రాజెక్టుకు వెళితే పులిచింతల నిండాలంటే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడాలి.తెలంగాణ భూభాగంలో రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ వైపు కృష్ణానది తీరంలోని భూభాగంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్కీములకు తరలించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు రావడం సహజం. కాబట్టి, ఆయా సమయాల్లోనే మాత్రమే నీటిని తరలించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టి ఉండవచ్చు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం. – గుణకరరావు, ఎస్ఈ, జలవనరుల శాఖ విజయవాడ సర్కిల్ కానీ తెలంగాణ మాత్రం ఏ విధమైన అనుమతులు లేకుండా ప్రాజెక్టుకు అవతలి ఒడ్డున బొగ్గమాదారం, దొండపాడు గ్రామాల వద్ద రూ.394 కోట్ల అంచనా వ్యయంతో 14 వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు రాజీవ్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు పులిచింతల దిగువకు విడుదలయ్యే నీటిని ఆ స్కీముకు తరలించేందుకు పైప్లైన్లు వేస్తున్నారు. స్కీం నిర్మాణం పూర్తయితే రోజుకు 3,500 క్యూసెక్కులు పైప్లైన్ల ద్వారా వదలాల్సి ఉంటుంది. స్కీం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం పంప్హౌస్ రెండంతస్తుల పనులు పూర్తి చేశారు. నదీతీరాలకు 10 కిలోమీటర్లలోపు ఇరిగేషన్ స్కీములు నిర్మించాలంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఎత్తిపోతల పథకం పూర్తయితే పులిచింతల ప్రాజెక్టుకు దిగువకు వదిలే నీటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు కూడా వాటా ఇచ్చినట్లవుతుంది. దీనివల్ల కృష్ణా, డెల్టా ప్రాంతాలకు విడుదలయ్యే సాగునీటిలో కోత ఏర్పడుతుంది. 13 లక్షల ఎకరాల భూములకు నష్టం వాటిల్లుతుంది. -
ఎన్జీరంగా వర్సిటీకి రచనా గ్రంథాల అందజేత
గుంటూరు రూరల్: రైతాంగం, గ్రామీణ సమాజం, వ్యవసాయాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆచార్య ఎన్.జి.రంగా అని పలువురు కొనియాడారు. ఆయన ప్రముఖ శిష్యులు రచించిన విలువైన గ్రంథాలను మరలా ముద్రించి ప్రతులను ఎన్.జి. రంగా ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణకు అందజేశారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. ఆచార్య ఎన్.జి.రంగా సుసంపన్నమైన మేధో, సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు దానిని ప్రజలకు, విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ గ్రంథ సముదాయాన్ని విశ్వవిద్యాలయానికి అప్పగించారన్నారు. ఈ అమూల్యమైన గ్రంథాలను ముద్రించి భద్రపరిచేందుకు ఎన్.జి. రంగా ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆచార్య ఎన్.జి. రంగా ఆయన శిష్యుల రచనలు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రపై విలువైన అవగాహనను కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్.జి.రంగా ఫౌండేషన్ ప్రతినిధులు కిషోర్, ప్రసాద్, మిత్ర, పుండరీకాక్షుడు, జక్కంపూడి సీతారామయ్య పాల్గొన్నారు. -
మైనింగ్ డీడీ చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలి న్యాయవాదుల క్రికెట్ టోర్నీ విజేత ఎస్వైకే లీగల్ వారియర్స్
గుంటూరు లీగల్: న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఎస్వైకే లీగల్ వారియర్ టీం నిలిచింది. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చందు 11 జట్టుపై ఎస్వైకే లీగల్ వారియర్స్ జట్టు విజయం సాధించింది. ఆకాష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా, సాజిద్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు. ఫైనల్ మ్యాచ్ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు టాస్ వేసి ప్రారంభించారు. జట్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ఎ.శాంతకుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అభినందించారు. విజేత, రన్నరప్ జట్లకు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కప్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ● తహసీల్దార్, రెవెన్యూ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు దారుణం ● కలెక్టర్కు ఏపీ రెవెన్యూ సర్వే అసోసియేషన్ వినతిగుంటూరు వెస్ట్: గుంటూరు గనులు, భూగర్భశాఖ ఉప సంచాలకులు చంద్రశేఖర్ ఇటీవల మీడియా ప్రతినిధుల సమక్షంలో గుంటూరు జిల్లా తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారులపై చేసిన అసభ్యకర, అవమానకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా బాధించినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పీఏ కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధానమని తెలిపారు. ఎన్ఓసీ( నో అబ్జక్షన్ సర్టిఫికెట్)ను మంజూరు చేసే అధికారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ పరిధిలోనే ఉంటుందన్నారు. తహసీల్దార్కు ఆ అధికారం లేదని, ఈ విషయం తెలిసినప్పటికీ చంద్రశేఖర్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం క్షమార్హం కాదని పేర్కొన్నారు. చంద్రశేఖర్ మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజల్లో ప్రభుత్వ శాఖల మధ్య విభేదాలు ఉన్నాయనే తప్పుడు అభిప్రాయం ఏర్పడే పరిస్థితి నెలకొందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగుల వినతి మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరావు, తహసీల్దార్లు కృష్ణకాంత్, షేక్ సుభాని, వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, జిల్లా జనరల్ సెక్రెటరీ, రామారావు అసోసియేట్ ప్రెసిడెంట్ ఆయూబ్, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బగళాముఖి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
చందోలు(కర్లపాలెం): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం బాపట్ల జిల్లా చందోలులో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో నరసింహమూర్తి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆషాఢ మాసం ముగింపు పూజలలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో ఎన్వీ రమణ పాల్గొన్నారు. హోమంలో కూడా పాల్గొని, పూజలు నిర్వహించారు. అనంతరం ఈవోతోపాటు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి ఆయన్ను సన్మానించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఎస్ఐ మాధవరావు, దేవదాయ శాఖ జిల్లా మేనేజర్ ఎం.నాగయ్య పాల్గొన్నారు. వీరాంజనేయుని సేవలో... పొన్నూరు: పట్టణంలోని వీరాంజనేయస్వామి వారిని శుక్రవారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత స్వామి వారిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ్ధప్రసాదం స్వీకరించారు. ఈవో ఎ. శ్రీనివాసరావు, అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట టౌన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి గడువు పెంచింది. జేఎన్వీఎస్టీ 2027–28 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించిందని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విదాల్యయం ప్రిన్సిపాల్ పంతంగి శ్రీనివారావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 11, 12 తేదీల్లో దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించిందని వెల్లడించారు. మాధ్యమం, కేటగిరీ, లింగం, ప్రాంతం, దివ్యాంగుల విభాగానికి సంబంధించిన వివరాలను మాత్రమే ఈ సమయంలో మార్చుకోవచ్చన్నారు. అమరావతి: ప్రసిద్ధ అమరావతి అమరేశ్వర ఆలయంలో శుక్రవారం ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి విశేషాలంకారం చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది జూన్లో నిర్వహించిన ఫార్మా–డీ, ఏప్రిల్లో నిర్వహించిన నానో టెక్నాలజీ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఎంఎస్సీ నానో టెక్నాలజీ 5–7 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 26 మంది హాజరు కాగా, వారిలో 25 మంది ఉత్తీర్ణులయ్యార తెలిపారు. ఫార్మా–డీ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 232 మంది రాశారన్నారు. వారిలో 228 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. దూరవిద్య రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలనీ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన దూరవిద్య యూజీ, పీజీ పరీక్షల రీవాల్యూయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
8,9 తేదీల్లో గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’
నెహ్రూనగర్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద కళా ఉత్సవం ‘అమరావతి చిత్రకళా వీధి’ గుంటూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. గురువారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి విద్యానగర్ వరకు వేదికల ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్శకులు, కళాకారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు తక్షణమే పూడ్చాలని, నాలుగు చోట్ల మొబైల్ టాయిలెట్లు, ఉచిత తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలతో చెత్త తొలగింపు, ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డీసీపీ సూరజ్ కుమార్, సిటీ ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. స్వామివారికి పవిత్రములు సమర్పణ పెదకాకాని: శివాలయంలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారికి, పరివార దేవతలకు గురువారం శాస్త్రోక్తంగా పవిత్రములు సమర్పించారు. మల్లేశ్వరస్వామి సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం 6 గంటల నుంచి పలు రకాల పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గంగా భ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామి వారికి పవిత్ర సమర్పణ క్రతువును ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకుడు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ ఆధ్వరంలో నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా సాయంత్రం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. పెదకాకాని పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమాలలో కంభంపాటి మల్లికార్జునరావు, కొమ్మూరి మల్లికార్జునరావు, భైరపనేని ధనలక్ష్మి, ధూపాటి శివశంకరరావు, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, పేటేటి ధనమహేశ్వరప్రసాదు, గ్రామస్తులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఎయిమ్స్లో ప్రత్యేక ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేం శాంతాసింగ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కొత్త విభాగంలో కాలిన గాయాల చికిత్స, పునర్నిర్మాణ శస్త్ర చికిత్సలు, మైక్రోసర్జరీ, హ్యాండ్ సర్జరీ, అవయవాల పునఃప్రతిస్థాపన, క్యాన్సర్ పునర్నిర్మాణం, పుట్టుకతో వచ్చే వైకల్యాల సవరణ వంటి ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సగటున 4,500 మంది ఔట్పేషెంట్లు, వారపు పని దినాల్లో 5 వేల మందికిపైగా వైద్య సేవలు పొందుతున్నారని, 2025–26లో 10 లక్షలకు పైగా ఔట్పేషెంట్ సేవలు, 30 వేలకుపైగా ఇన్ పేషెంట్ చికిత్సలు అందించినట్లు వివరించారు. ఐసీయూ పడకలను 118కు, ఎమర్జెన్సీ విభాగం పడకలను 60కు పెంచినట్లు తెలిపారు. త్వరలో 256–స్లైస్ సీటీ స్కానర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ మోహన్, డీన్ దేశు రామ మోహన్, డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్ తుమ్మల, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీ నేతల అక్రమ వసూళ్ల దందా
సాక్షి టాస్క్ఫోర్స్: పేద దళితులకు ప్రభుత్వం కల్పించిన హక్కులను సైతం తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు స్థానిక టీడీపీ నాయకులు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ భూ పత్రాల పేరుతో దళిత కూలీలను బెదిరిస్తూ అక్రమ వసూళ్ల దందాను మొదలుపెట్డడంతో గ్రామంలో టీడీపీ నేతల అరాచకాలు బయటకు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలోనే హక్కులు గతంలో ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం కింద మన్నవ గ్రామానికి చెందిన సుమారు 100 మంది దళిత వ్యవసాయ కూలీలు రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ రుణాలను పూర్తిగా మాఫీ చేయగా, అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించింది. దళిత రైతులకు సర్వహక్కులు కల్పిస్తూ భూమి పత్రాలను మంజూరు చేసింది. అయితే అప్పట్లో పొన్నూరు టీడీపీ నాయకుల రాజకీయ దురుద్దేశంతో, వర్గపోరు కారణంగా ఆ పత్రాల పంపిణీ కాకుండా అడ్డుపడ్డారు. సచివాలయంలోనే బరితెగింపు ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడి ఆదేశాలతో, కారుణ్య నియామకం పొందిన వీఆర్ఏ గ్రామంలోని దళిత లబ్ధిదారులను గ్రామ సచివాలయానికి రావాలని ఒత్తిడి తెచ్చారు. సచివాలయానికి వచ్చిన దళితులతో టీడీపీ నాయకుడు ‘మా నాన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. మీ భూ బకాయిలను రద్దు చేయించి, పత్రాలు తెప్పించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. మీ పత్రాలను ఇవ్వాలంటే ఎమ్మార్వో కార్యాలయంలో, ఇంకో చోట మొత్తం రూ. 4,500 చెల్లించాలి’ అని హుకుం జారీ చేశారు. రాత్రివేళల్లో తప్పని ఆందోళన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రూ. 4500 వసూలు చేసేందుకు వీఆర్ఏతోపాటు మరో నలుగురితో ప్రత్యేక కమిటీని టీడీపీ నేత ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారికే కలెక్టర్ చేతుల మీదుగా పత్రాలు ఇప్పిస్తాం.. లేకపోతే పత్రాలు టీడీపీ నేత వద్దే ఉంటాయని రాత్రివేళల్లో దళితుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతపై పలు చీటింగ్, భూకబ్జా, క్రిమినల్, మట్టిమాఫియా కేసులు నమోదై ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే తమ భూపత్రాలను తారుమారు చేస్తారేమోనని దళిత కూలీలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, ఈ అక్రమ వసూళ్ల దందాపై విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పొన్నూరు తహసీల్దారు మొహమ్మద్ జియావుల్ హఖ్ స్పందిస్తూ వసూళ్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చోరీలకు పాల్పడిన ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: చోరీలకు పాల్పడే ముఠాను నల్లపాడు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అడవి తక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భాస్కర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... ఇటీవల జరిగిన చోరీలపై ఎస్ఐ మధుపవన్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన ఏడుగురు అనుమానితులను ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–1 రెడ్డిపాలెం రోడ్డులో అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై నగరంలో పలు పోలీస్ స్టేషన్లు, నల్లపాడు, కొత్తపేట, తాడికొండ స్టేషన్ల పరిధిలో చోరీలు, దోపిడీ కేసులు ఉన్నాయన్నారు. నిందితులను వింజేపల్లి మేరిబాబు అలియాస్ మేరి, పావన ఫణికృష్ణ అలియాస్ పంతులు, షేక్ షరీఫుద్దీన్, పాలిపోగు శ్రీను, యరస్రాని రాజు, ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదనకు ఇలా చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గోరంట్ల గ్రామంలోని ఓ ఇంటిలో తాళాలు పగులగొట్టి వెండి పట్టీలు, చేతి గడియారం, నగదు తదితర వస్తువులు దొంగిలించినట్లు, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించి బంగారు ఉంగరాన్ని లాక్కున్నట్లు తెలిసింది. నల్లపాడు రోడ్డులోని మన్యా సూపర్ మార్కెట్లో రూ.1.10 లక్షల నగదు చోరీ చేసినట్లు, తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాల్లో షట్టర్లు పగులగొట్టి సిగరెట్ బాక్సులు, చిల్లర నగదు, గ్యాస్ సిలిండర్లు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. వారి నుంచి జత వెండి పట్టీలు, చేతి గడియారం, 4 గ్రాముల బంగారు ఉంగరం, వివిధ కేసులకు సంబంధించిన నగదు, రెండు గ్యాస్ సిలిండర్లు, సిగరెట్ బాక్సులు, భారీ మొత్తంలో చిల్లర నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించి రిమాండ్కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
భ్రూణహత్యల నివారణకు చర్యలు
గుంటూరు వెస్ట్: జిల్లాలో గర్భస్థ లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎస్డీటీ), సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం (ఏఆర్టి) అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. లింగనిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలోని వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనన్నారు. కమిటీ సభ్యులు, ఎన్జీఓలు లింగ నిర్థారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు నాగరాజు, వెంకట నాగ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై సమీక్ష తాడికొండ: రాజధాని నగరానికి ముఖ ద్వారంగా నిర్మాణం రూపుదిద్దుకుంటున్న ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు గురువారం క్షేత్రస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయపూడిలోని బ్లాక్ –4 అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఏడీసీ అధికారులు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం – పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ, జనరల్ మేనేజర్ కె శ్రీహరి పాల్గొన్నారు. – జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
హంతకులకు శిక్ష పడే వరకూ పోరాటం
చుండూరు రక్తక్షేత్రం వద్ద దళిత నేతల ప్రతిజ్ఞచుండూరు(తెనాలి): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో దళితుల మారణకాండ కేసులో అగ్రకుల హంతకులకు శిక్షలు వేసేవరకూ దళితుల పోరాటం ఆగదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయకుమార్ స్పష్టంచేశారు. చుండూరులోని రక్త క్షేత్రం వద్ద గురువారం జరిగిన దళిత అమర వీరుల 36వ సంస్మరణ సభలో వివిధ దళిత సంఘాల నాయకులు దళిత అమర వీరుల కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. రక్తక్షేత్రం వద్ద జరిగిన సంస్మరణ సభకు చుండూరు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు జాలాది మోజెస్ అధ్యక్షత వహించారు. సభలో కొరివి వినయకుమార్ మాట్లాడుతూ చుండూరు కేసులో 35 ఏళ్లు గడిచినా హంతకులకు శిక్షలు వేయక పోవటం భారత న్యాయవ్యవస్థకే కళంకమని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే దళిత మేధావుల బృందం ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు తరలివెళ్లేందుకు సమాయత్తం చేస్తామని చెప్పారు. అందరూ నిర్దోషులైతే నెత్తుటి నేరం ఎవరిది? ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ హంతకులందరూ నిర్దోషులైతే ఈ నెత్తుటి నేరం ఎవరిదని, రక్తక్షేత్రం సాక్షిగా 35 ఏళ్లు గడచినా దళితులకు న్యాయం జరగక పోవటం అత్యంత విచారకరమన్నారు. సభలో చుండూరు కేసును న్యాయస్థానాల్లో వాదించిన న్యాయవాది భువనగిరి చంద్రశేఖర్, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చుండూరు కేసును నడిపిన ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, ఉద్యమ వీరుడు, ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర, దళిత మహా సభ రాష్ట్ర కార్యదర్శి నూకతోటి బాబురావు, బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, కారంచేడు బాధిత పోరాట కమిటీ కార్యదర్శి సీహెచ్ భగత్ సింగ్, టి.అశోక్, గోళ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు . -
కూల్చివెతలుకు ఏడాది
గత ఏడాది ఆగస్టులో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేతగుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జి కనుమరుగై ఏడాది కావొస్తోంది. 70 ఏళ్ల పాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన చారిత్రక శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బిడ్జి విజన్ లేని టీడీపీ సర్కారు చర్యలతో కనుమరుగైంది. గుంటూరు అనగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే శంకర్ విలాస్ సెంటర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఏడాది గడిచింది. ఐకానిక్ ఫ్లై ఓవర్ స్థానంలో సాధారణ ఆర్ఓబీ పెరుగుతున్న నగర ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్విలాస్ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన టీడీపీ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 9వ తేదీ నుంచి బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేసింది. అనంతరం క్రమక్రమంగా బిడ్జి కూల్చివేత పనులు చేపట్టింది. బ్రిడ్జి మీదుగా రాకపో కలు సాగించే ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులతో పాటు పరుకు రవాణా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అనంతరం నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల్లోభాగంగా అరండల్పేట, బ్రాడీపేటను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్లను క్రమంగా మూసివేసి, పిల్లర్ల నిర్మాణాలను చేపట్టారు. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో బైక్లు, కార్లు, ఆటోలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందు చూపులేని పాలకుల చర్యల తో 70 ఏళ్ల పాటు సేవలందించిన ఆర్ఓబీ చరిత్రగా మిగిలిపోయింది. నాలుగు లైన్లతో కూడిన బ్రిడ్జి నిర్మి స్తామని పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని వచ్చే ఏడాది జూలై నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించినా, సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్విలాస్ బ్రిడ్జి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గుంటూరు నగరంలో ముఖ్యమైన కూడలిగా మారడంతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారి ఖచ్చితంగా తలచుకునే కీలకమైన ప్రాంతంగా మారింది. అయితే ఇది అంతా గతం. ప్రస్తుతం శంకర్ విలాస్ సెంటర్ ప్రాంతం కళను కోల్పోయింది. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో రెండు వైపులా దుకాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. పైసా విదల్చని రాష్ట్రప్రభుత్వం ఆర్ఓబీకి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు కూడా ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన రూ.98 కోట్లతో రాజీపడి నిర్మిస్తున్న ఆర్వోబీ కారణంగా భవనాలు కోల్పోతున్న వ్యాపారస్తులు, యజమానులకు రూ.40 కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందని, ఆ మొత్తాన్ని కలుపుకొంటే ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మించవచ్చునని బెటర్ శంకర్ విలాస్ ఫ్లె ఓవర్ జేఏసీ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు మొత్తుకున్నా పాలకులు, అధికారులు ఖాతరు చేయలేదు. దీంతో పాటు బ్రిడ్జి నిర్మాణం కారణంగా భవనాలు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ఆర్యూబీ నిర్మి స్తామని మాట తప్పిన అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన సాధారణ ఆర్వోబీ స్ధానంలో ఐకానిక్ ఫ్లె ఓవర్ నిర్మించాలని నగరంలోని వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 70 ఏళ్ల క్రితం అప్పటి రవాణా అవసరాలకు అనుగుణంగా నిర్మించిన బ్రిడ్జి స్థానంలో రాబోయే వందేళ్ల ట్రాఫిక్, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఐకానిక్ ఫ్లై ఓవర్ నిర్మించాలని చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఏక పక్షంగా ముందుకు వెళ్లింది. గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకపక్ష చర్యలతో తాను అనుకున్నదే జరగాలనే మొండి పట్టుదలతో నగర ప్రజలు ఐకానిక్ ఫ్లై ఓవర్ ప్రాజెక్టును కోల్పోయారు. రూ.167 కోట్లతో 1.4 కిలోమీటర్ల పొడువుతో ప్రతిపాదించిన ఐకానిక్ ఫ్లె ఓవర్ స్థానంలో రూ.98 కోట్ల సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా 930 మీటర్లకు కుదించిన నాలుగు లైన్ల సాధారణ ఆర్వోబీగా మారిపోయింది. పెమ్మసాని మొండిపట్టుదలతో ముందు చూపులేకుండా బ్రిడ్జిని కూల్చడంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుదేలయింది. గతంలో సాఫీగా సాగిపోయే ట్రాఫిక్ నేడు ఏ రోడ్డుపై చూసినా పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. రోడ్డుపైకి ఎందుకొచ్చాంరా దేవుడా.. అని వాహనచోదకులు అనుకునే స్థాయికి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. -
ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల క్రికెట్ నాకౌట్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదట ఎస్వైకే జట్టు... హబీబుల్లా జట్టుపై విజయాన్ని నమోదు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సాయిరామ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నారు. రెండవ సెమీ ఫైనల్లో చందు–11 జట్టు, 11 బుల్లెట్స్ జట్టును ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న సాజిద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి , జి. శాంతకుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరావు క్రీడాకారులను అభినందించారు. శుక్రవారం ఫైనల్ మ్యాచ్లో ఎస్వైకే, చందు–11 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
నగరంపాలెం: జిల్లాలోని టోల్గేట్, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవే పెట్రోలింగ్ బృందాలు వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రుళ్లు ఎక్కువసేపు వాహనాలు నడిపే లారీ, బస్, ఇతర వాహనాల డ్రైవర్లకు అలసట వల్ల ప్రమాదాలు జరగకుండా స్టాప్ – వాష్ అండ్ గోను అమలు చేశారు. డ్రైవర్లను కాసేపు నిలిపి విశ్రాంతి తీసుకునేలా, నీటితో ముఖం శుభ్రం చేసుకునేలా చేశారు. అలసటగా ఉంటే రహదారుల వెంట కాకుండా, గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలు/ సురక్షిత విశ్రాంతి కేంద్రాల్లో వాహనాలను నిలిపాలని సూచించారు. అతివేగం, వక్రమార్గంలో ప్రయాణించడం, మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. -
రూ. 65 లక్షలకు స్టోర్ మేనేజర్ మోసం
తెనాలిరూరల్: పట్టణ రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ మార్ట్లో స్టోర్ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి సుమారు రూ.65 లక్షల సరుకు మాయం చేసిన ఘటనపై కేసు నమోదైంది. విజయవాడ కొత్తపేటకు చెందిన మల్లివాడ అవినాష్ ఇక్కడి మార్ట్లో స్టోర్ మేనేజర్గా పనిచేశాడు. సుమారు రూ.65 లక్షల సరుకు మాయమైనట్లు నిర్వాహకుల ఆడిట్లో కొద్ది కాలం క్రితం వెల్లడైంది. అప్పటి నుంచి విధులకు రాకుండా, లెక్కలు చెప్పకుండా పరారీలో ఉన్నాడు. త్రీ టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలతో మోసం చేసిన వారిపై కేసు పట్నంబజారు: నకిలీ పత్రాలతో స్థలం కొనుగోలు చేసేలా ప్రేరేపించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆమె భర్తపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసుల కథనం ప్రకారం దాచేపల్లి మండలం తక్కెళ్లపాడుకు చెందిన మిర్చి వ్యాపారి కిచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు గుంటూరులో గుండుబోయిన అశోక్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నల్లపనేని రత్నమాల, ఆమె భర్త శివరామ్ప్రసాద్తో పరిచయం ఏర్పడింది. ఖాళీ స్థళాన్ని చూపి వారిదేనని నమ్మించి నకిలీ పత్రాలు, సర్వే నంబర్లతో రూ.25 లక్షలకు విక్రయించారు. స్థలం సరిహద్దులు చూపించమని అడిగినా చూప లేదు. స్థలానికి చెందిన హక్కు పత్రం, స్వాధీనం, విక్రయం కాని రత్నమాల, శివప్రసాద్, అశోక్లకు ఆభూమితో ఎలాంటి సంబంధం లేదని బాధితుడు గుర్తించాడు. నకిలీ పత్రాలు సృష్టించి తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడలతో మానసిక వికాసం
ఏఎన్యూ(పెదకాకాని): క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జేసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతాయన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని చెప్పారు. అమరావతి చాంపియన్షిప్లో భాగంగా జిల్లా నుంచి ఎక్కువ మంది పాల్గొని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ 12 విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం జేసీ, క్రీడాశాఖ అధికారులు జెండా ఊపి క్రీడాపోటీలను ప్రారంభించారు. అన్ని విభాగాల్లో క్రీడాకారులు, నిర్వాహకులు మొత్తం 2500 మంది పాల్గొన్నారు. -
అమరావతి కరకట్టపై టిప్పర్ బోల్తా
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసానికి అతికొద్ది దూరంలో టిప్పర్ లారీ బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తాపడింది. సేకరించిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా కంకర లోడ్తో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అమరావతి కరకట్టమీదకు ఎక్కుతుండగా అదుపు తప్పి కృష్ణానదివైపునకు బోల్తా పడింది. పక్కనే భారీ వేపచెట్టు ఉండడంతో దానికి ఆనుకుని లారీ మరో పల్టీ వేయకుండా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. పలు గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన రైతులకు సూచనలు తాడికొండ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో లాం ఫామ్ శాస్త్రవేత్తలు పర్యటించారు. తుళ్ళూరు మండలంలో పెదపరిమి – వడ్డమాను గ్రామాల్లో ఉన్న పంటలను పరిశీలించి పంటల వారీగా ఎల్నినో సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. మృత్తికా శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.శైలజ, సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వెంకటరావు, తెగుళ్ల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.మనోజ్, ఏరువాక కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఏ.మనోజ్లు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెదపరిమి, వడ్డమాను గ్రామానికి చెందిన రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజధానిలో మంత్రుల పర్యటన తాడికొండ: రాజధాని ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్లు బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా నిర్మాణంలో ఉన్న బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్సీ క్వార్టర్లును పరిశీలించగా వీరికి మంత్రి నారాయణ నిర్మాణ పనులను వివరించారు. అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ నాటికి అమరావతిలో 4వేల ఇళ్లు ప్రభుత్వానికి అందజేస్తామని నారాయణ తెలిపారన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానికి మంచి ప్రణాళిక తో ముందుకెళ్తున్నామన్నారు. పలువురు సీఆర్డీయే అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వే ట్రాక్పై మృతదేహం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి కృష్ణాకెనాల్ పరిధిలో గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో బుధవారం తాడేపల్లి కృష్ణాకెనాల్ జీఆర్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాక్పై రెండు ముక్కలుగా పడిఉన్న మృతదేహాన్ని పక్కకు తీశారు. ఏఎస్ఐ రత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్పై 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రెండు ముక్కలుగా పడి ఉన్నాడని, అతని జేబులో వెతగ్గా ఆధార్ కార్డు లభించిందని, అయితే ఆధార్కార్డులో ఉన్న వ్యక్తి ఇతను ఒకటేనా అన్నది అనుమానంగా ఉందని తెలిపారు. ఆధార్కార్డులో వీర్ల గురవయ్య, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామం అని ఉందని, ఆ గ్రామంలో విచారణ చేస్తే తప్ప ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరా కాదా అనేవిషయం తెలియదన్నారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో గుంటూరు రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక శివారులో చిగురు ఆశ్రమం దగ్గర అమరావతి కరకట్ట దిగువ ప్రాంతంలో తాడేపల్లి పోలీసులు బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ.. పెనుమాక శివారులోని చిగురు ఆశ్రమం ఎదురుగా కరకట్ట దిగువ ప్రాంతంలో ఓ చెట్టుకింద సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం ఉందని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, నెరిసిన జుట్టు, తెల్లని గడ్డం ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 8688831364 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి నరసరావుపేట: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని సాయిరాం టౌన్షిప్–2లో టీఎస్ నెంబర్ 35లోని 1.28 ఎకరాలపై హైకోర్టులో కేసు నడుస్తుండగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు, రైతులు కోరారు. ఈ మేరకు ప్రకాష్నగర్లోని జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, రిజిస్ట్రార్ శ్రీరామకుమార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ వెంచర్ యజమానులు కోర్టులో పెండింగ్లో ఉన్న భూములు అమ్మడమే గాక అక్రమ రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. -
అవగాహనే తొలి ఔషధం
● ఎన్సీడీ–సీడీ సర్వేలో బయటపడుతున్న వాస్తవాలు ● ముందస్తు జాగ్రత్తలతో వ్యాధి కట్టడికి అవకాశం క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది (ఫైల్) క్యాన్సర్... ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతుంది. పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ సోకితే మరణమే అనే భావన చాలా మందిలో ఉంది. నేడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాపకింద నీరులా నమోదవుతున్నాయి. ఆధునిక జీవనశైలి వల్లే కేసుల సంఖ్య పెరిగిపోతుందని వెద్య నిపుణులు చెబుతున్నారు. -
వృద్ధురాలిపై కత్తితో దాడి
మంగళగిరి రూరల్: పచారీ షాపులో కావలసిన సరుకులు కట్టించుకొని అనంతరం షాపు నిర్వహిస్తున్న వృద్ధురాలపైనే కత్తితో దాడి చేసిన ఘటన మంగళగిరి పట్టణం కొత్తపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం కొత్తపేటలో నిర్మల జూనియర్ కాలేజ్ ఎదుట వాడపల్లి శ్రీలక్ష్మి అనే వృద్ధురాలు (60) భర్త చనిపోవడంతో ఒంటరిగానే జీవనం కొనసాగిస్తూ పచారీ దుకాణం నిర్వహిస్తుంది. ఇంటినే షాపుగా మార్చుకొని వ్యాపారం చేసుకుంటుంది. రోజు లాగానే మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు ఓ గుర్తు తెలియని యువకుడు షాపులోకి వచ్చి కావాల్సిన వస్తువులన్నీ కట్టించుకున్నారు. ఆ యువకుడు ఏదో వస్తువు అడిగితే ఆమె షాపులోపలికి వెళ్లిందని ఇతను కూడా ఆమెతో పాటే లోపల కు వెళ్లాడని ఆ తర్వాత యువకుడు కూరగాయల కోసే కత్తితో వీపు భాగంలో పొడిచి పారిపోయాడని స్థానికులు తెలిపారు. బహుశా యువకుడు బంగారం కోసమో, నగదు కోసమో వచ్చి ఉంటాడని అందుకే ఆమెను అనుసరించి షాపులోపలికి వెళ్లాడని, అక్కడ నగదు కాని బంగారం కాని దొరకపోవటంతో ఆమె కేకలు వేసేసరికి చేసేది లేక అక్కడే ఉన్న కూరగాయల కోసే కత్తితో పొడిచి పారిపోయి ఉంటాడని వారు అంటున్నారు. ఆమె బయటకు వచ్చి కేకలు వేయడంతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసారు. పట్టపగలే కత్తితో వృద్ధురాలపై దాడి చేయడంతో స్థానికులు విస్మయం వ్యక్తంచేస్తూ భయాందోళనలకు గురయ్యారు. -
వివాహిత దారుణ హత్య
పెదకూరపాడు: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పెదకూరపాడు గ్రామంలో సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదకూరపాడు గ్రామంలోని దామచర్ల పాలెం కాలనీలో నివాసం ఉంటున్న అవ్వారి బాల గురవయ్య, అరుణ దంపతుల ఇంటికి ఆధార్ కార్డు వెరిఫికేషన్ నిమిత్తం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. బాల గురవయ్య తెస్తున్న సమయంలో ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. తలపై గట్టిగా మోదగా అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం ఓ దుండగుడు ఇంట్లోకి వెళ్లి అరుణ (45)పై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఆమె కేకలు వేసుకుంటూ ఇంటి బయటకి పరుగులు తీసుకుంటూ వచ్చి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు కొందరు బాల గురువయ్యను పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పెదకూరపాడు డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్స్క్వాడ్, క్లూస్ టీమ్ను పిలిపించారు. ఇటీవల బాల గురవయ్య తన పొలం అమ్మినట్టు స్థానికులు తెలిపారు. బాల గురవయ్య మొదటి భార్య పదిహేను సంవత్సరాల క్రితమే మృతి చెందింది. అనంతరం కృష్ణా జిల్లా నర్తనశాలకు చెందిన అరుణను రెండో వివాహం చేసుకున్నారు. అరుణకు కూడా ఇది రెండో పెళ్లి. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాల గురవయ్య మొదటి భార్య, ఆమె కుమార్తె కూడా పాము కాటుకు గురై గతంలో మృతి చెందారు. -
క్రమబద్ధీకరణకు ఒప్పంద అధ్యాపకుల డిమాండ్
ఏఎన్యూ (పెదకాకాని): ఏఎన్యూలోని కాంట్రాక్ట్ అధ్యాపకులను సేవలను తక్షణమే క్రమబద్ధీకరించాలని సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం ఎదుట ఒప్పంద అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా వారికి సంఘీభావంగా ఇతర ఒప్పంద అధ్యాపకులు కూడా తమ బోధనా కార్యక్రమాలు ముగిసిన వచ్చి మద్దతు తెలిపారు. ముందుగా జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుని విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎన్. భరత్గుప్తాను కలసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర స్థాయి ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షల్లో భాగంగా అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం తమను కూడా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పరిగణించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఎన్యూ వద్ద 18వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు -
జీఎస్టీ అధికారుల ‘టోలీక్’ సమావేశం
లక్ష్మీపురం: గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ అరుణ్ రిచర్డ్ సారథ్యంలో ‘టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ’ (టోలీక్) హిందీ సమావేశం బుధవారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడం, అధికారుల్లో హిందీపై పని పరిజ్ఞానాన్ని పెంపొందించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో పనిచేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారిక హిందీలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకునే ఆచరణాత్మక పద్ధతులపై సమావేశంలో చర్చించారు. ముందుగా గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ సునీల్ చౌదరి అధికార భాషా చట్టం తదితరాలను వివరించారు. పలువురు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు అధికార భాష అమలుపై అవగాహనను బలోపేతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ దేవ్కుమార్ రిజ్వాని మాట్లాడుతూ, హిందీ వినియోగం కేవలం అధికార భాషకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను నెరవేర్చడమే కాకుండా, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమన్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కూడా దోహదపడుతుందన్నారు. అధికారులకు సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ హెయర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు రవీంద్రనాథ్, అశుతోష్, అమృత్ రాజ్, శశిదాస్, ఆనందగోపాల్, చంద్రవర్మ, నీరజ్, రవి, శ్యాంప్రకాశ్, అమిత్, చక్రధర్, రాజేష్, ప్రణిత, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా కోడెదూడలు తరలింపు
పెదకాకాని: అక్రమంగా కోడె దూడలను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సంత నుంచి మంగళవారం కోడె దూడల లోడుతో కంటైనర్ లారీ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట బయలు దేరింది. ఈ లారీ రాత్రి 9 గంటలకు పెదకాకాని వై జంక్షన్కు చేరుకునే సరికి అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా 35 కోడె దూడలను తరలిస్తున్నట్లు గుర్తించి లారీని పోలీసుస్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో మణికంఠ, జమి రాజశేఖర్, ఐనవోలు హరిప్రసాద్లు గత కొంతకాలంగా అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు వెల్లడైంది. జిల్లెళ్లగూడెంకు చెందిన డ్రైవర్ సింహాద్రిని అదుపులోకి తీసుకున్నారు. మానవతా ధృక్పదంతో స్పందించిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఉన్న కోడె దూడలను కాళీగార్డెన్స్ సమీపంలో ఉన్న గేదెల షెడ్డుకు తరలించి పశుగ్రాసం, నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. కోడెదూడలను తరలిస్తున్న మణికంఠ, జమి రాజశేఖర్, ఐనవోలు హరిప్రసాద్లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. -
చిన్న ప్రాణం.. పెద్ద ఆపద!
గుంటూరు ఎడ్యుకేషన్: నాలుగేళ్ల వయసులోనే అరుదైన జన్యుపరమైన వ్యాధికి గురైన చిన్నారిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని మాస్టర్మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. బుధవారం బ్రాడీపేటలోని మాస్టర్మైండ్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ తమ వద్ద సీఏ అభ్యసించి తెనాలిలో స్థిరపడిన హరీష్, బాల నవ్య శ్రీ దంపతుల నాలుగేళ్ల కుమారుడు అశ్వత్ గరుదత్ జన్యుపరమైన అరుదైన కండరాల వ్యాధి డీఎండీ (డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ)కి గురై తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు అమెరికాలోనే ఉండే ఇంజక్షన్ ఖరీదు 26 కోట్ల రూపాయలు అవుతుందని, అంత శక్తి లేని ఆ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు, సభ్య సమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఏ విద్యను పూర్తి చేసుకున్న మాస్టర్మైండ్స్ పూర్వ విద్యార్థులైన తల్లిదండ్రులు తెనాలిలో వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్ల వయసు గల కుమారుడు అశ్వత్ గురుదత్ అనారోగ్యానికి గురి కావడంతో గత ఏడాది బెంగళూరులోని శివాన్సీ న్యూరో మెడికేర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా అరుదైన వ్యాధి బయటపడిందన్నారు. మాస్టర్ మైండ్స్ అధ్యాపకులు, యాజమాన్యం, విద్యార్థులు సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. అదే విధంగా వేర్వేరు మార్గాల ద్వారా ఇప్పటి వరకూ రూ.3.11కోట్లు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ రూ.26 కోట్ల భారం మోయలేని పరిస్థితుల్లో సోషల్ మీడియాతో పాటు మీడియా ద్వారా దయా హృదయులైన దాతలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. పునర్విక శ్రీ అనే బాలికకు ప్రభుత్వం సాయం చేసిన విధంగా అశ్వత్ గురుదత్కు పునర్జన్మ ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలకు చేపట్టేందుకు కేటాయించే సీఎస్ఆర్ నిధులను బాలుడి వైద్యానికి అందించాలని కోరారు. దాతలు తమ విరాళాలను ఫోన్ పే నెంబర్ 9700 365341కు పంపాలని తల్లిదండ్రులు హరీష్, నవ్య శ్రీ విజ్ఞప్తి చేశారు. -
భూములు కోల్పోతున్న రైతులకు న్యాయంచేయాలి
లక్ష్మీపురం: ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతు సంఘం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. బుధవారం గుంటూరు బ్రాడీపేట లోని యుటియఫ్ హాల్లో ఔటర్ రింగ్ రోడ్ రైతుల కమిటీ సమావేశం జొన్న శివశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 121 గ్రామాలకు సంబంధించి, 23 మండలాల్లో పదివేల ఎకరాలు పైన భూములు ఔటర్ రింగ్ రోడ్డు కింద రైతులు కోల్పోతున్నారన్నారు. ఇందులో సన్నా,చిన్న కారు రైతులు అత్యధికంగా ఉన్నారన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సరైన ప్రకటన చేయకుండా రహస్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొరకు పావులు కదుపుతుందన్నారు. భూమి కోల్పోతున్న రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతులు నష్టాలు పాలు చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. 2013 భూ సేకరణ కింద ఇవ్వాల్సిన నష్టపరిహారాలు కుదించే విధంగా కొత్త జీవో తీసుకువచ్చింది అన్నారు. ఈ కొత్త జీవో వల్ల రైతులకి ఎప్పుడో పాతకాలం రిజిస్ట్రేషన్ విలువ ఉండటం వల్ల పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. సిటీ అవుట్ కట్స్లో ఉన్న ఈ భూములకు ప్రైవేటు మార్కెట్ కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం లక్షల్లో మాత్రమే పరిహారం అంది పరిస్థితి ఉందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వల్లూరి భారతి, ఔటర్ రింగ్ రోడ్డు రైతుల కమిటీ నాయకులు కోయ కోటేశ్వరరావు, గుంటుపల్లి సాంబశివరావు, కె. పద్మావతి, రమేషు,కాజా వెంకటేశ్వరరావు, పి.శివ పార్వతి, ములకా శివసాంబిరెడ్డి, సిహెచ్.భాస్కర్ రావు, వెంగళరెడ్డి, బి.శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలి
గుంటూరు వెస్ట్: ప్రజల అవసరాలను గమనించి ఉత్తమ అధికారులుగా చిరస్మరణీయ సేవలు అందించాలని గ్రూప్–1 యువ అధికారులకు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సూచించారు. సమస్య పరిష్కార వైఖరి కలిగి ఉండాలని సూచించారు. 2026 గ్రూప్–1 బ్యాచ్లో ఎంపికై న అభ్యర్థుల క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి వైఖరి కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఫలితాలు సాధించగలిగే యుక్తి ఉండాలని పేర్కొన్నారు. ఒక పనిలో తుది లక్ష్యాన్ని పక్కాగా సాధించగలిగే విధంగా ఉండాలని చెప్పారు. పనిలో ఆనందం పొందాలని, సంతృప్తి సాధించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి అనుసంధానం వంటి సమస్యలు, ప్రసవాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడం ప్రధానమన్నారు. నెలకు ఎనిమిది, తొమ్మిది మాతృ మరణాలు ఉండగా ‘మాతృ దేవో భవ’ కార్యక్రమాన్ని నిర్వహించి ఒకటికి తీసుకువచ్చామని తన అనుభవాలను పంచుకున్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణను ఉత్తమంగా చేయడం గొప్ప కళన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య సమన్వయం కలిగి ఉండాలన్నారు. ఉన్నతాధికారుల సూచనలు తమకు ఎంతో ఉపకరించాయని యువ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల సంస్థ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
జావెలిన్ త్రో మీట్కు విశేష స్పందన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూర్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి జావెలిన్ త్రో పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో పలు పలు ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 7న నేషనల్ జావీలిన్ డేను పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించామని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ పోటీలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చేందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఫౌండర్ జాతీయ హమ్మర్ త్రోయర్ గారా శేషయ్య చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రసాద్తోపాటు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారుడు జీజే కిషోర్, శాప్ అథ్లెటిక్ కోచ్ వెంకటేశ్వరరావులు సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షకులు శివారెడ్డి, కె.రవి, దీపు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: వ్యక్తి తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండి, అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడంపాడు గ్రామ శివారులో గల పోగాకు గోడౌన్ వద్ద సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర రక్తగాయాలతో ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల గాయాలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించామని, మృతుడు బ్లాక్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట ధరించి ఉన్నాడన్నారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఇతను భిక్షాటన చేస్తూ ఉంటాడని తెలిసింది. మృతుడి ఆచూకీ తెలిసినవారు నల్లపాడు పోలీస్ స్టేషన్కు గానీ లేదా 8688831376, 8688831607 సెల్ నంబర్లలో గానీ సంప్రదించాలన్నారు. -
యువత ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి
మంగళగిరి రూరల్: మండల పరిధిలోని బేతపూడిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా యువత తమ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి పనిచేయాలన్నారు. కుటుంబ వ్యవస్థే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నామని, ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్య అంటే కేవలం వృత్తిపరమైన జీవితాన్ని నిర్మించుకోవడం మాత్రమే కాదని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిందని అన్నారు. అమృత విశ్వ విద్యాపీఠం అమృత యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయేంద్రజీ, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ స్వామి నిజామృతానందపురిజీ, అమరావతి క్యాంపస్ రిజిస్ట్రార్ విపిన్ నాయర్, డీన్ సీకే జయశంకర్ పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు
ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు సూచన తాడికొండ: స్వాతంత్య్ర దినోత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని మినిస్టర్స్ క్వార్టర్స్ వెనుక ఉన్న పరేడ్ గ్రౌండ్లో బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) జె. శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పురోగతి, భద్రత, ట్రాఫిక్, రహదారుల సదుపాయాలపై శ్యామలరావు అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ – పార్కింగ్ విషయమై వేడుకలకు వచ్చే వీఐపీలు, అధికారులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా వాహన పార్కింగ్ స్థలాలను కేటాయించాలని కోరారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా మళ్లింపు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సహాయం కోసం గ్రౌండ్ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ఓను కోరారు. సమావేశంలో ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర పాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, జిల్లా సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మావతి, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యహోమం, పూర్ణాహుతి, ఉపచారం, మంత్రపుష్పం, హారతి, విబూది, కుంకుమ ప్రసాద వితరణలు తదితర కార్యక్రమాలను ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చక, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చివరి రోజు గురువారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. ఆలయ అధికారులు, కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, బండారు మల్లేశ్వరి దంపతులు, వుల్లం రాజేశ్వరి దంపతులు, ధూపాటి శివశంకరరావు, బైరపనేని ధనలక్ష్మి దంపతులు, ఎక్స్ అఫీషియో సభ్యులు పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. -
కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలు
గుంటూరు లీగల్: కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని.. కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని స్టేక్ హోల్డర్స్ (బ్యాంకు, ఫైనాన్సియల్ సంస్థలు, బీమా కంపెనీల అడ్వకేట్లు)కు మంగళవారం జిల్లా కోర్టులో అవగాహన సదస్సు నిర్వహించారు. మధ్యవర్తిత్వం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, బ్యాంకు, ఫైనాన్సియల్ సంస్థలు, బీమా కంపెనీ అడ్వకేట్లు, పిటిషనర్ అడ్వకేట్లు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ నరసరావుపేట: పీఎంఏవై.20 కింద గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న గృహాలను మంగళవారం పరిశీలించారు. స్థానిక 33వ వార్డులో లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మాణం పూర్తి చేసి అధికారులతో బిల్లులు పెట్టించుకోవాలని సూచించారు. అనంతరం వినుకొండ పట్టణంలోని 10వ వార్డులో గృహాలను తనిఖీ చేశారు. జాప్యం లేకుండా బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ ఎస్ఈ ఎం.కృష్ణయ్య, జిల్లా అధికారి యూవీఎన్వీ ప్రసాద్, నరసరావుపేట కార్యనిర్వాహక శాఖ అధికారి బి.శివలింగం, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు కె.సాంబయ్య, అసిస్టెంట్ ఇంజినీర్లు, వార్డు ఎమినిటీలు పాల్గొన్నారు. ప్రత్తిపాడు: గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు పోలీస్ స్టేషనును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు, వాటి పురోగతి వివరాలను ఎస్ఐ కె.నరహరిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలతోపాటు రిసెప్షన్ సెంటర్ను పరిశీలించారు. సిబ్బంది, మహిళా పోలీస్లతో మాట్లాడి మెరుగైన పోలీసింగ్పై దిశానిర్దేశం చేశారు. తదనంతరం ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఐజీ మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషనులో పబ్లిక్కు ఫ్రెండ్లీ ఓరియెంటెడ్ ఉందా, ప్రజలకు న్యాయం జరుగుతుందా, పోలీస్ అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాలను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఐజీ వెంట గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, ప్రత్తిపాడు సీఐ పి.సుబ్బారావు తదితర అధికారులు ఉన్నారు. వినుకొండ: అప్పుల బాధ, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగులపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరిబోయిన వెంకటేశ్వర్లు తండ్రి, తల్లి, తమ్ముడు అప్పులు చేసి ఊరు విడిచి వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న వెంకటేశ్వర్లును పోలీసులు స్టేషన్కు పిలిపించి వేధిస్తుండడంతో, మనస్తాపానికి గురై ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకుముందు తన బాధను సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బంధువులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. -
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిగుంటూరు మెడికల్: సుస్థిరమైన జీవితానికి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సమించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ సంయుక్తంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తల్లిపాలు శిశువులు, చిన్నపిల్లల పోషణకు సుస్థిరమైన పోషణ విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిత, డాక్టర్ సాహితీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లులకు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంఓ డాక్టర్ సుజాత, డీఐఓ డాక్టర్ వల్లిక, కిమ్స్ శిఖర హాస్పటల్ ఉప పర్యవేక్షకురాలు డాక్టర్ కృష్ణ ప్రభ, కార్యాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు, తల్లులు పాల్గొన్నారు. -
స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్: గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో ‘మన అమరావతి’ థీమ్తో నిర్వహిస్తున్న స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026 పోస్టర్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారికి గుర్తించి పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీ విజయవాడ గుణదలలోని హయ్యత్ ప్లేస్లో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఐకాన్స్ షోరం సొసైటీ అధ్యక్షులు చైతన్య, కార్యదర్శి జయా పటేరియా మాట్లాడారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వర్, సంయుక్త కార్యదర్శి కోడే శ్రీచైతన్య, ట్రెజరర్ అప్పారావు, కమిటీ సభ్యుడు డాక్టర్ ఎ.నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 8,9,10 తరగతుల విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ ఎ.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 27న పాఠశాల స్థాయి, సెప్టెంబర్ 8న మండల, సెప్టెంబర్ 27న జిల్లా, నవంబర్ 1,2,3 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యం ప్రోత్సహించాలని కోరారు. వివరాలకు 90004 53600,84999 32328 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ భాస్కర్, టి.జాన్బాబు, బి.ప్రసాద్, టీఆర్ రమేష్, ఎస్ఎం సుభానీ, గురవయ్య, ఇ.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి
అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి, ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం వద్ద మంగళవారం డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చలపతిరావుకు వినతిపత్రం అందజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు అమలు చేయాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే జమ చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను విడుదల చేయాలని కోరారు. సంజీవని ఆరోగ్య బీమా అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అడవుల సంరక్షణలో పనిచేస్తున్న ప్రొటెక్షన్ హెల్పర్లకు రక్షణ పరికరాలు, కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీచేసి అదనపు పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజు, కార్యదర్శి కార్తీక్, అటవీశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కిరణ్, కుమార్, ధనుంజయ్, రాకేష్ పాల్గొన్నారు. -
9న గిరిజన దినోత్సవం నిర్వహించాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 9వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ ప్రభుత్వాన్ని కోరారు. అరండల్పేటలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గిరిజన సమాఖ్య ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి ఆగస్ట్ 9వ తేదీని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రానికి రూ.2లక్షలు కేటాయించి గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు. సమావేశంలో గిరిజన సమాఖ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కోయ శ్రీను, సహాయ కార్యదర్శి పాలపర్తి వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, మొగిలి అనూరాధ పాల్గొన్నారు. సత్తెనపల్లి: చెక్కు బౌన్స్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమాన విధిస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థాన న్యాయమూర్తి పి.ప్రియదర్శిని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని బోయ కాలనీలో నివాసం ఉండే బంటుపల్లి సూర్యనారాయణ అనే వ్యక్తి దగ్గర విజయవాడ దుర్గాపురం పున్నయ్య కాలనీ నివాసి అయిన తుమ్మల నాగేంద్ర ప్రసాద్ తన కుటుంబ, వ్యాపార అవసరాల నిమిత్తం రూ. 1.30 లక్షలు అప్పుగా తీసుకోని 2017 మే 15న ఒక ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. సదరు బాకీ తీర్చమని సూర్యనారాయణ కోరగా నాగేంద్రప్రసాద్ సింగ్ నగర్ బ్రాంచి ఎస్బీఐ కి చెందిన చెక్కును రూ. 1.30 లక్షలకు 2018 జూన్ 27న ఇచ్చాడు. ఆ చెక్కును కలక్షన్ నిమిత్తం ఫిర్యాది తన బ్యాంక్ అకౌంట్ అయిన సత్తెనపల్లి విజయబ్యాంక్ లో ప్రెజెంట్ చేయగా ముద్దాయి అకౌంట్ బ్లాక్డ్ అని చెక్కుబౌన్స్ అయ్యింది. దీంతో సూర్యనారాయణ న్యాయస్థానంలో చెక్కుబౌన్స్ కేసు వేయగా సుధీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ప్రియదర్శిని తీర్పువెలువరించారు. జరిమానా రూ. 10 వేలు చెల్లించటంతో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. మరో కేసులో... మాచర్ల: వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు వద్ద బొల్లాపల్లి మండల పరిధిలోని గండిగనుముల గ్రామానికి చెందిన దేవయ్య 2019లో రూ.5,40,000లు అప్పుగా తీసుకున్నాడు. ఈ మేరకు బాకీ తీర్చేందుకు వెంకటేశ్వర్లుకు అదే సంవత్సరంలో చెక్కు ఇచ్చాడు. చెక్కు బౌన్స్ కాగా బాధితుడు మాచర్ల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు విచారణ జరిపి మంగళవారం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ కల్యాణ్ తీర్పునిస్తూ కిన్నెర దేవయ్యకు నాలుగు నెలల శిక్షతోపాటు రూ.10,80,000 చెల్లించాలని తీర్పునిచ్చారు. దీంతో పాటు నష్టపరిహారంగా మరో రూ.2,70,000 చెల్లించాలని లేదా మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పెదనందిపాడు పీఎస్లో ఐజీ ఆకస్మిక తనిఖీ
పెదనందిపాడు: స్థానిక పోలీస్స్టేషన్ను గుంటూరు రేంజీ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. మహిళా సిబ్బంది, ఇతర అధికారుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలు పటిష్టంగా అమలు పర్చాలని సూచించాచారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ పూర్ణచంద్రరావు, సీఐ పి.సుబ్బారావు, పెదనందిపాడు ఎస్ఐ ఏకనాథ్, ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి, కాకుమాను ఎస్ఐ హరికృష్ణ ఉన్నారు. -
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎం.ఎస్.నెం.30 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలకు వేగంగా క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) చేసి హక్కు పట్టాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలోని అడవితక్కెళ్లపాడు, చౌడవరం, ప్రగతినగర్ ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన 35 ప్రత్యేక బృందాల్లోని రెవెన్యూ, ప్లానింగ్ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎటువంటి లోపాలు లేకుండా పక్కా రికార్డులు సిద్ధం చేయాలని సూచించారు. పేదలకు త్వరితగతిన హక్కు పట్టాలు అందేలా అధికారులు నివేదికల తయారీలో జాప్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, సిటీ ప్లానర్ డి.రాంబాబు, తహసీల్దార్లు సుభానీ, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నడింపాలెంలో కేంద్ర బృందం పర్యటన
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. స్థానిక 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి ఉన్న 149/4 సర్వే నంబరులో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయుష్ ఆస్పత్రితోపాటు అనుబంధ సంస్థలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్వైఎన్) డైరెక్టర్ డాక్టర్ జ్యోతి కేశ్వాని, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్–కన్సల్టెంట్ ప్రమోద్ వర్మ, పరిశోధన అధికారి డాక్టర్ ఎన్.వి. జ్ఞానదీప్ తటావర్తిల బృందం ప్రతిపాదిత స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం. సాయికాంత్ వర్మతో కలిసి పరిశీలించింది. స్థల స్వభావం, విస్తీర్ణం, హద్దులు, రోడ్డు మార్గం తదితర అంశాలను బృంద సభ్యులకు కలెక్టర్ వివరించారు. ప్రతిపాదిత స్థలం పక్కనే వాగు ఉండటంతో వరదల సమయంలో వరద నీరు ఆస్పత్రిలోకి వచ్చే అవకాశం ఉందని, అలానే నిర్దేశిత భూమిలో ఒక రైతుకి చెందిన పట్టా భూమి ఉందని బృంద సభ్యులు ప్రస్తావించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ స్థలంలో ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపితే వారం రోజుల్లో సమస్య పరిష్కరించి భూమి అప్పగిస్తామని చెప్పారు. వరద సమస్య లేకుండా కాంక్రీట్ డ్రైన్ నిర్మాణం చేపట్టి అందజేస్తామని కలెక్టర్ వివరించారు. సాధ్యమైనంత త్వరగా స్థలాన్ని ఫైనల్ చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ, ఆయుష్ విభాగం డైరెక్టర్ రోనంకి గోపాలకృష్ణ కేంద్ర బృందాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓట్లపైనా రాజకీయమేనా సర్?
అధికార పార్టీ నేతల కుట్రలతో ఓట్లు గల్లంతు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకున్న అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలు, వారి మద్దతుదారుల ఓట్ల తొలగింపే ధ్యేయంగా కుయుక్తులు పన్నారు. ఇలా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఏకంగా నాలుగు వందలకుపైగా వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఎటువంటి విచారణ లేకుండానే ఓట్ల తొలగింపునకు బీఎల్వోలు పాల్పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 167, 168 బూత్లలో 190 మంది ఓట్లు తొలగించడం గమనార్హం. గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో ఉంటున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరి ఓట్లను తొలగించే కుట్రకు అధికార పార్టీ నేతలు తెరతీశారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆయన స్వగ్రామంలో కాకుండా జిల్లా కేంద్రమైన గుంటూరులో, ఆయన కుమార్తెలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నప్పటికీ వారి ఓట్లు తొలగించలేదు. అదే అధికారులు... నియోజకవర్గంలోనే ఉంటున్న వారి ఓట్లను మాత్రం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. మన్నవలోనే కాకుండా అనేక గ్రామాల్లో సైతం ఇలాగే కుట్రపూరితంగా ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే అధికార పార్టీ చేసే ఓటు చోరీలో పలువురి ఓట్లు పోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతా అడ్డగోలుగానే... గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ ఏఎంసీ చైర్మన్ బొనిగల వేణుప్రసాద్ ఓటు గల్లంతు అయింది. ప్రస్తుత మాజీ సర్పంచ్ ఓటు ఉంచి, ఆయన భార్య బొనిగల సుభాషిణి ఓటు తొలగించారు. అదేవిధంగా ప్రస్తుత మన్నవ ఎంపీటీసీ ఓటు ఉంచిన అధికారులు... ఆయన భార్య బొనిగల దేవి, కుమారుడు బొనిగల అభినాగ్ పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. వీరితో పాటు గ్రామానికి చెందిన సుమారు 400 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించిన వైనం బయటపడింది. వీరంతా మండల కేంద్రమైన పొన్నూరులో ఉపాధి, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇళ్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు గ్రామంలోనే ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిడితో వీరి ఓట్లను బీఎల్వోలు తొలగించడం గమనార్హం. బాధితులు ఎన్నికల కమిషన్కు, పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేసి ఓటు హక్కు కల్పించాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. -
మండలి కృష్ణారావు చిరస్మరణీయుడు
గుంటూరు ఎడ్యుకేషన్: పేదల పెన్నిధిగా, దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకటకృష్ణారావు చిరస్మరణీయుడని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కొనియాడారు. మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారన్నారు. డెప్యూటీ సీఈఓ చొప్పర కృష్ణ, అకౌంట్స్ ఆఫీసర్ పుల్లగూర శామ్యూల్ పాల్, ఏఓలు రాజా రత్నబాబు, తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో... నగరంపాలెం: మాజీ మంత్రి, దివంగత మండలి వెంకటకృష్ణారావు జయంతిని మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో మంగళవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి ఎస్పీ వకుల్ జిందాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడి అని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ కృష్ణయ్య, ఎస్బీ సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
న్యాయవాదుల క్రికెట్ టోర్నీ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలను తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాటింగ్ చేయగా బార్ కౌన్సిల్ మెంబర్ ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డి బౌలింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. మొదటి మ్యాచ్లో ఈగల్ టీం తమ ప్రత్యర్థి ఇండియా లీగల్–11 జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సచిన్ స్పార్క్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండవ మ్యాచ్లో 11 బుల్లెట్స్ జట్టు తమ ప్రత్యర్థి ప్రేమ్ చంద్ టీంపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న కె.ఆనంద్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. తాడేపల్లి రూరల్: బకింగ్హామ్ కెనాల్లో దూకి గల్లంతైన విద్యార్థిని మృతదేహం మంగళవారం లభించింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్ పశువుల హాస్పిటల్ సమీపంలో నివాసముండే సురేంద్ర, అనిత దంపతుల కుమార్తె ఐశ్వర్య (17) చదువు విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి గల్లంతైంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మంగళగిరి 6వ బెటాలియన్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తాడేపల్లి రూరల్ పరిధిలోని మెల్లెంపూడి వద్ద ఐశ్వర్య మృతదేహం లభించడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీయగానే అక్కడే ఉన్న తండ్రి సురేంద్ర కుప్పకూలిపోయాడు. ఆయన్ను ఓదార్చి బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు
పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెదకాకాని శివాలయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు మంగళవారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చకస్వాములు, వేదపండితుల పర్యవేక్షణలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమాలను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. మొదటి రోజు ఉదయం పవిత్రములు గల వెదురుపేటికలతో యజ్ఞశాల ప్రదక్షిణ పూర్వకంగా యాగశాల ప్రవే శం, శివానుజ్ఞ, శ్రీ విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య పూజ, ప్రాశనం, రక్షాసూత్ర పూజ, ధారణ, బృత్విగ్వరణం, దీక్షాధారణ, అఖండ దీపస్థాపన, యాగేశ్వర కుంభస్థాపన పూజ, వాస్తు కుంభస్థాపన పూజ, వాస్తు శాంతి హోమం, బలి పర్యగ్నీకరణ, బలిహరణ, తీర్థప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవాయిద్యాలు, చతుర్వేద పారాయణాలు, గోపూజ అనుజ్ఞ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, వాస్తుశాంతి, వాస్తు పర్యగ్నీకరణ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, రక్షాబంధనం, మంత్రపుష్పం, హారతి, విభూతి, కుంకుమ ప్రసాద వితరణ జరిగినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడు పేటేటి ధన మహేశ్వరప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. -
మిర్చి బస్తాల చోరీ ముఠా అరెస్ట్
లక్ష్మీపురం: మిర్చి బస్తాల వరుస చోరీలకు పాల్పడుతున్న 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు వాహనాలు, రూ. లక్ష నగదు, పది మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నగరంపాలెం సీఐ మునిపల్లి రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... హౌసింగ్ బోర్డు, నల్లపాడు ప్రాంతానికి చెందిన బత్తుల శంకరావు మిర్చి యార్డులో మేసీ్త్రగా పని చేస్తున్నారు. జూలై 30వ తేదీన గురజాల నుంచి కొనుగోలు చేసిన 120 మిర్చి బస్తాలను ట్రాక్టర్లో గుంటూరు మిర్చి యార్డుకు తీసుకొస్తుండగా, యార్డులో రద్దీ ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ట్రాక్టర్ను రామిరెడ్డి నగర్ శ్మశానవాటిక ఎదురుగా నిలిపి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మిర్చి యార్డులో రద్దీ తగ్గిన తర్వాత ట్రాక్టర్ను యార్డు లోపలికి తీసుకెళ్లి లోడును దించారు. అదే సమయంలో 38 మిర్చి బస్తాలు చోరీకి గురైనట్లు గుర్తించి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో గుంటూరు వెస్ట్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పర్యవేక్షణలో నగరంపాలెం సీఐ మునిపల్లి రాజేష్ ఆధ్వర్యంలో మూడు బృందాలతో దర్యాప్తు చేపట్టారు. రూ. లక్షకు విక్రయం ఈ క్రమంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీ, వీఐపీ రోడ్డులోని లాలుపురం సమీపంలోని భవానీపురం ప్లాట్స్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న పది మంది పరారయ్యేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో వారే మిర్చి బస్తాల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఆవుల గణేష్ ఆధ్వర్యంలో చోరీలు చేస్తున్నట్లు అంగీకరించారు. విచారణలో జూలై 30న అర్ధరాత్రి 38 మిర్చి బస్తాలను కాజేసి మూడు టాటా ఇన్ట్రా వాహనాల్లో తరలించారని వెల్లడైంది. ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామానికి చెందిన వ్యక్తికి రూ. లక్షకు విక్రయించినట్లు ఒప్పుకొన్నారు. వారి నుంచి రూ. లక్ష నగదు, చోరీకి వినియోగించిన మూడు టాటా ఇన్ట్రా వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, పది మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన కృష్ణబాబు కాలనీకి చెందిన మోచర్ల దుర్గారావు, కొండేటి దుర్గారావు, బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన (ప్రస్తుతం కృష్ణబాబు కాలనీలో నివాసం ఉంటున్న) నాగిపోగు రాజేష్, మోటమర్రి మరియదాసు, కట్టా ఆనందరావు, పొన్నాల నరసింహారావు, షేక్ నాగూర్, షేక్ మున్నా బాషా, దేవళ్ల లక్ష్మీనారాయణ, షేక్ సంజీత్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఆవుల గణేష్ పరారీలో ఉండగా, గాలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. సీఐ, ఎస్ఐ, సిబ్బంది శ్రీనివాసరావు, జాన్ సైదా, బెనర్జీ, గంగరాజులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. రూ.లక్ష నగదు, 4 వాహనాలు, పది మిర్చి బస్తాలు స్వాధీనం -
అంగన్వాడీ కేంద్రాలను పారదర్శకంగా నిర్వహించాలి
గుంటూరు వెస్ట్: అంగన్వాడీ కేంద్రాలను సంతృప్తి స్థాయిలో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ లో ఎల్లప్పుడూ సానుకూల స్పందన పొందేవిధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని సీడీపిఓలు, పర్యవేక్షకులకు సూచించారు. ప్రీస్కూల్ అటెండెనన్స్, ఆపార్ ఐడీ క్రియేషన్, లబ్ధిదారుని అభా ఐడీ క్రియేషన్, టేక్ హామ్ రేషన్ పంపిణీ, ఏ.ఐ.ఇ.సి.డి స్క్రీనింగ్, గ్రోత్ మానిటరింగ్, పి.ఎం.ఎం.వి.వై, సరుకుల నమోదు తదితర శాఖాపరమైన సూచీలకు అనుగుణంగా ఖచ్చితమైన, నాణ్యమైన డేటాను నమోదు చేసి, లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.పి.జి. ప్రసూన, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
తెలుగు భాషాభివృద్ధికి మండలి కృషి
గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలిలు ఘనంగా నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ వెంకట కృష్ణారావు జీవిత విశేషాలు, విద్యా రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి, సామాజిక సేవకు ఆయన చేసిన విశిష్ట సేవలను వివరించారు. యువతలో సేవాభావం, దేశభక్తి, తెలుగు భాష పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వ్యవహరించారన్నారు. మండలి ఆశయాలను భావితరాలకు చేరవేయడం, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుల్లో ఒకరని, ఆయన రాజకీయవేత్త, గాంధేయవాది, సంఘసేవకుడు, విద్యా–సాంస్కృతిక పరిరక్షకుడుగా సేవలు అందించారన్నారు. ప్రజాసేవను జీవిత ధ్యేయంగా తీసుకొని నిరాడంబర జీవనం గడిపిన ఆయనను ‘దివిసీమ గాంధీ‘ అని గౌరవంగా పిలవడం, ఆయన పట్ల ప్రజలకు గల గౌరవం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి రమ్య, కలెక్టరేట్ ఏఓ మల్లేశ్వరి, స్టెప్ సీఈఓ పి.వి.ఎన్.సత్యనారాయణ, మాజీ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.మాణిక్యాలరావు, సీనియర్ సిటిజన్ మాధా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా వర్సిటీతో జీఎఫ్ఎస్ఐ సంస్థ ఒప్పందం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ ఇన్న్స్టిట్యూట్(జీఎఫ్ఎస్ఐ) పరిశోధన విభాగం సహా సంచాలకులు డాక్టర్ కాకాని విజయగోపాల్ మంగళవారం సందర్శించారు. ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ఎంఓయూలను మార్చుకున్నారు. భవిష్యత్ సహకార అవకాశాలపై చర్చించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, పంటల సాగు విధానాలు వ్యవసాయ వ్యవస్థలు భారతదేశంలోని అనేక ప్రాంతాల వ్యవసాయ పరిస్థితులతో సారూప్యతను కలిగి ఉండటంతో, అక్కడ అభివృద్ధి చేసిన సాంకేతికతలను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా అనుసరించి అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ ఆధారిత అల్గారిథమ్లు, డిజిటల్ వ్యవసాయం, కచ్చిత వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్లో రైతుల అవసరాలకు అనుగుణంగా విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం అందిస్తున్న ఆనన్లైన్ కోర్సుల్లో ఎన్జీరంగా విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తలు నమోదు చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువపత్రాలు పొందే అవకాశాలను కూడా వివరించారు. -
చీటింగ్ కేసులో నిందితుల అరెస్ట్
మంగళగిరి టౌన్: స్థలం లేకుండానే ఉన్నట్లు చూపించి మోసగించిన నిందితులను పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. మంగళగిరి పట్టణం భార్గవపేటకు చెందిన చౌడేశ్వరి, భర్త వెంకటేశ్వరరావు టైలర్గా పనిచేస్తున్నాడు. వారిద్దరి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2025 నవంబర్లో మంగళగిరి పట్టణానికి చెందిన యేసు అనే తెలిసిన వ్యక్తి చౌడేశ్వరి ఇంటికి వచ్చి తక్కువలో స్థలం అమ్మకానికి ఉందని నమ్మబలికాడు. గౌరీశంకర్, సునీల్, మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తులను యేసు వెంటబెట్టుకుని మంగళగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ పక్కన 300 గజాల స్థలం అమ్మకానికి ఉందని చూపించారు. దాని విలువ రూ.93 లక్షలు ఉంటుందని చెప్పగా విక్రయ అగ్రిమెంట్, విక్రయ బయానా రశీదు, తయారు చేసిన స్టాంప్ పేపర్లు కూడా తీసుకొచ్చారు. అదే రోజుల లక్ష రూపాయలు నగదు ఇవ్వగా బయానా రశీదు ఇచ్చారు. స్థలాన్ని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో రుణం కోసం డాక్యుమెంట్లను తీసుకెళ్లగా, బ్యాంకు అధికారులు పరిశీలించి ఈ స్థలానికి ఎలాంటి బ్యాంకు లోన్ రాదని చెప్పారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే మొత్తం అగ్రిమెంట్ తాలూకా అడ్వాన్స్ కింద రూ.15 లక్షలు ఇచ్చారు. డాక్యుమెంట్ పూర్తి వివరాల కోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వాళ్లు ఇచ్చిన డాక్యుమెంట్ను పరిశీలించమని చెప్పగా మంగళగిరి రెవెన్యూ తాలూకా డి–223/ఎ సర్వే నెంబర్లో 300 చదరపు గజాల స్థలం లేదని అధికారులు చెప్పారు. దీంతో వారిని నిలదీయగా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. లేని స్థలాన్ని ఉన్నట్లు చూపించారని, మోసపోయామని గ్రహించిన బాధితురాలు చౌడేశ్వరి జూన్ 28న మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళగిరి పట్టణ సీఐ వీరాస్వామి పర్యవేక్షణలో ఎస్ఐ రవీంద్రనాయక్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆదివారం ఇందిరానగర్ సెంటర్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. 15 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని మోసం చేసిన నిందితులు మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు, గౌరీశంకర్, ఏసులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి సునీల్ పరారీలో ఉన్నాడని, అతడ్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని పట్టణ సీఐ వీరాస్వామి తెలిపారు. -
సంగీతం శ్రద్ధగా సాధన చేయాలి
ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ఏఎన్యూ(పెదకాకాని): సంగీతం శ్రద్ధగా నేర్చుకుని సాధన చేయడం ద్వారా సంగీత రంగంలో రాణించవచ్చని ప్రముఖ గాయని డాక్టర్ ఎస్పీ శైలజ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం డాక్టర్ శైలజ దంపతులు విచ్ఛేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శైలజ మాట్లాడుతూ సంగీతంనపై ఆసక్తి ఉంటే సాధన ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ సంగీతం, పాటలు ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సినీనటుడు సుధాకర్ పాల్గొన్నారు. -
యాజమాన్య చర్యలతో నష్టాలను తగ్గించుకోవచ్చు
తాడికొండ: ఎల్నినో పరిస్థితులను శాసీ్త్రయంగా ఎదుర్కొనేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం సోమవారం తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. పత్తి, మినుము, పెసర, కూరగాయలు, కొన్ని ఉద్యాన పంటల్లో ఎదుగుదల మందగించడం, ఆకులు వాడిపోవడం, తేమ కొరత లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులకు పలు శాసీ్త్రయ సూచనలు అందించారు. -
పోలీసులపై న్యాయ పోరాటం
ముస్తఫా వ్యవహారంలో గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫాపై చంద్రబాబు ప్రభుత్వం మోపిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగుతున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ పొగాకు వ్యాపారితో నెలకొన్న లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అతని కుమారుడు బషీర్పై నూజివీడు పోలీసు స్టేషన్లో నమోదైన కేసుకు రాజకీయ రంగు పులిమిన ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. రూ.36 లక్షలు తీసుకుని సరుకు ఇవ్వకపోవడంతో వ్యాపారి కొడుకును సరుకుతో తీసుకొచ్చి, పెదకాకాని స్టేషన్లో అప్పగించిన ముస్తఫా తనయుడు బషీర్పై కిడ్నాప్ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ముస్తఫాతోపాటు అతని తనయుడు బషీర్పై కిడ్నాప్తో ఎస్సీ, ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ నేతపై వేధింపులు తాడికొండ సర్పంచ్గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ముస్తఫా వివాద రహితుడిగా గుంటూరు ప్రజలకు సుపరిచితుడేనని, అటువంటి ఆయనపై టీడీపీ సర్కారుకు కక్ష ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలిగా ఉన్న ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆమె గళం విన్పించకుండా చేసేందుకు ప్రభుత్వం వారి కుటుంబంపై కక్ష కట్టిందని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో నూరి ఫాతిమా ఇంటితో పాటు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారని, పెదకాకాని సీఐ నారాయణస్వామి నూరిఫాతిమా అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ పట్టుకెళ్లారని అన్నారు. ముస్తఫా ఇంట్లో గంజాయి వంటి మత్తు పదార్థాలు పెట్టే ఆలోచనతో పోలీసులు పదే, పదే సోదాలు చేశారని విమర్శించారు. పోలీసుల అతి ప్రవర్తనపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ పోలీసుల అతి ప్రవర్తనపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తున్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తుల ఫొటోలు ప్రచురించిన విధంగా వ్యాపార లావాదేవీకి సంబంధించిన కేసులో ముస్తఫా, అతని కొడుకు పరారీలో ఉన్నారని, వారిని అప్పగిస్తే బహుమతి ఇస్తామంటూ నూజివీడు పోలీసులు ఎల్లో మీడియా పత్రికలో ప్రకటనం ఇవ్వడం దారుణమన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మైనార్టీ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం వెళ్లకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని, మహిళలను, బంధువులను బెదిరించడం దుర్మార్గమని అన్నారు. పోలీసులతోపాటు తెర వెనుక ఉండి నడిపిస్తున్న పెద్దలు ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని అన్నారు. ఈనాడు పత్రిక ముస్తఫాపై ఇంత దిగజారి వార్తలు ప్రచురించడం పత్రికా లోకానికి సిగ్గు చేటన్నారు. ముస్తఫా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నేరస్తుడు కేంద్ర మంత్రి పెమ్మసాని నేరస్తుడని, అందుకే ఆయన మాట్లాడడని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ డమ్మీలని, పోలీసు యంత్రాంగం పెమ్మసాని చేతుల్లో ఉందన్నారు. పెద్ద మనిషిలా చెలామణీ అవుతూ తడి గుడ్డలతో గొంతులు కోస్తున్నారనీ, టీడీపీ గుండాలను పంపి, పోలీసులను అడ్డుకోవద్దని పెమ్మసాని చెప్పడంతోనే నా ఇల్లు, కార్యాలయాలపై ఏడు గంటలపాటు విధ్వంసం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారితోపాటు సూత్రధారులకు సంకెళ్లు వేయించే వరకు నిద్ర పోనని స్పష్టం చేశారు. తన ఇంటిపై దాడి జరిగిన రోజు సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీకి ఫోన్లు చేయలేదని పెమ్మసాని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను చేసిన ఆరోపణలు అబద్ధం అని పోలీసులు చెప్పలేదన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే షేక్ ఎండీ ముస్తఫాను సంబంధం లేని కేసులో ఇరికించి, మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి ప్రతిరోజూ స్టేషన్కు రమ్మని పిలవడం, కోర్టు ఆర్డర్ లేకుండా ఇంట్లో తనిఖీలు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, తూర్పు. పశ్చిమ నియోజకవర్గాల మైనార్టీ సెల్ అధ్యక్షులు లియాకత్ అలీ, ఖాసిం బేగ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షారుఫుద్దీన్, కార్యదర్శి ఉమర్, ఈసీ సభ్యుడు బషీద్, ఖాజావలి, పలావ్ సైదా పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంపై వన్ కే వాక్
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి సూచనల మేరకు సోమవారం వన్ కే వాక్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది కేసుల సత్వర పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా కేసులను సులభ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొ న్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి ఈ వన్ కే వాక్ నిర్వహించినట్లు తెలిపారు. వన్ కే వాక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నుంచి మెడికల్ కాలేజీ రోడ్డు, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సంస్థ కార్యాలయం వరకు సాగింది. మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వలంటీర్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్ధానంలో సహస్ర ఘటాభిషేకాన్ని సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు అర్చక స్వాములు జరిపారు. గణపతి పూజ, వరుణ జప సంకల్పం, నవగ్రహ మండపారాధన అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఘటాభిషేకం మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. గర్భాలయంలోని మూలవిరాట్ పూర్తిగా నీటమునిగే వరకు ఘటాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి నారాయణ గుంటూరు వెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలే పరమావధిగా వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సీఆర్డిఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులతో కలిసి తాడికొండ, మోతడక, కంతేరు గ్రామ రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. తాడికొండ, మోతడక గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్కు ముందుకు వచ్చారని, కంతేరు గ్రామ రైతులతో మరోసారి మాట్లాడి తెలియజేస్తామని అన్నారని వివరించారు. రైతులు కోరిన విధంగా ల్యాండ్ ఫూలింగ్కు కాలవ్యవధి నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో మూడు గ్రామాల రైతులతోపాటు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్వో ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.17 లక్షల విలువైన లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. దొండేటి ఐశ్వర్య జ్యోతి, కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసి సుమారు 108 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కాసుల హారాన్ని అందజేశారు. -
అనుభవం కలిగిన శానిటరీ ఇన్స్పెక్టర్ల బదిలీ వద్దు
జీఎంసీ ప్రజారోగ్య విభాగంలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. అనుభవజ్జులైన వారిని అదే డివిజన్లో కాకుండా వేరే డివిజన్కు బదిలీ చేస్తున్నారు. ఇది సరికాదు. ఆయా ప్రాంతాలపై పట్టు ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయకూడదు. చేస్తున్న బదిలీలను నిలిపివేసి అదే డివిజన్లో కంటిన్యూ చేయాలి. – కె.మల్లేశ్వరరావు, కార్యదర్శి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ● -
ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరి మారాలి
ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను మేం పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే ప్రస్తుతం సీ్త్ర–శక్తి పథకం ద్వారా ప్రభుత్వం ఉచిత బస్సు అవకాశాన్ని ఇస్తుంది. కేవలం 30 సీట్లు సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బస్సులతో ఇది సాధ్యంకాదు. అలా అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10,700 డీజిల్ బస్సుల స్థానంలో కనీసం 25 వేల ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకు 12వ పీఆర్సీ, డీఏలు వెంటనే ప్రకటించాలి. – ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘ జేఏిసీ నాయకులు ● -
గుంటూరు
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాగునీటి కోసం రైతుల భగీరథ యత్నం 7తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.7600, మోడల్ ధర రూ.5400 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9183 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.మాచర్ల: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం 513.10 అడుగులుగా ఉంది. తెలంగాణ లోని ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: పంటల బీమా గడువు ఈనెల 15 వరకు పొడిగించారని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం రైతులు పంట బీమా చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 15, 20 రోజులపాటు తహసీల్దార్, వ్యవసాయ అధికారులు, ఏపీఎం క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంటలకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉండే అవకాశం లేనట్లు జలవనరులు శాఖ తెలియజేసిందని, దానికనుగుణంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని సూచించారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలన్నారు. మండలాల వారీగా పంట విస్తీర్ణం వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. కౌలు రైతులకు సి.సి.ఆర్ కార్డులు జారీ చేయాలని చెప్పారు. గ్రీన్ గుంటూరులో భాగంగా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పెద్దఎత్తున మొక్కలు నాటి ఆయా ప్రదేశాలను, రహదారికి ఇరువైపుల ఆహ్లాదకరంగా తయారు చేయాలని తెలిపారు. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. వీబీ జీ రామ్ జీ కింద వేతనదారులు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న 22(ఎ) కేసులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలన్నారు. గృహ పట్టాల రెగ్యులరైజేషన్పై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన సీడ్ యాక్సస్ రహదారి ప్రారంభోత్సం జరిగే అవకాశం ఉందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్ ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేషశ్రీ, డీపీఓ బి.వి.నాగ సాయికుమార్, అధికారులు పాల్గొన్నారు. తెనాలి: సూపర్ ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఖరీఫ్ సాగు నిమిత్తం పంటకాల్వలకు నీటి విడుదల షెడ్యూలును గత మే నెలలోనే ప్రకటించింది. వరిసాగుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేశారు. సీజను ఆరంభం నుంచి వ్యవసాయశాఖ ‘పొలం పిలుస్తోంది’ షెడ్యూలును అమలుచేస్తోంది. వరి వెదజల్లాక సాగునీరు ఇవ్వలేం...వరిసాగు చేయొద్దంటూ ప్రభుత్వం ప్రకటించటం రైతులను తీవ్ర నిరాశపరచింది. పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న నీటివనరులను వినియోగిస్తూ, అవకాశం లేని అన్నదాతలు భారీ వ్యయంతో తమ పంటపొలాల్లో బోర్లు వేయిస్తున్నారు. భూగర్భజలాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు వ్యయప్రయాసలనూ లెక్కజేయటం లేదు. నీటి విడుదల లేక.. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల నుంచి తెనాలి, వేమూరు, రేపల్లె, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లాలోని కొంత ఆయకట్టు కలిపి కృష్ణా పశ్చిమడెల్టాగా వ్యవహరిస్తారు. ఇందులో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో దాదాపు 5.20 లక్షల ఆయకట్టు ఉండగా, ప్రకాశం జిల్లాలో మరో 50 వేల ఆయకట్టు ఉంది. ఈ మొత్తానికి సీతానగరం నుంచి సాగునీటిని విడుదల చేస్తుంటారు. ఈ సంవత్సరం షెడ్యూలు ప్రకారం జూలై 10వ తేదీన సాగునీటిని విడుదల చేయాల్సివుండగా, అయిదురోజులు ఆలస్యంగా 15వ తేదీన జలవనరులశాఖ మంత్రి షెడ్యూల్ విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీరు ఏమాత్రం పంటభూములకు ఎక్కే పరిస్థితి కనిపించటం లేదు. వరికి నో.. మరి ఏం చేయాలో ఎప్పటికి చెప్పేనో..! మరోవైపు ప్రభుత్వం వరిసాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతూ వస్తోంది. వరిసాగుకు సాగునీటిని ఇవ్వలేమని కూడా ఖరాకండీగా పాలకులు చెప్పేశారు. కృష్ణాడెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నీటి నిల్వలు ఉంచుకుని, అందులోంచి నీటిని ఇవ్వకపోవటాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేమంటే 2027 జూన్ నాటికి దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిల్వ చేస్తామని జలవనరులశాఖ అధికారులు చెప్పటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ డెల్టాలోని మాగాణి భూముల్లో వరిపైరు మినహా మరో పంటకు ఆస్కారం లేదని రైతులు గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యా మ్నాయ పంటలు వేసుకోమని చెబుతున్న ప్రభుత్వం, ఏయే పంటలు వేసుకోవాలి? విత్తనాలు ఎప్పుడిస్తారు? అనే అంశాలపై మాత్రం నోరు మెదపకపోవటం నివ్వెరపరుస్తోంది. పశ్చిమడెల్టాకు ఇప్పటివరకు పంటలకు అవసరమైన స్థాయిలో నీరు విడుదల కావటం లేదు. వరిసాగుకు కనీసం 6 వేల క్యూసెక్కులు ఇవ్వాల్సిన తరుణంలో ఆదివారం 2,519 క్యూసెక్కులు, సోమవారం 2,720 క్యూసెక్కులను విడుదల చేశారు. పశ్చిమడెల్టాలో ముందుగా సాగు ఆరంభించే కొల్లిపర మండల రైతులు, దాదాపు 15 వేల ఎకరాల్లో వరి వెదజల్లారు. మెట్ట భూముల్లో 1935 ఎకరాల్లో పసుపు, 1508 ఎకరాల్లో అరటి, నిమ్మ 87, మినుములు 818, కూరగాయలు 55, పండ్లసాగు 15 ఎకరాల చొప్పున ఉంది. వరితోపాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం ఆరంభించారు. గత 45 రోజుల్లోనే కొల్లిపర మండలంలో 250–300 బోర్లు వేయించి ఉంటారని అంచనా. ఈ పనిలో ఇతర జిల్లాకు చెందిన 15 మంది మేస్త్రిలు నిమగ్నమై ఉన్నారు. గతంలో 50 అడుగుల లోతులో బోర్లు వేసి నీటి ఇంజిన్ లేదా బావిలో మోటారుతో పంట చేలకు నీరు అందించేవారు. ప్రస్తుతం ఆ లోతులో నీరు అందకపోవటంతో 70 నుంచి 100 అడుగుల లోతు బోర్లు వేయిస్తున్నారు. అంత లోతునుంచి నీటిని తోడేందుకు సబ్మెర్సిబుల్ నీటి మోటార్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.లక్షన్నర వ్యయం చేస్తున్నారు. అయితే ఈ పరిణామంతో భూగర్భజలాలు తగ్గిపోవటమే కాదు. కొన్ని ప్రాంతాల్లో నీరు కూడా ఉప్పిరిసిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు పంటకాల్వలకు సాగునీటిని సక్రమంగా ఇవ్వలేదు. వెదజల్లిన వరిపైరును ఏదోలా కాపాడుకోవాల్సి ఉంది. రూ.లక్షన్నర వరకు ఖర్చుచేసి బోరు వేయిస్తున్నా. రైతులకు భారం తగ్గించటానికి ప్రభుత్వమే బోర్లు వేయించి, సబ్సిడీపై మోటారు, సామగ్రిని అందించి సహాయం చేయాలి. – మర్రెడ్డి శివసాంబిరెడ్డి, రైతు కొల్లిపర ప్రాంత రైతులు పంటపొలాల్లో బోర్లు వేయటానికి ఆసక్తి చూపుతున్నారు. గత రెండు నెలల్నుంచి బోర్లు వేయిస్తున్నారు. ఇందుకోసం 15 మంది మేసీ్త్రలం పనిచేస్తున్నాం. దాదాపు 300 కొత్త బోర్లు వేశాం. పంటను కాపాడుకోవాల్సిన రైతులకు ఇది తప్పని పరిస్థితి అయింది. – బడుగు సోమేశ్వరరావు, మేస్త్రి, మద్దూరు, కృష్ణాజిల్లా -
నిర్ణీత గడువులోపు అర్జీలకు పరిష్కారం
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో పాటు వేగవంతంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జేసీ స్పష్టం చేశారు. అనంతరం వచ్చిన 420 అర్జీలను డీఆర్ఓ షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డీపీఓ సాయి కుమార్, జిల్లా అధికారులు పరిశీలించారు. -
బంగారం చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
● రూ.6 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ పూర్ణచంద్రరావుగుంటూరు రూరల్: మహిళ చనిపోగా ఆ ఇంట్లో మృతురాలికి చెందిన నగదు చోరీ కేసులో మరోమహిళను అరెస్ట్ చేసిన ఘటన కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరంలోని సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ కాకుమాను మండలం పాండ్రపాడులో దేవిరెడ్డి సుబ్బాయమ్మ(75) అనారోగ్యంతో గత నెల 12వ తేదీన మృతి చెందారు. మృతురాలికి పెదనందిపాడు మండలం రావిపాడులో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అందరూ పాండ్రపాడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మృతురాలికి చెందిన బంగారు వస్తువులు కనిపించకపోవటంతో ఇల్లంతా వెతికారు. ఎంతకి దొరకకపోవటంతో వెంటనే మృతురాలి మనుమడు వెంకటేష్, కాకుమాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మృతురాలికి చెందిన బంగారు వస్తువులను ఆమె బంధువు పాండ్రపాడుకు చెందిన దేవిరెడ్డి నాంచారమ్మ దొంగిలించినట్లు గుర్తించారు. నిందితురాలిని ఏటుకూరు బైపాస్వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షలు విలువ చేసే బంగారు చైన్, బంగారు తాడు, ఉంగరం, మంగళసూత్రం సుమారు 57 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టుకు అప్పగించగా రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన ప్రత్తిపాడు సీఐ పీ సుబ్బారావు, ఎస్ఐ హరికృష్ణ, కానిస్టేబుల్స్ నరసింహారావు, చిరంజీవి, సంసోన్, శ్రీకాంత్, శివపార్వతిలను అభినందించి రివార్డులు అందజేశారు. -
ఏపీజీఈఏ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా రాఘవరెడ్డి
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా సమావేశం స్థానిక సూర్యకాళి ఫంక్షన్న్హాలులో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డిని ఎన్నుకోవటంతోపాటు కార్యకవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ సాయి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసిన ఏకై క సంఘం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి జి కిషోర్కుమార్, పరిశీలకులుగా జి నాగసాయి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా సిహెచ్ కిరణ్కుమార్రెడ్డి వ్యవహరించారు. 18 మందితో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కార్యదర్శి జి.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశాలను సంఘ నాయకులు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి, కార్యదర్శిగా జి రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా మారుతీప్రసాద్, ఉపాధ్యక్షులుగా జె.శ్రీలక్ష్మి, పి తులసీరామ్, కె.వి రమణమ్మ, కే జయరామిరెడ్డి, కే శ్రీనివాసరెడ్డి, సీహెచ్ జనార్దన్రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శిగా జి జ్యోతి, సంయుక్త కార్యదర్శిగా నజరీన్, ఎం శ్రీనివాసులు, బి శ్రీకాంత్రెడ్డి, పుల్లారావు, రవిచంద్ర, రోశయ్య, పి భానుప్రకాష్, కోశాధికారిగా సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అతిథులు, తోటి ఉద్యోగులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. గుంటూరు, కొత్తపేట, మల్లయ్యలింగంభవన్లో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎల్.శాంతి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సామాజిక భద్రత సౌకర్యాలు లేవని చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు వారి సమస్యలు వినడానికి కూడా ఇష్టపడడం లేదని విమర్శించారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వెలుగురి రాధా కృష్ణమూర్తి మాట్లాడారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షుడిగా ఎస్.వెంకటసుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా గుంటి వేణుగోపాల్, ఎల్.శాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమీ జాబి, డెప్యూటీ జనరల్ సెక్రెటరీ చాముండేశ్వరి, కోశాధికారి యు.మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వేదవతి, చందా మరై, సహాయ కార్యదర్శులుగా రత్న, కె.కల్పన, కుమారి జిల్లాల నుంచి ఐదు మంది చొప్పున ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య పిలుపు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● కూతురు నిశ్చితార్ధం కబుర్లు చెప్పి వస్తుండగా తండ్రి మృతి ● కోటనెమలిపురిలో విషాదం రాజుపాలెం: కూతురు నిశ్చితార్ధానికి బంధువులను పిలిచేందుకు వెళ్లి తిరిగి వస్తూ తండ్రి అనంతలోకాలకు చేరుకోవడంతో శుభకార్యం జరుపుకోవాల్సిన కుటుంబంలో విషాదం నిండింది. మండలంలోని అనుపాలెం సమీపంలో ఈ దుర్ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని కోటనెమలిపురి గ్రామానికి చెందిన ఆదిమూలం కాశియ్య (45) భార్య పూజితతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు సోమవారం నిశ్చితార్ధం కావడంతో అంచులవారిపాలెం గ్రామంలోని బంధువులను ఆహ్వానించి తిరిగి ద్విచక్ర వాహనంపై కోటనెమలిపురికి బయలుదేరాడు. మార్గంమధ్యంలో మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం సమీపంలోని కోల్డ్స్టోరేజ్ వద్ద మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారితే శుభకార్యం జరుపుకోవాల్సిన కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది. ఎస్ఐ మణికృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ఆరు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంగళగిరి మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ వర్షం కురిసింది. సగటున 2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో 12.4 మి.మీ., పెదకాకాని 5, తాడేపల్లి 3.6, తుళ్లూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. గుంటూరు ఎడ్యుకేషన్ రంగస్థలానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా బళ్లారి రాఘవ చిరస్థాయిలో నిలిచిపోతారని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చిలకలూరిపేటటౌన్: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్కు చెందిన షేక్ నాగూర్వలి(30) తాపీ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య మస్తాన్బీ చీరాల మండలం పందిళ్లపల్లి గ్రామానికి వెళ్లి రెండు రోజులు ఉండి వస్తానని భర్తకు చెప్పి శనివారం వెళ్లింది. ఆదివారం భార్య తను చెప్పినా వినకుండా వెళ్లిందని మనస్తాపం చెందిన నాగూర్వలి ఇంట్లో శ్లాబుకు ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన హుక్కు టవల్తో ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతా గమనించే లోపే మృతి చెంది ఉండటంతో నాగూర్వలి అక్క మస్తాన్బీ ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో జన విజ్ఞాన వేదిక(జేవీవీ)ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు.గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జేవీవీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి ఆగస్టు 27న, మండల స్థాయి సెప్టెంబర్ 11న, జిల్లా స్థాయి సెప్టెంబర్ 27న, నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయి సంబరాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. -
పల్నాడు జిల్లా బేస్బాల్ నూతన కార్యవర్గం
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు చిరంజీవి, సురేష్, చిన్నరామయ్య, ఎస్ఏఏపీ అబ్జర్వర్ పి.నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అబ్జర్వర్ చి.శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి రమణారెడ్డి, ముఖ్య అతిథి వై.సైదయ్య పాల్గొన్నారు. ఎన్నికల్లో పి. మణికంఠ వరప్రసాద్ రెడ్డి అధ్యక్షుడిగా, జి.వేమారెడ్డి కార్యదర్శిగా, చి.నాగేంద్రం ఖజాంచీగా, వి.అంజిరెడ్డి ఉపాధ్యక్షుడిగా, పి.కృష్ణారెడ్డి సంయుక్త కార్యదర్శిగా, వి. శివారెడ్డి, ఎ.కమలమ్మ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదం విషయంలో ఘర్షణ
తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదం దాడికి దారి తీసింది. పట్టణ ఐతానగర్కు చెందిన వల్లభాపురపు మాణిక్యరావు(రౌడీషీటర్), సుబ్బారావు రాత్రి వేళల్లో ఆటో నడుపుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్లాంపేట/ముత్తెంశెట్టిపాలేనికి బాడుగ రాగా వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కబేళా వంతెన మార్గంలో అప్పుతే నరసరావుపేట నుంచి వచ్చి కారుకు కవర్ వేస్తున్న సుల్తాన్(రౌడీషీటర్)ను ఢీకొట్టారు. ముందుకు పడిన సుల్తాన్ ముక్కుకు తీవ్ర గాయమైంది. ఆటోను ఆపకుండ వెళ్లిపోవడంతో సుల్తాన్, అతడి మిత్రులు, బంధువులు బైక్లపై వెంబడించారు. ఐతానగర్లో ఆటోను అడ్డగించి మాణిక్యరావు, సుబ్బారావులపై కర్రలు, రాడ్డులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుండి మాణిక్యరావును గుంటూరు వైద్యశాలకు పంపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్స్టేషన్లో మాణిక్యరావుపై సెక్షన్ 279 కింద ఆదివారం రాత్రి కేసు నమోదైంది. అలానే సుల్తాన్, మరి కొందరిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా మాణిక్యరావు, సుబ్బారావు మద్యం తాగి ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుంటూరు ఎడ్యుకేషన్: సమాజానికి వినోదాత్మకంగా మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో అమీర్ లోగ్ చిత్ర బృందం చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గోరంట్లలోని భాష్యం టెన్త్ క్యాంపస్ థియేటర్లో అమీర్ లోగ్ చిత్రంలోని కాసుల కళ గీతాన్ని భాష్యం రామకృష్ణ ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు రమణారెడ్డికి ఒక ఆర్కిటెక్చర్గా భాష్యం విద్యాసంస్థలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆయనలోని సృజనాత్మకతను వెలికితీస్తూ చిత్రాన్ని నిర్మించడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని, సీని రంగంలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, కో–ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి, సంగీత దర్శకులు స్మరణ్ సాయి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, డీఓపీ ఎస్వీకే, గీత రచయిత మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించిన రవీంద్ర రెడ్డి ప్రత్తిపాడు: క్యారమ్స్ పోటీల్లో ప్రత్తిపాడు కుర్రాడు సత్తా చాటాడు. నెల్లూరులో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఏపీ 1వ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ – 2026 రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఏపీ క్యారమ్స్ అసోసియేషన్, జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్వహించిన చాంపియన్ షిప్ పోటీల్లో ప్రత్తిపాడుకు చెందిన క్యారమ్స్ ప్లేయర్ బాపతు రవీంద్ర రెడ్డి గుంటూరు జిల్లా నుంచి పాల్గొని ఉత్తమ ఆటతీరును కనబరిచాడు. రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించాడు. అసోసియేషన్ ప్రతినిధులు రవీంద్ర రెడ్డికి ట్రోఫీ, సర్టిఫికెట్ అందజేశారు. గతంలోనూ రవీంద్ర రెడ్డి అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు సాధించాడు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు క్యారమ్స్ ఆటగాళ్లు, యువత, గ్రామస్తులు రవీంద్ర రెడ్డికి అభినందనలు తెలిపారు. నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను పది మండలాల్లో 77.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆదివారం సంబంధిత అధికారులు వెల్లడించారు. రెంటచింతల 3.6 మి.మీ, గురజాల 9.8, దాచేపల్లి 1.6, నరసరావుపేట, మాచవరం మండలాల్లో 1.8 చొప్పున, అచ్చంపేట 15.2, క్రోసూరు 2.6, అమరావతి 12.8, పెదకూరపాడు 22.0, రాజుపాలెం 2.2, ముప్పాళ్ల 4.2, మీ.మీ. వర్షం కురిసింది. -
దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్
● ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా లోపం ● సోషల్ మీడియాలో పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఆలయ అధికారులు ఆదివారం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 7న గుంటూరుకు చెందిన ఓ యువతి రాజగోపురం ఎదుట డ్యాన్స్ చేసింది. సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వ్యవహారం ఆలయ అధికారుల దృష్టికి ఆదివారం రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి సోషల్ మీడియాలో ఈ ఒక్క వీడియోనే కాకుండా గతంలోనూ అనేక సార్లు ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం లోపల కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దుర్గగుడిలో వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆలయ భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశం లేదని దేవస్థానం పదే పదే ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముగిసిన టైప్ రైటింగ్ పరీక్షలు
రేపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న టైప్రైటింగ్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఎగ్జామినేషన్ చీప్ సూపరింటెండెంట్ కే.మల్లికార్జునరావు మాట్లాడుతూ శని, ఆదివారాలలో జరిగిన పరీక్షకు నూరువాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు. రెండవ రోజు పరీక్షకు ఇంగ్లీష్ జూనియర్ గ్రేడ్కు ఏడు, లోయర్ గ్రేడ్కు 16, హయ్యర్ గ్రేడ్కు ఏడు, తెలుగు హయ్యర్కి ఇరువురు మొత్తం 32 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మార్టూరు: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై కోలలపూడి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. హైవే అంబులెన్సు సిబ్బంది నాయక్, స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. కోలలపూడికి చెందిన యార్లగడ్డ ఆదెమ్మ(70) ముప్పవరం నుంచి కోలలపూడి కూడలి వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లడం కోసం రహదారి దాటుతోంది. ఈ క్రమంలో అదే మార్గంలో కోలలపూడి వైపు వెళ్తున్న ఆటో ఆదెమ్మను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఆదెమ్మను హైవే అంబులెన్స్ సిబ్బంది నాయక్ మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదెమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆదెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆదెమ్మకు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ను స్థానికులు పోలీసులకు పట్టించినట్లు సమాచారం. వేటపాలెం: బైక్ పై వెనుక కూర్చొన్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేటపాలెం–చీరాల రోడ్డులో ఆమోదగిరిపట్నం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేటపాలెం మార్కెట్ సెంటర్ వద్ద గోలి గోపి(36) నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పి తన పక్కింటి అతని సహాయంతో మోటార్ బైక్ పై చీరాల హాస్పిటల్కి వెళుతున్నాడు. ఆమోద గిరిపట్నం వద్దకు వెళ్లే సరికి బైక్ వెనుక వైపు కూర్చునొని ఉన్న గోపీకి ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి కింద పడి పోయాడు. బైక్ ఆపి చూడగా గోపీ మృతి చెంది ఉన్నాడు. బైక్ వెనకూర్చుని ఉన్న సమయంలో ఫిట్స్ రావడంతో కింద పడి మృతి చెందాడని భావిస్తున్నారు. గోపీ వేటపాలెం సెంటర్లో కర్రీ పాయింట్ నిర్వహిస్తుంటాడు. భార్య, ఒక కూతురు ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై పి.జనార్దన్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాడు. -
మనసారె అర్పించి..
భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రగిరి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. ఆలయానికి చేరుకునే కుమ్మరి పాలెం, బ్రాహ్మణ వీధి, కెనాల్రోడ్డు, ప్రకాశం బ్యారేజీ ఇలా ఏ రోడ్డు చూసినా అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలే దర్శనమిచ్చాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు కుటుంబ సమేతంగా తరలి రావడం కనిపించింది. 8 గంటలకే క్యూలైన్లు కిటకిట.. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సారె సంబరాలు రాత్రి 9 గంటల వరకు ఏకధాటిన కొనసాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామునే నగరానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో దుర్గాఘాట్ భక్తులతో కిటకిటలాడింది. దుర్గగుడి ఈవో శీనానాయక్ దుర్గాఘాట్, కేశఖండనశాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటలకే భక్తుల వాహనాలతో హెడ్ వాటర్ వర్క్స్, సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం, పది గంటల నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. అన్ని క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. మహామండపం మొదటి అంతస్తుకు క్యూ.. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో అటు ఘాట్రోడ్డులోని క్యూలైన్లు ఓం టర్నింగ్ వరకు కిటకిటలాడాయి. ఇక మహామండపం 7వ అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడం విశేషం. గతంలో భక్తుల క్యూ లైన్ మహా మండపం మొదటి అంతస్తుకు చేరిన సందర్భాలు లేవని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అటు ఘాట్రోడ్డు, ఇటు మహా మండపం మొదటి అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడంతో భక్తులు అమ్మవారి పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడం కనిపించింది. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి పాత మెట్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాత మెట్లపై వచ్చిన వారికి గాలిగోపురం మెట్ల మార్గం ద్వారా స్కానింగ్ పాయింట్కు మళ్లించారు. -
పత్తిపైనా సన్నగిల్లిన రైతుల ఆశలు
నాదెండ్ల: ఖరీఫ్ సీజన్లో పత్తి సాగుపైనా రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనాలు వెలువడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్ధితులు, వేసవిని తలపించేలా ఎండలు, వడగాల్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయంలో వర్షాలు సకాలంలో కురవటంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా వాతావరణం ఉండనుండటంతో సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. గణపవరం గ్రామానికి చెందిన రైతు తొండెపు వెంకటేశ్వర్లు రెండు ఎకరాలతోపాటు ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. రెండు నెలల క్రితం కురిసిన వర్షానికి విత్తనాలు నాటారు. అప్పటి నుంచి వర్షాలు లేకపోవటంతో పత్తి మొక్కలు అరకొరగా మొలిచాయి. అడుగు మేర పెరిగి గిడసబారిపోయాయి. వాస్తవానికి ఈ సమయానికి పూత, పిందె దశకు రావాల్సి ఉంది. భిన్నమైన వాతావరణంతో పత్తి సాగుకు అనుకూలంగా లేదని భావించి ఒక సాలును నేలలో దున్ని వీటి స్థానంలో కంది విత్తనాలు ఎదబెట్టారు. పత్తిపై ఆశలు వదులుకున్న రైతు కందితోనైనా నష్టం తప్పుతుందని ఆశిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలామంది పత్తి రైతుల పరిస్థితి ఇలాగే ఉండటంతో వాపోతున్నారు. -
శివాలయంలో శాకంబరి ఉత్సవాలు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. అంతరాలయం, ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద పండ్లు, ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో తీర్చిదిద్దారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, అర్చకులు, వేదపండితులు శాకంబరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారుతాలయంలోని విఘ్నేశ్వరుణ్ణి, నందీశ్వరుడిని, ప్రసన్నాంజనేయస్వామి వారిని, భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని కూడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో చక్కగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో కళకళలాడింది. ఆలయానికి తరలి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, పాలకవర్గం సభ్యులు పెదకాకాని ప్రధాన సెంటర్ నుంచి ఆషాఢ సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కదంబ ప్రసాదం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు పేటేటి ధన మహేశ్వరప్రసాద్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సోమవారం కూడా అమ్మవారు భక్తులకు శాకంబరీదేవిగానే దర్శనమిస్తారని డీసీ తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు. -
ఐ–టీడీపీ పోస్టులు సిగ్గుచేటు
గుంటూరు ఎడ్యుకేషన్: సభ్య సమాజం తలదించుకునేలా ఐ–టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై పోలీసులు దృష్టి సారించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు చేసే పోస్టులపై మాత్రం అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కారణంగా గుంటూరులో రాజకీయ వైషమ్యాలు పెరిగాయని వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆయన ప్రోద్బలంతో గత జనవరి 31వ తేదీన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు. ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు పెట్రోలు బాంబులు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడైన అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేశారని విమర్శించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని అంబటి రాంబాబు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. అయితే, పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన వెంటనే మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, చట్టబద్ధంగానే పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర ఎస్సీ విభాగ అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్, నగర లీగల్ సెల్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జి. ప్రభు, లీగల్ సెల్ అధ్యక్షుడు వేణు, విద్యార్థి విభాగ అధ్యక్షుడు భాను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి కోటేశ్వరరావు, నాయకులు షర్ఫుద్దీన్, సుబ్బారావు, బత్తుల వెంకట్రావు, టీవీఎల్ పవన్, ఆటో మురళి తదితరులు పాల్గొన్నారు. -
అభయ ప్రదాయినిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళా ముఖి అమ్మవారు ఆదివారం అభయప్రదాయిని అలంకరణలో పూజలు అందుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా చందోలు, కుంచలవారిపాలేనికి చెందిన భక్తులు పొంగళ్లు చేసుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సారె, ఇతర నైవేద్యాలు సమర్పించారు. అమరావతి: అమరావతి గ్రామ దేవత పెద్దింటమ్మకు ఆషాఢ మాసం బోనాలను ఆదివారం సమర్పించారు. ఆదివారం ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం, అనంతరం వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవి అలంకారం చే శారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గ్రామంలోని భక్తులు పొంగళ్లు చేసుకుని మేళాతాళాలతో ఊరేగింపుగా పెద్దింటమ్మ గుడికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు తీర్థ్ధప్రసాదాలు అందజేశారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు లీగల్: బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని ఆఫీసర్ క్లబ్లో జరిగిన పురుష న్యాయవాదుల షటిల్ డబుల్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. విన్నర్గా జె.మాధవరావు–సుదర్శన్, రన్నర్గా బి.ప్రభాకర్ వర్మ–జి.శ్రీనివాస్ జోడీ నిలిచారు. గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు డ్రా తీసి పోటీలు తొలుత ప్రారంభించారు. స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు పర్యవేక్షించారు. రాయపూడి శ్రీను, షేక్ సుభాని, పాలపర్తి అనిల్, మైలా జాన్ జాబేజ్, బండ్ల కృష్ణ, కొప్పుల కిరణ్, సతీష్ సహకారం అందించారు. దుర్గమ్మకు కానుకగా బంగారు వస్తువులు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన కె. సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. రూ. 2.50 లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు తదితరులు అమ్మవారి చిత్రపటం,ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు. -
వందకు పైగా భక్తి బృందాలు
ఆదివారం రికార్డు స్థాయిలో వందకు పైగా భక్తి బృందాలు, సుమారు 35వేల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసోత్సవాలలో ఇంత భారీ స్థాయిలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా రద్దీనే కనిపించింది. మహామండపం, రాజగోపురం, లక్ష్మీ గణపతి ప్రాంగణం, ఘాట్రోడ్డు ఇలా ఎక్కడ చూసినా బృందాలు, బృందాలుగా భక్తులు కనిపించారు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. వెస్ట్ ఎసీపీ దుర్గారావు, వన్టౌన్ సీఐ గుణారామ్ స్కానింగ్ పాయింట్లో రద్దీని పర్యవేక్షించి ఆలయ సిబ్బందితో పాటు పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. -
మహనీయులు
పింగళి, బళ్లారి గుంటూరు వెస్ట్: పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవలు దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులు అని, వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం, వారు సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకోవడం ఆనందదాయకమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రంగస్థల కళాకారుడు బళ్లారి రాఘవ జయంతి కార్యక్రమం ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవ చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున గర్వంగా ఎగురవేస్తున్న భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య భారతదేశానికి చిరస్మరణీయమైన సేవ చేసిన మహనీయులని కొనియాడారు. కళారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన బళ్లారి రాఘవ నటనా వైభవం గొప్పదని చెప్పారు. క్రిమినల్ లాయర్ గాను ఆయన సేవలకు బ్రిటీష్ ప్రభుత్వ ప్రశంసలు కూడా పొందారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ పి.వి.ఎన్.సత్యనారాయణ, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.10 అడుగులకు చేరింది. ఇది 136.9932 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
డాక్టర్ మోహనరావుకు అంతర్జాతీయ గుర్తింపు
గుంటూరుమెడికల్: గుంటూరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ రావాస్ హాస్పిటల్– ఇంటర్నేషనల్ ఇనిన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ వ్యవస్థాపకులు, గుంటూరుకు చెందిన ప్రముఖ చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మోహనరావు పాటిబండ్ల ఒకే సదస్సులో మూడు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. చైన్నెలో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక శస్త్రచికిత్స సదస్సులో మూడు అవార్డులు అందుకున్నట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్న 2026 సదస్సులో డాక్టర్ రావు పరిశోధనకు విశేష గుర్తింపు లభించినట్లు తెలిపారు. డాక్టర్ రావు చేసిన పరిశోధన క్లిష్టమైన మెదడు– మెడ ఎముకల సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత సురక్షితమైన, తక్కువ గాయాలతో చేసే శస్త్రచికిత్స విధానంపై ఆధారపడిందన్నారు. వైద్య నిపుణులు ఈ పరిశోధనను వినూత్న, శాసీ్త్రయ ప్రమాణాలు, రోగులకు ఉపయోగపడే సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రతి పరిశోధన వెనుక ఒక రోగి ఉంటాడని, ప్రతి క్లిష్టమైన కేసు మనకు కొత్త పాఠం నేర్పుతుందని చెప్పారు. ఆ అనుభవాన్ని పరిశోధనగా మార్చి ప్రపంచ వైద్య సమాజంతో పంచుకోవడమే వైద్యుల లక్ష్యం అని తెలిపారు. ఈ గుర్తింపు మొత్తం వైద్య బృందానికి దక్కిన గౌరవం అన్నారు. వైద్య రంగంలో ఇలాంటి శాసీ్త్రయ అవార్డులు వ్యక్తిగత గుర్తింపునకే కాకుండా, ఆ పరిశోధన భవిష్యత్లో రోగుల చికిత్సకు ఉపయోగపడే అవకాశాన్ని కూడా సూచిస్తాయని అభిప్రాయపడ్డారు. -
పంటల బీమా గడువు పెంపు
కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంట మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకూ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 31వ తేదీతో ముగిసిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజులపాటు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయశాఖ దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు బీమా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరి పంటలకు యథావిధిగా ఆగస్టు 15వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు ఉందని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, రైతులు వీలైనంత త్వరగా బీమా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. తాడేపల్లి రూరల్: చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ అధ్యక్షుడు అశోక్సింగ్ జాదోన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గుహలను ఆయన శనివారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా ఉండవల్లి గుహలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని అశోక్సింగ్ జాదోన్ పేర్కొన్నారు. రెండవ అంతస్తులో శయనిస్తున్న అనంత పద్మనాభస్వామి విగ్రహం అత్యంత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉండవల్లి గుహలను సందర్శించిన వారిలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, పరిషత్ సంయుక్త కార్యదర్శి గొల్ల మాల్యాద్రి తదితరులు ఉన్నారు. నరసరావుపేట ఈస్ట్: శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాసంస్థల గుంటూరు విభాగ్ స్థాయిలో రెండు రోజులపాటు నిర్వహించిన ఖేల్ కూద్ పోటీలు శనివారం ముగిశాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని శిశుమందిర్ పాఠశాలల నుంచి దాదాపు 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్తోపాటు వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో గుంటూరు విభాగ్ కార్యదర్శి సి.హెచ్.గోపీకృష్ణ, పాఠశాల కార్యదర్శి కొత్త రాము, పాఠశాల సమితి అధ్యక్షుడు మిరియాల నాగప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొని విజేతలను అభినందించారు. తాడికొండ: ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో కలిసి శనివారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఆస్ట్రేలియా బృందం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, వారు అమరావతి అభివృద్ధి ప్రణాళికలను తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో భవిష్యత్ సహకార అవకాశాలపై సీఆర్డీఏ అధికారులతో ఆస్ట్రేలియా బృందం చర్చలు జరిపింది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్రెడ్డి బృంద సభ్యులకు వివరించారు. -
పశ్చిమ డెల్టాకు సాగు నీరు ఇవ్వాల్సిందే
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజనులో వరి సాగుకు నీరు ఇచ్చి తీరాల్సిందేనని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. లేకుంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమ డెల్టాకు సాగునీటి సాధన కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు డెల్టా పరిరక్షణ సమితిగా ఏర్పాటయ్యారు. శనివారం మధ్యాహ్నం స్థానిక వార్ఫ్ రోడ్డులోని జలవనరుల శాఖ పశ్చిమ డెల్టా ఈఈ కార్యాలయానికి వెళ్లారు. వరి సాగుకు నీరు విడుదల చేయకపోవడం, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెప్పడంపై జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య ప్రశ్నించారు. సబ్సిడీ విత్తనాలు రైతులకు పంపిణీ చేసి, వాటిని చేలల్లో వెదజల్లి పైరు పెరుగుతున్న దశలో నీరు ఇవ్వలేమని చెప్పటం అర్థరహితంగా పేర్కొన్నారు. పులిచింతల రిజర్వాయరు నుంచి గత మే నెలలో 10 టీఎంసీల నీటిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈఈ ఎస్.సుధాకర్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ వేసవిలో అనవసరంగా నీటిని వృథా చేశారని విమర్శించారు. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నుంచి ఖరీఫ్కు సాగునీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు సమాధానంగా ఈఈ మాట్లాడుతూ ఆ నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు నిల్వచేసి, తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని చెప్పటంతో నాయకులు మండిపడ్డారు. ఇప్పుడు పంటల అవసరానికి నీరివ్వకుండా ఏడాదిపాటు నిల్వ చేయటం ఏమిటని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోంది అధికారులేనని అయితానగర్ రైతుసంఘం నాయకుడు ఈదర పూర్ణచంద్ ఆరోపించారు. కృష్ణానదికి వరద ఆరంభమైందని, గోదావరి నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని చెబుతూ ఈ సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాగునీరు ఇవ్వలేమని చెప్పటం బాధ్యతారాహిత్యమని పూర్ణచంద్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికై నా పులిచింతల, పట్టిసీమ నుంచి అవసరమైన మేరకు సాగు నీటిని విడుదల చేయాలని కోరారు. ఏటా జూలై 15వ తేదీకల్లా డెల్టా కాల్వలకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని, పులిచింతలలో జూలై 15వరకు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చూడాలని, పట్టిసీమ కాల్వ సామర్థ్యం పెంచాలని, ప్రకాశం బ్యారేజి ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద బ్యారేజీ నిర్మించాలని, ప్రకాశం బ్యారేజీ ఎగువ పూడిక తీయాలని, దిగువను చెక్ డ్యామ్లు నిర్మించి సముద్రపు నీరు చొచ్చుకురాకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మారౌతు సీతారామయ్య, మైనేని రత్నప్రసాద్, ఈదర పూర్ణచంద్, డాక్టర్ చందు సాంబశివుడు, కొల్లిపర బాబుప్రసాద్, చెరుకుమల్లి సింగారావు, చవ్వాకుల రాఘవరావు, కేవీ సత్యనారాయణ, జె.శంకరరావు, పొన్నూరు నాగసూర్య శశిధరరావు, ఇ.వెంకటేశ్వరరావు, పి.స్టీవెన్ బాబు, కె.కోటేశ్వరరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పంచాయతీ అధికారిపై జేసీ విచారణ
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయికుమార్, పంచాయతీ సెక్రటరీ రాంకుమార్లపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ విచారణ చేపట్టారు. బీవీ నాగసాయికుమార్, పంచాయతీ సెక్రటరీ రాంకుమార్లు జేసీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. బాధితులు దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొందలపాటి శివనాగేశ్వరరావు (80), ఆయన భార్య అంజని సామ్రాజ్యం ఇచ్చిన లిఖతపూర్వక ఫిర్యాదుపై పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టామని జేసీ తెలిపారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ గతంలో తన ఇంటి ముందు ఉన్న మెట్లను మాయమాటలు చెప్పి తొలగించడంలో డీపీఓ నాగసాయి కుమార్, మాజీ పంచాయతీ సెక్రటరీ రామ్కుమార్ (ప్రస్తుతం డిప్యూటీ ఎంపీడీఓ తెనాలి)ల పాత్ర ఉందన్నారు. ఆ తర్వాత వాటిని పునర్నిర్మించడానికి తమ నుంచి లంచం డిమాండ్ చేశారన్నారు. దీంతోపాటు డీపీఓ తన వద్ద తుపాకీ లైసెన్స్ ఉందని ఏమైనా చేయగలని బెదిరించారన్నారు. 16 ఇళ్లలో తమ ఇంటిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడానికి కారణం కేవలం వారడిగిన లంచాలు ఇవ్వలేదనే కక్షతోనేనన్నారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా వృద్ధులమనే కనికరం కూడా లేకుండా దారుణంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ నిష్పక్షపాత విచారణ చేపట్టి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రత్తిపాడు: ఆటో ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబరు హైవే దిగి సర్వీస్ రోడ్డులో నడిచి నడిచి వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని అటువైపుగా వెళ్తున్న ఆటో బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 ఏళ్లు ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలిసిన వారు ప్రత్తిపాడు పోలీసులకు లేదా 8688831386 నంబరును సంప్రదించాలని ఎస్ఐ ఎన్.నరహరి కోరారు. ముగ్గురికి తీవ్ర గాయాలు ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలేనికి చెందిన గుళ్లపల్లి ఏసుబాబు, సతీష్ శనివారం రాత్రి బైక్పై గుంటూరు నుంచి కోయవారిపాలెం వస్తూ స్థానిక ప్రైవేట్ వెంచర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగారు. అదే సమయంలో పెదనందిపాడుకు చెందిన గొలస సురేష్బాబు మరో వ్యక్తితో కలిసి టూవీలర్పై గుంటూరు నుంచి ప్రత్తిపాడు వైపు వెళుతున్నాడు. ఆగి ఉన్న టూవీలర్ను సురేష్బాబు వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఏసుబాబు, సతీష్ గాయాలపాలవ్వగా, సురేష్బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 గుంటూరు జీజీహెచ్కు తరలించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్లలోని కీలక రైల్వేస్టేషన్లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. స్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ డీఆర్ఎంతో కలసి రాయనపాడులో జరుగుతున్న ఆర్ఓబీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. గంగినేని స్టేషన్ను ఆయన క్షుణంగా తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎర్రుపాలెం స్టేషన్లో యార్డు ప్రణాళిక, ప్రతిపాదిత నంబూరు కొత్త లైన్ల పనులను అధికారులతో సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాక్, స్టేషన్ అలైన్మెంట్ను పరిశీలించారు. భవిష్యత్తు సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని మంచి ప్రణాళికలతో పనులు పూర్తిచేయాలని సూచించారు. అక్కడ నుంచి మధిర స్టేషన్ను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని అంచనా వేసి పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. జీఎంను కలసిన ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ విజయవాడ డివిజన్ పర్యటన సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ కమిటీ నేతలు శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలసి సత్కరించారు. అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షుడు బి.వి.నాయక్ డివిజన్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రం సమర్పించారు. -
వైభవంగా విజ్ఞాన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
చేబ్రోలు: సాంకేతిక పరిజ్ఞానం అపార అవకాశాలను అందిస్తున్నప్పటికీ, అదే సమయంలో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదాన్ని కూడా తెచ్చిందని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఆర్.వెంకటరమణి హెచ్చరించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 14వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే సామర్థ్యం యువతకు అత్యవసరమని అన్నారు. ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను వివిధ రంగాలలో కృషి చేసిన హైదరాబాద్లోని నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్ నన్నపనేని, గ్రీన్కో ఫౌండర్, ప్రెసిడెంట్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 2,599 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీటితోపాటు 63 విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. పరిశోధనలు సమాజానికి మేలు చేసేలా.. నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్ నన్నపనేని మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించారు. ఆరోగ్య రక్షణ రంగానికి సాంకేతికత తోడైతే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చన్నారు. యువత నిరంతర పరిశోధనలపై దృష్టి సారించాలని కోరారు. నాట్కో సంస్థ ప్రస్థానం ఈ ప్రాంతం నుంచే, వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు సాధించిన మార్కులు, రాసిన పరీక్షలు కేవలం ప్రాథమిక జ్ఞానాన్ని అందించే మార్గాలు మాత్రమేనని, అవి మాత్రమే భవిష్యత్ను నిర్ణయించలేవని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఎనర్జీలో భాగస్వామ్యం.. గ్రీన్కో వ్యవస్థాపకులు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రక్రియలో భారతదేశం కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా, ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయికి చేరిందని వివరించారు. పర్యావరణహిత స్వచ్ఛ ఇంధనం, నిరంతర శక్తి నిల్వ దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో స్పష్టమైన విజన్, సరికొత్త సాంకేతికతలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. భారతదేశానికి ఉన్న విస్తారమైన వనరులు, సాంకేతిక నైపుణ్యం దేశాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ లీడర్గా నిలబెడతాయన్నారు. బంగారు పతకాల విజేతలు వీరే.. స్నాతకోత్సవం సందర్భంగా ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ప్రతిష్టాత్మక చైర్మన్స్ గోల్డ్ మెడల్– పరుచూరు తరుణ్( ఏఐ అండ్ ఎంఎల్), ఎండోమెంట్ అవార్డులు– చల్లగుల్ల తేజ అమృత సాయి, భవ్యశ్రీ ముప్పాళ్ల, కె.కార్తికేయ, బెస్ట్ లీడర్ అవార్డు– హరిదాసు సాహితి, బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ – చాగం రాఘవి, మేజర్ తీగవరపు శ్రీతేజ భరద్వాజ్ మెమోరియల్ అవార్డ్– నాగ సంహిత, బెస్ట్ ఎన్ఎస్ఎస్– సోషల్ ఎంగేజ్మెంట్ వలంటీర్– బి.నాగ ప్రీతిక రెడ్డి, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ హాస్టల్స్– కె.సాయి సత్యకృష్ణ, ముత్యాలంపల్లి ప్రణీత, ఎగ్జంప్లరీ స్టూడెంట్ అవార్డు– వి.శ్రీసాయి హిమజ తులసి తదితరులకు బంగారు పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్లర్ పావులూరి సుబ్బారావు, సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి, వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు. -
నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఈ పార్కు
గుంటూరు వెస్ట్: ప్రతి నియోజకవర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి.) సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజకవర్గాలలో భూములను గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క మోడల్లో ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా ఎగుమతుల ప్రణాళిక ప్రతిపాదించామని పేర్కొన్నారు. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. డి.ఐ.ఇ.పి.సి. సమావేశంలో 11 ఎం.ఎస్.ఎం.ఇ. సంస్థలకు పెట్టుబడి, వడ్డీ, విద్యుత్, సాంకేతిక అప్గ్రేడేషన్ కింద రూ.1.53 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపారు. జూలై 4 నుంచి 30వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్లో అందిన 55 దరఖాస్తులలో 24 దరఖాస్తులకు నిర్దేశిత సమయంలో ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనంతదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
ఒక్కటైనా పెంఛనూ లేదు!
● రెండేళ్లలో కొత్త పింఛన్ ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం ● దరఖాస్తులు ఇవ్వాలంటూ ప్రకటనలతో సరి ● ప్రతి నెలా అడ్డగోలు కారణాలతో లబ్ధిదారుల తొలగింపు నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోలేదని అర్హులు చెబుతున్నారు. కుటుంబానికి ఆధారం కోల్పోయిన అనేక మంది వితంతువులు రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ వస్తే కనీసం మందుల ఖర్చులకై నా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుందని వారు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో భేష్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసేవారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి, అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అందించేవారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలకు భర్త మరణిస్తే తదుపరి నెల నుంచే వితంతు పింఛన్ మంజూరు చేసేవారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల వ్యవధిలోనే మంజూరు అయ్యేది. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందించేవారు. ప్రతి నెల మొదటి తేదీ తెల్లవారుజామునే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. నెలలోనే 2,981 తగ్గింపు జిల్లా వ్యాప్తంగా ఒక్క నెలలోనే 2,981 పింఛన్లు తగ్గాయి. జూలైలో 2,51,771 పింఛన్లు ఉండగా, ఆగస్టు నాటికి అవి 2,48,790కు చేరాయి. అధికారులను ప్రశ్నిస్తే, మరణాలు తదితర కారణాలతో తొలగించాల్సి వస్తోందన్నారని స్థానికులు చెబుతున్నారు. కొత్తవి మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను వివిధ కారణాలతో తొలగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలను నిరాశపరుస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు కాలేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటికే ఉన్న పింఛన్లలోనూ కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026దర్శనం పేరుతో వసూళ్ల దందాదివ్యాంగ చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి ● టీటీడీ బ్రేక్ దర్శనాల పేరుతో టీడీపీ నేతల భారీ దోపిడీ ● నకిలీ సిఫార్సు లేఖలతో భక్తులను దగా చేసిన జనసేన నేత ● గుంటూరు మిర్చి వ్యాపారుల నుంచి రూ. 4.22 లక్షలు వసూలు ● గురజాల, వినుకొండ నియోజకవర్గాలలో భక్తులకు టోకరా సాక్షి ప్రతినిధి, గుంటూరు: వీఐపీ దర్శనాలు, సుప్రభాత సేవలకు అవకాశం ఇప్పిస్తామంటూ నకిలీ సిఫార్సు లేఖలతో భక్తులను కూటమి నేతలు నిండా ముంచేస్తున్నారు. దేవుళ్లంటే భయం కూడా లేకుండా వారు ధనార్జనే ధ్యేయంగా టీటీడీ లేఖలను సైతం అమ్ముకుంటున్న దుర్మార్గపు ఘటనలు జిల్లాలో అనేకం వెలుగుచూస్తున్నాయి. వీరిని పట్టుకుని దందా వెనుక ఉన్న ముఠాను అరెస్టు చేసి, అసలు సూత్రధారులను బయటకు లాగాల్సిన పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఏం చేసినా చూసీచూడనట్లు మిన్నకుండటం పోలీసులకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన 26 మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన పాపిశెట్టి శ్రీనివాసరావు అనే టీడీపీ నాయకుడు సేవా టిక్కెట్లతో పాటు రూములు కూడా సమకూరుస్తానంటూ సుమారు రూ.60 వేలు వసూలు చేశాడు. తీరా దర్శనం సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. గ్రామస్తులు సిఫార్సు లేఖలను టీటీడీ సిబ్బందికి చూపించగా, అవి నకిలీవని నిర్ధారించారు. దీంతో చేసేదేమీ లేక ఉచిత దర్శనం చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ ఎన్నారై నుంచి కూడా ఇతను రూ.26 వేలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్తులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. టీడీపీ నాయకుడు కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారని ఆరోపిస్తున్నారు. ● గుంటూరు నగరానికి చెందిన సుమారు 67 మంది మిర్చి వ్యాపారులు గత నెలలో తిరుమల వెళ్లి దర్శనం చేసుకునేందుకు సిఫార్సు లేఖల కోసం ప్రయత్నించారు. నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి టీటీడీ ఉద్యోగులతో విస్తృత పరిచయాలు ఉన్నాయని వారిని నమ్మించాడు. సుప్రభాత సేవ దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.4.22 లక్షలు కాజేశాడు. భక్తులు గత నెల 22న తిరుమల చేరుకున్నారు. సిఫార్సు లేఖలు పెడతానంటూ డబ్బులు తీసుకున్న నిమ్మల శ్రీనివాస్ కొద్దిసేపు మాట్లాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులకు అనుమానం వచ్చింది. అతను ఇచ్చిన లేఖలను టీటీడీ అధికారులకు చూపించగా, అవి నకిలీవని తేలింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల సూచన మేరకు తిరుమల–2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడిని పట్టుకుని నకిలీ సిఫార్సు లేఖలపై లోతుగా దర్యాప్తు జరపకుండా వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాపారులంతా గుంటూరుకు చెందినవారు కావడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లగా... తిరుపతిలో ఇప్పటికే కేసు నమోదు అయినందున ఇక్కడ మరో కేసు పెట్టలేమని పోలీసులు తెలిపారు. నిందితుడు జనసేన నాయకుడు కావడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● గురజాల కేంద్రంగా టీడీపీ నేతల సిఫార్సు లేఖలు ఇప్పిస్తానంటూ భక్తుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న వైనం ఆలస్యంగా బయటపడింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని, దీని వెనుక టీడీపీ ముఖ్య నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ దందా వెనుక ఉన్న పెద్దల పాత్రను వెలికితీయలేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పలు మార్లు విమర్శలు గుప్పించినా ప్రభుత్వం నుంచి స్పందించకపోవడం గమనార్హం. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. కూటమి నేతలు తమ అక్రమ దందాకు దేవుళ్లను సైతం వాడుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వినుకొండ నియోజకవర్గంలోనూ టీటీడీ దర్శనాల పేరుతో టోకరా వేశారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల అఖిలపక్ష నేతల డిమాండ్ అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.99 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. అక్రమాలకు, అవినీతికి అలవాటు పడిన కూటమి నేతలు అందుకు దేవుడిని సైతం వదలడం లేదు. టీటీడీ వీఐపీ దర్శనాల పేరుతో భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి వారిని ముంచారు. గుంటూరు జిల్లాలోనూ కూటమి నేతలు దర్శనాల దందా కొనసాగిస్తూ భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. పల్నాడు జిల్లా గురజాల, వినుకొండలో ఇదే దందా కొనసాగుతోంది. -
జిల్లాలో 2.37 లక్షల ఓట్లు రద్దు
నెహ్రూనగర్: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) షెడ్యూల్లో భాగంగా నిర్వహించిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ పబ్లికేషన్)ను శుక్రవారం జిల్లా అధికారులు విడుదల చేశారు. గత నెల 24వ తేదీతో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,02,074 ఓటర్లు ఉండగా, ఆబ్సెంట్, పర్మినెంట్ షిఫ్టింగ్, మరణాలు (ఏఎస్డీ) తదితర కారణాలతో 2,37,513 ఓట్లు తొలగించినట్లు మొదట అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. అయితే జూలై 31న విడుదల చేసిన తాజా డ్రాఫ్ట్ పబ్లికేషన్లో గల్లంతైన ఓట్ల సంఖ్య 2,37,556గా పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 15,64,518 ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై 24న విడుదల చేసిన వివరాలకు, జూలై 31న విడుదల చేసిన ముసాయిదా జాబితాకు మధ్య ప్రతి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ఓట్ల వ్యత్యాసం కనిపించడంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ప్రతిపక్షాలకు చెందిన ఓట్ల తొలగింపు జరుగుతోందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే 1,08,311 ఓట్లు గల్లంతు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 59,334 ఓట్లు తొలగించబడినట్లు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో వెల్లడించారు. అనంతరం గుంటూరు తూర్పులో 48,977, ప్రత్తిపాడులో 34,420, మంగళగిరిలో 26,989, తెనాలిలో 26,182, పొన్నూరులో 24,022, తాడికొండలో 17,632 ఓట్లు గల్లంతైనట్లు పేర్కొన్నారు. గుంటూరు నగర పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,08,311 ఓట్లు తొలగించబడటం గమనార్హం. ఈ ఓట్లలో ఎక్కువ భాగం డబుల్ ఓట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి కావచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 31,744 డబుల్ ఓట్లు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. -
నిరుద్యోగులకు అన్యాయం చేస్తే సహించం
గుంటూరు వెస్ట్: కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాసిన ప్రతిభావంతులైన అభ్యర్థులను పక్కనపెట్టి, అక్రమ మార్గంలో తనకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై శుక్రవారం గుంటూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, అసెంబ్లీ పరిశీలకుడు నిమ్మరాజు నారాయణ, మదన్ మోహన్ గౌడ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కుమ్మరి–శాలివాహన కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మండేపూడి పురుషోత్తం, రాష్ట్ర పంచాయతీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మేకతోటి వీరయ్య, రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్–3 అధ్యక్షుడు వంగా సీతారామిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు నేలటూరి సుందరరావు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, నగర అధ్యక్షుడు యాదాల చిన్న, నగర ఉపాధ్యక్షుడు ఎం. శివశంకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, ఆర్ఎంబీ మాజీ డైరెక్టర్ పిల్లి మేరి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పి. కవిత, ఎస్సీ సెల్ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు జి. ప్రభు, ఎస్ఈసీ సభ్యులు నున్నా సునీత, స్వర్ణలత, తాడిబోయిన వేణుగోపాల్, దానం వినోద్, వెంకటేశ్వరరెడ్డి, బుల్ల మేరీ కుమారి, రజియా, యపత్రి కోటి తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలు రాసి మోసపోయిన నిరుద్యోగుల బాధను చూసి కూడా చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్తో వెంటనే రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు, యువతకు అన్యాయం జరిగితే వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. యువత ఆగ్రహానికి గురికాకముందే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వినుకొండ స్టేషన్లో రైల్వే జీఎం పరిశీలన
వినుకొండ: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్, గుంటూరు డీఆర్ఎం. సుదేష్ణసేన్లు శుక్రవారం వినుకొండ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పార్కు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సిబ్బంది 16 క్వార్టర్ల సముదాయాన్ని జీఎం ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్కే రాజకుమార్, ఈఈ తపన్ కుమార్ సింహ, అధికారులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయల పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన ఎంసీఏ, హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంసీఏలో 737 మంది పరీక్షలకు హాజరు కాగా, 724 మంది ... హార్టికల్చర్ కోర్సులో 16 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు.నరసరావుపేట: జాతీయ రహదారి (ఎన్హెచ్–167ఏ)కి సంబంధించిన 58 మధ్యవర్తిత్వ కేసులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం కలెక్టరేట్లో విచారణ చేపట్టారు. పలువురు రైతులు భూసేకరణ, పరిహారానికి సంబంధించిన అంశాలపై తమ న్యాయవాదులతో వచ్చి సమస్యలు వినిపించారు. కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కోర్టు భవనాల కోసం స్థల సేకరణ రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారులు బాలకృష్ణ, మురళీకృష్ణ, గోపాలకృష్ణలతోపాటు తహసీల్దార్లతో వీసీ నిర్వహించారు. స్థల సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుంటూరులీగల్: పిల్లలకు తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే మంచి క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పించాలని జువైనైల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ మైలాబత్తుల శోభారాణి సూచించారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు గురువారం గుంటూరు మహిళా ప్రాంగణంలో జువైనైల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో బాల బాలికలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి శోభారాణి మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపించాలన్నారు. వారి ఆలోచనలు, ప్రవర్తన, స్నేహాలు, విద్యాభ్యాసంపై తగిన పర్యవేక్షణ కలిగి ఉంటే వారు మంచి మార్గంలో ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలిపారు. సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం ప్రతినిధులు, జువైనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బాలల రక్షణ, హక్కులు, భవిష్యత్తు అభివృద్ధి, పునరావాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల బాలికల తల్లిదండ్రులు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట: పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా చుక్కా రత్న మన్మోహన్ నియమితులయ్యారు. బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయన్ను పల్నాడు జిల్లాకు డీఎంహెచ్ఓగా ఇన్చార్జిగా నియమిస్తూ శుక్రవారం ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. గత నాలుగేళ్ల నుంచి డీఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ బి.రవి పదవీ విరమణ చేయటంతో ఈ మేరకు నియామకం అవసరమైంది. -
నిద్రమత్తులోనే ఈగల్..!
చంద్రబాబు చెప్పేవన్నీ ఫలితం లేని మాటలే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆయన తన ధోరణి ఏనాడూ మార్చుకోలేదు. దీనికి మరో నిదర్శనంగా ఈగల్ టీం పనితీరు ఉంది. రాష్ట్రంలో ఈగల్ పేరుతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను గతంలో ఏర్పాటు చేశారు. అయితే పేలవమైన పనితీరుతో అది కాస్తా చేతులెత్తేసింది. దీంతో జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. విద్యార్థులు, యువత మత్తులో చిత్తవుతూ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. వారి ప్రవర్తనతో కన్నవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.పట్నంబజారు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ‘ఎలైట్ యాంటీ – నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్)ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మత్తు పదార్థాలను ఎక్కడ ఉన్నా పట్టేస్తామని, నిందితులకు చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలికారు పాలకులు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకొంటూ ఇన్నాళ్లు కాలం గడిపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈగల్ తన మార్క్ చూపలేకపోతోంది. ఇవిగో నిదర్శనాలు.... గత రెండు రోజుల వ్యవధిలో పాతగుంటూరు, కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, గోవా, పాడేరు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకుని వస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గోవా నుంచి మత్తు బిళ్లలు అధికంగా దిగుమతి అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తన కుమార్తె డ్రగ్స్కు బానిసగా మారిందని.. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవటం లేదని గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ తల్లి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పరిస్థితికి అద్దం పట్టింది. దీంతో డ్రగ్స్ సరఫరా కళాశాలల వరకు ఉందని మరోమారు స్పష్టం అయ్యింది. మంగళదాస్నగర్కు చెందిన ఒక పదో తరగతి విద్యార్థినిని మత్తు పదార్థాలైన గంజాయి, ఇతరత్రా వాటికి అలవాటు చేసి ఆమైపె ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి వదిలేశారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పోలీసు అధికారులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరుగా జిల్లా స్థాయి అధికారులే పలు సందర్భాల్లో స్పష్టంగా కొన్ని కళాశాలల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పిన పరిస్థితులున్నాయి. ఇదే కాకుండా గోవా ఇతర ప్రాంతాల నుంచి పలు రకాల మత్తుబిళ్లలు, ఇంజెక్షన్లు తీసుకుని వస్తూ పట్టుబడుతున్నారు. దీనిని అరికట్టడటంలో ఈగల్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా కళాశాలల వద్దే గంజాయి, ఎండీఎంఏ, క్రిస్టల్ వంటివి విద్యార్థులకు అందుతున్నా ఎక్కడ నుంచి వస్తున్నాయనే స్పష్టత ఇప్పటికీ అధికారులకు రాలేదు. నిఘా బలోపేతమే మార్గం జిల్లాకో నార్కోటిక్ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఇది ఎక్కడ ఉందో చెప్పనే లేదు. పైగా ఈగల్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు హామీకు అతీగతీ లేదు. ఇప్పటివరకు ఏం చర్యలు చేపట్టారన్నది ప్రశ్నార్థకం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మాదకద్రవ్యాల వినియోగంపై నిఘా ఉంచి, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పౌరులను ఇందులో బాధ్యులుగా చేస్తూ గంజాయి విక్రయాలు, ఉపయోగాలపై రహస్యంగా సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును కాపాడాలని పేర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ‘ఈగల్’ను తీసుకొచ్చింది. గంజాయి స్మగ్లింగ్, మత్తు పదార్థాల వినియోగం, మత్తెక్కించే రసాయనాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడికి ప్రతి జిల్లాలో ఈగల్ పని చేయనున్నట్లు పేర్కొంది. మత్తుపదార్థాలు ఎక్కడైనా ఉపయోగించినా, స్మగ్లింగ్ చేసినా సమాచారం ఇవ్వడానికి 1972 అనే టోల్ ఫ్రీ నంబర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని నియమించింది. అయితే ఈగల్ గట్టి కేసును ఛేదించింది లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆయా స్టేషన్ పరిధిలో పట్టుకున్న మత్తు పదార్థాలకు సంబంధించి ఈగల్ సభ్యులు కూడా ఉన్నట్లు చెప్పుకోవటం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. ఈగల్ అనేది కేవలం ర్యాలీలు.. అవగాహన సదస్సులు.. ఫొటోల సెషన్లకు మాత్రమే పరిమితం అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఈగల్ బృందం ఏర్పాటైంది. దీనికి ఓ ఎస్ఐతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్న్ పరిధిలోనైనా ఈగల్ బృందం మాదకద్రవ్యాలపై దాడులు చేయవచ్చు. అయితే గతంలో విక్రయాలు జరిపిన వారు, సేవించిన వారిని పట్టుకుని చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయిని సైతం పాడేరు, గోవా, ఒడిశా ప్రాంతాల నుంచి నేరుగానే తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈగల్ ఏర్పాటయ్యాక జిల్లాలో పెద్దగా ఎక్కడా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. సొంతంగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసిన దాఖాలలే లేవు. అసలు ఈగల్ బృందంలోని సిబ్బందికి కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం. మెలకువలు, నిందితుల డేటా విశ్లేషణ, ఆర్థిక లావాదేవీలపై కనీస పరిజ్ఞానం కూడా లేనట్టు తెలుస్తోంది. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బందికి 30 శాతం అలవెన్సు సౌకర్యం కల్పించడంతో కేవలం ఆరుగురికే పరిమితం చేశారనే వాదనలు ఉన్నాయి. -
బాధలు పట్టవా.. బాబూ!
ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పారదర్శకంగా, సులభతర పాలన అందించడంలో నిర్లక్ష్యం చూపుతోంది. కనీస బాధ్యతల నుంచి తప్పుకుని ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసతుల కొరత వేధిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కాసుల రాబడిపైనే పూర్తి దృష్టి పెట్టింది.గుంటూరు వెస్ట్: ఉమ్మడి జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో గుంటూరు, తెనాలి, మంగళగిరి తదితర 8 మాత్రమే ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది రూ.కోట్ల అద్దె చెల్లిస్తున్నారు. వీటి ద్వారా సుమారు రూ. 1,500 కోట్లు ఆదాయం వస్తున్నా సొంత భవనాల ఏర్పాటుకు మాత్రం ప్రయత్నించడం లేదు. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జూలై 1, 1872న ప్రారంభమైంది. ఇప్పటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది. అంటే సుమారు 150 ఏళ్లుగా అదే ప్రదేశంలో ఒకే కార్యాలయం కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కొందరు దాతలు సొంత ఖర్చుతో కొన్ని ఎస్ఆర్ఓ కార్యాలయాలను బాగు చేయించారు. రోజురోజుకూ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నా, ఆ స్థాయిలో ఎస్ఆర్ఓలు సరిపోవడం లేదు. ఇరుకు సందుల్లో కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కొరత రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఖజానాకు రూ.కోట్లు సమకూరుతున్నా, కార్యాలయాల్లో కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కూర్చునేందుకు కుర్చీలు కూడా చాలా కార్యాలయాల్లో లేవు. గుంటూరు ఎస్ఆర్ఓ కార్యాలయంలో వర్షం వస్తే చాలు పైకప్పు కారిపోతోంది. దస్తావేజులు తడవకుండా పట్టలు కప్పుతున్నారంటే నమ్మాల్సిందే. అధికారులు కూడా అద్దె భవనాల యజమానులకు ఈ విషయాన్ని చెప్పడం లేదు. గతంలో కొందరు జిల్లా అధికారులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వంతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు వివరించినా, వారు పెడచెవిన పెట్టారు. ఇక కార్యాలయాల్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు కూడా ఎప్పటివో. ఇది సరిపోదన్నట్లు ప్రభుత్వం ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు) పేరుతో జీవో నంబర్ 396 విడుదల చేసి, పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోంది. వసతుల ఏర్పాటు కోసం ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశాం. రూ. వందల కోట్లు ఆదాయం వస్తోంది. అందులో ఒక్క శాతం అయినా ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తే ఎంతో బాగుంటుంది. 150 ఏళ్లుగా ఒకే కార్యాలయం ఉండటం గమనార్హం. – బత్తుల దాసు, గుంటూరు నిత్యం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. నల్లపాడు, కొరిటెపాడు వంటి కొన్ని కార్యాలయాలు మరీ ఇరుకుగా ఉన్నాయి. టూ వీలర్ పార్కింగ్కు కూడా అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి కనీస వసతులు కల్పించాలి. – భాస్కరరావు, గుంటూరు -
● నేటితో ముగియనున్న పంటల బీమా పథకం గడువు ● జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన మినుములు, పప్పులు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో కూడిన సాగు విధానాల వైపు రైతులు మళ్లాలని ఆయన కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడటంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. భూసారం , నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పంటల సాగులో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వాతావరణ సమాచారం, పంటల ఎంపిక, పంట బీమా తదితర అంశాలపై సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు సిద్ధమన్నారు. జిల్లాలో పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు బీమా పథకంలో చేరాలని సూచించారు. ఈ పంటల బీమాకు గడువు నేటితో ముగుస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 4 వేల హెక్టార్లకు సంబంధించి రైతులు బీమా చేయించారని చెప్పారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్రబాబు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా అరికట్టడం సామాజిక బాధ్యత మానవ అక్రమ రవాణా అత్యంత దారుణమైన అంశమని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. షాడోస్, వెట్టి చాకిరి విమోచన కోయిలేషన్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పోస్టర్ గురువారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ విడుదల చేశారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రి దేవి, షాడోస్, వెట్టి చాకిరి విమోచన కోయిలేషన్ సంస్థ ప్రతినిధులు ఎ.రాజ సాల్మన్, భాగ్యలక్ష్మి, అలేఖ్య, పావని, డీబీఆర్సీ సురేష్ పాల్గొన్నారు. దాచేపల్లి: ఇంటి తాళం పగలగొట్టిన దుండగుడు బుధవారం అర్ధరాత్రి 294 గ్రాముల బంగారం చోరీ చేశారు. బాధితుల కథనం ప్రకారం... దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురానికి చెందిన స్వామి శ్రీనివాసరావు బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటికి రంగులు వేయించేందుకు దాచేపల్లిలో ఉన్న మరో ఇంటిలోకి సామగ్రి సర్దుతున్నారు. బుధవారం రాత్రి వరకు కొన్ని సర్దుకుని ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం నారాయణపురంలోని ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టినట్లుగా గుర్తించారు. బీరువాల తాళాలు కూడా ధ్వంసమై కనిపించాయి. వాటిలో భద్రపరచిన 294 గ్రాముల బంగారాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. -
పంట బీమా కోసం పాట్లు
వరి కాకుండా ఇతర పంటలు వేయాలి కొరిటెపాడు (గుంటూరు): వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాల ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే దశకు చేరుకుంది. శుక్రవారం వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. అసలే ఎల్నినో పరిస్థితులు ఉండటం, సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జీవనాడిగా భావిస్తున్న ఉద్యాన పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉండటంతో రోజురోజుకూ టెన్షన్ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం బీమా కింద పరిహారం ఇవ్వకపోయినా.. ఈసారి ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, మొదట్లోనే కరువు కబళించే పరిస్థితులు ఉండటంతో బీమాపై ఆశలు వదులుకోకుండా ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. ప్రీమియం కోసం అవస్థలు బీమా పథకాల కింద నోటిఫై చేసిన ఐదు రకాల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరి, పండు మిరప, మినుము పంటలు ఉండగా.. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, అరటి పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెల 31వ తేదీలోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వ్యవసాయశాఖ, ఆర్ఎస్కేలు, బ్యాంకులు, మీ–సేవ, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) చుట్టూ రైతులు పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన పంటలు కలిపి 3,369.71 హెక్టార్లలో సాగు చేస్తున్న 457 మంది రైతులు ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న ఈ ఒక్క రోజులో ఎంతమంది చెల్లిస్తారో వేచి చూడాలి. మరో వారం, పది రోజులు గడువు పొడిగిస్తే కానీ రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపాటు ఖరీఫ్ ప్రారంభమైన 40 రోజుల తర్వాత ప్రభుత్వం బీమా పథకాల నోటిఫికేషన్ విడుదల చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అప్పటికే బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ సుమారు 90 శాతం పూర్తికావడంతో.. 60 నుంచి 70 శాతం మంది రైతులు పత్తి, వరి పంటల కింద రుణాలు తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేశారు. అయితే వర్షాభావం, ఇతర కారణాల వల్ల పత్తి పంట సాగు విస్తీర్ణం కేవలం 6,800 హెక్టార్లకు పడిపోయింది. పత్తి పంట కింద రుణం తీసుకుని ప్రీమియం చెల్లించినట్లు నమోదు చేసుకున్న రైతులు పొలంలో పత్తి సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదు కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పంట మార్పిడి చేయించుకుని.. సాగు చేసిన లేదా సాగు చేయబోతున్న పంటకు ప్రీమియం చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు. -
ప్రభుత్వంపై పోరుబాట
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెగా డీఎస్సీ స్కాంపై జూలై 31 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సమష్టిగా నిర్ణయించారు. గురువారం గుంటూరు నగరంలో సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరసన కార్యక్రమాలపై చర్చించారు. శుక్రవారం డీఎస్సీ స్కాంపై జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ సదస్సులు, ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహారదీక్షలు, 10న నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ విడుదల చేసిన షెడ్యూల్కు అనుగుణంగా సన్నద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగులను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పోరాటం మాజీ ఉప సభాపతి, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేయని పోలీసులు.. అంబటిపైనే కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్కు నిత్యం వినతులు వస్తున్నాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజులు, నిరుద్యోగ భృతిపై ప్రజలను మేల్కొలుపుతామన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. బాధితుడినే జైల్లో పెట్టారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధితుడైన అంబటి రాంబాబును జైల్లో పెట్టారని, దాడికి పాల్పడిన వారిని వదిలేశారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 10 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోకేష్ రాజీనామా చేయాలి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాల కారణంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకై తే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే, డీఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్ చేయాలన్నారు. నిరుద్యోగభృతి పేరుతో మోసగించారని, ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రూ. 75 వేలు బకాయి పడ్డారని అన్నారు. ఆ పరిస్థితులే ఏపీలో రానున్నాయి గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ ఢిల్లీలో పరిస్థితులు ఏపీలో రానున్నాయని, పోలీసులకు చట్టం అంటే లెక్కలేదు, కోర్టులు అంటే భయం లేదన్నారు. వమాజీ మంత్రి అంబటిపై జరిగిన దాడిలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి దాడిలో దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి నీచ రాజకీయాలు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో నీచమైన రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై అధికార పార్టీ నాయకులే దాడికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. విద్యార్థులకు రూ.11 వేల కోట్లకుపైగా ఫీజు బకాయిలు ఉంటే, తాజాగా రూ. 600 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ముస్తఫా అక్రమ కేసు మోపారన్నారు. జగన్ పాలనలో పారదర్శకత తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో లక్షలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ చేసినా అవినీతికి అస్కారం ఇవ్వలేదన్నారు. డీఎస్సీలో లోకేష్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. అంబటి ఇంటిపై దాడి, విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు లేవన్నారు. విద్యార్థులకు, యువతకు అన్యాయం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు లేనప్పుడు సామాన్యులకు దిక్కేదని అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు పెట్టారని, కాజా టోల్ప్లాజా సీసీ ఫుటేజ్ చూస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి, పత్తిపాడు, వేమూరు, రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లి సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్, వరికూటి అశోక్బాబు, పీటా నాగమోహనకృష్ణ బొల్లా బ్రహ్మనాయుడు, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షుడు గౌతంరెడ్డి, అసెంబ్లీ పరిశీలకులు నల్లమోతు రూత్రాణి, కాకుమాను సదాశివారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మదన్మోహన్ గౌడ్, నూతలపాటి హనుమయ్య, బాసు లింగారెడ్డి, చిట్టా విజయభాస్కర్రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, గుత్తికొండ అంజిరెడ్డ, వై.మురళీధర్రెడ్డి, పడాల శివారెడ్డి, గడ్డేటి సురేంద్ర, మోపిదేవి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసి, బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్ మాట తడబడకుండా 10 సార్లు డీఎస్సీ అంటే తాము చర్చ నుంచి తప్పుకొంటామన్నారు. టీడీపీలోని దిగువ శ్రేణి నాయకులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఒక్కటే దిక్కు అన్న చంద్రబాబులో వైఎ్స్ జగన్ బాటలో మావిగన్ బెస్ట్ అనే విధంగా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఆటవిక చర్యలతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
కోటప్పకొండలో 3న ఘటాభిషేకం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్ట్ 3వ తేదీ ఘటాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమరావతిని గురువారం తైవాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. తహసీల్దార్ డానియేల్ పర్యవేక్షణలో చైన్నెలోని తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ స్టీఫెన్ హ్సు, డైరెక్టర్ డెన్నిస్ త్సాయ్, డిప్యూటీ డైరెక్టర్ ఎరిక్ చావోలు అమరావతి పురావస్తు మ్యూజియం, అమరావతి స్తూపాన్ని తిలకించారు. అనంతరం ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తైవాన్ ప్రతినిధులకు అమరావతి మెడిటేషన్ టెంపుల్ ప్రతినిధి ధర్మానంద.. ధ్యానబుద్ధ ప్రాజెక్టు విశిష్టతను, అమరావతి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అనంతరం ధ్యానబుద్ధ ప్రాజెక్టులో బుద్ధునికి పూజలు నిర్వహించారు. బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధ్యానబుద్ధ విగ్రహాన్ని తిలకించిన స్టీఫెన్ హ్సు ప్రత్యేకంగా ఫొటోలు దిగడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక వైభవం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. చారిత్రక విశేషాలను తైవాన్ దేశస్థులు తెలుసుకునేలా కృషి జరగాలన్నారు. ఇండియా, తైవాన్ల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్శనలో వారి వెంట పురావస్తు శాఖ అధికారులు సూర్యప్రకాశ్, నాగేంద్ర కుమార్, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, ఎంపీడీవో శివపార్వతి, ఏపీటీడీసీ అమరావతి యూనిట్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో కె.దివ్య, రెండవ స్థానంలో ఎస్.తేజస్విని నిలిచారు. మహిళల క్యారమ్స్ సింగిల్స్ విభాగంలో మొదటి స్థానంలో కె.దివ్య, రెండవ స్థానంలో పి.కళ్యాణి, విజేతలుగా నిలిచారు. గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదిర నాగేశ్వరరావు విజేతలను అభినందించారు. క్రీడా పోటీలు మహిళా న్యాయవాదుల్లో ఐక్యత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పల హనుమంతరావు ఈసీ మెంబెర్ రాయపూడి శ్రీను, ట్రెజరర్ ఆకుల సుజాత, ఈసీ మెంబర్స్ ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో జూన్ 2026న జరిగిన రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎ. వెంకటేశ్వర్లు గురువారం పేర్కొన్నారు. బీ ఫార్మసీ పరీక్షలకు 1,591 మంది హాజరు కాగా 1,518 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 187 మందికిగాను 133 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ నాల్గవ సెమిస్టర్కు 52 మందికిగాను 51 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఏ ఇంటెగ్రేటెడ్ పబ్లిక్ పాలసీ ఆరవ సెమిస్టర్, ఎంఏ ఎకనామిక్స్ 4వ సెమిస్టర్, సోషియాలజీ 4వ సెమిస్టర్, మాస్ట్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 4వ సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్కు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారీ చేపట్టాలి
గుంటూరు వెస్ట్: పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాజేష్ కుమార్ సింగ్, రోహిత్ కుమార్, స్వతంత్ర కుమార్ మీనా, మల్లికార్జున్ రెడ్డిలతో కలసి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఈఆర్ఓల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకునే వారి అర్హతను సంబంధిత ధ్రువపత్రాల ఆధారంగా పరిశీలించాలని చెప్పారు. ఎలాంటి సందేహాలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచురణ, అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ సాయికుమార్, ఈఆర్ఓ లు, జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి గుంటూరు వెస్ట్: రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను, అధికారులకు కేటాయించాల్సిన బాధ్యతలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వసూళ్ల రోగం.. ఫిర్యాదుల పర్వం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొంతమంది ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తున్నా, సాక్షాత్తూ జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదులు వెళ్లినా, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రి ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ ఆస్పత్రి పరువును బజారున పడేస్తున్నారు. మామూళ్ల మత్తులో... కార్యాలయ ఉద్యోగుల్లో కొంతమంది మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారు. సదరు ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కేవలం సీట్ల మార్పులతోనే సరిపెట్టేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై ఆస్పత్రి అధికారులు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో వారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేయడమే తప్ప, కఠిన చర్యలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు అవినీతికి పాల్పడుతున్న కొంతమందిపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆస్పత్రి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొంతమంది కార్యాలయంలోనే కూర్చొబెట్టి పంచాయితీలు పెడుతున్నారు. ఉద్యోగులు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని ఫైళ్లు క్లియర్ చేశారు, ఏవి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటికి కారణాలేమిటి, త్వరగా క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తనిఖీలు కూడా చేయడం లేదు. తమ గదుల్లోనే కూర్చుండిపోవడంతో పరిపాలన కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. పాలన కుంటుపడుతోంది. అవినీతి వాటాల పంపకాల్లో తేడాల రావడం వల్లే సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి క్రమశిక్షణ పెంచి, సకాలంలో ఫైళ్లు క్లియర్ అయ్యేలా చూడటంతోపాటు అవినీతిని నిర్మూలించాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ జీరో జెడ్ 0456 నంబరు గల బస్సు విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండ మీదుగా నరసరావుపేటకు చేరింది. అందులో బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన బోయిన ఆదాము (55) ప్రయాణిస్తూ మృతి చెందాడు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల గమనించి విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికు తెలియజేశారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిలకలూరిపేటలో అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియమ్మను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఆరోగ్య పరిస్థితిపై బంధువులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. -
వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు
గుంటూరు ఎడ్యుకేషన్ : వైఎస్సార్ సీపీకి చెందిన గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్పై నూజివీడు పోలీసుస్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా పొగాకు వ్యాపారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కొయ్యలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రరావుతో లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగా రూ.36 లక్షల విలువైన పొగాకు కొనుగోలుకు డబ్బు చెల్లించిన ముస్తఫాకు సూర్యచంద్రరావు సరుకు పంపలేదని చెప్పారు. కొయ్యలగూడెం వెళ్లిన ముస్తఫా తనయుడు బషీర్కి లారీల్లో వేరొకరికి సరకు పంపుతున్నారని తెలిసిందన్నారు. ఆ లారీలను తీసుకువచ్చి పెదకాకాని పోలీసుస్టేషన్లో అప్పగించారని, వ్యాపారి కుమారుడిని కూడా తీసుకొచ్చి అప్పగించారని చెప్పారు. వ్యాపారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. బాధితులపైనే తప్పుడు కేసులు ఎమ్మెల్యే ముస్తఫా, బషీర్లు సూర్యచంద్రరావు కుమారుడిని కిడ్నాప్ చేశారని నూజివీడులో తప్పుడు కేసు పెట్టారని అంబటి చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ ఇవ్వలేదన్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశానికి రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం అంటూ, ఆయన కుమారుడు కిడ్నాప్కు పాల్పడ్డారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉన్న ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ఈ రాజకీయ దాడిని ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ పరంగా ముస్తఫాకు అండగా ఉంటామన్నారు. స్థాయిని దిగజార్చుకున్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారంలో చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారని అంబటి పేర్కొన్నారు. సిద్ధాంతాలు లేని చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలవచ్చని, తన పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న ఆ సామాజికవర్గం వారితో మాట్లాడడం మాత్రం నచ్చటం లేదన్నారు. -
వ్యాపారవేత్త అవయవదానం
చిరంజీవిగా నిలిచిన చంద్ర తిరుపంరెడ్డి గుంటూరు మెడికల్: అవయవదానంతో నలుగురి జీవితాల్లో వెలుగు నింపిన ప్రముఖ వ్యాపారవేత్త 57 సంవత్సరాల చంద్ర తిరుపంరెడ్డి. మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం వలన పలువురు రోగులకు కొత్త జీవితం లభించినట్లయింది. ఈనెల 23న బ్రెయిన్ స్ట్రోక్కు గురైన చంద్ర తిరుపం రెడ్డిని విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు తరలించారు. నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈనెల 28న వైద్యులు ఆయనను బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆ సమయంలో జీవన్ దాన్ కోఆర్డినేటర్లు అవయవ దానం ప్రాముఖ్యతను తిరుపంరెడ్డి కుటుంబ సభ్యులకు వివరించారు. తీవ్ర విషాదంలోనూ తిరుపంరెడ్డి భార్య జయలక్ష్మి, కుమారుడు అఖిల్ రెడ్డి, కుమార్తె చంద్ర సౌజన్య మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ అవయవ దానానికి అంగీకరించారు. ఆయన దానం చేసిన రెండు కంటి కార్నియాలు ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్కు, ఒక మూత్రపిండం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరుకు, మరో మూత్రపిండం సన్రైజ్ హాస్పిటల్స్ విజయవాడకు, కాలేయం కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరుకు కేటాయించి పంపించారు. అవయవాల మార్పిడి ద్వారా పలువురు రోగులకు కొత్త జీవితం లభించనుంది. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్ బాబు మాట్లాడుతూ, ‘అవయవ దానం అనేది ఒక వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం పోసే అత్యున్నత మానవతా సేవ’ అని పేర్కొన్నారు. -
గుంటూరు
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 513.10 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: ఈ ఏడాది వర్షాకాలం ఆశించినంతగా అనుకూలించకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగునీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన మేర ప్రవాహాలు లేకపోవడం వల్ల సాగునీటి నిర్వహణ సవాల్గా మారింది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, మిగిలిన నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. రైతులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు మేలు సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటిలభ్యత లేని ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా డెల్టా రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజనులో వరిసాగు చేయొద్దని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సూచించింది. అవకాశం ఉన్నచోట ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. తెనాలిలోని పశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కమిటీ సమావేశం జరిగింది. కమిటీ వైస్ చైర్మన్ నువ్వుల సునీల్చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ) పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణానదిపై గల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని గుర్తుచేశారు. ఎగువ ప్రాజెక్టులైన ఆల్మటి, నారాయణపూర్, జూరాలలో ఇంకా 50 టీఎంసీల మేర ఖాళీ ఉందన్నారు. పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నప్పటికీ 2027 జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం ఆ నీటిని నిల్వ చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరిలోనూ నీటి ప్రవాహం తగ్గిందన్నారు. పట్టిసీమకు గల 24 పంపుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని అందించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. గోదావరి జలాలు మరో 60–70 రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశమున్నందున తొలి ప్రాధాన్యత గోదావరి ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంటుందని వెంకటరత్నం చెప్పారు. ప్రస్తుతం కృష్ణాడెల్టాకు వదులుతున్న నీటిని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని 60 లక్షల మందికిపైగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పోలవరం కుడికాలువ పరిధిలోని కొన్నిచోట్ల రైతులు అనధికార పంపులతో నీటిని తరలిస్తుండటంతో కృష్ణా డెల్టాకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో నీటి ప్రాజెక్టులకు సమృద్ధిగా నీరు వస్తే ఖరీఫ్పై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు వ్యవసాయ, జలవనరుల శాఖలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితిని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. కాగా, వర్షాభావ పరిస్థితులపై రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో చంద్రబాబు సర్కారు తొలి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయడంతోపాటు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికల రూపకల్పన, అమలు విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ద్రవ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి కేంద్రాలపై శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ద్రవ వ్యర్థాలు, మలమూత్ర శుద్ధి కేంద్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రే వాటర్ మేనేజ్మెంట్, ద్రవ వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సమర్థ నిర్వహణ ద్వారా గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయికుమార్, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు. -
బెదిరించి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితుల అరెస్టు
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం యరబ్రాలెం గ్రామంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని అనంతరం బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన ఉదయ్ బెహరా యరబ్రాలెం పారిశ్రామికవాడ లో అల్యుమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను సోషల్ మీడియాలో పోలో గే అనే డేటింగ్ యాప్ ద్వారా విజయవాడ కు చెందిన మహంకాళి కిషోర్, పచ్చిగోళ్ళ మోషే, పల్లేటి క్రాంతికుమార్లతో పరిచయం పెంచుకున్నారు. ఈ ముగ్గురు జూలై 26 అర్ధరాత్రి యరబ్రాలెంలోని ఉదయ్ బెహరా గదికి వెళ్లి బెదిరింపులకు పాల్పడి ఫోన్న్ పే ద్వారా రూ.90 వేలు, మరో బాధితుడి నుంచి రూ.800 బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తించి జూలై 28న అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం విజయవాడ నగరానికి చేరుకుంది. బందరురోడ్డు పీవీపీ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న మట్టా భాను ప్రకాష్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన సత్యనాగ కుమారి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తాడేపల్లి మున్సిపల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనాగకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కారెంపూడి: చారిత్రక ప్రసిద్ధి చెందిన మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సింగరుట్ల క్షేత్రంలో కొలువై ఉన్న స్వయంభు శ్రీనారసింహాస్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.2 కోట్లు సీజీఎఫ్ నిధులు విడుదలైనట్లు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త గుండాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంటు కింద రూ. 20 లక్షలు జమ చేయాల్సి ఉందన్నారు. మ్యాచింగ్ గ్రాంటు మొత్తం జమ కాగానే సీజీఎఫ్ నిధులు దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. నెల రోజుల గడువు లోగా మ్యాచింగ్ గ్రాంటు జమ చేయాల్సి ఉందన్నారు. రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో బుధవారం ఓ ఆవుకి రెండు దూడలకు (కవలలు) జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని సింగు వెంకయ్యకు చెందిన ఆవు రెండు కోడె దూడలకు జన్మనిచ్చింది. రెండుసంవత్సరాలకిందట ఈ ఆవుకు ఒక కోడెదూడ జన్మించగా ప్రస్తుతం కవలలకు జన్మనిచ్చినట్లు వెంకయ్య తెలిపారు. ఆవుకు రెండు దూడలు జన్మించిన విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. ఆవు గర్భంలో పిండం అడ్డం తిరగడంతో వైద్యసేవలు అందించినట్లు పశువైద్యులు నాగార్జున తెలిపారు. పశువులలో కవలలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుందని ఆయన తెలిపారు. -
వింటే ఓకే.. లేకుంటే వేటే!
గుంటూరు వెస్ట్: సాఫీగా సాగిపోతున్న పనులను చెడగొట్టడంలో చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటే. ఈ–స్టాంపులను సరఫరా చేసే స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఒంటెత్తు పోకడల కారణంగా జిల్లాలో ఈ–స్టాంపుల కృత్రిమ కొరత ఏర్పడింది. తాము చెప్పినట్లు వ్యాపారం చేయకపోతే స్టాంప్ వెండార్ల లైసెన్స్లు తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ కంపెనీపై రాష్ట్రవ్యాప్తంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. దీంతో ఇటీవల ఈ–స్టాంపుల విక్రయాలు మందగించాయి. అయితే ఈ కంపెనీ ఈ–స్టాంప్ వెండార్లకు కొత్త నిబంధనలు విధించింది. డీఎస్డీ (డెఫిసిట్ ఈ–స్టాంప్ డ్యూటీ) అంటే రిజిస్ట్రేషన్ ఫీజులు, సర్వీస్ చార్జీలు వంటి వాటిని పెద్ద మొత్తంలో చెల్లిస్తేనే వెండార్లకు ఈ–స్టాంప్ పేపర్ల స్టేషనరీ సరఫరా చేస్తామని తెలిపింది. దీంతో వెండార్లు ఇది తమ పని కాదని, వచ్చిన వారికి మాత్రమే ఈ–స్టాంపులు విక్రయిస్తామని చెప్పడంతో ఆగ్రహించిన కంపెనీ అధికారులు గత రెండు నెలలుగా స్టేషనరీ సరఫరా నిలిపివేశారు. దీంతో వెండార్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్యలను లిఖితపూర్వకంగా వివరించారు. దీనిపై ఆగ్రహించిన కంపెనీ ఒకే రోజు జిల్లాలో 10 మంది వెండార్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరిస్తామని జీవో నంబర్ 396 తీసుకొచ్చిన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏమిటీ స్టాక్ హోల్డింగ్ కంపెనీ.. గతంలో నాన్ జ్యూడీషియల్ స్టాంపులు, ఫ్రాంకింగ్ స్టాంపులతోపాటు చలానా సదుపాయాలు కూడా ఉండేవి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థ సాఫీగా సాగిపోతున్న తరుణంలో 2016 జూన్లో అప్పటి చంద్రబాబు సర్కార్ స్టాక్ హోల్డింగ్ కంపెనీని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయడం, ఆ మొత్తంలో కొంత కమిషన్గా తీసుకోవడం దీని ప్రధాన విధి. అయితే పైలట్ ప్రాజెక్ట్ దశలోనే ఉన్నతాధికారులు ఇందులోని లోపాలను గుర్తించడంతో ఈ వ్యవస్థ కొంత మందగించింది. మళ్లీ గత ప్రభుత్వం కొన్ని మార్పులతో ఈ వ్యవస్థను విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టింది. అయితే మళ్లీ చంద్రబాబు సర్కార్ రావడంతో కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఇష్టానుసారంగా వెండార్లపై అనధికార నిబంధనలు విధించడం, సస్పెండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ–స్టాంపుల భారీ కుంభకోణం జరిగింది. దీనిని ఇప్పటికే సీఐడీ విచారిస్తోంది. అయినా ప్రభుత్వం ఈ–స్టాంప్ విధానంపై విచారణగానీ, ఆడిటింగ్గానీ నిర్వహించడం లేదు. చిన్న డినామినేషన్ స్టాంపులు విక్రయించకుండా అన్నీ పెద్దవే విక్రయించాలంటే ఎలా వీలవుతుంది? వెండార్ వద్దకు వచ్చి ఎంత విలువైన స్టాంపు కావాలంటే అదే విక్రయిస్తాం. రెండు నెలలుగా స్టేషనరీ ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఒకేసారి 10 మంది వెండార్లను సస్పెండ్ చేశారు. ఇప్పటికే నాన్ జ్యూడీషియల్ స్టాంపులకు ఓటీపీ విధానం తీసుకురావడంతో వాటిని ఎవరూ కొనడం లేదు. ఫ్రాంకింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. – బి. శ్రీనివాసరావు, సీనియర్ స్టాంప్ వెండార్, గుంటూరు గత నెల రోజులుగా జిల్లాలో ఈ–స్టాంపుల కొరత కొనసాగుతోంది. గుంటూరులోని అరండల్పేటలో స్టాక్ హోల్డింగ్ కంపెనీ కార్యాలయం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఈ కార్యాలయం నుంచే సరఫరా అవుతుంటాయి. అయితే ఇక్కడకు ఇటీవల అసిస్టెంట్ మేనేజర్గా వచ్చిన ఓ వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వెండార్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు వాపోతున్నారు. ఆయనకు ఎదురుతిరిగితే లైసెన్స్ ఎగిరిపోతుందని చెబుతున్నారు. ఈ–స్టాంప్ వెండార్లకు సరిపడా స్టేషనరీ సరఫరా చేయకపోవడంతో రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. చిన్న డినామినేషన్ల స్టాంపులు వేస్తామంటే స్టేషనరీ సరఫరా చేయబోమని స్టాక్ హోల్డింగ్ సంస్థ అధికారులు చెబుతున్నారని వెండార్లు అంటున్నారు. చాలా మంది వెండార్లు చిన్న డినామినేషన్ల స్టాంపులు విక్రయించడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
శాకంబరీదేవిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం బాలచా ముండేశ్వరి దేవిని శాకంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని అన్నిరకాల కూరగాయలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం పాడి పంటలతో రైతులంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రకృతిలో దొరికె అన్నిరకాల కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ తెలిపారు. అలాగే ఆలయంలోని జ్వాలాముఖి దేవి అమ్మ వారిని కూడా శాకబరీదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల చాముండేశ్వరి దేవి అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల కాలనీ రాజునగర్లోని మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు ప్యాకెట్లు, స్వీట్లు, పండ్లు తదితరాలు సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ చక్రానికి కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు రంగావజ్జుల కోటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. అమరావతి: అమరావతి గ్రామ దేవత పెద్దింటమ్మకు ఆషాఢ పౌర్ణమి సారె సమర్పించే కార్యక్రమాన్ని బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు మేళాతాళాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ రూరల్ పరిధిలోని పలు దేవాయాలలో బుధవారం గురుపూర్ణిమ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామి వారికి అభిషేకం, 10 గంటలకు విద్యామూర్తి శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, 10.30 గంటలకు అస్మత్ ఆచార్య ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ● తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం చెట్టుకింద ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని ఆయనకు ప్రీతిపాత్రమైన 5 వేల గారెలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
బిల్లు.. తప్పని ఘొల్లు
అధికారం అండగా తెలుగు తమ్ముళ్ల పెత్తనంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ)లోని కాంట్రాక్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి మరీ పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో వాటిని తీర్చలేక ఇబ్బందుల పాలవుతున్నారు. చంద్రబాబు పాలనలో అల్లాడుతున్నారు.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టర్లు పలు పనులు పూర్తి చేశారు. 711 బిల్లులకు సంబంధించి రూ.113.83 కోట్లకు నిధి పోర్టల్కు పంపించారు. అందులో 127 బిల్లులకు రూ.10.78 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 545 బిల్లులకు సంబంధించి రూ.95.02 కోట్లు వెయింటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. 39 బిల్లులకు సంబంధించి రూ.8.03 కోట్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లుల్లో కూడా కేవలం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల్లోపే ఉంటున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. రూ. 20 లక్షలకు మించి ఉన్న బిల్లులకు మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన నీటి పన్నులు, దుకాణాల రూమ్ అద్దెలు, బిల్డింగ్ లైసెన్స్ ఫీజులు, ఆక్రమణ పన్నులు, ఇతర అన్ని ఫీజులు జనరల్ ఫండ్ 001 ఖాతాకు జమ అవుతుంటాయి. అయితే కాంట్రాక్టర్లకు 001 పద్దు నుంచి బిల్లులు వస్తుంటాయి. ఈ పద్దులో ఉన్న నగదు రూ.48.20 కోట్లు మాత్రమే. కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నాయి. 001 పద్దు నుంచి చెల్లించినా.. మిగిలిన మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అడ్డం తిరిగిన కథ నిధి పోర్టల్ ద్వారా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీఎంసీ అధికారులు 165 మంది కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ ’జనరల్ ఫండ్స్’ నుంచి అయినా కొంత మేర బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. కానీ ‘తెలుగు తమ్ముళ్లు’ అడ్డుపడ్డారు. తమ అనుచరుల 5 నుంచి 10 బిల్లులను ముందే క్లియర్ చేయాలంటూ ప్రజాప్రతినిధుల ద్వారా కమిషనర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అధికార పార్టీ నేతల ఈ రాద్ధాంతంతో విసిగిపోయిన అధికారులు ఆ ప్రక్రియను సైతం నిలిపివేశారు. కనీసం కొందరికై నా జనరల్ ఫండ్స్ ద్వారా చెక్కులు రాస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశించిన కాంట్రాక్టర్లకు తెలుగు తమ్ముళ్ల దెబ్బకు మొండి చేయే మిగిలింది. జీఎంసీ 001 పద్దులో డబ్బులు తక్కువ ఉన్నప్పటికీ వందలాది బిల్లులు ఏ విధంగా అధికారులు నిధి పోర్టల్ పంపించారు? ఇది కాంట్రాక్టర్లను మోసం చేయడం, తప్పుదారి పట్టించడమే. బిల్లులు ఆలస్యమవుతున్న క్రమంలో కోర్టును ఆశ్రయిస్తున్నాం. బిల్లులు ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అడ్డుకున్నారు. కంటెమ్ట్ నోటీసు ఇస్తే అప్పుడు బిల్లులు ఇస్తున్నారు. అకౌంట్ సెక్షన్లో పారదర్శకత లేదు. అధికారులు సక్రమంగా ఉండరు. – డి. శ్రీనివాసరావు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ -
కోర్టులో ఉన్న వక్ఫ్ భూములకు వేలం
న్యాయం చేయాలంటున్న హక్కుదారు తాడికొండ: కోర్టులో ఉన్న వక్ఫ్ భూములకు అధికార పార్టీ నేతల జోక్యంతో వేలం నిర్వహించిన ఘటన తాడికొండ గ్రామ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. తరతరాల నుంచి ముతవల్లీ కుటుంబ సభ్యులు ఆధీనంలో ఉన్న భూమిపై కన్నుపడిన అధికార పార్టీ నాయకులు పక్కాగా ప్లాన్ అమలు చేశారు. భర్త మరణించడంతో ముతవల్లీ కుటుంబ సభ్యురాలైన షాకీరా బేగం ఈ భూమిలో ఉంది. ఈ కుటుంబానికి 1910 నుంచే భూమిని సాగుచేసుకొని జీవించేలా డాక్యుమెంట్ ఉంది. అయితే గతేడాది ఈమె కౌలు చెల్లించుకునేందుకు వక్ఫ్ అధికారులు వ్యతిరేకించారు. దీంతో షాకీరా బేగం హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా వక్ఫ్ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించగా వారు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని ఆమె తెలిపారు. ఆ భూమిని అక్రమంగా వేలం వేస్తున్నట్లు తమకు తెలిసి అడిగినందుకు తమపై అక్రమంగా కేసు బనాయించారని వాపోయింది. అధికారులను గట్టిగా నిలదీస్తే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తమకు ఒత్తిడి ఉందని చెబుతున్నారని బాధితురాలు వాపోయింది. బుధవారం వక్ఫ్బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో భూములకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో సర్వే నెంబర్ 1476 లో 65 సెంట్లు, సర్వే నెంబర్ 1486లో 10.63 సెంట్లు మొత్తం భూమికి ఎకరాకు రూ.13 వేల చొప్పున షేక్ ఇలియాస్, షేక్ జిలానీలు వేలంలో దక్కించుకున్నారు. -
తట్టా బుట్టా సర్దుకో లోకేష్
విద్యాశాఖ మంత్రి రాజీనామాకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల డిమాండ్గుంటూరు ఎడ్యుకేషన్ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య ధోరణిపై నిరసన వెల్లువెత్తింది. విద్యార్థులు, యువజనులు గుంటూరు నగరంలో కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ మంగళవారం నగరంలోని శంకర్విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో సాగింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో ఆయా విభాగాల నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా దగా పడిన అభ్యర్థులు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరై తమ స్కిట్ల ద్వారా సర్కారు వైఖరిని ప్రజలకు వివరించారు. పేకాట, తాడు లాగుడు పోటీలు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో రైడింగ్లు, సంకెళ్లు, ఉరితాళ్లు, ఫ్లాష్ మాబ్, చెవిలో పూలు తదితర కార్యక్రమాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. పేద విద్యార్థులు, యువతకు అన్యాయం ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే డీఎస్సీ అక్రమాలకు నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే పారదర్శకత, నిజమైన జవాబుదారీతనం ఉన్నట్లని పేర్కొన్నారు. ఆధారాలు ఉన్నాయని చూపించినా లోకేష్కు కనిపించడం లేదన్నారు. లక్షలాది మంది జీవితాలతో ఈ అంశం ముడిపడి ఉందని గుర్తుచేశారు. డీఎస్సీ నిర్వహణ లోపాలమయంగా ఉందని, పేపరు లీకేజీ జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో నిరూపించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి విషయంలోనూ ప్రభుత్వం విద్యార్థులను, యువతను మోసగించిందన్నారు. చంద్రబాబు, లోకేష్లు దగా చేస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు దక్కకుండా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫీజుల కోసం విద్యార్థులు, నిరుద్యోగ భృతి లేక యువత ప్రయివేట్ బైకు రైడ్ యాప్లలో, కూలీలుగా పనికి వెళుతున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపకముందే గౌరవంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని హితవు పలికారు. దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలని లోకేష్కు సవాల్ విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ జిల్లా, నగర అధ్యక్షులు సీహెచ్ వినోద్, రవి, యువజన విభాగ జిల్లా, నగర అధ్యక్షులు ఉత్తేజ్, కోటి, విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, విఠల్, జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, మస్తాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజి, జిల్లా కార్యదర్శులు కరీం, కిరణ్, సాజిద్, అరుణ్, మంగళగిరి అధ్యక్షుడు సందీప్, తాడికొండ నాగరాజు, తెనాలి శామ్యూల్, హోసన్న, పత్తిపాడు కెనడి, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు భాను, యువజన విభాగం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు శశి, నగర ప్రధాన కార్యదర్శి దూపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
మణిపాల్లో అవయవదానం
● గుంటూరు కార్పొరేషన్లో 8 మంది ఉద్యోగులపై సీడీఎంఏకు లేఖ రాసిన కమిషనర్ ● రూ.68.65 లక్షల దుర్వినియోగం నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నకిలీ యూడీఏ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చలాన్లు, నకిలీ బ్యాంక్ స్టాంపింగ్ చలాన్ల వ్యవహారంపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2015 నుంచి 2017 వరకు నకిలీ బ్యాంక్ చలానాలు సృష్టించి రూ.68.65లక్షల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం ఆడిట్ విభాగం కనిపెట్టి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సదరు అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా 8 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సర్వీస్ వివరాలతో కూడిన లేఖను ఈ నెల 24వ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్కు పంపిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్(ఎల్టీపీ) కారణంగా కార్పొరేషన్కు ఆర్థిక నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.74.79 లక్షలు కాగా, అందులో రూ.68.65 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.34.20 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.34.45 లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. -
సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు లీగల్: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత సూచించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కల్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించే లక్ష్యంతో మంగళవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న ఎన్ఆర్ఐ కళాశాలలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. కార్యక్రమానికి ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి లత మాట్లాడుతూ సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించడంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్సైట్లు, ఆనన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబాలకు ఎంతో విలువైన వారని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ భద్రతను కాపాడుకోవాలని అన్నారు. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతూ, సురక్షితమైన వాతావరణంలో ఉంటూ, తమను తాము రక్షించుకునే అవగాహనను పెంపొందించుకోవాలని తెలిపారు. నేరాలకు అవకాశమిచ్చే పరిస్థితులను నివారిస్తూ, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోక్సో చట్టం–2012 గురించి వివరిస్తూ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను లైంగిక వేధింపులు, దుర్వినియోగం నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సులో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదవ అదనపు సివిల్ జడ్జి లత -
రవాణా శాఖలో ఇష్టారాజ్యం!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో కొందరు అధికారుల విధుల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావడం లేదని, ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వర్ణభారతి నగర్లో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి (డీటీసీ), రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో), నలుగురు ఎంవీఐలు పనిచేస్తున్నారు. తెనాలి, మంగళగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో మరో ఇద్దరు ఎంవీఐలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారి తరచూ సెలవుల్లో ఉంటున్నారని, నెలలో దాదాపు సగం రోజులు రాకపోవడంతో కార్యాలయ నిర్వహణపై ప్రభావం పడుతోందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సేవలకు అదనపు వసూళ్లు గతంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియలో పారదర్శకత ఉండేదని, ప్రస్తుతం మాత్రం కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో లక్షకు పైగా రవాణా వాహనాలు ఉండగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ సమయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం గుంటూరులో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను మంగళగిరి, తెనాలి కార్యాలయాలకు మళ్లిస్తున్నారు. ఇక్కడైతే లైసెన్స్లు రావని పేర్కొంటూ ప్రభుత్వ ఫీజులకు అదనంగా రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఎల్ఆర్కు రూ.480, డ్రైవింగ్ లైసెన్స్కు రూ.1,150 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎంవీఐల పనితీరుపై విమర్శలు ఒక ఎంవీఐ కార్యాలయానికి క్రమం తప్పకుండా రాకుండా, స్థానిక రాజకీయ నాయకులతో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతలు, ఒక ఎమ్మెల్సీతో పరిచయాలు ఉండటంతో ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఎంవీఐ ఆరోగ్య కారణాలను చూపుతూ విధులకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన మాత్రం అందుబాటులో లేదు. జిల్లాలో అవసరమైన 15 మంది ఎంవీఐల స్థానంలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) కె. సీతారామిరెడ్డి స్పందిస్తూ ‘‘మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధులకు హాజరుకావడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి, అవసరమైతే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి వివరణ కోరుతాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. -
నీటి మోటార్ల చోరీ ముఠా అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నీటి మోటార్లను దొంగలించే ముఠాను పొన్నూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రెండు నెలలుగా పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, చుండూరు పరిధిలో రోడ్ల వెంట పొలాల్లో నీటి మోటార్లు అపహరణకు గురవుతున్నాయి. దీనిపై బాధిత రైతుల వరుస ఫిర్యాదులతో ఆయా పోలీస్స్టేషన్లల్లో కేసులు నమోదు చేశారు. పొన్నూరు గ్రామీణ సీఐ పి. కృష్ణయ్య నేతృత్వంలో ఎస్ఐ వి.శ్రీహరి ప్రత్యేక బృందాలతో గాలించారు. బ్రాహ్మణకోడురు గ్రామ శివార్లల్లో తాడికొండ ఫణిదరం గ్రామ వాసులైన తాడిశెట్టి నాగేశ్వరరావు, తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్వంశీ, మిండల సాంబశివరావు, కటారి సాంబశివరావు, పొన్నూరు టౌన్ నేతాజీనగర్లో ఉంటున్న అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో ముఠాలోని ఆరుగురితోపాటు దొంగిలించిన మోటార్లను కొనుగోలు చేసిన గుంటూరు రూరల్ మండలం పెదపలకూరు గ్రామ వాసి మరియప్పన్ పెరియసామిని సైతం అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.15.33 లక్షలు ఖరీదు చేసే 91 నీటి మోటర్లు, రూ.20 వేలు విలువ చేసే 18 కిలోల కాపర్ వైరు, రెండు కార్లు, ఆటో, రెంచీలు, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా రోజు కూలీలే.. ఈ ముఠాకు తాడిశెట్టి నాగేశ్వరరావు కీలకం. ఇతనిపై నల్లపాడు, తాడికొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అన్నారు. పొన్నూరు పట్టణం డీవీసీ కాలనీలో ఉంటున్న మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉందన్నారు. సుమారు ఆరు నెలలు నుంచి ఆమె వద్దకు వచ్చేవాడని చెప్పారు. ఈ క్రమంలో అతనికి బంధువులైన పెయింట్ పనులకు వెళ్లే తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్ వంశీలు ఏకమై, ఆటోడ్రైవర్ అయిన తాడిశెట్టి వంశీ ఆటోలో పొన్నూరు వెళ్లి మద్యం తాగేవారని చెప్పారు. వీరితోపాటు మిగతా ఇద్దరు కల్సి రాత్రిళ్లు పొలాల్లో విద్యుత్ మోటార్లు దొంగిలించేవారు. అనంతరం వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. పొన్నూరు గ్రామీణ పీఎస్లో నాలుగు కేసుల్లో 47 మోటార్లు, తెనాలి గ్రామీణ పీఎస్లో ఆరు కేసుల్లో 26 మోటార్లు, చేబ్రోలు పీఎస్లో మూడు, పొన్నూరు పట్టణ పీఎస్లో తొమ్మిది, చుండూరు పీఎస్లో ఆరు దొంగలించారని అన్నారు. ఈ కేసుని ఛేదించిన పొన్నూరు గ్రామీణ పీఎస్ సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐ వి.శ్రీహరి, హెడ్కానిస్టేబుల్ వి.నరేష్, కానిస్టేబుళ్లు కె.రవి, బి.వెంకటశివయ్య, జి.సుధీర్, హోంగార్డు ఎం.రాజేష్, సీసీ కెమెరాల విభాగపు ఏఎస్ఐ రామదాస్రెడ్డి, టవర్ లోకేషన్ వింగ్ సీహెచ్.రాముని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. రూ.15.33 లక్షల విలువ చేసే 91 మోటార్లు స్వాధీనం -
ఇంద్రకీలాద్రికి హరిత శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. -
జీజీహెచ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లోని షాపులను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నరసింహుడు, జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, బీరాల నాగేశ్వరరావులు షాపులు తనిఖీ చేశారు. షాపుల్లో కాల పరిమితి దాటిన శీతల పానియాలు అమ్ముతున్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంగళవారం వారు తనిఖీలు నిర్వహించి నాలుగు షాపుల్లో ఏ ఒక్కరికి ఫుడ్లైసెన్సు లేదనే విషయాన్ని గుర్తించారు. ప్యాకెట్లపై నిబంధనల ప్రకారం ఉండాల్సిన వివరాలు లేవని, ఫుడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న నాలుగు షాపులకు నోటీసులు జారీ చేశారు. ఒక దుకాణంలో టీ పొడిలో రంగు కలిపినట్లు గుర్తించి నమూనాలు సేకరించి ఆహార ప్రయోగశాలకు పంపించారు. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట ప్రకారం ఫుడ్లైసెన్సు తీసుకోకుండా వ్యాపారం చేయడం తీవ్రమైన ఉల్లంఘన అని, విజిలెన్స్ కమిటీ సభ్యుడు హరిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేసి హాజరు పరిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. -
ఘనంగా విజ్ఞాన్ రత్తయ్య జన్మదిన వేడుకలు
గుంటూరు రూరల్: పలకలూరులోని విజ్ఞాన్ ప్రాంగణంలో మంగళవారం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మణ్ డాక్టర్ లావు రత్తయ్య 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ఆరంభమైన ఈ వేడుకలలో విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కూర్మనాధం, వైస్ చైర్పర్సన్ లావు రుద్రమదేవి, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి, విజ్ఞాన్ వైజాగ్ విద్యా సంస్థల సీఈఓ శ్రీకాంత్, ప్రొఫెసర్ ఎల్ఎమ్ పట్నాయక్లు రత్తయ్యతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూర్మనాధం మాట్లాడుతూ ప్రతి ఏటా రత్తయ్య వల్ల అసంఖ్యాకంగా అభివృద్ధి చెందుతున్న విద్యార్థులు అధ్యాపకుల అభినందనలతో రత్తయ్య పూర్ణా యురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకుని ప్రయోజకులవటమే తనకు అసలైన బహుమతి అని తెలిపారు. రాణిరుద్రమ లావు మాట్లాడుతూ విజ్ఞాన్ విద్యాసంస్థలు విద్యను అందించే సంస్థలు మాత్రమే కాదని, విలువలతో కూడిన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే ఆలయాలని, ఇంతటి మహోన్నత విద్యాలయాలను గత 50 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్న లావు రత్తయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు విద్యారంగానికి మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ తనలాంటి ఎన్నో వేల మందికి రత్తయ్య దైవసమానులన్నారు. ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో రక్త దాన శిబిరంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని పెద్దఎత్తున రక్తదానం చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ నిరుల ప్రిన్సిపాల్ డాక్టర్ పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి,మత్తు పదార్థాల విక్రేతలు అరెస్టు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) :చెడు వ్యసనాలకు బానిసలు గా మారి గంజాయి, మత్తు పదా ర్థాలు విక్రయిస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ తాండ్ర సీతారామ్, పాతగుంటూరు సీఐ కె.వెంకటప్రసాద్ వివరాలు వెల్లడించారు. పాతగుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ మస్తాన్, అలీనగర్కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ మున్నా ఇరువురు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసగా మారి అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు చేస్తున్నారు. వీరికి పాతగుంటూరు మాచిరాజువారివీధికి చెందిన బిలాల్తో పరిచయం ఏర్పడింది. గోవా, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజా యి, మత్తు బిళ్లలు రూ. 300 లకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాతగుంటూరు శివారు ప్రాంతంలోని ప్రగతినగర్లో ఇరువురిని అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద గంజాయి, మ త్తు బిళ్లలు ఉండటం గుర్తించా రు. 11 గ్రాముల గంజాయి, 90 మత్తు బిళ్లలు, రూ. 9వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న బిలాల్ పరారీలో ఉన్నట్లు సమాచారం. -
క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
చేబ్రోలు: భవిష్యత్ వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ సమన్వయంతో మరింత సమర్థమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా యువ పరిశోధకులు పరిశోధనలు చేపట్టాలని ఏపీలోని ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్, ప్రొఫెసర్ పి.విశ్వనాథ్ సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘నేషనల్ సెమినార్ ఆన్ నెక్ట్స్ జెన్ హెల్త్కేర్: బయో మెడికల్ ఇమేజింగ్ థ్రూ క్వాంటమ్ డ్రివెన్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విశ్వనాథ్ మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకునే క్లిష్టమైన వైద్య సమస్యలను క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా విశ్లేషించగలదని వివరించారు. వ్యక్తిగత వైద్య సేవలు, ఔషధాల రూపకల్పన, జీనోమిక్ డేటా విశ్లేషణ, క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల నిర్ధారణలో క్వాంటమ్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ కొడాలి మాట్లాడుతూ భారీ స్థాయిలో డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ ఇమేజింగ్ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ విశేష అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ, వైద్య చిత్రాల విశ్లేషణ, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ, చికిత్సా ప్రణాళికల రూపకల్పన, ఔషధాల అభివృద్ధి వంటి అనేక విభాగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్ సమన్వయంతో ఆరోగ్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు పరిశోధనల ద్వారా ఈ మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు.ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్ విశ్వనాథ్ -
నవ్యాంధ్ర రాజధానిలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్యుల ఆపరేషన్ల అనంతరం రోగికి పూర్తి స్వస్థత చేకూర్చే ఫిజియోథెరపిస్టుల గౌరవానికి తగ్గట్టు నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి వి. హరికృష్ణ, డాక్టర్ షేక్ సుభాని పేర్కొన్నారు. స్థానిక అరండల్పేటలోని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సుభాని మాట్లాడుతూ 2003లో స్థాపించిన ఫెడరేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 98 కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా 2000 మంది విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఫిజియోథెరపీ పట్టభద్రులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ దయాకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ మహినా, డాక్టర్ అనీస్ గ్రేస్, డాక్టర్ రవి వర్మ, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ దుర్గా వరప్రసాద్, డాక్టర్ నూర్ భాష బాజీ, షేక్ షరీఫ్ ఉస్మాన్, డాక్టర్ పసల వినయ్ కుమార్, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు -
వైఎస్సార్ విగ్రహం ప్లాట్ఫాంను ఢీకొన్న ఘటనపై విచారణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : గుంటూరు నగరంలో స్తంభాలగరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ప్లాట్ఫాం వెనుక భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో మూడు రాతి దిమ్మెలు ఊడి పడిన ఘటన పై విచారణ నిర్వహించడం జరిగిందని వెస్ట్ డిఎస్పీ బెల్లం శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఒక గుర్తు తెలియని ట్రాక్టర్ మలుపు తిరిగే సమయంలో వాహనం అదుపు తప్పి వైఎస్ఆర్ విగ్రహ వేదిక ప్లాట్ఫాం వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో విగ్రహం చుట్టూ ఉండే ప్లాట్ఫాం వెనుక భాగంలో మూడు రాతి దిమ్మెలు ఊడి కిందపడి పోయాయి. దీన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ను పట్టుకునేందుకు యత్నించగా వాహనాన్ని నిలపకుండా పరారై పోయాడు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసలు ఘటనా ప్రదేశంంలో ప్రమాదం జరిగిన వైనాన్ని విచారించారు. విచారణలో ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, వేగంగా అదుపు తప్పి ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్ ను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పీ పేర్కొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : విద్యుత్ షాక్కు కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారానికి చెందిన కావలి రామకృష్ణ (45) ఐపీడీ కాలనీ పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఐపీడీ కాలనీలో కేబుల్ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ వైర్ రామకృష్ణపై పడింది. విద్యుత్ షాక్కు గురైన రామకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ సమావేశంలో పలు నిర్ణయాలు మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అకాడమీ 22వ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అకాడమీ చైర్మన్ ఫారుక్ షిబ్లీ అధ్యక్షతన పలు అజెండా అంశాలను బోర్డు సభ్యులు సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కంప్యూటర్ శిక్షణ కేంద్రాల బలోపేతం, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధి, సేవా నియమాళి, కారుణ్య నియామకాలు, ఉర్దూ సాహిత్య ప్రచురణలు తదితర అంశాలపై తీర్మానం చేశారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ల కోసం కంప్యూటర్ల కొనుగోలుకు ఏపీటీఎస్కు చెల్లించిన మొత్తం నిధులు విడుదలైనా వివిధ కారణాలతో సరఫరా ఆలస్యం కావడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సరఫరా చేయని పరికరాలకు సంబంధించిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా ఏపీటీఎస్కు లేఖ రాయాలని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లలో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఏడీసీఏ, మల్టీ లాంగ్వేజ్ డీటీపీ కోర్సులను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యులు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరి చిత్తూరి శ్రీధర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరి జంపాని శివయ్య, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యులు మెహబూబ్ బాషా, అకాడమీ డైరెక్టర్ నిజాముద్దీన్ తదితరులు ఉన్నారు. -
గంజాయి కేసులో నలుగురు అరెస్ట్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో గంజాయి తాగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ సీఐ బి. హరికృష్ణ వివరాలను వెల్లడించారు. గంజాయి తాగుతున్న చీరాల పట్టణం, రామ్నగర్కు చెందిన పేరం సాయిచంద్, చిలకలూరిపేటటౌన్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేవరకొండ హేమంత్కుమార్, కడప టౌన్ నాగరాజుపేటకు చెందిన రావినూతల అచ్యుత్సాయికుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తనదైన శైలిలో విచారించగా వారికి మండలంలోని వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవి ఏడుకొండలరెడ్డి గంజాయి సరఫరా చేశారన్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. వారి వద్ద నుంచి 190 గ్రాముల గంజాయి, వివో రెడ్ హ్యాండ్రైడ్ ఫోన్, రెండు నోకియా కీబోర్డ్ ఫోన్లు, ఒక లావా కీప్యాడ్ ఫోన్, రూ. 600 నగదు, టీవీఎస్ జూపీటర్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వెదుళ్ళపల్లి ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు, విధుల్లో ప్రతిభ కనపరిచిన హెడ్కానిస్టేబుల్ తిరుపతిరాజు, అంకయ్య, కానిస్టేబుల్స్ రమేష్, రాజేష్లను ప్రత్యేకంగా అభినందించారు. -
బియ్యం షాపులో విజిలెన్స్ అధికారుల తనిఖీ
గుంటూరు మెడికల్: పాత గుంటూరులోని శ్రీ దుర్గా భావన బెస్ట్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ షాప్లో సోమవారం జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహుడు తనిఖీలు నిర్వహించారు. షాపు నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి లైసెన్సు లేకుండా అమెరికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఐ సీ ఎం ఆర్ ధ్రువీకరించినట్లుగా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న బియ్యాన్ని శాంపిల్స్ తీసి షాపు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. షాపు తనిఖీ చేసిన వారిలో జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మునిపల్లి కవిత, అధికారులు ఉన్నారు. అమెరికా బ్రాండ్తో బియ్యం విక్రయాలు


