breaking news
Guntur District Latest News
-
21న ‘పల్స్ పోలియో’ కార్యక్రమం
గుంటూరు వెస్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్లలో శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు. కరపత్రాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్తోపాటు అధికారులు పల్స్పోలియో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. మార్గదర్శకాల ప్రకారం జాబితా నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం అభ్యర్థుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్కేర్లో ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలి రెండవ విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో రెండవ విడత ల్యాండ్ పూలింగ్పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించిందని గుర్తుచేశారు. దానికనుగుణంగా భూ సమీకరణ జరుగుతుందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించేందుకు ముందుగా తేదీలను తెలియజేయాలని సూచించారు. వక్ఫ్ భూములను పరిరక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
నాయీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
రేపల్లె: నాయీ బ్రాహ్మణులకు రాష్ట్రంలో అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్రాక్షారపు సూరిబాబు అన్నారు. రేపల్లెలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు, హాస్టల్స్, హెల్త్ శాఖలలో క్షౌర వృత్తి పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వం క్షౌ రశాలలకు 200ల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని, ఇది త్వరితగతిన అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యడ్లపల్లి కిషోర్బాబు, కె.అప్పారావు, విజయ్, కె.శివయ్య, సుబ్రహ్మణ్యం, కె.శివబాజీ, కొడాలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్: కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి తెనాలి మీదుగా గూడూరు వరకు నిర్మించిన మూడో రైల్వే లైన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రత్యేక రైలులో సాయంత్రం తెనాలి వచ్చారు. విండో ఇన్స్పెక్షన్లో భాగంగా జీఎం రైలులోనే ఉండి ట్రాక్ను పరిశీలిస్తూ ప్రయాణించారు. ఇదే రైలులో వచ్చిన విజయవాడ, గుంటూరు డీఆర్ఎంలు మోహిత్ సొనాకియా, సుదేష్ణసేన్ తెనాలిలో దిగిపోయారు. అమృత్ భారత స్టేషన్గా ఎంపికై న తెనాలి స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.28 కోట్లు మంజూరు కాగా, వాటికి సంబంధించి జరుగుతున్న గూడ్స్ షెడ్డు నిర్మాణం, స్టేషన్లో కాలినడక వంతెనలు, ఇతర పనులను విజయవాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా అధికారుల బృందంతో పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ టీవీ రమణకు పలు సూచనలు చేశారు. గుంటూరు మెడికల్: సుమారు 30 ఏళ్ల తర్వాత మళ్లీ మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు గుంటూ రు మెడికల్ కళాశాల విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ టైటిల్, పోస్టర్ను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ సమక్షంలో అధ్యాపకులు, వైద్య విద్యార్థులు మంగళవారం ఆవిష్కరించారు. ఎగ్జిబిషనన్కు ‘గుంటూరు మెడికల్ కాలేజ్ మెడ్ ఫ్యూషన్’ అని నామకరణం చేశా రు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సమాచారం, అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఉండాలని సూచించారు. విశిష్ట అతిథి రాజా కర్ణం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారికి రూ.లక్ష అందజేసి ఎగ్జిబిషన్ విజయవంతానికి తన మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, అధ్యాపకులు పాల్గొన్నారు. వేమూరు: కో ఆప్షన్ మెంబర్ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రైసెడింగ్ అధికారి పి.పద్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 12 గంటలలోపు నామినేషన్ పరిశీలన, అనంతరం చెల్లుబాటు నామినేషన్ పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ ఉపసంహరణ, తర్వాత కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరుగుతుందన్నారు. -
చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మూడు మండలాల నుంచి సుమారు 75 వేలకుపైగా సంతకాలు సేకరించారు. ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ సంతకాలు సేకరించడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇంకా పదివేలకు పైగా సంతకాలు సేకరించనున్నట్లు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్)లు పేర్కొన్నారు. పేదలకు అండగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో పేదలకు మేలు చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయడానికి కుట్రలు పన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, సమన్వయకర్తతోపాటు మంగళగిరి తాడేపల్లి పట్టణ రూరల్ అధ్యక్షులు, దుగ్గిరాల అధ్యక్షులు ఆకురాతి రాజేష్, బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, నాళి వెంకటకృష్ణ, అమరా నాగయ్య, తాడిబోయిన శివ గోపయ్యల ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలపై ప్రజలకు అవగాహన కల్పించి సంతకాల సేకరణ చేపట్టారు. పెనుమాక, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, దుగ్గిరాలలో విద్యార్థులు తమ ఆవేదనను సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డితోపాటు స్థానిక నాయకులకు విన్నవించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తే ప్రజలకు వైద్యం మరింత దూరం అవుతుందని నాయకులు అవగాహన కల్పించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే సేకరించిన 75,800 సంతకాల ప్రతులను పట్టణ, మండల నాయకులు కలిపి మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలకు అందజేశారు. మరో ఐదు రోజుల్లో పదివేల సంతకాలు పూర్తికానున్నట్లు దొంతిరెడ్డి వేమారెడ్డి వెల్లడించారు. -
ప్రకృతి వ్యవసాయంతో పంట వైవిధ్యతను పాటించాలి
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్) : ప్రకృతి వ్యవసాయం చేసి, పంట వైవిధ్యతను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి అన్నారు. ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కృషిభవన్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ సదస్సును జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ పీడీ జి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగు చేస్తున్న పంటల పద్ధతులపై సిబ్బంది అవగాహనతో పని చేయాలని అన్నారు. రసాయన పద్ధతులు పాటిస్తున్న రైతుల్లో కూడా ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగించాలని సూచించారు. ఆత్మ పీడీ జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం, యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. త్వరలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్లు విజయ్కుమార్, రాయుడు వీసీ ద్వారా మాట్లాడారు. సదస్సులో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
డీఈవోగా సలీమ్ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా షేక్ సలీమ్ బాషా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారిగా పని చేస్తున్నారు. మంగళవారం జరిగిన డీఈవోల బదిలీల్లో భాగంగా సలీమ్ బాషా గుంటూరుకు, సీవీ రేణుక ప్రకాశం జిల్లాకు డీఈవోలుగా బదిలీ అయ్యారు. 10 నుంచి టెట్ నిర్వహణ ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్)కు గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
నిర్మల మనసుతో సేవానిరతి
గుంటూరు మెడికల్: భార్య, భర్త ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. జిల్లా విడిచి అమెరికా వెళ్లా రు. వైద్య వృత్తిలో ఆమె బిజీగా ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన రాణించాడు. సుమారు 45 ఏళ్లకు పైగా భార్యభర్తలు ఇద్దరు తమ తమ రంగాల్లో రాణించి, కష్టపడి సంపాదించారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇరువురూ ఏడు పదుల వయ సుకు చేరుకున్నారు. ఈక్రమంలో హఠాత్తుగా భార్య మృతి చెందింది. భార్య జ్ఞాపకాలతో అమెరికాలో ఉండలేక ఆమె మృతిచెందిన మూడేళ్లకు ఇండియాకు వచ్చేశారు. ఇక్కడకు వచ్చిందే తడవుగా తన భార్య చది విన మెడికల్ కళాశాలకు, జీజీహెచ్కు ఏదొకటి చేయా లని తలంచారు. సుమారు మూడు నెలలుకు పైగా గుంటూరు జీజీహెచ్లో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కాట్రపాడుకు చెందిన రాజా కర్ణం. భార్యపై ప్రేమతో.... రాజాకర్ణం భార్య డాక్టర్ నిర్మల వై.కర్ణం అమెరికాలో మానసిక వైద్య నిపుణురాలిగా విశేషమైన సేవలందిస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందారు. భార్య మరణంతో మూడు నెలల క్రితం రాజా కర్ణం గుంటూరు జిల్లాకు వచ్చారు. తన భార్య చదువుకున్న గుంటూరు వైద్య కళాశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆరు ఏర్పాటు చేయించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్లో మరో ఆరు ఆర్వో వాటర్ కూలింగ్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి రోగులకు మంచినీరు, సురక్షిత చల్లటి నీరు తాగేందుకు అవకాశం కల్పించారు. సుమారు రూ.80లక్షలతో వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఆర్వో ప్లాంట్స్ను నిర్మించారు. తదుపరి శుశ్రుత విగ్రహాన్ని జీజీహెచ్ ఓపీ విభాగం వద్ద ఏర్పాటు చేయించారు. ఇటీవల యాంపీ థియేటర్ నిర్మాణం ఆస్పత్రిలో చేపట్టారు. తన భార్య పేరుతో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణం చేపట్టిన రాజాకర్ణంను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్కు రూ.50లక్షలు, మాతా, శిశు సంరక్షణ వైద్య విభాగానికి(ఎంసిహెచ్) రూ.కోటి విరాళం ఇచ్చారు. జీజీహెచ్కు అనుబంధంగా బొంగరాల బీడులో ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల స్థలంలో సుమారు రూ.15 కోట్లతో తన భార్య పేరుమీదుగా సైకియాట్రీ బ్లాక్ నిర్మాణం చేసేందుకు ముందుకొచ్చారు. చనిపోయిన భార్య పేరు మీదుగా 70 పదుల వయస్సు దాటిన రాజా కర్ణం మూడు నెలలుగా జీజీహెచ్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది ఆయన్ను అభినందిస్తున్నారు. -
● కాలువలోనుంచి బయటకు తీసి వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ● అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
సీతానగరంలో రోడ్డుపై మృతదేహం తాడేపల్లి రూరల్: సీతానగరం బకింగ్హామ్ కెనాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వదిలి వెళ్లిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి ఎన్టీఆర్ కరకట్టకు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద గోడపక్కనే ఒక మృతదేహం ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని నీటిలోనుంచి తీసి బయట పెట్టినట్లు స్థానికులు గుర్తించారు. మృతుని శరీరంపై కేవలం అండర్వేర్ మాత్రమే ఉంది. బకింగ్హామ్ కెనాల్లో మృతదేహం కొట్టుకుని వస్తే ఆ మృతదేహాన్ని ఎవరైనా తీసిఅక్కడ వదిలి వెళ్లారా? లేదా ఏదైనా ఘర్షణ జరిగి నీటిలో ముంచి చంపి అక్కడ వదిలి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలను సహజంగా ఎవరూ బయటకు తీయరు. అలాంటిది ఈ మృతదేహాన్ని ఎక్కడ నుంచి అయినా తీసుకువచ్చి ఇక్కడ పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి శరీరంపై దుస్తులు తొలగించి ఈతకు వచ్చినట్లు చిత్రీకరించి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో సీతానగరం పుష్కర ఘాట్లో సీతానగరం, ప్రకాశం బ్యారేజ్ ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువకులు తిరుగుతూ పలువుర్ని బెదిరించి డబ్బులు లాక్కు వెళ్లారు. ఇలాంటి వారు ఎవరైనా అతన్ని చంపి దుస్తులు లేకుండా నీటిలో ముంచి చంపి బయట పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు పోస్ట్మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని.. ఎవరైనా ఈ మృతుడిని గుర్తిస్తే 08645272186 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. తెనాలిలో స్క్రబ్ టైఫస్ తొలి కేసు తెనాలి అర్బన్: తెనాలిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావటం కలకలం రేపింది. రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన యాభై ఏళ్ల మహిళకు చర్మంపై మచ్చ కనిపించటం, జ్వరంగా ఉండటతో వైద్యం కోసమని మంగళవారం మధ్యాహ్నం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు స్క్రబ్ టైఫస్ కేసుగా అనుమానించారు. సంబంధిత పరీక్ష కిట్లు ఆసుపత్రిలో లేకపోవటంతో బయటనుంచి కొనుగోలు చేసి తెప్పించారు. ఆ కిట్తో పరీక్ష చేయగా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. -
ముగిసిన ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: గుంటూరు నగరంలో జరుగుతున్న రాష్ట్ర ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర మహాసభలలో భాగంగా అరండల్ పేట వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన ప్రతినిధుల సభ మంగళవారం విజయవంతంగా జరిగింది. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాండా, రైల్వే కార్మిక నాయకుడు వీరయ్య, చేనేత కార్మిక నాయకుడు వెంకట్రావు సభకు అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి జె.కిషోర్బాబు, రాష్ట్ర కోశాధికారి డీవీఎన్ స్వామి, రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎంఎస్ శాంతి, అప్పారావు స్టీరింగ్ కమిటీగా వ్యవహరించారు. సభలో సంస్థ జాతీయ కార్యదర్శి పీకే షాహి మాట్లాడుతూ వేతనాల పెంపు కోసం, శ్రమ దోపిడీని అంతం, కార్మిక వర్గంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి ఏఐఎఫ్టీయూ (న్యూ( కృషి చేస్తుందన్నారు. తెలియజేశారు. సీ్త్ర విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు సి.విజయ, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జన సాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివి కుమార్ తదితరులు సభలో మాట్లాడారు. అనంతరం సంస్థ రాష్ట్ర కార్యదర్శి కిషోర్బాబు ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికను చర్చించిన అనంతరం మహాసభ ఆమోదించింది. గణేష్ పాండా అధ్యక్షుడిగా, కిషోర్ బాబు కార్యదర్శిగా, డీవీఎన్ స్వామి కోశాధికారిగా వివిధ జిల్లాల నుంచి మరో 9 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. సభలో వివిధ రంగాలు, వివిధ ప్రాంతాల కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ వాచర్లను క్రమబద్ధీకరించాలి మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ప్లాంటేషన్ వాచర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాచర్ల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళగిరి ఆటోనగర్లోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్రీధర్కు వాచర్ల సంఘాలు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అంకయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2016లో యూనియన్లతో కూడిన ఒప్పందం మేరకు 7 సంవత్సరాలు సేవ పూర్తిచేసిన వాచర్లను 2019 వరకు క్రమబద్ధీకరించినప్పటికీ అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం క్రమబద్దీకరించిన వాచర్లు నెలకు రూ. 27546/–లు వేతనం పొందుతున్నప్పటికీ తాత్కాలిక వాచర్లకు మాత్రం రోజుకు కేవలం రూ. 597/–లు మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి తేడా లేకున్నప్పటికీ వేతనాల్లో ఉన్న అసమానతలు తొలగించి సమాన ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి యామల మధు, తదితరులు ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో జాన్సైదాకు సిల్వర్ మెడల్ ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి పి.జాన్సైదా తాంగ్తా మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఎల్.సాంబయ్య తెలిపారు. పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి జాన్సైదాను అభినందించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తాంగ్తా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాన్సైదా సిల్వర్ మెడల్ సాధించాడన్నారు. విద్యార్థి, పీడీ సుజాతను ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలో క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ను బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై విసృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రజా భద్రతను పెంపొందించేందుకు, నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రతి రోజు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రధాన కూడళ్లల్లో నిఘా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు, బ్యాంక్లు, పాఠశాలలు, కళాశాలలు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో గస్తీ కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించడం, చోరీలు, అక్రమ కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లల్లో పోలీస్ బృందాలు విధుల్లో ఉంటున్నాయని, ప్రమాదాలు వాటిల్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని రౌడీషీటర్లు, గంజాయి కేసుల నిందితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. రూ.12.28 లక్షల బయో ఉత్పత్తులు స్వాధీనం నరసరావుపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.12,28,740 విలువైన బయో ఉత్పత్తులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పార్సిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వివిధ కంపెనీల బయో ఉత్పత్తులను నిలుపుదల చేశారు. వ్యాపారులు అందజేసిన బిల్లులు, అనుమతి పత్రాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి బయో ఉత్పత్తులు రవాణా చేస్తున్నట్టు నిర్దారించారు. ఈ మేరకు రూ.12లక్షల విలువైన 188.8లీటర్ల ఆరు రకాల బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏవో సీహెచ్ ఆదినారాయణ, సీఐ కె.చంద్రశేఖర్, నరసరావుపేట ఏవో ఐ.శాంతి పాల్గొన్నారు. -
మహోద్యమ చరిత.. మహోజ్వల భవిత
కోటి సంతకాల సేకరణలో దూసుకు వెళ్తున్న పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు : చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై చేపట్టిన పోరాటంలో పొన్నూరు నియోజకవర్గ ప్రజలంతా భాగస్వాములయ్యారు. పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య, విద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలం, పట్టణ పరిధిలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబటి మురళీకృష్ణ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వివరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసి, వైద్యాన్ని ఉచితంగా అందించే కళాశాలలను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ప్రజలకు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 65 వేల సంతకాలు సేకరించారు. ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పొన్నూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజాదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నించి విఫలమైంది. అయినా ప్రజలు వెనుకాడకుండా భారీ సంఖ్యలో ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాల్ని అంబటి మురళీకృష్ణ ప్రసంగాల్లో ఎండగడుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్యశాలలే ప్రజల ప్రాణాలను కాపాడాయని, ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటీకరణను విరమింపచేయాలని అంబటి మురళీకృష్ణ అధికారులకు విన్నపం చేశారు. రేపు కోటి సంతకాల సేకరణ ర్యాలీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం నియోజకవర్గంలో 65 వేలు పూర్తయిన సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. 10న ఉదయం 9 గంటలకు పొన్నూరు పట్టణంలో, అనంతరం చేబ్రోలు, పెదకాకాని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
గుంటూరు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.1600, మోడల్ ధర రూ.1300 వరకు పలికింది. పుస్తకం ఆవిష్కరణ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమింప చేసే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగనన్న అదేశాల మేరకు కోటి సంతకాల సేకరణను మొదలు పెట్టాం. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున గ్రామస్తులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. –అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, పొన్నూరు 7 -
అనాథ ఆశ్రమ పిల్లలకు అమృత హెల్త్ స్కీం
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్ గుంటూరు వెస్ట్: ప్రభుత్వ గుర్తింపు పొందిన అనాథాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ పిల్లల సంక్షేమం దృష్ట్యా ఎన్టీఆర్ వైద్యసేవ, అమృత హెల్త్ స్కీంను అమలు చేస్తామని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం హెల్త్ కార్డులను చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 39 మంది చిన్నారులకు ప్రత్యేక అమృత హెల్త్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో మరణాలు సంభవించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖను సమన్వయం చేసుకుంటూ పంచాయతీ, రెవెన్యూ శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని తెలిపారు. ఈ జ్వరాలకు ఉపయోగించే మందులు ఉప ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదం
ఏఎన్యూ(పెదకాకాని): విద్యార్థుల్లో నాయకత్వం, పరస్పర సహకారంతో పాటు స్వీయ అభివృద్ధి, వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదపడతాయని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మూడు రోజుల యువజనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆచార్య కంచర్ల గంగాధర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. వనరులను సద్వినియోగం చేసుకొని ఆకాశమే హద్దుగా విద్యార్థులు ఎదగాలని ఆయన తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు విద్యార్థుల సృజనాత్మకశక్తి, ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయని పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణతో, కళాత్మక నైపుణ్యంతో ముందుకు సాగాలని చెప్పారు. యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్. మురళీమోహన్ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ తదితర అంశాల్లో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 22 కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ జి. సింహాచలం, పాలకమండలి సభ్యులు కే సుమంత్ కుమార్, వర్సిటీ ఆర్ట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజోమూర్తి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎన్.వి. కృష్ణారావు, ఆచార్య ఎం. త్రిమూర్తిరావు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం గరం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై మరోసారి నిరసన గళం విప్పారు. ప్రజలు అడిగే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, దీని వల్ల నియోజకవర్గంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. గతంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్లో సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తుపాను ఫాన్ కారణంగా నగరంలో ప్రభుత్వం సాయం అందించే కార్యక్రమాలను కనీసం సమాచారం ఇవ్వకుండానే కమిషనర్, మేయర్ ప్రొగ్రాం డిజైన్ చేయడంపై మండిపడ్డారు. దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే గల్లా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అధికారులను, మేయర్ తీరును కడిగి పారేశారు. రేషన్ డీలర్ల ఆక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాజాగా గుంతల రోడ్డుకు ప్యాచ్ వేసి మరోసారి అధికారుల తీరును ఎండగట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఉన్నారో.. ఏ పని చేస్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా కనీసం తట్ట మట్టి కూడా వెయ్యకపోవడం సిగ్గుచేటని తెలిపారు. స్వయంగా తానే నియోజకవర్గంలో బైక్పై తిరిగి రోడ్ల అధ్వాన పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితిపై ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ అనేక సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని తెలిపారు. తన ఇంటి ముందే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత నిధులతో రోడ్డుపై గుంతలు పూడుస్తానని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు నియోజకవర్గ అభివృద్ధిలో ఫెయిల్ అయ్యారని ఆమె ఆరోపించారు. -
జీఎంసీలోకి మరో 11 గ్రామాలు
● ప్రస్తుతం విలీన గ్రామాల్లోనే మౌలిక వసతులు శూన్యం ●ఈ నెల 12న కౌన్సిల్ అత్యవసర సమావేశం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ గ్రేటర్ గుంటూరు దిశగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. 2012లో నగరం చుట్టూ ఉన్న 10 గ్రామాలను విలీనం చేయగా, తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నెల 12వ తేదీన అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసేందుకు పాలక, అధికార వర్గాలు ముందుకు సాగుతున్నాయి. విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కరువు 2012లో నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం, అడవితక్కెళ్లపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటూకూరు, బుడంపాడు, రెడ్డిపాలెం గ్రామాలు విలీనం అయ్యాయి. వీటిలో సక్రమంగా తాగునీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు 11 గ్రామాలను విలీనం చేస్తే వాటికి కూడా నగరపాలక సంస్థ నుంచే తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. 11 గ్రామాలు ఇవే.. గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్ గుంటూరుగా చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 11 గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. చల్లావారిపాలెం, చినపలకలూరు, తురకపాలెం, వెంగళాయపాలెం, దాసుపాలెం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాల్పురం, మల్లవరం, ఓబులునాయుడుపాలెం, తోకవారిపాలెంలను విలీనం చేసేందుకు పంచాయతీ అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రకటనను నగరపాలక సంస్థ సిద్ధం చేశారు. 12న జరిగే అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమోదించనున్నారు. తరువాత జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదిక వెళ్లిన తరువాత ప్రభుత్వం 11 గ్రామాలను విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు
గుంటూరు ఎడ్యుకేషన్: పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో కౌశల్ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం గావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాసీ్త్రయ ప్రతిభను పెంపొందించేందుకు కౌశల్ పరీక్షలు దోహదపడతాయన్నారు. జిల్లా కౌశల్ కో–ఆర్డినేటర్ ఎం.సురేష్కుమార్ మాట్లాడుతూ క్విజ్, పోస్టర్, రీల్స్ తయారీ అనే అంశంపై ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 8,9,10 తరగతుల నుంచి పాల్గొన్న 610 మంది విద్యార్థుల్లో ఆరుగురు ప్రథమ, మరో ఆరుగురు ద్వితీయ బహుమతులు పొంది, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ప్రథమ బహమతి రూపంలో రూ.1,500, ద్వితీయ బహుమతి రూపంలో రూ.వెయ్యి నగదు అందజేశారు. ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, పాఠశాల కో–ఆర్డినేటర్లు శాంతిప్రియ, రామాంజనుయులు, రవీంద్రబాబు, నిర్మల, బాలకృష్ణ పాల్గొన్నారు. –క్విజ్ విభాగంలో షేక్ రషీద్ (అంకిరెడ్డిపాలెం), సీహెచ్ మనోహ (వంగిపురం), షేక్ నస్రీన్ (మాచవరం) ప్రధమ బహుమతి, ఎ.వెంకట తనూజ (ప్రత్తిపాడు), పి.ప్రియాంక, ఎం.కీర్తన (కాకుమాను) ద్వితీయ బహమతి సాధించారు. –పోస్టర్ విభాగంలో బి.అమూల్య (అత్తోట), వి.విలియం బాబు (కాకుమాను) ప్రథమ బహుమతి, టి.వాసవి (ముట్లూరు), ఎం.శ్రీవిద్య (సంగం జాగర్లమూడి) ద్వితీయ బహుమతి పొందారు. – రీల్స్ విభాగంలో సయ్యద్ ఖాసిం (వేములూరిపాడు), మహి (గోగులమూడి) ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక -
అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్
● పలు జిల్లాల్లో 150కి పైగా కేసులు ●19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం ●వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి టౌన్: రాత్రిళ్లు ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగలను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ సోమవారం వివరాలను వెల్లడించారు. విశాఖపట్టణానికి చెందిన తోట శివకుమార్ (శివభవాని)పై రాష్ట్రంలో సుమారు 150కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. విశాఖపట్టణానికి చెందిన తోట వరలక్ష్మి శివభవానికి భార్య. భార్యాభర్తలు ఇద్దరూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇంతియాజ్తో కలసి పలుచోట్ల దొంగతనాలు చేశారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంతనానికి పాల్పడడంలో వీరు సిద్ధహస్తులు. అక్టోబర్లో తిరుపతి పోలీసులు పలు దొంగతనాల కేసులో శివకుమార్ను అరెస్ట్ చేసి కడప జైలుకు పంపించారు. కడప జైల్లో షేక్ ఇంతియాజ్ పరిచయమయ్యాడని, జైలు నుంచి విడుదల అయిన తరువాత దొంగతనాలు చేసేందుకు ముగ్గురు ప్రణాళికలు రచించినట్లు విచారణలో తేలింది. – మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో తాళం వేసిన ఇంటిని రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో బంగారం మాటీలు, చెవిదుద్దులు, 6 జతల పట్టీలతో పాటు రూ.20వేల నగదును దొంగిలించి పారిపోయారు. అదేవిధంగా దువ్వాడ, గాజువాక, అనకాపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. యర్రబాలెంలో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరుపర్చగా మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. రూరల్ సీఐ ఎ.వి.బ్రహ్మం, రూరల్ ఎస్ఐలు సీహెచ్ వెంకటేశ్వర్లు, బాలు నాయక్, ఏఎస్ఐ రత్నరాజు, కానిస్టేబుల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత
ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి తాడికొండ: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఏపీ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి తెలిపారు. సోమవారం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట నాలుగో బ్లాకులో ఏపీ రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్ సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టంపై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతినెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ పది నుంచి 13 జిల్లాలలో 2026 డిసెంబర్ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఏపీ రెరా డైరెక్టర్ కె.నాగసుందరి మాట్లాడారు. సమావేశంలో ఏపీ రెరా సభ్యులు జగన్నాథ రావు, ఎం.వెంకటరత్నం, డి.శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్.కామేశ్వరరావు, జె.కులదీప్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసి సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య కేంద్రానికి తలుపులు వేసి ఉన్న సందర్భంలో 12 మంది ఉద్యోగులను సస్పెన్షన్ చేసిన విషయంపై సోమవారం ఏపీ ఎన్జీవో నేతలు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ను కలిసి మాట్లాడారు. పనివేళలు ముగిసిన పిదప తనిఖీలకు వచ్చిన నేపథ్యంలో అనాలోచితంగా చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. రాత్రిళ్లు విధులు నిర్వహించే స్టాఫ్నర్సులకు తగిన రక్షణ కల్పించాలని, సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మర్లపాటి రామకృష్ణ, ఇతర నేతలు కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో స్థానిక వీవీవీ హెల్త్ హబ్లో గత రెండు రోజల నుంచి జరుగుతున్న గుంటూరు ఓపెన్ పికిల్ బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన టి.నేహా అండర్–14 మిక్సడ్ సింగిల్స్, ఉమెన్ ఓపెన్ సింగిల్స్లో ప్రథమ స్థానాన్ని సాధించి డబుల్ టైటిల్ సాధించింది. ఓపెన్ డబుల్స్లో విన్సెంట్, నాగరాజు విజేతలుగా నిలవగా, పి.ఆనంద్ కుమార్, కె.అరుణ్ కుమార్లు రన్నర్ టైటిల్ను సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాస్టర్ గేమ్స్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ భాస్కరరావు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీవీ రావు మాట్లాడుతూ గుంటూరులో పికిల్ బాల్ క్రీడ యువతను బాగా ఆకర్షిస్తుందని తెలిపారు. రోటరీ క్లబ్ తరఫున ఈ పోటీలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ అధ్యక్షురాలు ఎం.అనురాధ, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రోటరీ క్లబ్ సెంటినర్ అధ్యక్షులు డాక్టర్ వీర రాఘవరావు, గుంటూరు ఆదర్శ్ కోశాధికారి జయ శ్రీ, అశోక, జిల్లా పికిల్ బాల్ సంఘం సభ్యులు భరత్, మన్సూర్ వలి, డాక్టర్ హనుమంతరావు, జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా క్రాస్కంట్రీ ఎంపిక పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్ ఎంపికల పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎంపికై న జట్టు కాకినాడలో ఈనెల 24వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు ఏవీ ఆంజనేయులు, కె.అరుణ్ కుమార్, పీఈటీలు శరత్బాబు, చక్రి, నాగరాజు, మోహన్, శాప్ అథ్లెటిక్స్ శిక్షకులు శివారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. పీజీఆర్ఎస్కు వచ్చిన పలువురు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించి, వారి విన్నపాలు ఆలకించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్ణీత వేళల్లో అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులకు సంబంధించి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అన్నారు. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదన్రావు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు. టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు నగరంపాలెం: టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తున్నారని తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు రాత్రిళ్లు ఇంటి తలుపులు కొట్టడం, కాల్ చేయడం వంటివి చేస్తున్నారన్నారు. తన కుమార్తెను, తనను చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
దుబాయి తీసుకెళతానంటూ మోసం
మంగళగిరి టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు మంగళగిరి టౌన్: దుబాయి తీసుకువెళతానని నమ్మించి మోసం చేసిన ఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణ పరిధిలోని పార్కురోడ్డుకు చెందిన జి.సాయి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పసుపులేటి సాయికృష్ణ అనే వ్యక్తితో గత 20 సంవత్సరాలుగా పరిచయం వుంది. సాయికృష్ణ గతంలో దుబాయిలో ఉండి వచ్చాడు. దుబాయికి పంపిస్తానని, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంత ఖర్చు అవుతుందని చెప్పాడు. 2023వ సంవత్సరంలో రూ.లక్ష ఇవ్వమని సాయికృష్ణ అడగడంతో సాయి తన సోదరుని ఫోన్నుంచి ఫోన్ పే ద్వారా రూ.లక్ష నగదును బదిలీ చేశాడు. అప్పటి నుంచి దుబాయికి ఎప్పుడు పంపిస్తావని అడిగితే అదిగో ఇదిగో అంటూ సాయికృష్ణ కాలయాపన చేశాడు. ఇచ్చిన నగదును తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వకుండా, నీకు చేతనైనది చేసుకో.. అంటూ బెదిరింపులకు దిగాడు. ఒక పథకం ప్రకారమే దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఉద్యోగం ఇప్పించుకుండా మోసం చేసిన సాయికృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం బాధితుడు జి.సాయి ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పెదకాకాని: వెనిగండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నట్లు వెనిగండ్ల పీహెచ్సీ వైద్యాధికారి రామాంజిరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన షేక్ రజాక్ నెల రోజులుగా వెనిగండ్ల ముస్లింపాలెంలో నివసిస్తున్నాడు. ఇప్పటి వరకు గ్రామ శివారులోని సుందరయ్యకాలనీలో ఉంటూ క్యాటరింగ్, మండపాల డెకరేషన్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పడప్పుడు నీరసం, ఆయాసంతో స్థానిక పీహెచ్సీకి వెళుతూ ఉండేవాడు. ఈనెల 3వ తేదీన నీరసంతో వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా వారి సూచన మేరకు అదేరోజు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసి జాయిన్ చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన వచ్చిన వైద్య పరీక్షల రిపోర్ట్ ప్రకారం స్క్రబ్టైఫస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. 26 ఏళ్ల రజాక్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ బాజీ, వై.శ్యాంబాబు ఎన్నికయ్యారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సంఘ గుంటూరు జిల్లా 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నాయకులు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా బి.హనుమంతప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా ఏవీ ప్రసాద్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్లుగా డి.పెదబాబు, ఎస్.రామచంద్రయ్య, డీకే సుబ్బారెడ్డి, వి.ప్రసాదరావు, కె.జోజప్ప, జి.దేవరాజు, జి.మల్లిఖార్జునరావు, డీఏ జోసఫ్ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి తోట మాల్యాద్రి నూత కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారిగా వి.భిక్షమయ్య వ్యవహరించారు. -
సంతకాల డిజిటలైజేషన్
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు పనితీరును వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ప్రజల నుంచి సేకరించిన 65 వేల సంతకాలను విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. -
మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?
తాడేపల్లి రూరల్: మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? దుమ్ము లేవకుండా బండరాళ్లు దొర్లకుండా ఎటువంటి గ్యారెంటీ ఇస్తారు? అప్పటివరకు క్వారీ నిలిపివేయాలని ఉండవల్లి దళితవాడకు చెందిన ప్రజలు ఆదివారం రాత్రి క్వారీ నిర్వాహకులను నిలదీశారు. ఆదివారం రాత్రి సమయంలో కొండపై భారీ యంత్రాలతో తవ్వుతున్న క్రమంలో వంద అడుగుల పై నుంచి ఓ బండరాయి దొర్లుకుంటూ ఇళ్లమీదకు వచ్చింది. అక్కడే వున్న ఓ వ్యక్తి పక్క నుంచి ఆ రాయి వెళ్లింది. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఆ ఇంట్లో వాళ్లు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉండవల్లిలో రాత్రి పగలు తేడా లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు నిర్వహించడంతో గ్రామం మొత్తం దుమ్మ ఏర్పడి ఇళ్లల్లో పేరుకుపోతోందని, వాతావరణంలో గాలి కూడా కలుషితం అవుతోందని, ఇప్పుడేమో రాళ్లు దొర్లుతున్నాయని, మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని.. దళితవాడ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలంటూ క్వారీ కింద భాగంలో ఆందోళన చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పాలని చూడగా.. క్వారీలో మట్టి తవ్వకాలు నిలిపివేస్తేనే ఇక్కడి నుంచి వెళతామని చెప్పడంతో తాత్కాలికంగా క్వారీలో మట్టితవ్వకాలను నిలిపివేశారు. అనంతరం తాడేపల్లి పోలీస్స్టేషన్కు వచ్చి జరిగిన సంఘటనపై పోలీసులకు వివరించారు. పోలీసుల నుంచి స్పష్టమైన హామీ రాలేదు. తాత్కాలికంగా నిలిచిపోయిన క్వారీ.... గత సంవత్సరం కాలం నుంచి నిరంతరం ఉండవల్లి క్వారీలో మట్టి తవ్వకాలను నాలుగు భారీ యంత్రాలతో నిర్వహిస్తున్నారు. గ్రామంలో కొంతమంది ఆందోళన చేయడంతో కొండపై వున్న ఆ భారీ యంత్రాలను కిందకి దించివేయడంతో తాత్కాలికంగా క్వారీ నిలిచిపోయింది. నిర్వాహకులు మాత్రం తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. గ్రామస్తులు తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఉండవల్లి దళితవాడలోకి దొర్లుకుంటూ వచ్చిన బండరాయి కాలనీవాసికి త్రుటిలో తప్పిన ప్రమాదం స్పష్టమైన హామీ ఇచ్చి క్వారీ నిర్వహించాలని నిర్వాహకులను నిలదీసిన స్థానికులు తాత్కాలికంగా నిలిచిపోయిన ఉండవల్లి క్వారీ -
కోటి గళాల నిరసన సంతకం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో... గుంటూరు తూర్పు నియోజకవర్గంలో... పొన్నూరు నియోజకవర్గంలో... మంగళగిరి నియోజకవర్గంలో... తెనాలి నియోజకవర్గంలో... ప్రత్తిపాడు నియోజకవర్గంలో... తాడికొండ నియోజకవర్గంలో... వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు చంద్రబాబు సర్కారు అడ్డగోలు నిర్ణయంపై నిరసన ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణకు మద్దతు పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యం, వైద్యవిద్య దూరం చేయడంపై మండిపాటు పేద, మధ్య తరగతి వారికి వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా చంద్రబాబు సర్కార్ తీసుకున్న దుర్మార్గ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంతో గళమెత్తింది. ఇప్పటీకే వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి వైద్య కళాశాలలు ప్రయివేటీకరణ వలన అనర్థాలను వివరించారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
నేటి నుంచి ఏఎన్యూలో యువజనోత్సవాలు
ఏఎన్యూ(పెదకాకాని): అంతర్ కళాశాలల యువజన ఉత్సవాలు సోమవారం నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభం కానున్నాయి. వర్సిటీ కళాశాలలతోపాటు అనుబంధ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో పూర్తి సదుపాయాలు కల్పించి, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.మురళీమోహనన్ తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలలో మూడు రోజులపాటు మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు జరుగునున్నాయి. యువజన ఉత్సవాల నిర్వహణకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే యువజనోత్సవాలకు ముఖ్య అతిథులుగా వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా వర్సిటీ రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్టార్ ఆచార్య సింహాచలం, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ ఎస్ఎస్.తమన్ హాజరుకానున్నారు. అతిథులుగా ఓ ఎస్డీ ఆచార్య ఆర్విఎస్ఎస్ రవికుమార్, పాలక మండల సభ్యులు ఆచార్య కె. సుమంత్కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్, వివిధ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సురేష్కుమార్, ఆచార్య వీరయ్య, ఆచార్య పాల్కుమార్, ఆచార్య లింగరాజు, ఆచార్య దివ్య తేజమూర్తి తదితరులు హాజరు కానున్నట్లు యువజనోత్సవాల కో ఆర్డినేటర్ ఎస్. మురళీమోహన్ తెలిపారు. ● సుమారు రూ.6 లక్షలు టోకరా ● పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ మంగళగిరి టౌన్: బ్యాంకుల్లో, వివిధ లోన్ యాప్లలో రుణాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళను మోసం చేసిన ఘటన మంగళగిరి పట్టణంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణం ఎల్జీ నగర్కు చెందిన రాజేశ్వరి వంట పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కొన్నినెలల క్రితం పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ఏపీఎస్పీ గేటు సమీపంలో ఓ షాపు పెట్టుకుని వ్యాపారం నిర్వహిస్తోంది. 2024 సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో చరణ్రెడ్డి ఆమె షాపునకు వచ్చి తరచూ చీరలు కొనేవాడు. ఆ విధంగా రాజేశ్వరికి పరిచయమయ్యాడు. చీరల వ్యాపారం అభివృద్ధికై లోన్లు ఇప్పిస్తానని రాజేశ్వరిని నమ్మించాడు. పాన్కార్డు, ఆధార్ కార్డు కావాలని, అప్పుడప్పుడు మహిళ ఫోన్ కూడా ఇవ్వాల్సి వస్తుందని చరణ్రెడ్డి చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోవడంతో గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన గుంటూరులోని హర్షిత ఎంటర్ప్రైజెస్కు సదరు మహిళను తీసుకువెళ్లి లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆధార్, పాన్కార్డు చెక్ చేయించి మహిళ చేతి వేలిముద్రలు తీసుకున్నాడు. ఈ క్రమంలో హర్షిత ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు రూ.3 లక్షల లోన్ సరిపోతుందా అని ప్రశ్నిస్తూ ఫొటోలు కూడా తీసుకున్నారు. వాళ్లు ఏం అడిగినా మాట్లాడద్దని రాజేశ్వరికి చెప్పడంతో మౌనంగా ఉంది. అదే సంవత్సరం సెప్టెంబర్ 11న గుంటూరులోని సత్య షోరూమ్కు తీసుకువెళ్లి అంతకుముందు లోన్ ఫెయిల్ అయ్యిందని, మళ్లీ ప్రయత్నం చేస్తున్నానంటూ నమ్మబలికాడు. అక్కడ కూడా రాజేశ్వరి వేలముద్రలు వేయించి, ఆధార్, పాన్ వెరిఫికేషన్ అంటూ మాయమాటలు చెప్పాడు. మరల లోన్ ఫెయిల్ అయిందని, నీ ఫోన్ కావాలంటూ చెప్పడంతో ఫోన్ను చరణ్రెడ్డికి రాజేశ్వరి ఇచ్చింది. అలా 10 రోజుల తరువాత మంగళగిరిలోని మహిళ షాప్కు వచ్చి గంటలు గంటలు రాజేశ్వరి ఫోన్ తీసుకుని చూసేవాడు. వచ్చిన కస్టమర్లకు చీరలు చూపిస్తూ ఫోన్ గురించి పట్టించుకోకపోవడంతో రాజేశ్వరి ఫోన్లో లోన్ యాప్లు వేశాడు. 2024 అక్టోబర్ 5వ తేదీన ఒక లోన్ యాప్ వేసి పూర్తిచేయమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ యాప్లో సమాచారం ప్రకారం పూర్తిచేసింది రాజేశ్వరి. సాయంత్రానికి తన ఖాతాలో నుండి రూ.17 వేల మాయమైనట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే చరణ్రెడ్డికి రాజేశ్వరి ఫోన్ చేసి ఖాతాలో డబ్బులు పోయాయని, ఎందుకు అని అడిగితే షాప్కు వస్తానని చెప్పి వచ్చాడు. చరణ్రెడ్డి మహిళ ఫోన్ తీసుకుని కొద్ది సమయం ఫోన్లో ఏదేదో చేస్తూ మీ నగదు ఎక్కడికీ పోలేదు. నేను ఆ యాప్లో రిపోర్ట్ చేశాను, తిరిగి నీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయని నమ్మబలికాడు. అదేవిధంగా పలుమార్లు ఆమె ఖాతా నుంచి నగదు తీసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా స్వర్ణోత్సవ సంబరం
బాపట్ల: స్థానిక వ్యవసాయ కళాశాలలో విద్యనభ్యసించిన 1975–79 బ్యాచ్ విద్యార్థులు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం స్వర్ణోత్సవ సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆత్యందం ఆహ్లాదకరంగా గడిపారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలతో పలకరించుకున్నారు. సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న ఉద్వేగంతో ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మొత్తం 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ సమ్మేళనంలో నలుగురు మహిళలు కూడా ఉండటం విశేషం. ఇక్కడ చదివిన అనంతరం వైద్య విద్యనభ్యసించిన నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు, అఖిల భారత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐఎఫ్ఎస్కు ఎంపికై న నలుగురు అధికారులు, బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్లు, వివిధ రంగాల్లో నిష్ణాతులై తమ పదవులకు వన్నె తెచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి రిటైర్ అయిన వారు ఉన్నారు. వీరంతా ఆదివారం వ్యవసాయ కళాశాలలో కలుసుకున్నారు. విద్య నేర్పిన 12 మంది గురువులకు వేద పండితుల ఆశీస్సులతో పట్టు వస్త్రాలను బహూకరించి, ఘన సన్మానం చేసి గురుభక్తిని చాటుకున్నట్లు ఈ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థి సంఘం నాయకులు జె.ధర్మారావు, పి.రాజశేఖరరావు తెలిపారు. చివరిగా ప్రస్తుత విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానంతర ఉద్యోగావకాశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి, బోధన సిబ్బంది పాల్గొన్నారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి జరిగిన అర్చనలు, విశేష పూజలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీరామనామక్షేత్రం ఆవరణలో 99వ శ్రీరామకోటి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ట్రస్టీస్ రాగం వెంకటలీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్రావు ఆధ్వర్యంలో జరగ్గా, సాయంత్రం క్రోసూరి మురళీకృష్ణమాచార్యుల బృందం అంకురారోపణం, అగ్నిస్థాపనం, రుత్విగ్వరణం, అఖండ జ్యోతిస్థాపన, శ్రీరామ పతాకావిష్కరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్ (సీతానగరం) కార్యదర్శి శ్రీమాన్ స్వామి వినిశ్చలానంద పతాకావిష్కరణ చేసి, అనుగ్రహభాషణం చేశారు. 99 ఏళ్లుగా శ్రీరామకోటి మహోత్సవాలను నిర్విరామంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వంశపారంపర్యంగా ఆ సీతారాముల అనుగ్రహంతో పలు ప్రాంతాల భక్తులు, దాతల సహకారంతో చేపట్టడం ఒక బృహత్తర యజ్ఞంగా పేర్కొన్నారు. కలియుగంలో తరించేందుకు రామనామ సంకీర్తనే సరైన మార్గమని చెప్పారు. క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలకరించారు. పట్నంబజారు: గుంటూరు డిపో 1 నుంచి హైకోర్టుకు వయా తుళ్లూరుకు నిత్యం ఉదయం 8.00గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరే జనరల్ బస్సు టైమ్ను 7.45 నిమిషాలకు మార్చినట్లు డిపో 1 అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 15 నిముషాల ముందుగా మార్చినట్లు వివరించారు. సోమవారం నుంచి మారిన బస్సు సమయం మార్పులను ప్రయాణికులు, ఉద్యోగులు గమనించాలని కోరారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 578.00 అడుగులకు చేరింది. ఇది 277.2460 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లో 20,167 క్యూసెక్కులు కాగా... శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 20,167 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది నగరంపాలెం: అక్రమ రేషన్ వ్యాపారులకు సహకరిస్తున్న పొన్నూరు రూరల్ పోలీస్స్టేషన్ (పీఎస్) కానిస్టేబుళ్లు ఎం.నాగార్జున, వై.మహేష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమార్కులపై ఉన్న పోలీసుల నిఘాను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. పోలీస్ శాఖ ఉద్యోగులకు ఉండాల్సిన నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణను వారు విస్మరించారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని, శాఖాపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.98 టీఎంసీలు. 7దాచేపల్లి: స్థానిక పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్, ఎస్ఐ పాపారావు పాల్గొన్నారు. నరసరావుపేట: ట్రాన్స్పోర్టు కంపెనీల ద్వారా అక్రమంగా రవాణా చేసిన పురుగుమందుల బాక్స్లను వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. -
మధ్యవర్తిగా వచ్చి మృత్యువాత
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు ● నరసరావుపేట మండలం కేఎం అగ్రహారంలో ఘటన ● మధ్యవర్తిగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న పర్వతాలు ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నరసరావుపేట రూరల్: స్వల్పవివాదం నేపథ్యంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కేఎం అగ్రహారంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి పక్కన వారితో ఏర్పడిన వివాదం పరిష్కారంలో మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తి దాడిలో మృత్యవాత పడ్డాడు. నరసరావుపేట రూరల్ పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు. నరసరావుపేట మండలం కేఎం అగ్రహరానికి చెందిన ఓర్సు ముసలయ్య, వేముల వెంకటేశ్వర్లు పక్కపక్క ఇంటిలో నివసిస్తున్నారు. స్థలం విషయంలో గతంలో ఇరువురి మధ్య వివాదం ఉంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలు మార్లు స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వేముల వెంకటేశ్వర్లు కుమారుడు అంకారావు ద్విచక్రవాహనంపై గడ్డి తీసుకొస్తుండగా రోడ్డుపై నిలిపి ఉంచిన ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానికి తగిలి బండి కింద పడింది. దీనిపై ముసలయ్య కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో అంకారావు రాడ్తో ముసలయ్యకు చెందిన ద్విచక్రవాహనానంపై దాడిచేయడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. మధ్యవర్తిగా వచ్చి.. ఇంటి వద్ద ఆదివారం జరిగిన వివాదాన్ని దేచవరంలో ఉంటున్న తన సోదరుడు పర్వతాలుకు ముసలయ్య తెలియజేశాడు. గ్రామానికి వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. తన కుమారుడు హనుమంతరావుతో కలిసి పర్వతాలు అగ్రహారం వచ్చాడు. ముసలయ్య కుమారుడు కోటేశ్వరరావు, భార్య రమణలు, పర్వతాలు, హనుమంతరావులు నలుగురు రెండు ద్విచక్రవాహనాలపై వెంకటేశ్వర్లుకు చెందిన పొలం వద్దకు వెళ్లారు. అక్కడ వెంకటేశ్వర్లు ఆయన కుమారుడు అంకారావుతో వీరికి వాగ్వివాదం జరిగింది. వెంకటేశ్వర్లు, అంకారావులు గడ్డపార, కర్రలతో వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో పర్వతాలు అక్కడికక్కడే మృతిచెందాడు. కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. పర్వతాలు కుమారుడు హనుమంతురావుకు స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడి జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దాడికి ఉపయోగించిన గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్టీమ్ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు. -
వైకుంఠపురవాసుని అనుగ్రహంతో ఉన్నత స్థానం
● నటుడిగా జన్మ సార్థకం ● బొల్లిముంత పురస్కారం.. పూర్వజన్మసుకృతం ● ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం తెనాలిటౌన్: నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు సినిమాలకు రాసిన మాటలు, పాటలు ఆ రోజుల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని, ఆయన పేరిట పురస్కారం అందుకోవటం తన పూర్వజన్మసుకృతమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగిన రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో చివరిరోజైన ఆదివారం రాత్రి ఏర్పాటైన సభకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జాతీయస్థాయి జీవితకాల పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరించారు. అనంతరం బ్రహ్మానందం తన కృతజ్ఞతాపూర్వక ప్రసంగంలో, తెనాలితో తనకు ఎంతగానో అనుబంధం ఉందన్నారు. వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే తానీ స్థాయికి ఎదిగానని చెప్పారు. నలభై తొమ్మిదేళ్ల కిందట డిసెంబరు 14న తన వివాహం వైకుంఠపురం దేవస్థానంలో నిరాడంబరంగా జరిగిందని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తాను పేదరికంలో ఉన్నానని చెప్పుకున్నారు. ఇక్కడకు వచ్చే ముందు వైకుంఠపురం దేవస్థానం వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. తెనాలిలో జరిగే శ్రీరామనవమి వేడుకలు గొప్పగా ఉండేవనీ, ఆకాశమంత పందిళ్లు, మార్కెట్లోని దొంగరాముడి గుడి వద్ద పానకం, వడపప్పు తిన్న రోజులు మరచిపోలేనని చెప్పారు. సినిమాల్లో తనను చూడగానే జనం నవ్వుకోవటం దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తానని, నటుడిగా తన జన్మ సార్థకమైందని బ్రహ్మానందం అన్నారు. మంచిగా ఆలోచించి, పదిమందికీ మంచిచేయాలన్నారు. ధర్మం, సహాయం అనే పదాలు తనకు ఇష్టం ఉండదని ఏ సహాయం చేసినా గోప్యంగా ఉంచాలనేది తన భావనగా చెబుతూ ఆ సహాయం కూడా యోగ్యులకు చేయాలని సూచించారు. మనుషులంతా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలనేది తన ఆకాంక్షగా చెప్పారు. ఏపీ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ పేద కళాకారులకు ఆర్థికసహకారం అందించటంలో బ్రహ్మానందం ముందువరుసలో ఉంటారని, చేసిన సాయం ఎవరికీ చెప్పుకోరని అన్నారు. ఆయనొక ప్రొఫెసర్, ఫిలాసఫర్గా అభివర్ణించారు. డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, తుమ్మల కిషోర్బాబు, చందు శ్రీనివాసరావు, అరవ రామకృష్ణ, బి.శ్రీనివాసరావు, సింగరాయకొండ మండల విద్యాధికారి బొల్లిముంత అజయ్కుమార్, బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెన్హర్ మాట్లాడారు. సభలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, సామాజిక కార్యకర్త చెరుకూరి రమేష్బాబు, అంతర్జాతీయ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చందు సుబ్బారావు పర్యవేక్షించారు. -
డాక్టర్ నందకిషోర్కు ఐఎంఏ రాష్ట్ర ఉత్తమ అధ్యక్ష అవార్డు
గుంటూరు మెడికల్ గుంటూరుకు చెందిన సీనియన్ ఈఎన్టీ సర్జన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్కు ‘ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని అవార్డు’ లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, వైద్యుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణ చర్యలలో పాలుపంచుకోవడం వంటి సేవలకుగాను 2024–2025 సంవత్సరానికి డాక్టర్ నందకిషోర్కు ఈ అవార్డు ప్రకటించారు. ఈ మేరకు ఐఎంఏ జాతీయ కార్యాలయం ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది. ఈ అవార్డును ఈనెల 27, 28 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిర్వహించే ఐఎంఏ జాతీయ సదస్సులో ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ నందకిషోర్ అందుకోనున్నారు. తనకు జాతీయఅవార్డు లభించిన సందర్భంగా రాష్ట్ర వైద్యులందరికీ డాక్టర్ నందకిషోర్ కతజ్ఞతలు తెలిపారు .జాతీయ అవార్డు కు ఎంపిక కావడం పట్ల ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నాగెళ్ల కిషోర్, సిజిపి డైరెక్టర్ డాక్టర్ ఎం.ఫర్నికుమార్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.బాలరాజు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు తదితరులు అభినందనలు తెలిపారు. గుంటూరు బ్రాంచ్కి చెందిన డాక్టర్ నందికిషోర్కి ఈ అవార్డు లభించడం పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ టీ.సేవకుమార్, పూర్వఅధ్యక్షుడు డాక్టర్ వై. సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాసరెడ్డి, బ్రాంచ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట ఈస్ట్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంలో వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 12 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయటం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణ చినరామిరెడ్డి, కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సస్పెండ్కు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు. ఈనెల 3వ తేదీన గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సందర్శించారనీ, ఆ సమయంలో ఆరోగ్య కేంద్రాన్ని తాళం వేసి ఉండటాన్ని గమనించి కేంద్రంలోని 12 మందిని సస్పెండ్ చేయటం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఆరోజున కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు సెలవుపై ఉన్నారనీ, మిగిలిన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధి నిర్వహణలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల వివరణ కోరకుండా సస్పెండ్ చేయటం బాధాకరమని తెలిపారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై పునరాలోచించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రట రీ షేక్.బాజీ, తాలూకా యూనిట్ నాయకులు ఎం.ఫ్లోరెన్స్, ఎస్.చలమారెడ్డి, ఆనంద్కుమార్ పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
●రెండు కిలోల గంజాయి స్వాధీనం ●వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ లక్ష్మీపురం: గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతున్న ఆరుగురిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి 10 గంటలకు నగరంపాలెం సీఐ సత్యనారాయణ పోలీస్స్టేషన్ పరిధిలోని వీఐపీ రోడ్డులోని లాలుపురం వెళ్లే డొంక సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఎస్ఐ ప్రసన్నకుమార్ పోలీసు బృందంతో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది పోలీసులను చూసి పారిపోతుండగా సీఐ తన సిబ్బందితో వెంబడించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చేతుల్లో ఉన్న కవర్లను పరిశీలించగా గంజాయి ఉండటం గుర్తించి, వెంటనే వాటిని సీజ్ చేసి, పట్టుబడిన ఆరుగురిని పోలీస్స్టేషన్కు తరలించారు. గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతుండగా పట్టుబడిన వారిలో ఐదుగురిపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇంకా కొంత మంది నిందితులను గుర్తించామని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా సరఫరా చేస్తున్నట్లు గాని, వినియోగిస్తున్నట్లు గాని తెలిస్తే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఈ కేసులు నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రసన్నకుమార్, హెడ్కానిస్టేబుల్ ప్రసాద్బాబు, దాసు, కానిస్టేబుల్ శ్రీనివాసు, ఉదయ్, నాగేశ్వరరావు, నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన వీరిందరిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. -
హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు
తెనాలి: రక్తం కనబడకుండా, ఆయుధం కనిపించకుండా, హింస లేకుండా ఏ తెలుగు సినిమా అయినా వుందా? ఎంత దుర్మార్గమిది...! ఎంత సాంస్కృతిక నేరస్థులు వీళ్లు, సినిమాలు తీసేవాళ్లు...వేషాలు వేసేవాళ్లు అని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. సినిమాల్లో ఒక్కోడు వందమందిని చంపటం, ఏ నేరారోపణ లేకుండా బయటకెలా వస్తారు... ఆలోచించాలని చెప్పారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహశీల్దార్ కేవీ గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. బహుభాషా కోవిదుడు బొల్లిముంత శివరామకృష్ణ తెనాలిటౌన్: బహుభాషా కోవిదుడు, అభ్యుదయ రచయిత, ఉద్యమనేత బొల్లిముంత శివరామకృష్ణ సేవలు ఆదర్శంగా తీసుకోవాలని అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు పిలుపునిచ్చారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం శనివారం ఎంతో వేడుకగా జరిగింది. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళా పురస్కారాన్ని, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబుకు రూ.25వేల నగదు పురస్కారాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన సభకు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణ, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, నలజాల లోకేష్, మైనేని రాఘవ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ రచనా పటిమ గురించి శోభన్ బాబు, ఊర్వశి శారద, ఎంతో చక్కగా వర్ణించారని అన్నారు. తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు తన 25 వేల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో పురస్కార గ్రహీత, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. అనంతరం ఫౌండేషన్ తరపున గుమ్మడి గోపాలకృష్ణ, కొత్తపల్లి రవిబాబులకు కళా పురస్కారాలు, రూ. 25 వేల నగదు పురస్కారం అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను దుశ్శాలువా,పూలమాల, మెమోంటోలతో సత్కరించారు. సభా కార్యక్రమానికి ముందు నంది పురస్కార గ్రహీత యం సైదారావు బృందంచే జుగల్ బందీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తెనాలి మండల తహశీల్దార్ కె.వి. గోపాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (తిమ్మరుసుగా) దర్శకత్వంలో ప్రదర్శించిన ’భువన విజయం’ సాహితీ రూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు నటీ నటులు తమ తమ పాత్రలకు జీవం పోశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ -
అంతర్జాతీయంగా పరిశోధన విస్తరణే లక్ష్యం
యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ తెనాలి: మధుమేహ బాధితుల గాయాలు కేవలం వారి శరీర సమస్య మాత్రమే కాదనీ వారి రోజువారీ జీవనాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక సౌకర్యాలను ప్రభావితం చేసే సమస్యగా యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ చెప్పారు. మధుమేహ గాయాలు వేగవంతంగా మానేందుకు అవసరమైన పరిశోధన చేసి పీహెచ్డీ స్వీకరించిన డాక్టర్ శుభశ్రీ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చికిత్సను సులభతరం చేయడం, రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, సామాజిక బాధ్యతను తీర్చడమనే లక్ష్యంతో ఈ పరిశోధన అంశాన్ని తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనను విస్తరించి, కొత్త సాంకేతికతలు, రీజనరేటివ్ వైద్య పరిష్కారాలు, స్మార్ట్ డ్రెస్సింగ్ పద్ధతులను రూపొందించాలని భావిస్తున్నానన్నారు. తన తల్లిదండ్రులు, సోదరి కుటుంబం తనను ఎంతో ప్రోత్సహించాయని, భవిష్యత్లో తన లక్ష్యాలను గౌరవిస్తూ కెరీర్, శాస్త్ర పరిశోధన, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను గుర్తించగల జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని భావిస్తున్నట్టు వివరించారు. -
సమాజ శ్రేయస్సుకు హోంగార్డుల సేవలు
నగరంపాలెం: పోలీస్ బలగాలతో సమానంగా హోంగార్డులు కూడా ప్రజా రక్షణ, సమాజ శ్రేయస్సుకు విశేష సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో శనివారం 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం జరిగింది. హోంగార్డులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హోంగార్డులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 520 మంది హోంగార్డులు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించారని.. వారి సేవలు మరువలేమని పేర్కొన్నారు. పరేడ్ కమాండర్ హోంగార్డు ఎండీ.సంధాని నేతృత్వంలో నిర్వహించిన పరేడ్ మార్చ్ ఆకట్టుకుంది. వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను జిల్లా ఎస్పీ అందించారు. అనంతరం హోంగార్డులు నగరంపాలెంలోని మూడు బొమ్మల కూడలి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, హోంగార్డు ఆర్ఐ సురేష్, డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్బీ), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), భానోదయ (గుంటూరు దక్షిణ), సీఐలు శ్రీనివాసరావు (ఎస్బీ), ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కమిటీతో మేలు జరిగేనా? కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 578.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,659 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.9865 టీఎంసీలు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : తొలివిడతలో తీసుకున్న 33 వేల ఎకరాలతో ప్రపంచాన్ని తలదన్నే రాజధానిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు సింగపూర్ మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ మ్యాప్లను రూపొందించి నానా హడావుడి చేశారు. అద్భుతాలు సృష్టిస్తానని చెప్పిన బాబు అమరావతి అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ సిటీ వంటివి రావాలంటూ మరోవిడత భూ సమీకరణ అన్నారు. దీంతో బాబును నమ్మి తొలివిడతలో రైతులు ఇచ్చిన భూముల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్నటి వరకు పరిధి ఇక్కడి వరకే అని గుర్తించి ఎన్ఆర్ఐలు, బడా బాబులు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడలేదు. గజం రూ.75 వేల వరకు కొన్ని ప్రాంతాలలో పలికిందంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు కొనుగోలుదారులకు కూడా ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొంది. నట్టేట ముంచేలా ఇప్పుడు ఇంకో విడత ఉందంటూ మంత్రి నారాయణ బహిరంగ ప్రకటనలు చేయడం, లీకులివ్వడం ప్రారంభించడంతో రైతులు, రైతు జేఏసీ ప్రతినిధులు, ఈ ప్రాంత వాసుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఇచ్చిన భూములు అభివృద్ధి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే తాము లబ్ధి పొందవచ్చని ఆశిస్తుంటే మాకు తోడు మరో ఏడు గ్రామాలను చేర్చితే మా పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. భూములిచ్చి 10 సంవత్సరాలు దాటింది. ఇంతవరకూ రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలపైనే తప్ప భౌతికంగా ఎక్కడున్నాయో తెలియదు. కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేయలేదు, చేసిన వారికి బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. భూములను అభివృద్ధి చేసి రైతులను ఆదుకోకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రైతు జేఏసీ పేరుతో గోడు వెళ్లబోసుకుందామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నిరసన తెలపడంతో త్రీమెన్ కమిటీ వేసి హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. అన్నీ విన్నా ఎన్ని సమస్యలు పరిష్కరిస్తారనేది తెలియడం లేదు. జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... పల్నాడు, గుంటూరు జల్లాల్లోని రెండు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. మరో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విస్తరణకు వినియోగించుకోనున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి 9,616 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఇందులో 7,465 ఎకరాలు రైతుల పట్టా భూములు, 97 ఎకరాలు అసైన్డ్ భూములు, 2,054.23 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గుంటూరు జిల్లాలో 10,878 ఎకరాల భూమిని సమీకరిస్తుండగా, అందులో 9,097 ఎకరాలు రైతులకు చెందిన పట్టా భూములు, 7.01 ఎకరాలు అసైనన్డ్ భూములు, 1,774.07 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గ్రామ సభల్లో పలువురు రైతులు దీనిని వ్యతిరేకించారు. తొలివిడత బాధిత 29 గ్రామాల రైతుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా భూముల సమీకరణ చేయనున్నారు. యండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, కర్లపూడి లేమల్లే గ్రామంలో 2,603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైనన్డ్ భూమిని సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమానులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల్లో కలిపి పట్టా భూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైనన్డ్ భూమిని సమీకరణ చేయనున్నారు. ఈ భూసమీకరణ బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హాఫ్పేటలో దిత్వా తుఫాన్ ఈదురు గాలులకు పూర్తిగా నేలవాలిన వరిపంట7రాజధాని పేరుతో అన్నదాతలపై మరోసారి భూ సమీకరణ పిడుగు పడింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పూలింగ్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అలజడి రేగిది. మరో ఏడు గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు రోడ్డున పడనున్నారు. అదనపు భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా విస్తరించడానికి మేం వ్యతిరేకం. రాయపూడిలో మా కుటుంబంతో పాటు బంధువులు చాలామంది రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చాం. అప్పట్లో చెప్పింది వేరు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది వేరు. 10 సంవత్సరాలుగా మాతో ఆడుకుంటారనుకుంటే ఒక్క సెంటు కూడా ఇచ్చేవాళ్లం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యల వలన రాజధానిలో భూములకు ధరలు పూర్తిగా పడిపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే రాజధాని రైతులు త్వరలో తిరగబడి సత్తా చూపడం ఖాయం. – చిలకా విజయ్ కుమార్, రాయపూడి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలింగ్పై ప్రభుత్వం నాడు చెప్పిందొకటి నేడు చేసేదొకటిగా ఉంది. అప్పుడు 33 వేల ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు మళ్ళీ అదనపు భూ సమీకరణ పేరుతో రెండో విడత, మూడో విడత కూడా ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడించడం అనాలోచితం. అప్పుడే ఈ మాట చెప్పి సమీకరణ చేసి ఉంటే ఇవ్వాలో వద్దో ఆలోచించే వాళ్లమే కదా. అప్పుడు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని అని ఇప్పుడు మున్సిపాలిటీ అనడంలో ఆంతర్యం ఏంటో ప్రభుత్వానికే తెలియాలి. – కొప్పుల శేషగిరిరావు, దొండపాడు, రైతు తొలివిడతలో భూములిచ్చిన వారికి ప్రధానంగా గ్రామ కంఠాల నిర్ధారణ, రిటర్నబుల్ ప్లాట్లు వీధిపోటు, వీధి శూల, జరీబు ప్యాకేజీ నిర్ధారణ వంటివి గత 10 సంవత్సరాలుగా తీరని సమస్యగానే మిగిలిపోయాయి. వీటిపై ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన త్రీమెన్ కమిటీ సమావేశంలో రైతులు గళమెత్తారు. అన్నీ విన్న కమిటీ ఆయా సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పింది. కానీ ఆచరణలో అది సాధ్యపడదని రైతులు చెబుతున్నారు. ఈలోగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబు మాటపై తొలి విడతకు ఆనాడు రైతులు అంగీకరించగా ఇప్పుడు రెండో విడతపై మాత్రం బాధితులు గుర్రుమంటున్నారు. -
విదేశీ గడ్డపై మెరిసిన మన వినీల
ఏఎన్యూ (పెదకాకాని): యూఎస్ఏ మిసెస్ తెలుగు జాతీయ స్థాయి సౌందర్య పోటీ సంస్థ నిర్వహించిన ‘మిసెస్ తెలుగు యూఎస్ఏ – 2026’ పోటీల ఫైనలిస్టుల జాబితాలో మన గుంటూరు మహిళకు స్థానం లభించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలతోపాటుగా విదేశాలలో ఉంటున్న వారూ ఇందులో పాల్గొన్నారు. 22 మంది తుది పోటీలకు ఎంపిక కాగా, వారిలో గుంటూరుకు చెందిన దొప్పలపూడి వినీల కూడా ఉన్నారు. ఆమెను ప్రవాసాంధ్రులు, పుర ప్రముఖులు అభినందించారు. నరసింహరావు, అంజమ్మ దంపతులకు వినీల గుంటూరులో జన్మించారు. చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఉన్నత చదువు కోసం 2016లో అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని వివిధ అందాల పోటీలలో విజయాలు సాధించారు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని బంధువులు తదితరులు ఆకాంక్షించారు. -
చోరీ కేసులో నిందితులు అరెస్టు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ రెహమాన్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈఏడాది ఆగస్టు 9న వాసవి కాంప్లెక్సు సమీపంలో రెడ్లబజారులో నివాసం ఉండే మద్రాసు సరస్వతి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి అదే నెల 10వ తేదీ రాత్రి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి లోపలకు వెళ్లి చూడగా, రూ. 10 లక్షల నగదు, 90 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో భాగంగా పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన మద్దు అనిత తన భర్తతో విడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా పాతగుంటూరు యాదవబజారుకు చెందిన షేక్ కరీముల్లా, శ్రీనగర్కు చెందిన రెడ్డి సాయిసంతోష్, అరండల్పేట పిచుకులగుంట ప్రాంతానికి చెందిన గండికోట గోపి, శ్రీనగర్కు చెందిన బాణావత్ చందునాయక్లతో కలిసి చోరీ చేసేందుకు పథకం పన్నారు. బాధితురాలు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీ, తదితర ఆధారాలతో నిందితురాలు అనితను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో, మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరికి గురైన రూ. 10 లక్షలు నగదుకు సంబంధించి రూ. 3.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, దొంగిలించిన బంగారాన్ని మేడికొండూరు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లలో తాకట్టు పెట్టిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బంది నూరుద్దీన్, మోహన్, రామారావులను అభినందించారు. -
మోంథా, దిత్వా తుఫాన్ల ధాటికి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన రైతన్నకు కన్నీళ్లు తప్పడం లేదు. తుఫాన్ల దెబ్బకు పంట తీవ్రంగా నష్టపోయి దిగుబడి తగ్గిపోయిందని వాపోతున్నారు. దీనికి తోడు మద్దతు ధర లేక దళారుల బ
తెనాలి టౌన్: ‘రైతన్నా... మీ కోసం’ అంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారం చేయడం మినహా అన్నదాతలకు చేసిన మేలు ఏమీ లేదని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులకు కార్డులు మంజూరు చేసి పంట నమోదు చేసే వారని అన్నదాతలు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో కౌలు రైతులు అధికంగా ఉన్నారు. వీరంతా రెండు నుంచి 20 ఎకరాల వరకు కౌలు చేస్తూ ఉంటారు. ఎకరాకు రూ. 35 వేల నుంచి రూ. 30 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. మోంథా తుఫాన్ కారణంగా పైరు వేసిన మొదటిలోనే పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి వచ్చే సరికి దిత్వా తుఫాన్ వచ్చింది. బలమైన గాలులతో పంట పలు చోట్ల పూర్తిగా నేలవాలింది. దీంతో కొన్నిచోట్ల పొలాల్లోనే వరి ధాన్యం నేల రాలి మొక్కలు మొలిచాయి. ఖర్చులు భరించలేక పంట కోయడానికి, తరలించడానికి ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో కొన్ని చోట్ల కోత కూడా కోయలేదు. వరి కోత యంత్రానికి ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.3,800 వరకు వసూలు చేస్తున్నారు. ధాన్యం పొలం నుంచి బయటకు తీసుకురావడానికి ట్రాక్టర్కు కనీసం రూ. వెయ్యి అడుగుతున్నారు. ఇంతచేసినా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనే వారు కనిపించడం లేదు. బస్తా రూ.1,250 నుంచి రూ.1,300 మాత్రమే దక్కుతోంది. రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పసుపులేటి
చేబ్రోలు: ఏపీ కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా చేబ్రోలు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసరావును నియమిస్తూ ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర కన్వీనర్గా నియమితులైన చేబ్రోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న పసుపులేటి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి మండలంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పసుపులేటిని పలువురు అభినందించారు. తెనాలి రూరల్: వ్యాపారలలో నష్టం రావడం, తాకట్టు పెట్టిన బంగారం వ్యాపారి మోసం చేయడంతో మనస్తాపానికి గురై బాంగారు ఆభరణాల దుకాణ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ రజకపేటకు చెందిన కడప వెంకట్రావు చేబ్రోలు మండలం వేజండ్లలో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అక్కడి ప్రజలు తాకట్టు పెట్టిన ఆభరణాలను తెనాలిలో శ్రీరామమూర్తి వద్ద తాకట్టు పెట్టాడు. వెంకట్రావు వద్ద గతంలో పని చేసిన వ్యక్తి మరో దుకాణాన్ని ప్రారంభించాడు. ఓ వైపు వ్యాపారంలో నష్టాలు రావడం, తెనాలిలో తాకట్టు పెట్టుకున్న శ్రీరామమూర్తి మోసం చేశాడని భావించిన వెంకట్రావు శనివారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు మెడికల్: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోల్డ్ చైన్ పరికరాలు, ఐఎల్ఆర్, డీప్ ఫ్రీజర్, వ్యాక్సిన్ క్యారియర్, ఐస్ ప్యాక్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా మెడికల్ ఆఫీసర్, ఫార్మాశిస్టులదేనని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఫార్మాశిస్టులు లేని చోట స్టాఫ్నర్సులను, ఎంపీహెచ్ఎస్ సిబ్బందికి కోల్డ్ చైన్ పరికరాలు పాడవకుండా నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారి అప్పజెప్పాలన్నారు. తప్పనిసరిగా వ్యాక్సిన్లు ఏవిధంగా నిల్వ ఉన్నాయి, వాటి కాలపరిమితి ఎప్పటి వరకు ఉంది, తదితర విషయాలను ప్రతిరోజూ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలన్నారు. డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత మాట్లాడుతూ ప్రతి ఫార్మశీ అధికారి పీహెచ్సీ లేదా అర్బన్ పీహెచ్సీల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. -
అంబేడ్కర్ భావజాలంతో సమస్యల పరిష్కారం
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ ఏఎన్యూ (పెదకాకాని): భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ భావజాలం నేటి అనేక సంక్షోభాలకు పరిష్కార మార్గాలను చూపుతుందని ఉస్మానియా యూనివర్సిటీ పీఏసీపీఈటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ అంబేడ్కర్ చెయిర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి సభ శనివారం వర్సిటీలోని బాలమోహన్ దాస్ సెమినార్ హాల్లో జరిగింది. ముందుగా వర్సిటీలో ఉన్న అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. చెయిర్ ప్రొఫెసర్ ఆచార్య వై.అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి పరిష్కార మార్గాలను వెతుకుతున్నారని గుర్తు చేశారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వీరయ్య, ఆచార్య అశోక్ కుమార్లు మాట్లాడారు. -
కోటప్పకొండలో ప్రారంభమైన ఆరుద్రోత్సవ పూజలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి మాలధారులు కొండకు చేరుకొని ఇరుముళ్ళు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి ఆరుద్రోత్సవ అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. యడ్లపాడు: మండలంలోని నాలుగు పురాతన ఆలయాలు అభివృద్ధి కానున్నాయి. పల్నాడు జిల్లాలోని 17 ఆలయాలకు రాష్ట్ర దేవదాయ శాఖ రూ.12.45 కోట్లు తాజాగా మంజూరు చేసింది. దీనిలో మండలంలోని మూడు గ్రామాల్లోని నాలుగు ఆలయాలకు రూ.289.56 కోట్లు నిధులు కేటాయింపు జరిగింది. దింతెనపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.కోటి, దండేశ్వరస్వామి గుడికి రూ.83.33 లక్షలు, తిమ్మాపురం చంద్రమౌళేశ్వర స్వామి ఆలయానికి రూ.56.25లక్షలు, కొండవీడు శివాలయానికి రూ.50 లక్షలు నిధులు మంజూరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నిధులకు స్థానిక ప్రజలు 33శాతం సొమ్మును జోడించి ఆయా పనులు చేపట్టాలని తెలిపారు. నిధులకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మాచవరం: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నీరు కలుషితం కావడంతో స్థానిక అధికారులు శనివారం శానిటేషన్ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీవో విష్ణు చిరంజీవి తెలిపారు. నది ఎగువ ప్రాంతాన రసాయన వ్యర్థాలు కలవడంతో నీరు కలుషితమై దుర్వాసన రావడం, నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా మండలంలోని రేగులగడ్డ , వెల్లంపల్లి, వేమవరం, గోవిందాపురం గ్రామ సమీప ప్రాంతాల్లో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దుర్వాసన రావడం, నదిలో నీటిని పశువులు తాగడంతో రోగాల బారిన పడటం ప్రజలు ఇబ్బందులకు గురి కావడంతో అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు నదిలో నీటిని వాడుకోవద్దని తెలియజేశారు. తాడికొండ/గుంటూరు మెడికల్: రాజధాని అమరావతిలోని ‘విట్’ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ విశ్వనాథన్ జన్మదినం సందర్భంగా శనివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. గుంటూరు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం శిబిరం ద్వారా విట్ విద్యార్థులు 449 యూనిట్ల రక్తాన్ని గుంటూరు జీజీహెచ్కు అందించినట్లు డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. -
ముస్లింల హృదయాల్లో నిలిచిన వైఎస్సార్
పట్నంబజారు: ముస్లింల హృదయాల్లో నిలిచిన నేత వైఎస్సార్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం నేతల సమావేశం జరిగింది. సమావేశానికి మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అధ్యక్షత వహించారు. ముందుగా మోజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ అబ్దుల్లా ఖాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మద్ పోర్టల్కు సంబంధించి కేంద్రం గడువు పొడిగించాలని, వక్ఫ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కేంద్రం అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అంటే మైనార్టీల పార్టీ అని నేరుగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారని స్పష్టం చేశారు. మోజన్, ఇమామ్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఆందోళన చేపడితేనే గౌరవ వేతనాలు జారీ చేసిన పరిస్థితి ఉందన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత వై.ఎస్.జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మైనార్టీలకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వై.ఎస్.జగన్కు దక్కుతుందన్నారు. ముస్లింలకు అండగా మహానేత చరిత్రలో ముస్లిం మైనార్టీల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నిలిచిపోయారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. ముస్లింలకు తొలి నుంచి వైఎస్సార్ కుటుంబం అన్ని విధాలా అండగా ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులు మైనార్టీల పేదరికాన్ని గుర్తించలేదని, వారి ఇబ్బందులు గుర్తించి సాయం చేసిన గొప్ప మనస్సు వైఎస్సార్దని కీర్తించారు. టీడీపీకి భయం పట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరన్నారు. విజయవాడ సమీపంలో ఏర్పాటు చేస్తానన్న హజ్ హౌస్ ఏర్పాటు చేశారా.. అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారని తెలిపారు. 2014 అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం మైనార్టీ మంత్రి కూడా లేని కేబినెట్ నిర్వహించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్థులను తన అనుచరులకు దోచి పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హఫీజ్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ తొలి నుంచి మైనార్టీల పక్షపాతి పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. జగనన్న మైనార్టీల అభివృద్ధి దిశగా రాష్ట్రంలో తొలిసారి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు గులాం రసూల్, హబీబుల్లా, పఠాన్ అబ్దుల్లా ఖాన్, పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్, ఉమ్మడి జిల్లా మైనార్టీ విభాగం నేతలు ఇమామ్ హుస్సేన్, ఖాశీంబేగ్, అప్సర్, జానీబాషా, ఫెరోజ్ఖాన్, దుబాయిబాబు, గోల్డ్బాబు, మస్తాన్వలి, షర్ఫుద్దీన్, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు వైద్య కళాశాలలో ఫార్మకాలజీ జాతీయ సదస్సు
పర్యావరణహితంగా పరిశోధనలు జరగాలి గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఫార్మాకాలజీ జాతీయ సదస్సు జరగనుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సంయుక్తంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫార్మకాలజీ సొసైటీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మీనా కుమారి పాల్గొన్నారు. నెక్ట్స్జెన్ ఫార్మా అనే థీమ్తో రెండు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్లో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ఫార్మకాలజీ ప్రొఫెసర్లు, అసోసియేట్ – అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కాలేజీ వేదికగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వక్తలు పర్యావరణానికి అనుకూలంగా జరిగే ఫార్మకాలజీ ట్రయల్స్ను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. దీర్ఘకాలిక రోగాలకై కొత్త ఔషధాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మరిన్ని పరిశోధనలు జరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమావేశానికి ఫార్మకాలజీ విభాగాధిపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాల్మాన్రాజు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో పాటు వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ (అకాడెమిక్) డాక్టర్ మాధవి పాల్గొని పరిశోధన ఉపన్యాసాలు అందించారు. -
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యు లు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించిన విషయం విదితమే. ఆ సమయంలో ఆసుపత్రికి తాళాలు వేసి ఉండటం గమనించి విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ కె పద్మావతి,డీఎంహెచ్వో రవికి సమాచారమిచ్చారు.గురువారం డాక్టర్లు కవితా అనసూయ, ప్రసాద్నాయక్, ఎంపీహెచ్ఈవో శ్రీనివాసరెడ్డి, హెచ్ఈ అంజమ్మ, ఎస్ఎ హనుమంత్నాయక్, స్టాఫ్నర్సులు అరుణ, విజయ, మస్తాన్బి, ఎల్టీ అరుణకుమారి, సూపర్ వైజర్లు రహిమాన్బాషా, జానకీదేవి, ఎఫ్ఎన్వో పుట్లమ్మలను సస్పెండ్ చేశారు. వీరి స్థానంలో చిలకలూరిపేట ఏరి యా ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న షేక్ సుమయా, హరిహరన్తోపాటూ ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం వీరు పీహెచ్సీలో వైద్య సేవలందించారు. ఎన్జీ రంగా వ ర్సిటీలో ప్రపంచ మృత్తికా దినోత్సవం గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో ప్రపంచ మృత్తికా ది నోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ 5న నేల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవటానికి ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మృత్తికా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మృత్తికాశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.శైలజ ఈ ఏడాది ఆరోగ్య పట్టణాల కోసం ఆరోగ్యమైన నేలలు అనే అంశంపై అవగాహన కల్పించారు. పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఏవీ రమణ మాట్లాడు తూ నేల లోపల కోటాను కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, డాక్టర్ డి.సంతప్కుమార్, డీన్ డాక్టర్ పి.సాంబశివరావు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్కు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈఓ శీనునాయక్ తెలిపారు. జనసేన కార్పొరేటర్కు పరాభవం పీటీఎం వేదికపైకి ఆహ్వానించకుండా సమావేశాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు గుంటూరు ఎడ్యుకేషన్: మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా జనసేన కార్పొరేటర్కు పరాభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 56వ డివిజన్లో నెహ్రూనగర్ 7వ లైనులో నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన పీటీఎంకు స్థానిక జనసేన కార్పొరేటర్ అయిశెట్టి కనకదుర్గను వేదికపైకి ఆహ్వానించలేదు. 55, 56 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు అతిధులుగా పాల్గొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కార్పొరేటర్ కనకదుర్గను పాఠశాల హెచ్ఎం తన వంతు బాధ్యతగా వేదికపైకి పిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ, టీడీపీ, జనసేన నాయకులు పట్టించుకోకుండా హేళనగా చూశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. సమావేశాన్ని టీడీపీ మహిళా నాయకురాలు గుడిపల్లి వాణీ నిర్వహించారు. ఈ సంఘటనతో టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు బయటపడ్డాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
తెనాలి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్స్కు, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం 20 బయో టాయిలెట్లను నిర్మించేందుకు నెస్లె కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు. తెనాలిలోని పారిశ్రమికవేత్తలు బడుల ప్రగతికి సహకరించాలని కోరారు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ బియ్యాన్ని సేకరించి మధ్యాహ్న భోజనానికి పాఠశాలలు, వసతి గృహాలకు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 1,049 పాఠశాలలు సహా జూనియర్ కళాశాలల్లో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల చదువుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఉపాధ్యాయులు విభిన్న బోధనా పద్ధతులు వినియోగించాలని సూచించారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం అవసరమన్నారు. డీఈవో సీవీ రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. అనూరాధ, పలువురు విద్యార్థులు, తలిదండ్రులు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, డీవైఈవో శాంతకుమారి, ఎంఈవోలు మేకల లక్ష్మీనారాయణ, వి.జయంతిబాబు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీవో ఎ.దీప్తి, ఇతర అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో రూ.38.68 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్, లైబ్రరీ నూతన భవనాన్ని మంత్రి, అధికారులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ -
గుంటూరు
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. ఆలయ అభివృద్ధికి విరాళం దుగ్గిరాల:కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్నకుమారి దంపతులు రూ.1,02,555 విరాళం అందించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 578.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,668 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా పని చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మమేకమై వారి బాగోగుల గురించి వాకబు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,049 పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో పీటీఎం 3.0 నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సంపూర్ణ ప్రగతి నివేదికలో విద్యార్థుల్లోని సమగ్ర నైపుణ్యాలు, భావోద్వేగాలు నమోదుతో పాటు పరీక్షల ద్వారా అభ్యాసన స్థితి అసెస్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన, ఎంఈవోలు ఎస్ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్, నాగేంద్రమ్మ, హెచ్ఎం ఆనంద కుమారి, తహసీల్దార్ మహబూబ్ సుభానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన ... సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 నిఘా, అమలు కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశమందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ.గాయత్రి దేవి, డీఈఓ సి.వి. రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, సభ్యులు గండి కోటేశ్వర రావు, ఈమని చంద్ర శేఖర్, బెల్లంకొండ శంకర రావు తదితరులు పాల్గొన్నారు. యూనిట్లు త్వరగా ప్రారంభించాలి.. వివిధ పథకాలు కింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక,ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశమందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ గత నెల రోజుల వ్యవదిలో 1047 దరఖాస్తులు అందగా 969 దరఖాస్తులకు మంజూరు చేసామన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, పర్యాటక శాఖ అధికారి రమ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురిని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాలు ఇవీ... వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన షేక్ పొన్నూరు కరీముల్లా, రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఉడారపు గోపీనాథ్, గ్రీవెన్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన పుట్టి సుబ్బారావు, ప్రచార విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యర్రం హనిమిరెడ్డి, వలంటీర్స్ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రాచకొండ ముత్యాలరాజు నియమితులయ్యారు. గుంటూరు జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షులుగా గుంటూరు నగరానికి చెందిన సిరిబోయిన అవినాష్, ఉప్పల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొండా రవి, వైఎస్సార్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గానికి చెందిన వేమూరి కిషోర్, వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చాగంటి విష్ణువర్ధన్రెడ్డి, మంగళగిరికి చెందిన కొప్పుల తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా తెనాలికి చెందిన అమర్తలూరి ఆనంద్, వలంటీర్స్ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన తోటకూర స్వర్ణలత, పబ్లిసిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన బొంతు నరేంద్రరెడ్డి, ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళగిరికి చెందిన డోకిపర్తి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా తెనాలికి చెందిన మాదినేని శ్రీనివాసరెడ్డి, షేక్ సలీం, పంచాయతీరాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన మండ్రు రాజు, కార్యదర్శులుగా తెనాలికి చెందిన కుక్కల ముక్తేశ్వరరావు, బచ్చు రాఘవరావు, యువజన విభాగం జిలాల ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన బడుగు కోటయ్య, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన షేక్ హిజార్ సుభాని, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన షేక్ షరీఫుద్దీన్, కార్యదర్శిగా షేక్ ఉమర్ వలి, ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన ఎన్.శామ్యూల్, ప్రత్తిపాడుకు చెందిన మన్నవ మహేంద్రబాబు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేలటూరి సుందరరావు, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన మెరిగల మోహన్రావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బక్కా మనోజ్కుమార్ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా... ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ప్రత్తిపాడుకు చెందిన దాసరి నాగరాజు, బొక్కా శివయ్య, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చెరుకూరి బాలస్వామి, జిల్లా దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన సయ్యద్ యూసఫ్, జిల్లా గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన కనపర్తి అనిల్, కార్యదర్శులుగా కాళిదాసు వెంకటేశ్వరరావు, షేక్ అజ్మల్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా రెడ్డి శ్రీనివాసరావు, జిల్లా బూత్ కమిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పరుసు రాజ్కుమార్, కార్యదర్శిగా మొవ్వా కాశిరెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా మాగులూరి పవన్దీప్రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా షేక్ జాకీర్ హుస్సేన్, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన షేక్ జకీర, కార్యదర్శిగా షేక్ నాగూర్బీ, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా ఎం.ఇందిరప్రియదర్శిని, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నలుకుర్తి ఉదయ్కాంత్, కార్యదర్శులుగా పాటిబండ్ల హోసన్న, మండిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా మంచాల సుకుమార్ నియమితులయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో.. అదేవిధంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగర ఎస్సీ విభాగం కార్యదర్శిగా రావెల విజయవర్ధన్, పశ్చిమ నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, 24వ డివిజన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ యూనస్ పాషా, 31వ డివిజన్ అధ్యక్షుడిగా తోటా వెంకటేష్ బాబు, 43వ డివిజన్ అధ్యక్షుడిగా మారంరెడ్డి భాస్కర్రెడ్డి, 35వ డివిజన్ అధ్యక్షుడిగా తాడికొండ లీలావెంకట వీరాంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఉత్తమ వైద్య సేవలతో ప్రజాభిమానాన్ని పొందాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించి అభిమానాన్ని పొందాలని గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట యడవల్లి వారి వీధిలో కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ను డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి.వెంకటరమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి వల్ల సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఆధునిక చికిత్సలతో వారి కలలు నెరవేర్చుకోవచ్చని తెలిపారు. చికిత్స కోసం వచ్చే ప్రతి జంటకు శాసీ్త్రయ పరిష్కారాలతో ఆధునిక చికిత్సలతో భరోసా కల్పించాలన్నారు. తల్లిదండ్రులు కావాలనుకునే ప్రతి జంటకు కిమ్స్ ఐవీఎఫ్ సెంటర్ భరోసా ఇచ్చేలా చికిత్సలు అందించాలని కోరారు. జిల్లాలో తొలి ఎంసీహెచ్ సూపర్ స్పెషలిస్టులతో తమ కేంద్రంలో సంతానం లేని వారికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కిమ్స్ యాజమాన్యం తెలిపింది. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారని, ప్రపంచ స్థాయి ఐవీఎఫ్ లేబరేటరీ, పరికరాలు ఉన్నాయన్నారు. ఐవీఎఫ్, ఇక్సి, ఐయూఐ, డోనర్, ప్రొగ్రామ్స్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, యండ్రాలజీ సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. హైరిస్క్ ఇన్ఫిర్టిలిటీ కేసులకు ఆధునిక పరిష్కార మార్గాలు జన్యు విశ్లేషణ, జనటిక్ ఎవల్యూషన్ సౌకర్యం ఉందన్నారు. కిమ్స్ శిఖర హాస్పటల్, కిమ్స్ సన్షైన్ హాస్పటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్, కిమ్స్ శిఖర హాస్పటల్ యూనిట్ హెడ్ డాక్టర్ ఎన్.వి.హరికుమార్, సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, రీప్రొడెక్టీవ్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నాగప్రత్యూష, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష గురిజాల, ఎంబ్రియాలజిస్ట్ ఎల్.ఎం.ఉదయ్, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ నసీర్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 కార్యక్రమానికి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిలువనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు పేర్కొన్నారు. గుంటూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు నోడల్ సెంటర్లలో కిట్స్ కళాశాల ఒకటిగా ఉందని వివరించారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా కిట్స్ కళాశాలకు 21 రాష్ట్రాల నుంచి విద్యార్థి బృందాలు రానున్నాయని చెప్పారు. 8వ తేదీ ఉదయం 8 నుంచి 9వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామంగా హ్యాకథాన్ జరగనుందన్నారు. అత్యుత్తమమైన ఒక్కో గ్రూప్నకు రూ.1.50 లక్షల నగదు బహుమతిని కేంద్రం అందజేస్తుందని చెప్పారు. సమావేశంలో కిట్స్ కళాశాల కార్యదర్శి కోయి శేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాబు, హ్యాకథాన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ అరుణ పాల్గొన్నారు. -
రాజకీయ సభల్లా పేరెంట్, టీచర్స్ మీటింగ్స్
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(పీటీఎం)లు రాజకీయ సభలుగా మారాయి. ప్రజాప్రతినిధులతోపాటు టీడీపీ నాయకులు వేదికలు ఎక్కి హల్చల్ చేశారు. విద్యారంగం, విద్యార్థుల ప్రగతి గురించి చర్చించకుండా చంద్రబాబు, లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో తమను ఎందుకు ఆహ్వానించారో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. చివరకు రాజకీయ ఉపన్యాసాలు చెప్పి మమ అనిపించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని ఎస్కేబీఎం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పీటీఎం 3.0 మధ్యాహ్నం 11.30 గంటల వరకు ప్రారంభం కాలేదు. గుంటూరు నగరంలోనే అత్యధిక సంఖ్యలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో పీటీఎం పేరుతో తల్లిదండ్రులను ఆహ్వానించిన ఉపాధ్యాయులు, అధికారులు తరగతి గదుల్లో సమావేశాన్ని నిర్వహించడం బదులు పాఠశాల ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి బహిరంగ సభ లా నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించిన తల్లిదండ్రులు ఎమ్మెల్యే గళ్లా మాధవి వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు టీడీపీ నాయకులతో నిండిపోయిన సభావేదికపై విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో మౌలిక వసతులు, తల్లిదండ్రులతో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ ప్రగతిపై చర్చించడం బదులు సీఎం చంద్రబాబు, విద్యా శా ఖ మంత్రి లోకేష్పై పొగడ్తలు, ప్రశంసలతో సమావేశం ఆద్యంతం కొనసాగింది. దీంతో పీటీఎంకు హాజరైన తల్లిదండ్రులు తెల్లమొఖాలు వేశారు. అసలు తమను ఆహ్వానించిన ఉద్దేశమేమిటో, అక్కడ జరుగుతున్నదేమిటో అర్థంకాక అయోమ యానికి గురయ్యారు. పీటీఎంలో తరగతుల వా రీ గా పరస్పరం సమావేశమై చర్చించాల్సిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బహిరంగ సభలా నిర్వహించిన పీటీఎంలో ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. చంద్రబాబు సర్కార్ భజన చంద్రబాబు సర్కారు భజన మినహా సమావేశాల్లో మరో విషయం ప్రస్తావనకు రాలేదు. చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాతే ప్రభుత్వ పాఠశాలలు ఆధునికీకరణకు నోచుకున్నాయని, తల్లికి వందనం రాకముందు తాము గతంలో ఎన్నడూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకోలేదన్నట్లుగా విద్యార్థులతో వేదికపై అబద్ధాలు పలికించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు ప్రతి విద్యార్థి తల్లికి జగనన్న అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా అధికారులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా పాఠశాలల ఆధునికీకరణ, వసతులు కల్పించిన విషయమై ఎక్కడా ప్రస్తావన లేకుండా చేశారు. బహిరంగ సభలా పీటీఎం జ రుగుతుండగా, విద్యార్థులు పాఠశాల మైదానంలో ఆటల్లో మునిగితేలారు. పీటీఎంకు హాజరైన తల్లిదండ్రులు చెట్ల కింద కూర్చుని ప్రసంగాలు వినేందుకు పరిమితమయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పీటీఎంలో ఎమ్మెల్యే గళ్లా మాధవితోపాటు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు వేదికపై పాల్గొని, మాట్లాడారు. వైసీపీకి చెందిన స్థానిక కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్, తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ విధంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ నాయకులు వేదికలు ఎక్కారు. మెగా పీటీఎం 3.0 పేరుతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఈ విధంగా రాజకీ సభలుగా మారిపోమి, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయాయి. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఎస్కే సమియా (18) ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉదయం బస్సులో వర్సిటీకి వచ్చింది. పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కకుండా తన స్నేహితుడైన లయోలా కాలేజీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మచిలీపట్నానికి చెందిన విన్సెంట్ ద్విచక్ర వాహనంపై విజయవాడకు బయలుదేరింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు దారితప్పి వచ్చిన హార్వెస్టర్ లారీ టోల్గేటు నుంచి వెనక్కి వస్తోంది. దీని పక్క నుంచి ద్విచక్రవాహనం వెళుతుండగా లారీ తగిలింది. విన్సెంట్ ఎడమవైపు, సమియా కుడివైపు పడిపోయారు. సమియాపై లారీ వెనుక టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమియా మృతదేహం వద్ద విన్సెంట్ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల ప్రాణాలు తీస్తున్న పెద్దాసుపత్రి
రాత్రి వేళ వైద్యం .. దైవాధీనం గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సైతం ఆసుపత్రిలో తనిఖీలు చేసినా వైద్యులు, వైద్య సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఎమర్జెన్సీ మెడిసిన్లో.. అత్యవసర చికిత్స కోసం వచ్చేవారంతా ఎమర్జెన్సి మెడిసిన్ డిపార్టుమెంట్లోనే చేరుతున్నారు. ఇక్కడ వైద్యులు ఎవరూ రాత్రి వేళ అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నియమించిన ఆర్ఎంఓలు తమకు రాత్రి వేళ డ్యూటీలు పట్టవంటూ క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్లుగా ఉద్యోగాల్లో చేరిన వారిని తమ విధులు చేయాలని ఆదేశిస్తున్నారు. ముఖ్య కార్యదర్శి తనిఖీలు చేసినా ... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్గౌర్ నవంబరు 29న జీజీహెచ్లో మూడు గంటలకు పైగా ఆకస్మిక తనిఖీలు చేశారు. సీనియర్ వైద్యులు విధుల్లో ఉండకుండా వైద్య విద్యార్థులు, జూనియర్ విద్యార్థుల ద్వారానే ఎక్కువ శాతం ఓపీ సేవలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా ప్రతి వైద్యుడి డేటా తనకు అందించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు ఓపీ వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా వైద్య విభాగాధిపతులు కొంత మంది ఓపీ విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు. మారు వేషం తప్ప చర్యలు ఏవి? ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ రెండు పర్యాయాలు మారు వేషాలలో ఆసుపత్రిలో తనిఖీలు చేసినా వైద్యులు, వైద్య సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తనిఖీల్లో ఆసుపత్రిలో అంతా బాగుందని సూపరింటెండెంట్ మీడియాకు వెల్లడించడంతో వైద్యులు, వైద్య సిబ్బందిలో ఏమాత్రం భయం లేకుండాపోయింది. -
ఎప్పుడూ హడావుడే..
2014–19 మధ్య కాలంలో పాఠశాలల భవనాలకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం, నామమాత్రపు మెరుగులు దిద్దడమొక్కటే టీడీపీ పాలనలో అభివృద్ధిగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే తంతు నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు, సిస్టమ్స్ ఇప్పుడు మూలనపడ్డాయి. విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందడం లేదు. మెయింట్నెన్స్ లేకపోవడంతో విలువైన బ్యారీలు, మోటార్లు, ఫిల్టరేషన్ సామగ్రి పాడైపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదటి దశలో 994 ఆర్వో వాటర్ సిస్టమ్స్, 155 మినరల్ వాటర్ ఫ్రిజ్లు ఏర్పాటు చేశారు. అంతటా నిర్లక్ష్యమే గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో 771 మంది, ప్రాథమిక పాఠశాలలో మరో 250 మంది చదువుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లు నేడు మూలనపడ్డాయి. విద్యార్థులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. బాలబాలికలకు రెండే టాయిలెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిర్మించిన టాయిలెట్ సముదాయాన్ని పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. బడుల పరిసరాల్లో పిచ్చి చెట్లు పెరిగినా పట్టించుకోవడం లేదు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు గతంలో దాదాపు పూర్తయ్యాయి. చివరి దశలో చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో అలాగే ఆగిపోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. మరుగుదొడ్లు అద్వానంగా మారాయి. ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదు. -
సమస్యలు గాలికి.. వేడుకలు దేనికి?
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలకు సకల వసతులు ● ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడిన ఆర్వో ప్లాంట్లు ● బాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేక అవస్థలు ● మెగా పీటీఎం పేరిట చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చదువుల పండుగ నేడు కళ తప్పింది. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఆర్భాటం తప్ప.. చిన్నారులకు కనీసం గుక్కెడు నీరు కూడా ఇవ్వడం లేదు. బాలికలకు మరుగుదొడ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని పక్కనపెట్టి నేడు మెగా పీటీఎం పేరుతో సర్కారు హడావుడి చేస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను దగా చేసేందుకు సిద్ధమైంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: చదువుల విప్లవాన్ని తెచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త హంగులు సమకూరాయి. నాడు–నేడు మొదటి విడతలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,183 పాఠశాలలను రూ.283 కోట్ల వ్యయంతో ఆధునికీకరించారు. రెండో విడతలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 562 స్కూళ్లలో రూ.204 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు పనులు కుంటుపడ్డాయి. వైఎస్ జగన్ హయాంలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలోని 165 పాఠశాలల్లో కొత్తగా 584 తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. నేడు ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మధ్యాహ్న భోజనంలోనూ.. పాఠశాలల్లో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు అమలు చేసిన జగనన్న గోరుముద్ద కార్యక్రమం విద్యార్థుల సంతృప్తే లక్ష్యంగా విజయవంతంగా కొనసాగింది. గత ప్రభుత్వంలో రోజూ పాఠశాలల్లో 90 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ప్రస్తుతం అది 65 శాతంగా ఉంది. జిల్లాలోని 1,074 పాఠశాలల్లో చదువుతున్న 96,576 మంది విద్యార్థుల్లో సగటున 62 వేల మంది మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ల దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులపై ఖర్చుల భారం గుంటూరు జిల్లాలోని 1,074 పాఠశాలలకు రూ.22.20 లక్షలను మాత్రమే ఈ కార్యక్రమం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతం అవుతున్న ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం నిర్వహణ మరో భారంగా మారింది. -
శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు
తెనాలి అర్బన్: తెనాలి నాజర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబస్, ఎంపీడీవో అత్తోట దీప్తి, తహసీల్దార్ గోపాలకృష్ణ, తెనాలి డీడీవో కుసుమ శ్రీదేవి మాట్లాడారు. తెనాలి డీడీవో పరిధిలో తెనాలి, పొన్నూరు, చేబ్రోలు, కాకుమాను, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలతో పాటు గ్రామ సచివాలయాలు ఉంటాయన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీడీవో కార్యాలయాల ఏర్పాటు ద్వారా పరిపాలన సౌలభ్యం లభిస్తుంందని, పరిపాలన వికేంద్రీరణతో ఫైళ్లు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ నాగార్జున, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, డీపీవో బీవీ నాగసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీ కోసం.. మోసమే రైతన్నా!
చంద్రబాబు సర్కారు దగాపై అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకతఅసలు విషయం పక్కన పెట్టి ఆర్భాటాలు చేయడం చంద్రబాబు సర్కారుకు వెన్నతో పెట్టిన విద్యే. ఇదే అంశం మరోమారు రైతుల విషయంలో రుజువైంది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా.. ఆర్భాటంగా కార్యక్రమం అంటూ ఊదరగొట్టింది. రైతన్నా.. మీ కోసం అటూ మోసం చేసింది. చంద్రబాబు సర్కారుపై అన్నదాతల్లో ఉన్న వ్యతిరేకతకు భయపడి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం గుంటూరు జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జిల్లాలో అక్కడక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కుబడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎవరి కోసం, ఎందుకు నిర్వహించారో, దాని వల్ల ప్రయోజనం ఏంటో తెలియకుండానే అయిపోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి రైతును కలవడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు చేతిలో పట్టుకుని హడావుడి చేసి గ్రూపు ఫొటోలు దిగి మీడియాకు పంపడానికి పరిమితం అయ్యింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొన్నప్పటికీ వారు కూడా ఉపన్యాసాలకే పరిమితం అయ్యారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పాల్గొనలేదు. జిల్లాలోని తాడికొండ,తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఒకే ఒక్కసారి పాల్గొన్నారు. రైతులతో ప్రత్యేక యాప్ కూడా అక్కడక్కడ ఇన్స్టాల్ చేయించారు. అధికారులు, రైతులు నామమాత్రంగా పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో రైతులు నిలదీస్తారనే భయంతో పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలకే ఈ కార్యక్రమం పరిమితం అయ్యింది. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాకు ఎసరు, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కనీస పరిహారం అందకపోవడంపై రైతులను మాట్లాడనీయకుండా జాగ్రత్త పడ్డారు. వ్యవసాయం దండగ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మరో మారు రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద సాయం అందని దాదాపు 20 వేల మంది రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు. రానున్న ఐదేళ్లలో రైతును రాజును చేసేందుకంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి జిల్లాలో రైతుల నుంచి స్పందన కరువైంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు ధర అంశాల గురించి ప్రతి రైతు ఇంటికి వెళ్లి తెలియజేయాలన్నది కార్యక్రమం లక్ష్యం. సాగులో యాంత్రీకరణ లాభం, పంట మార్పిడి, ఎరువులు అధిక వినియోగంతో అనర్థాలు, సూచనలు, సలహాలను అందజేయాల్సి ఉంది. రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నది కార్యక్రమ ఉద్దేశం. అయినప్పటికీ ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నిరసనల భయంతో ప్రజాప్రతినిధులు ఒక్క కార్యక్రమంలో పాల్గొని మమ అనిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవలను నిర్వీర్యం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలకు కోతలు పెడుతూ వస్తోంది. రైతు భరోసా కేంద్రాలను అలంకారప్రాయం చేసింది. కియోస్క్ మిషన్లను మూలన పడేసింది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేయడంలో ముఖం చాటేసింది. పంటల బీమాకు ఎసరు పెట్టింది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పరిహాసం చేసింది. మళ్లీ పంటలు వేయాలంటే భయపడేలా చేసింది. ఇలా కూటమి ప్రభుత్వంలో రైతన్నకు చేసిన దగా చెప్పుకుంటూ పోతే చాంతాడులా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ఇంటి ముంగిటకే అన్ని సేవలు అందాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఐదు సంవత్సరాలు వెన్నుదన్నుగా నిలిచారు. ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా అండగా నిలిచారు. ప్రకృతి వైపరీత్యాల వేళ తగినంత సాయం అందించారు. రైతు సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి అన్నదాతకు ఆర్థిక భరోసా ఇచ్చారు. నాడు వ్యవసాయం రైతుకు పండుగలా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమ్మో.. వ్యవసాయమా అనేలా చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముంగిటకే సేవలను తీసుకొచ్చింది. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అన్నదాతల ఖాతాల్లో నేరుగా సీజన్కు ఉపయోగపడేలా జమ చేశారు. ఎరువులు, విత్తనాలు తగినన్ని నిత్యం అందుబాటులో ఉండేవి. పంట దిగుబడి వచ్చాక ఏ మాత్రం కష్టపడకుండా రైతులు మద్దతు ధరకే విక్రయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దళారులు, వ్యాపారులు కూడా మోసం చేయకుండా చూశారు. ఆర్భాటాలకే పరిమితమైన ‘రైతన్నా.. మీ కోసం’ మొక్కుబడి కార్యక్రమంతో భజనకే పరిమితం తమను ఆదుకునేందుకు ఏం చేశారని రైతుల ఆగ్రహం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిన చంద్రబాబు పాలన -
గుంటూరు
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పొన్నూరు: పట్టణంలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి వార్లను గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, సతీసమేతంగా సందర్శించారు. 9గుంటూరు ఎడ్యుకేషన్: జనవరిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను డాక్టర్ గజల్ శ్రీనివాస్ కోరారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. -
ఎమ్మెల్సీ పేరుతో ‘మట్టి’ దందా
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొంతమంది టీడీపీ నాయకుల పేరు చెబుతూ అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ జేబులు నింపుకొంటున్నారు. మట్టి మాఫియాపై సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడల్లా సీఆర్డీఏ అధికారులు, పోలీసులు నామమాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. అక్రమ రవాణా చేస్తున్న 8 మట్టి లారీలను తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఆ వెంటనే ఓ వైట్ కాలర్ మట్టి మాఫియా వ్యక్తి పోలీస్స్టేషన్కు కారులో వచ్చాడు. ఆ కారును పోలీస్స్టేషన్కు అడ్డంగా పెట్టి ‘నేను ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తాలూకా, మా బళ్లు ఎందుకు సీజ్ చేశారంటూ’ హడావుడి చేశాడు. పోలీసులు మాత్రం సీజ్ చేసిన ఆ బళ్లు వదిలేది లేదని తేల్చి చెప్పారు. సదరు వ్యక్తి రాజధాని గ్రామాల్లో దౌర్జన్యం చేసే కొంతమందిని తన పక్కన పెట్టుకుని కారులోనే కూర్చుని ఒక్కో లారీ నుంచి రూ.వెయ్యి, రూ.2 వేల వరకు సీనరేజ్ కింద వసూలు చేస్తున్నాడు. ఎక్కడ మట్టి కావాలో లారీ యజమానులకు చెప్పి వారి నుంచి డబ్బులతోపాటు మట్టి తోలకాలు ఇచ్చినందుకు డబ్బులు తీసుకోవడం విశేషం. నాడు అనుమతులు ఉన్నా... గతంలో ప్రభుత్వ హయాంలో అనుమతులతో మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నపుడు అప్పటి ఎమ్మెల్యే ఆర్కేకి అనుమతులు లేవంటూ నిలదీసిన వ్యక్తే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో సదరు వ్యక్తితో కలిసి దందాలు చేస్తున్నట్లు సమాచారం. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వెనుక మహానాడు కట్టపై నివాసం ఉంటూ మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో రాజధాని పరిధిలో పలు దొంగతనాల్లో ప్రధాన ముద్దాయి అయిన రౌడీషీటర్ కూడా లారీలను లీజ్కు తీసుకుని మట్టి దందా చేస్తున్నాడు. రాజధానికి పంట పొలాలు ఇచ్చిన రైతులు జరిగిన ఈ సంఘటనపై, జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తుంటే దౌర్జన్యం చేస్తున్నారు. వారిని కొంతమంది గ్రామస్తులతో బెదిరించి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. -
ప్రజల ఇబ్బందులు గుర్తించాలి
స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ఆదాయంపై పెట్టిన శ్రద్ధ ప్రజలకు వసతులు కల్పించడంపై పెట్టడం లేదు. ఆదాయంలో ఏడాదికి కేవలం 10 శాతం వెచ్చించినా ఎంతో మెరుగయ్యేది. 150 ఏళ్లుగా ఇక్కడ ఉండటం అంటే ఎంత వెనుబడి ఉన్నామో అర్థమవుతోంది. జిల్లాల పునర్ విభజన తర్వాత చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికై నా స్పదించాలి. – చిరతన గండ్ల వాసు, బీఎస్పీ నాయకుడు, గుంటూరు ● -
గుంటూరు
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చైర్పర్సన్ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 579.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,445 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి సీతానగరానికి సంబంధించిన 14వ నెంబర్ సచివాలయంలో పింఛను పంపిణీ చేసేందుకు తీసుకువచ్చిన నగదులో కొంత మాయమైన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఆదివారం సెలవు కావడంతో శనివారం బ్యాంకు నుంచి సీతానగరంలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంచేందుకు రూ.20 లక్షలు విత్డ్రా చేసి తీసుకువచ్చారు. అదేరోజు నగదును టేబుల్పై పేర్చి అక్కడ సిబ్బందికి ప్రాంతాలవారీగా నగదు పంచుతున్న సమయంలో రూ.40 వేలు మాయమైంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పింఛను ఆపకుండా వెల్ఫేర్ అసిస్టెంట్ నగదు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంటీఎంసీ అధికారులు మాత్రం నగదు ఎవరి దగ్గర పోయాయో వారే చెల్లించాలని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు మెడికల్: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. శరీరంపై నల్ల మచ్చలతో కూడిన దద్దు, జ్వరం, తలనొప్పి, వణుకు, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయన్నారు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోతే శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని వెల్లడించారు. పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే, దగ్గరలోని ఆరోగ్య సిబ్బందిని గాని , ఆరోగ్య కేంద్రాన్ని గాని సందర్శించి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలలో వ్యాధికి సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు. వ్యాధి నిర్ధారణ రక్త పరీక్ష గుంటూరు జీజీహెచ్లో మాత్రమే అందుబాటులో ఉందని( ఐజీఎమ్ ఎలీసా), ఆందోళన అవసరం లేదన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్, టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుతో జెడ్పీటీసీలు ఏళ్ల తరబడి పనులు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి జెడ్పీతోపాటు కేంద్ర నిధుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండాల ఆమోదానికి పరిమితమవుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధ్యాన్యత ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. గతంలో సర్వసభ్య సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన జెడ్పీటీసీలు గత నెల 26న ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. కీలకమైన ప్రణాళిక, ఆర్థిక అంశాలతో కూడిన సమావేశాల అజెండాలను తిరస్కరించడం ద్వారా జెడ్పీలో ఏకపక్ష వైఖరిపై యుద్ధం ప్రకటించారు. ప్రచ్ఛన్న యుద్ధం జెడ్పీలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాకు, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీగా గెలిచాక చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించి, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన హెనీ క్రిస్టినా వైఖరితో జెడ్పీటీసీలు తీవ్రంగా విభేదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ మండలాల్లో పనులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును సహించలేక పోరుకు సిద్ధమయ్యారు. ఎవరితోనూ పనిలేకుండానే... జెడ్పీ వార్షిక బడ్జెట్లో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు 2025–26 బడ్జెట్లోనే కేటాయింపులు పూర్తయ్యాయి. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సైతం పనులు కేటాయించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్పర్సన్కు సిఫార్సులు పంపడం, వాటిని చైర్పర్సన్ వెంటనే ఆమోదించేయడం పరిపాటిగా మారింది. జెడ్పీటీసీలతో చర్చించకుండా నేరుగా స్టాండింగ్ కమిటీ, అక్కడి నుంచి జనరల్ బాడీ సమావేశాల అజెండాల్లో పొందుపర్చి ఆమోదింపచేసుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై సభ్యులతో చర్చించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి భిన్నంగా కోరం అయిందా, లేదా అని చూసి ఆమోదించేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో.. జెడ్పీటీసీలకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో చైర్పర్సన్ పెద్ద సంఖ్యలో కేటాయింపులు జరిపేశారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... వేమూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో రూ.29.30 లక్షలు, నరసరావుపేట ఎమ్మెల్యే సిఫార్సులతో రూ.20 లక్షలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలతో రూ.30 లక్షలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాదనలతో అత్యధికంగా రూ.కోటి పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల మేరకు ముందస్తు అనుమతులతో పనులు కేటాయించడంతో భగ్గుమన్న జెడ్పీటీసీలు వాటిని అడ్డుకున్నారు. 7ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం కావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జెడ్పీని వాడుకుంటున్న పాలకుల తీరుతో జిల్లా ప్రజా పరిషత్ పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి. -
తగ్గిన ఏసీబీ దూకుడు
నగరపాలెం (గుంటూరు వెస్ట్): ఉమ్మడి గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు తగ్గింది. అవినీతి అధికారులకు ముచ్చెమటలు పట్టించాల్సిన విభాగం ఇప్పుడు మౌనంగా వ్యవహరిస్తోంది. డీఎస్పీలను నియమించకపోవడం, ఐదేళ్లు, రెండేళ్లకుపైగా కొందరు సీఐలు తిష్టవేసి ఉండటం.. కిందిస్థాయి సిబ్బంది ఎనిమిదేళ్లుగా పాతుకుపోవడంతో నిస్తేజంగా మారింది. ఈ రెండేళ్లల్లో ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి అధికారులు తక్కువే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖకు అనుబంధమైన విభాగాల్లో సమూల మార్పులు చేపట్టారు. గుంటూరు ఏసీబీలో మాత్రం ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అన్నట్టుగా వ్యవహారం ఉంది. జూలైలోనే ముగ్గురు.. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగాక ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరించింది. ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శక వ్యవస్థ రూపొందించాలనే ఏకై క లక్ష్యంతో అడుగులేసింది. ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ 14400 అందుబాటులోకి తీసుకొచ్చారు. 2023 జూలైలో ఇరవై రోజుల్లో ముగ్గురు అధికారులపై ఏసీబీ దాడులు చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రూ.60 వేలు, రూ.40 వేలు లంచాలు తీసుకుంటూ దొరికిన అధికారులు ఉన్నారు. అధికారులు ఎక్కడ? ఇక ఏసీబీని అధికారులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. 2024 ఎన్నికలకు రెండు నెలలు ముందు డీఎస్పీని బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆయన స్థానంలో వేరే వారిని నియమించలేదు. ఇక్కడ ఇద్దరు డీఎస్పీలు ఉండాల్సినా ప్రస్తుతం ఒక్కరినీ నియమించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ సీఐని బదిలీ చేశారు. దీంతో వారి మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారు. తర్వాత మరో సీఐపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం నలుగురు సీఐలు ఉన్నారు. వారిలో నాలుగేళ్లుగా కొనసాగే వారు లేకపోలేదు. ఏఎస్ఐలు మొదలు కానిస్టేబుళ్ల వరకు ఏళ్ల తరబడిగా తిష్ట వేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికార/ సిబ్బంది సరిపోతారని, అదనపు నియమకాలు అవసరంలేదని కార్యాలయపు వర్గాలు పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. నియమాకాలపై ఉన్నత స్థాయిలో ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు. పెరిగిన పని భారం ఏసీబీలో పనుల భారం ఎక్కువైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి కార్యాలయపు ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయం (హెడ్ ఆఫీస్) వైపు చక్కర్లు కొడుతున్నారు. ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే హెడ్ ఆఫీస్లో ఉన్నామని చెబుతున్నారు. సిట్, ఇతరత్రా వాటిల్లో విచారణకు సంబంధించి క్షణం తీరికలేకుండా ఉంటున్నామని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ చతికిల పడింది. గత ప్రభుత్వంలో ఉన్న దూకుడుతనం ప్రస్తుతం కానరావడం లేదు. పెద్ద మొత్తంలో లంచాలు అడిగారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలనే నిబంధన అమల్లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో రేపల్లె డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటరమణ రూ.1.25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే లంచాల్లోనూ చిన్న, పెద్ద తేడాలు స్పష్టిస్తే కింది స్థాయిలో న్యాయం జరుగుతుందా అనే అనుమానం బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. గతంలో ఉన్న టోల్ఫ్రీ నంబర్ 14400ను తొలగించారు. అవినీతిని నిర్మూలిద్దాం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామంటూ 1064 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్పై ఉమ్మడి జిల్లాలోని ప్రజల్లో అవగాహన కొరవడింది. బాధితులు సైతం ఏ నంబర్కు ఫోన్ చేయాలనేది అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఏసీబీ సైతం లంచంపై పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. -
గణపవరం పీహెచ్సీలో ఆరోగ్యశాఖ కమిషనర్
నాదెండ్ల: గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన రాగా, అప్పటికే సిబ్బంది వెళ్లిపోయి పీహెచ్సీకి తాళాలు వేసి ఉన్నాయి. పరిసరాలు పరిశీలించి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ కమిషనర్తో మాట్లాడగా, సాధారణ పర్యటనలో భాగంగా గణపవరం పీహెచ్సీకి వచ్చినట్లు తెలిపారు. అమరావతి: శ్రీమత్ హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, తమలపాకులతో పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం చేసి వడ మాలలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకుడు పరుచూరి కేశవా చార్యులు స్వామి వారికి పంచామృత స్నపన, సహస్ర నామాలతో తమలపాకుల పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తాడికొండ: సీఆర్డీఏ అధికారులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని అక్రమ లే అవుట్లను ధ్వంసం చేశారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని సర్వే నెంబర్ 114లో 5.50 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్, సర్వే నెంబర్ 145లోని 1.20 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్లను ధ్వంసం చేశారు. సీఆర్డీఏ పరిధిలో అనధికారిక లే అవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. మంగళగిరి టౌన్ : బెటాలియన్ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర ప్రధానంగా ఉందని, గతంలో కంటే బెటాలియన్ అభివృద్ధి చెందిందని 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ కె.నగేష్బాబు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీలోని ఆధునికీకరించి ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ నాయకులు కమాండెంట్ నగేష్బాబు, అసిస్టెంట్ కమాండెంట్ ఆశీర్వాదంలను శాలువ, పూలమాలలతో సత్కరించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఆంధ్రప్రదేశ్ వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు వారి లైన్ డిపార్ట్మెంట్లలో, విద్య అర్హతల ఆధారంగా ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ కల్పించాలని కోరుతూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజ్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు అందరికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. -
ఆదాయం తప్ప వసతులు పట్టవా?
నిత్యం అరచేతిలో వైకుంఠం చూపించే పాలకులు ప్రజాసమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు జిల్లాలో మరికొన్నింటిలో సమస్యలు. రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించే కార్యాలయం ఇది. సుదీర్ఘ చరిత్ర దీని సొంతం. కనీసం పట్టించుకునే వారు లేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. గుంటూరు వెస్ట్ : నగరం నడిబొడ్డున, కలెక్టరేట్ ఆవరణలోని గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిస్థితి ప్రజలను అసహనానికి గురిచేస్తోంది. దీనిని అప్పటి బ్రిటీషు ప్రభుత్వ హయాంలో జూలై 1, 1872లో ప్రారంభించారు. ఇప్పటికే 153 సంవత్సరాలు గడిచింది. ఏటా సుమారు 50 వేల వరకు దస్తావేజులు ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. రూ.100 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. కానీ మరమ్మతులకు కూడా దిక్కులేక శిథిలావస్థకు చేరుకుంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూతన భవన నిర్మాణానికి రూ.60 లక్షలు కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిధులను విడుదల చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా క్రమం తప్పకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. మౌలిక సదుపాయాల సంగతి మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు కరవు పురాతన భవనం కావడంతో పైకప్పు గత 20 ఏళ్ల నుంచి లీక్ అవుతోంది. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బందితోపాటు దాతల సహకారంతో పైన పట్టలు కప్పించారు. విద్యుత్ తీగలు కూడా బ్రిటీషు కాలం నాటివే. ఇక రికార్డులు భద్రపరిచే ఇనుప రాక్స్ కూడా తుప్పుపడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మళ్లీ లీకులు ఏర్పడ్డాయి. దీనిని ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచారు. పైకప్పు రాళ్ళకు చెమ్మ పడుతోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలీక ప్రజలతోపాటు సిబ్బంది కూడా బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా పెచ్చులు కూడా ఊడిపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా 2012లో రెవెన్యూ భవన్ నిర్మించారు. వాస్తవానికి ఇది రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి పార్కింగ్కు ఉపయోగించేవారు. రెవెన్యూ భవన్ నిర్మాణంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయం చూపలేదు. ఇటీవల రిజిస్ట్రేషన్ కాంపౌండ్ ఆవరణలో కొత్త షెడ్డును సిబ్బంది సొంత ఖర్చుతో నిర్మించారు. అంతే కాకుండా మరుగుదొడ్లు కూడా దాతల సహకారంతోనే ఏర్పాటు చేశారు. -
వైభవంగా ప్రసన్నాంజనేయ వ్రత మహోత్సవం
బెల్లంకొండ: బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద గల కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా ప్రతి ఏటా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్రత మహోత్సవాల సందర్భంగా దేవదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. కార్తిక మాసంలో స్వామివారి దీక్షలను చేపట్టిన మాలధారులు మండల కాలం దీక్ష చేసి బుధవారం స్వామివారికి ఇరుముడులను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ చార్యులు, అనంతాచార్యులు వ్రత పూజల అనంతరం విశేష అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి సంకీర్తన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో సనిమెళ్ల కోటిరెడ్డి, ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆసుల జగన్, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన కళా ప్రదర్శనలు
సాక్షి, అమరావతి: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్) విద్యార్థుల కళా ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సీటీ ప్రాంగణంలో ఆరవ జాతీయ ఉధ్బవ్–2025లో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన ఏకలవ్య స్కూల్స్ విద్యార్థుల సంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవాలు కన్నుల విందుగా జరిగాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన వేదిక అయిన కృష్ణ జింక అడిటోరియలో దాదాపు 22 రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ విభాగంలో విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు వివిధ గిరిజనుల సంస్కృతులను, వారి వ్యవహార శైలితో పాటు ఆచార వ్యవహారాలను చాటి చెప్పడమే కాకూండా వారి నృత్యాలతో హావభావాలతో వీక్షకులను అలరింపజేశారు. నృత్య ప్రదర్శనతోపాటు కథల పోటీలు, ఉపన్యాస పోటీలు, పలు భాషలలో సృజనాత్మక రచన వంటి దాదాపు 18 రకాల పోటీలను వివిధ వేదికలపై నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా జీఎల్ పురం నుంచి సీనియర్ విభాగంలో ఈఎమ్ఆర్ఎస్ విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ వీర నృత్యం వారి వేడుకల అంశంతో కోలాటం, నృత్యం అద్భుతంగా సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ జాతీయ కళా ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
దివ్యాంగ బాలల ఉన్నతికి వెన్నుదన్ను
నరసరావుపేట రూరల్: దివ్యాంగ బాలబాలికల ఉన్నతికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచేందుకు పథకాలు అమలు చేస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని నరసరావుపేటలోని భవిత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, సమీకృత విద్య కో– ఆర్టినేటర్ ఆర్.సెల్వరాజ్, నవభారత దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భవిత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్, ఆయాల సేవలు మరువలేనివని తెలిపారు. దివ్యాంగుల ఉన్నతకి భవిత కేంద్రాలు మూల స్తంభాలని కొనియాడారు. అనంతరం దివ్యాంగుల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఓసీటీబీ పాఠశాల సెక్రటరీ నాయక్, ఫిజియోథెరపిస్ట్ పెదన్నారావు నాయక్, ఉపాధ్యాయులు కె.పద్మజ, జి.మేరీ కుమారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలి ః సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు దాచేపల్లి : మానసిక దివ్యాంగులు శక్తివంతులుగా ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు తెలిపారు. నారాయణపురంలోని ఫాతిమా మాత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరిపి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులను అంతా గౌరవించాలని, సమాజంలో వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు షేక్ జానీ బాషా, మందపాటి శ్రీనివాసరెడ్డి, గురుప్రసాద్, వలంటీర్ అహ్మద్ పాల్గొన్నారు. పల్నాడు డీఈఓ చంద్రకళ -
ఇద్దరి మృతికి కారకులైన నిందితులకు జైలు శిక్ష
గుంటూరు లీగల్: భూవివాదం నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా కారు నడిపి ఇద్ద రి మరణాలకు కారణమైన ఘటనలో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు. కోర్టు వర్గాలు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, నెక్కలు గ్రామం ప్రధాన రోడ్డుపై 2019 ఏప్రిల్ 5వ తేదీన భూ వివాదాల నేపథ్యంలో పసుపులేటి చిన్న బాపయ్య కుటుంబ సభ్యులపై కరల్రు, చేతులు, కాళ్లతో పలువురు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా నిందితులు బాధితులపై ఉద్దేశపూర్వకంగా కారు నడపడంతో పసుపులేటి మహాలక్ష్మి(74), పసుపులేటి వీరకుమారి (34) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు పసుపులేటి చిన బాపయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు విచారణ.. అనంతరం ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 అలూరి సుధాకర్కు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ. 11వేలు జరిమానా, ఏ2 అలూరి అజయ్కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3వేలు జరిమానా, ఏ4 యరమ్రాసు శ్రీనివాసరావుకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేలు జరిమానా విధించారు. ఈ క్రమంలో ఏ3, ఏ5, ఏ6 లపై నేరం రుజువు కానందున నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ కేసులో స్పెషల్ పీపీపీ టి.దుర్గాప్రసాద్ బాధితుల తరఫున వాదనలు వినిపించారు. నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. బాలికల హ్యాండ్ బాల్ విజేత పశ్చిమ గోదావరి పిడుగురాళ్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ అండర్ –15 బాలికల విబాగం విజేతగా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నిలిచింది. మండలంలోని జానపాడు శివారులోని తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో పోటీలు హోరోహోరిగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్లో పశ్చిమ గోదావరి, విజయనగర్ జట్లు పోటీ పడ్డాయి. పశ్చిమ గోదావరి విజయం సాధించి మొదటి స్థానంలోను, రెండవ స్థానంలో విజయనగరం, మూడవ స్థానంలో కడప, కర్నూలు జట్లు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బొల్లా గిరిబాబు షీల్డ్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు బొల్లాపల్లి: పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవాలను పురస్కరించుకుని బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 15 టీంలు పాల్గొన్నాయని, వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగవ స్థానాల్లో బాపట్ల, బేతపూడి, మాచవరం, యడ్లపాడు జట్లు గెలుపొందాయని నిర్వాహకులు కె. ప్రకాష్రావు, సీహెచ్ రాజేశ్వరరావులు తెలిపారు. ప్రథమ బహుమతి బాపట్ల జట్టుకు శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రూ 30,116, ద్వితీయ శివ శక్తి లీలా అంజన్ ఫాండేషన్ రూ. 25,116లు చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెవ ఫాదర్ వై. జాకోబ్ రెడ్డి, జాన్ శేఖర్, గ్రామ సర్పంచ్ కె. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా పునీత శౌరి తిరునాళ్ల
ప్రత్తిపాడు: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులోని పునీత శౌరి తిరునాళ్ల మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. నవంబరు 24వ తేదీన జెండా ప్రతిష్టతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి జరిగిన సమిష్టి దివ్య పూజాబలితో ముగిశాయి. ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజాబలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్యతో పాటు ఆయా చర్చిల ఫాదర్లు, గురువులు హాజరై సమిష్టి పూజాబలిని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన విశ్వాసులు పుణ్యక్షేత్రం ఆవరణలో ఒత్తుల ప్రదక్షిణను దేవుని స్తుతిస్తూ చేపట్టారు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లయబద్దంగా వాయిస్తున్న కళాకారుల విన్యాసాలు, కోలాట ప్రదర్శనలు, కర్ర సాములను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. తిరునాళ్లకు గ్రామానికి విచ్చేసిన బంధువులతో ఊరంతా సందడితో కళకళలాడింది. రాత్రి పది గంటల సమయంలో పునీతశౌరి వారిని స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు. గీతాలాపనలు చేశారు. తేరు ప్రదక్షిణలో వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు
గుంటూరు వెస్ట్ : మెగా డీఎస్సీ–2025లో ఉపాధ్యాయులుగా ఎంపికై న 21 మంది వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ను అక్టోబర్ 2లోపు రిలీవ్ చేయాల్సి ఉండగా సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్) చెన్నయ్య అదే నెల 13వ తేదీన రిలీవ్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్లు బుధవారం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారీయాకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిపై చెన్నయ్యకు వినతిపత్రం అందజేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎంపికై న 21 మందికి న్యాయం చేయకుండా అక్టోబర్ 13న సాయంత్రం రిలీవ్ చేయడంతో మొత్తం11రోజులు సర్వీస్ నష్టపోయి ప్రతి బదిలీలలో మిగిలిన డీఎస్సీ 25వారి కంటే వెనకబడతారని తెలిపారు. ఆ 21మందిపై కక్షసాధింపు చర్యగా అక్టోబర్ 13న రిలీవ్ చేసి అన్యాయం చేశారన్నారు. ఈ కారణంగా బదిలీలతో పాటు రేషనలైజేషన్లో కూడా నష్టపోతారన్నారు. ఇప్పటికై న ఆ 21మంది వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి న్యాయం జరగకపోతే సోషల్ వెల్ఫేర్ డీడీ కార్యాలయం ఎదుట బాధిత ఉపాధ్యాయులతో కలసి ఏపీటీఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని తెలిపారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ -
వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గుంటూరు బ్రాడీపేట 2వ లైన్లోని భవిత స్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వివరించారు. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదన్నారు. చిన్నారులు ఆత్మనూన్యతాభావానికి గురికాకుండా చదువుపై శ్రద్ధ వహించి, పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులతో స్నేహభావంగా మెలిగి, ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్థానిక చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ప్యానెల్ అడ్వకేట్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ ఎన్.శ్రీనివాసరావు, రిసోర్స్పర్సన్ సువర్ణ లత, హెచ్ఎం ఎండీ అస్సన్ బేగ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలతో భూముల విక్రయం
రౌడీషీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతుల డిమాండ్ మంగళగిరి టౌన్ : రైతుల భూములను చేజిక్కించుకునే లక్ష్యంతో సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ దస్తావేజులు సృష్టించి భూములు విక్రయించిన రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని చినకాకానిలో బుధవారం ఈ ఘటనపై రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నెం. 182/1లోని 10 ఎకరాల 25 సెంట్ల వ్యవసాయ భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి, రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన సహచరులతో కలసి భూమిలోకి చొరబడి రైతులను బెదిరించిన ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. రైతులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. రైతుల భూములపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి తప్పుడు నమూనా సర్వేలు చూపిస్తూ భూమిని వదిలివేయాలని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. పలువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయితీ, రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేయడం వంటి చర్యలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రౌడీషీటర్ జలీల్, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటేశ్వరరావు, నరసింహారావు, శివన్నారాయణ, కొండలరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
సంఘ విద్రోహశక్తులను ఎదుర్కొనేందుకు మాక్డ్రిల్
పెదకాకాని: సంఘ విద్రోహ శక్తులు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్డ్రిల్ నిర్వహించినట్లు ఆక్టోపస్ డీఎస్పీ కృష్ణ తెలిపారు. మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం రాష్ట్ర ఐజీ శ్రీకాంత్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో డీఎస్పీ కృష్ణ, ఎస్బీ సీఐ రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున మాక్డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోపస్ డీఎస్పీ కృష్ణ మాట్లాడుతూ ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు సంభవించినపుడు స్పందించవలసిన విధానాన్ని, వాటిని సమర్ధంగా ఎదుర్కోవడంపై మాక్ డ్రిల్ జరిగిందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవలసి చర్యలు, పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను అమలు పరచే దిశగా మాక్డ్రిల్ కొనసాగిందన్నారు. రాష్ట్ర ఆక్టోపస్ విభాగంలోని డెల్టా బృందం, జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్ బలగాలు, పెదకాకాని పోలీసుల సహకారంతో ఈ మాక్డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆక్టోపస్ ఆర్ఐ వరప్రసాద్, రామ్మోహన్, పెదకాకాని ఎస్ఐ రామకృష్ణ, అగ్నిమాపకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖ అధికారి రమణమూర్తి, ఆర్ఐ శ్రీనివాసరావు, ఏఎన్యూ యాజమాన్యం, 30 మంది ఆక్టోపస్ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు, పెదకాకాని పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన దివ్యాంగుల క్రీడా పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు క్రీడా పోటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. వారిలోని ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. అనంతరం కోటేశ్వరరావు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ ఏడీ దుర్గాభాయి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అఫ్రోజ్ ఖాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
గంజాయి సేవిస్తున్న ఏడుగురు అరెస్టు
గుంటూరు రూరల్: జనావాసాల మధ్యలో గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల ప్రకారం సోమవారం అర్థరాత్రి నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డ్ సమీపంలోని ఒక కాలేజీ వద్ద కొంతమంది యువకులు గుంపులుగా కూర్చుని గంజాయి సేవిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ మహేష్కుమార్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. గంజాయి తాగుతున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా వారి వద్ద రెండు 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయి. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. మిర్చి యార్డు సమీపంలో నివాసం ఉండే ముప్పిరి సుబ్బారావు, వేముల యోహాన్ల నుంచి 10 గ్రాముల చిన్న గంజాయి ప్యాకెట్ రూ 500 లకు కొనుగోలు చేసి తాగుతుంటారని తెలిసింది. గంజాయి విక్రయిస్తున్న ముప్పిరి సుబ్బారావు, వేముల యోహానులు పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం గాలింపు చేపట్టామని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
గుంటూరు మెడికల్: సాధారణ జ్వరం మాదిరిగా సోకి ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తున్న స్క్రబ్ టైఫస్తో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు, చేబ్రోలు, వేజండ్ల, తుళ్లూరు, గుంటూరు అర్బన్ పరిధిలోని గోరంట్ల, ఇతర ప్రాంతాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి జ్వరంతో ప్రారంభమవుతోంది. జ్వరం వచ్చి మూడురోజుల వరకు తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. చిన్న నల్ల మచ్చ (దద్దురు మాదిరిగా) శరీరంపై కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైపస్గా అనుమానించాలి. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చు. వర్షాకాలంలో ఈ జ్వరాలు ఎక్కువ సాధారణంగా స్క్రబ్ టైఫస్ కేసులు వర్షా కాలంలో ఎక్కువగా నమోదవుతాయి. జిల్లాలో ఒక్క వేసవి కాలంలో మినహా వర్షా కాలం, చలి కాలంలో కేసులు నమోదయ్యాయి. జ్వరంతోపాటు, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటాయి. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి. వాంతులు, తీవ్రమైన చలి, అలసట, దగ్గు, కళ్లు ఎర్రబడడం ఉంటాయి. శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధి సోకిన వారిలో సగం మందికి పైగా వీపు, ఛాతి, కడుపుపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. వాటిని నొక్కినప్పుడు మసక బారుతాయి. అనంతరం ఎరుపుగా మారతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో చర్మంలో కొద్దిగా రక్తస్రావం కావచ్చు. కీటకం ద్వారా సోకుతోంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగించే చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ఈ క్రమంలో దానిలో ఉండే లాలాజలం (ఓరిజెంటియా తుత్సుగముషి అనే బ్యాక్టీరియా) రక్తంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. జిల్లావ్యాప్తంగా 31 మందికి ఈ వ్యాధి జ్వరాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు శరీరంపై నల్ల మచ్చ గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి చిగ్గర్ మైట్ (కీటకం) ప్రభావంతో స్క్రబ్ టైఫస్ -
ముక్కోటి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను మంగళవారం మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ప్రచార నిమిత్తం గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైతు సమస్యలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీపీఐ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై ఈ నెల 10న అన్ని జిల్లాల్లోని మార్కెట్ యార్డుల వద్ద నిరసన తెలుపుతామని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా 17 మెడికల్ కాలేజీల వద్ద 18న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
గుంటూరు వెస్ట్: మాజీ భారత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నాయకులు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ నిస్వార్థమైన సేవతో దేశానికి దిశానిర్ధేశం చేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని రింగు రోడ్డులోని ఐటీసీ హోటల్, మెడికల్ క్లబ్ ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతి కోసం వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, బీజేపీ నాయకులు భజరంగ్ రామకృష్ణ, తాడువాయి రామకృష్ణ, దర్శనం శ్రీనివాస్, ఆలపాటి రవికుమార్, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి -
21న పల్స్పోలియో
గుంటూరు మెడికల్: జిల్లాలో పోలియో కేసులు నమోదు కాకుండా ప్రతి ఒక్కరూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. ఈనెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఏ ఒక్క బిడ్డను వదలకుండా, ముఖ్యంగా వలస ప్రాంతాల పిల్లలు, ఇటుక బట్టీలు, యాచకుల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,14,981 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. వీరికి 958 పోలియో చుక్కల కేంద్రాలు (బూతులు) ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 ట్రాన్సిట్ పాయింట్లు ఉన్నాయని, 97 మొబైల్ టీమ్లు, 4090 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది సూపర్వైజర్లను, 8 మంది జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు పరస్పరం సహకరించుకుంటూ పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో ఉన్న ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరి జాబితా తయారు చేసుకోవాలని చెప్పారు. జలుబు, జ్వరం లాంటి చిన్నచిన్న రుగ్మతలు ఉన్నప్పటికీ పోలియో చుక్కలు వేయవచ్చన్నారు. ఈ పోలియో చుక్కలు ప్రతినెలా వేసే పోలియో చుక్కలకు అదనమని పేర్కొన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఏ ఒక్క బిడ్డ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని మాట్లాడుతూ 21న బూత్ వద్ద వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ అన్నపూర్ణ, డాక్టర్ బి ఎస్ ఎస్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సుజాత, సూపర్వైజర్ శాస్త్రి పాల్గొన్నారు. -
ధాన్యం రైతుల ఆందోళన పట్టని ప్రభుత్వం
●తేమశాతంతో పనిలేకుండా కొనుగోలు చేయాలి ●ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి తెనాలి: ఖరీఫ్ సీజనులో ధాన్యం దిగుబడులు తగ్గి, ధరలు పడిపోవటంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి విమర్శించారు. స్థానిక చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం సీఐటీయూ డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్వలితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం 75 కిలోల ధాన్యం బస్తా బయట మార్కెట్లో రూ.1480 ఉండగా ఈ సంవత్సరం రూ.1280లకే వ్యాపారులు కొంటున్నారని తెలిపారు. గత సంవత్సరం 35–40 బస్తాలు దిగుబడి రాగా ఈ సంవత్సరం 25–30 బస్తాలు లోపే వస్తున్నాయని చెప్పారు. గత నెలలో మోంథా తుఫాన్ కారణంగా వరి దిగుబడి తగ్గిందన్నారు. కొన్నిచోట్ల చేలు పడిపోయినా, ప్రభుత్వం కనీసం నష్టం నమోదు చేయకపోవటం శోచనీయమన్నారు. కౌలురైతులు ఎకరాకు 25–32 బస్తాలు ధాన్యం లేదా రూ.25–40 వేల నగదుకు కౌలుకు తీసుకున్నారని గుర్తుచేశారు. తుఫాన్కు నేలవాలిన చేలల్లో హార్వెస్టింగ్కు అదనపు ఖర్చవుతోందని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో తేమశాతం 17 చూపిస్తే, మిల్లులకు వెళ్లాక 21 శాతంగా చూపుతున్నారని శివసాంబిరెడ్డి తెలిపారు. ఈ కారణంగా రైతులు దగ్గర నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు తీస్తున్నారని చెప్పారు. ఒకేసారి కోతలు రావటం వలన హార్వెస్టింగ్ మిషన్లు కొరత, టార్పాలిన్లు లేనందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తేమశాతంతో పనిలేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో బయో డీజిల్ బంక్లో నవంబర్ 23న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగం భాగ్యారావు (52) మంగళ వారం మృతి చెందాడు. పాలువాయి జంక్షన్ సమీపంలో బయోడీజిల్ దుకాణంలోని స్టీల్ క్యాన్లకు బయో డీజిల్ ట్యాంకర్ వచ్చి బయోడీజిల్ నింపుతుండగా ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో రషీద్(30) అక్కడికక్కడే అగ్నికి ఆహుతైన విషయం పాఠకులకు తెలిసిందే. బయోడీజిల్ దుకాణానికి 10 అడుగుల బయట ఉన్న భాగ్యారావుకు మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్నవారు అతనిని రోడ్డు వద్దకు లాగి దుస్తులు తీసివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే భాగ్యారావును అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు మృతి చెందినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. -
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలో గడిచిన 75 రోజుల్లో గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించి 163 మందిని గుర్తించి 28 కేసులు నమోదు చేసి 127 మందిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 48 కిలోల గంజాయి, 139 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 28 గ్రాముల ఎండీఎం, మూడు మోటారుసైకిళ్లను సీజ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి కార్యకలాపాలను గుర్తించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, నిరంతరం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అవగాహనతో అంతు చూద్దామనే ఆలోచనతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇటీవల సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రోన్లతో గస్తీ చేస్తున్నారని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుంచి విముక్తి పొందేందుకు పోలీసుల సాయం పొందవచ్చని అన్నారు. స్థానికంగా ఎవరైనా గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తే స్థానిక పోలీస్స్టేషన్లల్లో లేదా డయల్ 112, టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని తెలిపారు. -
రైతులకు కష్టాలు
పత్తి కొనుగోలు కేంద్రాలు రెండు నెలలు ఆలస్యం చేయడం, కపాస్ కిసాన్ యాప్ వల్ల ఏర్పడిన ఇబ్బందులు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. రైతుకు మద్దతు ధర పేరుతో క్వింటా పత్తికి నాలుగు నుంచి ఐదు కేజీల వరకు కోత విఽధించారు. దీంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి సీసీఐలో కొన్నేళ్లుగా సాగుతోంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిన్నింగ్ మిల్లులు ఆ పత్తిని సీసీఐకి నాణ్యమైన పత్తిగా చూపించి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రైతు సంఘాలు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో సీసీఐలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు 40 వేల బేళ్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. దీనిలో సీసీఐ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగే సూచనలు కనపడుతున్నాయి. -
‘సామాజిక’ మత్తు వల
తాడేపల్లి రూరల్ /పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో సామాజిక మాధ్యమాలలో వల విసురుతున్నారు. బాలికలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. బాలికల తల్లిదండ్రుల నుంచి వారితో డబ్బు తెచ్చేలా చేసి పబ్బం గడుపుతున్నారు. పరిచయమైన నాలుగైదు రోజుల్లోనే ఆకర్షణీయమైన ప్రదేశాల్లో తిప్పుతూ లాడ్జీలకు తీసుకువెళ్లి అసభ్యకరంగా ఫొటోలు సైతం తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ తరహాలో తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు సంఘటనలు జరిగాయి. ఇవిగో నిదర్శనాలు... ఒక బాలిక తనకు 18 సంవత్సరాలు నిండిన మొదటిరోజే ఆటో డ్రైవర్ అయిన మద్యం, గంజాయి అలవాటు ఉన్న వ్యక్తితో వెళ్లింది. ఆ బాలిక తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రాజకీయ నాయకులు వచ్చి మైనారిటీ తీరిందని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లారు. గత నాలుగు రోజుల క్రితం పోలీస్స్టేషన్ పరిధిలో మైనర్ అక్కాచెల్లెళ్లను ఆటో డ్రైవర్, మరో గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. డబ్బులు, ఇతర వస్తువులు తీసుకురమ్మని చెప్పడంతో వారు నగదు, రూ.లక్ష విలువైన సెల్ఫోన్లు తీసుకువెళ్లి ఆ కేటుగాళ్లకు అప్పగించారు. తండ్రి కష్టపడి ఒక కుమార్తెను తీసుకురాగా, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ బాలిక అదేరోజు ఇంటి నుంచి మళ్లీ పరారైంది. రెండవ బాలిక ఆచూకీ నేటికీ లభించలేదు. సదరు ఆటోడ్రైవర్పై ఫిర్యాదు చేయకపోవడంతో తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి పారిపోయని బాలికను మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో ఉండే ఓ యువకుడు తాను పోలీస్ అని చెప్పి ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువెళ్లాడు. మత్తుపదార్థాలు ఇచ్చి లోబర్చుకున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బు కోసం జీవితాలు నాశనం.... ఇలా ప్రేమ వ్యవహారాలు నడిపే యువకులకు ప్రత్యేకంగా షెల్టర్ ఇచ్చేందుకు కొంతమంది పనిచేస్తున్నారు. ఈ బాలిక విషయంలో కూడా ఇదే తరహాలో జరిగింది. నవులూరులో ఉడా కాలనీలో నివాసముండే ఓ మహిళతోపాటు నులకపేటలో వివాహిత కూడా బాలికలకు ఏకాంతంగా గడిపేందుకు తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంప ముంచుతున్న కొత్త స్నేహాలు ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పలకరింపులన్నీ ఆ వేదికగానే సాగుతున్నాయి. కొత్త కొత్త స్నేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో బాలికలు ఆకర్షణకు గురై లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో 17 సంవత్సరాల బాలిక ఒక యువకుడితో పరిచయం ఏర్పడటం, వారు శారీరకంగా కలవటం, ఆ బాలిక గర్భం దాల్చిన పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థిని తన బ్యాచ్ మేట్తోనే ఇలా పరిచయం కావడంతో ప్రైవేట్ ఫొటోలను పంపింది. అతడు ఇతరులకు పంపడంతో జైలుకు వెళ్లాడు. రెండు నెలల క్రితం కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో సైతం ఒక మైనర్ను యువకుడు తీసుకెళ్లాడు. గుంటూరు యువకుడు ఒకరు తానరు సాఫ్ట్వేర్ ఇంజినీరునని చెప్పి ఇన్స్ట్రాగామ్లో పరియమైన విజయవాడకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి మోసం చేసేందుకు యత్నించాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కూలి పనులు చేసుకునే వ్యక్తిగా తేలింది. -
మాదకద్రవ్యాల నియంత్రణ కీలకం
గుంటూరు వెస్ట్: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అవగాహన, ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగానికి ఆకర్షితులవుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ నవంబరు 1 – 28వ తేదీ వరకు 12 కేసులకుగాను 42 మందిని అరెస్టు చేశామన్నారు. తగినంత ఇసుక సరఫరా కావాలి జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా మైనింగ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టండి రెవెన్యూ సమస్యల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దారు సోమవారం అందుకున్న అర్జీలపై శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
గుంటూరు
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025త్రికోటేశ్వరుడి సేవలో నటుడు నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం మంగళవారం దర్శించుకున్నారు. తర్వాత ఆయన ప్రత్యేక పూజలు చేశారు. భగవద్గీత ఆవిర్భావ వేడుకలు నాదెండ్ల: సాతులూరు రెడ్డి పేరంటాలమ్మ ఆలయం వద్ద మంగళవారం భగవద్గీత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1 -
రాజధాని నడిబొడ్డున చెరువు కబ్జా
మందడం(తాడికొండ): రాజధాని నడిబొడ్డున సచివాలయానికి కూతవేటు దూరంలో తుళ్ళూరు మండలం మందడం చెరువులో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సుమారు 35 ఎకరాల్లో ఉన్న చెరువులో గతంలో పలువురు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం అప్పట్లోనే వారికి పట్టాలు అందజేసింది. ఇటీవల తెలుగు తమ్ముళ్లు తెగించడంతో నెల రోజుల వ్యవధిలో 4 షెడ్లు వెలిశాయి. వీరిని చూసి మరి కొంతమంది ఆక్రమణలకు తెరలేపడంతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరం, సీఆర్డీఏ స్థానిక కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఈ ఆక్రమణలు జరుగుతుండటంతో ముక్కున వేలేసుకోవడం అందరి వంతవుతోంది. త్వరలో ఇటుగా రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఈ గృహాలను తొలగిస్తే పరిహారం భారీగా వస్తుందంటూ ప్రచారం సాగుతోంది. -
నకిలీ బాండ్లపై విచారణ వేగవంతం
మంగళగిరి టౌన్: మంగళగిరి, కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) జరిగిన నకిలీ బాండ్ల అవినీతిపై అధికారులకు విచారణ వేగవంతం చేశారు. సీసీఆర్సీఎస్ కమిషనర్ అహమ్మద్ బాబు ఆదేశాల మేరకు గుంటూరు డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు అయిన వీరాంజనేయులు, మురళీకృష్ణలు మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్స్టేషన్లలో మంగళవారం సీఈవో రమేష్పై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్, జీడీసీసీ బ్యాంకుల విచారణ చేపట్టేందుకు తులసీ భ్రమరాంబ, సరళ, జయదాసు, భావన్నారాయణరాజులతో కూడిన బృందాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా నియమించినట్లు తెలియజేశారు. మంగళగిరి పీఏసీఎస్లో ఇప్పటికి 18 మంది ఖాతాదారులు నకిలీ బాండ్లతో రూ.1.99 కోట్లు, కురగల్లు పీఏసీఎస్లో 110 ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి నకిలీ బాండ్లతో రూ.7.98 కోట్ల నగదు మాయమైనట్లు తెలిపారు. ఇంకా బాధితులు, నకిలీ బాండ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా విచారణ సాగుతుందని పేర్కొన్నారు. నవంబర్ 20వ తేదీ వరకు రమేష్ అందుబాటులోనే ఉన్నారని, ఆ తరువాతే అమెరికా వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు క్రైం బ్రాంచ్ డీఎస్పీ మధుసూదనరావు మంగళవారం మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్లను పరిశీలించారు. ఆయా చైర్మన్లను వివరాలను అడిగి తెలుసుకొని, రికార్డులను చూశారు. కురగల్లులో బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. మంగళగిరి పట్టణ, రూరల్ సీఐలు వీరాస్వామి, ఎ.వి. బ్రహ్మం, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డా సీసీఐ
పత్తి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ).. వ్యాపారులతో కుమ్మకై ్క రూ.కోట్ల స్కాంలో ఇరుక్కు పోయినట్లు సమాచారం. దీనిపై సీఐడీ దృష్టి సారించింది. సోమవారం సీఐడీ అధికారులు సీసీఐ కార్యాలయానికి వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. పలు అంశాలకు సంబంధించిన ఫైళ్లను తమకివ్వాలని సూచించారు. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పలువురు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, గుంటూరు సీసీఐలోని ప్రొక్యూర్మెంట్ అధికారులు జిన్నింగ్ మిల్లుల అధికారులతో కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలోని బాపట్ల, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇబ్రహీంపట్నం కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 19 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. వీటిని 3.75 లక్షల బేళ్లుగా మార్చారు. ఇందులో 40 వేల బేళ్లను బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ రికార్డులు ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని రైతుల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాకముందే సీసీఐ నియమించిన జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి బేళ్లను తరలించారు. జిన్నింగ్ మిల్లు యజమానులు తక్కువ ధరకే తక్కువ నాణ్యత గల తడి పత్తిని మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసి దాన్ని రైతులు అమ్మిన పత్తిగా నకిలీ రికార్డులు తయారు చేశారు. సీసీఐ విధించిన ప్రమాణాల ప్రకారం నాసిరకం పత్తిని నాణ్యమైన పత్తిగా సీసీఐ అధికారులతో ధ్రువీకరించేలా వారితో కుమ్మక్కు అయ్యారు. సీసీఐ గోదాముల్లో నకిలీ, నాసిరకం పత్తిని నిల్వ చేయడం వల్ల నాణ్యత మరింత దెబ్బతిని కార్పొరేషన్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రక్రియ వల్ల రైతులు నష్టపోగా మధ్యవర్తులు, మిల్లర్లకు లాభాల పంట పండింది. -
చిన్నారుల గోడు ‘చెవి’కెక్కదా?
గుంటూరు జీజీహెచ్లో గత ప్రభుత్వంలో ఉచితంగా కాక్లియర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన ఒక్కొక్కరికి సుమారు రూ.16 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్లు ఉచితంగా చేశారు. రెండేళ్లుగా ఈ ఆపరేషన్లకు గ్రహణం పట్టింది. ఈఎన్టీ వైద్యులు ఆపరేషన్లకు ముందుకు రాకపోవడం, అధికారులు చొరవ చూపక పోవడంతో పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినప్పటికీ స్పీచ్ థెరపీ, ఇతర వైద్య పరీక్షల నిమిత్తం కొంత డబ్బు వసూలు చేస్తున్నారు. గుంటూరు మెడికల్: దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి సారిగా కాక్లియర్ ఆపరేషన్లు చేసిన సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఇ.సి.వినయ్కుమార్ తన స్వచ్ఛంద సంస్థ సాహి ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేశారు. ఆపరేషన్లకు అవసరమైన సుమారు రూ.50 లక్షల ఖరీదు చేసే వైద్య పరికరాలను సైతం ఆయన జీజీహెచ్కు అందజేశారు. ఆయన ఆపరేషన్లు చేయటంతోపాటు జీజీహెచ్లోని ఈఎన్టీ వైద్యులకు అందులో మెలకువలు నేర్పించారు. ఆ తరవాత జీజీహెచ్ ఈఎన్టీ వైద్యులు కొద్దిరోజులపాటు ఆపరేషన్లు చేసి అర్ధంతరంగా నిలిపివేయడంతో నేడు వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాక్లియర్తో చెక్ ... వినికిడి సమస్యలకు చెక్ పెట్టేందుకు కాక్లియర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒక చెవికి ఆపరేషన్ చేసేందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మొట్టమొదటిసారిగా ఒక చెవికి కాక్లియర్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో రెండు చెవులకు ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు చేసేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పు చేశారు. 15 మందికి విజయవంతం పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న 15 మంది చిన్నారులకు గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా ఒక్కొక్కరికి సుమారు రూ.16 లక్షల ఖరీదు చేసే కాక్లియర్ ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేశారు. పేదలకు ఎంతో ఉపయోగకరంగా, నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు చేసే సౌకర్యం జిల్లా మొత్తంలో గుంటూరు జీజీహెచ్లోనే ఉంది. జీజీహెచ్ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి కాక్లియర్ ఆపరేషన్లు చేస్తున్నారేగానీ, జీజీహెచ్లో ఆపరేషన్లు జరిగేలా చూసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ ఆపరేషన్లు చేయడం ద్వారా అధిక మొత్తంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా జీజీహెచ్కు ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్, విశాఖపట్నం కింగ్జార్జ్ ఆస్పత్రుల్లో మాత్రమే ప్రభుత్వపరంగా కాక్లియర్ ఆపరేషన్లకు అవకాశం ఉంది. జీజీహెచ్లో గతంలోలా నేడు కూడా కాక్లియర్ ఆపరేషన్లు జరిగేలా చూడాలని పలువురు బాధితులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను కోరుతున్నారు. -
సంపూర్ణ ఆరోగ్య సూత్రమే యోగా
గుంటూరు వెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ తెలిపారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధకులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధనే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని అతి సులభంగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతి శ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించారు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల, శైలజ, సల్మా, సంధాని, వెంకాయమ్మ పాల్గొన్నారు. -
అనారోగ్యంతో పోలీస్ జాగిలం రెమో మృతి
నగరంపాలెం: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పోలీస్ జాగిలం రెమో ఆదివారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సమీపంలోని ఖాళీ ప్రదేశంలో రెమోకు పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళులర్పించి, అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ విభాగానికి విశిష్ట సేవలందించిన రెమో మరణంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంతాపం వ్యక్తం చేశారు. రెమో జిల్లా భద్రతా విభాగంలో 2014 ఏప్రిల్ 29న విధుల్లో చేరి, సుమారు 12 ఏళ్లు క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించినట్లు పలువురు కొనియాడారు. నివాళులర్పించిన వారిలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు అరెస్ట్
నగరంపాలెం: గంజాయి విక్రయించే ఇద్దరు యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రెండు రోజుల కిందట కాకాని రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పాతగుంటూరు పీఎస్ సీఐ వెంకటప్రసాద్ సిబ్బందితో ఆకస్మిక సోదాలు చేశారు. ఈ క్రమంలో అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయంలో ఉంటున్న మహంకాళి శివమణికంఠ, నెహ్రూనగర్ ఒకటో వీధికి చెందిన భేటి బద్రినారాయణలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారిద్దర్ని అరెస్ట్ చేసి, 1,160 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. స్నేహితులైన ఇద్దరు గంజాయికి బానిసయ్యారు. మార్టూరు క్వారీ వద్ద ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు మంగల్ పాండే అలియాస్ మాము వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. చిన్న ప్యాకెట్లగా తయారుచేసి ఎక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు. -
6,7 తేదీల్లో తెలుగు సాహితీ మహోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన ఆధ్వర్యంలో ఈనెల 6,7 తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగే ఈ వేడుకల ఆహ్వానపత్రికను సోమవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ‘తెలుగుభాష–సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై సదస్సు, అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు 200 మందితో జాతీయస్థాయి కవి సమ్మేళనం ఉంటాయి. 11 నంది అవార్డులు పొందిన ఎం.సైదారావుచే జుగల్బందీ, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందంచే ‘భువన విజయం’నాటకం ఉంటాయని తెలిపారు. 7వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెనాలి కూచిపూడి కళాకారిణులు దాదాపు 500 మందితో మహానాట్య సమ్మేళనం, విభిన్న రంగాల్లో చేతివృత్తుల్లో కొనసాగుతున్న శ్రామిక యోధులు, కళారంగ ప్రముఖులకు చిరుసత్కారం ఉంటాయని వివరించారు. 7వ తేదీ ముగింపు సభలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందకు బొల్లిముంత శివరామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని రూ.లక్ష నగదుతో బహూకరిస్తారు. ముందురోజున గుమ్మడి గోపాలకృష్ణకు విశిష్ట రంగస్థల కళాపురస్కారం, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు సాహితీ సత్కారాన్ని రూ.25 వేల చొప్పున నగదుతో అందజేస్తారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు, మైత్రీ హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణసందీప్, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిశోర్బాబు, మొవ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సినీనటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం -
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
నగరంపాలెం: ఉద్యోగం పేరుతో తనను మోసగించారని ఓ బాధితురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పలువురు సమస్యలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తెచ్చారు. ఎస్పీ అర్జీల స్వీకరించి, వారి బాధలను ఆలకించారు. సంబంధిత ఎస్హెచ్ఓలతో జిల్లా ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఒకసారి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), మధుసూదనరావు (సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామమైన కురగల్లు పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం లిమిటెడ్)లో 72 మంది రైతులు నగదు డిపాజిట్ చేయగా, సహకార సంఘం సీఈఓ రమేష్ నకిలీ డిపాజిట్ బాండ్లను ఇచ్చి వారిని మోసం చేసిన విషయం పాఠక విధితమే. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ సొసైటీ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కలిసినా బాధితులకు ఎటువంటి భరోసా లభించకపోవడంతో సోమవారం గుంటూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు హాజరై వినతిపత్రం అందజేశారు. రైతుల బాధలు విన్న అధికారులు 21 రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాజధానిలో వున్న ఎకరం, అర ఎకరం పంటపొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చామని, అందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను నగదు రూపంలో కురగల్లులోని పీఏసీఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేశామని, సీఈఓ రమేష్ రైతులందరితో కలివిడిగా ఉండేవాడని, అతనిపై నమ్మకంతో రూ.లక్ష నుంచి కోటి వరకు 72 మందిమి డిపాజిట్ చేయగా, మొత్తం రూ.12 కోట్లకు సంబంధించి నకిలీ డిపాజిట్ బాండ్లను అందజేశాడని వాపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పత్రికల్లో వార్తలు రావడంతో రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. ఈ కేసు విషయమై ఎవరినీ పూర్తిగా విచారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో భూములు అమ్ముకోగా వచ్చిన డబ్బు పోగొట్టుకున్న తమ పరిస్థితి ఏంటని వాపోయారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ క్రికెట్ పోటీలు
గుంటూరు రూరల్: రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–14 బాలుర క్రికెట్ పోటీలలో పశ్చిమగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. గత మూడురోజులుగా రూరల్ మండలంలోని దాసుపాలెం గ్రామం లోగల గ్రౌండ్లో జరుగుతున్న పోటీల్లో భాగంగా చివరిరోజు సోమవారం తొలుత జరిగిన సెమీ ఫైనల్స్లో గుంటూరుపై కర్నూలు విజయం సాధించింది. అదేవిధంగా అనంతపురంపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. 3వ స్థానంలో గుంటూరు, 4వ స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన ఫైనల్స్లో కర్నూల్ను పశ్చిమ గోదావరి ఓడించి విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ బంగారు రాజు, దిలీప్చక్రవర్తిలు పర్యవేక్షించారు. విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జట్టును పెదకాకాని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం కె.భాస్కరరావు అభినందించారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మైనేనీ నాగేశ్వరావు, గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సిహెచ్ గోపి, సుమేధ స్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ త్రిమెన్ కమిటీ సెలక్టర్ సుధాకర్, ఏపీ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరిముల్లాచౌదరి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దేశీయ ఆయుర్వేద సంఘం జనరల్ సెక్రెటరీ డాక్టర్ నామాల శ్రీనివాసరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు. అండర్ –14 బాలుర విభాగంలో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు -
‘కోటి సంతకాల’ డిజిటలైజేషన్ ప్రారంభం
పొన్నూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. చంద్రబాబు పనితీరును వ్యతిరేకిస్తూ వైద్య, విద్యను కాపాడుకునేందుకు ప్రజలు సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఇప్పటివరకు సేకరించిన 65 వేల సంతకాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ సంతకాల ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ -
ఘనంగా గీతా జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై సోమవారం గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళా శాసనాలతో గీతా జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు శ్రీమద్భగవద్గీత సామూహిక పారాయణం నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలియజేశారు. మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కిరీటం, కర్ణాభరణాలు మంగళగిరికి చెందిన దంపతులు సోమవారం బహూకరించారు. మంగళగిరి పట్టణానికి చెందిన వెనిగళ్ల ఉమాకాంతం, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.5 లక్షల వ్యయంతో బంగారు పూత పూయించిన మూడు కిరీటాలు, ఆరు కర్ణాభరణాలు ఆలయ అధికారులకు అందజేశారు. ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారికి, అమ్మవారికి వాటిని ధరింపజేసి దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, అర్చకులు నల్లూరి రఘులు శాంతి కల్యాణం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాంతి కల్యాణ మహోత్సవంలో వెనిగళ్ల శివకుమార్, తిరుపతమ్మ దంపతులు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, రేవతి దంపతులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఉన్న భగవాన్ శ్రీ సత్య షిర్డి సాయిబాబా మందిరంలో గీతాజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సామూహిక భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతా జయంతి రోజున కృష్ణ భగవానుడ్ని తలచుకుంటే స్వామి ఆశీస్సులు ఉంటాయని, అందులో భాగంగా గీతా పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మందిర ప్రతినిధి పాతూరి సుధారాణి, నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, రాధిక, పలువురు సాయిభక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : గత 20 ఏళ్లుగా పురుగు మందుల వ్యాపారం చేస్తున్న ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం గ్రామానికి చెందిన ఓ ఎంటర్ప్రైజెస్ యజమాని రైతులు మోసం చేశాడని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఆయన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాత మల్లాయపాలెం, ప్రత్తిపాడు, గింజుపల్లివారిపాలెం, కోయవారిపాలెం పరిసర గ్రామాల్లోని 160 మంది రైతులకు రూ.40 కోట్లకు పైగా ఎగవేశాడని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఆరోగ్యమే మహా భాగ్యం
గుంటూరు వెస్ట్: ఆరోగ్యమే మహా భాగ్యమని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీని కలెక్టరేట్ ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం .. మన చేతిలోనే ఉందన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ‘హెచ్ఐవీ పరీక్ష చేయించుకోండి – సమాచారం కలిగి ఉండండి – సురక్షితంగా ఉండండి‘ అనే నినాదంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ అంటు వ్యాధులు కాదని, వాటికి గురైన వారిపై వివక్ష అవసరం లేదని స్పష్టం చేశారు. వారితో కలసి తినవచ్చు, జీవించవచ్చని చెప్పారు. ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాలోని 27 ప్రాథమిక, 47 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత హెచ్ఐవీ పరీక్షలు, సూచనలు ఇచ్చేందుకు 10 కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.మొబైల్ ఐసీటీసీ ద్వారాను పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హెచ్ఐవీతో జీవించే వారికి ప్రభుత్వం ఏఆర్టీ పెన్షన్ రూ.4 వేలు చొప్పున 2,634 మందికి అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.14 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్.. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (ఎంపీటీఎం)ను ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేలా విద్యాశాఖ అధికారులు, మండలస్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలు, గ్రామాల్లో పకడ్బందీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉగాది నాటికి ప్రారంభించటానికి జిల్లాలో రూఫ్ పూర్తయిన 5,470, రూఫ్ లెవల్ స్థాయిలో ఉన్న 9,100 ఇళ్ల పనులు వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తి అయ్యేలా హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధ్యాన్యం కొనుగోలు చేసిన ఆరు గంటల్లోనే రైస్ మిల్లుల్లో రైతులకు అక్నాలెడ్జిమెంట్ ఇచ్చేలా తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డీపీఓ సాయికుమార్, డీఈఓ రేణుక పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
శుభ కార్యాలకు బ్రేక్
ప్రత్తిపాడు: పెళ్లి చేసుకోవాలన్నా.. నూతన ఇంట్లో అడుగు పెట్టాలన్నా.. కొత్త వ్యాపారం ఆరంభించాలన్నా, విగ్రహ ప్రతిష్టలు చేయాలన్నా.. ఇలా శుభకార్యమేదైనా ముందుగా చూసేకునేది ముహూర్తమే. అది బాగుంటేనే పెళ్లి అయినా వ్యాపారమైనా ఒడుదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతుందని విశ్వసిస్తుంటారు. అయితే శుభకార్యాలకు ఈ ఏడాది పెద్ద బ్రేక్ పడింది. నవంబరు 30 శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం మార్గ శుద్ధ షష్టి నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. అనంతరం మాఘ మాసం బహుళ అమావాస్య 17 వరకూ ఉండటంతో అప్పటి వరకూ ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతాయి. అంటే దాదాపు 82 రోజుల పాటు శుక్ర మూఢం ఉండనుంది. మార్గశిర మాసం మొదలైన వారానికే ప్రారంభమైన మూఢం పుష్య, మాఘ మాసాల వరకూ కొనసాగుతోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, యజ్ఞాలు, కొత్త వ్యాపారాల ప్రారంభంతో పాటు ఇతరత్రా శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లి బాజాలు, వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు మూడు నెలల పాటు మూగబోనున్నాయి. శుక్ర బలం ఉంటేనే.. సాధారణంగా శుభ కార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. మౌఢ్యమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనమై తేజస్సు కోల్పోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే శుభకార్యాలకు మూఢం సమయం కాదని పండితులు సూచిస్తున్నారు. ముహూర్తాలకు ప్రతికూలత సాధారణంగా మాఘ మాసంలో వివాహాలు కుదిరి అగ్ని సాక్షిగా ఒక్కటయ్యేందుకు కాబోయే జంటలు ఎదురు చూస్తుంటాయి. వారి ఊహలకు తగినట్లుగానే మాఘ మాసంలో పెళ్లిళ్లకు కూడా బలమైన ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈసారి మూఢంలో కలిసిపోవడంతో ముహూర్తాల్లేని పరిస్థితి ఉంది. రథ సప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి తిథులు కూడా మూఢంలో కలిసిపోవడంతో గృహప్రవేశాలకు ప్రతికూలత ఏర్పడనుంది. బోసిపోనున్న ఫంక్షన్ హాళ్లు శుక్ర మౌఢ్యమి కారణంగా శుభ కార్యాలకు బ్రేక్ పడటంతో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు బోసి పోనున్నాయి. శుభకార్యాల మీద ఆధారపడ్డ పురోహితులు, డెకరేషన్, షామియానా, సామగ్రి నిర్వాహకులు, వంట మాస్టర్లు, బాజా భజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లకు దాదాపు రెండున్నర నెలల పాటు ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది. దేవాలయ ప్రతిష్టలు, ఉపనయనాలు, వివాహాలు, శంకుస్థాపన వంటి శుభకార్యాలు సహజంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ, ఫాల్గుణ, వైశాఖ మాసంలో ఎక్కువగా ఆచరించాలన్నది శాస్త్ర ప్రమాణం. అయితే, ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి వల్ల ఆటంకం ఏర్పడింది. మరలా ఫాల్గుణ మాసంలో 2026 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 11వ తేదీలోపు మాత్రమే శుభ ముహూర్తాలున్నాయి. మార్చి 19 తరువాత ఉగాది, శ్రీరామనవమి పండుగలు వెళ్లిన తరవాత అంటే మళ్లీ ఏప్రిల్లో గానీ శుభ ముహూర్తాలు లేవు. ఫాల్గుణ మాసంలో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు – జంధ్యాల వేంకట రామలింగేశ్వరశాస్త్రి (ఆగమ పరీక్షాధికారి, గణపతి విద్యాపీఠం నిర్వాహకులు) -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులతో పాటు దొంగిలించిన సొత్తు విక్రయించి దొంగలకు సహకరించే వ్యక్తిని కూడా గుంటూరు సీసీఎస్, లాలాపేట పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సంపత్నగర్ మెయిన్రోడ్డులో ఉంటున్న అవ్వారి వెంకటప్పయ్యశాస్త్రి గత నెల 8న తిరుపతి వెళ్లి 12న ఇంటికొచ్చారు. ప్రధాన ద్వారం తాళాలు పగుల కొట్టి ఉంది. బీరువాలో దాచిన 152 గ్రాముల బంగారు నగలు కనిపించలేదు. దీనిపై బాధితుడు లాలాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో గుంటూరు సీసీఎస్, లాలాపేట పోలీసులు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించారు. గుంటూరు మార్కెట్ సెంటర్లో సంచరిస్తున్న గోరంట్ల తూర్పుబజార్కు చెందిన చిల్లర సురేష్, విజయవాడ రామలింగేశ్వరనగర్ గంగానమ్మ గుడి పక్కన ఉంటున్న కాజా నాగవీరభాస్కరరావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం ఒప్పుకోవడంతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నాలుగు కేసుల్లో రూ.26.50 లక్షల ఖరీదు చేసే 227 గ్రాముల బంగారు, 182 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ చెప్పారు. దొంగలించిన సొత్తుని విక్రయించి వారికి సహకరిస్తున్న సుగాలినగర్ 4వ వీధికి చెందిన లంకా రాజేష్ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. పగలు రెక్కీ సురేష్, నాగవీరభాస్కరరావు పగలు రెక్కీ చేసేవారు. సురేష్ ఇళ్లల్లోకి వెళ్లి చోరీలకు పాల్పడగా, నాగ వీరభాస్కరరావు బయట కాపలా ఉండేవాడు. ఇనుపరాడ్తో తాళం పగలగొట్టి లోనికెళ్లి స్క్రూ డ్రైవర్తో బీరువాలు తెరవడంలో సురేష్ దిట్ట. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై 78 పైగా ఇళ్ల దొంగతనాల కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో గుర్తించిన పది మంది దొంగల జాబితాలో సురేష్ ఒకడు. నాగవీరభాస్కరరావు తెలంగాణ హుజూర్నగర్లోని జైల్లో ఉండగా చిల్లర సురేష్తో పరిచయమైంది. ఇద్దరూ దొంగలించిన సొత్తు లంకా రాజేష్ విక్రయించి వారికి సహకరించేవాడు. కేసులను ఛేదించిన సీసీఎస్ డీఎస్పీ బీవీ మధుసూదనరావు, సీఐ ఆర్ఎస్ కిశోర్కుమార్, ఎస్ఐ ఎల్.రాములు, ఏఎస్ఐ రామకృష్ణ, హెచ్సీ పీటర్రాజు, కృష్ణప్రసాద్, శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో డీఎస్పీలు మధుసూదనరావు (సీసీఎస్), అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), సీఐలు, ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాలేయ మార్పిడిపై కాలయాపన !
గుంటూరు మెడికల్: కాలేయ మార్పిడి ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం జనవరిలోనే అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రారంభించకుండా ఆసుపత్రి అధికారులు మీనమేషాల లెక్కిస్తుండటంతో, చికిత్సల కోసం వస్తున్న పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. గుంటూరు జీజీహెచ్లో గతంలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రతిరోజూ వంద మందికి పైగా పలు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 20 మంది కాలేయ సంబంధిత బాధితులే. వీరికి ఆపరేషన్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లో కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ను ప్రభుత్వం 2024 ఏప్రిల్లో నియమించింది. అందుకు అవసరమైన మిషన్లు సైతం అందజేసింది. కానీ జీజీహెచ్ అధికారులు ఆపరేషన్లు చేసేందుకు చొరవ చూపించడం లేదు. జనవరిలో అనుమతి గుంటూరు జీజీహెచ్లో చనిపోయిన వారి అవయవాలను సేకరించి, కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు జీవన్ ధాన్ ట్రస్టు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చింది. నేటి వరకు ఒక్క ఆపరేషన్ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి రోజూ గుంటూరు జీజీహెచ్లో 15 నుంచి 20 మంది వరకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో, గాయపడి చికిత్స పొందుతూ చనిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారు స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేసే బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా కో–ఆర్డినేటర్ను నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ పోస్టునూ భర్తీ చేయకుండా మిన్నకుండిపోయారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే, వారి అవయవాలను కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న వారికి అమర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఈ ప్రక్రియ కొనసాగించేందుకు తప్పనిసరిగా బ్రెయిన్ డెడ్ కమిటీ అనుమతి కావాల్సి ఉంటుంది. న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్లు, సమావేశం నిర్వహించుకుని చికిత్స పొందుతున్న వారు చనిపోయినట్లు నిర్ధారించాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ కో–ఆర్డినేటర్ పోస్టు భర్తీ చేయకపోవడం, బ్రెయిన్ డెడ్ కమిటీ సమావేశాలు పెట్టకుండా కాలయాపన చేస్తుండటంతో గుంటూరు జీజీహెచ్లో కాలేయ మార్పిడి ఆపరేషన్ల ప్రక్రియ ముందుకు కదలడం లేదు. -
అర్జీల పరిష్కారం వేగవంతం
అధికారులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశం గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి శాఖకు అందుతున్న అర్జీలపై స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. మొత్తం వచ్చిన వాటిల్లో పరిష్కరించినవి, ఇంకా చేయాల్సిన వాటిపై పక్కా సమాచారం ఉండాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఇంకా చూడాల్సిన అర్జీలు ఎన్ని ఉన్నాయి..వాటిపై ఎందుకు జాప్యం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని తెలిపారు. కొన్ని సమస్యలు మరలా వస్తున్నాయని (రీ ఓపెన్), వాటికి స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం వల్లే అలా జరుగుతున్నాయని భావించాల్సి ఉంటుందని చెప్పారు. పదే పదే వచ్చే అర్జీల్లో పెండింగ్ ఉండటానికి కారణాలు వివరణాత్మకంగా సమర్పించాలని ఆదేశించారు. ప్రతి అర్జీపై ఆడిట్ పక్కాగా జరగాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 260 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్, జిల్లా అధికారులు పరిశీలించారు. -
కౌలుకోలేని దెబ్బ
గుంటూరుసోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 కష్టాల కడలిలో కౌలు రైతు చీరాలకు చెందిన వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై బాపట్లలో కేసు నమోదు చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు, టీడీపీ నాయకురాలు కొమ్మనబోయిన రజని, మరికొందరిపై బాపట్ల పట్టణ పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ సాయికాలనీకి చెందిన బి.కల్యాణి శుక్రవారం రాత్రి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాలు.. సాయికాలనీకి చెందిన కల్యాణి.. బచ్చు నాగరాజును రెండో వివాహం చేసుకుంది. అతడు 2021లో మరణించడంతో ఆమెకు మొదటి భార్య రవీంద్రకుమారితో ఆస్తి సంబంధిత వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదంపై కళ్యాణి చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. కేసు విషయమై పోలీస్స్టేషన్కు వెళ్తుండగా ఆమెకు కొమ్మనబోయిన రజనితో పరిచ యం ఏర్పడింది. ఆమె న్యాయవాది ఊసా తులసీరావును పరిచయం చేసింది. అతను వివాదాస్ప ద ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పి తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఫిర్యాది కల్యాణిని బాపట్లలో ఇల్లు అద్దెకు తీసుకోవాలని చెప్పి రైలుపేటలో ఇల్లు అద్దెకు ఇప్పించారు. ఈ క్రమంలో ఆమైపె పలుమార్లు లైంగికదాడి చేయడంతో పాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. అంతేకాకుండా రజనితో కలిసి అసభ్యకరమైన వీడియోలతో బెదిరించి వేధించాడు. వీడియోలు, ఫొటోలు ఇవ్వాలంటే ఆస్తులు తమవారి పేరున రాయాలని బెదిరించి రాయించుకున్నారు. ఆస్తులు రాయించుకున్నా కూడా వీడియోలు బయటపెడతామని బెదిరించడంతో భయాందోళనకు గురైన ఆమె బాపట్ల పట్టణ పోలీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఊసా తులసీరావు, కొమ్మనబోయిన రజనిలతో సహా పదిమందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి సభ్యురాలిగా రజనిపై కేసు నమోదు కావడంతో టీడీపీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా కాపాడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెనాలి: సాగువిస్తీర్ణంలో 85 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నా వారికి ఎలాంటి ప్రభుత్వ ఆసరా దక్కటం లేదు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇందుకోసం సబ్ కమిటీని నియమించింది. అందులో తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇంతకాలమై నా కమిటీ తన నివేదికను క్యాబినెట్కు సమర్పించలేదని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. ఫలితంగా కౌలు రైతులు కష్టాల సాగుచేస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజనుకు పశ్చిమడెల్టాలో మాగాణి భూముల్లో వరిసాగు చేసిన రైతులకు సీజనులో ప్రకృతి వైపరీత్యాలతో ఎడాపెడా దెబ్బలు తగిలాయి. చివరకు పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుఫాన్ విరుచుకుపడింది. పంట నేలవాలిందని రైతులు హాహాకారాలు చేసినా.. అబ్బే! గుంటూరు జిల్లాలో 5 శాతంకు మించి నష్టం లేదంటూ ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకొంది. కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నష్టం అంచనా కూడా వేయలేదు. తీరా పంట పక్వానికొచ్చాక నూర్పిడులు జరుగుతుంటే, ఎకరాకు 5–10 బస్తాలకు పైగా దిగుబడి తగ్గిన చేదు వాస్తవం బహిర్గతమైంది. చేసేదేముంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచి, ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఆచరణలో అధికార యంత్రాంగం సమన్వయలోపం వెల్లడైంది. అధికారుల హడావుడి చేసి జీపీఎస్ లేకున్నా ఫర్వాలేదు, సొంత వాహనాల్లోనూ తీసుకెళ్లొచ్చు...అంటూ అనుమతులిచ్చారు. కొనుగోలు చేసేటప్పుడు 17 శాతం లోపుగా ఉన్న తేమ, రైస్మిల్లుకు వెళ్లేసరికి 21 శాతం చూపుతుండటం, బస్తాకు 4–5 కిలోలను తరుగుగా తీయాల్సిందేనని చెప్పటంతో అన్నదాత హతాశుడవుతున్న దుష్టాంతాలున్నాయి. ధాన్యం అమ్మకాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఇలాగుంటే, కౌలురైతుల అవస్థలు వర్ణనాతీతం. కౌలురైతు గుర్తింపు కార్డులు లేనందున ఈ–క్రాప్ నమోదుకు అవకాశం లేదని తెలిసిందే. ఎరువులు, విత్తనాల సంగతటుంచి వీరికి బ్యాంకు రుణాలు కూడా లేవు. పంటకు పెట్టుబడి అంతా అప్పులు తెచ్చి పెట్టారు. తీరా పంటచేతికొచ్చాక దిగుబడి తగ్గింది. ఇప్పుడా పంటకు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనే ఆస్కారం కూడా లేదు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని బయట వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు. పచ్చిమీద నూర్పిడి చేశారనే సాకుతో వ్యాపారులు బస్తాకు రూ.1200, రూ.1300 మించి ఇచ్చేది లేదంటున్నారు. అసలు రెండురోజులుగా బయట వ్యాపారులు పొలాలకేసి వచ్చింది లేదని రైతులు చెప్పారు. ఇక రైతులకే దక్కని టార్ఫాలిన్లు కౌలురైతులకు ఎలా వస్తాయి. దీనితో వాటిని కూడా కౌలురైతులు కొనాల్సివస్తోంది. 7 మోంథా తుఫాన్తో ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో.. అందని కౌలురైతు కార్డులు నమోదుకాని ఈ–క్రాప్ ధాన్యానికి దక్కని ‘మద్దతు’ ధర తగ్గిస్తున్న వ్యాపారులు దిత్వా తుఫాన్ హెచ్చరికలతో గుండెల్లో గుబులు టార్ఫాలిన్లకు సైతం దిక్కులేని దుస్థితి ప్రస్తుతం దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రోడ్లు, మెరక ప్రదేశాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకోవటానికి కనీసం టార్పాలిన్లను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోవటాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దావులూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభించినపుడు మంత్రి నాదెండ్ల మనోహర్ టార్పాలిన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చని చెప్పినట్టు రైతులు గుర్తుచేస్తున్నారు. ఆచరణలో ఒక్కో రైతుసేవా కేంద్రానికి 15–20కు మించి ఇవ్వలేమని అధికారులు అంటున్నారని రైతులు చెబుతున్నారు. అదికూడా ధాన్యం కొనుగోలు ఒప్పందం చేసిన రైతులకేనని, అవసరం తీరాక ఇతర రైతులకోసం ఇవ్వాల్సి వుంటుందని కూడా చెప్పారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల నిలుపుదల చేశారు. సముద్రంలోనికి 3,625 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 580.60 అడుగులకు చేరింది. ఇది 284.7452 టీఎంసీలకు సమానం. -
నిద్రపోతున్న నిఘానేత్రం
వీవీఐపీలు పర్యటించే ప్రాంతంలో కనిపించని సీసీ కెమెరాలు● నార్త్ సబ్ డివిజన్లో సీసీ కెమెరాల కోసం భారీ మొత్తంలో విరాళాల సేకరణ ● నేటికీ కెమెరాలు ఏర్పాటు చేయని పోలీసులు ● నిందితులకు వరంగా నిఘా లోపం ● మహిళ కిడ్నాప్ వ్యవహారంలో గుర్తించలేని నిందితుడి జాడ సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీ విరాళాలు.. ఒక్కటి పనిచేస్తే ఒట్టు -
వీళ్లతో మామూలుగా ఉండదు!
సాంఘిక సంక్షేమ శాఖలో మామూళ్ల పర్వం ● వార్డెన్ల విషయంలో అధికారుల ద్వంద్వ వైఖరి ● తమకు అనుకూలంగా ఉండే వారికి అన్నింటా అగ్ర తాంబూలం ● అనుకూలంగా లేని వారికి హాస్టళ్ల తనిఖీల పేరుతో ఇబ్బందులు ● అవసరమైతే సస్పెండ్ చేయడానికి వెనుకాడని వైనం ● పట్టించుకోని ఉన్నతాధికారులు హాస్టళ్ల నిర్వహణ గాలికి...! -
స్వర్ణం సాధించిన కేఎల్యూ విద్యార్థి
తాడేపల్లి రూరల్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కేఎల్యూ విద్యార్థి స్వర్ణపతకం సాధించినట్లు వర్సిటీ స్పోర్ట్స్ విభాగ డీన్ హరికిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయని, రాజస్థాన్ స్టేట్ షూటింగ్ రేంజ్లో ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కేఎల్యూకి ప్రాతినిధ్యం వహించిన నేలవల్లి ముఖేష్ స్వర్ణ పతకం సాధించాడని తెలిపారు. తమ యూనివర్సిటీ నుంచి తనిష్క్ మురళీధర్ నాయుడు, నాగసాయి తరుణ్ కూడిన బృందం రజత పతకాలు సాధించారని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన ముఖేష్ను రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి. రాజకుమార్, వర్సిటీ పీడీలు గౌతమ్, శ్రీహరి తదితరులు అభినందించారు. -
13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు. చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వలన బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని సంబోదించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వలన సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం తగు దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు చోరీ చేసే ముఠాకు చెక్
కంకిపాడు: ఖాళీగా ఉన్న వెంచర్లలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం వైర్లను చోరీ చేసే ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ జె.మురళీకృష్ణ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గరికే చందు ఇళ్ల వెంబడి ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. తన గ్రామానికే చెందిన గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, మంగళగిరి మండలం యర్రబాలేనికి చెందిన పాత ఇనుప కొట్టు నిర్వాహకుడు కుంటిగుర్ల నరసింహరాజుతో కలిసి జల్సాలు తీర్చుకోవటానికి, డబ్బుకోసం విద్యుత్ వైర్లు చోరీని మార్గంగా ఎంచుకున్నారు. కంకిపాడు, జగన్నాధపురం, కొణతనపాడు, ప్రొద్దుటూరు, దావులూరు గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్తంభాలకు ఉన్న విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నారన్నారు. గరికే చందుపై గతంలో నాలుగు వైరు చోరీ కేసులు ఉన్నాయి. విద్యుత్ వైర్లు చోరీపై నమోదైన కేసులో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రొద్దుటూరు గాయత్రీ విహార్ వద్ద గరికే చందు, గరికే నాగరాజు, పాలపర్తి నాగరాజు, కుంటిగుర్ల నరసింహరాజు అల్యూమినియం రేకులు ఏరుతూ సంచుల్లో మూట గట్టడాన్ని పోలీసులు గుర్తించారు. గరికే చందు, కుంటిగుర్ల నరసింహరాజు పోలీసులకు చిక్కగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. కంకిపాడు పరిసర గ్రామాల్లో అల్యూమినయం వైర్లు చోరీ చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద రూ.3 లక్షలు విలువైన వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులు చందు, నరసింహరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు విచారణలో ముఖ్యభూమిక వహించిన ఎస్ఐ డి.సందీప్, పీఎస్ఐ ఎస్.సురేష్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పి.ఎస్.ఎన్.మూర్తి, సయ్యద్ బాజీబాబును ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యారంగం ప్రైవేటీకరణ
●యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ ●ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభ ప్రారంభంలక్ష్మీపురం: భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తర్వాత ఉన్నత విద్యారంగంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉన్నత విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం సంఘం జిల్లా 50వ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, యూనివర్సిటీలో 15 ఏళ్లగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో అకాడమిక్ క్షీణత ప్రారంభమైందని అన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ప్రస్తుతం నాలుగు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కొన్నిచోట్ల కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో అధ్యాపకులు పనిచేస్తున్నారని, విశ్వవిద్యాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు. వైస్ చాన్స్లర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ నియామకం పూర్తి రాజకీయ కోణంలో జరగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయటం, తగిన మౌలిక వసతులు లేకపోవడం వలన చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. పేద విద్యార్థులు ముఖ్యంగా దళితులు, గిరిజన, బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 77 రద్దుచేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కిరణ్, మాజీ జిల్లా కార్యదర్శి భావన్నారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కృష్ణకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, జిల్లా అధ్యక్షులు కె పవన్కుమార్, సహాయ కార్యదర్శి అన్సారీ, కిరణ్ దాసరి, అమత వర్షిని, ఉపాధ్యక్షులు సౌమ్య, రూపాస్, కమిటీ సభ్యులు యశ్వంత్, సూర్జిత్, అజయ్, అభిలాష్, అనిల్ పాల్గొన్నారు. -
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శని, ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. దీంతో లాంచీ స్టేషన్కు లక్షా 20 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె మస్తాన్బాబు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. -
జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు
నగరంపాలెం: దిత్వా తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సబ్ డివిజన్లల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గుంటూరు తూర్పు సబ్ డివిజన్ –0863–2223353, గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ – 0863–2241152 / 0863–2259301, ఉత్తర సబ్ డివిజన్– 08645–237099, దక్షిణ సబ్ డివిజన్ – 0863–2320136, తెనాలి సబ్ డివిజన్– 08644–225829, తుళ్లూరు సబ్ డివిజన్– 08645–243265, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 0863–2230100 అని అన్నారు. ప్రతి కంట్రోల్ రూంకు సీఐలను, నోడల్ అధికారులుగా ఎస్ఐలను నియమించామని చెప్పారు. సీఐల పర్యవేక్షణలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రమాదకరమైన వంతెనలు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు అత్యవసర స్పందన బృందాలను అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజలు అత్యవసరమైతే మినహా గృహాల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అన్నివేళల సిద్ధమని పేర్కొన్నారు. -
బాలోత్సవంలో అలరించిన చిన్నారులు
మంగళగిరి టౌన్: బాలోత్సవంలో చిన్నారులు అదరహో అని పించారు. పిల్లలు కాదు... పిడుగులు అన్న విధంగా ఆ చిన్నారుల ప్రదర్శనలు సాగాయి. ఒకరిని మించి ఒకరు మించి ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించారు. మంగళగిరి– తాడేపల్లి బాలోత్సవం పట్టణ పరిధిలోని అరవింద మోడల్ స్కూల్లో ఆదివారం రెండవ రోజు అదిరేలా నిర్వహించారు. తెలుగులో ఉపన్యాసం, మట్టితో బొమ్మలు, ఇంగ్లిష్లో ఉపన్యాసం, జానపద నృత్యాలు, శాసీ్త్రయ నృత్యాలు, లఘు నాటికలు, ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి కార్యక్రమాల్లో బాలలు పాల్గొని చూపరులను ముగ్ధులను చేశారు. కార్యక్రమానికి అమరావతి బాలోత్సవం రాష్ట్ర కన్వీనర్ పి.మురళీకృష్ణ, రాష్ట్ర బాధ్యులు ఐజాక్ న్యూటన్లతో పాటు నాగేశ్వరరావు, వి.వి.ప్రసాద్, శాంతిరెడ్డి, పి.రాజశేఖర్, వల్లభనేని వాణి, ఎం.విజయమోహనరావు, సిందే బాలకృష్ణ పర్యవేక్షించారు. -
విజేతలకు పతకాలు ప్రదానోత్సవం
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏడాది జూన్ 21 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్– 2025 ఏపీ విజేతలకు ఆదివారం స్థానిక వెల్కమ్ హోటల్లో పతకాల బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సలాలిత్ తొట్టెంపూడి మాట్లాడుతూ ఏిపీ నుంచి మొత్తం 520 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో 204 పతకాలు సాధించారన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, రోడిక్ కన్సల్టెంట్ ఎండీ రాజ్కుమార్ హాజరై క్రీడాకారులకు బహుమతులు అందించినట్లు చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా శాఖ నూతన కార్యవర్గం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా శాఖ అధ్యక్షుడిగా పెదకాకాని జెడ్పీ హైస్కూల్ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్వీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మీ–పుల్లయ్య నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు బి.ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీఎంఎఫ్ గుంటూరు జిల్లా శాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్.బాల గంగాధర తిలక్ (గుంటూరు), గౌరవ సలహాదారుడిగా టి.సాంబశివరావు (తుళ్లూరు), కోశాధికారిగా అబ్దుల్ రెహ్మాన్ (నిడమర్రు), ఉపాధ్యక్షులుగా కె.కామాక్షి (దుగ్గిరాల), ఎం.సాయన్న (చినలింగాయపాలెం), బసవ లింగప్రసాద్, ఎంఎన్ఏ సిద్దిఖ్, బి.శ్రీనివాసరావు (గుంటూరు), జిల్లా కార్యదర్శులుగా నాంచారయ్య (తాడేపల్లి), ఎం.బాలనాగయ్య నాయక్ (కొలకలూరు), షేక్ చాంద్బాషా (పొన్నూరు), యు.సాంబశివరావు(తుళ్లూరు), ఎన్.పద్మావతి (తుళ్లూరు), జె.మురళీమోహన్ (మంగళగిరి), సునీతారజని, కె.జయలక్ష్మి(గుంటూరు), ఎం. ఉషశ్రీ (పెదనందిపాడు), ఎ.బాలచంద్రారెడ్డి (మేడికొండూరు), పి. శ్రీనివాసరావు(అత్తోట), ప్రమీల (ఫిరంగిపురం) రాష్ట్ర కౌన్సిలర్లుగా ఉప్పాల రామమోహనరావు, టి.సాంబశివరావు(గుంటూరు) ఎన్నికయ్యారు. అన్ని మండలాల నుంచి కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి టి.సాంబశివరావు వ్యవహరించారు. జిల్లా శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో గణిత సామర్ాధ్యన్ని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు ఉంది.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,334 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రత్తిపాడు: మహిళలు ఇంటి దగ్గరే స్వయం ఉపాధి పొందాలి.. ఆర్థికంగా వృద్ధి చెందాలి అంటూ చంద్రబాబు సర్కారు మాటలు నీటి మీద రాతలేనని తేలిపోతోంది. మాటల పసే గానీ చేతల పస లేదని స్పష్టమవుతోంది. అందుకు సాక్ష్యమే మహిళలకు ఇచ్చిన ఉచిత కుట్టు శిక్షణ. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 కుట్టు శిక్షణ కేంద్రాలను కొద్ది నెలల కిందట ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 1972 మంది మహిళలు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు శిక్షణ పొందేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు తొమ్మిది కేంద్రాల్లో శిక్షణ కూడా పూర్తయింది. ఇంకా మంగళగిరిలో రెండు, గుంటూరులో ఐదు కేంద్రాల్లో ప్రస్తుతం కొనసాగుతోంది. తొమ్మిది కేంద్రాల్లో శిక్షణ పూర్తయి ఇప్పటికి దాదాపుగా రెండు, మూడు నెలలు గడుస్తోంది. వీరికి మిషన్ కుట్టడం, డిజైన్ ఆధారిత కటింగ్పై తర్ఫీదునిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వందల మంది మహిళలకు కనీసం ధ్రువీకరణ పత్రాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. జాడే లేని మిషన్లు శిక్షణకు హాజరైన మహిళల్లో 75 శాతం హాజరు ఉన్నవారికి పూర్తయిన తరువాత ప్రభుత్వమే కుట్టు మిషన్లు ఇస్తుందని ప్రకటించారు. డిజిటల్ విధానంలో ప్రతిరోజూ హాజరు కూడా నమోదు చేశారు. వీరంతా ఇప్పుడు ధ్రువపత్రాలు, కుట్టు మిషన్లు కోసం ఎదురు చూస్తున్నారు. తద్వారా ఇంటి వద్దనే ఉంటూ మహిళలు టైలరింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇవే మాటలను శిక్షణ కేంద్రాల ఆరంభం రోజున అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడంతో మహిళల్లో ఆశలు రేకెత్తాయి. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. అంతేకాకుండా అర్హత ఉన్నవారికి బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇప్పిస్తామని అధికారులు చెప్పడం, అదీ కూడా ఆచరణకు దూరంగా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. ఫ్యాషన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఎక్కడ ? ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 127 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో పరీక్షలు పెట్టి ఎంపికై న వారికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలోని శిక్షకులను ఇక్కడకు పిలిపించి శిక్షణ ఇప్పిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ. 30–40 వేలు సంపాదించుకునే మార్గం చూపిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. నేడు అవన్నీ మాటలకే పరిమితమవ్వడంతో మహిళలు పెదవి విరుస్తున్నారు. ప్రత్తిపాడులో మిర్చి పంటను పరిశీలిస్తున్న రమణ తదితరులుమాట్లాడుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చిత్రంలో ఏఎస్పీ, డీఎస్పీ7జిల్లాలో ఇంకా కొన్ని కేంద్రాల్లో శిక్షణ నడుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తి అయింది. శిక్షణ పొందిన వారిలో 75 శాతం హాజరు ఉన్నవారికి త్వరలోనే ప్రభుత్వం కుట్టు మిషన్లు అందిస్తుంది. సర్టిఫికెట్లు కూడా అందిస్తాం. – మయూరి (బీసీ సంక్షేమ శాఖ అధికారి, గుంటూరు జిల్లా) -
వైభవంగా స్వరలయ ‘తెనాలి ఉత్సవ్’
తెనాలి: పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో రెండురోజుల ‘స్వరలయ తెనాలి ఉత్సవ్’ శనివారం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జానపద కళల ప్రదర్శనతో ఘనంగా ఆరంభమైంది. తొలుత తోలుబొమ్మలాటతో ఆరంభించి, ఆరాధ్యుల వెంకటసుబ్బమ్మ చెక్కభజన, గిరిజన గురుకుల విద్యార్థినులచే కోలాట ప్రదర్శన జరిగాయి. ప్రముఖ నృత్యగురువు నిర్మలా రమేష్ శిష్య బృందం ప్రదర్శించిన తెనాలి ఉత్సవ గీతం, తెనాలి వైభవంపై నృత్యరూపకం అభినందనలు అందుకున్నాయి. స్వరలయ తెనాలి ఉత్సవ్ లోగోను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. కళలను, సంస్కృతిని పరిపోషించేవారే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. తెలుగును రాజభాషగా చేసిన శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజు, రాజరాజనరేంద్రుడు ఇందుకు నిదర్శనమన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు తెలుగును, మన సంస్కృతిని కొనసాగించాలన్న విషయాన్ని నేటి పాలకులు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరించి పోతున్న కళలను ఆదరించాల్సిన ఆవశ్యకతను కార్యక్రమాలతో చాటుతున్న స్వరలయ సంస్థను అభినందించారు. దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించిన సభలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ (చైన్నె) సెక్రటరీ జనరల్ కె.శ్రీలక్ష్మీమోహనరావు, స్టేట్బ్యాంక్ ఏజీఎం వీవీ జగదీష్కుమార్, మండల తహశీల్దార్ కేవీ గోపాలకృష్ణ, శ్రీకనకదుర్గ దేవస్థానం పాలకమండలి సభ్యుడు తోటకూర వెంకట రమణారావు మాట్లాడారు. సభలో వివిధ రంగాల్లోని ప్రముఖులు నిర్మలా రమేష్, కాటూరి వెంకటేశ్వరరావు, అక్కల రామకృష్ణ, యు.ధర్మారావు, దీపాల సత్యనారాయణ, కనపర్తి బాబూరావు, టీవీఎస్ శాస్త్రి, కొల్లి రామాంజనేయ ప్రసాద్, టీఎస్ఆర్ బ్రహాచార్యులు, పద్మజా ప్రభాకర్, బెజ్జంకి నాగమణి, మేకతోటి ప్రభాకర్, జి.రాజశేఖర్, అబ్దుల్ రజాక్కు తెనాలి ఉత్సవ్ పురస్కారాలను ప్రదానం చేశారు. స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు పర్యవేక్షించారు. -
ఎయిమ్స్లో అంతర్జాతీయ సదస్సు
మంగళగిరి టౌన్ : నగర పరిధిలోని ఎయిమ్స్ వైద్యశాలలో రేడియో డయాగ్నసిస్ విభాగం, అనాటమీ విభాగానికి సంబంధించి ఇమేజ్ గైడెడ్ మస్కిలో స్కెలిటల్ ఇంటర్వెన్షన్లపై కోడరిక్ రెండవ అంతర్జాతీయ సమావేశాన్ని శనివారం ప్రారంభించారు. రేడియాలజీ, అనాటమీ విభాగాలు, మస్క్యులో స్కెలెటల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆసియన్ పసిఫిక్ ఇంటర్నేషనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోందని ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్, ప్రొఫెసర్ డాక్టర్ దేశు రామమోహన్లు ప్రారంభించారు. సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్లు వారు పేర్కొన్నారు. రెండురోజులు జరిగే కార్యక్రమంలో లైవ్ ఇమేజ్ గైడెడ్ ప్రదర్శనలు, కాడవెరికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
ప్రతిభ దివ్యం.. పోరు ఉత్కంఠం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): దివ్యాంగుల ప్రతిభాపాటవాలు సమాజానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విభిన్న అంశాల్లో ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ఎందరో దివ్యాంగులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులుగా, మోటివేటర్లుగా ఉన్నారని చెప్పారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగుల్లో ప్రతిభకు కొదవలేదని వారిలో ఉన్న సృజనాత్మకతను మరింతగా వెలికి తీసి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగ క్రీడాకారులు క్రీడల్లో అభివృద్ధి చెంది జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇన్చార్జి దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకుల డి.దుర్గా భాయి మాట్లాడుతూ డిసెంబర్ మూడో తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీల్లోనూ, దివ్యాంగుల దినోత్సవంలోనూ పాల్గొనే దివ్యాంగ ఉద్యోగులకు ఆన్డ్యూటీగా పరిగణించడం జరుగుతుందన్నారు. వివిధ అంశాల్లో జరిగిన క్రీడాపోటీలు ఉత్కంఠ రేపాయి. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజినీర్ నజీమా, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేలబావిలో యువకుడి మృతదేహం
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెం పెనుమాక రోడ్డు శివారులో పెనుమాక టిడ్కో గృహాలకు వెళ్లే మార్గంలో ఓ నేలబావిలో మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి కొత్తపేటకు చెందిన శంకర్, వీరకుమారి దంపతుల రెండవ కుమారుడు పిన్నిక ఆనంద్ (24) చదువు అనంతరం ఫొటోగ్రఫీ చేస్తు హైదరాబాద్లో నివాసముంటూ ఖాళీ సమయాల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీ నాయనమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. అంత్యక్రియల అనంతరం 27వ తేదీ ఉదయం అన్నయ్య, మరో స్నేహితుడితో కలసి వెళ్లి మద్యం సేవించి సాయంత్రం 4 గంటల సమయంలో అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆనంద్ ద్విచక్రవాహనంపై ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికిరాలేదు. 28వ తేదీ మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన కుమారుడు కనిపించడం లేదంటూ శంకర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేయకుండానే బంధువులు చుట్టుపక్కలప్రాంతాల్లో వెతుకుతుండగా యర్రబాలెంకు చెందిన ఓ వ్యక్తి డొంకరోడ్డులో మీ అబ్బాయి ద్విచక్రవాహనం ఉందని తెలియజేయడంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా పంటపొలంలో పాడైపోయిన బావిలో ఆనంద్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంలో కంటి కింద, తల వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయని, హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు అని, పోస్ట్మార్టం రిపోర్టు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెనుమాకలో ఓ యువతిని ఆనంద్ ప్రేమించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఆనంద్ను హత్యచేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. -
ఘనంగా లయోలా వజ్రోత్సవాలు
గుంటూరు రూరల్: విద్యద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, అటువంటి విద్యను అందిస్తున్న లయోలా స్కూల్స్ సమాజాభివృద్ధికి తమదైన ముద్రను వేస్తున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో లయోలా డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్ళ లయోలా విద్యాప్రస్థానంలో ఎందరో ఐఏఎస్లను, ఐపీఎస్లను, సమాజ సేవకులను, కార్పొరేట్ దిగ్గజాలను అందించిందన్నారు. ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటంలో లయోలా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. విద్య, క్రీడలు, సాంకేతిక నైపుణ్యం అన్ని రంగాల్లో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించిన లయోలా అభినందనీయమన్నారు. లయోలా డైమండ్ జూబ్లీ వేడుకల సావనీర్ను విడుదల చేశారు. పూర్వ ప్రిన్సిపల్స్, యాజమాన్యాన్ని సన్మానించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఏఎంఆర్ ఇండియా సంస్థ చైర్మన్ ఎ.మహే ష్కుమార్రెడ్డి, పాఠశాల సుపీరియర్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాథర్ డాక్టర్ పి.ఆంథోని, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సహాయరాజ్ మార్క్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ భాగ్యయ్య, రెవరెండ్ పాథర్ డాక్టర్ కెఎ స్టానిస్లూయిస్, పాఠశాల వైస్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మట్టి.. కొల్లగొట్టి ..!
తాడేపల్లి రూరల్ : ప్రభుత్వం రాజధాని పనుల్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసే సమయంలో వచ్చే మట్టిని విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికారులతో కలసి అక్రమార్కులు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. రాజధానిలో కొండవీటి వాగు వరదను నియంత్రించేందుకు ప్రభుత్వం పలుచోట్ల వెడల్పుతో పాటు రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. మరికొన్ని చోట్ల డ్రెయిన్లు, పైప్లైన్లు వేసే సమయంలో ఐదు నుంచి పది అడుగుల దాకా తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వచ్చిన మట్టిని సదరు కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం అక్కడి నుంచి తొలగించాలి. ఇదే అదునుగా చేసుకుని ఇతర ప్రాంతాల్లో చెరువ కట్టలను, రోడ్లను సైతం రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వేస్తున్నారు. సిండి‘కేట్లు’గా దోపిడీ లారీ ఓనర్లు సిండికేట్ అయ్యారు. మట్టి రవాణా ముసుగులో చెరువు కట్టలు, కొండవీటి వాగు మట్టిని యథేచ్ఛగా తోలుకుంటున్నారు. పైపు లైను దగ్గరకు ప్రైవేటు జేసీబీలు తీసుకువెళ్లి ట్రాక్టర్ లోడింగ్కు రూ. 400, లారీ మట్టికి రూ. 1000 ఇస్తున్నారు. ఈ మట్టిని అమ్ముకోవడానికి అనుమతులు ఉన్నాయి. ఈ ముసుగులో కొండవీటి వాగు నుంచి వచ్చే బంక మట్టిని రాత్రి సమయంలో తోలుతున్నారు. 220 మిషన్లు ఏర్పాటు చేసి అక్కడున్న వాచ్మేన్కు పదో పరకో అప్పజెప్పి వందల లారీల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చిర్రావూరు, రామచంద్రాపురంలతో పాటు కొల్లూరు ఇటుక బట్టీలకు తోలుతున్నట్లు లారీ డ్రైవర్లు తెలిపారు. ఈ మట్టి తవ్వకాలపై గతంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా సిండికేట్గా ఏర్పడ్డారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కొండవీటి వాగు మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. అటువైపు కనీసం పోలీసులు గానీ, సీఆర్డీఏ అధికారులు గానీ కన్నెత్తి చూడడం లేదు. కొంతమంది అధికారపార్టీ అండదండలతో లారీలు కొని మరీ ఈ వ్యాపారాన్ని నిర్వహించడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు మేల్కొని మట్టి తవ్వకాలలో జాగ్రత్తలు తీసుకుని, బిల్లులు ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు. -
ఎంఎల్సీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు మెడికల్: జాతీయ హైవేల మీద యాక్సిడెంట్ బారిన పడిన వాళ్లకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యశాల, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు జెండర్ బేస్డ్ వెల్నెస్, మెడికో లీగల్ కేసులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేషనల్ హైవేలపై ప్రమాదాలకు గురయ్యేవారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందవచ్చని చెప్పారు. అడిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పి.మురళీకష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలపై హింస నివారించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. మెడికో లీగల్ కేసుల విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హింసకులోనైన అనాధ చిన్నారులను, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని వెల్లడించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, వాణి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి -
లైంగిక దాడులపై అవగాహన
తాడేపల్లి రూరల్ : ఉండవల్లి మండల ప్రాథమిక పరిషత్ స్కూలులో శనివారం గుడ్షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక దాడులు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్ విద్య మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు చిన్నారులు బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన పడుతున్నారన్నారు. బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ సిబ్బంది పోతురాజు, అనూష, నాగమణి, అనిల్ కుమార్, బాబు జగజ్జీవన్రావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్ సీడ్ యాక్సెస్ రోడ్లో వీవీఐపీలు పర్యటిస్తుండడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కల్వర్టులు, ముళ్ల పొదలు, ఇతర పైపులైన్లు, చెక్ పోస్టులతో పాటు ఇతర బ్రిడ్జిల వద్ద బాంబ్ స్క్వాడ్, ఇతర బృందాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీవీఐపీలు, వీఐపీలు నివాసం ఉంటున్నారని, వారి భద్రత దృష్ట్యా మొత్తం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించార ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్జీ డీఎస్పీ రామకృష్ణ, జిల్లా భద్రతా విభాగం ఆర్ఐ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ ఆర్ఐలు నరేష్, శంకర్ పాల్గొన్నారు. మంచికల్లు(రెంటచింతల): పలనాటి కోనసీమగా పేరొందిన మంచికల్లు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల ప్రారంభమైనట్లు కారంపూడి వెంకటాచార్యులు శనివారం తెలిపారు. తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం కుంకుమ బండ్లు, శనివారం దీనబండారంతో ఈ వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. మార్గశిర ఏకాదశి మొదలు బహుళపాఢ్యమి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మంగళగిరి టౌన్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి విద్యార్థి ప్రతిభ చాటి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. మంగళగిరిలోని సాయినగర్కు చెందిన పాపన జితేంద్ర ఆర్థోపెడిక్ విభాగంలో 800 మార్కులకు 568 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏలూరు జిల్లా ఆశ్రమ వైద్య కళాశాలలో జితేంద్ర వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చేబ్రోలు శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి జితేంద్రను అభినందించారు. తమ కుమారుడు కష్టపడి చదివి పీజీ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని జితేంద్ర తల్లిదండ్రులు శివరామ్ ప్రసాద్, ధనలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. -
రైతులు సొంత వాహనాల్లో ధాన్యం రవాణా చేసుకోవచ్చు
కొల్లిపర: ఇకనుంచి ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి జీపీఎస్ అనుసంధానం లేకుండానే వారి సొంత వాహనాల ద్వారా కూడా మిల్లర్ల వద్దకు ధాన్యం తరలించుకొనే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిందని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ రైతులతో అన్నారు. మండల పరిధిలోని హనుమాన్పాలెం, తూములూరు, చివలూరు గ్రామాల్లో రోడ్డు వెంట ఆరబోసిన ధాన్యం రాశులను శనివారం తహసీల్దార్ జి.సిద్ధార్ధతో కలసి ఆయన పరిశీలించి, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెండు రోజుల్లో దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి నూర్పిళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో జీపీఎస్తో సంబంధం లేకుండా రైతులు తమ సొంత ట్రాక్టర్లు లేకపోతే ఇతర వాహనాల ద్వారా వారి ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకొని, కేటాయించిన మిల్లర్లు వద్దకు వారే నేరుగా రవాణా చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జేసీ వెంట ఇన్చార్జి ఎంపీడీఓ భార్గవ్, ఏఓ శ్రీనివాసరెడ్డి, రైతులు అవుతు సుధాకరరెడ్డి, ఎ.శివారెడ్డి, అడపా నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
పరీక్షలు విద్యార్థులకా... వర్సిటీకా..!
● విశ్వవిద్యాలయానికే పరీక్షగా మారిన పీజీ పరీక్షల లోపాలు ● అన్నీ తెలిసినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు ● అవకతవకలతో పీజీ ప్రశ్నపత్రాల ముద్రణే విద్యార్థులకు శాపం ఏఎన్యూ (పెదకాకాని): ఐదు దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతులున్న యూనివర్సిటీలో జరిగే పీజీ పరీక్షల్లో ఒకరోజు చేతితో రాసిన రైటింగ్తో ప్రశ్నపత్రాలు ఇస్తే... మరోసారి ఒకే పరీక్షా పేపరులో ఒకే రకమైన మూడు ప్రశ్నలు ఇవ్వడం ఇటీవల చోటుచేసుకుంది. తప్పును సరిదిద్దుకునే దిశగా అడుగులేయడం, పునరావృతం కాకుండా జాగ్రత్త వహించడం సహేతుకమనే చర్చ విద్యావేత్తల్లో జరుగుతోంది. డిగ్రీ పరీక్షలు సజావుగా సంవత్సరాల తరబడి కొనసాగుతున్నపుడు పీజీ పరీక్షల్లోనే పదే పదే తప్పులు ఎందుకు జరుగుతున్నాయో పాలకులు కూడా దృష్టి సారించడం లేదు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నో సందేహాలు పీజీ ప్రశ్నపత్రాలను ఇతర విశ్వవిద్యాలయాలు, విద్యా కేంద్రాలలోని నిష్ణాతులైన ఆచార్యులు రూపొందించి ఇస్తున్నారా? అనే సందేహం తలెత్తుతోంది. మరేదైనా విధానంలో నమూనా ప్రశ్నపత్రాలనే ఇప్పటి పరీక్షా ప్రశ్నపత్రాలుగా మారుస్తున్నారా అని సందేహాలు వస్తున్నాయి. కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు దాదాపుగా నమూనా ప్రశ్నపత్రాలను పోలి ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అనుభజ్ఞులైన ఆచార్యులు ప్రశ్నపత్రం రూపొందిస్తే ఇలాంటి తప్పిదాలు జరిగే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుందని ఆచార్యులు పేర్కొంటున్నారు. అసలు ప్రశ్నపత్రాలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఎలా రూపొందించారు? ఆ విధి నిర్వహణకు, ప్రశ్నపత్రాల రూపకల్పనకు, ప్రశ్నపత్రం రూపొందించిన ఆచార్యునకు ఎంత మొత్తం నగదును ఎవరికి చెల్లించారు? ప్రశ్నపత్రం రూపకల్పనకు అయ్యే ఖర్చుకు సంబంధించిన బిల్లులను ఎవరెవరికి ఇచ్చారు? అనే దిశగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దళిత, బడుగు, బలహీన వర్గాలంటే అంత చులకనా? వర్సిటీలో ఇటీవల ఇక్కడ వసతి గృహంలో ఆహారం పరిశుభ్రంగా లేదని ఓ మహిళా ప్రొఫెసర్ అయినటువంటి చీఫ్ వార్డెన్ను అప్పటికప్పుడు వర్సిటీ పాలకులు మార్చారు. విద్యార్థులకు అతి ముఖ్యమైన పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా తప్పుల మీద తప్పులు జరుగుతున్నా సరిదిద్దుకోని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వర్సిటీలో చర్చ జరుగుతోంది. మహిళలంటే చిన్నచూపా? దళిత, బడుగు, బలహీన వర్గాల వారిని ఒక రకంగా చూసి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అని పక్షపాత వైఖరిపై పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిపాలన పరంగా గాడి తప్పుతున్న వర్సిటీపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నూతన వీసీ రాకకు జాప్యం అవుతుందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో వర్సిటీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ హోదాలో నియమించిన సందర్భాలు సైతం ఉన్నాయని సీనియర్ ఆచార్యులు గుర్తు చేసుకుంటున్నారు. గత 15 నెలలుగా తాత్కాలిక పాలనలో వర్సిటీలో జరిగిన, జరుగుతున్న లోపాలను, పరిపాలనలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలంటే ప్రస్తుత పాలనాధికారులను మార్చి గతంలో మాదిరిగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సీనియర్ ఆచార్యులు సూచిస్తున్నారు. గతంలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మంచి ఫలితాలు సాధించారని పలువురు సామాజిక విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులనుగానీ, ఉపకులపతులనుగానీ ఇక్కడ నియమిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు. పీజీ పరీక్షల నిర్వహణలో గత కొంతకాలంగా జరుగుతున్న తప్పులు చూస్తుంటే బాధ్యత లేని అధికారులు ‘విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నారా... వర్సిటీకే పరీక్ష పెడుతున్నారా’ అనే సందేహం చైతన్యవంతమైన విద్యావంతుల్లో తలెత్తుతోంది. తప్పు చేసి ఒప్పుగా చిత్రీకరించేందుకు ఒకరు ప్రయత్నం చేస్తుంటే... తప్పు అని తెలిసినా మరొకరు చర్యలకు మీనమీషాలు లెక్కిస్తున్నారు. -
అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు
తెనాలి రూరల్: 44 ఏళ్ల క్రితం నాటి సివిల్ వ్యాజ్యంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1981 సంవత్సరానికి సంబంధించి పార్టీషన్ పిటిషన్ (ఓఎస్ నెంబరు 135/1981) పెండింగ్లో ఉంది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన సూరపనేని సూరమ్మ తనకు వారసత్వంగా ఉన్న ఆస్తిలో హక్కు ఉందంటూ 1981లో కోర్టును ఆశ్రయించారు. ప్రతి వాదిగా సూరపనేని వెర్రెమ్మ ఉన్నారు. వాది, ప్రతివాది, వీరు 1981లో పెట్టుకున్న న్యాయవాదులూ మృతి చెందారు. వీరి తరఫున వారసులు కేసును కొనసాగిస్తూ వచ్చారు. తెనాలి న్యాయచరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి ఎం. శ్రీధర్.. సూరమ్మకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సూరమ్మ తరఫున మాదినేని రాంప్రసాద్ వాదించారు. . నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్ నాయర్ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్ వైద్యులు ఆర్.మురళీబాబురావు, బీవీ.సుధీర్బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్, మాజేటి గోపి పాల్గొన్నారు.44 ఏళ్ల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి తెనాలి రూరల్: 44 ఏళ్ల క్రితం నాటి సివిల్ వ్యాజ్యంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1981 సంవత్సరానికి సంబంధించి పార్టీషన్ పిటిషన్ (ఓఎస్ నెంబరు 135/1981) పెండింగ్లో ఉంది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన సూరపనేని సూరమ్మ తనకు వారసత్వంగా ఉన్న ఆస్తిలో హక్కు ఉందంటూ 1981లో కోర్టును ఆశ్రయించారు. ప్రతి వాదిగా సూరపనేని వెర్రెమ్మ ఉన్నారు. వాది, ప్రతివాది, వీరు 1981లో పెట్టుకున్న న్యాయవాదులూ మృతి చెందారు. వీరి తరఫున వారసులు కేసును కొనసాగిస్తూ వచ్చారు. తెనాలి న్యాయచరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి ఎం. శ్రీధర్.. సూరమ్మకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సూరమ్మ తరఫున మాదినేని రాంప్రసాద్ వాదించారు. -
గుంటూరు
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025పేరుకే కొనుగోలు కేంద్రాలు ● నత్తను తలపిస్తున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ● చేసేది లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు ● 5,020 టన్నులు లక్ష్యం కాగా.. కొన్నది 217 టన్నులే ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి, పార్టీ ముఖ్య నేతలు ● క్షేత్రస్థాయిలో అన్నదాతల సమస్యలను తెలుసుకున్న నాయకులుఒక రైతు పొలంలో తెల్లనల్లి ప్రభావం.. మరో రైతు నాటిన పైరులో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న పేనుబంక.. ఇంకో రైతు వేసిన మిర్చి చేనులో కొమ్మకుళ్లు తెగులు సోకే సూచనలు.. మరొకరి పంటలో తెల్లదోమ లక్షణాలు.. ఇప్పటికే కమ్మేసిన బొబ్బర తెగులు.. ఇలా ఒక్కో రైతుదీ ఒక్కో ఆందోళన. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన హార్టికల్చర్ అధికారులు కంటికి కనిపించడం లేదు. ఫలితంగా తెగుళ్ల బారిన పడిన మిర్చి పంటను రైతులు పీకేస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు.కొల్లిపర: గుంటూరు జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. రైతులను ఆదుకోవటంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం అమ్మకాలకు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా పార్టీ తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళి, దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరి ఫాతిమా, బలసాని కిరణ్ కుమార్, డైమండ్ బాబులతో కలిసి శుక్రవారం సాయంత్రం అంబటి కొల్లిపర మండలానికి వచ్చారు. స్థానిక నాయకులతో కలిసి తూములూరు, దావులూరు గ్రామాల్లో పర్యటించారు. ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దావులూరు గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి మాట్లాడుతూ నిన్నటి వరకు అకాల వర్షాలు, తుఫాన్ కారణంగా ప్రతి సంవత్సరం కన్నా ధాన్యం దిగుబడి తగ్గి రైతులకు నష్టం జరిగిందన్నారు. దావులూరు కొనుగోలు కేంద్రంలో 5,020 టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, తొమ్మిది రోజుల్లో కేవలం 217 టన్నులను 36 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. కొనుగోళ్లు ఇలా సాగితే రైతుల దగ్గరున్న ధాన్యాన్ని ఎప్పటికి కొంటారని ప్రశ్నించారు. తేమ 17 శాతం కన్నా తక్కువ ఉంటే కొంటామని చెప్పటంతో రైతులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్లు, డొంకలు, ఖాళీస్థలాల్లో ఆరబోస్తున్నారని చెప్పారు. మట్టి గెడ్డలు, చెత్తపరకల తొలగింపు కోసం అదనంగా కూలీలతో జల్లిస్తున్నారని తెలిపారు. ఇంతా చేసి కేంద్రానికి ధాన్యం తీసుకెళితే, తేమ 17 శాతం కన్నా తక్కువ ఉన్న వాటిని లోడ్ చేసి మిల్లర్లకు పంపించగానే అక్కడ తేమ 20 శాతంగా ఉందంటున్నారని రాంబాబు అన్నారు. దీంతో చేసేదిలేక మిల్లర్లు చెప్పిన విధంగా బస్తాకు 4, 5 కిలోల తరుగు తీసి అమ్ముకుంటున్నట్టు రైతులు చెప్పారని తెలిపారు. గోతాలు, లారీలు సక్రమంగా అందకపోవటం, జీపీఎస్ పనిచేయక జాప్యం జరుగుతోందన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికై నా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ–క్రాప్ చేయని రైతుల నుంచి మధ్యవర్తులు 75 కిలోల బస్తాకు కేవలం రూ.1,200 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు ఈ–క్రాప్ నమోదు, బీమా చేసినట్టు గుర్తుచేశారు. 7తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ మండలంలో 60 శాతం వరి కోతలు జరిగినప్పటికీ దావులూరు కొనుగోలు కేంద్రం ద్వారా 217 టన్నులే కొనుగోలు చేశారన్నారు. 4 రోజుల్లో మిగతా కోతలు పూర్తి కానున్నాయని గుర్తుచేశారు. సేకరణ ఇదే విధంగా కొనసాగితే కోతలు పూర్తయ్యేసరికే పావు వంతు కూడా ధాన్యం కొనుగోలు చేయలేక పోవచ్చునని అన్నారు. పార్టీ మండల రైతు అధ్యక్షుడు అవుతు సాంబిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పల్లె మధుసూదన రావు, ఈమని హరికోటిరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, అవుతు పోతిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, పిల్లి గంగాధర్, సుజాత, వంగా సుధాకర్రెడ్డి, మొర్ల శ్రీను, ఈద హర్షవర్ధన్రెడ్డి, ఉత్తేజ్రెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, చెంచల రామిరెడ్డి, కళ్ళం వీరారెడ్డి, జొన్నల శివారెడ్డి, ఎ.కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. – బి.రవీంద్రబాబు, డీడీ, ఉద్యాన శాఖ, గుంటూరు జిల్లా అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శుక్రవారం 581.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 48,929 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది. ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్స్ను ఆర్డీవో శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీ చేశారు. -
పలు బ్యాంక్ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ బ్యాంకు కార్యాలయానికి శంకుస్థాపన తాడికొండ: అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన స్థలంలో భూమిపూజ, నిర్మాణానికి పనులు శుక్రవారం నిర్వహించారు. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన భూమిలో బ్యాంకు ఎండీ, సీఈఓ కళ్యాణ్కుమార్, జోనల్హెడ్ దారా సింగ్నాయక్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు భూమి పూజ నిర్వహించిన అనంతరం శంకుస్థాపన శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతిలో మరింత విస్తరణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ విజయవాడ పి.సతీష్బాబు, కడప రీజనల్హెడ్ ఈ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటాం
గుంటూరు మెడికల్: ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్బాబు చెప్పారు. శుక్రవారం గుంటూరు కన్నావారితోట 4వ లైనులో ఏపీజీడీఏ సెంట్రల్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ ఈఎన్టీ రిటైర్డ్ హెచ్ఓడీ డాక్టర్ మహేంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయధీర్బాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక పదేళ్ల అనంతరం గుంటూరులో సంఘ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. వైద్యుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని, 1996 నుంచి తమ పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. ● ముఖ్య అతిథి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల సమస్యలను గతంలో బయటకు వచ్చి చెప్పేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదన్నారు. డాక్టర్ జయధీర్ వైద్యుల సమస్య పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సంఘ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యుల సమస్యలపై పోరాటానికి తమ జేఏసీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్, కోశాధికారి డాక్టర్ పి.జె.శ్రీనివాస్, పలు జిల్లాలకు చెందిన నేతలు, గుంటూరు జిల్లా నేతలు, ఏపీ హంస సంఘం నేతల అరవపాల్, డ్రైవర్స్ అసోసియేషన్, నాలగవ తరగతి ఉద్యోగుల సంఘం, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
డిసెంబర్ 7న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిసెంబర్ 7న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న శిక్షణ తరగతులకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర స్థాయి సబ్జెక్టు నిపుణులైన ఆర్.శివనాగేశ్వరరావు, కె.కృష్ణసాయి, బుద్దా శ్రీనివాస్, ఆగస్థ్య ఫౌండేషన్ ప్రతినిధి నరేష్బాబు రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు 83099 65083, 90004 53600, 97035 79996 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు టి.జాన్బాబు, బి.ప్రసాద్, టీఆర్ రమేష్, ఎస్ఎం సుభానీ, గురవయ్య, ఇ. అనిల్కుమార్, షేక్ రెహ్మాన్, జి.శివపూర్ణయ్య పాల్గొన్నారు. -
మంగళగిరిలో ఏపీ ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారుక్ షిబ్లీ పేర్కొన్నారు. ఈ భవనాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయం విజయవాడ పరిధిలోని భవానీపురంలో ఉందని, త్వరలోనే మంగళగిరి ఆటోనగర్లో ఏపీఐఐసీ కార్యాలయ సమీపంలోని భవనంలోకి మార్చుతామని చెప్పారు. డిసెంబర్ 31కి ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ స్థాపించి 5 దశాబ్దాలు పూర్తికానున్న నేపథ్యంలో మంగళగిరిలోని నూతన కేంద్ర కార్యాలయం నుంచి పరిపాలన ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
రేపు జిల్లాస్థాయి వెటర్న్ క్రీడా పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదల చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాకింగ్, త్రో, రన్నింగ్, జంపింగ్ తదితర పోటీలను మహిళలకు, పురుషులకు విభాగాల వారీగా వేర్వేరుగా జరుగుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి వెటరన్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల వివరాలను 9000979056, 9949526697లో సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన క్రీడా పోస్టర్ను అసోసియేషన్ సెక్రెటరీ జి.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కిరణ్, ఈసీ మెంబర్ జి.గోపీనాథ్, ట్రెజరర్ సత్యనారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో విడుదల చేస్తామన్నారు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఐదుగురు ఎంపిక తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాలల్లో తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్ధులకు పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు. ‘మా–ఏపీ’ సభ్యులు రెన్యువల్ చేయించుకోవాలి తెనాలి రూరల్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్–ఏపీలో రెండేళ్ల సమయం పూర్తయిన సభ్యులందరరూ తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాలని ’మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్రాజా చెప్పారు. తెనాలి మండలం పెదరావూరు ఫిలిం స్టూడియోలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మార్చి 31లోగా రెన్యువల్ చేయించుకోవాలని, జీవిత కాలం సభ్యత్వం ఉన్న వారికి మినహాయింపు ఉందని, సభ్యత్వ నమోదు ఉచితమని తెలిపారు. కొత్త గోరంట్ల దేవాలయంలో చోరీ సత్తెనపల్లి: దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం కొత్త గోరంట్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోరంట్ల గ్రామంలోని శివారున పొలాల సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య తండ్రి దేవస్థానంలో గుర్తు తెలియని దుండగులు తలుపు పగలగొట్టి రెండు పంచలోహ విగ్రహాలను, రూ.10 వేల నగదు అపహరించుకుపోయారు. ప్రతి శుక్రవారం, ఆదివారం దేవాలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన నంబూరు ఏడుకొండలు తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపల పరిశీలించాడు. రెండు పంచలోహ విగ్రహాలు, రూ.10 వేలు నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చుక్కల్లో చిక్కుడు ధర
● భారీగా పెరిగిన కూరగాయల ధరలు ● హడలిపోతున్న వినియోగదారులు ● సామాన్యులకు తప్పని అదనపు భారం రెట్టింపు కష్టాలు దిగుమతి చేసుకున్నందున.. కూరగాయల దుకాణం కూరగాయలు ధర (కిలో) నాటు చిక్కుడు 120 క్యాప్సికం 100 బీన్స్ 90 క్యారెట్ 80 బీరకాయ 60 పచ్చిమిర్చి 60 టమాటా 60 బీట్రూట్ 70 బెండకాయ 50 దోసకాయ 50 దొండకాయ 40 వంకాయ 40 అల్లం 120 వెల్లుల్లి 160 -
ఉద్యానం... అధ్వానం
● అస్తవ్యస్తంగా ఉద్యాన శాఖ పనితీరు ● ఐదు మండలాలకు ఒక్కరే హార్టికల్చర్ అధికారి ● తెగుళ్ల బారిన మిర్చి పంట ● దిక్కుతోచని స్థితిలో పంటను పీకేస్తున్న రైతులు ● సలహాలు, సూచనలు ఇచ్చే వారే కరువు ● హెచ్వోల కొరతతో పత్తా లేని ఉద్యాన శాఖ అధికారులు ఒక్కరే అధికారి.. హెచ్వోల కొరత – బి.రవీంద్రబాబు, డీడీ, ఉద్యాన శాఖ, గుంటూరు జిల్లా -
నగర పాలక సంస్థలో ఆర్ఐ బదిలీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు ఇటీవల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అల్లుడికి చెందిన ఓ హాస్పిటల్కి రూ.లక్షల్లో పన్ను తగ్గించారు. దీంతోపాటు లాలాపేటలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్కూ పన్ను తగ్గించడంపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘కోడెల అల్లుడికి కార్పొరేషన్ నజరానా’ పేరిట కథనం ప్రచురితమైంది. హాస్పిటల్ విషయంలో రివిజన్ పిటిషన్ ఫైల్ చూసిన ఆర్ఐ సుబ్బారావు ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన గాంధీ పార్కు నగదును సొంతానికి వాడుకున్నట్లు రుజువు కావడంతో కొద్ది రోజుల క్రితమే సస్పెండ్ అయ్యారు. లాలాపేటలో కమర్షియల్ కాంప్లెక్స్కు పన్ను తగ్గింపు విషయంలో రివిజన్ పిటిషన్ ఫైల్ను ఆర్ఐ కాశయ్య చూశారు. శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా, కాశయ్యను టౌన్ ప్లానింగ్ సెక్షన్ జీ4కు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి ఆర్ఐ కాశయ్యపై గతంలో కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు రావడంతో అదనపు కమిషనర్ ఈ నెల 7వ తేదీన షోకాజ్ నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి కాశయ్యను మార్చని అధికారులు... ఇప్పుడు అకస్మాత్తుగా బదిలీ చేయడం గమనార్హం. బదిలీకి కారణం ఈ ఫిర్యాదు అని చెప్పడం గమనించాల్సిన అంశం. సాధారణంగా పన్ను తగ్గించే అంశం అడ్మిన్, ఆర్ఐ, రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో), డిప్యూటీ కమిషనర్ (డీసీ), అదనపు కమిషనర్, కమిషనర్ వరకు వెళుతుంది. కమిషనర్ నిర్ణయం మేరకు పన్ను తగ్గించాల్సి ఉంటుంది. ఆర్ఐదే బాధ్యత అన్నట్లుగా పరోక్షంగా బదిలీ చేయడంలో మతలబు ఏంటని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఈ రెండు ఆర్ఐ పోస్టులకు గతంలో పని చేసిన వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాశయ్య బదిలీ ఉత్తర్వులు కోడెల అల్లుడికి చెందిన హాస్పిటల్, మరో కాంప్లెక్స్కు పన్ను తగ్గింపుపై ‘సాక్షి’లో కథనం పెద్ద తలకాయలను వదిలేసి ఆర్ఐను వేరే కారణంతో బదిలీ చేసిన అధికారులు -
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల వాలీబాల్ జట్టు ఎంపిక చేసినట్టు కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ అంతర్ కళాశా లల పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో క్రీడాకారుల ఆట తీరు, ఫిట్నెస్, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని 14 మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. జట్టులో ఐ.కళ్యాణ్కుమార్, ఏ.ఉమామహేశ్వరరావు, ఎం.మణికంఠ, జె.నితిన్కుమార్ (కృష్ణవేణి డిగ్రీ కళా శాల, నరసరావుపేట), బి.మనోజ్, పి.శ్రీను, సీహెచ్.కోటి, వి.శంకర్ (వర్సీటీ వ్యాయామ కళాశాల, ఏఎన్యూ), బి.విజయ్కుమార్రెడ్డి, డి.బాలరెడ్డి (బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల), షేక్.ఉస్మాన్ (ధనలక్ష్మీ వ్యాయామ కళాశాల, ముప్పాళ్ల), కె.శేఖరబాబు (ఏపిఆర్డిసీ, నాగార్జునసాగర్), బి.వెంకటేష్ (కేబీఆర్ కళాశాల, నరసరావుపేట), వై.అశోక్బాబు, (వేద ఫార్మసీ కళాశాల) ఎంపికయ్యారు. స్టాండ్బైగా వై.కుమార్, ఎన్.సబీర్, సయ్యద్ అబ్బాస్, కె.భానుప్రకాష్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికై న జట్టు డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జేఎన్టీయూ కాకినాడలో నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాల యాల టోర్నమెంట్లో ఏఎన్యూ కు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, సెలక్షన్ కమి టీ సభ్యులు డాక్టర్ పి.గౌరీశంకర్, డాక్టర్ పి.శ్రీనివాసరావు, జె.ప్రేమ్కుమార్, వర్సీటీ పరిశీలకుడు డాక్టర్ డి.సూర్యనారాయణరావు, కళాశాల వైస్ప్రిన్సిపల్ ఎంఆర్కె సతీష్బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు. -
‘కిసాన్ పక్వాడా’తో రైతులకు చేయూత
గుంటూరు రూరల్: బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం పెదనందిపాడులో కిసాన్ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఇనుమెల్ల వి.ఎల్.శ్రీధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులకు బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘రైతు బలమే దేశ బలం – రైతు అభివృద్ధి దేశ అభివృద్ధి‘ అనే నమ్మకంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతోందని చెప్పారు. జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేష్ కుమార్ డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాల ప్రాధాన్యాన్ని వివరించారు. రైతులు సులభంగా, సౌకర్యవంతంగా రుణాలు పొందడంలో, డిజిటల్ లావాదేవీలు నిర్వహించడంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. చిన్న పొదుపుల ప్రాముఖ్యతను వివరించారు. రికరింగ్ డిపాజిట్ ద్వారా పొదుపు అలవాటు చేసుకోవాలని ప్రోత్సహించారు. గుంటూరు సంయుక్త వ్యవసాయ సంచాలకురాలు ఎం. పద్మావతి మాట్లాడుతూ డిమాండ్ ఆధారిత పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రుణ పథకాలు కిసాన్ క్రెడిట్ కార్డ్, పంట – అనుబంధ కార్యకలాపాల ఫైనాన్స్, సూక్ష్మ బీమా, సామాజిక భద్రత పథకాలు తదితర వివరాలను ప్రాంతీయ మేనేజర్ ఎస్.కె.కిరణ్ రెడ్డి రైతులకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా రైతులకు అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎస్హెచ్జీఎస్, ఇతర పథకాలను గుంటూరు ఎల్డీఎం రత్న మహిపాల్రెడ్డి, నాబార్డ్ డీడీఎం జి.శరత్బాబు, గుంటూరు డీఆర్డీఏ డీపీఎం కేశవ్ కుమార్ వివరించారు. బురక్రథ రూపంలో బ్యాంక్ ఉత్పత్తులు, సేవలను వివరించే సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పథకాల కింద రైతులకు రూ. 60.25 కోట్ల విలువైన రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుబ్రహ్మణ్యం, పెదనందిపాడు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని
మేడికొండూరు: జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చిరతనగండ్ల అనూష ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.జయప్రద తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన స్కూల్ గేమ్స్లో అండర్–14 రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో విద్యార్థిని పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు టి.వాణి సునీల, కె.బాలకృష్ణ తెలిపారు. అనూషను గ్రామ సర్పంచ్ పూల నాగమణి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ షేక్ ఆదాం ఉపాధ్యాయులు అభినందించారు. గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరంలో గల కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక మేనేజ్మెంటు సదస్సు (సంకల్ప్ 2025) గోడ ప్రతులను గురువారం కళాశాల చైర్మన్ కళ్లం మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప్ పేరుతో ఏటా విద్యార్థుల్లో నైపుణ్యతలను మెరుగు దిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఎం. ఉమాశంకరరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 19, 20వ తేదీల్లో సంకల్ప్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. సాంకేతిక, మేనేజ్మెంటు విభాగాలలో ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం ద్వారా పెద్దఎత్తున పారితోషికాలు కూడా అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.ఎస్.బి. రెడ్డి, కళ్లం భరద్వాజ, సంకల్ప్ నిర్వహణ సంచాలకులు హనుమంత్ప్రసాద్, కళాశాల డీన్ ఉపాధి కల్పన విభాగం పీఎల్ మాధవరావు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో పదిశాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం గురువారం తెలిపారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ వయా మంగళగిరి అమరావతి బస్సు చార్జి గతంలో రూ. 870లు ఉండగా, ఇప్పుడు రూ. 790కి తగ్గిందన్నారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ వయా విజయవాడ అమరావతి బస్సుల చార్జీ గతంలో రూ. 970లు ఉండగా, రూ. 880లకు తగ్గించినట్లు వెల్లడించారు. గుంటూరు – బీహెచ్ఈఎల్ వయా మంగళగిరి ఇంధ్ర బస్సు చార్జీ రూ. 700 ఉండగా, డిసెంబరు 1 నుంచి రూ. 640 తగ్గిందన్నారు. తెనాలి – బీహెచ్ఈఎల్ ఇంధ్ర బస్సు రూ. 710, తెనాలి – విశాఖపట్నం బస్సు చార్జీ రూ. 850లకు తగ్గించినట్లు తెలిపారు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాకేష్ అనే యువకుడు బాలికను గత రెండు నెలల క్రితం మాయమాలు చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్పొరేషన్ నజరానా
అధికారంలో ఉన్నారని తెలుగుదేశం నేతలకు, వారి సంబంఽధీకులకు లబ్ధి చేకూర్చేందుకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు కోడెల అల్లుడికి ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకు పావులు కదిలాయి. ఎప్పుడో పదేళ్ల క్రితం కట్టిన ఆసుపత్రి భవనాల కొలతలు ఇప్పుడు మారాయి. ఆస్తిపన్ను రూ.లక్షల్లో తగ్గిపోయింది. ఇటు టీడీపీ వారు, అటు అధికారులు ప్రజాధనం పట్టపగలే దోచుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కోడెల అల్లుడికి సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అల్లుడికి కార్పొరేషన్ నజరానా అందించింది. శివప్రసాద్ అల్లుడికి చెందిన హాస్పిటల్కు సంబధించిన ఆస్తి పన్నును ఆరు నెలలకు సుమారు రూ. 2,69,519 లక్షల వరకు తగ్గించి తమ స్వామి భక్తిని అధికారులు చాటుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆస్తి పన్నులు పెంచే కార్యక్రమాలను చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ రివిజన్ పిటిషన్ పేరుతో పన్నును ఏకంగా రూ.లక్షల్లో కార్పొరేషన్ అధికారులు తగ్గించడం గమనార్హం. రూ. రెండున్నర లక్షలకుపైనే.. గుంటూరు నగరంలో కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ వద్ద కోడెల శివప్రసాద్ అల్లుడికి చెందిన ఓ హాస్పిటల్ ఉంది. సిల్ట్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్తోపాటు మరో నాలుగు ఫ్లోర్లు ఉన్న ఈ భవనానికి ఆరు నెలల కాలానికి సుమారు రూ.4.50 లక్షల వరకు ఆస్తిపన్ను ఉంది. కొద్ది సంవత్సరాలుగా పన్ను కడుతూ వచ్చారు. ఇప్పుడు సెల్లార్, సిల్ట్ కొలతలు తప్పు ఉన్నాయని, నాలుగో అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని పిటిషన్ పెట్టుకున్నారు. ఇది సాధ్యం కాదని అధికారులు తిరస్కరించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోగా చట్టం అనుమతించకపోయినా మళ్లీ కొలతలు వేసి పన్ను తగ్గించేయడం వివాదాస్పదంగా మారింది. వేసినవి కూడా కాకి లెక్కలుగా ఉన్నాయి. సెల్లారు, సిల్ట్కు చదరపు అడుగు విలువ కేవలం రూ.900గా చూపించగా, పై అంతస్తులకు సుమారు రూ.1,400 మాత్రమే చూపించి ఆస్తి విలువ గణనీయంగా తగ్గించేశారు. దీని ఆధారంగా పన్ను తగ్గించేశారు. గతంలో రూ.4,58,772 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.1,89,253 కు తగ్గించేశారు. ఈ సంవత్సరంలో పన్ను తగ్గించమని కోరిన వెంటనే ఎటువంటి పిటిషన్ లేకుండానే కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది వెళ్లి కొలతలు పరిశీలించి పన్నును తగ్గించడం గమనార్హం. పదేళ్ల తర్వాత మారిన కొలతలు సాధారాణంగా ఒక ఆస్తి పన్నును తగ్గించాలంటే రెవెన్యూ సిబ్బంది ఎన్నో కోర్రీలు పెట్టి దానిని తగ్గించకపోగా.. పన్నును పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ మాజీ స్పీకర్, టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్కు చెందిన అల్లుడి హాస్పిటల్ కావడంతో ఆగమేఘాలపై పన్నును తగ్గించేశారు. దశాబ్దానికిపైగా పన్ను చెల్లిస్తుండగా, ఇప్పుడు రివిజన్ పిటిషన్ పేరుతో ఎలా తగ్గించారన్నది ఇక్కడ ప్రశ్న. అప్పట్లో భవనానికి ఇప్పుడు కొలతలు ఎలా తగ్గిపోయాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మున్సిపల్ అదనపు కమిషనర్ చల్లా ఓబులేశును ‘సాక్షి’ వివరణ అడగగా, సదరు ఆసుపత్రి యాజమాన్యం రివ్యూ పిటిషన్ ప్రకారం కొలతలు వేయగా, మార్కెట్ విలువలను బట్టి పన్నులను సరిచేశామని వివరణ ఇచ్చారు. లాలాపేట మెయిన్రోడ్డులో ఓ కమర్షియల్ కాంప్లెక్స్కు రూ. రెండు లక్షల వరకు పన్ను ఉంది. దానిని కూడా రూ.90 వేల వరకు తగ్గించేశారు. రివిజన్ పిటిషన్ పేరుతో నగరంలో పదుల సంఖ్యలో పన్నులు తగ్గించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర అభివృద్దికి ఆస్తి పన్నులే కీలకం. వాటి ద్వారానే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇలా తమకు అనుకూలమైన వారికి రూ.లక్షల్లో పన్నులు తగ్గించుకుంటూ పోతే కార్పొరేషన్కు ఆదాయం ఎలా పెరుగుతుందని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్కు కూడా ఎటువంటి మ్యుటేషన్ చార్జీలు వసూలు చేయకుండానే కంపెనీ పేరు మార్పునకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. -
సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగింపు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తులు డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోగా రాజాగారితోట, గుంటూరులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆయా సెంటర్లలలో స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 0863–2358071 నంబర్లో సంప్రదించాలన్నారు. తెనాలి రూరల్: డ్వాక్రా గ్రూపునకు సంబంధించి బ్యాంకులో నెల నెలా చెల్లించాల్సిన నగదు పూర్తిగా జమ కాకపోవడం, సుమారు రూ. 8లక్షలు పైగా అవకతవకలు జరగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి నందులపేట కవిరాజ పార్కు ప్రాంతంలోని ఓ డ్వాక్రా గ్రూపునకు మూడేళ్లగా క్రితం రూ. 15 లక్షల రుణం మంజూరైంది. సభ్యులందరూ ప్రతి నెల క్రమం తప్పకుండ 36 నెలల పాటు వాయిదాలు చెల్లించుకుంటూ వచ్చారు. అక్టోబరుతో వాయిదాల గడువు ముగియడంతో తమకు రావాల్సిన పొదుపు మొత్తం గురించి వాకబు చేయగా బ్యాంకుకు ఇంకా రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉందని సభ్యులకు తెలిసింది. దీంతో అవాకై ్కన సభ్యులు జిల్లా కలెక్టరుకు, డీఎస్పీకి, సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం రాత్రి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారిస్తున్నారు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,225 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కి 196 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్కు 388 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 30, పశ్చిమ కాలువకు 0, నిజాంపట్నం కాలువకు 87, కొమ్మూరు కాలువకు 1,983 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి విడుదల చేశారు. -
అపూర్వ సాయం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమవంతు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్ది, ఇప్పుడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా వచ్చిన డాక్టర్ సుందరాచారి కళాశాల అభివృద్ధిపై దృష్టి సారించారు. కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.7.50 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులు సైతం మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. నాడు గుంటూరు జీజీహెచ్లో... సుందరాచారి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఒకేసారి నాలుగు పీజీ సీట్లు వచ్చేలా చేశారు. పలుమార్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిట పీజీ పరీక్ష ఫలితాల్లో ఆయన మార్గదర్శకంలో పీజీ వైద్యులు సత్తా చాటారు. ఉమ్మడి ఏపీలో ఎక్కడా లేనివిధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల కోసం చిలకలూరిపేటకు చెందిన ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ కోయ రామకోటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ అమెరికా సహాయంతో రూ. కోటితో 2015లో స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేయించారు. స్లీప్ల్యాబ్ను సైతం నాట్కో ఫార్మా సహాయంతో 2017లో అందుబాటులో తెచ్చారు. 2018 జూన్లో న్యూరాలజీ వైద్య విభాగానికి ఐఎస్ఓ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ఉత్తమ బోధనకు 2023లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 2022లో ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీగా ఎంపికయ్యారు. కళాశాల అభివృద్ధిపై దృష్టి ప్రిన్సిపాల్ చొరవతో గుంటూరు వైద్య కళాశాల 1999 బ్యాచ్కు చెందిన డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్రులు రూ. 80 లక్షల విరాళంతో రెండు బస్సులు అందించారు. హాస్టళ్లలో క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడా మైదానాలు, సామగ్రిని మరికొందరు దాతలు ఇచ్చారు. అంతర్గత రోడ్లను 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ నలమోతు శరత్చంద్రకుమార్ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం ఇచ్చిన రూ. 6 లక్షల విరాళంతో నిర్మించారు. కళాశాల ప్రధాన ద్వారాన్ని పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ చెరుకూరి పవన్కుమార్ ఇచ్చిన రూ. 7 లక్షలతో నిర్మించారు. ప్రముఖ స్పెయిన్ సర్జన్, గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థి డాక్టర్ జె.నరేష్బాబు కుటుంబం రూ. 25 లక్షలు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి రూ. 10 లక్షలు, డాక్టర్ శారద రూ. 6 లక్షల విరాళం ఇవ్వడంతో కళాశాలలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 1980 బ్యాచ్కు చెందిన పూర్వ వైద్య విద్యార్థులు రూ. 60 లక్షలు విరాళం ఇవ్వడంతో పలు లెక్చర్ గ్యాలరీలను ఆధునికీకరించారు. దాతల సహాయంతో రూ. 10 లక్షలతో ఎగ్జామినేషన్ హాలు ఏర్పాటు చేశారు. వాటర్ కూలర్లు, పలు విభాగాల ఆధునికీకరణ పనులకు పలువురు దాతల సహకరించారు. కళాశాలలో విద్యుత్ వ్యవస్థ మెరుగు, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు, చెట్ల సంరక్షణ, గెస్ట్ ఫ్యాకల్టీ భవనం ఆధునికీకరణ, లైబ్రరీ ఆధునికీకరణ, విగ్రహాలతోపాటు ఫౌంటేన్ల అభివృద్ధి, వైద్య విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రత్యేక వెల్నెస్ క్లినిక్ను ఏర్పాటు వంటివి చేయించారు. కళాశాల అభివృద్ధికి దాతల సాయం మరువలేనిది. సంస్థను దేశంలో టాప్ పది కళాశాలల్లో నిలబెట్టడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పూర్వ వైద్య విద్యార్థులు, నగరానికి చెందిన పురప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు. బోధనలోనూ, వసతుల్లోనూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతా. మాతృ సంస్థకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. – డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, ప్రిన్సిపాల్ -
‘కిల్కారి’ నంబరును గర్భిణుల ఫోన్లలో సేవ్ చేయాలి
గుంటూరు మెడికల్: కిల్కారి కాల్ వచ్చే 911600403660 నంబరును గర్భిణులు, బాలింతల మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా సేవ్ చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి చెప్పారు. అలా నంబరు సేవ్ చేసినప్పుడు మాత్రమే గర్భిణులు తమకు ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కిల్కారి సేవలపై సమీక్ష జరిగింది. సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కిల్కారి కాల్స్ అందరికీ రావాలంటే ఆర్సీహెచ్ పోర్టల్లో గర్భిణుల వివరాలు సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. కిల్కారి కాల్ వచ్చినప్పుడు పూర్తిగా సమాచారాన్ని వినే గర్భిణులు, బాలింతల సంఖ్యలో జిల్లాలో పెరిగేలా సూపర్వైజర్లు క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాల్నారు. ఏఎంసీ, పీఎంసీ సేవలు హైరిస్క్ గర్భం సూచనలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, బర్త్ ప్లాన్, రక్తహీనత, ప్రమాదకరమైన లక్షణాలు, టీకాలు, ఇలా ప్రతి గర్భిణీ, బాలింతకు కావాల్సిన ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని కిల్కారి కాల్ ద్వారా పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కిల్కారి కాల్ కార్యక్రమాన్ని గర్భిణి, బాలింతల కోసం ప్రవేశపెట్టిందన్నారు. డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇ.అన్నపూర్ణ, ఎన్సీడీ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డీపీహెచ్ఎన్ఓ ఇన్చార్జి డాక్టర్ కె.ప్రియాంక, రవికుమార్, సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి -
వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరు కారు
సచివాలయ ఏఎన్ఎంలు గుంటూరు మెడికల్: సచివాలయ ఏఎన్ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖ విధులకు పరిమితం చేసేవరకు వారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి విధులకు హాజరు కారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. పలువురు సచివాలయ ఏఎన్ఎంలు ఏపీ ఎన్జీఓ నేతలను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏఎన్ఎంలకు ఇతర విధులు అప్పజెప్పకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి అమలులో విఫలమవుతున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము అండగా ఉంటామన్నారు. గుంటూరు అర్బన్ సచివాలయాల పరిధిలోని ఏఎన్ఎంలు వారి విభాగంలోని విధులనే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అనేక సర్వేలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించడానికి డీఎంహెచ్ఓ జోక్యం చేసుకుని కేవలం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విధులు మాత్రమే ఏఎన్ఎంలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పలుమార్లు విన్నపాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి సచివాలయ ఏఎన్ఎంలు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన విధులకు హాజరు కారని ఘంటసాల శ్రీనివాసరావు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్సుందర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి, కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్కుమార్, శ్రీధర్రెడ్డి, కృష్ణకిషోర్, అబ్దుల్ కరీం, శేషగిరిరాజు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలి.. పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలని ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగాలని ఏపీ ఎన్జీజీవో కార్యవర్గం తీర్మానించింది. ఈమేరకు గురువారం గుంటూరులోని ఏపీ ఏన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న నగరశాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికై న నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 20 ఈసీ సభ్యుల కో–ఆప్షన్ ఎన్నిక నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్కుమార్ ప్రవేశపెట్టిన అజెండా తీర్మానాలపై చర్చ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన విధులు మాత్రమే అప్పజెప్పే విధంగా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లాలని తీర్మానించారు. ఎన్జీవో సమాచారం, సభ్యత్వం పెంపొందించాలని, రావాల్సిన బకాయిలు, జీఎస్ సరెండర్ లీవుల గురించి చర్చించారు. నూతనంగా ఎన్నికై న నగర అధ్యక్ష, కార్యదర్శులను జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూల్ షరీఫ్ తదితరులు అభినందించారు. ఉద్యోగల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు పోరాట పటిమతో నగర నూతన కార్యవర్గం ముందుకు వెళ్లాలని నేతలు సూచించారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం భట్టిప్రోలు: బ్రహ్మ విద్యాశ్రమంలో 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గీతా జ్ఞాన కర్పూర యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు బూర్లె అరుణ కుమారి తెలిపారు. పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2100 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు రెండు వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 582.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,272 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు నియామకం
గుంటూరు మెడికల్: బీజేపీ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.వి.సుబ్బారావును నియమిస్తూ పార్టీ రాష్ట్రకార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి, తనకు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామికి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి అంకితంమవుతానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ప్రధాన కార్యదర్శి మధుకర్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
తాడికొండ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజధానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు తెలిపారు. తుళ్లూరు పరిధిలోని నేలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. తెలుగు మహాసభలకు ఆహ్వానం గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీ నరసింహను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారని తెలిపారు. పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరగనున్న పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేపట్టినట్లు గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఏఎన్యూలో స్పాట్ అడ్మిషన్లు జరగకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించిన సీఈఓ పేరుతో ఈ నెల 26వ తేదీన సాక్షిలో కథనం వెలువడింది. దీంతో సీఈఓ ఆలపాటి మాట్లాడుతూ అన్ని పరీక్ష పేపర్లకు ఫీజు రూ.980 చొప్పున డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఫైరింగ్ సమయంలో వేటకు వెళ్లొద్దు బాపట్ల టౌన్: ఎయిర్ఫోర్స్ అధికారులు ఫైరింగ్ చేసే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. గురువారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదన్నారు. సూర్యలంక ఎయిర్ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు. -
ఎండుతున్న పంటలు
నరసరావుపేట రూరల్: కాలువ మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుప్పగంజి వాగు మళ్లింపు పథకంలోని వందల ఎకరాల చివరి భూములకు నీరు అందక పంటల ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎండుతున్న పంటలను రక్షించుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంట కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. కుప్పగంజి వాగు నీటి మళ్లింపు కాలువ పరిధిలో మండలంలోని కేఎం అగ్రహారం, గుంటగార్లపాడు, రంగారెడ్డిపాలెం, ములకలూరు, జొన్నలగడ్డ తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాలు సాగులో ఉంది. ఏళ్లతరబడి మరమ్మతులు లేవు... కేఎం అగ్రహారం నుంచి ప్రారంభమయ్యే కాలువ గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. కాలువ పూడికతో నిండిపోవడంతో చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మిరప, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మిరప రైతులు ఎకరాకు రూ.50 వేలు, మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి పెట్టారు. పంటలు ఎండిపోతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో రైతులు కాలువ మరమ్మతు చేపట్టారు. జేసీబీతో పూడికతీత ప్రారంభించారు. కౌలు రైతు సంఘం జిల్లానాయకులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు కొరిటాల గోపాలరావు, కృష్ణారెడ్డి తదితరులు పంటలను పరిశీలించారు. -
సజావుగా ధాన్యం కొనుగోలు చేయాలి
– జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లాలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగేలా వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమైనందున రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం రానున్న వారం రోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సరిపడా గన్నీ బ్యాగులు, వాహనాలను పౌర సరఫరాల అధికారులను సమన్వయం చేసుకుంటూ తహసీల్దార్లు అందుబాటులో ఉంచాలన్నారు. దళారులకు మద్దతు ధరకు కంటే తక్కువగా ధాన్యం అమ్మకాలు జరగకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ సహాయకులతో నిరంతరం జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలన్నారు. వానలు పడతాయనే అధికారుల సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలుగా వారికి తగిన సాయం అందించాలని సూచించారు. ధాన్యం సక్రమంగా కొనాలని పేర్కొన్నారు.


