breaking news
Guntur District Latest News
-
వైద్య విద్యార్థులతో కూటమి సర్కార్ చెలగాటం
పట్నంబజారు: వైద్య విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్. వినోద్ ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా రూ.8,500 కోట్లతో వైద్య విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన ముందుకు సాగారని చెప్పారు. ఏడాది పాలనలో కనీసం విద్యార్థుల కోసం ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం, వారి జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతో వైభవోపేతంగా నడిచిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కూటమి సర్కార్ దుర్బుద్ధితో తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యార్థి సంఘ నేతలు రవి, గంటి, జగదీష్, అజయ్, కోటి, అజయ్, అరుణ్, సన్నీ పాల్గొన్నారు. -
మనవరాలిని చంపిన తాత అరెస్ట్
తాడేపల్లి రూరల్ : మండలంలోని కుంచనపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి మనవరాలిని నీళ్లలోకి విసిరేసి, మృతికి కారణమైన తాతయ్యను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఓ వృద్ధుడు బాలికను తీసుకువచ్చి బలవంతంగా కాలువలోకి విసిరి వేశాడని తెలిపారు. 100కు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కాలువలో గాలించి, బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలికను తాడికొండ మండలం బడేపురానికి చెందిన కూరపాటి హేమగా గుర్తించామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక తాతయ్యను తాడికొండ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలైన హేమ తల్లి, తండ్రి చనిపోయారన్నారు. తాతయ్య మాధవరావు, నాయనమ్మ సుమతి పెంచుతున్నట్లు చెప్పారు. నాయనమ్మ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఈ మధ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నారు. హేమకు కూడా అక్కడే వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు అనారోగ్యం కుదుటపడదని చెప్పడంతో తాతయ్య, నాయనమ్మ ఆందోళన చెందారు. ఇద్దరికీ మందులు ఖర్చులకు డబ్బులు లేకపోవడం, తాము లేకపోతే మనవరాలు ఏమవుతుందనే ఆందోళనతో కాలువలోకి పడవేసి హత్య చేశాడని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మాధవరావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మృతి నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ -
సీఎం చంద్రబాబు దళిత ద్రోహి
తాడేపల్లి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చులకన భావన ఉంది.. బహిరంగ ప్రాంతాల్లోనే ఎస్సీలను దూషిస్తూ అవమాన పరుస్తున్నారు.. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ సమావేశంలో సింగయ్య మృతిని కుక్కతో పోల్చారని దళిత సంఘ నాయకులు, బీసీ నాయకులు శుక్రవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారని తెలిపారు. బహిరంగ సభల్లో, విలేకరుల సమావేశంలో దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్త సింగయ్య మృతి చెంది వారి కుటుంబం బాధల్లో ఉంటే మృతిని కుక్కతో పోల్చి అవమానించారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులు, బీసీలు జరిగిన సంఘటనపై చాలా బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పోలీస్శాఖ వెంటనే నిజాయితీగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కేసులు పెడుతున్నామని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు గద్దేటి సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎస్టీ నాయకులు లక్ష్మీపతి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూదాల శ్రీను, శ్రీరాంశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నలకుర్తి రమేష్, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షులు బొందిలి నరేంద్ర సింగ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి కలపాల అజయ్, మల్లవరపు సుధారాణి, సుభాషిణి, కొమ్ము చంటి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, కాపు సంఘం నాయకులు మిరియాల రాంబాబు, చిట్టిమల్ల సుబ్బు, దర్శి రమేష్, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. ఎస్సీలంటే చులకన భావన అదే బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు సింగయ్య మృతిని కుక్కలతో పోల్చడం దారుణం ముఖ్యమంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తాం వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు -
కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు: టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. హాస్పిటల్కు వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించే విధంగా పర్యవేక్షిస్తున్నారు. స్పెషలిస్టులతో మాట్లాడి ఎప్పటికప్పుడు నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని అంబటి మురళీకృష్ణతో పాటు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడిని అంబటి మురళీకృష్ణ తీవ్రంగా ఖండించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా టీడీపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. పచ్చగా ఉండే పల్లెల్లో ఎర్రటి రక్తాన్ని చిందిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నడూ చూడని హత్యా రాజకీయాలను నేడు టీడీపీ చేస్తోందని విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అణచివేయడమే లక్ష్యంగా మన్నవ గ్రామంలో కుల రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ స్థానికంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే లక్ష్యం కుల, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే నరేంద్ర మన్నవలో ఒకే సామాజిక వర్గాన్ని అణచి వేయడమే లక్ష్యంగా కుట్ర -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
గుంటూరు మెడికల్: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును శుక్రవారం మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఎప్పటి నుంచో నియోజకవర్గంలో మంచి పేరు ఉందని తెలిపారు. గ్రామంలో అడ్డగోలుగా టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకే త్రీవంగా దాడి చేశారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మెదడు బాగా దెబ్బతిందని, అవయవాలు పని చేయడం లేదని తెలిపారు. టీడీపీ కూటమి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఒక టీమ్ పెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులపై దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మృతి చెందిన సింగయ్య కేసు విషయంలో కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సింగయ్య మృతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కారుకు సంబంధం లేదని చెప్పారన్నారు. మళ్లీ జగన్ కారుపై కేసు పెట్టడంపై కోర్టు కూడా తీవ్రంగా ప్రభుత్వానికి , పోలీసులకు అక్షింతలు వేసిందని తెలిపారు. సింగయ్య మృతి గురించి సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ కుక్కలతో పోల్చారని, ఇది ఎస్సీలను తీవ్రంగా అవమానించటమేనని పేర్కొన్నారు. అనంతపురంలో 13 ఏళ్ల బాలికపై 18 మంది రేప్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఎస్సీలంతా వైఎస్ జగన్ వెంట ఉంటారు కాబట్టి వారిని భయపెట్టేలా, అంతం చేసేలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు దాడి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, రిటైర్డ్ జడ్డితో విచారణ చేయించాలని నాగార్జున డిమాండ్ చేశారు. పోలీసుల సహకారం లేకుండా ఇలాంటి దాడులు జరగవని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యులు -
అల్లూరికి నివాళి
గుంటూరు వెస్ట్: విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక నాజ్ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి త్యాగాలను నేటి యువత నిత్యం మననం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్టెప్ సీఈఓ చంద్రముని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.మురళి, అధికారులు పాల్గొన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో... తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛను అందించేందుకు ప్రజల్లో చైతన్యం నింపి, స్వాతంత్య్ర ఉద్యమానికి దివిటీగా మారిన సమరయోధుడు అల్లూరని కొనియాడారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎవో శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు మోసాలను ఎండగడదాం !
మంగళగిరి టౌన్ /మంగళగిరి: ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని బైపాస్ రోడ్డులో గల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాబు మోసపూరిత హామీలను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వివిధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనను ప్రజలకు వివరించండి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికీ ప్రచారం క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం కార్యాచరణ సిద్ధం అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని వారి తరఫున పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలసి పోరాటం చేస్తాం. నిస్వార్థంగా వైఎస్సార్ సీపీ తరఫున కష్టపడుతున్న కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. వారికి ఏ అవసరం వచ్చినా పార్టీ ముందుంటుంది. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన శ్యామ్ సునీల్ కొల్లూరులో రేషన్ బియ్యాన్ని ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకొని రాత్రి సమయంలో తరలించటానికి ప్రయత్నించాడు. సుమారు 76 బస్తాల రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరు మండలంలోని రైస్ మిల్లుకు తరలించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని వివిధ కంపెనీలకు చెందిన గోతాలలో ప్యాక్ చేసి ఆటోలో తరలించే యత్నం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన శ్యాం సునీల్, బుల్లెద్దు శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. -
హాస్టల్ వార్డెన్కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు. వెంటనే వార్డెన్కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు. ఎస్ఐ వెంకటాద్రి దీనిపై మాట్లాడుతూ.. కొల్లిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్.కిషోర్ బాబు(12), వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్ (13), రేపల్లె ఓల్డ్ టౌన్కు చెందిన ఎ.జితేంద్ర దర్శన్ (14) స్థానిక నాజరుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని తెలిపారు. స్కూలుకు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు చెప్పారు. వెంటనే వార్డెన్కు సమాచారం అందించి బాలలను అప్పగించినట్లు తెలిపారు. వార్డెన్ ఆదినారాయణను వివరణ కోరగా.. వారిలో ఇరువురికి ఇంకా స్కూలులో అడ్మిషన్ కాలేదన్నారు. హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని, చెప్పులు కొనుక్కునేందుకు ముగ్గురు స్టేషన్ సమీపంలోని షాపునకు వచ్చారన్నారు. అక్కడి నుంచి నీరు తాగేందుకు స్టేషన్లోకి వెళ్లగా పోలీసులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. -
ఎల్ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు జూలై 9వ తేదీన ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమ్మె జరగనుందని తెలిపారు. 85 శాతానికిపైగా ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్సూరెనన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెలో భాగస్వామిగా ఉందన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74 శావాతం నుంచి వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజల పొదుపును ప్రోత్సహించాలని, విదేశీ పెట్టుబడులు ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని చెప్పారు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయం దేశ ప్రయోజనాలకు హానికరం అని స్పష్టం చేశారు. ఎల్ఐసీలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, క్లాస్ 3, 4 క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్లకు తరలించడం నష్టదాయకమని పేర్కొన్నారు. ఎల్ఐసీలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఫెడరేషన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం పాలసీదారులపై ఆర్థిక భారాన్ని మోపడమేనని, పైగా ఇది ప్రజలకు బీమాను దూరం చేయడమేనన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. ఈ సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలిపాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఆర్వీఎస్ శ్రీనివాస్, డి.సైదులు, ఐ.వెంకట్రావు, శివరామకృష్ణారావు, రాజశేఖర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ -
ఇసుక రీచ్లలో లారీలు నడపలేం
ప్రత్తిపాడు: అధికారుల వేధింపులు తాళలేమని, ఇసుక రీచ్లలో లారీలు నడపలేమని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గుంటూరు అమరావతి రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో లారీలను నిలిపివేసి జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ అధికారులు ఓవర్ టన్నేజీ తోలేందుకు అభ్యంతరం తెలుపుతున్నారని, అందుకు సమ్మతమేనని, కానీ దీనివల్ల వినియోగదారుడికి రూ.700కే ఇసుక అందించగలమని పేర్కొన్నారు. గతంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, అందుకు అంగీకరించారని చెప్పారు. ఇప్పుడు ఆర్టీవో అధికారులు జరిమానా విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లారీలకు ఈఎంఐలు కట్టలేక, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక ఇసుక లారీలను ఆపివేసినట్లు తెలిపారు. ఇసుక రీచ్లలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 40 టన్నులు ఇసుక ఎత్తి 20 టన్నులకే బిల్లులు ఇస్తున్నారని, ఆర్టీవో అధికారులు వాహనాలను నిలిపి ఓవర్ టన్నేజీ కింద రూ. 50 వేలు ఫైన్ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో లారీ ఓనర్లు, డ్రైవర్లు ధర్నా -
చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!
పట్నంబజారు: గుంటూరు నగరం వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తుతోంది. నగరంలో సుమారు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బుల్లెట్ల సంఖ్య 40 వేలకు పైమాటే. లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు రోడ్డు, అరండల్పేట, బ్రాడీపేట, ఈస్ట్ పరిధిలోని కొత్తపేట, ఎత్తురోడ్డు సెంటర్, నల్లచెరువు, ఆర్టీసీ బస్టాండ్, నాజ్సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డు, ఓల్డ్క్లబ్ రోడ్డు, అరవై అడుగుల రోడ్డు ప్రాంతాల్లో విచ్చలవిడిగా బైక్ సైలెన్సర్లు మార్చి ఆకతాయిలు ఇబ్బందులు పెడుతున్నారు. అధిక శబ్దాన్నిచ్చే హారన్లు, సైలెన్సర్లతో దూసుకెళ్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. వాహనం ఏదైనా కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ తప్ప మరొకటి వాడకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. కేంద్ర మోటార్ వెహికల్ (ఎంవీఐ) చట్టం 1988 రూల్ నెంబర్ 120 ప్రకారం వాహనాల్లో వాడే సైలెన్సర్ నిర్దిష్ట నాయిస్ లిమిట్ కంటే ఎక్కువ శబ్దం చేయకూడదు. భారతీయ శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం (నాయిస్ పొల్యూషన్, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) 2000 ప్రకారం భారీ సౌండ్ వచ్చే సైలెన్సర్లు నిషిద్ధం. ఎంవీఐ రూల్ 190(2) ప్రకారం చట్టబద్ధమైన రీతిలో వాహనాలు నడపకపోతే రూ.1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఎన్విరాల్మెంట్ ప్రోటెక్షన్ యాక్ట్ 1986, నాయిస్ పొల్యూషన్ రూల్స్ ప్రకారం సైలెన్సర్ల నుండి వచ్చే శబ్దం నిబంధనలకు లోబడి ఉండాలి. ఆరోగ్యానికి చేటు శబ్ద కాలుష్యం 100 డెసిబుల్స్కు మించి ఉండటం వలన వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. శబ్ద కాలుష్యం వలన ఆరోగ్యానికి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులకు హాని కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుమతులు లేని మార్పులు ట్రాఫిక్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. పోలీసులకు సదరు వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంది. ఇన్సూరెన్స్ క్లైయిమ్ తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం పలు సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) రద్దు చేయటంతోపాటు వాహనాన్ని సీజ్ కూడా చేయొచ్చు. కనీస తనిఖీలు తూచ్... రూ.15 వేల నుంచి రూ. 40 వేల వరకు విలువైన సైలెన్సర్లను ఆకతాయిలు వాడుతున్నారు. మరోవైపు నగరంలో వీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను విక్రయించే వ్యాపారులు, దుకాణాదారులు, మెకానిల్లపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ఇలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బైక్ సైలెన్సర్లు మారుస్తున్న ఆకతాయిలు రహదారులపై తిరుగుతూ భారీ శబ్దాలతో హల్చల్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వ్యాపారులు కనీస చర్యలు తీసుకోవడంలో పోలీసుల ఉదాసీనత భరించలేని భారీ శబ్దాలతో బుల్లెట్, ఇతర ద్విచక్రవాహనాలపై ఆకతాయిలు హల్చల్ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లేవారే కాదు.. ఇళ్లలోని వారి చెవులు కూడా చిల్లులు పడేలా, గుండె గుభేల్మనేలా దూసుకుపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో శబ్ద కాలుష్యం కలిగించేలా బైక్ సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా వాహనాలు సీజ్ చేయటంతోపాటు కోర్టుకు హాజరుపరుస్తాం. పరిమిత స్థాయికి మించి సైలెన్సర్లు ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధం. సైలెన్సర్లను విక్రయించే వారితోపాటు వాహనాలకు అమర్చుకునే వారిని కూడా ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తిస్తాం. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. శబ్దకాలుష్యం లేకుండా చూస్తాం. – ఎం. రమేష్, డీఎస్పీ, ట్రాఫిక్ విభాగం, గుంటూరు -
మన్నవ సర్పంచ్పై విచక్షణారహితంగా దాడి
-
మోకాళ్లపై కార్మికుల నిరసన
మంగళగిరి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. మంగళగిరి నగర పరిధిలోని ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వై. కమలాకర్, ఎం. బాలాజీ, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, కేదారనాథ్, దుర్గారావు, ప్రకాష్, రాము పాల్గొన్నారు. -
భూముల సమీకరణ ఉపసంహరించుకోవాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ప్రభుత్వం రాజధాని కోసం మరో దఫా 44వేల ఎకరాలు భూమిని సమీకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబూరావు మాట్లాడారు. 11 సంవత్సరాల కిందట తీసుకున్న 34వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములతో కలిపి 54వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోలేదని పేర్కొన్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారని, అది ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. రాజధాని కొలిక్కి రాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇప్పుడు వేల ఎకరాల భూములు సమీకరించడం సబబు కాదని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.న్భావన్నారాయణ, ఈమని అప్పారావు, కె.నళీనికాంత్, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు -
ఖరీఫ్లో ‘ముంపు’ ముప్పు
రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పాలకులు, అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్కు ముందే డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రేపల్లె సబ్ డివిజన్లో ఇలా... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఆర్ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. నియోజకవర్గంలో34,060 హెక్టారులలో ఖరీఫ్లో వరి సాగు అవుతుంది. వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. పంట చివరి దశ నవంబర్, డిసెంబరు మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది. -
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే !
ప్రత్తిపాడు:రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రత్తిపాడు వైఎస్సార్ కాలనీలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చల్లగిరి నాగరాజు కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు రైతు నాగరాజు పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు, కౌలు రైతు కార్డు లేకపోవడం, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ప్రైవేటు సంస్థల నుంచి వందకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎకరం ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, తిరిగి నూతనంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పొగాకు సాగు చేసిన 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు కె. ఆదినారాయణ, నల్లమోతు రాజేంద్ర ఉన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబానికి పరామర్శ -
బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: కుంచనపల్లి జాతీయ రహదారిపై గల బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి బాలికను నీటిలోకి విసిరేసి హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే బుధవారం తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఓ మహిళ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు మూడు గంటలు కష్టపడి బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వెంటన్ నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్, పెదకాకాని సీఐ, ఎస్ఐలతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుంచనపల్లి బ్రిడ్జి వద్ద, జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తి నడిపించుకుంటూ బ్రిడ్జి ఎక్కినట్లు నమోదైంది. మృతి చెందిన బాలిక, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న బాలిక ఒకరే కావడంతో ఫొటోలను కృష్ణా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు పంపారు. వివరాలు సేకరించాలంటూ కోరారు. తాడికొండ మండలం బడేపురానికి చెందిన పాపగా గుర్తించడంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించా రు. పేరు కూరపాటి హేమ అని, మతిస్థిమితం లేదని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాపను పెంచలేక తాతయ్య ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి తోసిన వ్యక్తి సరిగ్గా కనిపించకపోవడంతో పాటు లుంగీ ధరించి ఉన్నాడు. హత్య చేసింది తాతయ్య లేక ఎవరన్నా ఉన్నారనే విషయాలను లోతుగా తాడేపల్లి సీఐ వీరేంద్ర దర్యాప్తు చేశారు. చివరికి తాత కూరపాటి మాధవరావే కాల్వలోకి తోసేశాడని పోలీసులు నిర్ధారించారు.ప్రత్యేక దృష్టి సారించిన డీఎస్పీ 24 గంటల్లోపు వివరాల సేకరణ -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను పోలిన నియామక పత్రాలను సృష్టించి, బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాంజలి సంస్థ పేరుతో కొంత మంది వ్యక్తులు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, యోగా టీచర్లు, అటెండర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తప్పుడు నియామక ఉత్తర్వులను సృష్టించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా విద్యాంజలి సంస్థ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులోని జెడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ట్రైనర్ను నియమిస్తున్నట్లుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం పంపుతున్నట్లుగా సిద్ధం చేసిన నియామక ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. జెడ్పీ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ నియామక విషయమై సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇదంతా బోగస్ అని, ఎవ్వరూ నమ్మవద్దని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని సమాచారం పంపారు. ప్రధానోపాధ్యాయులు కూడా తప్పుడు నియామక ఉత్తర్వులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఢిల్లీలోని విద్యాంజలి సంస్థ పేరుతో నియామక ఉత్తర్వులు నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచన -
ప్రగతి.. అధోగతి
తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలి జిల్లాలోని ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ. అభివృద్ధిలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుందని నమ్మబలికారు. మున్సిపల్ నిధులతో కొన్ని పనులను ఆర్భాటంగా ఆరంభించారు. ఏడాది తర్వాత చూస్తే బిల్లుల చెల్లింపు సున్నా...కొత్తగా ఆమోదం తెలిపిన పనులకు నెలలు గడుస్తున్నా టెండర్లూ పిలవడం లేదు. కౌన్సిలర్ల ఆందోళన ప్రభుత్వ విధానంపై మున్సిపాలిటీలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి కూడా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతోనే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రకటించడం గమనార్హం. రూ.8.50 కోట్ల బిల్లులు పెండింగ్ పట్టణంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 105 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.8.50 కోట్ల బిల్లులను మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగలేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ బ్యాంకు ఖాతాల్లో నిధులున్నా నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. పేరుకే అజెండాలో నిధులు ప్రతి నెలా జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారులు వివిధ అభివృద్ధి పనులను అజెండాలో పొందుపరుస్తున్నారు. కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్నప్పటికి వాటిలో ఎక్కువ భాగం టెండర్ల దశకు వెళ్లడం లేదు. ఇందుకు నిధుల కొరతను సాకుగా అధికారులు చూపుతున్నారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై కౌన్సిలర్ల నిరసనతో వాడివేడిగా కొనసాగింది. సుమారు ఎనిమిది నెలలు గడచినప్పటికీ, ఇప్పటికీ టెండర్ల దశకు పనులు చేరుకోకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. తెనాలి పట్టణంలో రూ.7.70 కోట్ల విలువైన 46 పనులను చేపట్టేందుకు కౌన్సిల్ అనుమతించినా, ఆయా పనులు ఇప్పటివరకు టెండర్ల దశకు వెళ్లలేదు, కౌన్సిల్లో అధికారులు ఇదే విషయాన్ని సభ్యులకు తెలియజేశారు. తొలి ఏడాది ఆంధ్రా ప్యారిస్లో కుంటుపడిన అభివృద్ధి చేసిన పనులకు చెల్లింపు నిల్ కౌన్సిల్ ఆమోదించిన పనులకు టెండర్లు పిలవడంలో ఉదాసీనత బిల్లుల చెల్లింపుల్లో మార్పులు కూటమి ప్రభుత్వం ఇటీవల బిల్లుల చెల్లింపుల్లో మార్పులు తీసుకొచ్చింది. గతంలో చేసిన తరువాత వర్కింగ్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ, ఎంఈ, కమిషనర్లు ఆయా పనులను పరిశీలించి బిల్లులు రూపొందించేవారు. అందరి ఆమోదంతో ఆడిట్కు పంపేవారు. వారి అనుమతి తరువాత కాంట్రాక్టర్ల అకౌంట్లో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడా విధానం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నిఽధి యాప్లో బిల్లులను ఆప్లోడ్ చేయాల్సి ఉంది. అధికారుల అనుమతి తరువాత చెల్లింపులు జరగాల్సి ఉంటుంది. అయితే, నిధి యాప్లో లోపాలతో బిల్లులు పెట్టడానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు. యాప్లోని సమస్యలను పరిష్కరించే వరకు బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. -
మోసాన్ని వివరించాలి
కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో సంవత్సరంలోపే ఇచ్చిన హామీలన్నీ 90 శాతం అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వైఎస్.జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పి మోసం చేసింది. అమలు చేసిన పథకాల్లో సైతం కోత విధించింది. అనర్హులుగా తేల్చి పలువురి పెన్షన్లు, తల్లికి వందనం తీసివేశారు. సూపర్సిక్స్ను అమలు చేస్తారా లేదా అన్నది కూడా నమ్మకం లేదు. వైఎస్సార్ సీపీలో జరిగిన మంచిని, కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే మన లక్ష్యం. –మురుగుడు హనుమంతరావు, శాసనమండలి సభ్యులు -
కూటమి విష ప్రయోగం
పెదకాకాని: ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం పంట కాలువల శుభ్రం చేపట్టింది. పెదకాకాని మండలంలో రెండు పంట కాలువల ద్వారా సాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలోని సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్త కాలువ) వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వరకూ 47 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కాలువ పొడవునా 33 గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగు అవుతోంది. నీటి సంఘాల క్కుర్తి ఏటా కాలువల్లో పేరుకు పోయిన గుర్రపుడెక్క, నాచు, తూటికాడ తొలగించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. అయితే, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం నీటి సంఘాల నాయకులకు అప్పగించింది. మంగళగిరి రూరల్ మండలం కాజ శివారు ప్రాంతం నుంచి బుడంపాడు వరకూ 17 కిలోమీటర్ల పొడవునా గుర్రపుడెక్క, తూటికాడ, నాచు తొలగించేందుకు రూ. 24 లక్షలు కేటాయించింది. యంత్రాలు, కూలీలను ఉపయోగించి చేయాల్సిన పనుల్లో నీటి సంఘాల నాయకులు కక్కుర్తి పడ్డారు. డబ్బులు మిగుల్చుకునే పనిలో భాగంగా కాలువ పొడవునా గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో తూటికాడ, గుర్రపుడెక్క ఎండి కుళ్లిపోతోంది. నీరు దుర్వాసన వెదజల్లుతోంది. అధికారుల పర్యవేక్షణ కరువు గుంటూరు చానల్ నీటిని పలు గ్రామాల ప్రజలు తాగునీటికి వినియోగిస్తున్నారు. కలుషిత నీరు వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం గడ్డి మందు పిచికారీ చేయకూడదు. నిధులు మాత్రం మంజూరు చేసి సాగునీటి శాఖ అధికారులు పనుల పర్యవేక్షణ మరిచిపోయారు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు. గుంటూరు చానల్లో గడ్డి మందు పిచికారీ పట్టించుకోని అధికారులు కుళ్లిపోతున్న గుర్రపు డెక్క, తూటికాడ కలుషితమవుతున్న నీరు సాగు, తాగునీరుగా ఉపయోగిస్తున్న పలు గ్రామాల ప్రజలు -
గుంటూరు
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025కూటమి మోసాలపై పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ నరసరావుపేట: క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ పంటల బీమా పథకం పోస్టర్లను కలెక్టర్ పి.అరుణ్బాబు ఆవిష్కరించారు.శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం నగరం: జిల్లేపల్లిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు.సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్సవం తెనాలి అర్బన్: సాల్వేషన్ ఆర్మీ వార్షికోత్స బుధవారం ఐతానగర్లోని చర్చి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గేరా థామస్, సీయోను కుమారిలు జెండా ఎగురవేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేయడం ప్రథమం కాదని తెలిపారు. 1999 నుంచి ఆయన పొత్తులతో గెలిచి ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి, గెలిచిన తరువాత ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తామంటూ చంద్రబాబు పవన్ కల్యాణ్లు హామీ ఇచ్చారని, అమలు చేసే సమయానికి మాట దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమని సూచించారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన గురించి, చంద్రబాబు ఇప్పుడు వైద్యరంగాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో వివరించాలని చెప్పారు. పెన్షన్లు పెంచామని చెప్పి ఎంతమందికి అందడం లేదనేది కూడా వివరించాలని పేర్కొన్నారు. – వై.వి. సుబ్బారెడ్డి , వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ తాడేపల్లి రూరల్: ‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మరొకసారి వంచించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు కూటమి మోసాన్ని, దగాను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి’’నట్లు వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్లోని కుంచనపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో గుంటూరు, పల్నాడు జిల్లాల వైఎస్సార్సీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్రెడ్డి, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భాస్కర్రెడ్డి, మాజీ శాసనసభ్యులు, తెనాలి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు,పల్నాడు జిల్లాల వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న వై.వి. సుబ్బారెడ్డి , వేదికపై పార్టీ నేతలు 7సెల్ఫోనే ఆయుధం న్యూస్రీల్ 1999 నుంచి హామీలు ఇవ్వడం.. మరవడం బాబుకు మామూలే ! వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి టీడీపీ ఇవ్వని వాటిని ఇంటింటికీ వెళ్లి వివరించాలి వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ప్రత్తిపాడు: జిల్లాలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, అరకొర దిగుబడులు, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి విలయ తాండవం.. అన్నీ గట్టెక్కినా చివరి గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలకు తెచ్చిన అప్పులు రెట్టింపు అవుతుండటం, వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూటమి గద్దెనెక్కిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతులు బలిపీఠం ఎక్కారు. అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడి ఊపిరి తీసుకున్నారు. నిండా ముంచేసిన పత్తి, మిర్చి, పొగాకు గత ఏడాది జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటను రైతులు సాగు చేశారు. గులాబీరంగు పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో పత్తి రైతులు నిలువునా నష్టపోయారు. అదేవిధంగా మిర్చిని నల్లి తామర ముంచెత్తడంతో పంటను మధ్యలోనే పీకేయాల్సిన పరిస్థితి. పత్తికి, మిర్చికి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టారు. ఆరుగాలం ఽశ్రమించి పండించుకున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి సాగు చేసి నట్టేట మునిగిపోయిన రైతులు పంటను పీకేసి, నల్లబర్లీ పొగాకు సాగుచేశారు. తీరా పంట దిగుబడులు చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది క్వింటా రూ.15వేల వరకు అమ్మిన నల్లబరీని మొన్నటివరకు రూ.3 వేలకు కూడా కొనే వారులేక నానాఅగచాట్లు పడ్డారు. ప్రస్తుతం పొగాకు కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం చెబుతున్నా వాటి ద్వారా కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. రైతుపేరు ఊరు ఆత్మహత్య చేసుకున్న తేదీ పుట్టా నాగరాజు (40) చినకోండ్రుపాడు 2024 జూన్ 30 ధూపాటి శివయ్య (56) ప్రత్తిపాడు 2024 జూలై 27 గడ్డం గోపాలకృష్ణ (31) చినకోండ్రుపాడు 2024 అక్టోబరు 17 యనగందలు వీరారావు (54) ప్రత్తిపాడు 2024 అక్టోబరు 23 జొన్నలగడ్డ అశోక్ (36) కోయవారిపాలెం 2024 నవంబరు 13 గేరా ప్రసాద్ (32) తిక్కిరెడ్డిపాలెం 2024 నవంబరు 23 వరగాని బాబూరావు (59) వంగిపురం 2025 ఫిబ్రవరి 13 కావూరి శివశంకరప్రసాద్ (46) పుసులూరు 2025 జూన్ 7 చిమటా శేషయ్య (52) కొర్నెపాడు 2025 జూన్ 13 చల్లగిరి నాగరాజు (42) ప్రత్తిపాడు 2025 జూన్ 28 జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలిపీఠం ఎక్కుతున్న అన్నదాతలు భరోసా దక్కక, గిట్టుబాటు ధర లేక బలవన్మరణాలు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతుల ఆత్మహత్య మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయని కూటమి ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించే దిక్కుకూడా లేని దుస్థితి గత ప్రభుత్వం పంటలు సాగు చేసుకునే సమయంలో రైతన్నకు ఆదరువుగా ఉండేందుకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 13,500లను వారి ఖాతాలకు నేరుగా జమ చేసింది. అదే పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం రైతుల ఖాతాలకు జమచేస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కూటమి నేతలు తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. ఈ ఏడాది అదిగో ఇదిగో అని ఊరిస్తూ ఇప్పటి వరకు నగదు జమ చేయలేదు. -
ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చిన జీఎస్టీ
● సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్ ● ఘనంగా జీఎస్టీ దినోత్సవం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జీఎస్టీతో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జీఎస్టీ అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జీఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి. దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. జి ఎస్.టి. చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో జీఎస్టీ ప్రారంభమైన ఏడాది రూ.2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అలాగే గుంటూరులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది ఉండగా, ఇప్పుడు 75 వేల మందికి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ జీఎస్టీతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎండీ దాసరి రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు. సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జీఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహూకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.కార్యక్రమంలో జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మినారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు ఆర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణసాయి పాల్గొన్నారు. -
విజ్ఞాన్, ఏపీ ఫిషరీస్ వర్సిటీల ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ – విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్యూ)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావుమంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్తో విజ్ఞాన్ రిజిస్ట్రార్ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల జలజీవుల ఆరోగ్యం, డయగ్నొస్టిక్స్లో భాగస్వామ్య పరిశోధన చేస్తామన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆక్వా రైతులకు సాంకేతిక శిక్షణ కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా అధ్యాపకులు, సిబ్బంది మార్పిడి, ప్రయోగశాల వనరుల వినియోగం , వివిధ నిపుణుల సేవలు అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టుల కోసం సంయుక్తంగా ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన కోసం నిపుణుల నియామకం, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ప్రాజెక్ట్లను సులభతరం చేయవచ్చునన్నారు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ (ఏపీఎఫ్యూ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ అధ్యాపకులను, విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, డీన్లు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరుబాట
తాడేపల్లిరూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి రూరల్లోని కుంచనపల్లి ప్రాతూరురోడ్లో ఉన్న ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశ ఏర్పాట్లను ఆయన గుంటూరు ఈస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడుతో కలసి పరిశీలించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, మండల, పట్టణ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులతో బాబు ష్యూరిటీ – మోసాలు గ్యారెంటీ అనే అంశంపై సమావేశం నిర్వహిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో బాబు మోసాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశం.. క్యూఆర్ కోడ్ వినియోగంపై ఈ సమావేశం ఉంటుందని తెలిపారురు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, కుంచనపల్లి అధ్యక్షుడు మిరియాల రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నేడు వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల విస్తృత స్థాయి సమావేశం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం వివరాలు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
‘మిషన్ ఉన్నతి’తో రైల్వే ఉద్యోగులకు మేలు
లక్ష్మీపురం: ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, కార్యాచరణ కొనసాగింపునకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పట్టాభిపురం కార్యాలయంలో మంగళవారం ‘మిషన్ ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మిషన్ ఉన్నతి కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా కీలకమైన స్థానాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులు స్వయంగా వారి జూనియర్లకు పదోన్నతి ఉత్తర్వులను అందజేయిస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఆయా విభాగాలలో ఆరుగురు సిబ్బంది ఉద్యోగ విరమణ పొందగా వారి చేతుల మీదుగా వారి తరువాత విధులు నిర్వహించే సిబ్బంది పదోన్నతులు పొందడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్ఎం సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎఫ్ఎం అమూల్య బి.రాజ్ పాల్గొన్నారు. ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె గుంటూరు ఎడ్యుకేషన్: మందుల కన్నా ఆత్మీయ స్పర్శతోనే వైద్యానికి వన్నె తెస్తుందని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులోని చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్, ఇండియన్ ఇంటలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి ఆధ్వర్యంలో సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అనే అంశంపై జూమ్ వేదికగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉన్నత వృత్తులలో వైద్య వృత్తి ఒకటని, దేవుని తర్వాత ప్రాణం నిలిపే అవకాశం వైద్యునికే ఉండడం ఒక అద్భుతమైన వరం వంటిదని అన్నారు. జేబును చూసి వైద్యం చేయడం కన్నా రోగి జబ్బు చూసి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా వైద్యులు ఉండాలని, కార్పొరేట్ల మాయాజాలం, కాసుల కక్కుర్తి అవాంఛనీయమైనవని, మందుల కన్నా మృదువైన మాటలు, మానవీయ స్పర్శ అత్యున్నత ఫలితాలను అందిస్తాయని అందుకే వైద్య వృత్తికి మానవీయ దృక్పథం మకుటంలా నిలుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాఖ్యాత కోపల్లి జయకర్ బాబు, జి. శాంతమూర్తి మాట్లాడారు. జూమ్ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వాడకుప్ప సుధాకర్, ఏలీ, ఎం.స్వాములు, ప్రియా జాన్, బాలకృష్ణారెడ్డి, కవి, రచయిత కాపిరెడ్డి కృష్ణారెడ్డి, గునుకూరు రత్నరాజు, శ్రీ విష్ణు, గాలి శాంత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇస్కాన్ మందిర జగన్నాథస్వామి ఉత్సవాలు
తెనాలి: తెనాలి నాజరుపేటలోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న జగన్నాథస్వామి ఉత్సవాలు నాలుగో రోజైన మంగళవారం రాత్రితో ముగిశాయి. సోమవారం రాత్రి జగన్నాథ రథయాత్ర ముగిసిన తదుపరి, ఇక్కడి బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాతను అక్కడ కొలువు ఉంచిన విషయం తెలిసిందే. చివరి రోజు రాత్రి పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున పాల్గొని సుభద్రాదేవికి చీర, సారె, పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ వేడుకల సందర్భంగా గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన వివిధ కళాసాంస్కృతిక పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వేలమంది పాల్గొన్నట్టు ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సింహ గౌరదాసు చెప్పారు. సుభద్రాదేవికి సారె సమర్పణ అనంతరం ఆయా పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను బహూకరించారు. అత్యధికంగా 28 జ్ఞాపికలను గెలుచుకున్న స్థానిక వెస్ట్బెర్రీ స్కూలుకు ఓవరాల్ ఛాంపియన్గా ట్రోఫీని బహూకరించారు. మందిర ఉత్సవాలకు సహకరించిన బలరాం గోవింద ప్రభు, వైష్ణవి, భార్గవ్, వెంకటేష్, అపూర్వ, ఆశ్రిత, గాయత్రి, వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం, శివశంకర్, పావని, తేజ, మురళి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత పినపాడుకు చెందిన కోదాడ బృందం వాయిద్యాల నడుమ మహిళలు ఊరేగింపుగా సారెను తీసుకొచ్చారు. సుభద్రాదేవికి సారె సమర్పించిన మహిళలు వైభవంగా జగన్నాథ రథయాత్ర పెదకాకాని: విశ్వ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వీవీఐటీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రథయాత్ర విద్యార్థుల భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి విశ్వవిద్యాలయం వరకు సుభధ్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథయాత్రను వివా వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు జయ జయహే జై జగన్నాథ నినాదాలతో యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో గోళ్లమూడి గ్రామ ప్రజలు హారతులు, పూలు జల్లుతూ రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు యూనివర్శిటి వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహా హారతి నిర్వహించి, విద్యార్థులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి
సుందరయ్యనగర్లో సీపీఎం నేతల ప్రచారం తెనాలి: అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని ప్రజలు స్పష్టంగా తిరస్కరించాలని, చూస్తూ ఊరుకుంటే తరతరాలుగా ఇరుక్కుపోతారని సీపీఎం నాయకులు ప్రజలను హెచ్చరించారు. సీపీఎం నాయకులు కేబీ ప్రసాద్, శెట్టి ఏసోబులు మంగళవారం తెనాలి సుందరయ్యనగర్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదానీ కంపెనీ ప్రతినిధులు వినియోగదారుల సమ్మతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా బలవంతంగా విద్యుత్ మీటర్లు మార్చుతున్నారని కేబీ ప్రసాద్ చెప్పారు. స్మార్ట్ మీటర్లుగా పిలుచుకునే ఆ మీటర్లలో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అందులో ఉండే ‘అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్’ (ఏఎంఐ) ద్వారా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని, వైర్లెస్ ద్వారా ఆ మీటర్ అదాని కంపెనీకి కనెక్ట్ చేయబడి ఉంటుందన్నారు. ఎక్కడో ఉండి ఆ మీటర్ను ఆపరేట్ చేయొచ్చని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. రెండోది ‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ (ఏఎంఆర్) అని చెబుతూ ఏ సమయానికి ఎంత విద్యుత్ వాడుకున్నదీ రికార్డు చేస్తుందన్నారు. పీక్ అవర్స్లో 6–10 గంటల వరకు అధిక చార్జీలు వసూలు చేస్తారని వివరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మాట్లాడుతూ వాడుకున్న విద్యుత్కు తర్వాత డబ్బులు చెల్లించే ప్రస్తుత పద్ధతికి భిన్నంగా, ముందుగానే డబ్బులు చెల్లించి సెల్ఫోన్లో ఛార్జింగ్ చేయించితేనే విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. విద్యుత్ను సౌకర్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, సరుకుగా మార్చి ప్రజలను పిండుకోవటానికి వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వి.బాబూరావు, యు.బుజ్జి, శెట్టి పౌలు, వి.సూరిబాబు, ఎస్.బాలస్వామి, మేరి, శెట్టి సలోమి, ఎస్.సింధు, కె.మరియమ్మ, ఎస్.అరుణప్రమీల, పి.జ్యోతి, కె.లక్ష్మమ్మ, నరసమ్మ పాల్గొన్నారు. -
వర్షాల నేపథ్యంలో ఇసుక ప్రత్యేక డంప్
గుంటూరు వెస్ట్: వర్షాకాలం నేపధ్యంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ముందుగానే ప్రత్యేకమైన డంప్ యార్డుల్లో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్ఓ షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరపాలన్నారు. ఇసుక విక్రయాలు జరిగే ప్రాంతాల్లో ధరల బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత తహసీల్దార్లు తనిఖీ నివేదకలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం జిల్లాలో 2021–24 మధ్యలో జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్విన ఏజెన్సీలకు నోటీసులివ్వాలన్నారు. వర్షాకాలం నేపధ్యంలో ఏర్పాటు చేస్తున్న ఇసుక స్టాక్ పాయింట్లు ప్రధాన రహదారులకు సమీపంలో ఉండాలన్నారు. స్టాక్ పాయింట్ల నుంచి వసూలు చేసే రవాణా చార్జీల విషయంలో వినియోగదారుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి డి.వెంకట సాయి, జిల్లా భూగర్భ వనరుల శాఖ డీడీ వందనం, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ క్లస్టర్లు.. గుంటూరు వెస్ట్: జిల్లాలో వ్యవసాయంతో పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు గుర్తించాలన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్, హ్యాండ్లూమ్ క్లస్టర్ పనులు వేగవంతం చేయాలన్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో మాడ్యూలర్ కిచెన్ క్లస్టర్ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్ఐపీబీ, ఎస్ఐపీసీలో జిల్లాకు అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో 45 ఎస్ఎంఎస్సీ పరిశ్రమలకు సంబంధించి రూ.2,52,74,672 మంజూరు చేస్తూ కలెక్టర్ సమావేశంలో ఆమోదించారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, తెనాలి ఆర్డీఓ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం
చినగంజాం: ఉప్పు సాగుకు ఇటీవల కాలంలో ప్రకృతి తీవ్ర విఘాతం కలుగజేస్తోంది. అయినా ఉప్పు రైతు వాటిని తట్టుకొని నెగ్గుకు రాగలుగుతున్నాడు. వేసవి ఉష్టోగ్రతలు పంట దిగుబడిని, నాణ్యతను పెంచుతాయి. ఉప్పు సాగు ముమ్మరంగా సాగే అనుకూల సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఉప్పు రైతు కోలుకోవడం కష్టమే. గత నాలుగు సీజన్లుగా ఇదే పరిణామాలు ఉప్పు సాగు విషయంలో చోటు చేసుకుంటున్నాయి. సీజన్లో భారీగా పడిపోయిన ఉప్పు ఉత్పత్తి రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సీజన్లో ఉప్పు ఉత్పత్తి భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఉప్పు పరిశ్రమల్లో మొత్తం 22 వేల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి కొనసాగుతుంది. తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఉప్పు రైతు నష్టపోక తప్పడం లేదు. ఉప్పు సాగు ప్రతి ఏడాది నవంబరు నెల నుంచి తరువాత ఏడాది జూన్ వరకు దాదాపు 8 నెలలపాటు కొనసాగుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉప్పు సాగును ప్రారంభించి తొలి తీత సంక్రాంతి పండుగ నాటికి తీయాల్సి ఉంది. 2024–25 సీజన్లో నవంబరు, డిసెంబరు నెలలో ప్రకృతి అనుకూలించక ఆలస్యంగా రైతులు సాగును ప్రారంభించాల్సి వచ్చింది. ఉప్పు కొఠారుల్లో భారీగా వర్షపు నీరు నిలిచి సాగుకు భూములు అనుకూలత లేక జనవరి నెలలో సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో ఉండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 30 శాతం మాత్రమే ఉప్పును రైతులు తీయగలిగారు. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి ఉప్పు దిగుబడికి అనుకూలంగా ఉండే మే, జూన్ నెలల్లో తుఫాన్లు, అకాల వర్షాలతో సాగు పూర్తిగా నిలిచిపోయింది. ఉప్పు రైతుకు ఎన్నడూ లేని విధంగా తీవ్ర విఘాతం కలిగింది. సొంత భూములున్న రైతులు, లైసెన్స్దారులు పరిస్థితి ఎలా ఉన్నా ముఖ్యంగా కౌలుదారులకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉమ్మడి ప్రకాశంలోఉపాధి కోల్పోయిన వేల కుటుంబాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊళ్లపాలెం, కనపర్తి, కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో ఉప్పు సాగు కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలో చినగంజాం, పెదగంజాం గ్రామాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు మొత్తం 3,600 ఎకరాల్లో ఉప్పు సాగు చేసే భూములున్నాయి. వాటిలో ప్రభుత్వ భూములు 2,400 ఎకరాలు కాగా, 500 ఎకరాలు స్నోవైట్ సాల్ట్ భూముల్లో సాగు సాగడం లేదు. ప్రభుత్వ భూమిలో 620 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మరో 1200 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. చినగంజాం మండల పరిధిలో చిన్న, పెద్ద రైతులు సుమారు 1050 కుటుంబాలు ఉండగా వారితో పాటు ఉప్పు కొఠారుల్లో పనులు నిర్వహిస్తూ కూలీలుగా సుమారు 8 వేల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చినగంజాం సాల్ట్ వర్కర్స్ కో ఆపరేటివ్ ప్రొడక్షన్స్ సేల్స్ సొసైటీ (ఎల్ నంబర్ 73 అండ్ 86)లో 400 ఎకరాలు సుమారు 700 కుటుంబాలు, రాజుబంగారుపాలెం సాల్ట్ సొసైటీలో 120 ఎకరాలు 350 కుటుంబాలు మొత్తం 1050 కుటుంబాలు ఉప్పు సాగు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఊళ్లపాలెం గ్రామ పరిధిలో ఎస్సీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద 500 ఎకరాలు, ఓసీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద మరో 350 ఎకరాలు ఉప్పు సాగు చేస్తుండగా, కొత్తపట్నం మండలంలోని సాల్ట్ సొసైటీ కింద 275 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. వీటితో పాటు సుమారు మరో వెయ్యి ఎకరాలు ప్రైవేట్ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉప్పు సాగుకు అవాంతరం కలగడంతో వేల కుటుంబాలు ఈ సీజన్లో తమ ఉపాధిని కోల్పోయారు. సీజన్లో భారీగా పడిపోయిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్న రైతు రైతుల ఆశలపై నీరు చల్లిన అకాల వర్షం ఉమ్మడి ప్రకాశంలో రైతులకు కోలుకోలేని దెబ్బ రైతుల కష్టం పట్టించుకోనికూటమి ప్రభుత్వం -
దేశ ప్రగతిలో సీఏల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ప్రగతిలో సీఏల పాత్ర ఎంతో కీలకమని క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రంథి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సీఏ విద్యకు గుంటూరు నగరం కేంద్రంగా ఉందని, వివిధ రాష్ట్రాల విద్యార్థుల ఇక్కడికి వస్తున్నారని అన్నారు. విద్యార్థులు సీఏ విద్యను ఎంపిక చేసుకోవడం ద్వారా ఉన్నత భవిష్యత్ అందిపుచ్చుకోగలరని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్ కుందుల, సీఏ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ గుంటూరు చాప్టర్ చైర్మన్ చింతా వీఎన్ఎస్ రఘునందన్, వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షేక్ బాజీ, దేసు సంపత్ పాల్గొన్నారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు -
జీజీహెచ్లో ఘనంగా డాక్టర్స్ డే
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో మంగళవారం డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలోని శుశ్రుతాహాల్లో జరిగిన ఈ వేడుకలకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వైద్యులను సత్కరించి మాట్లాడారు. జీజీహెచ్లో పేద రోగులకు వైద్యులు ఎంతో కష్టపడి సేవలందిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో పచ్చదనం బాగా పెంచారని అభినందించారు. వైద్యులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుని రోగులకు ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ మాట్లాడుతూ ఆస్పత్రిలో దాతల సహాయంతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. రోగులకు ఓపీ రద్దీని తగ్గించేందుకు నూతనంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది వైద్యులను ఘనంగా సత్కరించారు.సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పౌరునికి అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి కొరిటెపాడు(గుంటూరు): ప్రతి పౌరునికి బ్యాంకింగ్, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేలా చేయడమే జన సురక్ష శిబిరాల లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జన సురక్ష మూడు నెలల శిబిరాలను తెనాలి మండలం, కొలకలూరు గ్రామంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయిలో ఆర్థిక సేవలను విస్తరించేందుకు చేపట్టిన జన సురక్ష సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శిబిరాల్లో జన్ ధన్ ఖాతాల ప్రారంభం, జీవన్జ్యోతి, సురక్ష బీమా పథకాలలో నమోదు, అటల్ పెన్షన్ యోజన సభ్యత్వం, పాత ఖాతాలకు ఈకేవైసీ చేయించడం, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏపీఎం జయశ్రీ, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్చార్జి శ్యామ్ ప్రసాద్, కొలకలూరు యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా బ్రాంచి మేనేజర్ హర్ష, పంచాయతీ కార్యదర్శి కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. -
జలజీవన్ మిషన్ తీరుపై విచారణ
గుంటూరు వెస్ట్: వర్షపు నీటిని ఒడిసి పట్టడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల పురోగతి పరిశీలించడానికి కేంద్ర జల శక్తి శాఖ పరిశీలకులు కిరణ్కుమార్ కర్లపు, రేష్మి పిళ్లైతో కూడిన అధికారుల బృందం రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మమేకమై ప్రభుత్వ విధానాలపై ఆరా తీశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఫారం ఫాండ్, వాన నీటి సంరక్షణ, నిర్మాణాలు, అమృత్ సరోవర్లు, నర్సరీలు, పండ్లు, పూలతోటలు పెంపకం, తదితర విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో చేపడుతున్న పనులు బాగున్నప్పటికీ వాటిని వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడు చేయకపోవడం వలన పురోగతి మార్గాలు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుతుపవనాలు రావడానికి ముందు, తరువాత నీటి లభ్యతను లెక్క వేయడంలో భాగంగా రానున్న అక్టోబరు నెలలో మరోసారి జిల్లాలో పర్యటిస్తామన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై పథకాలపై చర్చించారు. -
ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు కాజేశారు
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలాది రూపాయలు కాజేసి, మోసగించారంటూ బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ నిర్వహించారు. అర్జీదారుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీ (క్రైం), రమేష్ (ట్రాఫిక్) కూడా అర్జీలు స్వీకరించారు. నకిలీ నియామక పత్రాలతో మోసం గతేడాదిలో తెలిసిన వ్యక్తి పరిచయమయ్యారు. నేషనల్ హెల్త్ అథారిటీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ముగ్గురం కలిసి అతనికి సుమారు రూ.16.80 లక్షలు చెల్లించాం. గతేడాది నవంబర్ 4న ఢిల్లీ వెళ్లగా, అవి నకిలీ గుర్తింపు కార్డులు, నియమాక పత్రాలను అధికారులు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో అటువంటి సంస్థ లేదని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించాం. దీంతో డబ్బులు అడగ్గా, రూ.3.80 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగతా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. – ఓ యువకుడు, రావెల, తాడికొండ మండలం పొలం ఇప్పించాలి గుంటూరు రూరల్ పరిధిలోని వెంగళాయపాలెంలో మాకు 46 సెంట్లు పొలం ఉంది. 2006లో మాజీ ఎమ్మెల్యే సోదరుని వద్ద దాన్ని రూ.5 లక్షలకు తనఖా పెట్టాం. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి మాకు డబ్బు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేకు అప్పగించాడు. పొలం తనఖాకు సంబంధించి డబ్బులతో పాటు అదనంగా చెల్లిస్తామని, కాగితాలు ఇవ్వాలంటూ ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. మాకు పొలం ఒక్కటే జీవనాధారం. గతంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. న్యాయం చేయాలి. – సీహెచ్.భాగ్యలక్ష్మి, రామారావు, వెంగళాయపాలెం ఎస్పీ సతీష్కుమార్కు బాధితుల మొర -
ఈ నగరానికి ఏమైంది?
● అదనంగా విధుల్లోకి తీసుకున్న కార్మికులు ఎక్కడ ? ● నగరంలో గ్రీనరీతో ఒక్క రోడ్డు కూడా లేదు ● 10వేల మొక్కలు కార్పొరేషన్కు వస్తే కనిపించేది 305 మాత్రమే.. ● సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ● కౌన్సిల్లో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గుంటూరులో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం సంతృప్తి ఇవ్వదు: కమిషనర్ కార్పొరేటర్లు, ప్రజారోగ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ అనేది వంద శాతం సంతృప్తి ఇవ్వదని, మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.. అదనంగా 150 మందిని విధుల్లోకి తీసుకున్నా వారు ఎక్కడ పని చేస్తున్నారో కూడా తెలియదు.. ట్రాక్టర్లు డివిజన్కు ఒకటి కేటాయించామని అధికారులు చెబుతున్నా, ఎప్పుడు వస్తున్నాయో తెలియడం లేదంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులు, మాజీ కార్పొరేటర్ కారసాని సామ్రాజ్యానికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. సోమవారం కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ఉదయం 10.47గంటలకు ప్రారంభమైంది. సభ్యుల 35 ప్రశ్నలకు, 105 కార్పొరేషన్ ప్రియాంబుల్స్, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ● పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో వీఐపీలు తిరిగే ప్రధాన రహదారి ఐటీసీ రోడ్డులో ఉన్న మూడు చోట్ల చెత్త పాయింట్లను శుభ్రపరచడంలో అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రధాన రాహదారే అధ్వానంగా ఉందని, ఇక నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నగరంలోని సచివాలయాల్లో ఒక్కరే ఉద్యోగి పని చేస్తున్నారని, అతడు కూడా వాచ్మెన్గా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏదైనా సమాచారం అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులైన తమకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. పర్మిషన్ లేని భవనాలు స్వయంగా చూపించినప్పటికీ ఇంత వరకు చర్యలు లేవని తెలిపారు. 21వ డివిజన్లో రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్ కడితే దాన్ని కూల్చాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశిస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ● తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చెత్త వేయకుండా గ్రీన్ మ్యాట్లు కట్టినా ఉపయోగం లేకుండా ఉందని తెలిపారు. అక్కడే చెత్త వేస్తున్నారని చెప్పారు. నగరంలో గ్రీనరీతో కూడిన బ్యూటిఫికేషన్ రోడ్డు ఒక్కటీ లేదని, కనీసం కార్పొరేషన్ కార్యాలయం ముందు కూడా చేసుకోలేకపోతున్నామని విమర్శించారు. పక్కనే ఉన్న తెనాలి, పొన్నూరులో గ్రీనరీ బాగుందని, కలెక్టరేట్ రోడ్డును కూడా అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు 10వేల మొక్కలు వస్తే అందులో నాటింది 305 మాత్రమేనని, మిగిలిన వాటి సంరక్షణ ఏంటని? ఆయన ప్రశ్నించారు. సచివాలయాల్లో సక్రమంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదని, పనుల మీద వచ్చిన ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు ఇంటర్నెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా ?అని నిలదీశారు. ● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ సుబ్బారెడ్డి నగర్లో రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ఎందుకు అతని బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. 25వ డివిజన్లో అనధికార లే అవుట్స్ పెరిగిపోతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ● గతంలో మా వార్డులో 60 మంది పారిశుద్ధ్య కార్మికులుంటే ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారని..కాలువలు తీయడానికి మనుషులు లేరని కార్పొరేటర్ వెంకట కృష్ణ తెలియజేశారు. ● అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను కుదించే ప్రయత్నంలో ఉందన్నారు. నగరంలోని ఉన్న 207 వార్డు సచివాలయాలను 103 క్లస్టర్స్గా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అయిపోగానే సిబ్బంది రేషనలైజేషన్ చేస్తామని వెల్లడించారు. ● గుంటూరు నగరంలో 1256 హోర్డింగ్స్ ఉంటే అందులో 250కి మాత్రమే స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉందని.. ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, షేక్ రోషన్, దూపాటీ వంశీ కౌన్సిల్లో టౌన్ప్లానింగ్ అధికారులను నిలదీశారు. ● 17వ వార్డులో కాలువలు, డ్రైన్లపై కూడా భవన నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మణస్వామి అనుమతులు ఇస్తున్నారని.. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ ఫర్జానా డిమాండ్ చేశారు. వార్డులో టీడీపీ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, దీన్ని కట్టడి చేయాలని ఆమె కోరారు. ● వార్డులో అభివృద్ధి పనుల్ని కార్పొరేటర్కు చెప్పకుండానే అభివృద్ది పనులు ప్రారంభించారని...జేసీబీతో పనులు చేస్తున్న క్రమంలో వృద్ధుడి కాలు విరిగిందని..అసలు సిబ్బంది ఎవరూ లేకుండా పనులేలా చేస్తారంటూ కార్పొరేటర్ మల్లవరపు రమ్య నిలదీశారు. ● కార్మిక శాఖ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పాపతోటి అంబేడ్కర్ కౌన్సిల్ అధికారులను కోరారు. మాటలు సరిగా మాట్లాడు ! పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు చెప్పే మాటలు మాత్రమే మేయర్ నమ్ముతున్నారని.. తమ మాటలు నమ్మడం లేదని టీడీపీ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ ప్రశ్నించారు. మాటలు సరిగా మాట్లాడు.. ఇక్కడ ఎవరి మాటలు నమ్మాలో, నమ్మకూడదో తనకు తెలుసని, పని చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ రవీంద్ర చెప్పారు. సమ్మె చేస్తున్న వారిపై చర్యలు: మేయర్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నారని, వీధి లైట్లు వెలగనీవ్వడం లేదని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మేయర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు. -
‘ఉపాధి’లో అక్రమాలపై విచారణ చేయించాలి
లక్ష్మీపురం: ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకర్ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రరెడ్డి సూచనల మేరకు తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. సర్పంచులకు కూడా తల్లికి వందనం పథకాన్ని తక్షణమే వర్తింపజేయాలని విన్నవించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.1,150 కోట్లను స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలని కోరారు. కార్యక్రమంలో తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ అధ్యక్షులు పూసపాటి వెంకటరామిరెడ్డి , ఈపూరు రమేష్, దొడ్డా రాంజీ అంబేడ్కర్, ఫిరంగిపురం మేడుకొండూరు మండలాల పంచాయతీరాజ్ అధ్యక్షులు గుత్తికొండ ప్రతాపరెడ్డి, షేక్ హాజీ, తాడికొండ, మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, తాళ్లూరి వంశీ, తాడికొండ మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ బాబావలి, పార్టీ నాయకులు గుత్తికొండ అంజిరెడ్డి, పెరికల చిన్న, గంపల గంగాధర్ యాదవ్, బాకీ వెంకటస్వామి, మాదాసు ధర్మరాజు, షేక్ మీర్జావలి షేక్ సలీం, గుంటి రఘువరన్ గోల్డు బాబు, రాయపూడి ఇమ్మానియేలు పాల్గొన్నారు. ‘సదరం’ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి లక్ష్మీపురం: సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ కేంద్రాల్లో దివ్యాంగులకు మౌలిక వసతులు కల్పించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్రాజ్ కోరారు. వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పటిష్టంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్, సదరం సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బొక్క అగస్టీన్ మాట్లాడుతూ పెన్షన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకువచ్చి ఆరోగ్య కేంద్రాల చుట్టూ దివ్యాంగులను తిప్పుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు నాగుల్ మీరా, నాయకులు గణేష్, కిరణ్ పాల్గొన్నారు వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు -
ఏసీబీకి చిక్కిన దేవదాయ శాఖాధికారి
కొల్లూరు : లంచాల కోసం వ్యాపారులను వేధిస్తున్న దేవదాయ శాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మత్తే మహేంద్ర కథనం మేరకు... బాపట్ల జిల్లా కొల్లూరు దేవాలయాల సమూహ ఈఓగా పనిచేస్తున్న నాగిశెట్టి శ్రీనివాసరావు కొద్ది రోజులుగా ఆలయ దుకాణాదారులను లంచాలు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొల్లూరుకు చెందిన వంకాయల సాయి తన తండ్రి లక్ష్మినారాయణ మరణించడంతో శ్రీ అనంతభోగేశ్వరాలయం పరిధిలో ఉన్న 6వ నంబర్ దుకాణాన్ని తన సోదరుడు రమేష్ పేరుమీదకు మార్చాలని శ్రీనివాసరావును పది రోజుల క్రితం కోరాడు. దుకాణం పేరు మార్పుకు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇచ్చుకోలేనని తెలపడంతో రూ.70 వేలు చెల్లించాలని లేని పక్షంలో దుకాణం స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారి హెచ్చరికలు చేశాడు. ఆలయ అధికారి అర్ధరాత్రి సమయాలలో సైతం ఫోన్లు చేసి లంచం నగదు కోసం వేధిస్తుండటంతో ఆయన అడిగిన మొత్తం సోమవారం ఇస్తానని సాయి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కొల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలోని ఈఓ కార్యాలయంలో దుకాణదారుడు సాయి ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఈఓకు రూ.60 వేలు నగదు చెల్లింపులు జరుపుతుండగా, అకస్మాత్తుగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దుకాణదారుడి నుంచి లంచంగా తీసుకున్న రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఈఓ కార్యాలయంలోనే రసాయనాలతో పలు పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి దేవాదాయ శాఖాధికారి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈఓ శ్రీనివాసరావును మంగళవారం విజయవాడలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు మహేంద్ర వెల్లడించారు. దాడులలో ఏసీబీ సీఐలు నాగరాజు, మన్మదరావు, సురేష్, సుబ్బారావు, ఎస్ఐలు చిచ్చా ఉరుకొండ, సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
చిల్డ్రన్స్ హోం సందర్శన
గుంటూరు లీగల్: క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు బాలిక సదన్లోని చిల్డ్రన్స్ హోంను సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. సదుపాయాల గురించి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. హోంలో ఆహారం, విద్య, వైద్యంతో పాటు రూములను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట బాలిక సదన్ సూపరింటెండెంట్ కవిత, సిబ్బంది ఉన్నారు. -
కులం పేరుతో దూషణ, దాడి
దుగ్గిరాల: కులం పేరుతో దూషించి, స్పృహ కోల్పోయేటట్లు కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యానాది యూత్ ఫెడరేషన్ నాయకులు సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది కులానికి చెందిన కన్నం మాధవి, కన్నం మరియమ్మ, వి.నరేంద్రబాబులు ఆదివారం కె.ఆర్. కొండూరు గ్రామంలో షాపింగ్ చేసుకొని వస్తుండగా ఇద్దరు చిన్న పిల్లలు తగువులాడుకుంటూ ఉండగా గొడవ ఎందుకని వారికి సర్ది చెప్పి వెళుతున్నారు. ఈ సమయంలో నలుగురు ముస్లిం యవకులు పెద్దగా అరుస్తూ వారిని కులం పేరుతో తిట్టి, కొట్టి గాయపరచారు. కేసు పెట్టేందుకు వెళుతుంటే అడ్డగించి బెదిరించారు. విషయాన్ని యానాది యూత్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులతో కలసి సోమవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. యానాది యూత్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కొమరగిరి సూరిబాబు, రావూరి గోపి, అశోక్, మరియమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
లక్ష్మీపురం: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 6వ రాష్ట్రస్థాయి అండర్ 10,12 విభాగాల్లో ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. జిల్లా బాలబాలికలు 4వ స్థానం సాధించారని జిల్లా ఫెన్సింగ్ అనానిమిషన్ ప్రధాన కార్యదర్శి డి. అశోక్బాబు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జులై 5 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. బాలికల 11–12 విభాగంలో డి.జోష్ని, బి.శ్రీలక్ష్మి, యు.శ్వేత, ఫాఈల్లో ఎం.శ్లోక, ఆర్షియా హస్నా, సేబార్లో జి.హన్సిత, నాగశ్రీ ఎంపికై నట్లు తెలియజేశారు. అండర్– 12 విభాగం సేబార్లో ఎం.చైతన్య సాయి, జె.పృథ్వి, వినయ్, బాలికల అండర్– 10 ఇప్పిలో బి.దీక్షిత, రాథోడ్, జి.తన్మయిశ్రీ , ఎం.స్నేహశీ, సేబార్లో సి.అరోహి, అండర్– 10 కేటగిరి బాలురు ఫాఈల్లో పి.రిశాంక్ శర్వాన్, పి.రిత్విక్ ఎంపికై నట్లు అశోక్బాబు వెల్లడించారు. -
సుప్రీం ఆదేశాలను అమలుచేయాలి
కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ నాగరాజన్ వినూత్న ప్రచారం తెనాలి: మహాత్మా గాంధీజీ ఆదర్శంగా ఆయన సూత్రాలను ప్రచారం చేస్తున్న పట్టణానికి చెందిన గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గాంధీ నాగరాజన్ సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. గాంధీ వస్త్రధారణతో కళ్లకు గంతలు కట్టుకుని, పోలీస్ సంస్కరణలపై సుప్రీం తీర్పుకు సంబంధించిన అంశాలను ప్రచారం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసు సంస్కరణలపై ఐపీఎస్ అధికారి ప్రకాష్సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పోలీస్ వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం పెంచటానికి జారీ చేసిన ఏడు ముఖ్యమైన ఆదేశాలను గాంధీ నాగరాజన్ ప్రస్తావించారు. పోలీస్ విధులను రాజకీయ జోక్యం నుంచి రక్షించడానికి, పోలీసులకు మార్గదర్శకత్వం వహించడానికి రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు ఆయన కోరారు. ఎస్పీ, డీజీపీలకు రెండేళ్ల పదవీ కాలం నిర్ణయించాలని, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవించారు. పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఏర్పాటు, దర్యాప్తు, శాంతిభద్రతల విభజన వంటి అంశాలను అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆచార్య లింగరాజు ఏఎన్యూ: డాక్టర్ వైఎస్సార్ ఏఎన్యూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా యూనివర్సిటీ సైన్స్ ఫిజిక్స్ విభాగాధిపతి సీహెచ్. లింగరాజు నియమితులయ్యారు. వీసీ కె. గంగాధరరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జి. సింహాచలం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్గా నియమితులైన లింగరాజుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్స్ కల్పన, నైపుణ్య లక్షణాల పెంపొందింపు లక్ష్యంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. -
దుర్గమ్మకు భక్తుల ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో భక్తులు విశేషంగా తరలిరావడం కనిపించింది. ఉదయం నుంచి ప్రారంభమైన సారె సంబరం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆలయ వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ కుటుంబం అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించింది. నగరంతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు సారె సమర్పించేందుకు తరలివవచ్చారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తాం..
జే.పంగులూరు: కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా, వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తూ మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెంకటమురళి అన్నారు. మండల పరిధిలోని మార్కెట్ యార్డులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 18 పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం పంగులూరు, పర్చూరు, ఇంకొల్లు మూడు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారన్నారు. పొగాకు కొనుగోలుకు ప్రభు త్వం రూ.270 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు సరుకును బట్టి రూ.6 వేలు నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. -
కనుల పండువగా జగన్నాథ రథయాత్ర
తెనాలి: ఇస్కాన్ తెనాలి ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్ర సోమవారం కన్నులపండువగా జరిగింది. రథ్ఫెస్ట్–2025 పేరుతో నాలుగు రోజుల పాటు చేపట్టిన ఉత్సవాల మూడో రోజు రథయాత్ర నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుంచి మధ్యాహ్నం రథయాత్రను ఆరంభించారు. గాంధీ చౌక్, నెహ్రూ రోడ్డు, రజక చెరువు, ప్రకాశం రోడ్డు, గంగానమ్మపేట, గాడి బావి సెంటర్, బోసు రోడ్డు, చినరావూరు పార్కుకు వెళ్లి, తిరిగి బోసు రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాతను కొలువుదీర్చి, ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు జగన్నాథుడు, రథయాత్ర విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఒకటో తేదీ సాయంత్రం వరకు జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాత అక్కడే కొలువై ఉంటారు. సుభద్ర దేవీకి సౌభాగ్య సారె కార్యక్రమం నిర్వహిస్తారు. రథయాత్రకు ముందు విజయవాడకు చెందిన జిజ్ఞాస సాంస్కృతిక సంస్థ వారి క్యూరేషన్లో పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. ఇస్కాన్, తెనాలి మేనేజరు హెచ్జీ సింహగౌరదాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల్నుంచి కళాకారులు పాల్గొన్నారు. విదేశీ భక్తులు కమలకాంత దాస్, జిజ్ఞాస నుంచి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహనకృష్ణ పాల్గొన్నారు. రథ్ ఫెస్ట్లో భాగంగా 28, 29 తేదీల్లో పిల్లలకు, యువతకు సాంస్కృతిక పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టవద్దని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఇన్చార్జి కలెక్టర్ ఏ.బార్గవ్ తేజ, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రజల నుంచి 260 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని ఫిర్యాదును సరిగా ఎండార్స్ చేయడం లేదని, సంబంధిత శాఖలో సరైన అధికారికి పంపడం లేదన్నారు. ఉన్నతాధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా కిందిస్థాయి అధికారులే పరిష్కరిస్తున్నారని తెలిపారు. సరిగా స్కాన్ చేయకుండా అప్లోడ్ చేస్తున్నారని, గ్రీవెన్స్ అధికారులే సమస్యను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అర్జీదారుడికి సమస్యను పరిష్కరించిన విధానాన్ని క్షుణ్ణంగా తెలియ జేయాలని చెప్పారు. అధికారుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ అందించాలని తెలిపారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి తగ్గుతోందని, దాన్ని పెంచడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కమిషన్, కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉన్నతాధికారులకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశం -
ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని యూఎల్బీ పరిధిలో పనిచేస్తున్న వార్డు ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల బదిలీల కు సంబంధించిన కౌన్సె లింగ్ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరిగిన కౌన్సెలింగ్లో ఎటువంటి సీనియార్టీ లిస్ట్ పెట్టకుండానే నచ్చిన సచివాలయాలను మూడు ఆప్షన్లుగా ఎంచుకుని ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోండి ఈనెల 30న మీకు సచివాలయం కేటాయిస్తామని అధికారులు చెప్పిన విషయం విధితమే.. దీనిపై ‘సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రెండో రోజు ఆదివారం జరిగిన వార్డు ఎమినిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీలకు కౌన్సెలింగ్కు సంబంధించిన సీనియార్టీ లిస్ట్ను ప్రచురించారు. దీంతో ఆయా సెక్రటరీలు ఊపిరి పీల్చుకున్నారు. వార్డు అడ్మిన్లు వర్సెస్ బిల్ కలెక్టర్లు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు/గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయాలకు వార్డు అడ్మిన్ సెక్రటరీలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లుకు కూడా వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా అవకాశం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. 2019లో బిల్ కలెక్టర్లకు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా ముందు ప్రాధాన్యత కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం బదిలీల కౌన్సెలింగ్ జరగుతున్న నేపథ్యంలో బిల్ కలెక్టర్లు వారు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాల్లోనే ఉండేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని హోల్డ్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో వార్డు అడ్మిన్ సెక్రటరీలు అలా హోల్డ్ చేసుకోవడం కుదరదంటూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 23 మంది బిల్ కలెక్టర్లు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. వీరంతా తాము ఐదేళ్ల నుంచి వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నామని, తమకు ప్రాధాన్యత ఇచ్చి నచ్చిన సచివాలయం కేటాయించాలని కోరుతుండగా.. అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల కౌన్సెలింగ్ ఒక కొలిక్కి రావాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందేనని జీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీనియార్టీ లిస్టులు లేకుండానే శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో కదలిక ముగిసిన బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, బిల్ కలెక్టర్ల వ్యవహారం -
చేరికలు
ముందుచూపు179 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు లేక మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలే ఇందుకు ఉదాహరణ. పల్నాడు జిల్లావ్యాప్తంగా 179 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కనీసం ఒక్క విద్యార్థి సైతం చేరకుండా ఉండటం విద్యారంగ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనావస్థలో ప్రభుత్వ విద్య విలీనం పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలిపేయడం, మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు అంటూ ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు విద్యను దూరం చేయడం వంటి కారణాలతో ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు లేక పాఠశాలలు దీనావస్థలోకి వెళ్లిపోయాయి. ఈ విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను పరిశీలిస్తే ఒక పల్నాడు జిల్లాలోనే 179 పాఠశాలలు ఉండటం గమనార్హం. వికటించిన ప్రయోగాలు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంబంధిత పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేసిన కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పేరుతో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేసింది. గ్రామంలోని వేర్వేరు కాలనీల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాలుగైదు ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటే పాఠశాల ఉండాలనే ప్రభుత్వ విధానంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే దూరమయ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్నాడు జిల్లాలోని 179 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థీ చేరని వైనం పాఠశాల విద్యలో ప్రభుత్వ ప్రయోగాల ఫలితం మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రభావంతో గ్రామాల్లో ప్రైమరీ పాఠశాలలు మూత పడే ప్రమాదం వైఎస్సార్ సీపీ పాలనలో సజావుగా కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు -
ఆగని మట్టి దందా
అంతా షాడో కనుసన్నల్లోనే.. తాడికొండ: అధికారుల అలసత్వం, నాయకుల పైరవీల కారణంగా తాడికొండ మండలం ఫణిదరం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మట్టిదందా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గ్రామంలోని మంచినీటి చెరువులో తవ్వకాలు చేస్తూ టన్నుల కొద్దీ మట్టిని ట్రాక్టర్లు, లారీలలో రాత్రీ, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు గుంటూరు కలెక్టరేట్కు వెళ్లి మరీ ఫిర్యాదు చేసినా ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మట్టిదందా అంతా నియోజకవర్గ ముఖ్య నేతకు చెందిన కార్యాలయంలో ఉంటున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతా ఆయనే అయి షాడో ఎమ్మెల్యేగా వ్యవహారం నడిపిస్తూ జేబులు నింపుకొంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప తామేం చేయలేకపోతున్నామంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అధికారులను సైతం బెదిరించి తన వశం చేసుకున్న సదరు వ్యక్తి.. ప్రజా సమస్యలు పక్కన బెట్టి మట్టి దందాకు నియోజకవర్గంలో భారీగా తెరలేపాడు. ఇక్కడ అక్కడ అనే బేధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా తమవారిని తెరపైకి తెచ్చి భారీగా మట్టి దందా నిర్వహిస్తున్నాడు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్లో మరింత బరి తెగించి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో భారీగా తవ్వకాలు జరపడం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉందని ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి దందాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాడికొండ మండలం ఫణిదరంలో నెల రోజులుగా యథేచ్ఛగా మట్టి దోపిడీ చేస్తున్న కూటమి నేతలు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహారం చెరువులో ఏర్పడిన భారీగుంతలు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు గుంటూరుతో సహా పరిసర గ్రామాలకు భారీగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్న వైనం -
బోనభాగ్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): తెలంగాణ హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. -
వైభవంగా పునీత పేతురు మహోత్సవం
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని బాల ఏసుదేవాలయంలో ఆదివారం శ్రీసభ కార్యక్రమం నిర్వహించారు. పునీత పేతురు, పాల్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయ విచారణ గురువులు ఎం.ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి కార్యక్రమం నిర్వహించి వాక్యోపదేశం చేశారు. పునీత పేతురు, పాల్లు తమ జీవితంలో భగవంతుడిపై విశ్వాసాన్ని ఏవిధంగా చూపి నిలుపుకున్నారో దానిని విశ్వాసులు తెలుసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఒకే కుటుంబంగా కలిసి ప్రార్థనలు చేయాలని చెప్పారు. అనంతరం దివ్యపూజాబలి నిర్వహించారు. కార్మెల్ మాత మహోత్సవం జూలై 14,15,16 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సహాయ విచారణ గురువులు, మఠకన్యలు, కథోలిక క్రైస్తవులు పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు బాబు కుట్ర
చుండూరు(వేమూరు) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. చుండూరు మండలంలోని కారుమూరివారి పాలెంలో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకటరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామకం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీసులకు తనకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, తన ఆస్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తలేనని చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా ఎదురు నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన కార్యకర్తలకు ఎప్పడూ గౌరవం ఉంటుందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఈపూరు గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్ సిక్స్లు అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే పథకాలు అమలు చేసిన ఘనత దక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కక్ష సాధించే పరిపాలన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి చలంచర్ల సుధారాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పాలన సాగిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు ఉయ్యూరి అప్పిరెడ్డి, మండల అధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి, వేమూరు, అమర్తలూరు మండలాల పార్టీ అధ్యక్షులు దాది సుబ్బారావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, ఎంపీపీ జాలాది రూబేను, రాపర్ల నరేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగంటి లవకుమార్, జెడ్పీటీసీ సభ్యులు దాట్ల సౌజన్య మోహన్రెడ్డి, బి. నాంచారమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
గుంటూరు ఎడ్యుకేషన్: బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రత్యేకమైన కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లపై సమాజానికి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులు తమ పని విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. ● రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో ఉన్న అసంబద్దాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేసామని తెలిపారు. ● రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలు, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘంగా యూటీఎఫ్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఈసందర్భంగా ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామని వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి గయాసుద్దౌలా, నాయకులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, ఎండీ షకీలాబేగం, టి.ఆంజనేయులు, ఎ.శ్రీనివాసరావు, బి.ప్రసాద్, కె.కేదార్నాథ్, కె.కామాక్షి, ఎం.కోటిరెడ్డి, పి.ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
చీరాల అర్బన్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చీరాలలో పట్టణశాఖ 20వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ఎస్.పురుషోత్తం, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఈఓ ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల బలోపేతం చేయడానికి ఎన్రోల్మెంట్ పెరుగుదలకు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ఉపాధ్యాయుల కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. అనంతరం పేరాల్లోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసిన నాగళ్ల రమణారావు దంపతులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా బాధ్యులు గడివాడ అమర్నాథ్, బడుగు శ్రీనివాస్, కె.ఎర్రయ్య, వి.ప్రఽభాకరరావు, ఎం.ఏసురత్నం, టి.వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పార్వతి, అపర్ణ, రమేష్, సుబ్బారెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
గుంటూరు మెడికల్: వ్యాపార వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరు భాస్కరరావు అన్నారు. ఇటీవల నవ్యాంధ్ర ప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్, కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, కోశాధికారి వై.బి.శివారెడ్డిల ప్రమాణ స్వీకారం ఆదివారం పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పొట్లూరు భాస్కరరావు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. అసోసియేషన్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్తులో అసోసియేషన్ తరఫున నూతన భవంతిని నిర్మించి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. -
నిధులు పంచాయతీలకు జమ చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమస్యపై సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సర్పంచులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పంచాయతీలకు రావాల్సిన జనరల్ ఫండ్స్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించారని చెప్పారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న సర్పంచులు 80 శాతం మంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు కావటం వలన పంచాయతీలకు నిధులు ఇవ్వడంలేదని అన్నారు. కనీసం శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితి పంచాయతీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకంలో ఉన్న కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సగం కూలీ డబ్బులు తమకి ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని విమర్శించారు. మీకు ఇంత, మాకు అంత అనే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పేద వాళ్లకు పనిలేకుండా చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడా ల చక్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించిన నిధులు తల్లికి వందనం వంటి పథకాలకు దారి మళ్లించడం అన్యాయమని అన్నారు. దీనివల్ల ఒక పంచాయతీలో కూడా చిన్నపని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం కూడా సర్పంచులకు వర్తింపజేయకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. రొంపిచర్ల మండల పార్టీ కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ -
సిఫార్సు బదిలీలు!
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఈ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా, కేవలం సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. సిఫార్సు ఉన్నవారికే ప్రథమ ప్రాధాన్యం 2019లో సచివాలయ మహిళా పోలీసులకు వచ్చిన ర్యాంకు, వారి అర్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వారికి ఆయా సచివాలయాల్లో పోస్టింగ్ కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేవలం వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే బదిలీలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ విధంగా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికై నా బదిలీ చేస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖరాకండిగా చెబుతుండంతో సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని మహిళా పోలీసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒక్కో లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు ! ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1100 మంది దాకా మహిళా పోలీసులు ఉన్నారు. వీరందరికీ ఆదివారం కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఇందులో రూరల్ ప్రాంతంలో పనిచేసే మహిళా పోలీసులు అర్బన్ ప్రాంతానికి వచ్చేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ఒక్కో మహిళా పోలీసు 5 నుంచి 10 దాకా వారి వారి పలుకుబడిని బట్టి సిఫారసు లేఖలు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్తో పనిలేదు? ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ ఛాలెంజడ్, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగులతో పాటు, స్పౌజ్ కేటగిరి వారికి ప్రథమ ప్రాధ్యానం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ అమలు జరగడం లేదు. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలే పనిచేస్తుండడంతో అర్బన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు రూరల్కు బదిలీ అవుతామేమోననే భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే ప్రాధాన్యం! గుంటూరు సిటీకి వచ్చేందుకు ఒక్కో లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఆందోళనలో మహిళా పోలీసులు -
వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం పాత్ర కీలకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి లీగల్ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటిని ఆదివారం సత్కరించారు. అరండల్పేటలోని లీగల్ విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ముందుగా న్యాయవాదులు, లీగల్ విభాగం నేతలు అంబటిని సత్కరించి, అభినందనలు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన నేపథ్యంలో లీగల్ విభాగం సన్మానించటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లీగల్ విభాగం కృషి ఎనలేనదన్నారు. 2024 ఎనికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి పెట్టే ప్రతి అక్రమ కేసుపై లీగల్ విభాగం ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైతం న్యాయవాదుల కృషి ఎంతగానో ఉండబోతోందన్నారు. మహత్తర శక్తిగా లీగల్ విభాగం ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి కుట్రలను చేధిస్తూ.. వైఎస్సార్ సీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు తామున్నామనే ధైర్యాన్ని కలిస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత జరుగుతున్న దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక మహత్తర శక్తిగా లీగల్ విభాగం పనిచేస్తోందన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయవాదులకు మంచి చేసేలా వైఎస్ జగన్ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. గుంటూరు పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురువేసేందుకు న్యాయవాదుల ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కూటమి పాలనలో అనేక అక్రమ కేసులు చూస్తున్నామని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సయ్యద్ బాబు, సోమసాని ఝాన్సీ, మంజుల, పోకల వెంకటేశ్వర్లు, హబీబుల్లా, వాసం సూరిబాబు, లలిత, వరదాయని, శ్యామల, ఇందిరా, శ్రీనివాసరెడ్డి, కళ్లం రమణారెడ్డి, సింగ్, బొమ్మనబోయిన శ్రీను, వజ్రాల రాజశేఖరరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్, స్వదీప్తి, తార, అబ్రహాం లింకన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు లీగల్సెల్ ఆధ్వర్యంలో అంబటికి సత్కారం -
ప్రైవేటు స్కూళ్ల విద్యా వ్యాపారం
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే 20 శాతం నుంచి 30 శాతం మేరకు పెంచేశారు. ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతికి ఫీజు రూ.18 నుంచి 20 వేల మధ్యలో ఉండగా, కార్పొరేట్ స్కూల్లో అది రూ. 28 వేలుగా ఉంది. కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతికి రూ.35 వేలు, టెన్త్కు రూ.40వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ క్యాంపస్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.60వేలు, టెన్త్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పబ్లిషర్లతో డీల్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టేశాయి. ప్రైవేటు పబ్లిషర్లతో డీల్ కుదర్చుకుని, ఎమ్మార్పీలకు ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్సులు విక్రయిస్తున్నాయి. వీటితో పాటు యూనిఫాం, బెల్టు, టై సహా అన్నీ వారి దగ్గరే తల్లిదండ్రులు కొనాలి. మరికొన్ని పాఠశాలలు మార్కెట్లోని వస్త్ర విక్రయ దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని, యూనిఫాంను ఫలానా దుకాణంలో కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. నాణ్యమైన విద్య..మిథ్య ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్యాంశాల బోధన జరిగాలి. అయితే, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అనధికార పాఠ్య పుస్తకాలతో తరగతులను నిర్వహిస్తున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ద్వారానే బోధించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ, వాటిని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తూట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోఽధిస్తున్న పాఠ్యాంశాలనే ప్రైవేటు పాఠశాలల్లోనూ తప్పనిసరి చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడించింది. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా క్యాంపస్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆన్లైన్లో పుస్తకాలకు ఆర్డర్ పెట్టాలి. పుస్తకాలను కొనుగోలు చేసే విధానాన్ని విద్యాశాఖాధికారులు పక్కాగా పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆన్లైన్ విధానానికి స్విస్తి పలకడంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉండగా, అధిక లాభాలను ఆర్జించిపెట్టే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలనే విక్రయిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ అకడమిక్ కేలండర్కు విరుద్ధ్దంగా సొంత సిలబస్ బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఫీజులు నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు పుస్తకాలు, యూనిఫాం కొనడానికి అప్పులు క్యాంపస్లలోనే యథేచ్ఛగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తక విక్రయాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే బోధించాలనే నిబంధనకు తూట్లు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను కొనుగోలు తప్పనిసరి చేసిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానంతో విద్యాశాఖాధికారులతో పర్యవేక్షణ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేందుకు వీల్లేదు -
సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు పారదర్శకతకు పాతర వేశారు. అసలు ఖాళీలు చూపించకుండానే నిర్వహించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని యూఎల్బీస్(అర్బన్ లోకల్ బాడీస్) అయిన గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీల్లో పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన శనివారం మందిరంలో జరిగింది. ఇందులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఉన్నారు. పారదర్శకతకు పాతర మామూలుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఖాళీలను బట్టి నడుస్తుంది. ముందుగా దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజెడ్, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత సీనియార్టీ, ర్యాంక్ని బట్టి ఉంటుంది. అయితే, అధికారులు ఇవేమి పాటించలేదు. సచివాలయ వివరాలను మూడు ఆప్షన్స్గా చూపించి, ఫారం ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్లిపోండంటూ చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ఈ నెల 30వ తేదీలోగా అలాట్ అయిన సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ కేటాయిస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. అసలు తాము ఇచ్చిన ఆప్షన్స్ ఫాం అయిన ఉంటుందా ? లేక చెత్త బుట్టలో వేస్తారో ! అని ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. వార్డు టూ వార్డు ట్రాన్స్ఫర్లపై మండిపాటు వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే ట్రాన్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా యూఎల్బీ టూ యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కు ట్రాన్ఫర్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొంత మంది మహిళా సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. వార్డు టూ వార్డు పెట్టుకోవడం ద్వారా ఇంకా దాన్ని ట్రాన్ఫర్లు అనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఖాళీలు చూపించకుండా బదిలీలు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోవాలని సూచన 30న సచివాలయం ఎలాట్మెంటు అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల మండిపాటు ఎమ్మెల్యేల లెటర్లకే ప్రాధాన్యత ? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు జరిగింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,082(అర్బన్, రూరల్లకు కలిపి) మంది సెక్రటరీలు ఎంపికయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్కు పోస్టింగ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, పలువురు ఒకే సచివాలయానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫార్సుల లెటర్లు తీసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లే ఆధారంగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ కొంత మంది సీనియర్ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు మిన్నకుండిపోయారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు నగరంలోని అరండల్పేటకు చెందిన జగదీష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. ఒకటో తరగతిలో చేర్పించిన బాబుకు రూ.20వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం అదనంగా రూ.4 వేలు, రెండో తరగతిలో చేర్పించిన అమ్మాయికి రూ.22వేల ఫీజుతో పాటు పుస్తకాల కోసం రూ.5వేలు చెల్లించాలని చెప్పడంతో గుండె గుభిల్లుమంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వెల ఒక్కో విద్యార్థికి రూ.500లోపే కదా అని జగదీష్ అడిగితే వాటిని మార్కెట్లో కొనుక్కోవాలని, తాము సూచించిన వాటిని క్యాంపస్లోనే కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం సూచించింది. నెలకు రూ.15వేలు సంపాదిస్తున్న జగదీష్కు ఇద్దరు పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివించడం భారంగా మారింది. ఇది ఒక్క జగదీష్కే పరిమితమైన సమస్య కాదు.. పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు పడుతున్న సమస్యలకు ఇది ఒక ఉదాహరణ. 7న్యూస్రీల్ -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం
ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ముత్యాలనగర్లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. జూలై 1న అన్ని పట్టణాలలో మున్సిపల్ కార్మికులతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జూలై 4న ధర్నా చౌక్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. -
‘చలపతి’లో చదరంగం పోటీలు ప్రారంభం
ప్రత్తిపాడు: గుంటూరు రూరల్ మండలం లాంలోని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో శనివారం ఆల్ ఇండియా అండర్–19 చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలను చలపతి కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ డైరెక్టర్ ఎం. గోపీనాథ్ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాలకు చెందిన 220 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉత్సాహంగా చదరంగం ఆడారు. మొదటి రోజు విజేతలుగా నిలిచిన వారికి చలపతి విద్యా సంస్థల చైర్మన్ వై.వి. ఆంజనేయులు, ప్రిన్సిపాల్ ఎన్. రామారావు, గోపీనాథ్ నగదు బహుమతులు, షీల్డ్లు అందించి, అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో చెస్ టోర్నమెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు రూ.1.20 లక్షల వరకు నగదు బహుమతులు అందించనున్నట్లు ఆయన చెప్పారు. -
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే వాటిని సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి అని ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి శత జయంతి వర్ష సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు మల్లాది రామనాఽథశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందని తెలిపారు. ● శనగవరసు రామ్మోహనశర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు. ● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారని కొనియాడారు. ● ప్రముఖ ప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్ మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి -
అయితానగర్ను భయపెట్టేందుకే దాడి
తెనాలి: పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని ఎప్పుడు.. ఎవరిని వేధించాలని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ దృక్పథాన్ని, సంస్కృతిని తీసుకురావాలని, ప్రశ్నించే తత్వానికి ఈ సదస్సు వేదిక కావాలని శనివారం రాత్రి తెనాలిలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత చైతన్యానికి, ఉద్యమాలకు గుండెకాయ వంటి అయితానగర్ను భయభ్రాంతులను చేసేందుకు యువకులపై బహిరంగ దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరునూ, వారిని సమర్థిస్తున్న పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ తెనాలి అయితానగర్లోని కమ్యూనిటీ హాలులో జరిగిన సదస్సుకు సమన్వయకర్త పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ దళిత, ప్రజాసంఘాలు మొత్తం 24 పైగా నిర్వాహక కమిటీగా జరిపిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే కేసు పెట్టి, తీర్పులిచ్చి, శిక్షలు వేసేస్తుండటం దారుణమని పేర్కొన్నారు. తెనాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనను సీపీఎం ఖండిస్తోందని తెలిపారు. మానవ హక్కులను కాపాడుకోవడమే మనముందున్న సమస్యగా స్పష్టం చేశారు. ● సీపీఐ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల దారుణంపై ప్రజాప్రతినిధులు, చివరికి హోం మంత్రి సహా సిగ్గుపడకపోగా సమర్థిస్తారా? అంటూ నిలదీశారు. ● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా శిక్షించమని ఏ చట్టం చెబుతోందని అన్నారు. ● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు, వాస్తవంగా పెట్టీ కేసు మాత్రమేనని తెలిపారు. దీనిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు. ● రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ అయితానగర్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోనే కుట్ర మొదలైందని చెబుతూ అందుకే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషనులో స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరును చేర్చినట్టు తెలిపారు. ● ఏపీ ఎమ్మార్పీయస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులు ఐకమత్యంగా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ● విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల చర్య కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని చెప్పారు. ● వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యా సాగర్ మాట్లాడుతూ పోలీసుల దాడివెనుక పోరాట స్ఫూర్తి కలిగిన అయితానగర్ను భయభ్రాంతులను చేయాలనే పాలకుల కుట్ర ఉందని తెలిపారు. ● మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిశోర్ మాట్లాడుతూ ఇంత ఆందోళన జరిగినా కనీసం పోలీసులపై చర్య తీసుకోలేదంటే దళితులపై ప్రభుత్వ చులకనభావమేనని పేర్కొన్నారు. ● సభాధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నేత జి.శాంతకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వై.నేతాజీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ , కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, మాల ఉద్యోగుల సంఘం నేత కిశోర్బాబు, కులనిర్మూలన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ నేత మణి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకా చంద్రశేఖర్, భగత్సింగ్, వేముల మురళి, నీలాంబరం, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రం, ఆర్పీఐ పార్టీ అంబేడ్కరైట్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవిప్రసాద్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడారు. దళిత బహుజన ఫ్రంట్ కొరివి వినయ్కుమార్ స్వాగతం పలికారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో వక్తలు పోలీసుల తీరు, సమర్థిస్తున్న పాలకుల వైఖరిపై ఆగ్రహం తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు -
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
తెనాలి అర్బన్: విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తుందని జిల్లా అదనపు స్కిల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ వీసీహెచ్. ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంచుకుని, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేళాలో 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. మేళాలో 279మంది రిజిస్టర్ చేయించుకున్నారని, వారిలో 112 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిౖకైనట్లు చెప్పారు. ఎంపికై న వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కె.శ్యామ్సుందర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం.రామారావు, కె.కమలకుమారి, జెఏఏ ఎ.శ్రీదేవి, జిల్లా ప్లేస్మెంట్ అధికారి పి.ఈశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా అదనపు స్కిల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి రక్షించారు. రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో దిగింది. బయటకు వచ్చి తమ్మిలేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. సమీపం నుంచి గమనిస్తున్న కార్మికులు వెంటనే స్పందించి రక్షించి ఏలూరు జీజీహెచ్కు తరలించారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్పాల్, మహిళ అన్న ఇద్దరూ ఏలూరు చేరుకున్నారు. ఏలూరు రైల్వే పోలీసులు జీజీహెచ్కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్పాల్కు అప్పగించారు. -
టెండర్లలో తిరకాసు
గుంటూరుశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. అమ్మవారికి బోనాలు పిడుగురాళ్ల: ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని భవానీనగర్లో గల శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.ముగిసిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: రూసా 2.0 కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూ. 10కోట్లతో హబ్ సెంటర్, రూ. 4 కోట్లతో ఎకామిడేషన్ బ్లాక్ ఫర్ ఎంప్లాయిబిలిటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ భవనం నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ ఈ ఏడాది మే 2న విజయవాడకు చెందిన ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. నిర్మాణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు, ఆసక్తి ఉన్న సంస్థలు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశాయి. రూ. 10కోట్లతో భవన నిర్మాణానికి ఏడు, రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గడువు కూడా మే 30తో ముగిసింది. ఒకే సంస్థ టెండర్ ఆమోదం టెండర్లను వెంటనే తెరవాల్సి ఉన్నా 20 రోజుల వరకు ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాత్సారం చేశారు. తెరిచిన తర్వాత రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి దాఖలు చేసిన ఆరు సంస్థల బిడ్లను తిరస్కరించారు. ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి దాఖలైన నాలుగు బిడ్లలో మూడింటిని తిరస్కరించారు. ఒక బిడ్కు అర్హత ఉన్నట్లు తేల్చారు. విచిత్రమేమంటే రెండు భవనాల నిర్మాణానికి ఒకే సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత ఉన్నట్లుగా పొందు పరిచారు. మిగితా వారందరికీ అర్హత ఉన్నా ఎందుకు తిరస్కరించారనేది అం తుచిక్కని విషయం. ఈ అంశాన్ని బయటకు కూడా వెల్లడించడం లేదు. ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఫోన్లు ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా విషయం అడగగానే కట్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహించే శాఖలో, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల టెండర్లలో అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. విస్తుపోతున్న కాంట్రాక్టర్లు రూ.10కోట్లతో నిర్మించే భవనాల కోసం జరిగే టెండర్ల ప్రక్రియలో సాధారణంగా అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక వేళ పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేకపోతే ఒకటి, రెండు సంస్థలు తిరస్కారానికి గురవుతాయి. కానీ ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ఆరు తిరస్కారానికి గురవ్వడంపై కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. మరో భవన నిర్మాణానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే, మూడు తిరస్కారానికి గురవ్వడం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 7న్యూస్రీల్నచ్చిన వారికి కట్టబెట్టేందుకే.. తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనల, ప్రక్రియ ప్రకారం అంతా చేపట్టామని చెప్పుకునేందుకు టెండర్లు ఆహ్వానించారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగానీ, నిధులు వెచ్చిస్తున్న యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విభాగం, ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని పేర్కొంటున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. విద్యలకు నిలయమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల పిలిచిన టెండర్ల వ్యహారంలో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. సొమ్మొకరిది.. పెత్తనమొకరిది అన్నట్లుగా టెండర్లను పర్యవేక్షిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు వ్యవహరించారు. అస్మదీయులుకు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారు. నిర్మా ణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలున్న కాంట్రాక్టర్లను పక్కన బెట్టారు. యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులపై ఏపీఈడబ్ల్యూఐడీసీ పెత్తనంపై కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు తడిపినట్లు ఆరోపిస్తున్నారు. ఏఎన్యూలో నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు అన్ని అర్హతలూ ఉన్న కాంట్రాక్టర్ల దరఖాస్తులు తిరస్కారం నచ్చినవారికి కట్టబెట్టేందుకే నాటకం కాంట్రాక్టర్ల మండిపాటు చిన్నబాబు ఇలాకాలో ఇష్టారాజ్యం ఏపీఈడబ్ల్యూఐడీసీ తీరుపై తీవ్ర విమర్శలు -
సి‘ఫార్సు’ల బది‘లీలలు’
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్ లోకల్ బాడీస్లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్వెంట్ సెక్రటరీలు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రాధాన్యత వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్డ్ సిబ్బందికి, మెడికల్ గ్రౌండ్స్ కింద క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్ ఉన్నవారికి రిక్వస్ట్ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్ రాదు. రూరల్ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11082 మంది సెక్రటరీలు గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్ల దందా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి సెక్రటరీల బదిలీలకు కౌన్సెలింగ్ నచ్చిన సచివాలయంలో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు లెటర్లు ఇప్పిస్తామంటూ కార్పొరేటర్లు నగదు వసూలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్న సెక్రటరీలు -
రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదవి విరుస్తున్న రైతులు ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. త్యాగం చేసిన రైతులకు నష్టం ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. రైతుల్లో పలు సందేహాలు ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్న రైతులు ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం. రైతుల్లో వ్యతిరేకత పరిధి విస్తరణ పేరుతో 43వేల ఎకరాల సమీకరణ భూముల రేట్లు అధికంగా ఉండటంతో ఇచ్చేందుకు రైతుల విముఖత అవసరాల మేరకే తీసుకోవాలంటూ సీఎంని కోరిన అధికార పార్టీ నేతలు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో తమ భూములకు గండికొట్ట వద్దంటున్న రైతులు రెండు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోతాయని భయపడుతున్న గ్రామస్తులు తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులు బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో గల సీడీఎంఏ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వంలో స్పందన లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, జీతం పెంచే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వని కారణంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. 30వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జోన్ల చైర్మన్లు బాబా ఫకృద్దీన్, మధుబాబు, సత్యం, శ్రీనివాసులు, రాజేష్బాబు, ఏసుబాబు, జిల్లా కన్వీనర్లు సతీష్కుమార్, మురళీకృష్ణ, ముకుందం, సురేష్, ప్రసాద్, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మిక జేఏసీ నాయకులు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
పారదర్శకంగా జరపాలి
గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -
కమిటీ సభ్యుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక)చట్టం, పారిశుద్ధ్య పనివారల నిషేధం, పునరావాస చట్టం కింద జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ(అనధికార)లో సభ్యుల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ యు. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సామాజిక సృహ, అవగాహన కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటలో ఉన్నాయని, సంబంధిత ధ్రువపత్రాలతో (రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీలు) జూలై 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని ఆయన సూచించారు. పవర్ లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్ లక్ష్మి చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 69 కేజీల జూనియర్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. స్క్వాడ్లో 177 కేజీలు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంచ్ప్రెస్లో 77.5 కేజీలు, డెడ్లిఫ్ట్లో 155 కేజీలు కలిపి మొత్తం 410 బరువులు అలవోకగా ఎత్తి ఓవరాల్గా మూడో స్థానంలో చాంపియన్గా నిలిచి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ అన్నదాత ప్రసాద్, సంఘ అధ్యక్షులతో పాటు సహచరులు ఆమెను అభినందించారు. -
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమెను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు.అప్పు ఎగ్గొట్టేందుకు హత్యమార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు.భార్యతో చేతులు కలిపి హత్యకు పథకంతెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు. -
కేంద్ర ఆరోగ్య పథకం ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి
లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ జీఎస్టీ పెన్షనర్ల సంఘ నేతలు టి.వివేకానంద, గద్దె తిలక్, పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, కె.సామ్రాజ్యం పాల్గొన్నారు. -
ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జీఎం హనుమా నాయక్
దేశ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలే కీలకం గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హనుమా నాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ మహోత్సవ్ను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమా నాయక్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఐసీఏఐ సంయుక్తంగా నూతన పరిశ్రమలను నెలకొల్పడంలో సహాయ, సహకారాలను అందిస్తాయని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను మెరుగుపరచడంలో సహాయపడతారని వివరించారు. 2018–19 ప్రభుత్వ వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఆరు మిలియన్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పని చేస్తున్నాయని ఆయన వివరించారు. ఎంఎస్ఎంఈలో రకాలు, పెట్టుబడి పరిమితి, నమోదు కోసం ప్రమాణాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఐసీఏఏ బ్రాంచ్ చైర్మన్ చింతా వీఎన్ఎస్ రఘునందన్ వివరించారు. సర్టిఫికెట్ పొందే విధానం, చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు, చెల్లింపులు వంటి అంశాలను తెలియజేశారు. కార్యక్రమంలో సీఏ తిరుమలేశ్వరరావు, ఐసీఏఐ వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షైక్ బాజీ, దేసు సంపత్, సీఏలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. -
ప్రణమిల్లిన భక్త జనం
అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమ ర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది. కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను నోడల్ అధికారి టి.చంద్రకుమార్ పరిశీలించారు. ఆయన వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు ఉన్నారు. -
జీతాల పెంపు, పింఛన్ పునరుద్ధరణ కోరుతూ నిరసన
తాడికొండ: జీతాల పెంపుతో పాటు పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ తుళ్లూరు సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయం ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ.21 వేలు జీతం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అందరికీ రూ.21 వేలు ఇస్తూ, రాజధాని కార్మికులకు మాత్రం రూ.12 వేలు ఇవ్వడం అన్యాయమని ఖండించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు స్పందించి కార్మికుల జీతాలు పెంచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం. భాగ్యరాజు, కార్మిక సంఘం కార్యదర్శి కుంభా గోపిరాజు, నాయకులు లేళ్ల సుఖవేణి, నల్లగొండ వీర్లంకమ్మ, మేకల మేరి, జెట్టి లక్ష్మీతిరుపతమ్మ, వి. బుజ్జి, శిరీష, సీఐటీయూ నేత పేరం బాబూరావు పాల్గొన్నారు. -
ఆభరణాల కోసం వియ్యపురాళ్లు హత్య
పట్టణ శివారులో ఈనెల 19న జరిగిన జంట హత్యల కేసులో ప్రైవేటు బీమా కంపెనీ ఏజెంటు కుసుమకుమారిని ఏ–1 ముద్దాయిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒంటరిగా ఉంటున్న వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70)ను పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో వారు నివాసముంటున్న ఇంటి కిందిభాగంలోనే హత్యకు గురయ్యారు. వారి ఒంటిపై బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. సీసీ కెమెరా నిందితులను పట్టిచ్చింది. ఈ కేసులో కుసుమకుమారితోపాటు ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా, మరొకడు మైనర్ కావడం గమనార్హం. మారీసుపేట రెండుగేట్ల మధ్య ఒక ఇంటిలో వీరు ప్రణాళిక రచించుకోవడం, రెక్కీలు నిర్వహించడం, ఆ ప్రకారం నేరాలకు పాల్పడుతూ వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. -
రాజధాని రైతుల సమస్యలపై అలసత్వం వద్దు
తాడికొండ: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ అధికారులకు సూచించారు. రాజధానిలో రైతులు, రైతు కూలీల పరిష్కారం కోసం తుళ్లూరు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్డేకి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు, రిటర్నబుల్ ప్లాట్లు, వీధిపోటు సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొత్తం 27 ఫిర్యాదులు అందాయని, వాటిలో భూ వ్యవహారాలు– 17, ఇన్ఫ్రా–3, సామాజిక సంక్షేమం –3 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి. శ్రీనివాస నాయక్, ఎం. శేషిరెడ్డి, కె.ఎస్. భాగ్యరేఖ, పి. పద్మావతి, ఏజీ చిన్నికృష్ణ, కె. స్వర్ణ మేరి, జి.రవీందర్, జి.భీమారావు, సీఆర్డీయే సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి. పాండురంగారావు, రామకృష్ణన్, సామాజిక సంక్షేమ విభాగ డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ పి. జయశ్రీ 27 ఫిర్యాదులు అందజేసిన రాజధాని రైతులు -
స్థానికులనూ బయటకు రానివ్వలేదు...
ద్వారకానగర్, ముత్యాలరెడ్డినగర్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే చోదకులు, పాదచారులు అమరావతి రోడ్డుపైకి రాకుండా నిలిపివేశారు. ఆయా రహదారుల వద్ద ఒక్కొక్క కానిస్టేబుల్ను నియమించి, రాకపోకలను నియంత్రించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ర్యాలీ ముగిశాక వర్షం పడటంతో విద్యార్థులు పరుగులు తీశారు. దగ్గర్లోని దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థులను తరలించిన ప్రైవేట్ బస్లు దూరంగా నిలిపివేయడంతో వర్షంలోనే ముద్దగా తడుస్తూ ముందుకెళ్లారు. కొందరైతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు తలపై పెట్టుకుని బయలుదేరారు. మహిళలు తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు ముగిసే సమయానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన తీరుపై నగరవాసులు మండిపడ్డారు. తీరుతెన్ను లేకుండా ఏర్పాట్లు ఉండటం, వర్షం కూడా కురవడంతో గంటల తరబడి రోడ్డుపైనే నానా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. -
బతుకే చిత్తు
ముంచెత్తే మత్తు.. కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్ -
రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ● విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ● తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. ● అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. ● గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ● కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులు పోటీతత్వాన్ని పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్. బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా. ● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్ ఎప్పి విభాగం: హర్షవర్ధన్. బాలికలలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ. -
నేటి నుంచి ఇస్కాన్ రథయాత్ర
ఆటోనగర్(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ వారి జగన్నాథస్వామి రథయాత్ర ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని స్థానిక ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ తెలిపారు. గురువారం 16వ డివిజన్లోని పాత వీబీఎం కాలేజీలోని ఇస్కాన్ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్లతో పాటు టీషర్ట్లు, టోపీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధారిదాస్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు చెప్పారు. జూన్ 27 నుంచి 29 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 3.5 ఎకరాల విస్తీర్ణంలో రథయాత్ర మేళా మహోత్సవం జరగనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా జూన్ 29న సుమంగళి సుభద్ర అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు 1000 మందికి పైగా మహిళలు సుభద్ర అమ్మవారికి 4 ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చి సారె సమర్పించనున్నట్లు చెప్పారు. భవానీపురంలోని సితారా గ్రౌండ్స్, స్వాతి థియేటర్, కనకదుర్గ అమ్మవారి గుడిరోడ్డు మీదుగా రథం సెంటరు సీతమ్మవారి పాదాలు వరకు రథయాత్ర సాగుతుందన్నారు. వారాహి ఉత్సవాలకు శ్రీకారం నాగాయలంక: స్థానిక కృష్ణానదీ తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం సముదాయంలోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో గురువారం శ్రీవారాహి అమ్మవారి ద్వితీయ ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత కనకదుర్గమ్మకు విశేషపూజ, ప్రత్యేక అలంకారం చేశారు. తెల్లవారుజామున వారాహి అమ్మవారి విగ్రహానికి శాస్త్రోక్త పూజలు చేసి కనకదుర్గమ్మ ఎదుట ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ప్రతిష్ఠించారు. వారాహిమాతను పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషే కించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బృందావన శ్రీనివాసుడిని గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులను, భక్తులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టర్ సాదియాకు బంగారు పతకంమంగళగిరి: ఈ నెల 22వ తేదీ నుంచి కర్ణాటకలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, షేక్ సంధానిలు గురువారం తెలిపారు. 57 కేజీల స్క్వాడ్ విభాగంలో 200.5 కేజీలు, డెడ్ లిఫ్ట్లో 185.5 కేజీల బరువులు ఎత్తి ఆల్మాస్ రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్మాస్ను పలువురు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు వెల్లడించారు. మొహరం వేడుకలు ప్రారంభంపొన్నూరు: మొహరం పండుగ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. హాజరత్ మొహమ్మద్ వారి మనుమలు హాజరత్ ఇమామే హసన్, హాజరత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ పట్టణంలోని మొల్లా దహెరా మసీదు వద్ద పీర్ల చావిడిలో పీర్లను పూలతో అలంకరించారు. మేళతాళ వాయిద్యాలతో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా హైదర్, మొల్లా గబ్బర్ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్, మొల్లా ఖలీల్ బాషా, మొల్లా జలీల్, మొల్లా బాజి, మొల్లా నసీర్, మొల్లా రహంతుల్లా, షేక్ గౌస్, మొల్లా అసద్, మొల్లా ఆర్షద్, మొల్లా ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మొల్లా కరీమ్ పర్యవేక్షించారు. జూలై 4వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీడీఏగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు (డీడీఏ)గా ఎ. నాగేశ్వరరావు గురువారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగేశ్వరరావు వైఎస్సార్ కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు(జేడీఏ)గా పనిచేస్తున్న యు.నరసింహారావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నరసింహారావు రిటైర్ అయ్యాక ఎ.నాగేశ్వరరావు ఆయన స్థానంలో కొనసాగనున్నారు. సత్య సాయిబాబా ప్రచార రథానికి స్వాగతం తెనాలి: పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ప్రచార రథం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. శ్రీసత్య సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో బుధవారం రాత్రి తెనాలి వచ్చిన ప్రచార రథానికి ఘన స్వాగతం లభించింది. భక్తులు పలువురు హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి విఠలేశ్వర్, కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ఒక్కో ఎకరాకు విత్తన పసుపు పుట్టి లెక్కన విత్తుతారు. ఒక్కో పుట్టి 225 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం తూములూరు కేంద్రంలో విత్తన పసుపు పుట్టి రూ.5,800 నుంచి రూ.6,000 వరకు పలుకుతోంది. గతేడాదితో పోల్చితే ధర తగ్గింది. గతేడాది పుట్టి రూ.10 వేల వరకు విక్రయించారు. రైతులు ఒక్కో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది పుట్లు విత్తన పసుపు వినియోగిస్తారు. అంటే ప్రస్తుత ధరల ప్రకారం పసుపు విత్తనానికి ఎకరాకు రూ.36 వేల నుంచి రూ.48 వేల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. పసుపు విత్తేందుకు ముందుగా చేలలో ట్రాక్టరుతో సాళ్లు తీసేందుకు రూ.4 వేలు, తర్వాత కూలీలతో పసుపు విత్తటానికి రూ.3 వేల చొప్పున ఖర్చవుతుంది. అంటే కేవలం పసుపు విత్తేవరకు మాత్రమే రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మొత్తం పంట చేతికొచ్చేసరికి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు అనివార్యం. పసుపు సాగుకు కౌలుకు తీసుకుంటే మరో రూ.55 వేలు అదనం. దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డునపడే అవకాశం ఉంది. కానీ చేతికొచ్చేసరికి ఏ ధర ఉంటుందో తెలీని పరిస్థితి. గిట్టుబాటు ధర సంగతి అటుంచి క్వింటా ధర కనీసం రూ.11 వేలు ఉండాలని రైతులు తమ ఆకాంక్ష వెల్లడించారు. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
ఇవేం కష్టాలు బాబోయ్!
నగరంపాలెం, నెహ్రూనగర్: గుంటూరు నగరంలో గురువారం;సీఎం చంద్రబాబు పర్యటన, అవగాహన ర్యాలీ దెబ్బకు ‘ఇవేం కష్టాలు బాబోయ్’ అని ప్రజలు, వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పేరుతో కార్యక్రమం జరిగింది. దీంతో సాయంత్రం వేళ విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ వరకు వాకథాన్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అమరావతి రోడ్డు నుంచి ఫీవర్ ఆసుపత్రి, వయా చిల్లీస్ వరకు రెండు వైపులా రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఎటు తిరిగి వెళ్లినా బారికేడ్లే అమరావతి రోడ్డుకు మొదట ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో చోదకులు, పాదచారులు నాయుడుపేట, శ్రీనగర్ వైపు చుట్టూ తిరిగి వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ అమరావతి రోడ్డు మీదుగా వెళ్తే కొద్దిదూరం బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. కనీసం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నివాసాలలో ఉండే వారిని కూడా వాహనాలు సహా ఆవేశారు. దీంతో పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్తున్న చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే బారికేడ్లకు సమీపాన ఉన్న పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుంటామని ప్రాధేయపడినా పోలీసులు తొలగించలేదు. ఇద్దరు సీఐలు మాత్రం మరింత అత్యుత్సాహం చూపారు. ద్విచక్ర వాహనం ముందుకు వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఓ సీఐ మొబైల్ ఫోన్ చేత్తో పట్టుకుని హల్చల్ చేశారు. పిల్లలను తీసుకొని వచ్చిన ఓ మహిళైతే ఇల్లు దగ్గరే అని చెప్పినా, అర్ధగంట తర్వాత మాత్రమే పంపిస్తానని పోలీసులు చెప్పారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు. సీఎం రాకతో అమరావతి రోడ్డులో అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనదారుల నిలిపివేత ఆమడ దూరంలోని ఇళ్లకు వెళ్లేందుకూ ప్రజలకు ఇక్కట్లు వర్షంలో తడిసి ముద్దయిన విద్యార్థులు, మహిళలు నేడు ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ ప్రారంభం సీఎం చంద్రబాబు రాక ప్రత్తిపాడు: ఏఐ ఉపయోగించి వినూత్న పోలీసింగ్, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ పోలీస్ శాఖ ‘ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్’ను ప్రారంభించనుంది. గుంటూరు రూరల్ మండలం చౌడవరంలోని ఆర్వీ ఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరగనున్న హ్యాకథాన్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇప్పటికే 60కుపైగా బృందాలు దేశ విదేశాల నుంచి పలు విద్యాసంస్థలు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చాటిన బృందానికి రూ. 10 లక్షల నగదు బహుమతి, ఏపీ పోలీసు శాఖ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. -
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు సమర్పించారు. తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హోం శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి గురువారం ఉదయంఆషాఢ సారె సమర్పించారు. -
అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికల సంఘాల జేఏసీ చైర్మన్ మధుబాబు తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో కలిసి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేదని వాపోయారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం సీడీఎంఏ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు నేడు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
రేపు సీఎం చంద్రబాబు రాక
ఏర్పాట్లను పరిశీలించిన అధికారుల బృందం ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలకు రానున్నారు. ఏపీ పోలీస్ శాఖ ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో బుధవారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పాటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హ్యకథాన్ జరిగే కార్యక్రమ వివరాలపై ఐటీ రంగ నిపుణులతో, కళాశాల సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి, ఐజీ శ్రీకాంత్, ఎస్పీ పి. సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ సంజన సింహా, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ పి. వెంకటేశ్వరరావు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డీఎంహెచ్వో కె.విజయలక్ష్మి, ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అండ్ ఆర్డీ డైరెక్టర్ కె.రవీంద్ర, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో 16.4 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16.4 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 2.6 మి.మీ. పడింది. సగటున 6.9 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలంలో 10 మి.మీ., కొల్లిపర 9.2, తుళ్ల్లూరు 8.8, చేబ్రోలు 8.2, ప్రత్తిపాడు 7.8, తాడేపల్లి 7.6, మంగళగిరి 7.4, తాడికొండ 6.4, పెదకాకాని 6.2, గుంటూరు తూర్పు 6, గుంటూరు పశ్చిమ 5.6, పెదనందిపాడు 5.6, వట్టిచెరుకూరు 5, ఫిరంగిపురం 4.4, కాకుమాను 4, మేడికొండూరు మండలంలో 3.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. డెప్యూటీ తహసీల్దార్లు బదిలీ నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్ సాల్మన్ను నాదెండ్లకు, ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సు బ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్ నాయక్ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్ను ముప్పాళ్లకు, ఎన్.అనూరాధను యడ్లపాడుకు, షేక్ బాషా ను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్.లక్ష్మీప్రసాద్ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్ను కారంపూడికి బదిలీ చేశారు. -
వైఎస్సార్ సీపీలో పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సైదా ఖాన్ను పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సురసాని వెంకటరెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్ !
పత్తి, మిర్చి విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రత్తిపాడు: కొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలు సమయంలో రైతులంతా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ● వ్యవసాయశాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ● కొనే సమయంలో వ్యాపారి నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ● జిన్నింగ్ లేదా లూజుగా ఉన్న పత్తి విత్తనాలు, కంపెనీ పేరు లేని ప్యాకెట్లు కొనకూడదు. ● పగిలిన ప్యాకెట్లు, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబరు, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీ, నికర తూకం, నికర ధరతో పాటు కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పై వివరాలన్నీ ఉంటేనే రైతులు బిల్లును తీసుకోవాలి. ● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సంచులపై కంపెనీ సీలు ఉన్నదో లేదో గమనించుకోవాలి. ● విక్రయదారుడు ఇచ్చిన బిల్లును పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరుచుకోవాలి. ● అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లును మాత్రం కచ్చితంగా అడిగి తీసుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని పరిశీలించాలి. ● సంతృప్తిగా ఉన్న విత్తన రకాలనే వాడాలి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే వీలుంటుంది. గతంలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు 2019కు ముందు వరకు నకిలీల బెడద రైతులను తీవ్రంగా వెంటాడేది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే వాటి ద్వారా భరోసా, గ్యారెంటీ ఇస్తూ నాణ్యమైన, రాజీలేని ఉత్పత్తులను అందించింది. దీంతో రైతులు ఆయా కేంద్రాల ద్వారానే పత్తి, మిర్చి విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత రైతుభరోసా కేంద్రాల పేరును మార్చి రైతు సేవ కేంద్రాలుగా నిర్వహిస్తున్నప్పటికీ అందులో సేవలు మాత్రం శూన్యమనే చెప్పాలి. లైసెన్సు ఉన్న వారి నుంచే కొనాలి విత్తనాలను కచ్చితంగా లైసెన్సు ఉన్న అధీకృత డీలరు వద్దే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకుని డీలరుతో సంతకం చేయించుకోవాలి. రైతు కూడా బిల్లుపై సంతకం చేయాలి. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లుతో పాటు విత్తనాల ప్యాకెట్ కవరును భద్రపరుచుకోవాలి. రైతులు నకిలీల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం. దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడతాం. – షేక్ సుగుణా బేగం (ఏవో, ప్రత్తిపాడు) -
సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట
కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన లక్ష్మీపురం: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం వీఆర్ఏలు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పేరుతో హామీలు అమలు చేశామంటూ పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ ఉత్సవాలు చేసుకుంటోందని విమర్శించారు. వాటిలో వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాడు నిర్వహించిన యువగళం, పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులతో సమావేశం జరిపి, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది నేటికీ అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు వేతనాలు ఇస్తోందని, ఇక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఎందుకు ఆలోచించట్లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలకు గతంలో డీఏను వేతనంతో కలిపి ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం విడిగా ఇవ్వడంతో పెరుగుదల లేదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతనాలు పెంపు లేని కారణంగా వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీఆర్ఏలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఉంటున్నారని, వారి సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేస్తామని లక్ష్మణరావు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నిసా, షేక్ ఆదం షఫీ, ఎన్. రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య పాల్గొన్నారు. -
అవగాహనతోనే మాతృ మరణాలకు అడ్డుకట్ట
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడంతో మాతృ మరణాలు నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మే నెలలో గుంటూరువారితోట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన మాతృ మరణానికి గల కారణాలను కమిటీ సభ్యులు సమీక్షించారు. కూలంకషంగా చర్చించాక ఈ మరణం నివారించలేనిదిగా నిర్ణయించినట్లు డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు సంభవించకుండా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాతృ మరణాలకు గల కారణాలపై గర్భిణులు, బాలింతలతోపాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణులు కూడా క్రమం తప్పకుండా వైద్యాధికారి వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తీసుకోవడం లాంటి చర్యలతో మాతృ మరణాలను పూర్తిగా నివారించవచ్చని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ రంగారావు, డాక్టర్ ఝాన్సీవాణి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ ఆదిత్య ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రాధికా రాయుడు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, శ్రీధర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు. న్యాయవాదుల విశిష్టతకు పుస్తక రూపం అభినందనీయం తెనాలి: న్యాయవాదుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని పలువురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన ‘తెనాలి లాయర్స్ డైరీ–2025’ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తెనాలి కోర్టు ప్రాంగణంలోని మహిళా న్యాయవాదుల భవనంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. 11వ అదనపు జిల్లా జడ్జి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.పవన్కుమార్, ఫస్ట్ ఏఎంఎం వివేక్వర్ధన్లు పాల్గొన్నారు. తెనాలి లాయర్స్ డైరీతో ఈ ప్రాంత న్యాయవాదుల ప్రాముఖ్యతను, సమాచారాన్ని పొందుపరచడం ఉపయోగకరమని జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, నాయయవాదులు వెలినేని రాఘవయ్య, మద్ది మల్లికార్జునరావు, ఎం.జగదీశ్వరాంబ, ఎ.విజయలక్ష్మి, గుమ్మడి రవిరాజ్ మాట్లాడారు. తెనాలి లాయర్స్ డైరీ రూపకల్పన చేసిన గుంటూరు కృష్ణను సత్కరించారు. -
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. తెరపైకి పాత అక్రమ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కారు స్వాధీనం తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల పేరిట బెదిరింపులు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు అధికార పక్షమైతే ఓకే... వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
రెచ్చిపోతున్న
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.వాగులో లారీ బోల్తాప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.ఆలయ నిర్మాణానికి విరాళంనరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.భక్తి శ్రద్ధలతో చండీహోమంనగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. -
బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం
బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మార్క్ఫెడ్ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, యాప్లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు. -
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ఎంపిక
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు. -
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి
ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ -
వైఎస్సార్సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.ఖతార్లో ఉద్యోగావకాశాలుగుంటూరు వెస్ట్/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలో టీఐసీ అండ్ ఏ, ఆర్సీ మల్టీ వెల్డర్ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్ ఏఆర్సీ మల్టీ వెల్డర్కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్ ఏఆర్సీ వెల్డర్కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసంఅభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.27న నిధి ఆప్కే నికత్గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎస్.తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. గుంటూరులోని ఏసీ కళాశాల, కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులోని దీపక్ నెక్ట్స్జెన్ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్ఆర్ పురంలో సౌత్ సెంట్రల్ జోన్ మెటలి ఫెరస్ మైన్స్ గ్రూప్లోని ప్రకాశం వృత్తి శిక్షణ కేంద్రం, విజయవాడలో ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని విజన్ ఎడ్యుకేషన్ సొసైటీ, పల్నాడు జిల్లా గణపవరంలోని శ్రీధనలక్ష్మి కాటన్ అండ్ రైస్ మిల్లు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశాలకు ప్రకటనగుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
ఇళ్లు కట్టిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
తెనాలి రూరల్: పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా తెనాలి మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, నేలపాడు గ్రామాలలో పలువురికి స్థలాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఆ క్రమంలో ఎస్జీ బిల్డింగ్ వర్క్స్ పేరిట పట్టణ మారీసుపేట 24వ వార్డు శాంతినగర్కి చెందిన కాంట్రాక్టర్ కం ఏజెంట్ ఎం. పున్నారావు తెరపైకి వచ్చాడు. తాను తక్కువ ఖర్చుతో సకాలంలో ఇళ్లు కట్టిస్తానని సుమారు 175 మంది లబ్ధిదారులను నమ్మించాడు. వారి నుంచి అటు ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇటు లబ్ధిదారుల సొంత డబ్బు అందినకాడికి దండుకుని కొద్దిపాటి పనులు మాత్రమే చేశాడు. లబ్ధిదారులను ఇన్నాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 58 మంది బాధితులను విచారించి మంగళవారం పున్నారావును అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో పేదలను మోసం చేసిన మరో ఏడుగురు కాంట్రాక్టర్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. -
జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓగా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పదోన్నతి పొంది రాష్ట్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు పలువురు వైద్యులు అభినందించారు. -
కొనుగోలులో జాప్యం తగదు
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీ ఎన్నిక సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9న సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు -
కనకదుర్గ వారధిపై బైకును ఢీకొన్న లారీ
● బైక్పై ఉన్న వ్యక్తి కృష్ణానదిలో పడిన వైనం ● కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు ● పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం తాడేపల్లి రూరల్: జాతీయ రహదారిపైనున్న కృష్ణానది కనకదుర్గ వారధిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఓ లారీ మంగళవారం రాత్రి అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి వారధిపై నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో పడ్డాడు. లారీ రెయిలింగ్ను ఢీకొని ఎదురు క్యాబిన్ వరకూ వారధిపైనుంచి గాలిలో వేలాడింది. సేకరించి వివరాల ప్రకారం.. చైన్నె నుంచి కోలకత్తా వెళుతున్న లారీ కనకదుర్గ వారధి వద్దకు వచ్చాక బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు బైక్పై వెళుతున్న తాజ్ అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తాజ్ గాలిలో ఎగిరి 60 అడుగుల లోతులో ఉన్న కృష్ణానది ఇసుక దిన్నెల్లో పడిపోయాడు. లారీ నడుపుతున్న ఎంపీకి చెందిన మోసిన్ లారీ క్యాబిన్ డోర్ ఓపెన్ అయి వారధిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రోప్ సహాయంతో పై నుంచి కిందకు దిగి ఎస్ఐ నారాయణ, సిబ్బంది కలిసి ఇసుక తిన్నెల్లో పడిన తాజ్ను కిలోమీటర్ మేర మోసుకొచ్చి వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఇతను ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీని రెండు గంటలపాటు కష్టపడి క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వారధిపై ప్రమాదం జరగడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఉపాధి హామీ పనుల్లో లోపాలు
రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి సుందర్రావు, టీఏ మాధవి, ఎస్ఆర్పీ బి ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధన లక్ష్మి, ప్రసన్న ఉన్నారు. -
భార్యపై అనుమానంతో వ్యక్తి హత్య
భట్టిప్రోలు(వేమూరు): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి భట్టిప్రోలులో చోటుచేసుకుంది. వేమూరు రూరల్ సీఐ వీరాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన చాగళ్లమర్రి రత్నరాజు, జంపని సురేష్ స్నేహితులు. రత్నరాజు తాపీ పనిచేస్తుండగా, సురేష్ వడ్రంగి పనిచేస్తున్నాడు. రత్నరాజు భట్టిప్రోలు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె భట్టిప్రోలులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి రత్నరాజు భట్టిప్రోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జంపని గ్రామానికి చెందిన జంపని సురేష్ తారసపడ్డాడు. దీంతో రత్నరాజు అతనిని ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రత్నరాజు తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. -
లోక్ అదాలత్ ఇచ్చేది అంతిమ తీర్పే
సత్తెనపల్లి: లోక్ అదాలత్లో ఇచ్చేది అంతిమ తీర్పుగా భావన చేయాలని మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆధ్వర్యంలో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సెక్షన్లు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఆయా ఎస్.హెచ్.వో లకు సూచనలు చేశారు. ముందు సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు, ఎస్.హెచ్.ఓ లతో గుంటూరు జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియాఉద్దీన్లు వర్చువల్గా జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష చేశారు. అనంతరం స్థానిక న్యాయమూర్తులు స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె. సుజన్ కుమార్, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జాతీయ లోక్ అదాలత్పై ఎస్హెచ్ఓలతో సమీక్ష -
సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం
నగరంపాలెం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) ను సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించారు. ఆయా సమస్యలకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్లో మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంత్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), ఎ.శివాజీ రాజు (సీసీఎస్) కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బెదిరిస్తున్నారు స్థానికంగా ఇంటి వద్ద ఇద్దరు రౌడీషీటర్లు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వారిద్దరు ఏకమై, నన్ను ట్రాప్ చేశారు. బలత్కారం మినహా పనులన్నీ చేశారు. దీని ఆసరా చేసుకుని నా వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి రూ.40 వేలను విడతల వారీగా తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇంట్లో నుంచి తీసుకువచ్చి వారికి ఇచ్చా. మరలా ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. నమ్మకంగా నమ్మించి నగదు కాజేశారు. రౌడీషీటర్ భార్య కూడా నన్ను బెదిరిస్తోంది. ఏదైనా చేస్తారని భయంగా ఉంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నా. – ఓ బాలిక, గుంటూరు సహచర కానిస్టేబుల్ మోసం మంగళగిరి సబ్ డివిజన్లోని ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. సహచర కానిస్టేబుల్ కమీషన్ల కోసం ఓ ప్రైవేటు కంపెనీ పాలసీలు చేయించాడు. వాటికి సంబంధించి నగదు చెల్లించ లేదు. ఈలోగా అతడి భార్య ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు అడగ్గా, రూ.1.20 లక్షలు ఇచ్చాను. సదరు కానిస్టేబుల్ తర్వాత నా బంగారం కూడా తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకున్నాడు. గతంలో ఇచ్చిన డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. న్యాయం చేయగలరు. – బి.అంకరాజు, ట్రాఫిక్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ -
● రూ. 3 లక్షల విలువైన మెత్ డ్రగ్ స్వాధీనం ● బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తుండగా పట్టుకున్న ఈగల్ టీమ్
టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి, మెత్ డ్రగ్స్ను ఈగల్ టీమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఈగల్ టీమ్ సోమవారం కాజ టోల్ గేట్ వద్ద నిఘా వేసింది. యువకుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలాల్లో అస్థిపంజరం లభ్యం తెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై ‘అమ్మా’నుషం తాడేపల్లి రూరల్ : వ్యభిచారంలోకి దించిన కన్నతల్లిపై మైనర్ కూతురు తాడేపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో సహజీనం చేస్తూ వడ్డేశ్వరం వచ్చి నివసిస్తోంది. 17 ఏళ్ల కూతురిని కూడా అతనితో ఉండాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు వ్యభిచారం వృత్తిలోకి దింపింది. ఈ బాధలు భరించలేక బాలిక పక్కింట్లో నివాసముంటున్న మహిళ సాయంతో తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసింది. -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు. అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా బుజ్జిబాబు గుంటూరు ఎడ్యుకేషన్ : న్యూజిలాండ్లో అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం కో–ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్గా న్యూజిలాండ్లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు. ‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు రాజుపాలెం: నడికూడి రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాఽథ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. యువకుడి బలవన్మరణం చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
28న తెనాలిలో మానవ హక్కుల పరిరక్షణ సదస్సు
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): తెనాలి పోలీసుల అరాచకత్వాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ తెనాలి పట్టణంలో జూన్ 28న సాయంత్రం 4 గంటలకు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సోమవారం పరిరక్షణ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ తెనాలి పోలీసులు దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో, బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీలు విరిగేటట్లుగా అమానుషంగా దాడి చేసిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సీఐ రాముల నాయక్, తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబులతో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. దళిత యువకులపై నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సమర్థించి వత్తాసు పలికిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, దళిత బహుజన ఫ్రంట్, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, రెల్లి సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. -
తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ధూళ్ళిపాళ్ల రమాదేవి సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కల్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో సీట్లకు 89 మంది విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వ విద్యాలయాల్లో (ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు గుంటూరు జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సోమవారం ప్రకటించిన జాబితాలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి టెన్త్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్మీడియెట్తో పాటు బీటెక్తో ఆరేళ్ల ప్రోగ్రామ్కు అర్హత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 94.78 శాతం మేరకు ఉన్నట్లు ప్రవేశాల జాబితాలో పొందుపర్చారు. గుంటూరు జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీల వారీగా నూజివీడు–31, ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ– 16, ఒంగోలు–35, శ్రీకాకుళంలో–7 చొప్పున ఉన్నారు. ఎంపికై న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్తో పాటు ప్రభుత్వ వాట్సాప్ సేవల నంబరు 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా క్యాంపస్లలో ఈనెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్కు విద్యార్థులు హాజరు కావాలి. ● గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.నాగసాయి రోషిణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా 573 మార్కులు సాధించడం ద్వారా ప్రవేశం పొందిన ఆమెను డీఈవో సీవీ రేణుక, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మజ అభినందించారు. -
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి లేదా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు. సీనియార్టీ ప్రకారం సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు, కోశాధికారి నాగిపోగు సుమన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ పాల్గొన్నారు. -
కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సాగునీటి కాలువలు మురుగు నీటి మయమై ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ కృష్ణా డెల్టా ఆయకట్టు సుమారు 5.71 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి సాగునీటి కాలువల పరిస్థితి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం, అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, నాయకులు పాపారావు, రైతులు పాల్గొన్నారు. హైవేలపై ప్రమాదాల నివారణకు ఆధునిక వాహనాలు ఆర్టీఓ బి. సత్యనారాయణ ప్రసాద్ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు పెట్రోలింగ్ ఆధునిక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వాహనాలు 5, 9 నంబర్ల జాతీయ రహదారులపై నిత్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు. నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రిడ్జి మీదకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లాడ్జి సెంటర్ వద్ద, డొంక రోడ్డు నుంచి కొత్తపేట వైపు వెళ్లేటప్పుడు మలుపుల వద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు. నాట్యంపై రాత పరీక్షలు ప్రారంభం కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లొమా రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాఽథశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. -
బిడ్డ చదువుకు అండగా నిలవాలి !
తెనాలి: తన బిడ్డ చదువుకు సంబంధించి అర్జీని సమర్పించేందుకుని ట్రై సైకిల్పై కార్యాలయానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని చూసిన సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి, సమస్య ఏమిటని ఆరా తీశారు. ఆయన చెప్పింది సావధానంగా విని అర్జీని తీసుకున్నారు. పరిశీలిస్తానని హామీనివ్వటంతో సంతోషపడ్డారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సమావేశం సందర్భంగా ఈ అంశం చోటుచేసుకుంది. పరిష్కార వేదికపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సబ్కలెక్టర్ సంజనా సింహా, వల్లభాపురంలో వివాహిత ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. సమస్యను తెలుసుకుని వారి నుంచి అర్జీని స్వీకరించిన సబ్కలెక్టర్, అక్కడికి దగ్గరలోనే దివ్యాంగుడు ఒకరు ట్రైసైకిల్పై ఉండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ కింద తన కుమారుడును స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు. ఒకటి, రెండు తరగతులు ఉచితంగానే విద్యను అందించిన పాఠశాల యాజమాన్యం గతేడాది 3వ తరగతికి సంబంధించి రూ.22 వేలు, ఈ విద్యాసంవత్సరం రూ.8 వేలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రైట్ టు ఎడ్యుకేషన్ కింద చేర్చుకున్నారు కదాని అడిగితే ఆ ఒప్పందం గతేడాదితో రద్దయిందని చెబుతున్నారని సబ్ కలెక్టర్కు విన్నవించారు. పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహా హామీనిచ్చి, అర్జీని తీసుకున్నారు. దివ్యాంగుడి వినతి దగ్గరకెళ్లి అర్జీని స్వీకరించిన సబ్కలెక్టర్ సంజనా సింహా -
ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లు మంజూరు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సాధికారత లక్ష్యంగా ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం క్రెడిట్ క్యాంపును అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఏపీలోని అమరావతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి జోన్లల్లోని ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లను మంజూరు చేశారు. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ్ బజరంగ్సింగ్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, టీజీ) ప్రణేష్కుమార్ అధ్యక్షత వహించారు. శివ్ బజరంగ్సింగ్ మాట్లాడుతూ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషిస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్లు ఎన్.గౌరీశంకరరావు (అమరావతి), ఎం.రాజేష్ (విజయవాడ), అమరావతి జోన్ డెప్యూటీ జోనల్ మేనేజర్ కస్తూరి కృష్ణమోహన్, ఎం.శేషగిరిరావు పాల్గొన్నారు. వర్చువల్గా పలువురు జోనల్ మేనేజర్లు, డెప్యూటీ జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కు అందిస్తున్న బ్యాంక్ ఉన్నతాధికారులు -
ఆగ్ర హం
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్, సోషల్మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్కుమార్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు దానం వినోద్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల విజయ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ మాట్లాడారు. అనంతరం నిరసన సభ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా పార్టీ, యువజన, విద్యార్ధి విభాగం నేతలు ముందుకు సాగారు. కలెక్టర్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని, సహకరించాలని కోరడంతో పది మంది ముఖ్యనేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. తొలుత తూర్పు నియోజకవర్గ నుంచి పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ద్విచక్ర వాహనాలు ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, శేషగిరి పవన్, మేరి కుమారి, జగదీష్, పేటేజీ బాజీ, యువజన విభాగం నేతలు మహ్మద్ గౌస్, పులగం సందీప్రెడ్డి, కోటిరెడ్డి, చుండు వెంకటరెడ్డి, గౌతమ్, సాంబశివరావు, కొండమడుగుల గోపిరెడ్డి, ఈదా యశ్వంత్రెడ్డి, సూరజ్, వంగా సీతారామిరెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు. పోలీసు జులుంపై -
వృద్ధురాళ్ల హత్య కేసులో నిందితుల అరెస్ట్
సమీప బంధువులకు కూతురు సమాచారం తెనాలి రూరల్: స్థానికంగా సంచలనం రేకెత్తించిన వితంతు వియ్యపురాళ్ల జంట హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ, యువకుడు, మైనర్ బాలుడు ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ ఎస్.రమేష్బాబు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వివరాలను వెల్లడించారు. పరిమి రోడ్డులో నివసించే దాసరి రాజేశ్వరి(59), పీటా అంజమ్మ(70) ఈనెల 19న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుల సమీప బంధువు మోర్ల రాజారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమకుమారి, పరిమి రోడ్డుకు చెందిన ఇళ్ల గోపీకృష్ణ, చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ కలాం(మైనర్)ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు రాజేశ్వరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె చైన్నెలో ఉండగా కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రాజేశ్వరి భర్త నాలుగు సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఆమె వియ్యపురాలు పీటా అంజమ్మ భర్త కూడా రెండేళ్ల కిందట మృతి చెందాడు. అంజమ్మ, రాజేశ్వరి వియ్యపురాళ్లు కావడంతో ఇద్దరు పరిమి రోడ్డులోనే కలిసి ఉంటున్నారు. వృద్ధుల ఆలనా పాలన సమీప బంధువు వీరేష్బాబు చూస్తున్నాడు. మహిళలు ఇద్దరు డాబా పై భాగంలో ఉంటున్నారు. కింది భాగంలో నాలుగు గదులు, గతంలో అప్పడాల ఫ్యాక్టరీ నిర్వహించిన ప్రాంతం ఖాళీగా ఉంది. దానిని అద్దెకిచ్చేందుకు బోర్డు పెట్టారు. మృతులు ఉంటున్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చిన రాజేశ్వరి కుమార్తె ధనలక్ష్మి చైన్నెలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో.. మృతుల వద్ద బంగారం, నగదు ఉందన్న విషయాన్ని గుర్తించిన నిందితులు వారిని హతమార్చి, అపహరించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం వచ్చి ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో మాటలు కలిపారు. లోపలకు చొరబడి తూకం రాయితో దాడి చేసి రాజేశ్వరిని హతమార్చారు. వియ్యపురాలు కిందకు వెళ్లి చాలాసేపటికి పైకి రాకపోవడంతో అంజమ్మ పైనుంచి కేకలు వేసింది. ఆమెను రాజేశ్వరి పిలుస్తోందని రమ్మని కుసుమకుమారి చెప్పడంతో కిందకు వచ్చిన ఆమె గొంతుకు టవల్ బిగించి హతమార్చారు. రాజేశ్వరి మెడలో ఉన్న బంగారపు నాంతాడు, అంజమ్మ చేతులకు ఉన్న నకిలీ గాజులను అపహరించారు. మృతుల్లో ఒకరి చేతిలో కరన్రు, మరొకరి చేతిలో తూకం రాయిని ఉంచి, ఇద్దరూ పరస్పరం ఘర్షణ పడడంతో మృతి చెందారన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేసి ఉడాయించారు. చైన్నెలో ఉన్న రాజేశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఇద్దరూ స్పందించకపోవడడం, సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో కంగారు పడిన ఆమె, సమీప బంధువులైన వీరేష్, రాజారావును ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు వచ్చి చూడగా రాజేశ్వరి, అంజమ్మ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు. విషయాన్ని వెంటనే వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అపహరించిన బంగారాన్ని తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకొని వాటిలో కొంత నగదును ఖర్చు చేశారని, మిగిలిన రూ.34,500ను, నాంతాడు, నకిలీ గాజులను, వారు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసులో నిందితురాలైన మహిళ కుసుమకుమారి గోపీకృష్ణ, కలాంలతో కలసి గత నెలలో కూడా ఇదే తరహాలో తన ఇంటి ఎదురు నివసించే మరో మహిళను కూడా హతమార్చి బంగారం అపహరించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీఎస్పీ చెప్పారు. మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన సీఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ షేక్ కరీముల్లా, సిబ్బంది పి. మురళి, ఎస్. జయకర్, డి. సురేష్ బాబు, కల్యాణిలను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. మైనర్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే ముఠా గత నెలలో మరో మహిళను హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడి -
‘యువత పోరు’ హోరు
గుంటూరులో యువతను అడ్డుకుంటున్న పోలీసులు మోసం బాబు సహజ లక్షణం ● ఎగసిపడ్డ యువ కెరటాలు ● గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన యువత ● అధికారులకు వినతిపత్రం అందజేత ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ చంద్రబాబుకు మోసం చేయడం పుట్టుకతో వచ్చిన సహజ లక్షణమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలనిచ్చి యువత భవిష్యత్తును నట్టేట ముంచారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రతి ఒక్క యువతి, యువకుడికి చంద్రబాబు రూ. 36వేలు బకాయి పడ్డారని, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలండర్ అతీగతీ లేకుండా పోయిందని ఫాతిమా విమర్శించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి మాట్లాడుతూ హామీలను నెరవేర్చలేని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారన్నారు. ఫీజురీయింబర్స్ బకాయిలు, వసతిదీవెన, యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు.. అన్నీ ఎగ్గొట్టారని విమర్శించారు. డబ్బులు లేవంటూ అన్ని వర్గాల ప్రజలను నిలువునా వంచించారన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో యువత కోసం పోరాటాలకు తాము సిద్ధమన్నారు. ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా, ఇదేమని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని, వీటిపై యువత తిరబడే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని ఉత్తేజ్రెడ్డి హెచ్చరించారు. యువత కోసం పోరాటాలకు సిద్ధం ఉద్యోగాలు ఊడపీకిన బాబు పార్టీ యువజన విభాగం రాష్ట్ర జోనల్ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్. జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తెలిపారు. అందులో పావు వంతైనా ఇచ్చిన పా పాన చంద్రబాబు పోలేదని మండిపడ్డారు. 20లక్షల ఉద్యోగాల సంగతి పక్కన బెడితే వలంటీర్లు మొదలుకుని నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఊడపీకారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న లోకేష్ 400 రోజులు అయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
కూటమి సవతి తల్లి ప్రేమ
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై పని చేస్తున్న ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. బదిలీల్లో అన్యాయాన్ని నిలదీస్తూ ఆదివారం గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో 339 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిమిత్తం వీరిని ఆదివారం గుంటూరులోని డీఈవో కార్యాలయానికి రావాల్సిందిగా విద్యాశాఖాధికారులు సమాచారం పంపారు. అయితే, ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఆయా మండలాలకు పంపేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుంటూరులోని డీఈవో కార్యాలయంలో డీఈవో సీవీ రేణుక అధ్యక్షతన కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేస్తున్న 1998, 2008 డీఎస్సీల క్వాలిఫైడ్స్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల అన్యాయాన్ని ఎండగడుతూ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆందోళనకు దిగారు. మానవత్వంతో ఉద్యోగాలు ఇచ్చిన జగన్ 1998, 2008 డీఎస్సీల ద్వారా ఎంపికై న క్వాలిఫైడ్స్ అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వాలు ఉపాధ్యాయులుగా నియామకాలు కల్పించలేదు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. రాష్టవ్యాప్తంగా ఆందోళనలు సైతం నిర్వహించారు. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గత సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో నెలకు రూ.30వేల వేతనంతో ఎంటీఎస్ పద్ధతిపై ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్ ఇచ్చారు. అధికారుల వైఖరికిపై తీవ్ర నిరసన తాజాగా ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని మారుమూల మండలాల్లో పాఠశాలలు ఖాళీ అయ్యాయి. అక్కడకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న ఎంటీఎస్లను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియామక సమయంలో వారికి సొంత మండలంలోనే పని చేసేందుకు వెసులుబాటు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఒక్కో ఉపాధ్యాయుడిని 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు బదిలీపై పంపాలనే అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ 50 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చిందని, కేవలం రూ.30వేల వేతనంతో ఇళ్లు, పిల్లలను వదిలి దూర ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లి, ఏ విధంగా పని చేయాలనే ఆవేదనతో కౌన్సెలింగ్ను బహిష్కరించారు. న్యూస్రీల్ఎట్టకేలకు దిగి వచ్చిన అధికారులు ఎంటీఎస్ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన విద్యాశాఖాధికారులు ఆదివారం సాయంత్రం 4.00 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్లాక్ చేసిన ఖాళీలను ఓపెన్ చేశారు. 339 మంది ఉపాధ్యాయులకు 620 ఖాళీలను ప్రదర్శించి, కౌన్సెలింగ్ ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని పాఠశాలలకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను పంపేందుకు విద్యాశాఖ ప్రయత్నం డీఈవో కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ బాయ్కాట్ సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ 1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్స్కు ఎంటీఎస్ ప్రాతిపదికన నియామకాలు కల్పించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 339 మంది టీచర్లు బాధించడం తగదు 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయినప్పటికీ పోస్టింగ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూసిన తరువాత గత ప్రభుత్వంలో ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఖాళీలు లేవని, బొల్లాపల్లి మండలం వెళ్లమని చెబుతున్నారు. నెలకు రూ.30వేల వేతనంపై పని చేస్తూ, ప్రతి రోజూ గుంటూరు నుంచి బొల్లాపల్లి వెళ్లడం సాధ్యపడుతుందా ? మరో నాలుగేళ్లలో ఉద్యోగ విరమణ పొందనున్న సమయంలో ఈ విధంగా బాధించడం తగదు. – కటకం శారద, గుంటూరు పల్నాడులో సర్దుబాటు చేసే యత్నం ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న 339 మంది ఎంటీఎస్ టీచర్లను పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల్లో సర్దుబాటు చేయాలని అధికారులు చూస్తున్నారు. సొంత మండలంలో పని చేసే అవకాశాన్ని దూరం చేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. –ఎం. సాంబశివరావు, రేపల్లె -
గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం
ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు పాతెర
పట్నంబజారు: కార్లు, ఇతర వాహనాల అద్దాలకు నల్ల ఫిల్మ్ వాడకాన్ని సుప్రీం కోర్టు పూర్తి నిషేధించింది. ఒక వేళ వాడినా 30 నుంచి 60శాతంలోపు మాత్రమే వినియోగించాలి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989/100 ప్రకారం, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దీంతో పాటు 20 ఏళ్ల కిందటే సుప్రీం కోర్టు కూడా దీనిపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. గతంలో అనేక ఘటనలు, కిడ్నాప్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిగిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను వెలువరించింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని రవాణా, పోలీసు శాఖలకు బాధ్యతలు అప్పగించింది. అయితే, రెండు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల వాహనాలకు విచ్చలవిడిగా వాడుతున్నారు. కార్లకు విచ్చలవిడిగా వినియోగం గుంటూరు నగర పరిఽధిలో సుమారుగా 30వేలకు పైగా కార్లు ఉంటాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సొంత కార్లతో పాటు ట్రావెల్స్, మ్యాక్సీ క్యాబ్లు కలిపి రెండు వేలకుపైగా ఉంటాయి. వీటిలో కార్ ట్రావెల్స్ నిర్వాహకులు, సొంత కార్లు ఉన్నవారు బ్లాక్ ఫిల్మ్ను అధికంగా వినియోగిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే తొలిసారి రూ 300 జరిమానా, తరువాత రూ. 500 వేస్తారు. మూడోసారి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచే అవకాశాలున్నాయి. జెడ్ ప్లస్కు మాత్రమే అనుమతి భద్రత ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీ ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆఖరికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్ లేని వాహనాలనే వినియోగించాలని స్పష్టంగా చెప్పింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగించదలచిన వారు రాష్ట్ర హోం సెక్రటరీ అధ్వర్యంలో డీజీపీతో పాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భద్రత ప్రమాణాల దృష్ట్యా మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇది కూడా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనాల వెనుక వైపు అద్దాలకు 70శాతం, సైడ్ గా్లాసెస్కు 30 నుంచి 50 శాతం మాత్రమే బ్లాక్ ఫిల్మ్ ఉండాలి. కానీ ఈ నిబంధనలను స్టిక్కరింగ్ పాయింట్లు, ప్రముఖ షోరూమ్ల నిర్వాహకులు పట్టించుకోకపోవడం లేదు. కార్లకు వాహనాలకు 100శాతం బ్లాక్ ఫిల్మ్ను వినియోగిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్తోపాటు గ్లాసెస్ కూడా నిర్ణీత పరిమాణాలను మించి ఉండకూడదు. వాహనాల్లోని లోపలి భాగాలు స్పష్టంగా కనిపించాలి. కనీస తనిఖీలు ఏవీ ? కారుల అద్దాలకు విచ్చల విడిగా నల్ల ఫిల్మ్ వాడకం సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు పట్టించుకోని రవాణా శాఖ, ట్రాఫిక్ అధికారులు గుంటూరు నగరంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఏదైనా ఘటన జరిగితే తప్పా చర్యలు తీసుకొనే పరిస్థితి లేదు. నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు నిర్వహించి, బ్లాక్ ఫిల్మ్ వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వంగూరు మరియదాసు కుమారుడు యశ్వంత్(18) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనంపై దాచేపల్లి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో దాచేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా కట్టెల లోడుతో వస్తున్న ఎద్దుల బండిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో యశ్వంత్ కడుపులోకి కట్టె దిగబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యశ్వంత్ని వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువులో చక్కగా రాణిస్తూ కుటుంబానికి అండగా ఉన్న యశ్వంత్ మృతితో తంగెడ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు వినిపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. యశ్వంత్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మందపాటి రమేష్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. -
ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నేడే ఎక్కువ
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలో యాభై ఏళ్ల కిందట నెలకొన్న పరిస్థితులతో పోల్చితే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడే ఎంతో ఉందని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నవజ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో భరద్వాజ మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రం వారిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి పాలనలో మావోయిస్టులతో చర్చలు జరిపి, వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎల్టీటీఈతో పాటు అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిర్వహించిన సంస్థలతో సైతం చర్చలు జరిపిన ప్రభుత్వాలు ప్రస్తుతం మావోయిస్టులతో చర్చలకు అంగీకరించేది లేదని చెప్పడం వెనుక కార్పొరేట్ సంస్థల ఒత్తిడి కారణమని పేర్కొన్నారు. వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ మాట్లాడుతూ యాభై ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థాన యాత్రలో సాధించిన ఎన్నో విజయాలను తెలియజేశారు. ఇప్పటికీ రాడికల్స్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు. నేడు ఎందరో త్యాగమూర్తులు అమరులయ్యారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థి నాయకులుగా మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమంలో ఒడిదుడుకులు వస్తుంటాయని, అంతమాత్రాన అది ముగిసిపోయినట్లు కాదని, ఉద్యమ వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఆర్ఎస్యూ విజయాల్ని మననం చేసుకున్నారు. మధ్యాహ్నం జరిగిన సెషన్కి న్యాయవాది సురేష్ అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రజలపై యుద్ధం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు మద్దతుగా నిలిచిన మావోయిస్టులను, వారితో పాటు అమాయక గిరిజనులను హత్య చేస్తోందని ఆరోపించారు. ప్రజలను అణచివేయడం కోసమే ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడి చేస్తున్నాయనే వాస్తవం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమంలో విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా, కార్యవర్గ సభ్యుడు పాణి, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ -
ఆన్లైన్లోనూ పీజీఆర్ఎస్ అర్జీలు నమోదుకు అవకాశం
గుంటూరు వెస్ట్: ఆన్లైన్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలను Meekosam.ap.gov.in లోనూ నమోదు చేసుకోవచ్చని చీఫ్ గ్రీవెన్స్ అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ స్టేటస్ను 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ‘ఆర్టీఈ’ కింద రెండవ విడతలో 73 మంది ఎంపిక నరసరావుపేట ఈస్ట్: విద్యాహక్కు చట్టం కింద పల్నాడు జిల్లా పరిధిలో రెండవ విడత లాటరీలో 73 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికై నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వి.సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా మండల కార్యాలయాలలో అందుబాటులో ఉంచటంతోపాటు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపినట్టు వివరించారు. తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో ఈ నెల 28వ తేదీలోపు ఆయా పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. తమ పిల్లల ఒకటో తరగతి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపికై న విద్యార్థుల ప్రవేశాలను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖాధికారులు విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారించుకొని సదరు జాబితాను ఈ నెల 28వ తేదీన డీఈఓ కార్యాలయంలో అందచేయాలని తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.3,00,116 విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన జల్లి శ్రీనివాసరావు, చౌడేశ్వరి దంపతులు రూ.3,00,116 విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆదివారం ఈవో నలబోతు మాధవిదేవిని కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో దాతల కూమారుడు నరేంద్రకుమార్ సతీమణి శ్రీదేవి, రెండవ కుమారుడు నాగవేణు హరికుమార్, ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళికృష్ణలు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసి సహకరించాలని ఈవో కోరారు. జూలై 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జూలై 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 29న సభ్యుల గైర్హాజరుతో నిరవధికంగా వాయిదా పడిన సర్వసభ్య సమావేశాన్ని తిరిగి జూలై 4న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జెడ్పీటీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులకు నోటీసులు పంపారు. జగన్మాతకు జేజేలు ● దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ● ఆర్జిత సేవల్లో ఉభయదాతలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గగుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100,రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ చేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు ఆదివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన సాయి చరిత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. నేడు దుర్గగుడి మాస్టర్ ప్లాన్పై సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహా మండపంలోని ఏడో అంతస్తులో జరిగే సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులను ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. -
కాల‘కూటమి’ అబద్ధాల నిలదీత !
పట్నంబజారు: కూటమి సర్కార్ దుర్నీతిని ఎండగట్టేందుకు ‘యువత పోరు’బాట పట్టనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూటమి సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాల అమలుపై నిలదీయనున్నారు. 20లక్షల ఉద్యోగాలిస్తామని, లేనిపక్షంలో రూ. 3వేల నిరుద్యోగ భృతినిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా గెలిచిన తరువాత రెడ్బుక్ మార్క్ పాలనతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ధ్వజమెత్తనున్నారు. ఏడాది పాలన గడిచిన నేపథ్యంలో ఒక్కొక్కరికీ రూ. 36వేలు బకాయి పడ్డావు బాబూ... అని దిక్కులు పిక్కట్లిల్లేలా నినదించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా, కొత్తగా ఏదీ విడుదల చేయలేదు. డీఎస్సీ కూడా అరకొరగా ఇచ్చింది. గ్రూప్ 2, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్పా చేస్తోంది ఏమీ లేదనే అభిప్రాయాలు యువత నుంచి వ్యక్తమవుతున్నాయి. యువతకు అండగా వైఎస్సార్ సీపీ యువత జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’కు శ్రీకారం చుట్టింది. నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఉదయం 9గంటలకు చేరుకుని, ధర్నా చౌక్ వద్ద శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేస్తారు. కూటమి మోసాన్ని ఎండగడుతూ స్వచ్ఛందంగా నిరసన తెలియజేసేందుకు యువజనులు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్నారు. నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ కూటమి నిర్లక్ష్యాన్ని నిలదీయనున్న యువత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన యువతను నిలువునా మోసం కూటమి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్న వైఎస్సార్ సీపీ -
తెలుగు ప్రాచీనతకు దర్పణం ‘వ్యాస మంజూష’
అద్దంకి: తెలుగు సాహిత్యంలోని ప్రాచీనతను తెలియజేస్తూ దాన్ని నూతన దృక్పథంతో ఆవిష్కరించిన పుస్తకమే ‘వ్యాస మంజూష’ అని సాహితీవేత్త, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన ‘వ్యాస మంజూష’ పుస్తక పరిచయ సభ పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం ‘వ్యాస మంజూష‘లోని ప్రత్యేకతలను సభకు వివరించారు. గాడేపల్లి దివాకరదత్తు, ఆర్వీ రాఘవరావు, జాగర్లమూడి ప్రతాప్ వంటి సాహితీ ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. శ్రీనాథుని కనకాభిషేక విశేషాల నుంచి ‘పాయసమెరుక’ చర్చకు అన్న పద్యం వరకు వీనుల విందుగా చదివి వివరించారు. ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత, శ్రీనాథ–పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని సాహితీవేత్తలు ప్రశంసించారు. రచయిత సత్యనారాయణ కవిత్వం ఆలోచింపజేస్తుంది శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని పెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ, త్యాగయ్య, అన్నమయ్య వంటి కవుల విశేషాల గురించి రచయిత చేసిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునేలా ఉందని సాహితీవేత్తలు కొనియాడారు. డీవీఎం సత్యనారాయణ వాచో విధేయత, నిత్య పరిశీలన, వినయ శీలత, ప్రజాకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీశిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు. సభ అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య–రామలక్ష్మమ్మల ట్రస్టు తరఫున శ్రీరామచంద్రమూర్తి, శైలజ రచయితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కౌముది అధ్యక్షుడు వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీసుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, గోగులమూడి శేషగిరి, ఆర్టిస్టు బాలు, పీసీ హెచ్ కోటయ్య, కె. రామమోహనరావు ఎ.యోగయ్య, మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, వినుకొండ సుధాకర్, అళహరి హరిప్రసాద్బాబు, కందికట్టి సత్యనారాయణ, పెండ్యాల అంకయ్య, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, పుట్టంరాజు సాయికుమార్, బాచిన పూర్ణచంద్రరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందడిగా పుస్తకావిష్కరణ రచయిత సత్యనారాయణకు సత్కారం -
సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలతో నాయకుల్లో చలనం
పిడుగురాళ్ల: వైఎస్సార్ వైద్యశాల, కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం పేషీ నుంచి ఆక్షింతలు పడడంతో స్థానిక నాయకుల్లో చలనం వచ్చిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తాను చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటం వలనే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో చేపట్టిన వైఎస్సార్ వైద్యశాల, కళాశాలను పరిశీలించినట్లు చెప్పారు. అయితే మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరు అయిందని శ్రీనివాసరావు చెబుతున్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. మొన్నటి వరకు రాయపాటి శ్రీనివాస్ మంజూరు చేయించాడని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ మీద అవగాహన లేకపోవడం హాస్యాస్పదం అన్నారు. మూడేళ్లలో 70శాతం పనులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 మార్చి 2020లో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసినట్లు వివరించారు. 2020 జనవరిలో కరోనా వచ్చిందని, 2021 కరోనా వలన పనులు చేపట్టలేకపోగా, మిగిలిన మూడేళ్లలోనే మెడికల్ కాలేజీ 60 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హాస్పటల్ను 90 శాతం పూర్తి చేశామని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రతిపక్షమా, పాలకపక్షమా కాకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని కాసు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
నగరపాలక సంస్థ ‘వీధి’ దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై ఒక కొలిక్కి రాకుండానే వీధి వ్యాపారుల నుంచి నగరపాలక సంస్థ రూ.150 వసూలు చేస్తోంది. నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిధిలోని సెక్రటరీలు వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి చలానాలు కట్టాలని సూచిస్తున్నారు. ఇదేం దోపిడీ అంటూ వీధి వ్యాపారులు గత్యంతరం లేక నగరపాలక సంస్థ కార్యాలయంలో నగదు చెల్లిస్తున్నారు. 30వేలకు పైగా వీధి వ్యాపారులు నగరంలో సుమారు 30వేలకు పైగా వీధి వ్యాపారులున్నారు. గతంలో ఇచ్చిన గుర్తింపు కార్డులను కొంత మంది దుర్వినియోగం చేశారనే కారణంతో ప్రస్తుత కమిషనర్ పులి శ్రీనివాసులు వాటిని రద్దు చేశారు. తిరిగి కొత్తగా ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. వ్యాపారాలను చెక్ చేసిన తరువాత ఐడీ కార్డులు ఇస్తామని గత సంవత్సరం నవంబర్లో నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు. దీంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇంత వరకూ కార్డులు ఇవ్వకపోగా, సచివాలయం వారీగా సెక్రటరీలు రూ.150 చలానా కట్టిస్తున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత కరువు నగరపాలక సంస్థ పరిధిలో మూడు జోన్లను పట్టణ ప్రణాళిక అధికారులు ఏర్పాటు చేశారు. రెడ్జోన్ మినహా గ్రీన్ జోన్, అంబర్ జోన్ పరిధిలో వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలోనే కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే, 2022లో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఆశీలు వసూలు చేయకూడదని స్పష్టం చేయడంతో నగరపాలక సంస్థ నిలిపివేసింది. దీంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా నగరపాలక సంస్థ టెండర్ నిర్వహించకపోవడంతో రూ.3 కోట్లు దాకా కార్పొరేషన్ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. స్ట్రీట్ వెండింగ్ పాలసీ అమలయ్యే వరకు ఆశీలు వసూలు చేసే కార్యక్రమంపై నగరపాలక సంస్థ దృష్టి సారిస్తే కార్పొరేషన్కు కోట్ల రూపాయిల ఆదాయం సమకూరేది. అటు ఈ విషయంపై దృష్టి సారించక..ఇటు స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇవ్వకుండా రూ.150 వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని వీధి వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఆక్రమణల దళం దౌర్జన్యం నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణ దళ సిబ్బంది దౌర్జన్యం చేసి, వ్యాపారాలు జరగనివ్వకుండా చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకుంటే జోలికి పోవడం లేదని.. ఇవ్వకపోతే కాటాలు, ఇతర వస్తువులు తీసుకువెళుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇచ్చి, న్యాయం చేయాలని పలువురు వ్యాపారస్తులు కోరుతున్నారు. ఐడీ కార్డ్ పేరిట వీధి వ్యాపారుల నుంచి రూ.150 వసూలు ఇదేం దోపిడీ అంటూ వ్యాపారుల మండిపాటు -
ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ
తెనాలి: పట్టణానికి చెందిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 40వ వర్ధంతిని సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ వి.బాలమోహన్దాస్ సెమినార్ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటయే సభలో డాక్టర్ నాయుడమ్మపై రూపొందించిన సావనీరును ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధర్రావు, చైన్నెలోని సీఎస్ఐఆర్–సీఎల్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణ వి.కాంత్ పాల్గొంటారు. కార్యక్రమాన్ని యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తోలు పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం తోలు శుద్ధి చేసే ప్రక్రియకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే పరిశ్రమకు సమస్యగా ఉన్న మకిలి మాయమైంది. కొన్ని వర్గాలకే పరిమితమైన చర్మ పరిశ్రమ అందరిదైంది. చర్మకారుల నైపుణ్యం పెరిగింది. కులాని కతీతంగా చర్మ పరిశ్రమ విస్తరించి, ఆ రంగంలోనూ దేశానికి కీర్తిని తీసుకొచ్చింది. నిశ్శబ్దంగా సాగిన ఈ విప్లవాన్ని సాధించిన ఘనత ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మకు దక్కుతుంది. ‘జన్మతః రైతును...వృత్తిరీత్యా అస్పృశ్యుడను’ అని చెప్పుకున్న నాయుడమ్మ, తన వృత్తితో చర్మ పరిశ్రమను ఇతర పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండల గ్రామం యలవర్రు డాక్టర్ నాయుడమ్మ స్వస్థలం. 1922 సెప్టెంబరు 10న జన్మించారు. దగ్గర్లోని తురుమెళ్లలో హైస్కూలు విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ తర్వాత, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు. 1943లో చైన్నెలో లెదర్ టెక్నాలజీలో చేరారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ చర్మశుద్ధిపై ఎంఎస్, డాక్టరేట్ పొందారు. 1951లో తిరిగొచ్చి, చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఆ సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించే కృషితో 1958లో అదే సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. పరిశోధనలు చర్మకారులకు వరప్రసాదాలు నాయుడమ్మ పరిశోధనలు దేశీయ చర్మ పరిశోధనకు, చర్మకారులకు వరప్రసాదాలు. ఆయన సారథ్యంలో సీఎల్ఆర్ఐ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించింది. పలు దేశాలు చర్మ సంపద సద్వినియోగానికి నాయుడమ్మ సలహాలను స్వీకరించాయి. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా వివిధ దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విషయాల శాఖ కార్యదదర్శిగా, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా ఏకకాలంలో ఆరుసార్లు పనిచేశారు. సీఎస్ఐఆర్ డీజీ ఇరత దేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న భారతీయ శాస్త్ర సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శాస్త్ర సాంకేతిక కమిటీకి రథసారథి 1980లో అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్ర సాంకేతిక కమిటీకి అధ్యక్షులుగా నాయుడమ్మ అనేక సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఆసియా ఖండానికి చెందిన అసోసియేషన్ ఫర్ సైన్స్ కో–ఆపరేషన్కు వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్గా, ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారుగా, కెనడాలోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్గా, సైన్స్ టెక్నాలజీ హైపర్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా పనిచేశారు. చర్మవిజ్ఞానంపై 200 పరిశోధన పత్రాలు, 100 వ్యాసాలను సమర్పించారు. నాయుడమ్మ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మశ్రీ గౌరవం సహా ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డును, పలు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 1985లో జూన్ 23న ఆయన ప్రయాణిస్తున్న ఎంపరర్ కనిష్క–బోయింగ్ 747 విమానం బాంబు పేలుడుకు గురై పేలిపోయింది. దేశం ఒక మహోన్నత శాస్త్రవేత్తను కోల్పోయింది. దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి కృషి నేడు 40వ వర్ధంతిని ఏఎన్యూలో నిర్వహిస్తున్న సందర్భంగా నివాళి -
సైక్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహణ అభినందనీయం
చీరాల: నియోజకవర్గంలో మొదటిసారిగా చీరాల సైక్లింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఆదివారం ప్రారంభించారు. వాడరేవు నుంచి ప్రారంభించిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను 60 కిమీ, 20 కిమీల విభాగంలో నిర్వహించారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారులు, నాయకులు పాల్గొన్నారు. 60 కిమీ విభాగంలో విజేతలు సిద్ధార్థ్ లింగ్ (కర్ణాటక) రూ.లక్ష, అర్హద్ ఫరీద్ (ఢిల్లీ) రూ.50 వేలు, నవీన్ కర్ణాటక రూ.30 వేలు, 20 కిమీల విజేతలు ఎస్.అబ్రహాం (తమిళనాడు) రూ.50 వేలు, రాజు పాండీ (తమిళనాడు) రూ.30 వేలు, సోహెల్ రియాజ్ (మహారాష్ట్ర) రూ.20 వేలు బహుమతులు గెలుచుకున్నారు. చీరాల వన్టౌన్, రూరల్ సీఐలు ఎస్.సుబ్బారావు, పి. శేషగిరిరావు, ఎస్సైలు ఎ.చంద్రశేఖర్, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి క్రీడాకారుల రాక -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ సమీపంలోని గొట్టిముక్కల మేజర్ కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన దేవరకొండ నాసరయ్య నర్సరీ పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దుర్గి మండలం ఓబులేశునిపల్లెకు చెందిన గాజుల ఆంజనేయులు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. నాసరయ్యకు ఎడమకాలు విరిగింది. ఆంజనేయులుకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను కూడా మార్చుకుని, తల్లిదండ్రుల అభీష్టం మేరకు వృత్తికి పునరంకితమై పని చేయాలని సూచించారు. తల్లిదండ్రుల మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుని, ఉన్నత విద్యాప్రణామాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. విద్యారంగానికి నష్టం చేసే సంస్కరణలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఇతర పనుల నుంచి మినహాయించి, కేవలం బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠశాలల నుంచి తరగతులను విభజించి, ఇతర చోట్లకు తరలించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలకు దూరం చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను తీసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు జూన్ వేతనాలు పొందడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు పెండింగ్ ఉన్న మూడు కరువు భత్యాలను ప్రకటించి పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పి.లక్ష్మీనారాయణ, జి.దాస్, చక్కా వెంకటేశ్వరరావు, ఎస్.ఎస్.ఎన్. మూర్తి, వి.కిశోర్ షా, వివిధ మండల శాఖల బాధ్యులు టి.భాస్కర్, జహంగీర్, శ్రీనివాసరావు, శివరామకృష్ణ, బాలరాజు, వెంకటేశ్వరావు, కుటుంబరావు, మాలకొండయ్య, మరియరాజు, షూకూర్, రమేష్ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
అమరావతి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని నరుకుల్లపాడులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాలు.. మండలంలోని నరుకుళ్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నల్లిబోయిన వినోద్ గుంటూరులోనూ, బోదా గోపి సుద్దపల్లిలోనూ గత ఏడాదిగా తలదాచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, సీతారామయ్య మరి కొంతమంది కలసి నల్లిబోయిన వెంకటసుబ్బారావు, పెదవీరబాబు, చినవీరబాబు ఇంటిమీద దాడికి వెళ్లారు. మధ్యాహ్నమే వినోద్, గోపీలు వెళ్లిపోయారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకుని పోలీసులు రావటంతో గొడవ సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా సీఐ అచ్చియ్య శనివారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీకి చెందిన బొంతా శ్రీను, ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటుండగా టీడీపీ చెందిన చింకా వెంకటేశ్వర్లు కర్రతో దాడి చేయగా అతని ఎడమ చేతికి గాయమై అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు సీఐ అచ్చియ్య తెలిపారు.