Guntur District Latest News
-
నర్సింగ్ వృత్తి పవిత్రమైనది
గుంటూరు మెడికల్: నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, రోగి వ్యాధి నుంచి కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ విజయవాడ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబంలో సోదరి ఏవిధంగా ఇతర కుటుంబ సభ్యులను ఆదరించి ప్రేమగా చూస్తుందో అదే తరహాలో సిస్టర్స్గా పిలువబడే నర్సులు సైతం చికిత్స కోసం వచ్చే రోగులను ప్రేమగా ఆదరించి వ్యాధి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. లక్షలాది మంది రోగుల కేర్ తీసుకునే నర్సింగ్ సిబ్బంది వృత్తిలో సేవాభావాన్ని కలిగి ఉండాలని సూచించారు. యుద్ధంలో నిస్వార్థంగా సేవలందించిన ప్లారెన్స్ నైటింగేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వృత్తి పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలన్నారు. వ్యాధి బాధలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సు గైడ్, ఎడ్యుకేటర్, మెంటార్గా వ్యవహరిస్తూ తన చేతులతో మ్యాజిక్ చేసి వ్యాధి నుంచి కోలుకుని నవ్వుతూ రోగి ఇంటికి వెళ్లేలా చేస్తారన్నారు. నర్సులు దేశ,విదేశాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రభుత్వం నర్సింగ్ సిబ్బంది నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా నర్సులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. అందులో భాగంగా గత ఏడాది విజయవాడలో నర్సింగ్ సిబ్బందికి అవార్డులు అందజేశామని, నేడు గుంటూరులో అవార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. నర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నర్సింగ్ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అవార్డులు అందజేశారు. ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను సోమలపూరి చిన్నమ్మి, కొత్తమిద్దె సావిత్రి, డాక్టర్ వనజకుమారి, డాక్టర్ కంద స్వామి సుగంది, ప్రొఫెసర్ సి.ఆర్.షంషీర్ బేగంలు అందుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, ఏపీ నర్సెస్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, పలు జిల్లాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
టార్గెట్ గుంటూరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది. సిబ్బంది కొరతే పెనుసవాలు రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని జీఆర్పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్ గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు. అసలేం జరిగింది రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్లతో సహా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్లు తుపాకులతో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మాత్రం విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. -
క్వాంటం కంప్యూటర్ను సందర్శించిన మంత్రి
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీని మంగళవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ మేరకు ఇటీవల వర్సిటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన క్వాంటం కంప్యూటర్ సర్వీస్ సెంటర్ను పరిశీలించారు. వర్సిటీ అధికారులను కలసి క్వాంటం కంప్యూటర్ వివరాలను తెలుసుకున్నారు. క్వాంటం కంప్యూటర్ల పనితీరు, ఏ ఏ రంగాల్లో కంపోనెంట్లు తయారీ, వాటి ప్రాముఖ్యతల గురించి ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ మంత్రికి వివరించారు. ప్రపంచ దేశాల్లో క్వాంటం కంప్యూటర్లకు పెరుగుతున్న ఆదరణ గురించి తెలిపారు. అనంతరం వర్శిటీలోని పలు ల్యాబొరేటరీలను సందర్శించారు. కార్యక్రమంలో వర్శిటీ వీసీ ఆచార్య సీహెచ్ సతీష్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, క్వాంటం డీన్ డాక్టర్ సోమనాధ్, ప్రొఫెసర్ వర్ష తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలిలో ఓ శిల్పశాలలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి నిజాంపట్నం కాల్వకట్ట వద్దగల ఓ శిల్పశాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శిల్పశాలలోని ఫైబర్ విగ్రహాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి నల్లటి దట్టమైన పొగతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల వారు స్పందించి విగ్రహాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా శకటం తెనాలిలో అందుబాటులో లేదని, మంగళగిరి నుంచి తెప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. నిజాంపట్నం కాల్వ నుండి బకెట్లతో నీళ్లు తోడి స్థానికులు, శిల్పశాల యజమానులు, వర్కర్లు మంటలను ఆర్పేందుకు ప్రయల్నించారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిదని చెబుతున్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ(39) చాగంటివారిపాలేనికి చెందిన రుద్రపాటి చంద్రశేఖర్ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెందింది. చంద్రశేఖర్కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే నీట్కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులు -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. -
రేపు చలో మామిళ్లపల్లి
గుంటూరు ఎడ్యుకేషన్: పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ గూండాలతో చేయించిన దాడితో బాధితులైన రైతులను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి పేరుతో రైతు పరామర్శ యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా పొన్నూరు నియోజకవర్గంలో 40వేల ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చిందని, కేంద్రం ప్రకటించిన విధంగా క్వింటా రూ.2,400 మద్దతు చొప్పున పంటను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ ఉద్యమం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వందలాది మంది రైతులతో కలిసి, వైఎస్సార్ సీపీ చేపట్టిన మొక్కజొన్న పోరాటదీక్షకు వచ్చిన స్పందన ప్రభావంతోనే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. అయితే రైతాంగం ఎదురు చూస్తున్న విధంగా కొనుగోలు కేంద్రాలను తెరవలేదని, దీంతో చేతికి వచ్చిన పంటను అమ్ముకునే అవకాశం లేకుండా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పెద్ద దళారీగా మారిన ఎమ్మెల్యే నరేంద్ర సంగం డెయిరీలో పశువుల దాణా ఉత్పత్తి కోసం మద్దతు ధర కంటే తక్కువకు రూ.2,100లకు పంటను కొనుగోలు చేసినట్లుగా స్వయంగా అంగీకరించారన్నారు. దీంతో పాటు తన అనుచరులతో రైతుల నుంచి క్వింటా రూ.1,600కు కొనుగోలు చేయిస్తూ రైతులను తీవ్రంగా మోసగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తీరు మార్చుకోవాలి మామిళ్లపల్లి, మంచాల, వెల్లలూరు గ్రామాల్లో తనకు ఆధిక్యం ఉన్న చోట కాపులను అణిచివేయాలని పన్నిన కుట్రలో భాగంగానూ ఎమ్మెల్యే నరేంద్ర ఈ వ్యవహారాన్ని నడిసిస్తున్నారన్నారు. సెలవు రోజు వచ్చి గోదాముకు సీల్ వేసిన తహసీల్దార్, అందుకు శాంతిభద్రతల సమస్య ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేను సంతృప్తి పర్చడం కోసం గోదాముకు తాళం వేశారన్నారు. ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర సేవలో తరిస్తూ, చట్టాన్ని అతిక్రమిస్తున్న పొన్నూరు, చేబ్రోలు రూరల్ సీఐలు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. మొక్కజొన్న గిట్టుబాటు ధర కల్పనతోనే ఉద్యమం ఆగదని, గుంటూరు ఛానెల్, కొమ్మమూరు బ్రిడ్జిపై ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలుస్తాం రైతులకు అండగా నిలవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈనెల 13న ఛలో మామిళ్లపల్లి – రైతు పరామర్శ యాత్రలో వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో కలసి రైతులను పరామర్శించి, మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెనుమాల అరుణ్కుమార్, పొన్నూరు నియోజకవర్గ నాయకుడు తురిమెళ శ్రీనివాసరావు, చాగంటి మురళీమోహన్, బద్దెపూడి రమేష్, చింతలపూడి మురళీకృష్ణ, లంకపోతు పిచ్చెయ్య, చిర్రా అంకిరెడ్డి, గోళ్ల జ్యోతి పాల్గొన్నారు. మామిళ్లపల్లి గ్రామంలో సూడా సముద్రయ్య కోడలు త్రివేణి పేరుతో ఉన్న గోదాములో రైతులు నిల్వ చేసుకున్న మొక్కజొన్న పంటను అంబటి మురళీకృష్ణ దాచారంటూ తనకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే నరేంద్ర ప్రోద్బలంతో మామిళ్లపల్లితో సంబంధం లేని, బయట గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, గూండాలు గోదామును ధ్వంసం చేసి, అడ్డువచ్చిన రైతులపై దాడికి తెగబడ్డారని మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మామిళ్లపల్లి గ్రామంలో ఎకరం పొలం లేదని, తాను మొక్కజొన్న పంట ఉత్పత్తి దారుడిని, కొనుగోలుదారుడిని సైతం కాదని స్పష్టం చేశారు. మామిళ్లపల్లిలో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వాస్తవాలను వారి దృష్టికి తీసుకువచ్చిన తరువాత 31 మంది టీడీపీ నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, వారందరు మామిళ్లపల్లి గ్రామంతో సంబంధం లేని బయటి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులేనని చెప్పారు. -
ఉద్యోగం పేరుతో పది లక్షలు కాజేశాడు..
నగరంపాలెం: రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని లోకో పైలెట్ మోసగించాడని, అతడికి చెల్లించిన రూ.10.5 లక్షలు తిరిగి చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నట్లు ఓ నిరుద్యోగి వాపోయారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్(గ్రీవెన్స్)లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుల వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదు చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన)రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి(మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్(ట్రాఫిక్), మధుసూదన్రావు (గుంటూరు సీసీఎస్) అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో బాధితుడి ఆవేదన -
23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. ఎంజే మాణిక్యరావు స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.మోజెస్, ఉపాధ్యక్షుడు ఎం.విజయకుమార్, ప్రతినిధులు డీవీ సోమయ్యశాస్త్రి, ప్రమీల, హేమలత, బోసుబాబు, దుర్గాప్రసాద్, గంగాధర్రావు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీ కొని రైతు దుర్మరణం
చేబ్రోలు: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతివేగంగా ఢీ కొట్టడంతో రైతు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లేమల్లెపాడుకు చెందిన వల్లపు రఘురామయ్య(48) కొత్తరెడ్డిపాలెంలో పొలం పనులు ముగించుకొని టీవీఎస్పై ఇంటికి బయలు దేరాడు. పాతరెడ్డిపాలెం గ్రామ శివారులో లేమల్లెపాడు వెళ్లే దారిలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రఘురామయ్యకు ముఖానికి, తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బిహార్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పేద కుటుంబానికి చెందిన రఘురామయ్య మృతికి కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాలల బస్సులు తనిఖీ
పట్నంబజారు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆర్టీఏ డీటీసీ కె.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సుల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ క్షీణించడంపై సోమవారం ‘సాక్షి’లో ‘ఫిట్లెస్ బస్సు.. భద్రత తుస్సు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో పాఠశాలలకు చెందిన 284 బస్సులు తనిఖీ చేయగా భద్రతా ప్రమాణాలు సరిగా లేని 78 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సులు రోడ్డుపైకి వస్తే చర్యలు ఉంటాయన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు. లేని పక్షంలో బస్సులు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. -
గంజాయి కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ అంథోని గంజాయి విక్రయిస్తున్న సమయంలో మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోకవాణి వాదనలు వినిపించారు. బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: బాస్కెట్ బాల్ అంతర్జిల్లాల సబ్జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక ప్రక్రియను ఏపీ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు కోరగంటి రవి, చావల శ్రీను, సురేష్, అనిల్ సూర్య నిర్వహించారు. అంతర్ జిల్లాల సబ్–జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్న్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుఫున బాలుర విభాగం నుంచి లోహిత్ కుమార్, నిమేష్ రెడ్డి, అథర్వ్, లోహిత్, ప్రీతం పాల్, శశాంక్, తనీష్, ఇషాంత్, మోక్షిత్, సాయి శివ నాగ్, కార్తికేయ, నాగార్జున, అలీ, షాజాద్, బోడేశ్వర్, ధ్రువేష్ చౌదరి ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి భూమి, మహిత, దీప్తి, దీక్షిత, పార్నవి, బృంద సాయి, సాన్విత, వేధన్షి, పల్లవి, రాగ వర్షిణి, తన్వి, కావ్య, యాషిక, లీష్మ లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. -
పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్
పెదకాకాని: ఇన్స్ట్రాగామ్లో స్థానిక ఎమ్మెల్యేపై పోస్ట్ చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ చేబ్రోలు మండల సోషల్ మీడియా కన్వీనర్, చేబ్రోలు 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు ఇంటూరి జైపాల్రెడ్డిని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు మండలానికి చెందిన జైపాల్రెడ్డి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై అసభ్యకరమైన పోస్టు పెట్టారని పెదకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త దాసరి నరసింహారావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కార్యకర్త ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం జైపాల్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా కన్వీనర్పై కేసు నమోదు చేసి ఉపయోగించిన రెండు ఫోన్లు, లాప్టాప్ సీజ్ చేసినట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. అలానే ఎమ్మెల్యేపై మొక్కజొన్న దొంగల గ్యాంగ్ లీడర్ నరేంద్ర, రైతులు రేటు లేదు దొంగలకు డబ్బుల ముద్ద అనే పోస్ట్లు పెట్టారని రామాంజనేయులు, వినోద్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు గుంటూరు లీగల్: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. పల్నాడు జిల్లా కోసూరు మండలం పెరికపాడుకు చెందిన మందా నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్నేహంగా ఉన్నాడు. నాగరాజు మద్యం తాగేందుకు అతడిని పిలవడంతో భార్య మందలించింది. నాగరాజు ఒంటరిగా మద్యం తాగాడు. అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి, అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.కె.షమీ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో ఎస్ఐలు ఎం.నారాయణ, బి. అనంతకృష్ణ, కోర్టు కానిస్టేబుల్(ప్రస్తుతం ఏఎస్ఐ) శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం సంయుక్తంగా గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు డీ–1 సెక్షన్ పరిధిలోని బ్రాడీపేట, అరండల్పేటలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 4,750 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 108 మందికి రూ.5.05 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఐదుగురికి రూ.26 వేలు కలిపి మొత్తంగా రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎస్ఏ కరీం, పఠాన్ హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ సర్వీసుల తనీఖీలు భారత విద్యుత్ చట్టానికి లోబడి ఉంటాయన్నారు. ఫిర్యాదుల కోసం 9440812263, 9440812361 నంబర్లును సంప్రదించాలని వారు కోరారు. తనిఖీల్లో డీఈఈలు షేక్ ముస్తాక్ అహ్మద్, మల్లికార్జున ప్రసాద్, రవికుమార్, ఏఈఈలు, కె.అక్కిరెడ్డి, శివశంకర్, సతీష్కుమార్ పాల్గొన్నారు. ఏఎన్యూ ప్రొఫెసర్కు అరుదైన గౌరవం ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏఎన్యూ సోషియాలజీ సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్, జెండర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ వారి గ్లోబల్ రోస్టర్ ఆఫ్ జెండర్ ఎక్స్పర్ట్గా ఎంపికయ్యారు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్లు, వ్యవస్థాపకులైన నికోలా, లీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.గంగాధరరావు సోమవారం ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ను అభినందించారు. -
వైభవంగా హనుమాన్ గ్రామోత్సవం
పట్నంబజారు: అంజనీ సుతుడు ఆంజనేయస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. గుంటూరు నగరం నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ దీక్షాపరులు, భక్తులు భారీ ఊరేగింపు నడుమ ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్తో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామి వారి వేషధారణలు, డప్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాజ్ సెంటర్లో ప్రారంభమైన ఊరేగింపు భాస్కర్ డీలక్స్, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్, శివాలయం, భగత్ సింగ్ బొమ్మ సెంటర్ మీదుగా లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తిరిగి అక్కడ నుంచి హిమని కూల్ డ్రింక్ సెంటర్, జిన్నాటవర్ సెంటర్ మీదుగా తిరిగి ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుంది. అశేష భక్త సందోహం మధ్య జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో నగర ప్రజలు స్వామివారినీ మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఆలయ ఈవో టి సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు టీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్ ఆలయాల పాలకమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఘటాభిషేకం హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిఏటా సాంప్రదాయంగా నిర్వహించే ఘటాభిషేకం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ, దీక్ష సమాజం సభ్యులు కోరారు. -
ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్ఎల్టీపీ ప్రోగ్రాం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వహించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్ ప్లాజమ్ డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. పరిశోధనలకై డిబిటీ, డీఎస్టీ వంటి సంస్థల నుండి బాహ్య నిధులు సమీకరించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. కార్యక్రమం ఐసీఏఆర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.పి.భదానా, ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.మురళీధరన్, టీఎన్ఏయూ రిటైర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు, డాక్టర్ జి. రామచంద్రరావు, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రాధిక పాల్గొన్నారు. -
జనగణనకు అధిక ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: జిల్లాలో జన గణనను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు సమన్వయంతో పనిచేయా లని పేర్కొన్నారు. ప్రజలు ఉదయం, సాయంత్రం ఇళ్ల వద్ద అందుబాటులో ఉంటారని గమనించాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్యుమరేటర్లు రెండు పూటలా గృహ సందర్శన చేయడం మంచిదన్నారు. జలధార – జల హారతి పనులు పూర్తి చేయాలి కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన జలధార–జల హారతి పనులు పూర్తి చేయాలన్నారు. మంజూరు చేసిన పనులలో ఇంకా ప్రారంభం చేయడంలో జాప్యం జరుగుతుండటం పట్ల చేబ్రోలు, కాకుమాను, పొన్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ప్రశ్నించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనులను పూర్తి చేయడంలో చురుకై న పాత్ర పోషించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. పూర్తి సామర్థ్యంలో చెరువులలో నీటి నిలువ చేయాలని పేర్కొన్నారు. చెరువు గర్భం మాత్రమే కాకుండా కాలువలు, స్లూయిస్ లలో గురప్రు డెక్క ఉండరాదని, పూడికలు లేకుండా చూడాలని అన్నారు. యంత్ర పరికరాల వినియోగం అవసరం ఉన్న పనులను గుర్తించి, జాబితాను రూపొందించాలన్నారు. డివిజనల్ అభివృద్ధి అధికారులు జలధార పనులను పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఐ ద్వారా వృత్తి నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏఐపై జిల్లా అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏఐలో పొందుపరచకూడని అంశాలను కూడా వివరించారు. -
‘మా పంట మాకు ఇప్పించండి’
నగరంపాలెం: ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాట ధర లభించలేదు. దీంతో మొక్కజొన్న బస్తాలను తెలిసిన రైతు గోదాములో నిల్వ చేసుకున్నాం. అయితే వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు సంబంధించి గోదాము మంటూ సీజ్ చేశారు. వారం రోజులుగా అన్నం లేదని, మా మొరను ప్రభుత్వమైనా అలకించాలని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు విన్నవించారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్(గ్రీవెన్స్)లో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలసి జిల్లా ఏఎస్పీ(పరిపాలన) జీవీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. షెడ్కు వేసిన సీజ్ను తొలగించి, ఆరుగాలం పండించిన మొక్కజొన్న, వ్యవసాయ సామగ్రిని ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యే దాడి చేయించారు... పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని, దీంతో షెడ్లో మొక్కజొన్నను నిల్వ చేసుకున్నామని చెప్పారు. అయితే ఆ షెడ్ వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు చెందిందని ప్రచారం చేశారని వివరించారు. ఈ క్రమంలో పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కొంతమందిని పంపించి తమపై దాడి చేయించారని వాపోయారు. రైతులు అందరూ కన్నీరు పెడుతున్న ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ షెడ్ను పగులకొట్టారని అన్నారు. షెడ్ సూద సముద్రయ్యదని, అంబటి మురళీకృష్ణది కానేకాదని స్పష్టం చేశారు. షెడ్ యాజమాని, రైతు సూద సముద్రయ్య మాట్లాడుతూ మేం ఎప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదని, వారం రోజులుగా అన్నంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మా మొరను కూటమి ప్రభుత్వం అలకించడలేదన్నారు. నాలుగు ఎకరాల పొలం ఉందని, అయితే షెడ్లో 320 టిక్కిలు ఉన్నాయని తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కూడా న్యాయం చేయడం లేదని వాపోయారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని, దౌర్జన్యంగా పగులకొట్టారని వాపోయారు. అందులో వ్యవసాయ పనిముట్లు ఉన్నాయని చెప్పినా ఆలకించలేదన్నారు. ఎమ్మెల్యే నరేంద్రకు ముఫ్పై ఏళ్లుగా సేవ చేశానని, ప్రస్తుతం నా సోదరులు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. మొక్కజొన్న రైతు సూరిశెట్టి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సుమారు 500 మంది వచ్చి షెడ్ను పగులకొట్టారని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి మా ధాన్యం ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రైతులపై అన్యాయంగా బనాయించిన కేసులను తొలగించాలని కోరారు. మొక్కజొన్న రైతులు ఇక్కుర్తి శ్రీనివాస్, అంబటి పోలీస్ పాల్గొన్నారు. -
రైతులకు షాక్ ఇచ్చిన తణుకు ఎమ్మెల్యే సోదరుడు
తాడేపల్లి రూరల్: గత పది సంవత్సరాల నుంచి 120 మంది రైతులకు చెందిన 92 ఎకరాల భూములను డెవలప్మెంట్ చేస్తామంటూ నమ్మించి అగ్రిమెంట్ చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ భూములు ఇచ్చిన రైతులతో పాటు మిగిలిన వారికి ఆదివారం షాక్ ఇచ్చాడు. 92 ఎకరాల భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని రైతులు మంత్రి లోకేశ్ను మీడియా ముఖంగా కోరారు. ఆ మరుసటి రోజే రైతులకు షాక్ ఇస్తూ మంగళగిరి తాడేపల్లి జాతీయ రహదారి వెంబడి నుంచి ఉన్న సర్కార్ డొంకను ఆక్రమించుకుని ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా రోడ్డు చుట్టూ రేకులు ఏర్పాటు చేసేందుకు లారీల్లో రేకులు తెచ్చి ఐఓసీ వెనుక దించారు. ఇది గమనించిన 92 ఎకరాల రైతులతో పాటు ప్రస్తుతం అక్కడ పొలాలు ఉన్న రైతులు వచ్చి రేకులు ఏర్పాటు చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ డొంక అని, ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని రైతులు వారితో వాగ్వివాదానికి దిగారు. ‘మాకు తెలియదు.. సార్ ఇక్కడ దించమన్నారు’ అని చెప్పగా.. ఆ సార్ ఎవరో చెప్పాలని రైతులు ప్రశ్నించినా.. రేకులు దించి వెళ్లిపోయారు. గతంలో ఎమ్మెల్యే రామకృష్ణ సోదరుడు రైల్వే డంప్ యార్డ్ దగ్గర నుంచి పంట పొలాల మీదుగా ఉన్న సుమారు రెండు ఎకరాల డొంక భూమిని కూడా ప్రభుత్వం నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ డొంకను అమ్మే ఆలోచనను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ రోడ్డును వారికి అమ్మితే ఎలా అని నిలదీసినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా రైతులను పంట పొలాల్లోకి వెళ్లనీయకుండా రోడ్డును ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక అధికారులు ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా భూములను డెవలప్మెంట్కు తీసుకుని చేయకుండా వేధిస్తున్న వైనం ఇప్పుడు ఆ భూములతో పాటు వ్యవసాయ పొలాల్లోకి వెళ్లకుండా రోడ్డు ఆక్రమించుకునేందుకు యత్నం అడ్డుకున్న అన్నదాతలు.. న్యాయం చేయాలని వేడుకోలు -
అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి తాడికొండ: తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పకీరయ్యపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. గతంలో కూడా ఇతనిపై దాడికి పాల్పడటంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇటీవల మళ్లీ ఫకీరయ్య వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా తిరుగుతుండటంతో కట్టెపోగు నవీన్, కావూరి అశోక్లు ఆయన ఇంటికి దాడి చేశారు. దాడి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా నిలబడటంతో 112కు కాల్ చేసి ఫిర్యాదు చేసి స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. మూడో అంతస్తులో వివాహాల సందడి సాయంత్రం పెరిగిన రద్దీ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ -
రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి
నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్స్ క్లబ్ ఏర్పాటు– నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఐద్వా సీనియర్ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యా వ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్ క్లబ్లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు. చిల్డ్రన్ ్స క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ -
విజ్ఞానం... వినోదం
● చదువుల ఒత్తిడి నుంచి విద్యార్థులకు ఉపశమనం ● క్రీడలు, ఆటలతోపాటు సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసే విధంగా శిక్షణ ● నగరంలోని వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు ● ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ● ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు -
‘ఇంజినీరింగ్’ పరీక్షలకు వేళాయె!
● రేపటి నుంచి 20 వరకు ఏపీ ఈఏపీసెట్–2026 ● 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 46,168 మంది విద్యార్థులు ● మూడు జిల్లాల్లో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2026ను నిర్వహిస్తోంది. ● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,168 మంది విద్యార్థులు ● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 28,158, అగ్రికల్చర్, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 2,899, అగ్రికల్చర్, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు. ● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 7,684, అగ్రికల్చర్, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్ట్, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి. -
జూన్ ఒకటి నుంచి ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు
లక్ష్మీపురం: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్య– ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు ఉంటాయని వివరించారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. ఫీజుల పెంపు, నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాల లేమి, కాంట్రాక్టు ఉద్యోగుల అనిశ్చితి వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, విద్యుత్ చార్జీల భారాలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి యువతపై మరింత ప్రభావం చూపుతోందని తెలిపారు. యువతను ఉద్యమ దిశగా తీసుకువెళ్లడం, వారి సమస్యలకు సంఘటిత పోరాటం నిర్మించడం ఈ శిక్షణ తరగతుల ముఖ్య లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.సుభాని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువజన సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.యశ్వంత్, అరుణ్, సద్దాం, మహేష్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే వాటి సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు -
భద్రత తుస్సు!
గుంటూరుసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026ఫిట్‘లెస్’ బస్సు..● ఈ నెల 10వ తేదీతో ముగిసిన విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షల గడువు ● కనీసం 30శాతం బస్సులకు కూడా పూర్తికాని పరీక్షలు ● 50శాతంకు పైగా బస్సులు ప్రజాప్రతినిధులవే.. ● తూతూ మంత్రంగా తనిఖీలు ● ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పమంటే నీళ్లు నములుతున్న వైనం దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పట్నంబజారు: ప్రతి తల్లి, తండ్రి కలలు కనేది.. కష్టపడేది వారి చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసమే. బస్సెక్కి స్కూళ్లకు వెళ్లిన తమ చిన్నారులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు వారు పడే ఆదుర్దా అంతాఇంతా కాదు. వీటికి తోడు జిల్లాలో వరుసగా జరుగుతున్న స్కూల్ బస్సుల ప్రమాదాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అసలు స్కూల్ బస్సులను వదిలేసి.. కేవలం ఆదాయ మార్గాల వనరులను వెతుక్కునే పనిలో పడ్డారనే విమర్శలు లేకపోలేదు. పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభయ్యే సమయానికి పూర్తిస్థాయిలో విద్యా సంస్థల వాహనాలకు ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారుగా 2500పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. వీటిలో సుమారు 400 నుంచి 600 బస్సుల వరకు స్క్రాప్కు వెళ్లటంతో ప్రస్తుతం 1900 నుంచి 2వేల బస్సుల వరకు ఉన్నాయి. మే 10వ తేదీలోగా ఫిట్నెస్ సెంటర్లలో వాహన సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని, పూర్తిస్థాయిలో అన్ని ధ్రువీకరణ పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. అయితే ఇప్పటివరకు కనీసం 400 బస్సులు కూడా ఎఫ్సీ పొందలేదని తెలుస్తోంది. బస్సులకు ఇంకా ఎఫ్సీ చేయించకపోవడం, కేసుల నమోదు సంఖ్యపై అధికారులను ‘సాక్షి’ వివరణ కోరబోగా స్పందించలేదు. ● గత కొద్ది రోజుల క్రితం చుట్టుగుంట సెంటర్లోని వీఐపీ రోడ్డులో ఒక పాఠశాల బస్సు డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి వెనుక నుంచి ముందుకు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆటో బాగు చేయిస్తానని చెప్పటంతో.. వివాదం సద్దుమణిగింది. ఇందులో ఆలోచించాల్సింది మాత్రం ఒక్కటే.. ఎదురుగా ఆటో కాకుండా లారీ, బస్సు లాంటి భారీ వాహనం అయితే పరిస్థితి ఏంటీ..? ● ఉండవల్లి– పెనుమాక దారి మధ్యలో గుహల సమీపంలోని ఓ విద్యా సంస్థ బస్సుల డ్రైవర్ అతి నిర్లక్ష్యంతో నడిపి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. అయితే అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులోని ఇద్దరికి మాత్రం గాయాలయ్యాయి. ● గత కొద్ది రోజుల క్రితం కొరిటెపాడు రోడ్డులో సైతం అతి వేగంగా ఒక విద్యా సంస్థ బస్సు వేగంగా వెళుతూ.. స్పీడ్ బ్రేకర్ ఎక్కించటంతో బస్సులోని కొంత మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇటువంటి ఘటనలు.. ఎక్కడో అక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయి. చిత్రలేఖనంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు 7గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సంబంధించి కూటమికి చెందిన కొంత మంది ప్రజాప్రతినిధుల విద్యాసంస్థల బస్సులే అధికంగా ఉంటున్నాయి. వీటిపై తనిఖీలు నిర్వహించే ధైర్యం లేని అధికారులు.. చిన్నాచితక విద్యాసంస్థల బస్సుల్లో చిన్న తప్పులు పట్టుకుని వాటిని తనిఖీలు నిర్వహించామని ఊదరగొడుతున్నారు. ప్రధాన యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల బస్సులను ఎందుకు తనిఖీ చేయరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 60 సంవత్సరాలు వయో పరిమితి దాటిన వ్యక్తి డ్రైవింగ్కు అనర్హుడు. డ్రైవర్కు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డ్రైవర్ ఆరోగ్య పరీక్షలు ఆయా యాజమాన్యాలు విధిగా చేయించి, ఆ రికార్డులను భధ్రపరచాలి. డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులు తెలియజేయటంతో పాటు, 5 సంవత్సరాల అనుభవం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి డ్రైవర్లు మాత్రమే అర్హులు. కళాశాల, స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లితండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు, ప్రతి నెల వాహనానికి సంబంధించి స్థితిగతులను రిజిష్టర్ చేయటంతో పాటు, ప్రతి వాహనంలో ఫిర్యాదు పుస్తకాన్ని ఉంచాలి. అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భధ్రపరుచుకునే బాక్సులు సబ్రూల్ ‘ఏ’, ‘బి’ ప్రకారం తప్పని సరిగా పాటించాలి. ప్రతి బస్సులో ఒక అటెండర్ ఉండాలి. ప్రతి వాహనంలో ప్రయాణించే విద్యార్థుల వివరాలను తప్పనిసరిగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నోట్ చేసుకోవటంతో పాటు, తల్లితండ్రులకు డ్రైవర్ వివరాలను తెలియజేయాలి. 15 సంవత్సరాలు దాటిన బస్సులకు అనుమతి ఉండదు. ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ.. బస్సులు నడపాలి. ఏౖదైనా ఘటన జరగక ముందే అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టడంతో పాటు, విస్త్రృత తనిఖీలు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. -
మత విద్వేషపూరిత పోస్టులు వ్యాప్తి చేయవద్దు
నగరంపాలెం: సోషల్ మీడియాలో మతవిద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటనల దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్/ ఇతర సాషల్ మీడియా వేదికల్లో మతపరమైన ద్వేషపూరిత సందేశాలు, ఛాయచిత్రాలు, వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. గ్రూప్ అడ్మిన్న్లు ఆయా గ్రూప్ల్లో షేర్ చేసే ప్రతి సందేశం(మెసేజ్) నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ ఉంటే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్ల నుంచి తొలగించాలని సూచించారు. గ్రూప్ అడ్మిన్లు బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్ల్లో చట్టవిరుద్ధమైన ప్రచారం కాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తప్పుడు ప్రచారం, మతద్వేషపూరిత పోస్టులు, నకిలీ వార్తలు, మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలను సృష్టించే, ఫార్వార్డ్ చేసే లేదా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏ సోషల్ మీడియా వేదికలైనా సరే వదంతులను వ్యాప్తి చేయవద్దుని అన్నారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు లేదా ఫార్వార్డ్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు ద్వారా లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా వాస్తవాలు ధ్రువీకరించుకోవా లన్నారు. ఎవరైనా వదంతులు, మతద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా ఎస్పీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దృష్టికి ప్రజలు తేవాలన్నారు. అటువంటి వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
శోకసంద్రమైన ఎండుగుంపాలెం
నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్ఎస్పీ తుర్లపాడు మేజర్ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు(52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. తిరిగి ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్ఎస్పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఆంధ్రనాట్యం భారతీయ సాంస్కృతిక వైభవ చిహ్నం
ఏఎన్యూ(పెదకాకాని): భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యాద్భుతంగా ఆవిష్కరించే నాట్యరీతుల్లో ఆంధ్రనాట్యం ఒకటని ఏఎన్యూ రెక్టార్ ఆచార్య రామినేని శివరాంప్రసాద్ అన్నారు. శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచశత ఆంధ్రనాట్య సంగమం పేరుతో 500 మంది ఆంధ్రనాట్య కళాకారులు చేసిన నృత్యాంశాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన సందర్భంగా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య రామినేని శివరాంప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక నాట్యకళలు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అందులోనూ తెలుగు వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఆంధ్రనాట్యానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు పంచశత ఆంధ్రనాట్య సంగమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావటం ఆనందంగా ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఆంధ్రనాట్యాన్ని విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్రనాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రఖ్యాత నాట్యాచార్యులు, అభినవ సత్యభామ కళాకృష్ణ, కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు తదితరులు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రఖ్యాత నాట్యకళాకారులు కళాకృష్ణ మాట్లాడుతూ తమ గురువు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ మరుగున పడిన ఆంధ్రనాట్యానికి పునరుజ్జీవం తీసుకురావడం కోసం పాటుపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ కళల వికాసానికి పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు అపూర్వమైన సేవలందిస్తున్నారన్నారు. సంస్థ వ్యవస్థాపకులు కళారత్న పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు పంచశత ఆంధ్రనాట్య సంగమంలో భాగస్వాములు కావడం విశేషమన్నారు. సుమధుర కళానికేతన్ప్రధాన కార్యదర్శి పసుమర్తి భాస్కరశర్మ, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆ సంస్థ ప్రతినిధులు గుర్తింపు పత్రాలను నిర్వాహకులకు అందించారు. పలువురు కళకారులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు. ఏఎన్యూ రెక్టార్ ఆచార్య రామినేని శివరాంప్రసాద్ -
రాజరాజేశ్వరి దేవిగా మహంకాళి దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్కుమార్లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు. తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. -
జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపాలి
గుంటూరు వెస్ట్: జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా అధికారులతో కలసి శనివారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో జిల్లా ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్, ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అందిన అర్జీలు నూరు శాతం పరిష్కారం, కేటాయించిన బడ్జెట్ మురిగిపోకుండా చూడాలని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను వివరించారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను అనుసంధానం చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్దేశిత సమయానికి నివేదికలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలను గురించి ఆలోచించాలని, సంబంధిత ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు దీనికి అనుగుణంగా ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలన్నారు. ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసియున్న ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం పంచామృత స్నపన, లక్ష తులసి పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి.సుభద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీహనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు గ్రామోత్సవ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున పురవీధుల్లో దీక్ష సమాజం సభ్యులు, దీక్షాపరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సీహెచ్ మారుతి, వెంకటరమణ, వంశీ ప్రసాద్, బాపిరాజు, కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ మాఫియా దందా
గుంటూరుఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలానికి ఒక టీడీపీ నేత రేషన్ మాఫియా నిర్వహణను పంచుకున్నారు. గుంటూరు నగరంలో, రూరల్ మండల పరిసరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లో రేషన్ మాఫియా నడుస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్కు చేరేలోగానే బియ్యాన్ని మాఫియా దోచేస్తోందని డీలర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,500, మోడల్ ధర రూ.4,000 వరకు పలికింది.దుగ్గిరాల: దుగ్గిరాలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అక్రమ రేషన్ దందాకు అంతులేకుండా పోయింది. ముఖ్యంగా మురళి.. ఈ పేరు చెబితేనే ప్రతి రేషన్ డీలర్ భయపడుతున్నాడంటే మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. బియ్యం గోడౌన్ నుంచి లారీ బయలుదేరగానే సంబంధిత అధికారులు ఆ వ్యక్తికి సమాచారం ఇస్తారు. వెంటనే ఆ వ్యక్తి తమ మాఫియా గణంతో ఆయా డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తాడు. తమ వాహనాల్లో ఇన్ని బస్తాలు లోడు చేయాలని ఆదేశిస్తాడు. అతని మాట ఎవరైనా వినకుంటే రోజుల వ్యవధిలో అధికారులు ఆయా షాపుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. చేసేది లేక ఆ వ్యక్తి చెప్పినట్లుగానే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని వాహనాల్లో చెప్పినన్ని బస్తాలు లోడు చేసి పంపాల్సిందే. డిప్యూటీ తహసీల్దార్లపై ఆరోపణలు పేదలకు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అవినీతి కుంపటిలో కూరుకుపోయింది. కింది స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,90,546 రేషన్ కార్డులున్నాయి. 972 డిపోల ద్వారా ప్రతి నెలా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు పంచదార, గోధుమ పిండి సరఫరా చేస్తారు. మొదటి 15 రోజులు ఈ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. చాలా రేషన్ దుకాణాల్లో కొలతల వ్యత్యాసం ఉంటుంది. దీనిని సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోరు. దానికిగాను కొన్ని రేషన్ దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. గతంలో వెస్ట్ డీటీ మొహమ్మద్ ఖాదర్ బాషాపై ఓ రేషన్ దుకాణదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈస్ట్ డీటీపైనా ఫిర్యాదులు అందాయి. ఇలా మరికొందరిపైనా నిత్యం ఏదో ఒక సమయంలో ఫిర్యాదులొస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉండగానే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కీ బోర్డుపై ‘గిన్నిస్’ రికార్డు 7జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మరేషన్ గోడౌన్ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యం బస్తా ఒకొక్కటి 50 కిలోలు ఉండాలి. కానీ 40, కిలోలు, ఇంకా కొన్నింటిలో 35 కిలోలు ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. తమకు వచ్చే బియ్యంలోనే కోతలు వేసి, మళ్లీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న మాఫియాకు వారు అడిగినన్ని బస్తాలు పంపితే ఇక లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నుంచి వచ్చే బస్తాల్లో తమ వాటాగా అధికారులు బస్తాకు పది కిలోలకుపైగా దోచుకుంటుంటే, మాఫియా కూడా తామేం తక్కువ కాదని బస్తాలకు బస్తాలు దోచుకుపోతున్నారు. మాఫియా సైతం కిలో రూ.16కు కొనుగోలు చేస్తోందని, ప్రజలకు ఇచ్చి మళ్లీ వారి వద్దే రూ.15 బియ్యం కొని మాఫియా అడిగినన్ని బస్తాలు ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. -
‘ఆట’విడుపు.. మేలుకొలుపు
● క్రీడలకు పూర్తిగా దూరమవుతున్న నేటి బాలలు ● ఇకనైనా కన్నవారు మేల్కొంటేనే బంగారు భవిష్యత్తు ● ఆటల్లోనే చిన్నారులకు ఆనందం... ఆరోగ్యం ● ఏదోకటి ఆడితేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు ● వేసవిలోనైనా శిక్షణ శిబిరాల్లో చేర్చాలని వైద్యుల సూచన ● ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు బాల్యం ఒక అద్భుతం -
13న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్యక్రమ ఇన్చార్జి అధికారి, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఈనెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్న నేపథ్యలో వేదిక ప్రాంతాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. మయూర్ అశోక్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ డెప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డీసీపీ అశోక్కుమార్, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ వెంకట బ్రహ్మం, తహసీల్దార్ రాఘవేంద్ర పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రత్యేక లోక్ అదాలత్
గుంటూరు లీగల్: సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. సమాధన్ సమరో 2026లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావొచ్చని తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–222448 లను సంప్రదించవచ్చునని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి -
ఈసెట్లో ప్రథమ ర్యాంక్ మనదే
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ విద్యార్హతతో బీటెక్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన ఏపీ ఈసెట్–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 23న రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అనంతపురం సంయుక్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో పరీక్షలు రాసిన 1,625 మంది విద్యార్థుల్లో 1,510 మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు కై వసం చేసుకుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో తెనాలి ఐతానగర్కు చెందిన ఆలూరి దుర్గా సిరి 7వ ర్యాంకు సాధించింది. ఆలూరి దుర్గా సిరి అంగలకుదితి నాగ అపరాజిత భవానీ లక్ష్మీ శరణ్య 92.92 శాతం ఉత్తీర్ణత -
ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం
కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
జల గరళం
కలుషితమవుతున్న గుంటూరు చానల్ నీరు ● పలు గ్రామాలకు తాగునీటి అవసరాలకు అవే దిక్కు ● వ్యర్థాలు, పూడిక, రసాయనాల చేరికతో ప్రజారోగ్యంపై ప్రభావం ● నిద్రావస్థలో నీటిపారుదల, ప్రజారోగ్య శాఖ అధికారులు శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026కృష్ణానది, కొండవీటి వాగు హెడ్ స్లూయిజ్ నుంచి గుంటూరు వరకు గుంటూరు చానల్ 47 కిలోమీటర్ల పొడవున ఉంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలోని ఓ ముఖ్యమైన తాగునీటి వనరుగా మారింది. గుంటూరు చానల్ను పొడిగించాలని, ఆధునికీకరించాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఈ చానల్లో పలు ప్రాంతాల్లో మురుగు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. కాలువను పొడిగించేందుకు అనేకసార్లు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రస్తుత టీడీపీ సర్కారు కూడా పొడవు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిమిత్తం నిధులను కూడా కేటాయించింది.దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. – అఫ్రోజ్ఖాన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవితఖైదు గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. జిల్లాలో సగటు వర్షపాతం 4.1 మి. మీ. -
ఘాటెక్కిన మిర్చి వాటాలు!
మిర్చి యార్డులో పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిర్చి యార్డులో భారీగా జరుగుతున్న జీరో వ్యాపారంపై వచ్చే నగదులో తమకు కూడా వాటా ఇవ్వాలని పాలకవర్గం పట్టుపడుతుండటం, దీనిపై గురువారం కార్యవర్గం సమావేశం కావడం యార్డులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి కార్యదర్శి గైర్హాజరు అయ్యారు. ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు పెడితే తాను రానని కార్యదర్శి చెప్పినట్లు పాలకవర్గ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కార్యదర్శి వైఖరిపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన డబ్బుల్లో తమ వాటా చెల్లించాల్సిందేనని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మిర్చి యార్డు కార్యదర్శి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బంధువు కావడంతో తమను అసలు లెక్క చేయడం లేదని పాలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఖాతాకు గండి యార్డులో గత రెండేళ్లుగా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో యార్డుకు రావాల్సిన సెస్ రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఏడాదిన్నర తర్వాత పాలకవర్గం వచ్చినా అధికారులు మిర్చి యార్డుపై తమ పెత్తనం కొనసాగిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది యార్డ్ ఖాతాలో జమ కావడం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నారు. మిర్చి యార్డులో జరుగుతున్న జీరో వ్యాపారం, దానిపై వచ్చే ఆదాయం విషయంలోనే అధికారులు, పాలకవర్గం మధ్య గొడవలు తలెత్తాయి. జీరో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నో విధాలుగా... ఇదే కాకుండా బిల్ టు బిల్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మిర్చి యార్డులో రైతులు, ఎగుమతి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసి కోనుగోళ్లు జరపడానికి కమీషన్ ఏజెంట్లు పని చేస్తుంటారు. రైతులకు కొనుగోలు చేసిన రోజే డబ్బులు చెల్లిస్తారు. వీరు మార్కెట్ యార్డు నుంచి లైసెన్స్ కలిగి ఉంటారు. లైసెన్స్ లేనివారు ఇప్పటికే ఉన్న వారి పేరుతో వ్యాపారం చేస్తూ వాస్తవంగా వసూలు చేయాల్సిన రెండు శాతానికి బదులుగా రెట్టింపు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న వేమెన్లు, సూపర్వైజర్లు, యార్డు యంత్రాంగానికి కాసుల వర్షం కురుస్తోంది. బిల్ టు బిల్ విధానానికి సహకరించినందుకు బస్తాకు రూ.పది వరకూ వసూలు చేస్తున్నారు. యార్డులో వచ్చే అవినీతి డబ్బుల కోసం పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య రచ్చ జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజిలెన్స్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి. -
బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
తెనాలిరూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. తెనాలి మార్కెట్ యార్డు వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో త్రీ టౌన్ ఎస్ఐ షేక్ కరిముల్లా, సిబ్బంది గురువారం రాత్రి దాడులు నిర్వాహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఊట్ల భార్గవ్, మరో వ్యక్తి ‘లేసర్ 247’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీరికి గూగల్ పే, ఫోన్పే ద్వారా నాగేశ్వరరెడ్డి, లక్ష్మీ చెన్నరెడ్డి, రామ, గుణ పవన్, రామకృష్ణ, అతని సోదరుడు, యశ్వంత్, భార్గవ్రెడ్డి, వివేక్రెడ్డి నగదు బదిలీ చేసి బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు గుర్తించారు. బెట్టంగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
గాలివాన బీభత్సం
రోడ్లపైనే నేలకొరిగిన వృక్షాలు తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి రూరల్ పెనుమాక, ఉండవల్లి, పట్టణ పరిధిలోని నులకపేట, ప్రకాష్నగర్, డోలాస్నగర్, శర్మ డాబా ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్లే పాత జాతీయ రహదారి వెంబడి శర్మ డాబా వద్ద నుంచి ప్రకాష్నగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వర్షం తగ్గిన తరువాత ఈ రహదారిలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా కార్పొరేషన్ సిబ్బందితో జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగింపజేశారు. 2 కి.మీ. వ్యవధిలో పలుచోట్ల భారీ వృక్షాల కొమ్మలు తొలగించడానికి 2 గంటల సమయం పట్టింది. వాటిని తొలగించే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోయి, ద్విచక్రవాహనాలు సైతం కార్పొరేషన్ సిబ్బంది అనుమతించలేదు. గాలివానకు ఎగిరిపడిన రేకులు మంగళగిరి టౌన్ : మంగళగిరిలో గురువారం అకాల వర్షం కురవడంతో మండల పరిధిలోని యర్రబాలెం గ్రామంలో ఓ ఇంటి రేకులు ఎగిరి వీధిలో పడ్డాయి. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలుల వల్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిలువ నీడను కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. -
అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు
చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటంతో ఓ అల్లుడు అత్త ఇంట్లోనే చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్లో పొన్నూరు రూరల్ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ గురువారం వివరాలను వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందులోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్, చైన్లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. త్వరతగతిని కేసును చేధించిన చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్ జింధాల్, తెనాలి డీఎస్పీలు అభినందించారు. రూ.9లక్షలు విలువచేసే బంగారు, వెండి నగల అపహరణ -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చిన్నారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్షిప్ పోటీలకు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు. -
సర్కారు మద్దతే లేదయా..
నేలతల్లిని నమ్ముకున్న కర్షకుడి కంట చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కన్నీరే మిగిలింది. రెండేళ్లుగా ఏ పంట వేసిన కనీస మద్దతు ధర మాటలకే పరిమితం కావడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ గోడు చెప్పుకొనే దిక్కు లేక.. దయ లేని పాలకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణా డెల్టా ప్రాంతమంటే పంటలు పండించడంలో ఎంతో పేరుంది. కానీ రెండు సంవత్సరాల నుంచి రైతులు నష్టాలపాలవుతున్నారు. అయినప్పటికీ నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు ఇప్పుడైనా కలిసి రాకపోదా.. అనే ఆశతో సాగు కొనసాగిస్తూనే ఉన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను పండించిన వారికి ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన తప్పడం లేదు. భూమి కలిగిన రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంట చేతికి రాగానే గ్రామాల్లో అప్పులు ఇచ్చిన వారితోపాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు నగదు కోసం అడగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట విక్రయించి బాకీలు తీరుద్దామన్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు లేకపోవడంతో దళారులకు అయినకాడికి అమ్మేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని దైన్యం మంగళగిరి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను వేలమంది రైతులు కౌలుకు తీసుకుని పండించారు. గతంలో వరి 70 కేజీల బస్తా రూ.1,900 నుంచి రూ.2,100 ఉంది. ప్రస్తుతం దాని ధర రూ. 1,250 నుంచి రూ. 1,350 పలుకుతోంది. బస్తాకు రైతు సుమారు రూ.700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నాడు. ఎకరానికి 40 బస్తాలు దిగుబడి ఉంటే సగటున రూ.28 వేల నుంచి రూ.32 వేలు నష్టం వాటిల్లుతోంది. గతంలో మొక్కజొన్న రూ.2,600 ఉండగా ప్రస్తుతం క్వింటా రూ. 1,700 ఉంది,. బస్తాకు రూ.900 వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రూ. 31,500 నష్టమే మిగులుతోంది. జొన్న గతంలో రూ. 2,400 ఉంటే ప్రస్తుతం రూ.1,500 ఉంది. క్వింటా బస్తాకు రూ.900 నష్టపోతున్నారు. అంటే ఎకరానికి 35 బస్తాలు అయితే రూ. 31,500 నష్టం తప్పడం లేదు. దీంతో ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇక బతుకు ‘సాగే’దెలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనే మూడు ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాను. ఎరువుల నుంచి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు అన్ని విషయాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2,400 ప్రకటించినా నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు లేకుంటే రైతులకు అస్సలు ఏమీ ఖర్చులు కూడా రావు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. లేదంటే దళారుల వల్ల రూ.900 నష్టంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – కొండూరి అబ్రహం, దుగ్గిరాలగ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఎకరం కౌలు రూ.40 వేలు చెల్లించాలి. కొంత డబ్బును వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నా. కొనుగోలు కేంద్రాలు లేవు, గిట్టుబాటు ధర ఊసే లేదు. ఏమీ తోచని పరిస్థితి. దళారులకు అమ్మితే క్వింటాకు రూ.900 వరకు నష్టపోవాల్సి వస్తోంది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. ఎరువులు కోసం ఎన్నో కష్టాలు పడి మరీ వ్యవసాయం చేశాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – సిద్దాబత్తుని ఆంజనేయులు, దుగ్గిరాల -
ఉద్యోగుల పోరుబాట
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. విద్యాశాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. విసిగిపోయి.. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. అందిస్తున్న సేవలివీ... మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ● ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ● మినిమం టైం స్కేల్, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి. ● రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ● కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంగీత విశ్వనాథన్ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్ను యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు. -
రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలి
తాడికొండ: రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలని సీఆర్డీయే కమిషనర్ వి విజయరామరాజు అన్నారు. భూసేకరణ కార్యకలాపాలలో భాగంగా రాయపూడి, నేలపాడు గ్రామాలలో ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు, పలు అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్ ) చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ తెలిపారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున రాజధాని గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలన్నారు. గ్రామ కంఠాల, లంక భూముల వ్యవహారంపై రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నా ఎలాంటి హామీ లభించలేదు. మా సమస్యలు తీర్చితే ఇస్తామని పలువురు బాధితులు మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఏభార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెఎస్ భాగ్యరేఖ, బి సాయి శ్రీనివాస నాయక్ ఇతర సీఆర్డీయే అధికారులు పాల్గొన్నారు. -
15 నుంచి రంగస్థల నటనాభినయ ప్రత్యేక శిక్షణ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో వర్క్షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితోదాడి
చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. గురువారం స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించారని అన్నారు. అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు సేవా భావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), పోలీస్ కార్యాలయ ఏఓ ఎం.వసంతరావు, ఏఏఓ జగన్నాథ రావు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్జీరంగా వర్సిటీలో అల్లూరికి నివాళి గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ, బయో టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ పి ఆనంద్కుమార్లు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ అల్లూరి స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం చేసిన త్యాగాలు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ తెగువ, నిబద్దత, దేశభక్తికి అల్లూరి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎంవీ రమణ, కంప్ట్రోలర్ డాక్టర్ బి ముకుందరావు, పీజీ డీన్ డాక్టర్ పీ మునిరత్నం, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ డి సంపత్కుమార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ జి కరుణసాగర్, లైబ్రెరియన్ డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేవ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ పీ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్యూ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పరిధిలో జరిగిన ఎంబీఎ ఇంటర్నేషన్ బిజినెస్, ఎల్ఎల్బీ, ఎంపీఈడీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫిబ్రవరిలో జరిగాయి. ఈ పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 46 మంది ఉత్తీర్ణులయ్యారు. 2025 నవంబరులో జరిగిన ఎల్ఎల్బీ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు, 2025 డిసెంబరులో జరిగిన ఎంపీఈడీ మూడవ సెమిస్టర్ రీవాల్యేషన్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈ తెలిపారు. క్యాష్ డిపాజిట్ చేస్తామంటూ మోసం తెనాలిరూరల్: ఏటీఎం సెంటరులోని క్యాష్ డిపాజిటట్ మెషిన్లో డబ్బు వేసేందుకు వెళ్లిన వ్యక్తి మోసం చేసి రూ. 50 వేలు తీసుకెళ్లిన ఘటన తెనాలిలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడి చదువు అవసరాల కోసం ఏటీఎంలో నగదు జమ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సహాయం చేస్తామంటూ అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టు నమ్మించారు. అనంతరం చాకచక్యంగా రూ.50 వేల నగదును తీసుకుని పరారయ్యారు. మోసపోయిన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఏటీఎంలోని సెక్యూరిటీ గార్డు అని భావించి బాధితుడు మోసపోయినట్టు సమాచారం. రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలిరూరల్: రైలు నుండి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి–విజయవాడ రైలు మార్గంలోని చిలువూరు స్టేషన్కు కిలోమీటరు దూరంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి గురువారం వెళ్లారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎరుపు టీషర్టు, ఎరుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
అధికారుల ఉరుకులు పరుగులు
తాడికొండ: ‘పరిహారానికి పదేళ్లా’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. బాధితుడు చుండు నర్సిరెడ్డి, సోదరుడు చుండు వెంకటరెడ్డిలకు కలిపి ఉన్న 14 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేశారు. సర్వే రిపోర్టును అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 1962 లోనే వారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని సుమారు 70 సంవత్సరాలుగా స్వాధీనంలో ఉంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి, 1956 ఈనాం యాక్ట్ చట్టం ప్రకారం రైతువారీ పట్టా ఉంది, ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని పంటలు పండించుకుంటూ ప్రతిఏటా పంట రుణం కూడా తీసుకుంటున్నారు. అయితే తమకు తెలియకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా ఆన్లైన్లో భూమిని ఎలా తొలగిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో ఎందుకు తొలగించారంటే తహసీల్దార్ సైతం తమకు తెలియదంటున్నారని, ఒక్క వడ్డమాను గ్రామంలోనే ఈనాంకు చెందిన 100 ఎకరాలను ఆన్లైన్లో ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. పూలింగ్కు ఇచ్చిన 2 ఎకరాల కోళ్ల ఫారం పరిహారం విషయంలో ఇంకా అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తన భూమిని తనకి తిరిగి ఇచ్చేయాలని బాధితుడు కోరుతున్నాడు. బాధితుడి ఈనాం భూములకు సర్వే నిర్వహించిన రెవెన్యూ, సర్వే సిబ్బంది 1962 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తమ స్వాధీనంలోనే ఉన్నట్లుగా తెలిపిన బాధితులు -
రేపటి నుంచి మిర్చి యార్డుకు సెలవులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవులు ఉంటాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి ఎగుమతి, దిగుమతి షాపుల కార్మిక సంఘాలు, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతుల మిర్చి బస్తాలను గురువారం వరకే యార్డులోకి అనుమతిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వివరించారు. -
నేటి నుంచి మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49 వారికోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో కె.సునీల్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులపాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించేందుకు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్(ఐఐటీ–జేఈఈ మెయిన్స్, ఎన్ఈఈటీ, ఎంసెట్) అందించనున్నట్లు వివరించారు. 250 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం 6303325356, 8978452495 సంప్రదించాలని కోరారు. తెనాలి: తెలంగాణ సారస్వత పరిషత్ ముద్రించిన బాల సాహితీ కథా సంకలనంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన ‘ప్రగతి పథం’ కథ ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 180 కథలు రాగా వాటిలో ఎంపిక చేసిన 70 కథలతో ‘బాలసారస్వతం’ పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. వాతావరణ, జల కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, భూగర్భ జలాల్ని ఎలా పెంచుకోవాలి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి యువత ఎలా దోహదపడాలనే అంశాలపై ఈ కథనం రాశారు. హకీంజాని ఇప్పటి వరకు పిల్ల్లల కోసం 36 పుస్తకాలు, 290 కథలు రచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హకీంజాని కథలను 2019లో 11వ తరగతికి, 2020లో 12వ తరగతికి పాఠ్యాంశాలుగా ప్రచురించింది. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్ర చెస్ అసోసియేషన్, గుంటూరు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు 8వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవీంద్ర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని ఐడీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.50,000 నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లోని వారికి ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 99481 98809 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
పవర్లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: చైనాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్(మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్ లిఫ్టర్లు ఎం. షానూన్ 47 కేజీల విభాగం, జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్, ఇ.ఎల్. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు. -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
కలెక్టరేట్ ఉద్యోగిపై పోలీసుల దాడి హేయం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్మెనన్గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్ఎస్ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జేసీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు -
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలి
కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్టైల్స్ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు -
భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
కేవీకే శాస్త్రవేత్త గంగాదేవి చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్ను సాధించినట్లు చెప్పారు. జాతీయ స్థాయి పేటెంట్ సాధించిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్, అలాగే ఉత్తమ హెచ్–ఇండెక్స్ సాధించిన డాక్టర్ మిథున్ రుద్రపాల్, డాక్టర్ కె.చంద్రశేఖర్లను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావులు అభినందించారు. -
సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మగుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందరిరం నుంచి విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుండి 12 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి హాజరు కావాలని స్పష్టం చేశారు. 20 రోజులపాటు జరిగే స్టడీ అవర్స్లో విద్యార్థి ఏ విభాగంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించాలని, మంచి తర్ఫీదు అందించి వారిలో విజ్ఞాన తృష్ణ పెంచడంతో పాటు సమర్ధత పెంచాలన్నారు. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాలని చెప్పారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహిస్తారని హెచ్చరించారు. పదవ తరగతిలో తప్పిన విద్యార్థులు అందరూ సప్లిమెంటరీ పరీక్షలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారి ఒకటవ తరగతికి ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది అంచనాల మేరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన చిన్నారులు 22,672 మంది ఉన్నారని, అయితే కనీసం 12,470 మంది పిల్లలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మంగళగిరి, గుంటూరు, తెనాలి, కొల్లిపర, చేబ్రోలు మండలాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుండి ఐదు సంవత్సరాలు నిండి బయటకు వస్తున్న చిన్నారులు 10,679 మంది ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త, ప్రధాన ఉపాధ్యాయుడు సమన్వయం చేసుకోవడం ద్వారా ఆ చిన్నారులు అందరిని ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఈఓ డా.షేక్ సలీం బాషా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన పాల్గొన్నారు. -
తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ
మంగళగిరి టౌన్: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. -
హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లు
తాడేపల్లి రూరల్: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో 10వ తేదీ ఉదయం సంపూర్ణ సుందరకాండ పారాయణ, 11న ఉదయం 9 గంటలకు శ్రీ దాసాంజనేయ స్వామి వారికి అభిషేక మహోత్సవం, మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదగోష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న ఉదయం 9 గంటలకు యోగాంజనేయ స్వామి వారికి నవకలశ స్నపనం, విశేష అలంకరణ, 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్చాలీసా పారాయణ, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. మూడు రోజులు కై ంకర్యాలు జరుగుతాయని, పుష్ప కై ంకర్యానికి రూ. 11,000, ప్రసాద కై ంకర్యానికి రూ. 5,000, ఉత్సవ కై ంకర్యానికి రూ. 3000గా నిర్ణయించామని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
శనగ రైతుకూ
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇదీ గుంటూరు జిల్లాలో శనగ రైతుల పరిస్థితి. రబీ సీజనులో దిగుబడులు చేతికొచ్చాయి. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో సేకరణ నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం శనగకు మద్దతు ధర క్వింటాకు రూ.5,875 గా ప్రకటించింది. మార్కెట్లో మాత్రం రూ.4,800 నుంచి రూ.5,000 మధ్యే ధర పలుకుతోంది. పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్ కొనుగోళ్లు పరిమితంగా ఉండటంతో ఎక్కువ మంది దళారులు, ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్ళూరు తదితర మండలాల్లో ఈ ఏడాది గణనీయంగా శనగ పంట సాగైంది. వర్షాలు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు బాగానే వచ్చాయి. ధర లేకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ క్వింటా కనీస మద్దతు ధర రూ.5,875కు తొలిదశలో 5,600 మెట్రిక్ టన్నులను సేకరించింది. కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపేసింది. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటం, జిల్లాలో 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే అందులో కనీసం 10 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. అంతేకాకుండా నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం, గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడం, తేమ శాతం, నాణ్యత పేరుతో శనగలు కొనకుండా తిరస్కరించడం వంటి చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నామమాత్రంగా కొనుగోలు.. గుంటూరు జిల్లాలో రబీ సీజనులో శనగ సాగు సాధారణ విస్తీర్ణం 20,302.5 ఎకరాలు కాగా, జిల్లాలో 48,797.5 ఎకరాల్లో సాగు చేశారు. సుమారు 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ జిల్లాలో తొమ్మిది కొనుగోలు సెంటర్లు (పెదనందిపాడు–3, కాకుమాను–1, ప్రత్తిపాడు–1, వట్టిచెరుకూరు–1, తాడికొండ–1, తుళ్ళూరు–1, ఫిరంగిపురం–1) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.5,875 చొప్పున 1,122 మంది రైతుల నుంచి 5,600 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అందులో ఇప్పటి వరకు 721 మంది రైతులకు రూ.14.50 కోట్లు చెల్లించారు. ఇంకా 421 మంది రైతులకు సుమారు రూ.15 కోట్లు మేర డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరో 200 టన్నులు కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాకు మొదటి విడతలో 5,600 టన్నుల కొనుగోళ్లకు అనుమతి లభించిందని, ఆ మేరకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు చేశామని వెల్లడించారు. రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో మరో 15 వేల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శనగలను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం వరకే పరిమితమవుతోంది. కొనుగోళ్లు మాత్రం సక్రమంగా జరగడం లేదు. నమోదు చేసుకున్నా రోజుల తరబడి కాల్ రావడం లేదని, అప్పులు తీర్చాలి కాబట్టి దళారులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికీ సుమారు 401 మంది రైతుల ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కానీ 45 రోజులు గడుస్తున్నా .. నగదు జమ కాకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయి. రబీలో మొక్కజొన్న దిగుబడులు బాగున్నా.. ధరల్లేకపోవడం సమస్యగా మారింది. శనగ రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 48,797.5 ఎకరాల్లో శనగ సాగవ్వగా సుమారు 55 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కనీసం 20 వేల టన్నులైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు ఊరట లభిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు క్వింటా రూ.5,875కు విక్రయించినా గిట్టుబాటు కాదంటూ కొంతమంది రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. -
కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన
తెనాలి: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం ప్రతినిధి బృందం తెనాలి చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా సత్వర చికిత్సాలయం (డైక్) సెంటర్ను సందర్శించింది. ‘రాష్ట్రీయ బాల స్వస్థ’ కార్యక్రమం అమలుపై పరిశీలనకు నాలుగురోజులపాటు ఈ బృందం షెడ్యూలును నిర్ణయించింది. తొలిరోజున గుంటూరును సందర్శించింది. రెండో రోజైన బుధవారం తెనాలి ‘డైక్’ను పరిశీలించింది. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ నేతృత్వంలోని బృందం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు ప్రధాన అంశాలపై సమీక్షించారు. పిల్లల పుట్టుకలో లోపాలు, వ్యాధులు, కొరతలు, ఎదుగుదల లోపాలు, వైకల్యం అంశాలను ముందుగా గుర్తించటంపై సమీక్షించారు. రిఫరల్ మెకానిజం బలోపేతం చేయటం ద్వారా నిర్ణీత సమయాల్లో పరిశీలన చేయటం, ‘డైక్’ ద్వారా మెరుగైన సేవలను అందించటం, క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చించారు. అధికారుల సమన్వయం, నివేదించటంపై తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, ‘డైక్’ పీడియాట్రిషన్ డాక్టర్ మధుబాబు, డైక్ మేనేజరు శిరీష తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
మేడికొండూరు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మేడికొండూరు మండల పరిధిలోని జంగంగుంట్ల పాలెంలో మొక్కజొన్న రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొక్కజొన్నలను గ్రామాల్లోకి తమ ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేసే వారని రైతులు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేవారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ఈ క్రాప్ చేసిన తర్వాత గిట్టుబాటు ధరకు కేంద్రానికి లెటర్ రాయాలని రైతులకు కలబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.2,400లకు రైతుల వద్ద కొనుగోలు చేయకపోతే రాబోయే రోజులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. అదేవిధంగా మేడికొండూరులో పంట కొనుగోలుపై స్పష్టత కొరవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ధరలు నేలచూపు రబీలో కష్టపడి పండించిన మొక్కజొన్న పంట విక్రయానికి రైతులు ఎదురుచూస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో ధరలు నేల చూపు చూస్తున్నాయని వాపోతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మేడికొండూరు మండలంలో 1,295 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు ఎకరానికి 45 నుంచి 50 క్వింటాలు వరకు దిగుబడి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికే 90 శాతం కోతలు పూర్తయినా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి ఆవుల రమణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, బొడ్డు పెద్ద సాంబయ్య, బొడ్డు చిన్న సాంబయ్య, ఆమతి రాఘవరావు, సాంబిరెడ్డి, రవికృష్ణ, రవికిషోర్రెడ్డి, అచ్యుతరామయ్య, షేక్ రబ్బాని, ఉడత శ్రీనివాసరావు, అబ్బాస్, కొరివి చెన్నయ్య, కొరివి కిషోర్, తమనపల్లి శాంతయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, లుర్డు రాజు, నోసిన కోటేశ్వరరావు, షేక్ జిలాని, షేక్ బుడే, మక్బూల్, ఆలూరి శ్రీనివాసరావు, జగదీష్, సూర్యనారాయణ రెడ్డి, డేవిడ్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇదేంటి.. అతిథి అధ్యాపకా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అతనో అతిథి అధ్యాపకుడు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేశానని.. పార్టీ శిక్షణ శిబిరాలలో పాల్గొన్నానని.. ఆ పార్టీలో నేతలు అందరూ తనకు సన్నిహితులే అంటూ వర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిన్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం.. ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేయటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. యూనివర్సిటీలోని ఒక కళాశాలలో పని చేస్తున్న ఈ అతిథి అధ్యాపకుడి తీరుతో ఆ విభాగంలోని విద్యార్థులు విలవిలలాడుతున్నారు. విభాగ పెద్దల అండదండలతో నియమితుడైన తర్వాత అడ్డగోలుగా వ్యవహరిస్తుడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరు చెప్పుకొని అందర్నీ బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి దశ నుంచి టీడీపీలో ఉన్నానని... తనను ఎవరూ ఏమీ చేయలేరని రెచ్చిపోతున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. అధికార పార్టీకి చెందిన ఒక కుల కార్పొరేషన్ చైర్మన్ తనకు అత్యంత ఆప్తుడని హల్చల్ చేస్తున్నా సరిచేసేవారు కనిపించడం లేదు. తాను ఎంత చెబితే అంత అంటూ మిగిలిన సిబ్బందిని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. వేధింపులు... దూషణలు.. గతంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్న ఈ అతిథి అధ్యాపకుడు.. తాజాగా అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. ఒక విద్యార్థిని వ్యవహారంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థిని పాదరక్షలు తీసివేసి క్లాస్కు రావాలంటూ ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారుల పరిశీలనకు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఇతను మూల్యాంకన విభాగంలో పనిచేసినప్పుడు వెహికల్ తాళాలు కావాలంటే తన గదికి రావాలని వికృతంగా మాట్లాడినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఎగ్జామినర్ల పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు మహిళా ఎగ్జామినర్లతో తన పరిధి దాటి వ్యవహరించినట్టు అప్పటి అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక మహిళా లెక్చరర్ను ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టి మూల్యాంకనం చేయించారనే ఆరోపణ ఉంది. మరికొందరు మహిళా లెక్చరర్లను ప్రత్యేకంగా ఎక్కువ పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయించడంతో వారు ఆందోళనకు దిగారు. గత శుక్రవారం విభాగ ఆవరణలో ఒక వర్గ సంప్రదాయాలను హేళన చేశారని విద్యార్థి బంధువులు వచ్చి నిలదీయడమే కాకుండా, ఆందోళన కూడా చేశారు. ఉన్నతాధికారులు ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేసినట్లు చెబుతున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామని యూనివర్సిటీ అధికారులు కొందరు వాపోతున్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026పచ్చ దందా... అడ్డుందా? అధికారులకే సవాలు విసురుతున్న తెలుగు తమ్ముళ్లు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,500 వరకు పలికింది. తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్షిప్లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్–జూనియర్, జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో షబీనా జూనియర్ విభాగంలో చాంపియన్గా నిలిచింది. జూనియర్స్లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్ షబీనా స్క్వాట్లో 200 కిలోలు, బెంచ్ప్రెస్లో 110 కిలోలు, డెడ్ లిఫ్ట్లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.అశోక్కుమార్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు. గుంటూరు మెడికల్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్ చేయడం, ఫాలో అప్ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్ని, ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్, మేనేజర్ శిరీష పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెన్యువల్ పత్రాలు తీసుకురావాలని కోరారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గుంటూరు రూరల్: రూరల్ మండలంలో ఓబులునాయుడుపాలెం, నాయుడుపేట, వెంగళాయపాలెం, చిన్నపలకలూరు, గోరంట్ల తదితర గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో మాఫియా అక్రమ మైనింగ్ సాగుతోంది. ప్రజాప్రతినిధి అల్లుడు పేరుతో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం. ఏకంగా ప్రజా ప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు వచ్చి తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు వాహనాల లెక్కలు రాసుకుంటున్నారంటే ఏ స్థాయిలో మైనింగ్కు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తూ లారీ ఒకొక్కటి రూ. 8 వేలు – రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు భూమిలో హక్కుదారుడికి తెలియకుండా తవ్వి మట్టి స్వాహా చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించారు. అయినా అక్రమ మట్టి దందాను మాత్రం ఆపలేదు. స్థానిక టీడీపీ నాయకులతో కలిపి ప్రజాప్రతినిధులే ఇలా చేస్తుండటం చర్చశనీయాంశంగా మారింది. భారీగా తవ్వకాలు తవ్వకం మొదలుపెట్టారంటే నీరు ఊరినా ఆపడం లేదు. రూరల్ మండల పరిసర ప్రాంతాల్లో సుమారు 50 నుంచి 60 అడుగులు తవ్వితే నీరు ఊరుతుంది. అంటే ఏ స్థాయిలో తవ్వకాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నీటిని మోటార్లతో తోడి అక్కడే మరో పది అడుగులు తవ్వుతున్నారు. నిబంధనలకు ఇంతలా తూట్లు పొడుస్తున్నా మైనింగ్ అధికారులుగానీ, పోలీసులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రూ.కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు రూ.లక్షల్లో మామూళ్లు వెదజల్లి పని కానిచ్చేస్తున్నారని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరు పంచాయతి పరిధిలోని ఖాజీపేట కళావేదికపై జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చిటుమడుగుల సాంబయ్య కళాప్రాంగణంలో చిటుమడుగుల భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చివరిరోజు ప్రదర్శనలు ఆరంభించారు. రాత్రి ఏడుగంటలకు స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి ‘సీ్త్రమాత్రే నమః’ నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు ఉదయ్ భాగవతుల నాటకీకరించి, దర్శకత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ఏర్పాటైన సభకు కళాపరిషత్ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్ అధ్యక్షత వహించారు. సభలో గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని కాకినాడకు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ సీఎస్.ప్రసాద్కు బహూకరించారు. సభానంతరం స్నేహ ఆర్ట్స్–చంద్రమాంపల్లి, దివిలి వారి ‘పుట్టింటి సంపద’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్నిగ్ధ రచనకు, బి.రాజు దర్శకత్వంలో పి.బాలాజీనాయక్ పర్యవేక్షణలో ప్రదర్శించారు. నిర్వాహక కమిటి తరపున గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. 7పాలిసెట్లో జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణతగుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2026 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 92.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 25న జరిగిన పాలిసెట్–2026కు జిల్లా వ్యాప్తంగా హాజరైన 4,894 మంది విద్యార్థుల్లో 4,549 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 3,032 మంది బాలురులో 2,797, 1,862 మంది బాలికల్లో 1,752 మంది చొప్పున ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 92.25 శాతం, బాలికల ఉత్తీర్ణత 94.09 శాతంగా నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇసునూరి చేతన్ ఆనంద్ రామ్ రాష్ట్రస్థాయిలో 132వ ర్యాంకు, చిలకా సుజిత్ ప్రహర్ష్ 159వ ర్యాంకు, సంపతి యశ్వంత్ 322వ ర్యాంకు సాధించారు. రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలంలో అనంతవరం, వడ్డమాను అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకులు, టీడీపీ నాయకులు కలిసి దందాకు పాల్పడుతున్నారు. తాడికొండ మండలంలోని లచ్చన్నగుడిపూడి, మోతడక, పాములపాడు గ్రామాలలో మైనింగ్ రాత్రి సమయంలో నిర్వహిస్తూ తెలుగు తమ్ముళ్ళు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సైతం నిత్యం వందల సంఖ్యలో లారీలలో నల్లమట్టి ఇతర ప్రాంతాలకు తరలుతూనే ఉంది. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ నడుస్తూనే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. యడ్లపాడు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో రాత్రి సమయాల్లో మైనింగ్ జరుగుతూనే ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నవారిని కూడా ఇలా అడుగుతారా? అని పేర్కొంటున్నారు. వారి బెదిరింపులకు భయపడి అధికారులు అటు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
తాడికొండ: భూ సమస్యలకు త్వరలోనే పూర్తి పరిష్కారం చూపుతామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని రైతుల భూ సమస్యలపై మంగళవారం సీఆర్డీయే కమిషనర్ విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లతో త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్లతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ సీఆర్డీయే కొత్త కమిషనర్గా విజయరామరాజు ఇటీవలే బాధ్యతలు స్వీకరించారని, నూతన కమిషనర్కు రాజధాని సంబంధిత పలు అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా సమీక్ష నిర్వహించుకున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న కొన్ని గ్రామ కంఠాల సమస్యలు, కొన్ని ఎఫ్ఎస్ఐ గ్రామాల్లోని మౌలిక వసతులు, తదితరాంశాలపై అధికారులు గ్రౌండ్ లెవెల్కు వెళ్లి పరిశీలిస్తే స్థానిక సమస్యలు తెలుస్తాయని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక సమస్యలు అర్థం అవుతాయని కమిషనర్కు సూచించారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి ఎన్ఎస్పీ పాలసీ ద్వారా ఎన్హాన్స్ చేయాలని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ -
ఆచార్యా... అన్నీ అయినోళ్లకేనా!
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక పరిపాలనలో సొంత సామాజిక వర్గానికే పదవులన్నీ పప్పుబెల్లాల్లా పంచుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏక కాలంలో ఒకరికి పలు బాధ్యతలు అప్పగించడం వలన వారు తరగతులు నిర్వహించలేకపోతున్నారనేది స్పష్టమవుతోంది. కూటమి పాలనలో ఎక్కువ పదవులు అనుభవిస్తున్న వారు ఆర్థిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పాలకుల తీరు చూస్తే వర్సిటీలో పదవులు అనుభవించే వారు మనవారేనా... అయితే అప్పగించెయ్ అనేలా పరిస్థితి మారింది. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ఉన్న విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరికే 12 ఉద్యోగ బాధ్యతలు ఏఎన్యూలో రీసెర్చ్ సెల్ కో ఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఏకకాలంలో 12 ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేస్తున్నారో దీని వలన తెలుస్తోంది. ఈ వ్యక్తి 12 సంవత్సరాలుగా వర్సిటీలోని పరీక్షా భవన్లో యూజీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏసీటీఏగా (డిగ్రీ జవాబు పత్రాల కోడింగ్) విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే ఆన్లైన్ పరీక్షల ఇన్చార్జి, ఓ విభాగానికి విభాగాధిపతిగా, పీజీ అడ్మిషన్ సెట్ కో కన్వీనర్గా, వర్సిటీ సాంకేతిక విభాగం పర్యవేక్షకుడిగా, దూర విద్యాకేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్గా, ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాలకు తనిఖీ బృందం సభ్యుడిగా, ఎగ్జామ్ సెంటర్ల సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, ఏఎన్యూ ఇంటర్ నెట్ వర్క్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే వ్యక్తికి వర్సిటీ పనులపై పలుమార్లు ఢిల్లీ వెళ్లే బాధ్యతలు కూడా అప్పగించడం విశేషం. దీనిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరికి ఇలా... ఏఎన్యూలోని అదే విభాగంలో ఐక్యూఏసీ కో ర్డినేటర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కూడా పలు బాధ్యతలు అప్పగించారు. సీటీఏగానూ, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాల్లో తనిఖీ సభ్యుడిగా, పీజీ, డిగ్రీ పరీక్షల పరిశీలకుడిగా, రెగ్యులర్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. రెగ్యులర్ విధానంలోనే కాకుండా దూర విద్యా కేంద్ర పరీక్షల్లోనూ పరిశీలకుడిగా, తనిఖీ బృందం సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల్లోనూ, దూర విద్యాకేంద్రాల తనిఖీల్లోనూ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పలు వర్సిటీ అంతర్గత కమిటీల్లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లెక్కకు మించిన బాధ్యతలు నిర్వహించే ఈ అధ్యాపకులు తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారో అప్పగించిన వారికే తెలియాల్సి ఉంది. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయం ఉండదని తెలియదా? కొందరు అధ్యాపకులకు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు కట్టబెడుతున్న తాత్కాలిక వీసీకి ఆయా అధ్యాపకులకు పాఠాలు చెప్పే వెసులుబాటు, సమయం ఉన్నాయా? అని ఆలోచించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే తాత్కాలిక వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. కనీస చర్యలు కూడా లేవు. గతంలో వీసీలు తనిఖీలు చేసి అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేవారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే బాధ్యతగా భావించేవారని పలువురు విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. తాత్కాలిక వీసీ వచ్చిన 23 నెలల్లో ఏ రోజూ మచ్చుకై నా తనిఖీలు లేవని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వర్సిటీ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. వర్సిటీలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు తరగతులు జరగడం లేదని వాపోయారు. అధ్యాపకులకు తప్పనిసరిగా బోధన చేయాలని సూచించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేదు. ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కొందరు హోదాను చూసుకుంటుండగా... మరికొందరు ఆర్థిక సంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్సిటీలోని తాత్కాలిక పాలకులకు సైతం విద్యార్థుల ఇబ్బందులు పట్టడం లేదు. దీనిపై పలువురు ప్రిన్సిపాల్స్ చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా మంచి పేరున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. కొందరు అధికారుల పనితీరు, స్వార్థం, ఓ సామాజిక వర్గంపై ప్రేమతో నేడు దిగజారుతోంది. ఏ విద్యాకేంద్రంలోనైనా విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధనలు, నైతిక విలువలను నేర్పించడం ప్రథమ కర్తవ్యం. కానీ వర్సిటీలో 23 నెలల తాత్కాలిక పాలనలో విద్యార్థులకు తరగతులే సరిగా నిర్వహించడం లేదు. పాఠాలు చెప్పకుండా పరీక్షలు రాసేదెలా అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. -
భూగర్భ జలాలు పెరగాలి
గుంటూరు వెస్ట్: జలధార–జలహారతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. జలధార–జలహారతి కార్యక్రమంపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పనులు నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగు నీటి వ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడాలన్నారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార– జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేతనదారుల ద్వారా చేపట్టాలన్నారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని, ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలన్నారు. గొలుసుకట్టు చెరువులపైనా శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తద్వారా వర్షాలు కురిసే సమయంలో మంచి ఫలితాలు సాధించగలమని, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని కలెక్టర్ వివరించారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ -
మాన్యువల్ మాయాజాలం
● రాష్ట్రమంతా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు ● జీఎంసీలో మాత్రం మాన్యువల్ గానే.. ● మాన్యువల్గా ఫైళ్లు చూసి సంతకం చేసిన తరువాతే ఆన్లైన్లో పెడుతున్న రెవెన్యూ సిబ్బంది ● ఆన్లైన్లో ఫైళ్లు సకాలంలో పెట్టకపోవడంతో సమయం వృథా అవుతుందంటూ లబోదిబోమంటున్న అర్జీదారులు ● రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే ఆన్లైన్ ఫైల్స్ను కూడా రిజెక్ట్ చేస్తున్న వైనం ● గడువు తీరేదాకా అప్రూవ్ చేయని దరఖాస్తులు వందకు పైగానే.. తిరస్కరించిన దరఖాస్తులు 2,970 రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే దరఖాస్తులు సైతం.. -
పునర్విభజన చిచ్చు!
గుంటూరుమంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో కూటమి పార్టీల మధ్య విబేధాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మొదట్లో ఏడాదిపాటు కలిసి ఉన్నా తర్వాత రాను రాను జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమకు అన్యాయం జరిగిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మిర్చియార్డు చైర్మన్ పదవిని ఆశించిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుకు అసంతృప్తే మిగిలింది. ప్రస్తుతం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన వ్యవహారం కూడా రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. పునర్విభజన ప్రక్రియ పేరుకే అధికారులు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలే చూసుకుంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పశ్చిమ నియోజకవర్గ నేతలతో జనసేన పార్టీ నేత బోనబోయిన శ్రీనివాసరావు మీటింగ్ పెట్టారు. దీనిపై అమితుమీకి జనసైనికులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ● చుట్టుగుంట రైతు బజార్లో తమ పార్టీకి చెందిన వారికి షాపులు కేటాయించాలని కోరితే ఒక్క షాపు కూడా కేటాయించలేదు. కొత్తగా కేటాయించిన రేషన్ షాపుల్లో జనసేన వారికి అవకాశమే లేకుండా పోయింది. పైగా గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదించకపోవడంపై జనసేన తాజా మాజీ కార్పొరేటర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు అధికారులు కూడా జనసేన నాయకులను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. నల్లపాడు సీఐ వంశీధర్ ఏకపక్షంగా పనిచేస్తూ, అవినీతికి పాల్పడుతున్నా అతనిపై చర్యలు లేవు. ప్రైవేటు ఆసుపత్రిపై దాడి చేసిన కేసులో దాడి చేసిన వారికి సీఐ మద్దతుగా నిలబడటంతో జనసేన నాయకులు ఏకంగా ప్రెస్మీట్ పెడితేగాని అతన్ని మార్చని పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన నాయకులు 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసి తమను ఇబ్బంది పెట్టారన్న భావన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు పైకి కలిసి పనిచేస్తున్నట్లు కనపడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు. నల్లపాడు సీఐ వంశీధర్ అవినీతిపై ప్రెస్మీట్ నిర్వహించి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు (ఫైల్) గుంటూరు పశ్చిమ పరిధిలో జనసేన నాయకులు వస్తే అసలు పనులు చేయవద్దని ఎమ్మెల్యే చెప్పడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సచివాలయ అడ్మిన్లతో సమావేశంలో జనసేన వారికి తనకు సమాచారం ఇవ్వకుండా అసలు పనులు చేయడానికి వీలు లేదని చెప్పడంతో అసలు జనసేన నాయకులుకు పనులు కావడం లేదు. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆఖరికి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం వెనుక గల్లా మాధవిని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నాయకులు ఉండి జనసైనికులను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవగానే ఆమెకు పొలిట్బ్యూరోలో స్థానం ఇవ్వడాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోవడం లేదు. పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు. తమను పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల అసంతృప్తి నామినేటెడ్ పదవుల్లోనూ చిన్నచూపు క్యాడర్తో సమావేశం నిర్వహించిన పశ్చిమ జన సైనికులు పోలీసుల తీరుపై అసహనం అవినీతి అధికారులపై ప్రెస్మీట్ పెట్టాకే నల్లపాడు సీఐకి స్థానచలనం -
మంత్రి ఇలాకాలో పరేషన్
● తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో నిండుకున్న రేషన్ బియ్యం నిల్వలు ● నాలుగు రోజులైనా రేషన్ దుకాణాలకు చేరని వైనం ● దాదాపు 80 షాపులకు మూడో తేదీకి మాత్రమే చేరిన సరుకులు ● ఇంకా రేషను అందని 40 షాపులు ● బియ్యం కోసం వచ్చి తిరిగి వెళుతున్న పేదలు వైఎస్సార్ సీపీ హయాంలో ఠంఛనుగా.. గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం ! -
గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్లకు పతకాలు
మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల 1వ తేదీ నుంచి 3 వరకు ఏపీ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని స్థానిక జిమ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో విజేతలను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. విజయభాస్కరరావు మాట్లాడుతూ సబ్ జూనియర్, జూనియర్, మాస్టర్స్ (మెన్ అండ్ ఉమెన్) ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో గుంటూరు జిల్లా నుంచి 17 పతకాలు సాధించారని తెలియజేశారు. అందులో 11 బంగారు పతకాలు, 2 రజత, నాలుగు కాంస్య పతకాలు పవర్ లిఫ్టర్లు సాధించారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ బాయ్స్ జట్టు మొదటి స్థానం, జూనియర్ మెన్టీమ్ చాంపియన్ షిప్ మొదటి స్థానం, సబ్ జూనియర్ గర్ల్స్ టీమ్ చాంపియన్ షిప్ మూడవ స్థానం, జూనియర్ ఉమెన్స్ టీమ్ మొదటి స్థానం, మొత్తం నాలుగు విభాగాల్లో టీమ్ చాంపియన్ షిప్ సాధించారని తెలిపారు. బెస్ట్ లిఫ్టర్ సబ్ జూనియర్స్ విభాగంలో లిఖిత మూడవ స్థానాన్ని, జూనియర్ ఉమెన్స్లో షబీనా మొదటి స్థానాన్ని, జూనియర్ మెన్లో కౌషిక్ మూడవ స్థానాన్ని, మాస్టర్స్ ఉమెన్లో జ్యోతివర్మ మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పవర్ లిఫ్టింగ్ ఇండియా సౌత్జోన్ సెక్రటరీ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ వంశీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. -
ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే
పట్నంబజారు: ‘మీరు ప్రతి నెల డబ్బులు ఇవ్వాల్సిందే... ఒక వేళ ఇవ్వలేకపోతే... నా దగ్గర వేరే మార్గం ఉంది’ అంటూ గుంటూరు ఈస్ట్ డీటీ భాస్కర్ ఒక డ్వాక్రా గ్రూప్ ద్వారా నడుపుతున్న రేషన్ డీలర్ తిరుమలశెట్టి శివలీల, ఆమె బంధువు ఉప్పుతల విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిర ప్రియదర్శిని కాలనీలోని రేషన్ దుకాణం వద్ద వారిద్దరు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఉన్న 183 నెంబర్ రేషన్ డిపోను తిరుమలశెట్టి శివలీల ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆమె ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్ లీడర్గా ఉన్నారు. ఈస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే డీటీ భాస్కర్కు నెల రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రీవెన్స్లో డీటీ భాస్కర్పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే 18వ తేదీన రూ 1.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది కూడా ఇవ్వాలని అడుగుతున్నారని, తమకు ఆ పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఫోన్లు చేసిన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని, అందులో జిల్లా పౌరసరఫరాల అధికారికి రూ. లక్ష వాటా వెళ్తుందని, అన్ని రేషన్ షాపులు వారు ఇస్తున్నారని, మీరెందుకు ఇవ్వరని వేధిస్తున్నారని తెలిపారు. అది ఇవ్వలేదనే కోపంతోనే, పైగా తాను కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాననే కక్షతో ఈ నెల 2వ తేదీ రాత్రి ఒక ఆటోలో కొంత మంది వ్యక్తులతో బియ్యం తీసుకుని వచ్చారని చెప్పారు. అవి తమ షాపులో పెడుతున్న సమయంలో ప్రశ్నించినా ఏం ఫర్వాలేదు తాను చూసుకుంటామని చెప్పారని తెలిపారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కథంతా మార్చేసి.. బియ్యం తమ షాపులో అధికంగా ఉందని చెప్పి అక్రమంగా కేసు నమోదు చేసి, బలవంతంగా సంతకం చేయించుకున్నారని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా షాపుకు తాళం వేసి వెళ్లిపోయారని తెలిపారు. ప్రతి నెలా రేషన్ మాఫియాకు సైతం తాను చెప్పిన వారికే బియ్యం విక్రయించాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. డీటీ భాస్కర్ తీరుకు స్థానికులంతా ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. స్థానికులు, రేషన్ డిపో ఇంటి యజమాని సైతం డీటీ భాస్కర్ కొంత మంది ప్రైవేట్ వ్యక్తులతో వచ్చి దౌర్జన్యం చేశారని చెబుతున్నారు. -
అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్, ఎస్ఐ జీ సురేష్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. -
రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్ గోవాడ వెంకట్కు కరణం సురేష్ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్ శేఖర్, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్ (హైదరాబాద్), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, వైఎస్కేఎన్ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్ అసోసియేషన్–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్ఎంఆర్ క్రియేషన్స్–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచే తేదీని ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణగుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచే తేదీలను తక్షణమే ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఎప్పటి నుంచి ప్రారంభించేది రైతులకు వివరణ ఇవ్వకుంటే, మొక్కజొన్న అమ్మకాల్లో తీవ్రమైన సందిగ్ధత, నిరాశ నెలకొనే అవకాశముందన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు నినియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్పత్తి వచ్చిన నేపథ్యంలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. రాజకీయ విందు సమావేశాలను పక్కన పెట్టి, రైతుల కడుపు నింపే విధంగా మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన విధంగా రూ.2,400 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గ బోర్డర్ అయిన వడ్లమూడిలోని సంగం డెయిరీలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరతో కొని, నిల్వ ఉంచి, అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధం చేసిన భారీ మొక్కజొన్న నిల్వలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను తీసుకువచ్చి సీజ్ చేయించి, సంగం డెయిరీ ద్వారా అక్రమ నిల్వలకు సంబంధించి వ్యత్యాసం డబ్బులను రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ కొనుగోళ్ల దళారీల గ్యాంగ్ లీడర్ పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై చర్యలు తీసుకోకపోవడం, రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశం సీఎం చంద్రబాబుకు, డీసీఎం పవన్ కళ్యాణ్కు లేదని అర్ధమవుతోందన్నారు. ఇప్పటికే రైతాంగం కళ్లు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్న మొక్కజొన్న పంట కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించకుంటే, రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి గల తీరు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్పోస్టు సెంటర్లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్పోస్టు సెంటర్ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్, శౌర్యదీప్ సింగ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ రవీంద్రరాజు, విజేత స్కూల్ డైరెక్టర్ నిమ్మల సురేష్, ఇన్చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
ప్రశాంతంగా ముగిసిన నీట్
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను నీట్ టెన్షన్ పెట్టింది. మండుటెండలో సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలస్యమైతే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతామోననే ఆందోళన విద్యార్థులలో కనిపించింది. ఆదివారం వైద్య విద్య కోర్సుల జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2026)కు గుంటూరు జిల్లాలో 98.06 శాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 24 కేంద్రాల పరిధిలో కేటాయించిన 8,417 మంది విద్యార్థుల్లో 8,299 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 11 నుంచే ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో సందడి నెలకొంది. ఉదయం 11.30 నుంచి విద్యార్థులను ఆయా కేంద్రాల్లోనికి అనుమతించారు. అంతకుముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆభరణాలు, వాచీలు, టోపీలను తొలగింపచేశారు. అన్ని కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాన గేట్లు మూసివేస్తామని ఎన్టీఏ నిబంధనల్లో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చిన ఓ విద్యార్థినిని లోనికి అనుతించలేదు. దీంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయిన ఆమె కన్నీరు పెట్టుకుంది. గుంటూరు సాంబశివపేటలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. వసతులు కల్పించలేదని తల్లిదండ్రుల ఆగ్రహం ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నీట్ రాసేందుకు పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మొత్తం 2,976 మందికిగాను 2,911 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. కానీ పరీక్ష సమయం 2 గంటలకు అని స్థానికులు చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి వర్సిటీకి చేరుకునే క్రమంలో 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ప్రధాన ద్వారం గేటు వేశారు. ఆ విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా అవకాశం లేదని, పరీక్ష రాసే విద్యార్థి తంబ్ (వేలిముద్ర) తీసుకోదంటూ వెనక్కి పంపించారు. 30 సెకన్లు ఆలస్యంగా వచ్చిన మరో విద్యార్థిని విషయంలో డీఎస్పీ మురళీకృష్ణ చెప్పడంతో లోనికి అనుమతించారు. వేలాదిగా తల్లిదండ్రులు వర్సిటీ వద్దకు తమ పిల్లలతో చేరుకున్నారు. నిర్వాహకులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం, తాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయడకపోవడంతో చెట్ల కింద, జాతీయ రహదారి అండర్పాస్ కింద వారు గడపాల్సి వచ్చింది. విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులకు వసతులు కల్పించడంతో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని, కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల కింద, ప్రధాన ద్వారం ఎదుట కూర్చోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు మండిపడ్డారు. వర్సిటీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నాసరయ్య తదితరులు కూడా విషయంలో అధికారుల తీరును ఖండించారు. పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
ముగిసిన జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్ అసోసియేషన్, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
పెద్దాసుపత్రికి నిర్లక్ష్య రోగం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు అలమటిస్తున్నారు. సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతి రోజూ 3 వేల మందికిపైగా గుంటూరు జీజీహెచ్కు వస్తున్నారు. రోగులకు సరిపడా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రి అధికారులు విఫలమవుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన సీనియర్ వైద్యులు మధ్యాహ్నానికే ఇళ్లకు, సొంత క్లినిక్లకు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పర్యవసానంగా పెద్ద ఆసుపత్రిలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి గంపెడంత ఆశతో చికిత్స కోసం వస్తున్న నిరుపేదలు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. గుంటూరు మెడికల్: జీజీహెచ్కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుల పనితీరుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సరెండర్ చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆసుపత్రి మొత్తానికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర వైద్య విభాగంలో అత్తెసరు వైద్య సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ కూడా మొక్కుబడిగా కొనసాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు.... జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్లపై, వీల్చైర్లలో ఆక్సిజన్ మాస్క్లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు. ఉదయం ఓపీలో చూపించుకున్న రోగి రిపోర్ట్ల కోసం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. రిపోర్ట్లు చేతికి అందేసరికి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. రోగులు రిపోర్ట్లు చేతిలో పట్టుకుని ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లి మరోరోజు వైద్య సేవల కోసం రావాల్సి వస్తోంది. ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు..... పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే. లేదంటే రాత్రి వేళల్లో ప్రైవేటు అంబులెన్స్ల వారికి పదివేల వరకు చెల్లించి మృతదేహాలను తరలించుకోవాల్సి వస్తుందని బంధువులు వాపోవుతున్నారు. మహాప్రస్థానం వాహనాల సేవలు అంతంత మాత్రమే ఉంటున్నా ఆస్పత్రి అధికారులు వారికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అర్ధాకలితో విధుల నిర్వహణ జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు. జీతాలు నెలా నెలా రాకపోవటంతో వారు ఫోన్పే స్కానర్లు పెట్టి మరీ మామూళ్లు అడుగుతున్న వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముట్టజెప్పాల్సిందే... కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఫైల్ కదలాలన్నా ముడుపులు ముట్టచెప్పాల్సిందే. నర్సింగ్ కార్యాలయంలో కూడా సెలవుల మంజూరుకు, డ్యూటీల కేటాయింపునకు మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.నీళ్ల బాటిల్ కొనుగోలు చేసి తీసుకెళుతున్న దృశ్యంక్యాన్సర్ ఆసుపత్రి వద్ద పనిచేయని వాటర్ కూలర్ వీల్చైర్పై రోగిని తీసుకెళుతున్న సహాయకురాలుగుంటూరు జీజీహెచ్లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు. ఎండలకు జీజీహెచ్లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయకపోవటంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. వార్డుల్లో ఉంటున్నవారు మరుగుదొడ్లు వినియోగించేందుకు, ఇతర అవసరాల కోసం నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం జీజీహెచ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. భోజన విరామం కోసం గంట గ్యాప్ ఇస్తే, మిగతా సమయమంతా ఓపీల్లో వైద్యులు ఉండి చూడాల్సిందే. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వారు తీరిగ్గా 10 గంటలకు ఓపీకి వస్తున్నారు. కొంత మంది హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు ఓపీ వైద్య సేవలకు డుమ్మా కొడుతున్నారు. ఓపీ విభాగానికి వచ్చిన సీనియర్ వైద్యులు రోగులను చూడకుండా ఓపీ సమయంలోనే వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతూ మధ్యాహ్నం చేయాల్సిన విధులను ఓపీలో చేసేసి మధ్యాహ్నం విధులు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. కొంత మంది వైద్యులు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఇళ్లకు, సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కొంత మంది పీజీ వైద్యులతో కొన్ని వైద్య విభాగాల వారు ఈవినింగ్ క్లినిక్ను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పెద్దాసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారంలో కేవలం రెండు రోజులు లేదా మూడు రోజులు మాత్రమే ఓపీలు నిర్వహిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవల కోసం రోగులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. విధులు నిర్వహించని వైద్యులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని వీల్చైర్లు తుప్పుబట్టిపోయి వినియోగించడానికి పనికి రాకుండా ఉంటున్నాయి. రోగుల బంధువులే వైద్య పరీక్షల కోసం, వార్డుల్లో అడ్మిషన్ కోసం రోగులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. రోగులను తరలించాల్సిన కింది స్థాయి ఉద్యోగులు ఆసుపత్రిలో ఉన్నారో.. లేరో.. అన్నట్లు ఉంది. వీరిపై అజమాయిషీ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన.. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి– చుండూరు స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెనాలి పోలీసుల రూటే సెపరేటు
తెనాలి: తమ రూటే సెపరేటు అన్నట్టుగా తయారయ్యారు తెనాలి పోలీసులు. కేసుల నమోదు, నిందితుల అరెస్టులో విమర్శలు వస్తున్నా పట్టటం లేదు. చివరకు పోలీసులపై దాడి కేసుల్లోనూ నిందితులను గోప్యంగా ఉంచుతున్నారు. అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే కేసుల నమోదు, నిందితుల అరెస్టు వంటివి జరుగుతున్నాయనేది బహిరంగంగానే వినిపిస్తోంది. ఇటీవల అంగలకుదురులో జరిగిన దాడి కేసులోనూ పోలీసులు ఇదే వైఖరిని అవలంభించారు. గ్రామస్తులంతా మూకుమ్మడిగా రోడ్డుపై ధర్నాకు దిగితేగాని తత్వం బోధపడలేదు. సాధారణ సెక్షన్లతో నమోదుచేసిన కేసును హత్యాయత్నం కేసుగా మార్చుతామనీ, నిందితులను అరెస్టు చేస్తామని హామీని ఇవ్వాల్సివచ్చింది. ● రూరల్ మండలం అంగలకుదురులో గత నెల 28వ తేదీ సాయంత్రం రోడ్డుపై వాహనం పార్కింగ్ విషయమై గ్రామానికి చెందిన వెలగా తులసీరామ్, షేక్ నాగుల్మీరాల మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 9:45 గంటల ప్రాంతంలో నాగుల్మీరా, మరి కొంతమందిని వెంటతీసుకుని తులసీరామ్ ఇంటికి వవెళ్లారు. ఇంట్లో ఉన్న అతడిని కిందకు కొట్టుకుంటూ తీసుకురావడమే కాకుండా, వస్తువులను ధ్వంసం చేసి, దొమ్మీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిని తులసీరామ్ను స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ 324, ఇంట్లోకి దొమ్మీపై వెళ్లటంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ● టీడీపీ ఆధిక్యత కలిగిన అంగలకుదురులోకి బయట వ్యక్తులు ప్రవేశించి తులసీరామ్పై అతడి ఇంట్లోనే మందిగా వచ్చి దాడికి పాల్పడటంపై గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అంగలకుదురు గ్రామ పరిరక్షణ సంఘంగా ఏర్పడి సమావేశం పెట్టుకున్నారు. రక్తగాయాలు వచ్చేలా దాడిచేసిన కేసులో 324 సెక్షన్ పెట్టటం, దొమ్మీపై నాన్బెయిలబుల్ కేసు పెట్టటం నచ్చలేదు. పైగా మూడురోజులైనా నిందితులను అరెస్టు చేయని పోలీసుల వైఖరిపై మండిపోయారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగకపోతే న్యాయం జరగదన్న భావనతో శనివారం సాయంత్రం అంగలకుదురులో తెనాలి–గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు బైక్లను అడ్డుపెట్టారు. ప్లకార్డులను చేతపట్టి పోలీసుల వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఫలితంగా రద్దీ రహదారిలో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు, సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీసుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తప్పని పరిస్థితుల్లో నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని, దాడిపై నమోదు చేసిన సెక్షన్నూ మారుస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. -
వైభవంగా సాక్షి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్సీ), ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్న్ హెచ్సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్స్టేషన్ హెచ్సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
మీ విజయం స్ఫూర్తిదాయకం
గుంటూరు వెస్ట్: ‘విద్యార్థులూ... మీ విజయం స్ఫూర్తిదాయకం.. భవిష్యత్ విజేతలు మీరే..’ అని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ కొనియాడారు. తన మాతృమూర్తి ఉపాధ్యాయురాలని, ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ఎంతో గౌరవం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుల అభినందన సభ ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో జిల్లాను గర్వకారణంగా నిలిపారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల ఉన్న అపోహలన్నింటికీ సమాధానం మీరేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరూ.. మీమీ పాఠశాలల్లోని తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు స్ఫూర్తిని, ప్రేరణను నింపాలన్నారు. పిల్లల చదువులకు సహకరించి, గొప్ప విజయాలు సాధించడంలో తోడ్పాటును అందించిన తల్లిదండ్రులను అభినందించారు. ఉత్తమ ఫలితాల సాధనలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. నేటి ప్రభుత్వ విద్యార్థుల మార్కులు చూస్తే తనకే ఈర్ష్యగా ఉందంటూ.. అంతటి ఘనవిజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు సెల్యూట్ చేశారు. ● జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ జిల్లా నుంచి 27,012 మంది పరీక్షలకు హాజరు కాగా 24,011 మందితో 88.89 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో జిల్లా నిలిచిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సత్కరించారు. మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఇదేం రీల్స్ పిచ్చి!
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్ సోషల్ మీడియా రీల్స్కు అడ్డాగా మారింది. రోగులకు సేవలందించాల్సిన ఓ వైద్యుడు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. కర్రతో విన్యాసాలు చేస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టడంతోపాటు, ఫేస్బుక్, యూట్యూబ్లలో సైతం అప్లోడు చేశాడు. సాక్షాత్తు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుటే డాక్టర్ రీల్స్ చేస్తున్నా సూపరింటెండెంట్ గానీ, సీఎస్ ఆర్ఎంఓగానీ, అడ్మినిస్ట్రేటర్ గానీ ఎవరూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. విధులకు డుమ్మా.. రీల్స్తో హంగామా జీజీహెచ్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) గా క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గురుప్రసాద్ శుక్రవారం క్యాజువాల్టీలో విధులు నిర్వహించకుండా సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జీజీహెచ్లో క్యాజువాల్టీ ఆసుపత్రికి గుండెకాయలాంటిది. రోడ్డు ప్రమాద బాధితులు, విషప్రభావానికి గురైన వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారంతా కూడా మొదట ఎమర్జెన్సీ వార్డుకు చికిత్స కోసం వస్తుంటారు. అక్కడ వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండి బాధితులను రోగులను సత్వరమే పరీక్షించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. ఎంతో కీలకమైన క్యాజువాల్టీలో డాక్టర్ విధులు నిర్వహించకుండా రీల్స్ చేయడంపై ప్రశ్నించినందుకు ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి, ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్బాబుతో సైతం దురుసుగా మాట్లాడి కర్రతో దాడిచేసినట్లు డాక్టర్ అనిల్బాబు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఆరోపణలు.. గతంలోనూ ఎమర్జెన్సీ మెడిసిన్లో విధులు నిర్వహించడం లేదని, డ్యూటీలు నిర్వహించకుండా రీల్స్ చేస్తున్నారన్న ఆరోపణలు డాక్టర్ గురుప్రసాద్పై వచ్చాయి. అతడిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా పనిచేసిన డాక్టర్ గాజుల రామకృష్ణ సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు సదరు వైద్యుడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ నేడు ఆవిధంగా రీల్స్ చేస్తూ ఆసుపత్రి పరువు బజారున పడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వైద్యులు ఇలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం విమర్శలకు తావిస్తుంది. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్వర్మ సంఘటనపై స్పందించి ఎమర్జెన్సీ వార్డులో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేలా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని, రీల్స్ చేయకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
జగన్ పాలనలో శ్రమజీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రమ జీవులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. శుక్రవారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షుడు శేషగిరి పవన్కుమార్ ఆధ్వర్యంలో మేడే (కార్మికుల దినోత్సవ) వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, షేక్ నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కార్మిక జెండాను ఆవిష్కరించారు, అనంతరం ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు సోదరులకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి విస్తృత రీతిలో కార్యక్రమాలను అమలు పర్చడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారని అన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో కార్మిక, కర్షక, రైతుల సంక్షేమం ఎండమావిగా మారిందని, కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు న్యాయమైన హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేత నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి పెనుమాల అరుణ్కుమార్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిపోయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మురళి, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు పటాన్ సైదాఖాన్, బాబు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జి.ప్రభు, అరవింద్, చింతపల్లి రమణ, అరుణ్, భాను, కేసరి సుబ్బులు, స్వర్ణలత, నందేటి రాజేష్, సురసాని వెంకటరెడ్డి, నాజర్, హనుమంతు గోపి శ్రీనివాస్, రామచంద్రయ్య పాల్గొన్నారు. -
ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు
రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. కమనీయం రంగనాథుడి కల్యాణం యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంప్ల పోస్టర్ను శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ అశుతోష్ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. -
ఏఐ సరే.. అసలు కారణం పట్టించుకోరే?
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల నియంత్రణకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డ్రోన్ల సహాయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దోమల లార్వా నియంత్రణకు చేపట్టిన ఈ కార్యక్రమాలు కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతున్నాయని, అసలు సమస్యకు మూల కారణాలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు విలీన గ్రామాల్లోని 26 ప్రధాన చెరువుల్లో, మురుగు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ ఆపరేషనన్ చేసేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే సదరు డ్రోన్ ఆపరేషన్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో అక్కడే మురుగునీరు నిల్వ ఉండి దోమల వృద్ధికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని శివారు ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమల వృద్ధి మరింత పెరిగిపోతోందని చెప్పుకోవచ్చు. శుభ్రం చేసే వారే కరువు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 3,129.45 కిలోమీటర్ల పొడవైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. నగర పరిధిలో ప్రజారోగ్య విభాగంలో సుమారు 2 వేల మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమంది డెప్యూటేషన్పై నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల వద్ద, మరి కొంతమంది అధికారుల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ గడిపేస్తున్నారు. మిగిలిన కొంతమందితో నగరం అంతా డ్రైనేజీ వ్యవస్థ శుభ్రం చేయడం కష్టంగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో పారిశుద్ద్య కార్మికులు డ్రైయిన్లు శుభ్రం చేసే పరిస్థితి లేదని నగరవాసులు చెబుతున్నారు. అదే విధంగా మలేరియా విభాగంలో పనిచేసే వారు ఫాగింగ్ మిషన్లను ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువగా తిప్పుతున్నారు. మిగిలిన ప్రాంతాలకు అసలు వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.. దీంతో రాత్రి వేళల్లో నగర వాసులు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాలలో అధ్వానం గుంటూరు నగరంలో విలీనమైన 10 గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కచ్చా డ్రైనేజీలు దర్శనమిస్తూ.. ఆ డ్రైనేజీలో మురుగు అంతా ఇళ్ల ముందే నిలిచిపోయి దుర్వాసనతోపాటు దోమల వృద్ధికి కారణం అవుతోంది. అదే విధంగా నగరంలో ఖాళీ స్థలాలు 10 వేలకుపైగా ఉన్నాయి. వీటిల్లో చాలా చోట్ల పిచ్చి మొక్కలు, చెట్లు పెరగడంతోపాటు కొన్ని స్థలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు సాధారణంగా చెరువుల్లో దట్టంగా పెరిగిన గురప్రుడెక్క, తూటికాడను తొలగింపజేస్తారు. జీఎంసీ మలేరియా విభాగ సిబ్బంది నేరుగా లోపలికి వెళ్లి మందు చల్లడం ప్రమాదకరంగా మారడంతో ఏఐ డ్రోన్లను వాడుతున్నారు. కానీ డ్రైయిన్లు లేని చోట నిర్మించడంతోపాటు ఉన్నవాటిని సక్రమంగా శుభ్రం చేయించడం ముఖ్యమనే విషయం కూడా అధికారులు మర్చిపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించడంతోపాటు ఫాగింగ్ వంటివి కూడా పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అప్పుడే కొంతలో కొంతైన దోమల నివారణ సాధ్యమవుతుందని నగర వాసులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు అవకాశం
డిసెంబరు 31వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి గుంటూరు, వెస్ట్: సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ భూ పరిమితులు చట్టం, 1976 ప్రకారం ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందన్నారు. తమ ఆధీనంలో ఉన్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువున, ఎగువున ఉన్న అందరు నిబంధనల మేరకు అర్హత కలిగి ఉంటారన్నారు. సీలింగు భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ 241 జి.ఓను జారీ చేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వుల మేరకు సీలింగ్ భూములను క్రమబద్ధీకరించుకొనుటకు అర్హులైన వ్యక్తులు డిసెంబరు 31వ తేదీలోగా జాయింట్ కలెక్టర్, కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సిలింగ్స్, గుంటూరు వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు దఫాలుగా – దరఖాస్తు సమయంలో 50 శాతం, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తేదీ నుంచి ఒక నెల గడువు లోపల మిగిలిన 50 శాతం చెల్లించాలని వివరించారు. 150 చదరపు గజాల వరకు అన్ని అర్హతలు గల వారికి ఉచితంగా డి – పట్టా మంజూరు చేస్తారని, 150 నుండి 300 చదరపు గజాల వరకు ప్రాథమిక (బేసిక్) విలువలో 15 శాతం చెల్లించాలని, 300 నుండి 500 చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 30 శాతం, 5 వందల చదరపు గజాలకు పైబడి ఉంటే బేసిక్ విలువ శత శాతం చెల్లించాలని వివరించారు. క్రమబద్ధీకరించుకొను అర్హులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 2019 మే 1వ తేదీకి ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్రమబద్దీకరణ విలువ చెల్లించిన వారి భూములను వారి సొంత ఖర్చులతో వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కల్పించడమే కాకుండా ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు తగు చర్యలు తీసుకుంటారన్నారు. డి – పట్టా పొందిన వారికి, గతంలో 10 సంవత్సరాల తరువాత మాత్రమే బదలాయింపు చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం 2 సంవత్సరాలకు బదలాయింపు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 8,417 మంది విద్యార్థులకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఆభరణాలను ధరించరాదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతోపాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను ఆయా కేంద్రాల్లోనే ఇస్తారు. -
నగర అభివృద్ధికి సమష్టి కృషి అవసరం
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు వెస్ట్: గుంటూరు నగరం రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై శుక్రవారం స్థానిక కలెక్టట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, కమిషనర్ కె.మయూర్ అశోక్, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు వంటి సౌకర్యాలు సమకూర్చి సుందరమైన పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల పౌరులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా వాణిజ్య సంస్థల నుంచి వచ్చే చెత్త నిర్మాణ పట్ల దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణను ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ప్రజా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. బొంగరాలబీడు వద్ద మంచి పార్కు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరం మేరకు కార్మికులను పెంచాలని, 2027 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. గోరంట్ల నీటి పథకం జూన్ మొదటి వారం నాటికి ప్రారంభం కావాలని ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానస సరోవరం అభివృద్ధి పనులను పి.పి.పి మోడ్లో చేపట్టే ఆలోచన ఉందన్నారు. అమృత్ 2.0 క్రింద చెరువు పునరుద్ధరణకు అవకాశం ఉందని చెప్పారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు శాసీ్త్రయ విశ్లేషణ చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. రమణీయం.. రథోత్సవం పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, స్వామివారి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. డప్పు కళాకారుల సందడి ఆకట్టుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవదాయ సహాయ కమిషనర్ గాండ్ల కామేశ్వరమ్మ, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధర తిలక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 7 -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన మనందరి సమష్టి బాధ్యత అన్నారు. బార్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్కుమార్, ఆర్.చేతన్, పి.వీరాంజనేయులు, స్టేక్ హోల్డర్స్, సోప్ వర్కర్స్, మునిసిపల్ వర్కర్స్, ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
రంగురాళ్ల డంపు స్వాధీనం
దాచేపల్లి: భారీ స్థాయిలో రంగురాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహాయంతో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లు (క్రిస్టల్ క్వార్జ్) స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ నుంచి ఈ రంగురాళ్లు వెలికి తీసినట్లు అధికారులు గుర్తించారు. రంగురాళ్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తరువాత వీటి విలువ ఎంత అనేది తెలుస్తుంది. స్థానికుల సమాచారం సుమారు రూ.కోటి పైనే రంగురాళ్ల విలువ ఉంటుందంటున్నారు. స్థానిక సీఐ రాజేష్, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, పంచనామా నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
రానున్న ఐదు రోజులు ఎండ తీవ్రం
గుంటూరు వెస్ట్: రానున్న ఐదు రోజులపాటు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న ఐదు రోజులలో వేసవి తీవ్రత (హీట్ ఇండెక్స్) అధికంగా ఉంటుందని సూచించిందన్నారు. 41 – 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండవచ్చని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు ఫిరంగిపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, గుంటూరు పశ్చిమం, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచెరుకూరు, తుళ్ళూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ఆయన సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబసభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పింఛన్లు పంపిణీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ శుక్రవారం స్థానిక ఆకులవారి తోటలో పంపిణీ చేశారు. స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. -
అంతర్ జిల్లా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జిల్లా జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జీఎస్సీ బోస్, కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు సీహెచ్ శ్రీనివాసరావు, అనిల్, రవికుమార్ పర్యవేక్షించారు. అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుపున బాలుర విభాగం నుంచి షణ్ముఖ్, రూపేష్, మణికంఠ, అఖిల్, జాన్ ప్రడ్డి పాల్, జయ రామ్, అఖిల్, విజయ్, ప్రత్యుష, సత్య, ఈశ్వర్ దినేష్ స్టాండ్ బై గా గిరి, హర్షిత్, ఆకాష్, రుత్విక్, బాలికల విభాగం నుంచి యోగ శ్రీ, మానస, అక్షయ, కుండానే, కావ్య, జుబేరియా, శ్రీ లక్ష్మి, ఫర్హానా, ఈషా, ప్రణతి, సహస్ర, సాయి శ్రీ స్టాండ్ బైగా బృంద, జస్విత, ప్రణీత, బ్లేస్సిలను ఎంపిక చేశారు. డాక్టర్ తనపై దాడి చేశాడంటూ విభాగాధిపతి ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో విధుల కేటాయింపులో వివాదం ఏర్పడి ఓ డాక్టర్ ఓ విభాగాధిపతిపై దాడిచేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనపై దాడిచేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ విభాగాధిపతి లిఖితక పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ ఆర్ధోపెడిక్ విభాగాధిపతిగా, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా డాక్టర్ పాటిబండ్ల అనిల్బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి విధులు చేపట్టిన డాక్టర్ అనిల్బాబు ఎమర్జెన్సీ మెడిసిన్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలువురు క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్లకు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్) విధులు కేటాయించారు. జీజీహెచ్లో క్యాజువాల్టీలో పనిచేస్తున్న సీఏఎస్లను క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. వీరు మూడు షిఫ్ట్లు క్యాజువాల్టిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించి డ్యూటీ రోస్టర్ వేసిన పిదప క్యాజువాల్టిలో విధులు నిర్వహించకుండా ఆర్ఎంఓ రూములో డాక్టర్ గురుప్రసాద్ ఉండటంపై డాక్టర్ అనిల్కుమార్ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి డాక్టర్ గురుప్రసాద్ తనను అసభ్యంగా మాట్లాడి, కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలు సక్రమంగా నిర్వహించేలా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఉన్నవ గ్రామంలో చోరీ యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం శివారు పరిధిలోని వెంకటేశ్వర నగర్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన దాసరి మరియబాబు (35) బైకుపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని వెంకటేశ్వరనగర్ సమీపాన ఏదురుగా వస్తున్న ఆర్టీసీ ఢీకొనటంతో రోడ్డుపై పడి కుడి కాలు విరిగిపోవటంతో సత్వరమే 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్తం అధికంగా పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఆర్టీసి డ్రైవరు సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురగల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్క్ఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ,11సెల్ఫోన్లు, స్పానిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చట్టాలపై అవగాహన అవసరం
గుంటూరు లీగల్: చట్టాలపై మహిళలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్లో ఉన్న బాధిత మహిళలతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయ పరమైన సలహాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారికి అందే చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సెలర్ శాంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. ఐపీడీ కాలనీ, సాయికృష్ణ నగర్లోని ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్ను సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ -
మెరిసిన మనోళ్లు
గుంటూరు ఎడ్యుకేషన్ : గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకుగానూ గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 598 మార్కులను సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. టెన్త్లో టాప్ మార్కులు కై వసం చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇంజినీర్లుగా ఎదగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. మా స్వస్థలం పాత గుంటూరులోని వినోభానగర్. నాన్న దుర్గారావు చిన్నతనంలోనే మరణించారు. అమ్మ స్వర్ణకుమారి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ చదివిస్తున్నారు. ఇంగ్లిషులో రెండు మార్కులు తగ్గాయి. మిగతా అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కుల చొప్పున వచ్చాయి. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతో పాటు రోజువారీ పరీక్షల్లో ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుని మంచి ఫలితాల సాధన దిశగా ముందుకెళ్లాను. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవడం ద్వారానే ఈ స్థాయిలో ఫలితాలు సాధించా. – జి.దినేష్ (598 మార్కులు) మా స్వస్థలం గుంటూరు శివారులోని గోరంట్ల. నాన్న వెంకట్రావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ నాగలక్ష్మి వార్డు సచివాయంలో ఉద్యోగి. ఇంగ్లిషు, ఫిజికల్ సైన్సులో ఒక్కో మార్కు చొప్పున తగ్గాయి. ఇంటర్మీడియేట్లో ఎంపీసీ గ్రూపులో చేరి, ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నా. – పలకలూరి స్వేచ్ఛ ప్రియదర్శిని (598 మార్కులు) మా స్వస్థలం అమరావతి. నాన్న శివప్రసాద్ వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ విమలాదేవి గృహిణి. ఇంగ్లిషు, హిందీలో ఒక్కొక్క మార్కు చొప్పున తగ్గాయి. ప్రణాళికాబద్ధంగా చదవడం, ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా అధిక మార్కుల సాధనకు దోహదపడింది. – కె.ఇందువదన (598 మార్కులు) -
శేషవాహనంపై నారసింహుడు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
టెన్త్లో బాలికలదే పైచేయి
గుంటూరు ఎడ్యుకేషన్ : గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన 27,012 మంది విద్యార్థుల్లో 24,011 మంది ఉత్తీర్ణులయ్యారు. గుంటూరు జిల్లాలో 88.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచినా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 8వ స్థానానికి పరిమితమైంది. మూడేళ్లుగా 89 శాతానికి ఉత్తీర్ణత శాతం మించడం లేదు. బాలురు 14,377 మంది పరీక్షలకు హాజరు కాగా 12,607 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 87.69 శాతం నమోదైంది. బాలికలు 12,635 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,404 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు ç³§ø ™èlÆý‡VýS† ç³È„ýS çœÍ-™éÌZÏ hÌêÏÌZ° {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌSÌS ѧéÅ-Æý‡$¦Ë$ A™èl$Å™èl¢Ð]l$ çœÍ-™éÌS¯]l$ Ý뫨…-^éÆý‡$. hÌêÏ ÐéÅç³¢…V> {糿¶æ$™èlÓ, gñæyîlµ, Ð]l¬°Þç³ÌŒæ, Ýë…íœ$MýS çÜ…„óSÐ]l$ VýS$Æý‡$-MýS$ÌS ´ëuý‡Ô>ÌSÌS ¯]l$…_ sñ毌S¢ ç³È-„ýSË$ Æ>íܯ]l õ³§ýl MýS$r$…-»êÌS ѧéÅ-Æý‡$¦Ë$ {糆-¿ê-Ð]l…-™èl$-Ë$V> °Í-^éÆý‡$. {ò³•Ðólr$, M>Æöµ-Æó‡-sŒæ™ø ´ùsîæ ç³yìl Æ>çÙ‰-Ýë¦Æ‡$$ÌZ A«¨MýS Ð]l*Æý‡$PË$ Ý뫨…-^èl-yýl…-™ø-´ër$ hÌêÏÌZ sêç³Æý‡$ÏV> °Í-^éÆý‡$. {糿¶æ$™èlÓ ´ëuý‡Ô>ÌSÌZÏ A™èlÅ«¨MýS Ô>™èl… Ð]l$…¨ ѧéÅÆý‡$¦Ë$ E¡¢-Æý‡$~Ë$ M>Ð]l-yýl…-™ø-´ë}-ెMýS$PÐ]l Ð]l*Æý‡$PË$ Ý뫨…-_¯]l ѧéÅ-Æý‡$¦Ë$ Ð]l…§ýlÌS Ð]l$…¨ E¯é²Æý‡$. õ³§ýl, Ð]l$«§ýlÅ ™èlÆý‡VýS† ™èlÍÏ-§ýl…-{yýl$Ë$ B¯]l…§ø-™éÞ-à-ÌS™ø E¯é²Æý‡$. ప్రథమ శ్రేణిలో 20,504 మంది ఉత్తీర్ణులు అత్యధిక శాతం మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై వారే ఉన్నారు. పరీక్షలు రాసిన 27,012 మందిలో 24,011 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 20,807 మంది ప్రథమ శ్రేణి పొందారు. మిగిలిన వారిలో 2,430 మంది ద్వితీయ, 774 మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 17 ప్రభుత్వ బడుల్లో వందశాతం ఉత్తీర్ణత.. జిల్లాలోని 186 ప్రభుత్వ పాఠశాలల్లో 17 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేసినవి 54 ఉన్నాయి. 50 శాతంలోపు నమోదు చేసిన పాఠశాలలు నాలుగు ఉన్నాయి. యాజమాన్యాల వారీగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 97.67 శాతం, ప్రైవేటు పాఠశాలలు 95.51 శాతం, సోషల్ వెల్ఫేర్ 92.89, ట్రైబల్ వెల్ఫేర్ 78.94, జెడ్పీ 78.48, ఎయిడెడ్ 76.39, మున్సిపల్ 74.82, ప్రభుత్వ పాఠశాలల్లో 73.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా స్థానం రాష్ట్రస్థాయిలో దిగజారింది. మారుమూల ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో 88.89 శాతంతో 8వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో టెన్త్లో ఉత్తీర్ణత 88.89 శాతానికి పరిమితం కావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
సుబ్రహ్మణ్యస్వామిని సేవలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్
తెనాలి రూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు. -
నేటి నుంచి ఇళ్ల గణన
గుంటూరు వెస్ట్: జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇళ్ల గణనపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 62,434 కుటుంబాలు స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతోందన్నారు. జిల్లాలో 3,803 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను ఏర్పాటు చేశామన్నారు. 4,046 మంది ఎన్యుమరేటర్లను, 720 సూపర్ వైజర్లను, 23 మంది ఛార్జ్ అధికారులను నియమించామన్నారు. ఇందులో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది 3213, జూనియర్ సహాయకులు 383 మంది, సీనియర్ సహాయకులు 220 మంది, ఇతరులు 950 మంది ఉన్నారని తెలిపారు. సిబ్బంది అందరికీ శిక్షణ నిర్వహించామని చెప్పారు. ఎన్యుమరేటర్లకు జనగణనకు అవసరమయ్యే కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు అంకితభావంతో పనిచేసి సరైన డేటా సేకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించగా, ఇళ్ల గణన మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్యుమరేటర్స్కి, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, సీపీఓ పి.శేషశ్రీ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఏఎన్యూ వార్షికోత్సవం
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ గోల్డెన్ జూబిలీ వేడుకల సందర్భంగా కళాశాలల రెండు రోజుల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జాన్ డేవిడ్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కె.గంగాధర్ రావు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ గజల్ శ్రీనివాస్, అర్జున అవార్డు గ్రహీత ఒలింపియన్ మంగళ్ సింగ్ చాంపియా, కళారత్న దామోదర గణపతిరావు పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం, రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరాం ప్రసాద్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్విఎస్ఎస్ఎన్ రవికుమార్ హాజరయ్యారు. కన్వీనర్గా ప్రొఫెసర్ ఎం.త్రిమూర్తి రావు వ్యవహరించారు. వీసీ ప్రొఫెసర్ కె.గంగాధర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం కృషి చేయాలని, నిరంతరం నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళారత్న శ్రీ దామోదర గణపతి రావు ,ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ, అర్జున అవార్డు గ్రహీత మంగళ్ సింగ్ చాంపియా, డాక్టర్ గజల్ శ్రీనివాస్లు మాటాడారు. ఆయన ఆలపించిన గజల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రొఫెసర్ కె.వీరయ్య, ప్రొఫెసర్ పి. పి. ఎస్. పాల్ కుమార్ , ప్రొఫెసర్ కె. తేజోమూర్తి, ప్రొఫెసర్ ఆర్వి నిరుపమలు తమ కళాశాలల పురోగతిని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
2 నుంచి ఆహ్వాన నాటికల పోటీలు
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపూరి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మే నెల 2,3,4,5 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) సౌజన్యంతో జరిగే ఈ పోటీలు ఈసారి కొలకలూరు పంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల్నుంచి జరుగుతాయని కళాపరిషత్ కార్యదర్శి గోపరాజు విజయ్ బుధవారం ప్రకటించారు. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజున గోపరాజు బాల త్రిపురసుందరమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటీమణి దాసరి రమాదేవి (హైదరాబాద్కు ప్రదానం చేస్తారు. 3వ తేదీ రాత్రి కరణం సురేష్ జ్ఞాపకార్ధం ఏటా ఇస్తున్న సవ్యసాచి అవార్డును ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ వెంకట్ గోవాడ (హైదరాబాద్), గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణి (విజయనగరం)లకు బహూకరిస్తారు. 4వ తేదీన కొలంకపురి కళాపరిషత్ రచనల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. చివరిరోజున గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు డాక్టర్ సీఎస్ ప్రసాద్ (కాకినాడ)కు అందజేసి సత్కరిస్తారు. డాక్టర్ గోవాడ వెంకట్ దాసరి రమాదేవి -
పానక నివేదన పథకం ప్రారంభం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం నివేదిస్తామని ఆయన తెలిపారు. ఒక బిందెకు రూ. 40, 11 బిందెలకు రూ. 440, 27 బిందెలకు రూ. 1080, 108 బిందెలకు రూ. 4320, 365 బిందెలు (రోజుకు ఒక బిందె చొప్పున సంవత్సరానికి) రూ. 14,600 లతో పథకాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు పొందేందుకు ఆర్జిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఊంజల్ సేవ, బంగారు గరుడోత్సవం, పెద్ద శేషవాహనం, చిన్నశేష వాహనం సేవలకు రూ.5 వేల చొప్పున, సుదర్శన హోమం, నరసింహ హోమం, లక్ష్మీ హోమానికి రూ. 3500 చొప్పున, శాంతి కల్యాణం రూ. 1500, నిత్య గోత్ర నామార్చనకు (సంవత్సరం) రూ. 516 గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్జిత సేవల కోసం రుసుము చెల్లించుటకు ఆన్లైన్ ద్వారా ‘సిటీ యూనియన్ బ్యాంక్, మంగళగిరి శాఖ, అకౌంట్ నెం. 500 101 014 411 599, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 688’కు చెల్లించవచ్చని తెలియజేశారు. నిత్యాన్నదాన ప్రసాదాలకు విరాళాలు ఇచ్చే వారు మహారాజ పోషకులు రూ. 1,01,116 పైన, రాజపోషకులు రూ. 50,116 పైన, పోషకులు రూ. 25116 పైన, ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవారు రూ. 10116 గా నిర్ణయించామని వివరించారు. విరాళాలు ఆన్లైన్ ద్వారా ‘మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెం. 500 101 042 919 33, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 686’లో చెల్లించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
అరాచకానికి అందలం!
గుంటూరు రూరల్: ‘అరాచకాలు చెయ్.. అక్రమాలకు పాల్పడు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెట్టు.. మంచి ఆదాయం వచ్చే పోస్టింగ్ పట్టు’ అన్నట్లుంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. ఎన్నో ఆరోపణలు, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనలో వీఆర్కు పిలిచిన సీఐకి నెల రోజులు గడవక ముందే, విచారణ సైతం పూర్తి కాకుండానే నగరంలోనే అధిక ప్రాధాన్యం కలిగిన పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తోంది. నల్లపాడు పోలీస్స్టేషన్లో గతంలో సీఐగా పనిచేసిన సీఐ సైతం సెటిల్మెంట్లు, రియల్ దందాలు, బార్ల వద్ద అక్రమ వసూళ్లు, వై.జంక్షన్లో రాత్రి సమయాల్లో అనేక రాచకార్యాలు వెలగబెట్టి చివరికి జనసేన నాయకుల ఒత్తిడితో ఎట్టకేలకు వీఆర్కు వెళ్లారు. ● ఇప్పుడు అదే కోవకు చెందిన మరో సీఐ పి.భాస్కర్పై సైతం ఇటీవల కాలంలో భారీ ఆరోపణలు ఉన్నాయి. దాచేపల్లి స్టేషన్లో పనిచేస్తుండగా.. కేసు పరిష్కారం కోసం వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని అధికారిక విచారణకోసం ఢిల్లీ వెళుతూ తనతోపాటు ఆ మహిళను సైతం తీసుకెళ్ళిన ఘటనలో మహిళ భర్త ఫిర్యాదు మేరకు సుమారు 20 రోజుల క్రితం వీఆర్కు పంపినట్లు సమాచారం. ఇదే కాకుండా సీఐకి గతంలో బేడీల భాస్కర్ అనే బిరుదును సైతం దాచేపల్లి ప్రజలు, మీడియా ఇచ్చారు. దాచేపల్లిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేసి అతనిని స్టేషన్లో కూర్చోబెట్టగా.. వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారని భయంతో ఆయనే స్వయంగా తన పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు బేడీలను తాళాలుగా వినియోగించి బేడీల భాస్కర్గా ప్రత్యేకత సాధించారు. ● ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, అక్రమాలు చేసిన సీఐని వీఆర్కు పిలిచి రోజుల వ్యవధిలో మరోసారి అందలం ఎక్కించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించి, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, అక్రమాలు, దందాలు చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆదాయం వచ్చే పోస్టింగ్లను ఇస్తున్నారని పోలీస్ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చాంశనీయంగా మారింది. ● ఎటువంటి విచారణ పూర్తి కాకుండా అందులోనూ నగరంలో అధిక ప్రాధాన్యత గలిగిన, అధిక విస్తీర్ణత కలిగిన, అధిక కేసులు నమోదవుతున్న పోలీస్ స్టేషన్కు అటువంటి సీఐని పోస్టింగ్ ఇచ్చి పంపితే ఆ స్టేషన్ పరిధిలో ప్రజలు, శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందోనని పోలీస్ వర్గాల్లో, ప్రజల్లో చర్చాంశనీయంగా మారింది. రానున్న రోజుల్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు, ఏవిధంగా ఉండబోతున్నాయోనని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరిది అక్రమాలు, మహిళలపై అసభ్యప్రవర్తన చేసిన వారికి అండ వీఆర్కు పిలిచిన నెల రోజుల్లోనే నగరంలోని ప్రాధాన్యతగల స్టేషన్లో పోస్టింగ్ విచారణ పూర్తికాకుండానే పోస్టింగ్పై పోలీస్ వర్గాల్లోనే చర్చ జనసేన వర్గాలు ఫిర్యాదు చేస్తే తప్ప గత సీఐ వంశీని మార్చని వైనం ఎక్కువ ఆరోపణలు ఉన్న సీఐ భాస్కర్కు నల్లపాడులో పోస్టింగ్ -
ఉపాధ్యాయుడిని వదిలేసి హెచ్ఎంకు నోటీసు తగదు
గుంటూరు ఎడ్యుకేషన్ ఆరు నెలలుగా పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయుడిని వదిలేసి, తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్న ఇన్చార్జ్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు ఇవ్వడం తగదని అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సంఘ (ఏఐఎస్టీఎఫ్) ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను డీఈవో కార్యాలయంలో ఎస్టీయూ నాయకులతో కలసిన జోసఫ్ సుధీర్బాబు ఉపాధ్యాయుడితో పాటు అతనికి సహకరించిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధీర్బాబు మాట్లాడుతూ గుంటూరు తూర్పు పరిధిలోని గోరంట్ల ఎంపీపీ (ఎల్ఈ) స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గత ఆర్నెల్లుగా విధులకు గైర్హాజరైన విషయాన్ని ఇటీవల ఒక ప్రధాన దినపత్రిక వెలుగులోకి తెచ్చేవరకూ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎంకు వాట్సాప్ ద్వారా సెలవు సమాచారాన్ని పంపి, లీప్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్న విషయం సంబంధిత ఎంఈవోకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రముఖ పత్రికలో కథనం వచ్చిన తరువాత నిద్ర మేల్కొన్న ఎంఈవో... ఉపాధ్యాయుడిని వదిలి, విధులకు సక్రమంగా హాజరవుతున్న ఇన్చార్జ్ హెచ్ఎం, పైగా దివ్యాంగురాలికి షోకాజ్ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు ఉన్నారు. గోరంట్ల పాఠశాల వ్యవహారంపై విచారణ గుంటూరు ఎడ్యుకేషన్ గోరంట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్ఈ)లో బుధవారం విద్యాశాఖాధికారులు విచారణ నిర్వహించారు. ఆర్నెల్లుగా ఉపాధ్యాయుడు గైర్హాజరుకావడం, ఇన్చార్జ్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ వెనుక వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, ఎంఈవో విజయభాస్కర్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ హెచ్ఎం రాజకుమారి వాంగ్మూలం నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కాగా పాఠశాలలో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అధికారులు ఉపాధ్యాయుడి గైర్హాజరు వ్యవహారంలో ఇన్చార్జ్ హెచ్ఎం రాజకుమారి ప్రమేయం లేదని, ఆమె తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. -
పదోన్నతుల పితలాటకం!
గుంటూరుగురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● 9 ఏళ్లుగా ప్రమోషన్లకు నోచుకోని జీజీహెచ్ సిబ్బంది ● జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు తాత్సారం ● గతంలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం బుధవారం 525.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. -
వైఎస్సార్ సీపీ పోరాట ఫలితమే సీఎం లేఖ
గుంటూరు ఎడ్యుకేషన్: మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే రాష్ట్రంలో మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ప్రకటించిన మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’కు అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఆందోళనలో ఉన్నారని, సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట దిగుబడి ఉందని, రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు స్వయంగా లేఖ రాశారని అన్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న దృష్ట్యా ప్రజలకు తగు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. దక్కని మద్దతు ధర ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 10వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా, ఒక్క పొన్నూరు నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాల్లో పంట పండించారని తెలిపారు. క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 సైతం రైతులకు అందడం లేదని, దళారులు రైతుల నుంచి రూ.1600 నుంచి రూ.1700 వరకు కొంటున్నారని స్వయంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పొన్నూరు నియోజకవర్గంలోనే 40వేల ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ల మేరకు పంట దిగుబడి వచ్చిందని, ఇందులో ఇప్పటి వరకు నాలుగు లక్షల క్వింటాళ్ల పంటను రైతుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండ్ గ్యాంగ్ దళారుల రూపంలో కేవలం రూ.1650కే కొనుగోలు చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేనే స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారని అన్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు పొన్నూరు నియోజకవర్గంలోని రైతుల నుంచి నాలుగు లక్షల క్వింటాళ్లకు రూ.30 కోట్ల మేరకు లబ్ధి పొందారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర గ్యాంగ్ రైతుల నుంచి దోచుకున్న రూ.30 కోట్లను రికవరీ చేసి అన్నదాతలకు పంచాలన్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే నరేంద్రపై చర్యలు తీసుకుని, రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఎన్ఏబీఎల్’ అక్రిడిటేషన్తో గుర్తింపు
చేబ్రోలు: విద్యాసంస్థల్లోని ల్యాబ్లకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని బెంగళూరుకు చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణుడు డాక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్పై అవగాహన సదస్సు’ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారెడ్డి ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ప్రాముఖ్యత, డాక్యుమెంటేషన్ విధానం, ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అక్రిడిటేషన్ పొందడానికి ల్యాబ్లు కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక పరీక్ష విధానాలు, సమగ్ర రికార్డుల నిర్వహణ, సాంకేతిక ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. ల్యాబ్ క్వాలిటీ మాన్యువల్ తయారీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించడం, టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ రికార్డుల నిర్వహణ, ఇంటర్నల్ ఆడిట్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఎన్ఏబీఎల్ ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ వంటి ముఖ్య అంశాలను అధ్యాపకులకు వివరించారు. విద్యాసంస్థల్లోని ల్యాబ్లకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ కలిగి ఉండటం వలన పరీక్షా ఫలితాలపై విశ్వసనీయత పెరగడమే కాకుండా, ఇండస్ట్రీ మరియు పరిశోధన రంగాల్లో అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఎన్ఏబీఎల్–క్యూసీఐ కో ఆర్డినేటర్ మానసి కులకర్ణి ‘గుణవత్తా యాత్ర’ కార్యక్రమం, క్వాలిటీ ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్ ఆర్ట్స్ శ్రీసరస్వతి శిశుమందిర్, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ ఫౌండర్ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్ఎం వలివేటి రాజేంద్ర కుమార్, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్ జానీబాష, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్ అండ్ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు. -
వాసవి కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలో వస్త్ర దుకాణ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకానిరోడ్డులోని వాసవి కాంప్లెక్సులో ఉన్న దుర్గా సిల్క్స్ సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. గుంటూరు–2 అగ్నిమాపక శాఖ అధికారి పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. వాసవి కాంప్లెక్సులో అన్నీ వస్త్ర దుకాణాలే ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న సమయంలో దుకాణదారులు షాపు షట్టర్లు మూసివేయడంతో ప్రమాదం తప్పిది. దుకాణంలోని నాలుగు బ్లాకుల్లో మంటలు వ్యాపించడంతో వస్త్రాలు కాలిపోయాయి. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్
నగరంపాలెం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన తొమ్మిది మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... సోమవారం రాత్రి శ్రీరామ్నగర్ ఒకటో వీధిలోని వెంకటేశ్వర టీ స్నాక్స్ దుకాణం వెనుక ఖాళీ స్థలంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారంతో నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ తనిఖీలు చేశారు. తనిఖీల్లో వర్రా మణికంఠ (ఏటీ అగ్రహారం 12వ వీధి), రామిశెట్టి సురేష్ (నెహ్రూనగర్ ఆరో వీధి), కాసినేడి నటరాజ్కుమార్, కుంచాల సాయికుమార్, బొడ్డు ఇస్సాక్ (శ్రీరామ్నగర్ ఒకటో వీధి), షేక్.బాజీ (రామిరెడ్డినగర్ 4వ వీధి), పైడి ఎర్రంనాయుడు, పైడి అశిరినాయుడు (శ్రీరామ్నగర్ రెండో వీధి) యంపటి కోటిరెడ్డి (ఎన్జీవో కాలనీ)లను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ తొమ్మిది మంది ఆన్లైన్లో ఏపీబుక్.ఇన్, లక్కీ కిస్మత్.కామ్, గల్లీబెట్స్.ఇన్, వీల్బుక్.కామ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారని అన్నారు. క్రికెట్ను ఆటగా వీక్షించాలని, ఎవరూ జూదంగా మార్చవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసుని ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు రాంబాబు, ఎ.రామచంద్రరెడ్డి, కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పి.గంగరాజు, సీహెచ్.ఉదయచంద్, షేక్ షకీల్ అహ్మద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు. -
రేపటి నుంచి వేసవి శిక్షణ శిబిరం
●తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం ● త్రుటిలో తప్పించుకున్న కన్నవారు ● ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన 7మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు. మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెనాలిరూరల్: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది. కన్నకూతురు ఘాతుకం చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్ నుంచి లోపలికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9600, మోడల్ ధర రూ.7200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9320 టీఎంసీలు. -
అధరగొడుతున్న కుర్రాళ్లు!
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒకప్పుడు క్రికెట్ అంటే రంజీ ట్రోఫీ ఆడిన వారికి కొంత నగదు వచ్చేది. తర్వాత ఐపీల్ వంటి మెగా టోర్నమెంట్లలో అవకాశం దక్కితే మరింత ఆర్థిక భరోసా లభించేది. ప్రస్తుతం జిల్లా స్థాయి క్రికెటర్లకు కూడా రూ.లక్షలు సంపాదించేలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మార్చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పేరిట ప్రతి ఏడాది జరుగుతున్న వేలంలో జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయి వరకు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని స్థాయిని బట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన వేలంలో గుంటూరు జిల్లా నుంచి 16 మంది ఎంపికయ్యారు. చెన్ను సిద్ధార్థను రూ.11.25 లక్షలకు, షేక్ రషీద్ను రూ.11 లక్షలకు, గద్దె సమన్విత్ను రూ.8 లక్షలకు, మామిడి వంశీకృష్ణను రూ.6 లక్షలకు, కొమ్మినేని మహీప్కుమార్ను రూ.5.5 లక్షలకు, కేపీ సాయి రాహుల్ను రూ.5.5 లక్షలకు, శంబు అఖిల్ను రూ.2.80 లక్షలకు ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. 2022లో ఏపీఎల్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్ చంద్రారెడ్డి, గోపీనాథ్రెడ్డిలు ప్రారంభించారు. ఆర్థిక చేయూత అందించారు. వేలంలో పలికిన ధర: రూ.5.5 లక్షలు జట్టు : సింహాద్రి వైజాగ్ లయన్స్ ప్రత్యేకతలు: 2022 నుంచి ఏపీఎల్ ఆడుతున్నాడు. అండర్– 16 నుంచి అండర్–20, 23 వరకు స్టేట్ క్రికెట్ జట్టులో ఆడుతున్నాడు. 2023 నుంచి ఆంధ్రా రంజీ జట్టులో కొనసాగుతున్నాడు. 2025లో విజయ్ హజారే టోర్నమెంట్ ఆడాడు. -
వైభవంగా నృసింహుని జయంత్యుత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నృసింహుని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో మంగళవారం ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచసూక్త హోమం అనంతరం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లు ఈవో సునీల్కుమార్ పర్యవేక్షించారు. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత రంగనాయకస్వామి ఆలయం వార్షిక కల్యాణ మహోత్సవం రెండోరోజైన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుంచి స్వామి వారికి గ్రామ బలిహరణ, హోమం, రంగనాయక స్వామి సహస్ర నామార్చన, రాత్రికి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్, భక్తులు భాగస్వాములయ్యారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు విశ్వనాఽథ్ ఆధ్వర్యంలో లక్ష మలెలతో పూజ చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం, కోట శేషగిరిరావు, జుజ్జూరి శ్రీనివాసరావు, యక్కల నాగభూషణం, మాగులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెం(క్రోసూరు): వేసవి తాపానికి అడవి నుంచి తప్పిపోయి జనసంచారంలోకి వచ్చిన జింక బిక్కుబిక్కుమంటూ బావిలో పడింది. స్థానికులు చూసి రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పొలాలలో ఈ సంఘటన చోటుచేసుకుందని ఎస్ఐ రవిబాబు తెలిపారు. జింకను పిడుగురాళ్ల అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గుంటూరు నగరంలో నాలుగో రోజైన మంగళవారం కూడా ఇంధన కొరత కొనసాగింది. ఇంధన కొరత లేదని జిల్లా అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అది కాగితాలకే పరిమితం అయింది. నగరంలోని పలు బంకులు తెరిచినప్పటికీ నామమాత్రంగానే విక్రయాలు జరిపారు. ఆయా బంకుల వద్ద వాహనదారులు క్యూలు కట్టారు. డీజిల్ కోసం ఆటోలు, పెద్ద వాహనదారులు అవస్థలు పడ్డారు. పలు బంకులు మూత పడి ఉండడం కనిపించింది. సాయంత్రం నుంచి పలు బంకుల్లో సాధారణ పరిస్థితి కనిపించింది. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
జిల్లాలో అందుబాటులో ఇంధనం
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లాలోని 195 పెట్రోల్ బంకుల్లో పూర్తిస్థాయిలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. హెచ్పీసీఎల్, ఐ.ఓ.సి.ఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం భేటీ అయ్యారు. కొండపల్లి ఇంధన నిల్వల ప్రదేశాన్ని జేసీ సందర్శించారు. ఇంధన నిల్వలు అందుబాటు పరిస్థితిని ఆరా తీశారు. జేసీ మాట్లాడుతూ ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దని కోరారు. బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చెప్పారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా, అధికారులు పాల్గొన్నారు. -
అపూర్వం... హనుమాన్ ఘటాభిషేకం
పట్నంబజారు: ఏ ఆపద వచ్చినా.. మనసులో భయం ఆవరించినా.. చిన్నారుల నుంచి పెద్దల వరకు తలుచుకునే ఏకై క నామస్మరణం ‘శ్రీ ఆంజనేయం’. భక్తుల పాలిట అభయాంజనేయుడై.. కొండంత మనోధైర్యాన్ని ఆయన నామస్మరణతో కల్పించే శక్తి ఆ అంజనీసుతుడికే ఉందనేది భక్తుల నమ్మకం. గుంటూరు నాజ్ సెంటర్లోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి కూడా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. సుమారు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం కలిగిన ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా వెలుగొందుతోంది. వందల ఏళ్ల క్రితం సాధువులు ఇక్కడకు వచ్చి సాధన, యజ్ఞయాగాదులు చేసేవారని నానుడి. సాక్షాత్తూ ఆంజనేయస్వామి శ్యామలాదాస్ బావాజీకి కలలో కనిపించారని ప్రతీతి. తాను నాజ్సెంటర్లోని ప్రాంతంలో ఉన్న ఒక గుంటలో ఉన్నానని.. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారని పురాణాలు పేర్కొంటున్నాయి. చెరువులో ఉన్న ధ్యాన ఆంజనేయస్వామి.. భక్తులకు మాత్రం అభయాంజనేయస్వామి రూపంలో దర్శనమిస్తారు. సుమారు మూడు శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ పవిత్ర క్షేత్రం కాలగమనంలో ఎన్నో మార్పులకు లోనైంది. తన ఆధ్యాత్మిక వెలుగును మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. పూర్వకాలంలోనే ఈ ప్రదేశం సాధువులు, సన్యాసులు తమ తపోసాధనలకు వేదికగా ఎంచుకున్నారని స్థానికంగా వినిపించే నానుడి. ఇక్కడికి విచ్చేసిన ఋషులు, యోగులు జపాలు చేసి, ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేసి వెళ్లేవారని భక్తుల విశ్వాసం. దశాబ్దాలుగా సద్ది కార్యక్రమం 1987 సంవత్సరం నుంచి అప్పటి ఆలయ అర్చకులు ప్రసాద్ (పాపాచార్యులు), రవికిరణ్ రాజ్, టీవీ సుబ్బారావులు హనుమాన్ మాలల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1989 నుంచి హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షుడిగా ఉన్న టీవీ సుబ్బారావు, అర్చకులు పాపాచార్యులు, రవికిరణ్రాజ్లతో కలిసి స్వాములకు సద్ది కార్యక్రమాన్ని చేపట్టారు. కొంత మంది దాతలు, ఆంజనేయ భక్తుల సహకారంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆంజనేయస్వామి విజయోత్సవ యాగకాలం రోజు నుంచి దీక్షలు ప్రారంభిస్తారు. హనుమాన్ జయంతి వరకు 41 రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. మిగతా ఇద్దరూ శివైక్యం చెందడంతో ప్రస్తుతం టీవీ సుబ్బారావు మాత్రమే కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రాత్రి సమయాల్లో సైతం దీక్షాపరులకు ఫలహారాన్ని అందజేస్తున్నారు. గుంటూరులో వందల ఏళ్ల క్రితం కరువు కాటకాలు వచ్చిన సమయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారని పూర్వీకులు ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి స్వామి వారికి హనుమత్ జయంతి రోజున సహస్ర ఘటాభిషేకం చేయడం ఆనవాయితీ వస్తోంది. కనుల పండువగా వేడుక దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న నాజ్ సెంటర్ ఆంజనేయ స్వామికి సంబంధించి ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఏటా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుత శ్రీ వెంకటేశ్వరస్వామి గ్రూప్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ టి. సుభద్ర ఆధ్యర్యంలో హనుమాన్ దీక్షా సమాజం సభ్యులు కార్యక్రమాలు చేపడుతున్నారు. మే 8వ తేదీన అంకుర్పాణ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ, 9న లక్ష తులసీదళ పూజ, పంచామృత స్నపన, 10న లక్ష మల్లెల పూజ, 11న లక్ష ఆకుల పూజ, హనుమాన్ చాలీసా నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు గ్రామోత్సవంతో స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు కనుల పండువగా జరగనుంది. 12న సహస్ర ఘటాభిషేకం, స్వామి వారి కల్యాణం ఉంటాయి. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. -
చెన్ను సిద్ధార్థ (ఆల్ రౌండర్)
వేలంలో పలికిన ధర: రూ.11.25 లక్షలు జట్టు: విజయవాడ సన్రైజర్స్ ప్రత్యేకతలు: 2015 సంవత్సరం అండర్–16 స్టేట్ జట్టులో స్థానం నుంచి నిలకడైన ఆటతో సెలక్టర్లను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో 2023లో అండర్–23 జట్టులో స్థానం పొందినప్పటి నుంచి పూర్తిగా ఆట స్థాయిని మార్చేశాడు. రెండు సార్లు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున స్థానం పొందేందుకు ట్రయల్స్కు హాజరయ్యాడు. గతంలోనూ ఏపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆంధ్రా రంజీ జట్టులో కొనసాగుతున్నాడు. -
విద్యాశాఖలో వింత ధోరణి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖలో వింత ధోరణి నెలకొంది. ఆర్నెల్లుగా పాఠశాలకు రాకుండా, పిల్లలకు పాఠాలు చెప్పకుండా తిరుగుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. గుంటూరు శివారు గోరంట్లలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల (ఎల్ఈ)లో గత ఆర్నెల్లుగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడి వ్యవహారాన్ని ఈనెల 24న సాక్షి వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడిన అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి రెండు రోజుల కిందట షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆర్నెల్లుగా ఉపాధ్యాయుడు విధులకు హాజరు కావడం లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఎంఈవో ద్వారా నోటీసు ఇచ్చి, సంజాయిషీ కోరారు. పాఠశాలకు రాకుండా లీప్ యాప్లో హాజరు నమోదు పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు గతేడాది నవంబర్ నుంచి విధులకు హాజరు కావడం లేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో దీర్ఘకాలిక సెలవులో ఉన్నట్లుగా ప్రధానోపాధ్యాయురాలికి వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతూ, మరో వైపు విధుల్లో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. పాఠశాలకు రాకుండా లీప్ యాప్లో హాజరు నమోదు చేసిన సదరు ఉపాధ్యాయుడు వ్యవస్థను పక్కదారి పట్టించారు. 62 మంది విద్యార్థులు ఉన్న ఐదు తరగతుల బోధనకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇద్దరే బోధన చేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరు ఆర్నెల్లుగా గైర్హాజరు కావడంతో ఉన్న ఇద్దరు టీచర్లే ఐదు తరగతులను బోధిస్తున్నారు. దీంతో వారిపై అధిక పని భారం పడి సతమతమవుతున్నారు. నిత్యం పాఠశాలలో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులతోపాటు డిప్యూటేషన్పై వెళ్లిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉపాధ్యాయులు సైతం విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున పాఠశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉండగా, సదరు ఉపాధ్యాయుడు ఈనెల 23న విధులకు హాజరు కాలేదు. సమగ్ర విచారణ జరిపించాలి ఉపాధ్యాయుడి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డిని కలిసిన యూటీఎఫ్ బృందం ఈ వ్యవహారంలో పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవడం తగదన్నారు. ఉపాధ్యాయుడిని కాపాడుతూ పాఠశాలకు సక్రమంగా హాజరై బోధనచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలుకి షాకాజ్ నోటీసు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు?. పాఠశాలలో రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫేషియల్ అటెండెన్స్, సర్వీస్ రిజిస్టర్, జీతాల బిల్లులను సమగ్ర పరిశీలన చేసి దోషులను శిక్షించాలని కోరారు. లేని పక్షంలో పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు. తాను సెలవుల్లో ఉన్నట్లుగా హెచ్ఎంకు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపి, లీ్ప్ యాప్లో హాజరు నమోదు చేసిన వ్యవహారంలో సంబంధిత ఉపాధ్యాయుడికి క్షేత్రస్థాయిలో విద్యాశాఖాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖను మోసగిస్తూ సాగించిన ఈ వ్యవహారం వెనుక పాఠశాల పరిధిలోకి వచ్చే గుంటూరును నగరానికి చెందిన ఒక ఎంఈవో ఉన్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనలో ప్రాథమికంగా సదరు పాఠశాల హెచ్ఎం తప్పుందని, అయితే లోతుగా విచారణ జరిపి దోషులెవరో తేలుస్తామని డీఈవో షేక్ సలీమ్ బాషా చెప్పారు. -
అంజుమన్ భూమి కోసం అవసరమైతే నిరవధిక దీక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమాతెనాలి: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని 71.75 ఎకరాల అంజుమన్–ఏ–ఇస్లామియా భూమిని ప్రభుత్వం లాక్కుంటే నిరవధిక దీక్షకై నా వెనుకాడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పష్టంచేశారు. గుంటూరులోని అంజుమన్–ఏ–ఇస్లామ్కు దాదాపు వందేళ్ల క్రితం ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించటాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా షేక్ నూరి ఫాతిమా గుంటూరు నగర ప్రజల నుండి భారీస్థాయిలో సంతకాలను సేకరించి జిల్లాకలెక్టర్కు సమర్పించారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై అభ్యంతరాలను తెలియజేయాలంటూ తెనాలి ఇన్చార్జి సబ్కలెక్టర్ నోటీసు జారీచేయటంతో మంగళవారం సాయంత్రం సబ్కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందజేశారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ కె.లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఈ అంశం తన పరిధిలోనిది కాదనీ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. నూరి ఫాతిమా విలేకరులతో మాట్లాడుతూ, భూసేకరణ ప్రకటన జారీచేసి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేదలు, మైనారిటీల సంక్షేమం కోసం అంజుమనె ఏ ఇస్లామ్ కమిటికి భూకేటాయింపు జరిగిందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, అంజుమన్ జేఏసీ గుంటూరు కన్వీనర్ హఫీజ్ షేక్ మహమ్మద్ రిజ్వానా, కో–కన్వీనర్లు ఎండీఅబ్దుల్ కలాం, షేక్ అయూబ్జానీ, ఖాజావలి, లాహేత్, గౌస్ బాషా, కాలేషా, సయ్యద్ బాబు, షాబా హుస్సేన్, లియాకత్ అలీ, షేక్ అప్సారి, సయ్యద్ బాబు, షేక్ సైదా, షేక్ మస్తాన్వలి, మహమ్మద్ రిజ్వానా, షేక్ దుబాయ్ బాబు, సుభాని పాల్గొన్నారు. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.87.84లక్షలు స్వాహా
పిడుగురాళ్ల: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84లక్షలను సీఎంఎస్ ఉద్యోగి స్వాహా చేసినట్లు గురజాల డీఎస్పీ మల్లా మహేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు... సీఎంఎస్వో కంపెనీ మేనేజర్ అనిల్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయటం జరిగిందని, క్యాస్ కస్టోడీగా పని చేసే మామిడి నరేష్ రూ. 87,84,900 నగదును తన సొంత అవసరాలు, ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లలో పెట్టింగ్లు పెట్టాడని విచారణ తెలిసిందన్నారు. నరేష్ ఇదే కంపెనీలో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడన్నారు. సీఎంఎస్ కంపెనీ వారు వారానికి ఒక సారి నిర్వహించే ఆడిట్లో రూ. 87,84,900లు తేడా ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు, సిబ్బంది ఉదయం బైపాస్ రోడ్డులో మామిడి నరేష్ను పట్టుకోవటం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి రూ. 25,53,000లను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. ఆ నగదును అతని ఖాతా, అతని భార్య ఖాతాలో ఉంచుకుని వాడుకొని ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ మొత్తం ఖర్చు చేసుకున్నట్లు విచారణ తెలిసిందన్నారు. నిందితుడు మామిడి నరేష్ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
లక్ష్మీపురం: విద్యారంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రైవేటు టీచర్స్, లెక్చర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రైవేటు టీచర్లకు సీవీ రామన్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం 1.20 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. కానీ వారిలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం చేపట్టాల్సిన చర్యలేవీ చేపట్టట్లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్కార్డులు మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగం శరవేగంగా పెరుగుతుందని, కానీ టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ఎం.సూర్యారావు మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం తమ అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసీ ఆర్గనైజెంగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్, పిటిఎల్పిడబ్ల్యూఎ రాష్ట్ర నాయకులు కిరణ్, శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీనిను, శ్రీవాణి, సదరన్ ప్రైవేటు టీచర్స్ అసోసియేసన్ అధ్యక్షులు డాక్టర్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తాడికొండ/మంగళగిరిటౌన్:మంగళగిరి– తుళ్లూరు మండలాల పరిధిలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి కీలక ప్రమాద ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్లోని మురుగన్ హోటల్ సమీప ప్రాంతం, వెంకటాయపాలెం టోల్ప్లాజా, సీడ్ యాక్సెస్ రోడ్లను సందర్శించి, అక్కడి రోడ్డు పరిస్థితులు, వాహన రాకపోకలు, ప్రమాదాలకు దారితీసే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు వేగాన్ని తగ్గించేలా అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ముందస్తు హెచ్చరికగా ప్రతిబింబించే (రిఫ్లెక్టివ్) సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించేందుకు హైమాస్ట్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని, టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పీడ్ గన్న్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందిని కీలక ప్రాంతాల్లో నియమించాలని, అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంగళగిరి గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, పోలీస్ సిబ్బంది, హైవే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయండి తాడికొండ : అమరావతి రాజధానిలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అమలవుతున్న భద్రతా చర్యలపై మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తుళ్లూరు డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో అమలవుతున్న భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, చెక్పోస్టుల పనితీరు, డ్రోన్ నిఘా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు అధికారులను సూచించారు. చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీని సమర్థవంతంగా చేపట్టాలన్నారు. డ్రోన్ నిఘాను సమర్థవంతంగా వినియోగించి సున్నిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్బీ డీఎస్పీ అలహారి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ సంకురయ్య, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం, ఆర్ఐ (అడ్మిన్) శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
స్పాసెంటర్పై దాడి
ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్ గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్స్టేషన్ పోలీసులు స్పా సెంటర్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్ఫోన్లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నరసరావుపేట టౌన్: చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరంలో మండలంలోని బసికాపురం గ్రామంలో వేంపూడి అనంతమ్మ మెడలోనీ బంగారు గొలుసును ముగ్గురు ఆగంతకులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్, ఉయ్యాల విష్ణు, పాలపర్తి ప్రవీణ్లను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది. వెల్దుర్తి: మండలంలోని లోయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. లోయపల్లి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకాసినంతరం, మధ్యాహ్నం 3గంటల తరువాత మాచర్ల నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో మాత్రం దాని ప్రభావం కారణంగా పలుమార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో లోయపల్లి గ్రామంలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె మీద పిడుగు పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. రోజువారీ పనులు చేసుకొని జీవించే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో నిలిచారు. తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ వచ్చి పరిశీలించి కుటుంబ సభ్యులకు రోజు వారీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇన్నర్ రింగ్రోడ్డు బాధితులను ఆదుకోండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. స్వర్ణభారతినగర్ ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3 బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. గతంలో సుమారు 300 ఇళ్లను కూల్చివేశారని, నేటికీ వారికి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కాని ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఎందరో చిన్నపిల్లలతో రోడ్డున పడ్డారని వాపోయారు. కొంత మందికి ఇళ్ల స్థలాలను లాం తదితర ప్రాంతాల్లో చూపారని కానీ అక్కడ ఇప్పటికే గతంలో స్థలాలు కేటాయించగా అందులో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని వాపోయారు. వాళ్లు ఉంటున్న స్థలాలు మరలా మాకు ఇచ్చి మమ్మల్ని ఉండమంటే ఏవిధంగా న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారతినగర్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో కత్తితో హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త
తాడేపల్లిరూరల్: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామంలో కత్తి చేత్తో పట్టుకుని హల్చేసిన టీడీపీ కార్యకర్తను ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ వీరేంద్రబాబు తాడేపల్లి పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవల్లిలో నివాసముంటూ ప్రస్తుతం కృష్ణాయ పాలెంలో నివాసముంటున్న పెద్దపరం జ్యోతి అనే యువకుడికి కత్తిపట్టుకుని పెనుమాకలో హల్చల్ చేసిన కూనపురెడ్డి ప్రదీప్చంద్కు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. శనివారం రాత్రి పెద్ద పరంజ్యోతి కూనపురెడ్డి ప్రదీప్కు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనిని ఆసరా చేసుకుని ప్రదీప్చంద్ ద్విచక్రవాహనంలో కత్తులు పెట్టుకుని పెనుమాక వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనపై పెద్దపరంజ్యోతి ఫిర్యాదు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రదీప్చంద్ ఉండవల్లి సెంటర్లో ఉండగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చామని, ఇతను రెండు కత్తులుకలిగి ఉన్నాడని, ఆ రెండింటిని కూడా మారణాయుధాలుగా నిర్ధారించి కేసు నమోదు చేశామని తెలిపారు. గతంలో ప్రదీప్పై తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయని, అయినా ఇతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదని, ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రదీప్పై రౌడీషీట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి వారు ఎవరైనా కత్తులు పట్టుకుని వీరంగం చేస్తే వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చోరీ కేసులో నిందితుడికి జైలు తిరుపతి లీగల్: ఓ చోరీ కేసులో గుంటూరు జిల్లా తెనాలి, గంగానమ్మ పేటకు చెందిన పి. నాగ ఉమామహేశ్వరరావుకు రెండు నెలలు జైలు, రూ.వంద జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పి. కోటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీన తిరుమల సి ఆర్ ఓ ఆఫీసు హాల్లో నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్యాంటు జేబులోని సెల్ ఫోను అపహరణకు గురైంది. అతని ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు నాగ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు వివరాలు వెల్లడించిన సీఐ వీరేంద్ర -
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుంటూరు రూరల్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంచార్జి సౌత్ డీఎస్పీ బివి.మధుసూదన్రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలిరూరల్: పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ సోమవారం వివరాలు వెల్లడించారు. మండలంలోకి కొలకలూరుకు చెందిన తిరుమలశెట్టి నాగరాజును 2020 అక్టోబరులో తన పిన్ని కొడుకు రాము మహేష్ చాకుతో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్పై విడుదలైన మహేష్ తప్పించుకుని తిరుగుతూ కోర్టు వాయిదాలకూ రాకపోతుండడంతో ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా పరిగణించిన కోర్టు కేసు విచారణను నిలిపివేసింది. మహేష్ కడపలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా, కేసును రీ–ఓపెన్ చేసిన న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. -
అవయవదానం అభినందనీయం
తాడేపల్లిరూరల్: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్డెడ్గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాశిస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మశీ అధికారి పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు జనవరిలో దరఖాస్తులను ఆహ్వానించినట్లు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ జి. శోభారాణి తెలిపారు. దరఖాస్తులను స్క్రూటిని చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేశామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ను సీఎఫ్డబ్ల్యూ. ఏపీ.ఎన్ఐసి. ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, 28వ తేదీన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు శిక్షణ శిబిరాలు దోహదం తాడేపల్లి రూరల్: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర గ్రంథాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు సెల్ఫోన్కి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో వ్యాసరచన పోటీలు, కథ చెబుతాను.. ఊ కొడతారా, చిత్రలేఖనం, కమ్యూనికేషన్ స్కిల్స్, హస్త కళలు, యోగా, ధ్యానం, గణితంలో మెళకువలు, క్విజ్, సైన్స్ ప్రయోగాలు, పర్యావరణంపై అవగాహన, ఆరోగ్యం, పరిశీలన, కార్టూన్, సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఇన్నర్ రింగ్రోడ్డులో ఇళ్లు కూల్చివేత
గుంటూరు రూరల్: కూలీనాలీ చేసుకుని ఒక పూట తిని మరోపూట పస్తులుండి దాచుకున్న డబ్బుతో ఇళ్ళు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్ 3 పేరుతో పేదల ఇళ్ళను కూల్చి రోడ్డున పడేశారని స్వర్ణభారతినగర్ 20వ లైను బాధితులు వాపోయారు. సోమవారం ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్ 3లో నగర మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పోలీసుల అండతో ఇళ్ళ కూల్చివేతకు పూనుకున్నారు. ఫేజ్ 3కి చెందిన బాదితులు కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాలవద్దకు వెళ్ళగా అక్కడ వేరేవాళ్ళు ఇళ్ళు నిర్మించుకుని నివశిస్తుండటంతో తాము మోసపోయామని వాపోతున్నారు. ఒకే స్థలాన్ని నలుగురు ఐదుగురికి కేటాయించి బాధితులను మోసం చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్ళను కూల్చినవారికి ప్రత్యామ్నాయం చూపే వరకూ అద్దెగా నెలకు రూ 3000 చెల్లిస్తామని చెప్పి ఇళ్ళను కూల్చివేశారు. కానీ నేటికి అతీగతి లేదని అద్దె ఇవ్వక పోగా ఇళ్ళు లేక రోడ్డున బతుకుతున్నామని బాధితులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేశారంటున్న బాధితులు బాధితులకు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని భరోసా స్వర్ణభారత్ నగర్ కాలనీ 20వ లైన్లో గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను, హైవే పనులకు అడ్డంగా ఉన్నాయని ఎటువంటి సమాచారం లేకుండా కూల్చి వేయటం దుర్మార్గపు చర్య. అని వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ధ్వజమెత్తారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కనీసం బాధితులకు నిలువ నీడను కూడా చూపకుండా ఇళ్ళను కూల్చివేయటం కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం పేదలను ఆదుకోలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే పునరావం అందించాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి తగిన స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. అంకమ్మతల్లికి పూజలు దాచేపల్లి:స్థానిక వీర్ల అంకమ్మతల్లి కొలుపు ల తిరునాళ్ల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా ప్రజలకు డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆగ్రహం అంటూ పచ్చమీడియాలో పబ్లిసిటీ చేసుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడలేదు. జిల్లాలో మొత్తం పెట్రోల్ బంకులు 195 ఉండగా, అందులో సగానికి పైగా మూతపడ్డాయి. ప్రతిరోజు 450 నుంచి 500 కేఎల్ (కిలో లీటర్స్) వాడకం ఉంటుందని, కొరత ఏర్పడటంతో 700 కిలోలీటర్ల వరకు వాడకం ఉందని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆటోలు, కార్లు డీజిల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. డీజిల్ లేక టాక్సీలు బయటకు రాలేదు. ఆటోలు కూడా చాలా వరకూ ఇళ్లకే పరిమితం అయ్యాయి. అనేక పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో వాహన యజమానులు, రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా రేషన్ తరహాలో పరిమితంగా డీజిల్ విక్రయిస్తున్నారు.అన్నదాతలు డీజిల్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న తరలింపుకు, పంట కోత యంత్రాలకు, మోటార్లకు ఎక్కువ మొత్తంలో డీజిల్ కావాల్సి ఉండటంతో ప్లాస్టిక్ టిన్నులతో పెట్రోల్ బంక్ల వద్ద రైతులు క్యూ కట్టిన పరిస్థితి చాలాచోట్ల కనపడింది. కోల్డ్ స్టోరేజ్, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల ఉత్పత్తి నష్టాలు పెరుగుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లు నడపటం ఇబ్బందిగా మారటంతో సరుకు రవాణా మందగించింది. రాష్ట్ర స్థాయిలో నిల్వలు ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా డీజిల్ అందుబాటులో లేకుండా పోయిందని పెట్రోల్ బంక్ల అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రజల అవసరాలను అడ్డం పెట్టుకుని డీజిల్ బ్లాక్ మార్కెట్కు తరలించారు. మొన్నటివరకు గ్యాస్ కొరత వేధిస్తే, తాజాగా మూడు రోజుల నుంచి ఇంధన కొత్త ఏర్పడింది. సివిల్ సప్లయీస్ డీఎస్ఓ కోమలి పద్మ గత పది రోజుల నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లారు. డీఎస్ఓ అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖలో పర్యవేక్షణ లేకుండా పోయింది. మరోవైపు నగరంలో డీజిల్ కొరత నేపథ్యంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా పలు బంకులను సందర్శించి అక్కడ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నృసింహుని గరుడ సేవ మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణ పరిధిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామి వారికి అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, నారసింహ మూల మన్య హోమం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రణయనం, కుమ్భారాధన, నారసింహ హోమం అనంతరం స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైభవంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం రెంటచింతల: ఆర్యవైశ్యుల ఇలవేల్పు, జగజ్జనని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో గ్రామ పురవీధులలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. సోమిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం ప్రదర్శించారు. దేవస్థానం చైర్మన్ నాళం చినబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెన్నకేశవ స్వామిని తాకిన సూర్య కిరణాలు వేమూరు: జంపని గ్రామంలో వేంచేసి ఉన్న భూసహిత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవుడిని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కీరీటం వరకు స్వామి వారిని 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచూ స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు. రేపటి నుంచి చందోలు బగళాముఖి అమ్మ తిరునాళ్ల చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల ఈనెల 29 నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరవుతారని తెలిపా రు. మే 2వ తేదీన బగళా ముఖి అమ్మవారికి ప్రాచీన కాలంనాటి బంగారు ఆభరణాలు అలంకరణ చేయటం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన పలు గ్రామాల నుంచి భక్తులు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసుకుని పసుపు బండ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు.బంక్యూ పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాను. ప్రస్తుతం పొలాల్లో నుంచి మొక్కజొన్న పంట తరలింపు కార్యక్రమం ముమ్మురంగా జరుగుతోంది. అయిపోతుందని సమాచారం మేరకు రెండు రోజుల క్రితమే ట్రాక్టర్కు 20 లీటర్లు పోయించాను. ప్రస్తుతం అది అయిపోయే పరిస్థితి నెలకొంది. బంకుల్లో డీజిల్ లేదని చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. – కిరణ్రాజు, మునిపల్లె, పొన్నూరు మండలం గుంటూరు వెస్ట్: డీజిల్, పెట్రోల్ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, సమస్యలన్నీ సర్దుమణుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఎస్పీ వకుల్జిందాల్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. మంగళవారం ఉదయం నాటికి అన్ని బంకులు పూర్తి స్థాయిలో పని చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి బంక్ వద్ద ఒక రెవెన్యూ ఉద్యోగి, ఒక పోలీసు కానిస్టేబుల్ను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. – జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ ఏఎన్యూ(పెదకాకాని): స్వర్ణోత్సవాల వేళ ఆయా కళాశాలల వార్షికోత్సవాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ముస్తాబయింది. విశ్వవిద్యాలయంలో రెండు రోజులు పాటు నిర్వహించే వేడుకలకు ప్రొఫెసర్ త్రిమూర్తిరావు కన్వీనర్గా వ్యవహరించనున్నారు. గతంలో ఏ కళాశాలకు ఆ కళాశాల ప్రత్యేకంగా వార్షికోత్సవాలు నిర్వహించుకోగా ఈ ఏడాది స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొంటున్న తరుణంలో ఐదు కళాశాలల్లో ఒకేసారి వార్షికోత్సవం జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సోమవారం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, వేడుకల నిర్వహణ కమిటీ కన్వీనర్లు, మెంబర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వార్షికోత్సవాల కార్యచరణపై చర్చించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వీరయ్య ,ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజోమూర్తి, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కేవీ నిరుపమ, కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. 7జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగి అన్ని బంకులలో ఆయిల్ నిల్వలు తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు, మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. అనేక బంకులను తనిఖీ చేశారు. రాజధాని ప్రాంతమైన మందడంలో అయిల్ లేదంటూ బంక్ మూసివేశారు. అయితే తుళ్లూరు తహసీల్దార్ తనిఖీలలో బంక్లో ఆయిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించడంతో మళ్లీ బంక్ను తెరిపించి అమ్మకాలు సాగించారు. కొన్ని బంకుల్లో ఇబ్బందులను గుర్తించామని, ఈ కొరత అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాటిపై చర్యలకు ఉపక్రమిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రికి అన్ని బంక్లకు డీజిల్ అందుబాటులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. -
నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించాలి
ఏఎన్యూ(పెదకాకాని): కళాశాల పాలన వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ప్రిన్సిపాళ్లు నిబద్ధతతో పాలనాపరమైన బాధ్యతలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా కోరారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రిన్సిపాల్స్ ఓరియంటేషన్ కార్యక్రమం, అడ్మిషన్లు, డిజిటల్ గవర్నెన్స్పై దిశానిర్దేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రంజిత్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధి పోర్టల్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని, ప్రతి ఫైలు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా జరగాలని సూచించారు.ప్రిన్సిపాల్స్ ఎదుర్కొంటున్న పరిపాలనాపరమైన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. వీసీ ఆచార్య కె.గంగాధర్రావు, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.కృష్ణసత్య మాట్లాడారు. ఓరియంటేషన్ ప్రోగ్రాం అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిర్మయి, ఆయా కళాశాలల నుంచి వచ్చిన 111 మంది ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయండి
నగరంపాలెం (గుంటూరువెస్ట్): ఆంధ్రజ్యోతి దినపత్రికలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబ సభ్యుల గురించి సభ్య సమాజం తలదించుకునేలా ప్రసారమైన వార్తలు కార్యకర్తల మనసులను కలిచివేశాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఈనెల తొమ్మిదిన ఏబీఎన్ రాధాకృష్ణపై, ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, అన్నాబత్తుని శివకుమార్, బాలవజ్రబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజానారాయణ, గులాం రసూల్, అనుబంధ నాయ విభాగాల కులు, కార్యకర్తలు, న్యాయవాదులు కలసి వినతిపత్రం అందించారు. – మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వో (సీఐ)లకు వినతిపత్రాలు అందించామని తెలిపారు. రాజధాని విషయమై మాట్లాడితే జైల్లో నిర్భందించారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం, మరో పార్టీ వారికి మరో న్యాయం జరుగుతుందా అని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు రిజిస్ట్రర్ చేయలని రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు జిల్లా ఎస్పీని కోరుతున్నానని అన్నారు. కార్యకర్తలకు భార్య, చెల్లెలు తెలియదనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మా మానవత్వానికి మనసు చంపే విధంగా కామెంట్ చేశారని అన్నారు. మానవ హక్కుల కమిటీకి.. రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోతే మానవహక్కుల కమిటీకి, న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు. 2029లో ప్రతీకార చర్య ఉంటుందని అన్నారు. మీరు చెప్పకపోతే తమలో ప్రతీకార చర్య పెరుగుతుందని చెప్పారు. 2029లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి పుల్స్టాఫ్ పెట్టే కార్యక్రమం చేస్తామని, ఇప్పటి వరకు కామాలు పెట్టుకుంటా వచ్చామని ఇక పుల్స్టాఫ్ ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాన్ చేస్తామనే మాట గర్వంగా, ధైర్యంగా చెబుతామని మోదుగుల ఉద్ఘాటించారు. -
ప్రత్యామ్నాయం చూపలేదు..
గత ఏడాది క్రితం ఇళ్ళను కూల్చివేశారు. వారికి ఇప్పటి వరకూ ఇళ్ళుకానీ, ఇళ్ళ స్థలాలు కానీ చూపించలేదు. మరలా ఇప్పుడు మరో వంద మందిని రోడ్డున పడేస్తున్నారు. అధికారులు, కూటమి పెద్దలు కావాలని స్వర్ణభారతినగర్లోని పేదలను రోడ్డున పడేస్తున్నారు. – బడేబీ, బాధితురాలు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చేస్తున్నారు. ఇళ్లలో పనికొచ్చే సామగ్రిని కూడా తీసుకోకుండా బాధితులకు మరింత నష్టం కలిగిస్తున్నారు. కావాలని కూటమి నాయకుల కుట్రతో నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – ప్రమీల, బాధితురాలు మున్సిపల్ అధికారులు వచ్చి కనీసం సమాచారం లేకుండా పోలీసుల అండతో ఇళ్లలోని సామానులను సైతం రోడ్డుపై విసిరేసి ఇళ్ళను ఖాళీ చేయిస్తున్నారు. అదేమని అడిగితే అసిస్టెంట్ కమిషనర్ సైతం పోలీసులకు ఇళ్లలోంచి వారిని బయటకు లాగి పడేయండి అంటూ పోలీసులను ఆదేశిస్తున్నారు. – నాగలక్ష్మి, బాధితురాలు ఇంటిని కూల్చివేస్తే కట్టు బట్టలతో రోడ్డుపై పడ్డాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియటంలేదు. చిన్నపిల్లలతో మండుటెండలో రోడ్డుపై నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎంత మొత్తుకున్నా కనికరించటంలేదు. – మానస, బాధితురాలు ● -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
నగరంపాలెం: రైల్వేలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో కాజేసినట్లు బాధితుడు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్ఏస్ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల సమస్యలను జిల్లా ఎస్పీ ఆలకించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), మధుసూదనరావు (గుంటూరు సీసీఎస్) అర్జీలు స్వీకరించిన వారిలో ఉండగా, 172 ఫిర్యాదులు వచ్చాయని డీపీఓ వర్గాలు తెలిపాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


