Guntur District Latest News
-
రాయగడ ఎక్స్ప్రెస్లో చోరీ కేసులో నిందితుల అరెస్టు
లక్ష్మీపురం: రాయగడ ఎక్స్ప్రెస్లో బ్యాగు చోరీ చేసిన తల్లి, కొడుకులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే జీఆర్పీ సీఐ వీరబాబు వెల్లడించారు. గురువారం గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పి సీఐ వీరబాబు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖ పట్నంకు చెందిన సిద్ధాంతి పద్మావతి, భర్త, బంధువులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. 20వ తేదీ తెల్లవారు జామున సుమారు 3.50 గంటల సమయంలో మంగళగిరి వచ్చేసరికి సామగ్రిని పరిశీలించగా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. బ్యాగులో 26 గ్రామలు బంగారు చైన్తో పాటు రూ.7వేల నగదు ఉండగా.. భోగిలో వెతుకులాడారు. కనిపించకపోవడంతో ఈనెల 24వ తేదీన జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఏఎస్సీ శైలేష్ కుమార్, ఆదేశాల మేరకు గుంటూరు డీఎస్ఆర్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ వీరబాబు, ఆర్పీఎఫ్ పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాత నేరస్తుల వివరాలు తీసుకొని యాక్టివ్గా ఉన్న పాత నేరస్తులను విచారించగా.. విజయవాడకు చెందిన చెన్నాడా వినోద్ కుమార్ దొంగతనం చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గురువారం ఉదయం 9.40 నిమిషాలకు గుంటూరు రైల్వే స్టేషన్ లోని ఈస్ట్ సైడు రైల్ కోచ్ రెస్టారెంట్ వద్ద ముద్దాయి చెన్నాడ వినోద్ కుమార్ దొంగతనం చేసిన బంగారు గొలుసును అమ్మడానికి తన తల్లి చెన్నాడ నాగరాణి అలియాస్ మైలా నాగరాణి, అలియాస్ గోపిశెట్టి నాగరాణితో కలిసి అక్కడ సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్ను, రూ.2వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఆర్పీఎస్ఐ మహబూబ్ సుభాని, కానిస్టేబుళ్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐబీ ఇన్స్పెక్టర్ వీరబాబు, శంకర్, ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. దొంగిలించిన బంగారం అమ్ముతున్న తల్లీకొడుకులను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు -
జిల్లా అదనపు ఎస్పీ సంతోష్
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఎటువంటి లాభం ఉండదని చెప్పారు. అంతేగాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్లతో సమయం వృధా చేసుకోవద్దని, యువత ఉన్నత స్థాయికి చేరేందుకు తమ సమయం ఉపయోగించాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని అన్నారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం దృష్ట్యా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బులు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురై, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఉమ్మడి జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, దుకాణాలపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్న్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు, చేబ్రోలు, పొన్నూరు పట్టణంలో చేపట్టారు. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు హోసన్న మందిరం ఎదురు బెంగళూరు అయ్యం గారి బేకరిలో మూడు గృహ ఎల్పీజీ సిలిండర్లు, చేబ్రోలు మండలం మంచాల గ్రామం శ్రేష్టా కేఫ్ ఫుడ్ కోర్ట్లో నాలుగు సిలిండర్లు, పొన్నూరు టౌన్ ఫ్రెండ్ టీ ప్యాలెస్లో ఐదు గృహ ఎల్పీజీ సిలెండర్లు, ఎస్ఎస్వీ టీ కేఫ్లో మూడు సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు స్థానిక సీఎస్డీటీలకు 15 సిలిండర్లు అప్పగించారు. ఈ మేరకు యజమానులపై నాలుగు 6–ఎ కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు 85, ఆఫీస్ సబార్డినేట్స్ 26, ల్యాబ్ టెక్నీషియన్స్ 20, ల్యాబ్ అటెండెంట్ 10, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఏప్రిల్ 2న సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను గుంటూరు మెడికల్ కళాశాలలో అందజేయాలన్నారు. డిస్ట్రిక్ట్ సెక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. విద్యార్హతలు, వేతనాలు, ఇతర వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్ కాలేజ్.ఈడీయూ.ఇన్ వెబ్సైట్లో చూడాలన్నారు. ఏప్రిల్ 13న ఉద్యోగాలకు ఎంపికై న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రదర్శిస్తామన్నారు. నరసరావుపేట టౌన్: చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్ కమిటీ చైర్మన్ విశాల్ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు. -
జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన భవనాలు
నగరంపాలెం: జిల్లా పోలీస్ శాఖకు పీజీఆర్ఎస్, మినీ హాల్ నూతన భవనాలను అప్పగించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వీఐటీ–ఏపీ విద్యా సంస్థల సహకారంతో నిర్మించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్), మినీ హాల్ నూతన భవనాల శిలఫలకాలను వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు ఆవిష్కరించారు. వేద మంత్రాల నడుమ ఈ భవనాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ అరుల్మౌళివర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్చంద్ర, జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్బీ), అలహరి శ్రీనివాస్, సంకురయ్య (ఏఆర్), ఏఆర్ ఆర్ఐలు సురేష్బాబు, రామకృష్ణారెడ్డి, శివరామకృష్ణ , శ్రీహరిరెడ్డి, రామకృష్ణారెడి, పలువురు సీఐలు, వీఐటీ–ఏపీ యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్గుప్తా హాజరు కాలేదు. మార్కాపురంలో జరిగిన బస్ ప్రమాదం దృష్ట్యా అత్యవసరంగా అక్కడకెళ్లారని కార్యాలయపు వర్గాలు పేర్కొన్నాయి. -
రామాలయాన్ని నిర్మించిన ముస్లిం భక్తుడు
మాచర్ల రూరల్: భద్రాద్రి శ్రీ సీతారామ దేవస్థాన నిర్మాణంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తన స్వామి భక్తిని చాటుకుంటే.. మాచర్ల మండలం జమ్మలమడకలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి రామాలయాన్ని నిర్మించి రామభక్తిని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్ సైదా సాహెబ్ 1996 సంవత్సరంలో గ్రామ శివారులోని సుమారు ఎకరం స్థలంలో శ్రీసీతారామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తన భక్తిని చాటుకున్నాడు. ముస్లిం వ్యక్తివి.. హిందూ దేవుళ్లకు చెందిన రామాలయాన్ని నిర్మించటమేటంటూ పెద్దలు వారించినా వినకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని విడవకుండా ఆలయాన్ని నిర్మించాడు. సైదా సాహెబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం విశేషం. సుమారు 8సంవత్సరాల క్రితం అనారోగ్యంతో షేక్ సైదా సాహెబ్ ఆలయ ప్రాంగణంలోనే మృతిచెందాడు. సాహెబ్ భక్తి భావాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఆయన్ను తలచుకుంటూ గ్రామస్తులంతా ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆలయాన్ని నిర్మించి మతసామరస్యం చాటిన సైదా సాహెబ్ -
విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం
మంగళగిరి టౌన్: విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు కీలకమని కేఎల్యూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.ప్రవీణ పేర్కొన్నారు. మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని గ్రంథాలయానికి గురువారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రంథాలయ భవనంలో రంగులు వేయడంతో పాటు గోడలపై విద్యాపరమైన, స్ఫూర్తిదాయకమైన చిత్రాలను చిత్రీకరించారు. గ్రంథాలయాలు శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దడం విద్యార్థులు, పాఠకులు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమేనని ప్రవీణ అన్నారు. తద్వారా గ్రంథాలయానికి ప్రజలు ఆకర్షితులవుతారని.. పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగాం కో ఆర్డినేటర్ డాక్టర్ పి.శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. సమన్వయకర్తగా ఫీల్డ్ కో ఆర్డినేటర్ పి. సురేష్ వ్యవహరించారు. మంగళగిరి టౌన్: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంగళగిరి ఎంఈఓ–2 బాబు తల్లిదండ్రులకు సూచించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అడ్మిషన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానం, తల్లికి వందనం, మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయిలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 ఉషాకుమారి, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉషాలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడికొండ: అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాలుకు పైలింగ్ పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. నారాయణ మాట్లాడుతూ.. బీ+జీ+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తున్నామన్నారు. భవనం పైన 250 మీటర్ల ఎత్తులో టవర్ ఉంటుందని తెలిపారు. సందర్శకులు టవర్ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్ చేశామని అన్నారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ భవనాన్ని నాలుగు భాగాలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు. తాడికొండ: భాష, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి ఆయన నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి సహకరిస్తున్న ట్రస్ట్కు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను తెలియజేయడం కోసమే ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించారు. విజయపురిసౌత్: అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం నాగార్జునసాగర్ వద్ద రవాణా శాఖ, పోలీస్, ఫైర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రంకన్న్ డ్రైవ్, ఫిట్నెస్, ఇన్సురెన్స్, పర్మిట్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తావని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాష, ఎంవీఐ శేషారెడ్డి, విజయపురి సౌత్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026సౌర ప్యానళ్ల వితరణ అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది.గుంటూరు వెస్ట్ (క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో తొమ్మిది బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ సహా ఆరు క్రీడా అంశాలలో వసతులు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలోని క్రికెట్ మైదానాన్ని ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి చేస్తామన్నారు. రూ.170 కోట్లతో మొత్తం స్టేడియం డీపీఆర్లు తయారు చేశారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, తూర్పు శాసన సభ్యులు నసీర్ అహ్మద్లు మాట్లాడారు. కమిషనర్ మయూర్అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పరివర్తన మానసిక దివ్యాంగుల పాఠశాలను గురువారం సత్తెనపల్లి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్,)జె. సుజన్కుమార్ సందర్శించారు. ముందుగా అక్కడ ఉన్న విద్యార్థుల వసతి గృహం, వంటశాలను పరిశీలించారు. ఆహార నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి.ఎల్. కోటేశ్వరరావు, గంటా వెంకటశివ, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, పాఠశాల నిర్వాహకుడు కొరబండి కిషోర్బాబు ఉన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 536.60 అడుగులకు చేరింది. ఇది 181.3178 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 8,473, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. తాడేపల్లి రూరల్ : రాజధాని ముఖద్వారమైన మంగళగిరి నియోజకవర్గంలో సీతానగరంలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కొంతమంది నాయకులు కన్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రూ. లక్షల సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. ఇదే తరహాలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం బోటు యార్డు సమీపంలో రైల్వే భూములను సైతం ప్లాట్లుగా మార్చి రెండు, మూడు సెంట్ల చొప్పున అమ్మేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్ధలో ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అది ఆసరాగా చేసుకున్న సదరు నాయకులు రెచ్చిపోయి ఒక ప్లాట్ను రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీతానగరం బోటు యార్డు రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు గతంలో తాడేపల్లి మున్సిపాలిటీగా ఉన్న సమయంలో రహదారి ఏర్పాటు చేశారు. ఆ రహదారికి కుడిభాగంలో కొంత రైల్వే స్థలం, మరికొంత ప్రభుత్వ స్థలం, దాని పక్కనే ప్రైవేటు స్థలం ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలను టార్గెట్ చేసి ఈ భూములను అమ్మేస్తున్నారు. వలస వచ్చినవారే టార్గెట్ ప్రకాశం, శ్రీకాకుళంలతో పాటు ఇతర జిల్లాల నుంచి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారిని సదరు నాయకులు టార్గెట్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి ఎటువంటి ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ నమ్మబలికి సెంటు భూమి ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు అమ్మేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత మూడవ విడత, నాల్గవ విడతలో మీకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుందంటూ నమ్మిస్తున్నారు. కొనుగోలుదారులు ఇళ్లు నిర్మించుకుంటుంటే అక్కడికి వెళ్లిన సచివాలయ సిబ్బందిని నాయకులు సంప్రదిస్తున్నారు. మాట వినకపోతే బెదిరించి కొనుగోలు చేసిన వారి చేత ఇళ్లను నిర్మింపజేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కోర్టు కేసులతో కునారిల్లుతుంది. వందల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ వేయడంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ బాధితులకు సరైన న్యాయం జరగకపోవడంతోపాటు కొన్ని సందర్భాల్లో కార్పొరేషను ఆదాయం, ఆస్తులు కూడా పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సంవత్సరం మార్చి మొదటి వారం వరకు మొత్తం 297 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా టౌను ప్లానింగ్ విభాగంలో 145 కేసులు, ఇంజినీరింగ్ సెక్షనులో 62, రెవెన్యూ సెక్షనులో 42, పబ్లిక్ హెల్త్ సెక్షనులో 20, జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షనులో 17, ఎలక్షన్ను సెల్ 8, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఉపా సెల్, ఎడ్యుకేషనను ఎస్టాబ్లిష్మెంట్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున కేసులు పెండింగ్లో ఉన్నాయి. కౌంటర్ వేయని కేసులు 150 మొత్తం 295 పెండింగ్ కేసుల్లో 150 కేసుల్లో అసలు కౌంటర్ దాఖలు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టౌను ప్లానింగ్ సెక్షనులో 145 కేసులకు 75, ఇంజినీరింగ్ విభాగంలో 62 కేసులకు 42, రెవెన్యూ సెక్షన్నులో 42 కేసుల్లో 10, పబ్లిక్ హెల్త్ విభాగంలో్ 20 కేసులకు 7, జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ 17 కేసులకు 7 కేసుల్లో కౌంటర్ లేదు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఒక కేసు ఉంటే దీనికీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఎలక్షనను విభాగంలో కూడా 8 కేసులు పెండింగ్లో ఉంటే ఒక్క దానికి కూడా కౌంటర్ వేయలేదు. అధికంగా ఈ అంశాలపైనే.. టౌను ప్లానింగ్ విభాగంలో ఎక్కుగా రోడ్డు విస్తరణకు సంబందించి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భవనాలు ఎఫెక్ట్ అయ్యే వారు కూడా ఎక్కువగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ సెక్షనులో బిల్లులు చెల్లింపు, టెండరింగ్ విషయంలో కేసులు నమోదు అయ్యాయి. రెవెన్యూ సెక్షననులో షాపింగ్ కాంప్లెక్స్లకు సంబంఽధించి ట్యాక్స్ విషయంలో, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో లీజు గడువు పూర్తయినప్పటికీ వాటిని ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయించారు. నగరపాలక సంస్థ కార్యాలయం1బోటు యార్డ్ రోడ్డు నుంచి జీయర్ ఆశ్రమం వరకు సుమారు 40 అడుగల వెడల్పుతో రహదారిని ఏర్పాటు చేశారు. ఆ రహదారిని సైతం ఆక్రమించడంతో అక్కడ పట్టా భూములు కొనుక్కొని నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైకి మురుగునీరు పారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ జరిపి ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.మంగళగిరి టౌన్: చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయానికి హైదరాబాద్ ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి రూ. 5.5 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ప్యానళ్లను గురువారం అందజేశారు. సుబ్బారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శరణాలయంపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఆయన ప్రారంభించారు. బాలలకు అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు దొంతిరెడ్డి గాంధీ, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రుక్మాంగరెడ్డి, వెంకటరామిరెడ్డి, లంకా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్ వేయకపోవడం వలన కార్పొరేషను ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అభివృద్ది పనులు నెలల తరబడి ఆగిపోవాల్సి వస్తోంది. ఉదాహరణకు కాకుమానువారి తోట (కార్మిక శాఖ స్థలం) రోడ్డు వేయకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంది. రోడ్డు టెండర్ను కాంట్రాక్టర్ అడ్డదారిలో దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వర్కును ఇంజినీరింగ్ అధికారులు రద్దు చేశారు. దీనిపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు నెలల తరబడి తేలకపోవడంతో ఆ రోడ్డు అలాగే ఆగిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో కోర్టు కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని నగర వాసులు కోరుతున్నారు. -
ఆర్డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్డీఓ వెల్లడించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్ తేజస్వినికి డాక్టర్ మురళీమోహన్ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు. -
గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి గల్లంతయిన విద్యార్థి మృతదేహం బుధవారం మేడికొండూరు పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి బయటకు తీశారు. పలకలూరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి చంద్రశేఖర్(16) తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీ గుంతలో ఈతకు దిగి కనిపించకుండా పోయాడు. సంఘటన జరిగిన సమయం నుంచి మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తాడేపల్లి నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్వారీ గుంతలలో రాళ్ళల్లో లోతుగా ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మతుని తండ్రి బండారు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు.. పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీలో విద్యార్థి గల్లంతైన సంఘటన ప్రదేశానికి విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తూ.. జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో రెండవ కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తను ఆటోడ్రైవర్గా పనిచేసిన కుమారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని ఉన్నతంగా స్థిరపడేందుకు చదువే ఆధారంగా భార్యాభర్తలు కుమారుల కోసం కష్టపడుతూ ఉంటారని బంధువులు తెలియజేశారు. -
రేపటి నుంచి నేపాల్ ప్రతినిధి బృందం పర్యటన
రేపల్లె,బాపట్ల: రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీఓ)గా బూసి శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేఆర్సీలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించటం జరుగుతుందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డివిజనల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిగా బి.శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ని మర్యాద పూర్వకంగా కలిశారు. బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం తరలించారు. -
గుంటూరు
నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. ఒక్కరోజే రూ. 2.55 కోట్లు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని వినియోగించుకుని బుధవారం రూ. 2.55 కోట్లు పన్నులు ప్రజలు చెల్లించారని కమిషనర్ తెలిపారు.7 -
నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ, ఎగువ సన్నిధులతో పాటు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులకు సంబంధించి హుండీ ఆదాయాలను బుధవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ మాట్లాడుతూ ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి రూ. 16,74,302, దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి రూ. 25,06,239, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 79,682, అన్నదానంకు రూ. 30,297 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వైకుంఠపురం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ను బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న తీరు, తెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూల్యాంకన విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వాల్యూయేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు. బుధవారం రెండో స్పెల్లో భాగంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మూల్యాంకన విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రశ్నల కోడ్స్, ప్రశ్నపత్రం సరళి, మార్కుల వెయిటేజీ తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత, సహాయ క్యాంపు అధికారులు, కోడింగ్ అధికారులు పాల్గొన్నారు. ముప్పాళ్ళ: మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (13)ను యువకుడు(23) మాయమాటలు చెప్పి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గమనించి తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడాన్ని గమనించి మళ్లీ లైంగిక వేఽధింపులకు పాల్పడుతుండగా బాలిక సమీప బంధువులు యువకుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు సమస్యల పరిష్కారం ముఖ్యం నరసరావుపేట రూరల్: నూతన సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి తోడ్పాటును అందించేలా ఏరువాక కేంద్రం పనిచేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ తెలిపారు. మండలంలోని రావిపాడు ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ పంటలలో ఎదురయ్యే సమస్యలు, వాటి సమగ్ర నివారణ చర్యలు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం కార్యక్రమాలను రైతు స్థాయిలో సమస్యలకు అనుగుణంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. -
పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకం
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.నాగరాజు తెలిపారు. ఈ రోజును తాము బ్లాక్ డే నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెన్షనర్లందరికి సమాన హక్కులు ఉండాలన్నారు. జనవరి 1, 2026 ముందు రిటైరైన వారు, తర్వాత రిటైరైన వారిని విభజించి పెన్షనర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెన్షన్ కమ్యూటేషన్ పీరియడ్ను 12 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్జీఓ నాయకులు మూర్తి, కోటేశ్వరరావుర, సాయిబాబు, నాగేశ్వరరావు, నాగేంద్రం, సుబ్బారావు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
కొరిటెపాడు (గుంటూరు): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుతో చేపట్టిన ఆందోళనలకు స్పందన లభించిందని ఏఐబీఓసీ రాష్ట్ర నాయకులు శేష సాయి, జయకుమార్, కోటిరెడ్డి, రాంబాబు, వేణులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నగరంపాలెంలోని ఎస్బీఐ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎఫ్ఎస్ తీసుకున్న పీఎల్ఐ అమలు నిర్ణయం ప్రస్తుతం చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) వద్ద పరిష్కార దశలో ఉన్నప్పటికీ అమలు చేయడం ఏకపక్ష, తొందరపాటు చర్య అని విమర్శించారు. ఈ పథకం ఉద్యోగులు, యూనియన్లు కోరింది కాదని, కొద్ది మందికి మాత్రమే లాభం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, సమస్య పరిష్కరించాలని వారు కోరారు. నేడు గుంటూరు నగరానికి డీజీపీ హరీష్కుమార్గుప్తా రాక నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్గుప్తా గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. నగరంపాలెంలోని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నూతన సమావేశ మందిరం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) జిల్లా నూతన భవనాన్ని రాష్ట్ర డీజీపీ ప్రారంభించనున్నట్లు డీపీఓ కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏపీ విట్ విశ్వ విద్యాలయం చాన్సలర్, వైస్చాన్సలర్, రిజిష్ట్రర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొంటారని పేర్కొన్నారు. -
నీటి దోపిడీ ట్యాపులు
ఇన్నర్ రింగ్రోడ్డులో అపార్ట్మెంట్లకు అనధికారికంగా అమరిక నెహ్రూనగర్ దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ విభాగంలో కింది స్థాయి సిబ్బంది దొంగ టెండర్లు వేయించి రూ. కోట్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టిన విషయం తెలిసిందే. టెండరింగ్లో లెస్సుల పేరుతో మాయాజాలం చేసి జీఎంసీ ఆదాయానికి కన్నం వేసిన విషయాలను కూడా సాక్షి పలుమార్లు ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా అభివృద్ధి చెందుతున్న ఇన్నర్ రింగ్ రోడ్డులో అపార్ట్మెంట్లకు ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ట్యాపులు ఇచ్చేసి బిల్డర్ల వద్ద నుంచి రూ.లక్షలు దండుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఉదహరణ.. ఇన్నర్ రింగ్ రోడ్డులో గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే సదరు ఫ్లాట్కి ఇటీవల వాటర్ పైపులైన్ నుంచి నీళ్లు రావడం లేదని గమనించారు. రిపేరు చేయించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి తన అసెస్మెంట్ నంబర్ (ఇంటి పన్ను) చెప్పి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. సదరు అసెస్మెంట్ నంబర్ మీద కేవలం ఆస్తి పన్ను మాత్రమే చూపించింది. వాటర్ కనెక్షన్ లేదని నగరపాలక సంస్థ సిబ్బంది చెప్పారు. కంగుతిన్న యజమాని బిల్డర్కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. వాటర్ ట్యాపును రిపేర్ చేయించే బాధ్యత తనదని బిల్డర్ చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ఈ లెక్కన ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో ఒక వీధిలో అపార్ట్మెంట్ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే ఎన్ని దొంగ ట్యాపులు ఉన్నాయో తేలనుంది. ఆ పేర్లతో పైపులైన్లు ఇన్నర్ రింగ్ రోడ్డులో పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు భారీగా వెలుస్తుంటాయి. అపార్ట్మెంట్లు సేల్ కావాలంటే తప్పనిసరిగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తప్పనిసరిగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. అయితే సదరు అపార్ట్మెంట్ల బిల్డర్లుతో ఇంజినీరింగ్ అధికారులు కుమ్మకై పైపులైన్ వేయాలంటే డోనేషన్/కాంట్రీబ్యూషన్ ఇస్తే చాలని వారి వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేయడం..ఆ తరువాత వాటికి టెండర్ పెట్టి బిల్లులు చేసుకోవడం పరిపాటిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇన్నర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్లు పరిశీలించి దొంగ ట్యాప్లో ఉంటే డిస్కనెక్ట్ చేయడంతోపాటు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వరరావు , నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ -
పైసా మే..పాస్
తరగతులకు హాజరు కాకుండానే కేవలం పరీక్ష రాస్తే చాలు బీఈడీ సర్టిఫికెట్ ఇస్తారంటూ దేశవ్యాప్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరువు పోయింది. పైసలిస్తే చాలు ప్రాక్టికల్ రాయకుండానే పాస్ అనే తీరులో మరోసారి అభాసుపాలైంది. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట ఏఎన్యూలో రూ.కోట్ల విద్యావ్యాపారం జరిగింది. బీఈడీ కళాశాలలు రూ.లక్షలు విరజిమ్మి... లక్ష్యం నీరుగార్చారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏఎన్యూ పరిధిలో 2024– 26 బీఈడీ విద్యాసంవత్సర ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు మూడు విడతలలో నిర్వహించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరు కావలసిన ఈ పరీక్షలలో 4500 నుంచి 5000 మంది ఇతర రాష్ట్రాలవారే. తెలంగాణ, ఒడిశా, అసోం, మిజోరాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకో రేటు నిర్ణయించి వసూలు చేశారు. 50 మార్కుల పరీక్షకు 49గానీ, 50గానీ మార్కులు వేసి ఏఎన్యూని మరోసారి భ్రష్టుపట్టించారు. ఏఎన్యూలో దొడ్డిదారిన ఉద్యోగాలు పొంది, దోచుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరి తీరుతో పైసలిస్తే చాలు ప్రయోగాలు సజమావుగా సాగుతున్నాయి. ఏఎన్యూ పరిధిలోని 60కి పైగా కళాశాలల్లో అనేకమంది విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున ఒక సిండికేట్ కళాశాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా వసూలు చేసినట్లు సమాచారం. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట విద్యా వ్యాపారం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు జరిగిందని పల్నాడులోని ఓ కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. పల్నాడులోని ఒక ప్రిన్సిపాల్, నర్సరావుపేటలోని ఒక లెక్చరర్, కళాశాల నుంచి కలెక్షన్ చేసే ఏజెంట్లుగా వ్యవహరించారు. వీరు అనధికారికంగా యాజమాన్యాలను బెదిరించి మరో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా వీరే దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎగ్జామినర్కి రోజుకి రూ.2 వేల నుంచి రూ.2,500 చొప్పున కొన్ని కళాశాలలు చెల్లించాయి. గైర్హాజరైన ప్రతి విద్యార్థికి రూ. 500 అదనంగా కొందరు చెల్లించారు. ప్రాక్టికల్ ఫీజ్ పేరిట కొన్ని కళాశాలల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వసూలు చేశారు. మెయింటెనెన్స్ ఫీజు అంటూ రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు దక్షిణగా సమర్పించారు. తొమ్మిది రోజుల పరీక్షల తంతులో రూ.ఐదు కోట్ల వరకు విద్యావ్యాపారం జరిగిందని తెనాలికి చెందిన ఒక ఇంగ్లిషు లెక్చరర్ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో బురిడీ కొట్టించారు. వినుకొండ, తెనాలి ప్రాంతంలోని మూడు చొప్పున కళాశాలల్లో క్లర్కులు, ప్రిన్సిపల్స్ ఇలా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థుల, పరిశీలకుల సంతకాలు పోల్చి విచారణ జరిపితే అనేక మందిపై చర్యలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షల పేరిట జరిగిన రూ.కోట్ల విద్యావ్యాపారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూడటం తథ్యమని వాదనలు వినిపిస్తున్నాయి. అప్రూవల్ జాబితాలలోని ఎగ్జామినర్ల సంతకాలను, మార్కుల జాబితాలలోని వాటితో పోలిస్తే అవకతవకలు బహిర్గతం కానున్నాయి. మూడవ సెమిస్టర్ హాల్ టికెట్లలో విద్యార్థుల సంతకాలను ప్రాక్టికల్ పరీక్ష డైలీ రిపోర్టు సంతకాలతో పోలిస్తే నకిలీల గుట్టు రట్టవుతుందని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఎన్ని కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించాయో పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. పల్నాడులోని ఇద్దరు అయ్యవార్ల ఫోన్ పేలు, కాల్ లిస్టులపై విచారణ జరిపితే రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూడటం తథ్యమనే వాదనలు తెరపైకి వచ్చాయి. విద్యావ్యవస్థను కాసుల కోసం దిగజార్చిన వారి అక్రమాలకు కళ్లెం పడుతుంది. మార్చి 23వ తేదీ నుంచి జరిగే మూడవ విడత పరీక్షలలో అక్రమాలు వెలువెత్తాయి. నరసరావుపేట, రేపల్లెలోని కళాశాలల్లో మూడు రోజుల పరీక్షలను రెండు రోజులలోనే ముగించారు. నరసరావుపేట వ్యవహారం బహిరంగం కావడంతో మామూళ్ల కోసం పరుగులు తీశారు. పరీక్షలు పెట్టేటప్పుడు తమ దగ్గరకు ఎందుకు రాలేదంటూ పల్నాడుకు చెందిన ఒక దళారి డెల్టాలోని ఒక మహిళా యజమానిపై జులుం ప్రదర్శించారు. డెల్టా ప్రాంతంలోని ఫిజిక్స్ ఇంటర్నల్ లేకుండా పరీక్ష ఎలా పెట్టారని ఒక దళారి బెదిరించి వసూలు చేశారు. పల్నాడులోని ఒక కరస్పాండెట్ కొన్ని బీఈడీ కళాశాలలను బెదిరించి భారీగా వసూలు చేసినట్టు పచ్చ పార్టీకి చెందిన యాజమాన్యాలే వాపోతున్నాయి. -
నూనెలు సలసల
గుంటూరు ఎడ్యుకేషన్: వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను వంట నూనె ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటిట్లో గుబులు రేపుతోంది. రెండు వారాలకు ముందు వరకు సాధారణంగా ఉన్న వంట నూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ నూనైపె ఒక్కసారిగా రూ.20 నుంచి రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇదే కాకుండా వివిధ బ్రాండ్లకు చెందిన వంట నూనె ధరలు లీటర్కు ఏకంగా రూ.60 నుంచి రూ.80కు సైతం పెరిగాయి. హోల్సేల్ సూపర్బజార్లు, ఆన్లైన్ హోమ్ డెలివరీ ప్లాట్ఫామ్లలోనూ అధిక ధరలు కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో ధరలకు రెక్కలు వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వంటనూనెల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం పన్నులు సైతం వట నూనెల ధరలు పెరగడానికి మరో కారణమైంది. ఉగాది పండుగ మొదలు మార్కెట్లో వంటనూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకు చూపి స్థానిక వ్యాపారులు వినియోగదారులపై నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు గోదాముల్లో స్టాకును బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెరిగేందుకు కారకులవుతున్నారు. అదే విధంగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన నూనె ప్యాకెట్లు, డబ్బాలను ప్రస్తుతం నెలకొన్న డిమాండ్తో ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో రోజుకు రూ.50వేల లీటర్లకు పైగా నూనె వినియోగం తగ్గిపోయిన పరిమాణం... నూనె రకం గతంలో ధర ప్రస్తుత ధర (లీటర్) ( లీటర్) పామాయిలు 90–115 20–160 సన్ఫ్లవర్ ఆయిల్ 140–155 160–180 వేరుశనగ నూనె 130–150 170–190 -
మేఘా క్యాంపును పరిశీలించిన ఏడీసీ సీఎండీ
తాడికొండ: రాజధాని పరిధిలో రాయపూడి – తుళ్లూరు గ్రామాలకు చేరువలో మెగా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి మంగళవారం పరిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మెటీరియల్ స్టాక్ను కాంట్రాక్టర్ ఇక్కడ ఉంచారని, ఈ ప్రమాదంలో ఎల్పీఎస్ నిర్మాణ పనులకు తీసుకువచ్చిన వివిధ రకాల యుటిలిటీ పైపులు అగ్నికి ఆహుతైనట్లు ఏడీసీ చీఫ్ ఇంజినీరు సీహెచ్ ధనుంజయ సీఎండీకి వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణాలను లోతుగా పరిశోధించాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. పరిశీలించిన ఇంటిలిజెన్స్ ఎస్పీ, జిల్లా ఎస్పీలు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం రాయపూడి సమపంలో మెగా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ యార్డు వద్ద మంగళవారం పైపులు తగలబడిన ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసకున్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ బృందాలతో కలిసి పరిసరాలను పరిశీలించి 22 లాటులు పీఎల్బీ పైపులు కాలిపోయినట్లు గమనించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే గుర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను గమనించాలని సూచించారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా జోన్–3 పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లు
పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ తెనాలిటౌన్: జోన్–3 పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లు పారదర్శకంగా జరిగాయని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సంవత్సరంలో గ్రేడ్–3 సంబంధించి ప్రమోషన్లు కల్పించగా కొందరు ఉద్యోగులు మే నెలలో కోర్టును ఆశ్రయించడంతో ప్రమోషన్లు నిలిచిపోయినట్లు చెప్పారు. ఇటీవల పదిరోజుల కిందట న్యాయస్థానం ఆ పిటిషన్ చెల్లదని కొట్టివేయడంతో పంచాయతీరాజ్శాఖ కమిషనర్ వెంటనే స్పందించి పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించినట్లు తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 600మంది నష్టపోయినట్లు గుర్తుచేశారు. పంచాయతీరాజ్శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. కొందరు ఉద్యోగులు దుర్దేశపూర్వకంగా ప్రకాశం జిల్లాలో చేస్తున్న నిరసన దీక్షను ఖండించారు. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రమోషన్లు కల్పించలేదన్న మాట అవాస్తవమని చెప్పారు. కోర్టు తీర్పు చూసికూడా వీరికి కనువిప్పు కలగలేదని ఆరోపించారు. పంచాయతీరాజ్ కమిషనర్పై నిందలు వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ జాన్ పీరా మాట్లాడుతూ జీవోఎంఎస్ 91 ప్రకటించిన గ్రేడ్ల ప్రకారం పేస్కేల్ అమలు చేయాలని కోరారు. ఈ విధానం వలన 15వేల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. గ్రేడ్–3 స్కేల్ అమలుపరచడం వలన 8,300 కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరి పి.శివాజీ, శ్రీకాకుళం జిల్లా సహా అధ్యక్షుడు జ్యోతి శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కూటమిలో లుకలుకలు
● టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు ● బీజేపీలో అంతర్గత చిచ్చు ● ప్రజా ప్రయోజనాలపై దృష్టి శూన్యంనరసరావుపేట: అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు, పదవుల పోరాటం, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లోని నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీల ప్రతినిధిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీడీపీ ఎంపీగా పోటీచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ అరవిందబాబుకు టికెట్ ఇచ్చేందుకు తన విముఖుత వ్యక్తం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల అనంతరం కూడా వారిద్దరి మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై పట్టింపు ఏదీ?ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. రెండేళ్ల నుంచి నియోజకవర్గం నుంచి కొనసాగే నకరికల్లు–చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టించలేకపోయారు. పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. మున్సిపాల్టీతో పాటు ప్రభుత్వ కార్యాలయా ల్లో అవినీతి ఏరులై పారుతుంది. ఈ ప్రభుత్వంలో అధికారుల లంచాలు తీసుకోవడం తప్పితే తమకు కూటమి ప్రభుత్వంలో ఒరిగిందేమిలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీలో అంతర్గత కు మ్ములాట నడుస్తుంది. గత ఎన్నికల నాటి కి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన రంగిశెట్టి రామకృష్ణ, ప్రస్తుత అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ వర్గీయుల మధ్య నిప్పులేకుండానే పొగ వస్తుంది. ఇటీవల రామకృష్ణ కాప సంఘ సమావేశంలో తన కులస్తులపైనే కొన్ని విమర్శలు చేయటం, ఆ విమర్శలతో పార్టీకి ఏం సంబంధం లేదని, అతని వ్యక్తిగతమంటూ బీజేపీ నాయకులు ప్రెస్మీట్ పెట్టి చెప్పటం గమనించాల్సిన అంశం. దీనిపై రామకృష్ణ వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని వాట్సాప్లలో వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు భోగట్టా. -
జిల్లాస్థాయి సమన్వయ సంఘం సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్.వి.వి.ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ 2026–27లో చేపట్టబోతున్న కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు పంటలవారీగా సలహాలను, సూచనలు తెలిపారు. దత్తత గ్రామాల రైతుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎ.మనోజ్ మాట్లాడుతూ 2025–26 సంవత్సరంలో వివిధ పంటలలో చేపట్టిన చిరు సంచులు ఫలితాలను, క్షేత్ర పరిశీలనలను, జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు ఏరువాక కేంద్రం 2026–27 లో చేపట్టవలసి కార్యక్రమాలకు అవసరమైన సలహాలను అందజేశారు. విస్తరణ నిపుణురాలు డాక్టర్ శ్రీలతవాణి 2025–26లో చేపట్టిన కార్యక్రమాలు 2026–27లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. రైతులకొరకు షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక నిధులతో నువ్వులలో సమగ్ర యాజమాన్యంపై పుస్తక ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఆత్మ పథక సంచాలకులు డి.వెంకటేశ్వర్లు, జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, జిల్లా నీటిపారుదల శాఖ డీఈ, విత్తన ధ్రువీకరణ అధికారి సురేష్రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ యాకోబు, పంటలవారీగా ప్రధాన శాస్త్రవేత్తలు, ఆర్ఈసి సభ్యులు, డి.ఎల్.సి.సి సభ్యులు, ఇన్నోవేటివ్ నెట్వర్క్ సభ్యులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
కారుతో విద్యార్థుల హల్చల్
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ పరిధిలోని ప్రాతూరు గుండిమెడ మధ్య వున్న చిన్నరహదారిలో కొంతమంది విద్యార్థులు మంగళవారం కారుతో హల్చల్ చేశారు. అతివేగంగా కారు నడిపి ఓ విద్యార్థి మృతికి కారణమవగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... జాతీయ రహదారి వద్ద ప్రాతూరు అండ్పాస్ నుంచి ఒక కారు అతివేగంగా వస్తూ రోడ్డుపక్కనే ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి పలువుర్ని ఢీకొట్టేందుకు యత్నించగా వారు తప్పించుకున్నారు. ప్రాతూరు గ్రామం మలుపు నుంచి గుండిమెడ వస్తున్న సమయంలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీం పంటకాలువ దాటిన తరువాత రోడ్డుపక్కనే అతివేగంగా వస్తున్న కారులో ఉన్న స్నేహితుల కారు ఆగి ఉంది. అదే వేగంతో ఆ కారును ఢీకొని ఆ పక్కనే ద్విచక్రవాహనంపై వెళుతున్న సంపత్రెడ్డి (17), అనే ఇంటర్ విద్యార్థిని, మరో విద్యార్థినిని ఢీకొనడంతో సంపత్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సంపత్రెడ్డి మొహం మొత్తం నలిగిపోయింది. వాహనం వెనుక ఉన్న విద్యార్థినికి కాలు, చెయ్యి విరగడంతో 108లో స్థానికులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని వివరాలు చెప్పేందుకు, కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. కారుతో ఢీకొట్టిన విద్యార్థిని స్థానికులు పట్టుకోగా, అదే కారులో వున్న విద్యార్ధి, విద్యార్థినులు మరో కారులో ప్రాతూరు వైపు పరారవుతుండగా రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించిన యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని సైతం కారుతో నెట్టుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ప్రమాదం జరిగిన విషయాన్ని కనుక్కోకుండా వారి కొడుకుని కాపాడుకునేందుకు యత్నించడంతో స్థానికులు ఆయన వచ్చిన కారు అద్దాలను పగలకొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కారు నడిపిన విద్యార్థితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు మాత్రం వారందరూ మత్తులో ఉన్నారని, గంజాయి తాగారా, మద్యం సేవించారా అన్నది తెలియరావడం లేదని, జరిగిన సంఘటనపై సక్రమమైన విచారణ చేసి విద్యార్థి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
టీబీ రహిత జిల్లాగా ఆవిర్భవించాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు మెడికల్: క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా ఆవిర్భవించేందుకు సమష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధికి సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. ‘టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం’ థీమ్తో ఈ సంవత్సరం టీబీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, ఉచిత పరీక్షలు, ఔషధాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు అందరూ టీబీ పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్ కు, టీబీ రహిత జిల్లాకు సహకరించాలని చెప్పారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. టీబీ పరీక్షలు, మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయన్నారు. టీబీ రోగులతో బంధాన్ని కొనసాగించి, త్వరగా నయం కావడానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
29న అండర్–19 యువకుల క్రికెట్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ సారధ్యంలో ఈ నెల 29 ఉదయం 7:30 గంటలకు అరండల్ పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్యా హైస్కూల్ గ్రౌండ్లో అండర్–19 యువకుల క్రికెట్ ఎంపిక నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు యు.మహతి శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ బాగ్తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార కార్డ్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ తో రిపోర్ట్ చేయాలన్నారు. పులిపాక హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్ గుంటూరు ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పొత్తూరువారితోటలోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం సంబంధిత పాఠశాలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ తనిఖీ చేసిన సమయంలో పాఠశాలలో హాజరైన విద్యార్థుల కంటే అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజనం చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేసిన సంఘటనపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటనను జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జ్ హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈవో సలీమ్ బాషా రెగ్యులర్ హెచ్ఎంతో పాటు ఎంఈవో–2కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మందుబాబులకు మూడు రోజుల సేవాశిక్ష చీరాల రూరల్: మద్యం తాగి జన సంచారంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 9 మందికి మంగళవారం సెకండ్ క్లాస్ న్యాయస్థానం మేజిస్ట్రేట్ నరహరి శ్రీనివాసరావు మూడు రోజులు పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలంటూ సేవా శిక్ష విధించినట్లు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. చీరాల టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు, ఒన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు, వేటపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు ఉన్నట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను అనాథలుగా మార్చేందుకు దోహదం చేస్తోందని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసుల్లోని నిందితులకు న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధిస్తుందని చెప్పారు. అయితే వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు న్యాయమూర్తి వారిపై జాలి చూపించి సేవా శిక్ష విధించినట్లు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భక్తులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. తెనాలి చెంచుపేటకు చెందిన మాదాల నాగరాజా కుమారి, భానుప్రసాద్లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పిడుగురాళ్ల: పట్టణంలోని నాగుల గుడిలో షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం, కావడి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026రూపురేఖలుపునర్విభజనతో మారనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దైన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుత గుంటూరు ఈస్ట్, వెస్ట్తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్ స్థానాలు ఏర్పడే అవకాశముంది. నిజాంపట్నం: స్థానిక సచివాలయం–2ను డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. 9 శాసనసభ, 2 లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో అతివలకు అందలం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు మహిళలకు కేటాయింపు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో ఉంటుందో.. అభ్యర్థి ఎవరో.. అంటూ ప్రజల్లో చర్చ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న రాజకీయ నేతలు -
క్వారీ గుంతలో విద్యార్థి గల్లంతు
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి విద్యార్థి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు రూరల్ మండలం పెద్ద పలకలూరు గ్రామానికి చెందిన బండారు రాంబాబు కుమారుడు చంద్రశేఖర్, అతని స్నేహితుడు నేలకంఠ గీతా భగవాన్లు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు. చంద్రశేఖర్ తన ద్విచక్ర వాహనంపై గీతా భగవాన్తో కలసి పెద్ద పలకలూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో కై లాసగిరి పర్వతాల వెనుక వైపున ఉన్న పాత క్వారీ గుంత వద్దకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ నీటిలోకి దిగి ఈత కొడుతూ మధ్య వరకు వెళ్లి అకస్మాత్తుగా మునిగాడు. గమనించిన అతని స్నేహితుడు గీతా భగవాన్ సమీపంలోని వారికి సమాచారం ఇచ్చి, వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. మేడికొండూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చంద్రశేఖర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల వరకు వెతికినా చంద్రశేఖర్ ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. -
పెట్టుబడుల పేరుతో మోసం
నగరంపాలెం: పెట్టుబడుల పేర్లతో మోసగించారని, రైతులకు తెలియకుండా మిర్చి బస్తాలు విక్రయించారని ఒకరూ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులను స్వీకరించారు. వారి విన్నపాలను జిల్లా ఎస్పీ ఆలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లల్లోనూ ఫిర్యాదు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా meekos am.ap.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్–ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చునని చెప్పారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ (క్రైం), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదన్రావు (సీసీఎస్) ఫిర్యాదులు స్వీకరించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల మధ్యాహ్నా భోజనంపై వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తపై చర్యలు చేపట్టాలి. పిల్లలను శోభనం పెళ్లి కొడుకులుగా కించపరిచేలా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల్లో తొంభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు చదువుకుంటారు. విద్యార్ధుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్, దార్ల అర్జున్కుమార్, నాయకులు సుమారు రెండేళ్ల క్రితం రైతులకు సంబంధించి 1,800 మిర్చి బస్తాలను చిలకలూరిపేట రోడ్డులోని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశాం. అయితే రైతులకు తెలియకుండా 1,500 బస్తాలను కోల్ట్స్టోరేజీ నిర్వాహకులు విక్రయించారు. సుమారు రెండు నెలలు క్రితం రైతులు వెళ్లి విచారించగా, సదరు నిర్వాహకులు విక్రయించినట్లు బయటపడింది. దాదాపు విక్రయించిన సరుకు సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. న్యాయం చేయగలరు. – గరిగంటి వెంకటేశ్వర్లు, ఈశ్వరీ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులు గుంటూరు అరండల్పేటలో సుమారు రెండేళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి రూ.లక్ష పెట్టుబడి చెల్లిస్తే నెలకు రూ.10 వేలు చొప్పున 20 నెలలు చెల్లిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల మందికి పైగా చెల్లించారు. మొదట్లో చెల్లింపులు పద్ధతిగా చేశారు. అయితే నెల నెలా చెల్లింపుల్లో ఆలస్యమవగా అనుమానం వచ్చి కార్యాలయం వద్దకు వెళ్లాం. అక్కడకు వెళ్తే నిర్వాహాకులు పారిపోయారని తెలిసింది. దాదాపు రూ.వంద కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదు. న్యాయం చేయగలరు. – బాధితులు నిజామ్, అనీల్, శ్రీనివాస్, షేక్ సైదా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన బాధితులు -
మోదుగులను శోభాయాత్రకు ఆహ్వానించిన సమితి సభ్యులు
పట్నంబజారు: ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఆహ్వానించారు. రెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో కలిసిన సమితి సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై గోరంట్ల వరకు జరిగే శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీరామనవమి రోజున అద్భుతమైన శోభాయాత్రను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భక్తులంతా ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమితి సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు రామరాజు త్రికోటేశ్వరరావు, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్ సెంటర్లోని హిందూ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు రవాణా సదుపాయం తదితర వివరాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయడంతోపాటు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ 149 కేంద్రాల పరిధిలో నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులు పాల్గొన్నారు. -
20 లక్షల ఉద్యోగాలు ఏవి బాబూ?
పట్నంబజారు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇస్తామని చెప్పిన 20లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ ఉత్తేజ్రెడ్డి ప్రశ్నించారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా, నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేశారని, ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ను 10వేల ఉద్యోగాలతో విడుదల చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అది కూడా విడతల వారీగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వ తీరు పబ్లిసిటీ పీక్.. ఫెర్మాఫెన్స్ వీక్ అనే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత మూడు బడ్జెట్లు ముగిశాయని, నిరుద్యోగ భృతి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, అవి ఎక్కడెక్కడ ఇచ్చారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యువతకు సంబంధించి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ఉంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. -
కట్టుకున్న భార్యే కడతేర్చింది
మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీనగరంపాలెం: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్, పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అత్యుత్తమ సేవలే మెడ్స్టార్ లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధప్రదేశ్లోనే అడ్వాన్స్డ్ మెడికల్ ఎకోసిస్టమ్తో రోగి కేంద్రిత వైద్య సేవలకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ మెడ్స్టార్ ఆస్పత్రిని మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.విజయ చైతన్య తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆశ్రమం రోడ్డులో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఆస్పత్రిలో ఫిలిప్స్ అజ్యూరియన్ 7ఎం 20 హైబ్రిడ్ క్యాథ్ల్యాబ్ను రాష్ట్రంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా అత్యాధునిక 3డీ ఇమేజింగ్, తక్కువ రేడియేషన్ సాంకేతికతతో హైబ్రిడ్ ప్లాట్ఫారమ్ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండో వాస్క్యులర్ సంబంధిత క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత కచ్చితత్వం, భద్రతతో నిర్వహించొచ్చని పేర్కొరు. ఫిలిప్స్ 3డీటీ (ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ) సిస్టమ్ అందుబాటులో ఉందన్నారు. ఇది గుండె నిర్మాణాన్ని రియల్ టైమ్లో, హై–రిజల్యూషన్ 3 ఈ రూపంలో చూపిస్తూ క్లిష్టమైన హార్ట్ వాల్వ్, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్స్ సమయంలో కచ్చితమైన నిర్ధారణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని వివరించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, పల్మనాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రిలో మొత్తం వైద్య వ్యవస్థను గార్డియన్ సాఫ్ట్వేర్ అనలిటిక్స్ ఆధారిత ఇంటెలిజెంట్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ సమన్వయం చేస్తుందని, ఇది రోగుల ఆరోగ్య స్థితిని రియల్ టైమ్లో పర్యవేక్షిస్తూ, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి, వైద్య బృందం స్పందన వేగాన్ని పెంచుతుందని తెలిపారు. దీని ద్వారా నిరంతర, డేటా ఆధారిత వైద్య సేవలు అందు తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ పరుచూరి సాయికుమార్, సీటీ సర్జన్ డాక్టర్ పి.వి.నరేష్, నెఫ్రాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వై.రమేష్ పాల్గొన్నారు. -
గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
సబ్కలెక్టర్ కార్యాలయంలో సీపీఎం నేతల వినతి తెనాలి: ఎల్పీజీ గ్యాస్ సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ కోరారు. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సీపీఎం నాయకులు ఎల్పీజీ గ్యాస్ను అందుబాటులో ఉంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి పట్టణంలో వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు ఫోన్ చేస్తే స్పందించటం లేదని చెప్పారు. ఒకవేళ స్పందించి రిజిస్టరు చేసుకున్నా రెండు వారాలు గడిచినా డెలివరీ చేయటం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎల్పీజీ గ్యాస్కు ఎటువంటి కొరత లేదని, గ్యాస్ సరఫరాకు కూడా ఎలాంటి అవరోధం ఉండడానికి వీలు లేదని హామీలు ఇచ్చారని గుర్తుచేస్తూ, వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో, సక్రమంగా సీరియల్ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ిసీపీఎం నాయకులు షేక్ హుస్సేన్వలి, రాజ శేఖర్ పాల్గొన్నారు. -
అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: అర్జీలు రీ–ఓపెన్ కాకుండా శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని శాఖల్లో అర్జీలు రీ–ఓపెన్ జరుగుతుందన్నారు. అటువంటి వాటిపై శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బంది అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. లీగల్ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి జవాబు ఇవ్వాలన్నారు. సరైన కారణాలు లేకుండా అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం వచ్చిన 688 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్తిపాడు మండలం కోయావారి పాలెం గ్రామ పరిధిలోని జగన్ కాలనీలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ 71 కుటుంబాలు కూలీనే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నాయి. రోడ్లు, కాలువలు లేవు. వర్షాలు వస్తే కాలనీ నీటిలో మునిగిపోతుంది. కనీస మౌలిక వసతులు కల్పించాలని మనవి. – కూరపాటి నిర్మల, తదితరులు, దళిత బహుజన రీసోర్స్ సెంటర్. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఓబుల్నాయుడు పాలెం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమంగా క్వారీ వ్యాపారం చేస్తున్నారు. దీనికి కొందరు ప్రభుత్వాధికారులు కూడా సహకరిస్తున్నారు. స్థానికంగా క్వారీ మాఫియాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి విచారించి న్యాయం చేయాలని మనవి. – ఆర్.శివనాగరాజు, ఓబులనాయుడుపాలెం. -
కళల తెనాలిలో ‘స్వరలయ’ కళాసేవ అమోఘం
రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: కళలకు జన్మభూమి వంటి తెనాలిలో నిత్యకళాసేవ చేస్తూ, క్రమం తప్పక చేసే కార్యక్రమాలలో స్వరలయ నిర్వహించే ఉగాది ఉత్సవాలు చిరస్మరణీయమని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణానికి చెందిన సంగీత, సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సభకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత సీఈవో దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గాప్రసాద్, మల్లేశ్వరరావు, రవిమోహన్, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తమరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠపురం ఆలయంలో హుండీ కానుకలు లెక్కింపు
తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు. శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు. -
టెక్స్టైల్ కంపెనీలో భారీ చోరీ
మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని ఓ టెక్స్టైల్ కంపెనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.45 లక్షల 20 వేల నగదుతో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో సోమవారం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో గత నెల 28న మిషనరీ అపహరించిన ఘటనపై ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన డాక్టర్ గోలి నాగసైనరావుతో పాటు పలువురు స్నేహితులు కలసి 2006లో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్స్ కంపెనీ నిర్మించారు. కొంతకాలం లాభాల బాటలో నడిచింది. ఆ తరువాత ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల బ్యాంకుకు ఇ.ఎం.ఐలు చెల్లించలేదు. భాగస్వామి ఇమ్మనేని ఈశ్వరరావును రిజల్యూషన్ ప్రొఫెషనల్గా బ్యాంకు అధికారులు నియమించారు. అప్పటి నుంచి ఈశ్వరరావు ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 28న మిషనరీ దొంగతనం జరిగిందని గమనించి ఈశ్వరరావు మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ● మైలవరానికి చెందిన గజ్జలకొండ గోపాల్, ఈశ్వరరావుకు తెలిసిన వ్యక్తి కావడంతో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా పలువురిని నియమించారు. గోపాల్కు దుర్భుద్ది పుట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ మిషనరీని అమ్ముకుని ఇతర దేశాలకు వెళ్లిపోవాలని గోపాల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కూలీల సహాయంతో కంపెనీలో ఉన్న మిషనరీని ముందుగా మాట్లాడుకున్న షాపులకు అమ్మేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న గోపాల్ విదేశాలకు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన తొమ్మిది మందిని మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని కోకో కోలా కంపెనీ వెనుక ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల 20 వేల రూపాయల నగదు, మహేంద్ర బొలెరో, మహేంద్ర స్కార్పియో వాహనాలు, ట్రాక్టర్ ఇంజన్తో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయానికి షార్ట్కట్స్ లేవు
● కష్టపడితేనే జీవితంలో సక్సెస్ ● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గుంటూరు ఎడ్యుకేషన్: కష్టపడితేనే జీవితంలో విజయాన్ని సాధించగలమని, ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు షార్ట్కట్స్ లేవనే విషయాన్ని తెలుసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని చాణక్య ఎడ్యుకేషనల్ హబ్లో ‘సందేహాలతో సతమతమవుతున్న దశ నుంచి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే స్థాయికి చేరుకోవడం ఎలా’ అనే అంశంపై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అభివృద్ధి వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో పట్టుదలతో చదవాలని, ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఒక లక్ష్యం అనేది ఉండాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, నైతిక, మానవతా విలువలను ఆచరించినప్పుడే జీవితంలో సన్మార్గంలో పయనించగలరని అన్నారు. చదువుల పేరుతో ఒత్తిడి, ఆందోళనతో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, శ్రమను నమ్ముకుని, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని, విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు చేసుకోవాలన్నారు. ప్రేరణాత్మక వక్త కె.శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, వ్యాపార సంబంధమైన విషయాల్లో దృష్టి సారించాలని సూచించారు. చాణక్య ఎడ్యుకేషనల్ హబ్ సీఈఓ డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ జీవితంలో ఏ విధంగా ఎదగాలి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానిని చేరుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సూచనలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. -
అంబటికి కాటసాని పరామర్శ
పట్నంబజారు: వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబును పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొద్ది కాలం క్రితం టీడీపీ గూండాలు అంబటిపై దాడికి యత్నించి, నివాసం, కార్యాలయం పగులకొట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో సిద్ధార్థ నగర్లోని ఆయన నివాసంలో అంబటిని కలిసిన కాటసాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు చేసిన దాడి వివరాలను పరస్పరం చర్చించుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కాటసానికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. తెనాలిఅర్బన్: 2003 సంవత్సరంలో ఎంపికై 2004లో విధుల్లో చేరిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరారు. బోసురోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి లోకేష్తో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తెనాలి కన్వీనర్ పుట్టా జనార్ధనరావు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు అనిశెట్టి శ్రీనివాసులు, ఎం.నాగమ్మ, షేక్ జాకీర్, వెంకటేశ్వరరావు, మంజుల, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎదను కదిపిన ఆలాపన
తెనాలి: ఆ గానం సంగీత మధురిమలను పంచింది...ఆధ్యాత్మిక కీర్తనలు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సంగీతాభిమానులకు పారవశ్వాన్ని కలిగించాయి. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ గానాలాపనకు శ్రోతలు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని చాటారు. ఎన్నో ఏళ్లుగా తన సంగీత విద్యతో శ్రోతలను రంజింపజేస్తూ, మరెందరికో శిక్షణనిస్తున్న చింతలపాటి మంజుల గానాలాపన ప్రతి ఎదనూ కదిపింది. ప్రతి కీర్తనకూ శ్రోతలనుండి కర తాళధ్వనులు అందుకున్నారు. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్చౌక్లో గల శ్రీసీతారామమందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు ఇందుకు వేదికగా నిలిచాయి. సంగీతవ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా సొంతూరు తెనాలిలో వసంత నవరాత్ర ఉత్సవాల్లో సంగీత కచేరీ చేయటం అదృష్టంగా భావించానని డాక్టర్ మంజుల చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెనాలి డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత, కళాభిమాని మునగాల మోహన్శ్యాంప్రసాద్ డాక్టర్ మంజులను సత్కరించి అభినందించారు. సంగీతరంగంలో తెనాలికి గల ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్న విద్వన్మణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామమందిరం పాలకవర్గ కమిటి కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి డాక్టర్ మంజులను ప్రశంసించారు. సంగీత విద్వన్మణి డాక్టర్ చింతలపాటి మంజులకు సత్కారం -
కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ
తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్–యువ కవుల కోసం కవిత్వ మెళకువల’పై ఒక రోజు వర్క్షాప్ను ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజలు తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్షాప్నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్లు విశ్లేషించారు. వర్క్షాప్నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ శివశంకర్ -
31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
తెనాలిటౌన్: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, 24 విభాగాల యూనియనన్్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చూన్ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్టు, ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ర్, అనాధ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణీ తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ కేరెక్టర్ నటి సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్, పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు పాల్గొన్నారు. -
మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
● రెండు సెల్ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి గుంటూరు రూరల్: ట్రూకాలర్లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్ నంబర్లకు వీడియో కాల్స్ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్లో రియల్ నంబర్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్లో చెక్ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్ అయిన నెంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, వారికి వీడియో కాల్స్ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్, ఆపిల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు. – రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం తెనాలిరూరల్: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్ హోమ్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూమ్లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.11.80 లక్షల విలువైన సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బడ్స్, చార్జర్, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్న్ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకుని సోనోవిజనన్ షోరూమ్లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్లో క్లీనర్గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు(68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన ఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్ఐ తెలిపారు. అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడిక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): శనగ పంటను ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన ఆదివారం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటా రూ.5,875లకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తగిన విధంగా కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు 5 వేల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగల దిగుమతిని రద్దు చేయాలని, దేశీయ శనగలను కొనుగోలు చేయాలని కోరారు. శనగలతోపాటు మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుము వంటి పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై చేస్తున్న సామ్రాజ్యవాద దాడిని ఖండించాలని ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని, ట్రంప్ యుద్దోన్మాద చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహ్మమారికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా విస్తత ప్రచారం చేపట్టాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాలలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 6వేల ఎకరాల సారవంతమైన భూములను సేకరిస్తున్నారని, భూములు కోల్పోయే రైతులకు ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.అరుణ, ఎమ్.ఎ.చిష్టీ, డి.లక్ష్మీనారాయణ, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
జిల్లాలో 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ, పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు. డాక్టర్ కొంగర శ్రీకాంత్ గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్లోని బండ్లమూడిగార్డెన్స్లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్ఐ బండ్ల భార్గవ్ కథనం.. మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. వరస ప్రమాదాలతో భయాందోళన గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సంక్షోభంలో పాఠశాల విద్యారంగం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సంక్షోభంలో ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో పాఠశాల విద్యారంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని అన్నారు. పాఠశాల విద్యలో అనేక ప్రయోగాలను చేస్తూ, పాఠశాలలను ప్రయోగ పరీక్ష కేంద్రాలుగా మార్చి వేశారని అన్నారు. కూటమి పాలనలో విద్యారంగంలో తెచ్చిన ఏ ఒక్క పథకం, కార్యక్రమం నాణ్యమైన విద్య అందించేదిగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా విద్యారంగంపై ప్రయోగాలు మానుకుని, విద్యార్థులకు ఉపయోగపడే శాసీ్త్రయమైన విద్యావిధానాన్ని మాతృభాషలో కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల తరగతులు ఉపసంహరించుకోవాన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ విద్యాశాఖాధికారులు నిరంకుశంగా అమలు చేస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలానీ మాట్లాడుతూ 79 ఏళ్లుగా ఏపీటీఎఫ్ విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి నిరంతరం పనిచేస్తోందని, కార్యకర్తలు నిత్య చైతన్యంతో పనిచేయాలని సూచించారు. పేద ప్రజల బిడ్డలకు మంచి విద్యను అందించాలన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపాటి దాస్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితో సంఘ నిర్మాణానికి, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యవర్గ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్, ప్రధానకార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, జిల్లా కార్యదర్శులు గడ్డిపాటి శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్లు బి.సాయి లక్ష్మీ, కె.రమేష్ వివిధ మండల శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు -
నేటి నుంచి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు
రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ వారి పుష్కర కుంభా భిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేది ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. చేబ్రోలు: మానవాళి రక్షణకు ఏసుక్రీస్తు శిలువ శ్రమలు పొంది, శిలువపై రక్తం చిందించి మరణించి సర్వ మానవాళికి రక్షణ అందించారని చేబ్రోలు చీలిపాలెంలోని పునీత అంతోనివారి దేవాలయం ఫాదర్ మల్లవరపు బాలశౌరి తెలిపారు. చేబ్రోలులో ఆదివారం ఘనంగా శిలువ యాత్ర కార్యక్రమం చేపట్టారు. పాతరెడ్డి పాలెం, గొడవర్రు, కోవెలమూడి, లేమల్లె పాడు, కొత్తరెడ్డిపాలెం నుంచి వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభువు శిలువ శ్రమలను కళ్లకు కట్టే విధంగా నాటక రూపంలో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొన్నూరు ఆశ్రమానికి చెందిన బ్రదర్ జాక్ (గోతాలస్వామి) సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశారు. కమిటీ పెద్దలు, సంఘస్తులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకున్నారు. -
ఘరానా దొంగ అరెస్ట్
గుంటూరు రూరల్: జల్సాల కోసం డబ్బులు సులువుగా సంపాదించుకునేందుకు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు... కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామానికి చెందిన కత్తి రవికుమార్ గతంలో గుంటూరు, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, కర్నూల్ జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ చోరీలు చేశాడు. పలు కేసుల్లో అరైస్టె 5 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో జైలు నుంచి వచ్చి మళ్లీ గుంటూరు అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి పూట బంగారం చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పలకలూరు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలో చోరీలకు సంబంధించి రూ1.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందిని రివార్డు అందజేసి అభినందించారు. -
విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి
ఆర్ఐవో జి.సునీతగుంటూరు ఎడ్యుకేషన్:స్పాట్ వాల్యూయేషన్ విధి నిర్వహణలో అధ్యాపకులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐవో) జి.సునీత పేర్కొన్నారు. ఆదివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఆన్సర్ షీట్లకు మూల్యాంకనం నిర్వహించేందుకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి స్పెల్లో భాగంగా జనరల్ కోర్సుల వారీగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, చరిత్ర, ఎకనామిక్స్ సబ్జెక్టులతోపాటు ఒకేషనల్ విభాగంలో ఇంగ్లీషు, జీఎఫ్సీ, ఏ అండ్ టీ, సీఎస్ఈ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ సబ్జెక్టులకు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మూల్యాంకన విధులకు నియమితులైన అధ్యాపకులందకూ బోర్డు నిర్ధేశించిన స్కీమ్ ఆఫ్ వాల్యూయేషన్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు మౌళిక వసతుల పరంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్పాట్ వాల్యూయేషన్ విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులు మొబైల్ ఫోన్ వినియోగించరాదని పేర్కొన్నారు. సమావేశంలో సహాయ క్యాంపు అధికారులు బి. ఉమాదేవి, జయశీల, కోడింగ్ అధికారులు సుచరిత, బాలమోహన్ పాల్గొన్నారు. -
చురుగ్గా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆన్సర్ షీట్లకు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ వేగవంతమైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సంస్కృత భాష ఆన్సర్ షీట్లకు వాల్యూయేషన్ జరుగుతోంది. జనరల్, ఒకేషనల్ కోర్సులవారీగా ఆరు సబ్జెక్టుల చొప్పున ఆదివారం వాల్యూయేషన్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు మూల్యాంకన విధులకు హాజరయ్యారు. ఇటీవల ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి గుంటూరు జిల్లాకు ఆర్ట్స్, సైన్స్ కోర్సుల వారీగా 3.50 లక్షలు, ఒకేషనల్లో 75 వేల స్క్రిప్ట్స్ వచ్చాయి. స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి, ఆర్ఐవో జి.సునీత పర్యవేక్షణలో తెలుగు, హిందీ, సంస్కృతం, గణితం, సివిక్స్, ఇంగ్లిషు సబ్జెక్టులకు సంబంఽధించిన ఆన్సర్ షీట్లకు అధ్యాపకులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. వాల్యూయేషన్తోపాటు ‘మార్క్స్ ట్యాబ్లేషన్’ ఆన్సర్ స్క్రిప్టులకు వాల్యూయేషన్ చేయడంతోపాటు మార్కుల కేటాయింపు ప్రక్రియ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలోనే జరుగుతోంది. గతంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్లను చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించిన తరువాత వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపేవారు. ఆ విధంగా బోర్డుకు వెళ్లిన ఆన్సర్ స్క్రిప్ట్లను స్కాన్ చేసి విద్యార్థుల రోల్ నంబరు, ప్రశ్నపత్రంలో ఇచ్చిన సీరియల్ నంబరు, బార్కోడ్ ఆధారంగా మార్కులను కేటాయించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్లను స్కానింగ్ చేసి మార్కులను కేటాయిడం ఇంటర్మీడియెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృతమై ఉండటంతో అధికారులకు, ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. పగలు, రాత్రి విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మార్కుల వెల్లడిలో జాప్యం నెలకొంటున్న పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం ఈ విధానంలో మార్పులు తెచ్చిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్లను స్కానింగ్ చేసే ‘మార్క్స్ ట్యాబ్లేషన్’ విధానాన్ని వికేంద్రీకరణ చేసింది. జిల్లాల వారీగా స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోనే ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరవుతున్న ఎగ్జామినర్లు వాల్యూయేషన్ చేస్తున్న స్క్రిప్ట్లను అదే రోజు స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. తద్వారా ఇంటర్మీడియెట్ బోర్డుకు కొండంత పని భారం నుంచి విముక్తి లభించింది. ఆన్సర్ స్క్రిప్ట్లకు స్పాట్ వాల్యూయేషన్ ద్వారా మార్కుల కేటాయింపుతోపాటు అక్కడిక్కడే స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపడంతో వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఫలితాలను ఏప్రిల్ 11న ప్రకటించే అవకాశం ఉంది. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో సబ్జెక్టులవారీగా మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. సబ్జెక్టు నిపుణులను బోర్డులుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్ షీట్లకు వాల్యూయేషన్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినర్తో పాటు ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఉంటారు. వీరికి అదనంగా బోర్డుకు ఒకరు చొప్పున నియమించిన స్క్రూటినైజర్ మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్లను తనిఖీ చేసి, కేటాయించిన మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా 500 మంది అధ్యాపకులను సంబంధిత విధుల్లో నియమించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో విధుల్లో పాల్గొంటున్న అధ్యాపకులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన అధికారులు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. -
పన్ను వసూలుకూ పాట్లు!
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న పన్నులు వసూలు చేయడంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ వసూళ్లపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రైవేట్ వారి నుంచి పన్ను వసూళ్ల విషయంలో కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉంది. ఖాళీ స్థలాలు, వాటర్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీలకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడంలో అధికారులు వెనుకంజలో ఉన్నారు. నగరాభివృద్ధికి కీలకమైన ఆదాయం సమకూర్చడానికి ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ బిల్డింగ్లకు సంబంధించిన మొత్తం అసెస్మెంట్లు 2,17,929 ఉన్నాయి. వీటికి సంబంధించి డిమాండ్ రూ.350 కోట్లు ఉంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఇందులో వసూలు అయింది రూ.127.86 కోట్లు మాత్రమే. ఇంకా రూ.222.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రైవేట్ పాపర్టీకి సంబంధించి చూస్తే 2,07,415 ప్రాపర్టీలకు ఇంటి పన్నులు వసూలు చేయాలి. వీటికి రూ.186.43 కోట్ల డిమాండ్ ఉండగా... ఇందులో వసూలు అయింది రూ.110.12 కోట్లు మాత్రమే, ఇంకా రూ.76.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెస్మెంట్లు 309 ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.30.36 కోట్లు కాగా, వసూలు అయింది రూ.2.49 కోట్లు మాత్రమే. ఇంకా రూ.27.86 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి 142 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి మొత్తం డిమాండ్ రూ.12.78 కోట్లు. వీటిల్లో వసూలు అయినవి రూ.35.41 లక్షలు మాత్రమే. ఇంకా రూ.12.43కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఖాళీ స్థలాలూ ఎక్కువే.. నగరంలో 9,997 ఖాళీ స్థలాలకు అసెస్మెంట్లు ఉన్నాయి. వీటిలో మొత్తం డిమాండ్ రూ.115.60 కోట్లు. కానీ 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.13.78 కోట్లు మాత్రమే. ఇంకా రూ.101.82 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. నగరంలో గృహా అవసరాలకు వాడే నీటి పన్నులు 1,12,850 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం డిమాండ్ రూ.28.37 కోట్లు. ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.7.12 కోట్లు మాత్రమే. ఇంకా రూ.21.25కోట్లు వసూలు కావాల్సి ఉంది. అదే విధంగా కమర్షియల్, అపార్ట్మెంట్స్కు వాడే వాటర్ చార్జీలు (మీటర్) మొత్తం 4478 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటికి డిమాండ్ రూ.53.80 కోట్లు కాగా.. ఈ నెల 21వ తేదీ వరకు వసూలు అయింది రూ.6.10 కోట్లు మాత్రమే. ఇంకా రూ.47.70 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బకాయిలు ఉన్నవారి ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాల్సిన అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనే చెప్పుకోవచ్చు. గుంటూరు నగరపాలక సంస్థలో దీర్ఘకాలికంగా రూ.కోట్లల్లో బకాయిలు ఉన్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు. రూ.10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారు వందల సంఖ్యల్లోనే ఉన్నారు. వీరి వద్ద నుంచి బకాయిలు వసూలు చేయడంలో అధికారులు విఫలం చెందారనే చెప్పుకోవచ్చు. రెడ్ నోటీసులు ఇచ్చి వారి ట్యాప్ కనెక్షన్, డ్రైయినేజీ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పినప్పటికి బకాయిదారుల్లో కనీసం చలనం లేదనే చెప్పుకోవచ్చు. ప్రత్యేక అధికారి పాలనలో అయిన మొండి బకాయిదారులపై దృష్టి సారించాల్సి ఉంది. వారి నుంచి రూ.కోట్ల రూపాయిల బకాయిలు వస్తే ప్రజలకు మేలు చేకూర్చే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. అదే విధంగా కేంద్ర, ప్రభుత్వ కార్యాలయ నుంచి బకాయిలు వసూలు చేయగలిగితే కార్పొరేషన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. -
కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగ పుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వివిధ సేవా టికెట్ల ద్వారా స్వామి వారికి రూ. 8,35,885 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
చిన్నారులకు విద్యుత్ షాక్
తాడేపల్లి రూరల్: ఆడుకుంటున్న సమయంలో చేతిలో ఉన్న బెల్టు ఇంటికి అతి సమీపంలో వున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్లో జామాయిల్ తోటలో నివాసముండే పుప్పాల శ్రీనివాస్, దుర్గ దంపతులకు కుమార్తె, కుమారుడు. ఇతను ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్ తమ్ముడు సురేష్ అలియాస్ బుజ్జి చిరు ఉద్యోగం చేస్తూ ఉండవల్లి సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మూడో అంతస్తులో అద్దెకు నివాసముంటున్నాడు. సురేష్కు కూడా ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ పిల్లలు ఆడుకునేందుకు సురేష్ ఇంటికి వచ్చారు. నలుగురు పిల్లలు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో సురేష్ కొడుకు త్రివిక్రమ్ చేతిలోని బెల్టును విసిరివేశాడు. అది 11 కేవీ వైర్లపై పడింది. పక్కనే ఉన్న శ్రీనివాస్ కుమార్తె విష్ణుప్రియ బెల్టును తీసేందుకు ఇంటికి మాపు వేసే ఐరన్ పైపు కలిగి ఉన్న కర్రతో ప్రయత్నించింది. దీంతో విష్ణుప్రియకు, త్రివిక్రమ్కు విద్యుత్ షాక్ తగిలింది. పెద్దగా కేకలు వినిపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న సురేష్, స్రవంతిలు బయటకు వచ్చి చూడగా పిల్లలు ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నారు. ఏం జరిగిందో అర్ధంకాక పెద్దగా కేకలు వేసి ఇంట్లో ఉన్న దుస్తులతో మంటలను అదుపుచేశారు. ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్దరిని తల్లిదండ్రులు, ఇతర స్నేహితులు వైద్య నిమిత్తం విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. 11 కేవీ విద్యుత్ వైర్లు ఇంటి ముందు నుంచి వెళుతున్నా ఇంటి యజమాని విద్యుత్ సరఫరా కాకుండా పైపులైన్లు వేయించలేదు. ప్రమాదం అని తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు ఆ బిల్డింగ్ యజమానికి సూచించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా చిన్నారులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8వ తరగతి చదువుతున్న విష్ణుప్రియకు జుట్టుతోపాటు రెండు చేతులు, ఛాతీ పూర్తిగా కాలిపోయింది. కుడిచేయి బొటన వ్రేలు, చూపుడు వేలు తీసివేయాలని వైద్యులు తెలియజేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. త్రివిక్రమ్కు రెండు చేతులు, కుడిచేయి ఛాతీ కింద భాగంలో పూర్తిగా విద్యుత్ ఘాతానికి గురై కాలిపోయాయి. -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లాలోని లాడ్జిలు, హోటళ్లు, డార్మిటరీలలో శనివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. రాత్రి వేళ బస చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. అనుమానితుల వివరాలు సేకరించారు. అనంతరం ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా ధృవీకరణ చేపట్టారు. ప్రతి ఒక్కరి నుంచి ఆధార్ లేదా గుర్తింపు పత్రం తీసుకోవాలని నిర్వాహాకులకు సూచించారు. రిజిస్టర్ పుస్తకం విధిగా పాటించాలని అన్నారు. సీసీ టీవీ కెమెరాలను ప్రవేశ ద్వారాలు, కారిడార్లు, పరిసరాల్లో బిగించాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులపై సమీప పోలీస్స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. డార్మిటరిస్, హోటళ్లు, లాడ్జిలలో చట్టవ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 816 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 110, పశ్చిమ కాలువకు 70, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కుల విడుదల చేశారు -
రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు బలవన్మరణం
తాడేపల్లి రూరల్: భార్య ప్రవర్తనలో మార్పు రావడం, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలోని రైల్వే పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి కొత్తూరుకు చెందిన సాయికుమార్ (26) ఇదే ప్రాంతంలో నివాసముండే అఖిలాండేశ్వరిని 2019లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం వేరే వారితో ఫోన్లో మాట్లాడడం, సన్నిహితంగా ఉండడం గమనించిన భార్యను పలుమార్లు సాయికుమార్ హెచ్చరించినా ఎటువంటి మార్పు లేకపోవడంతో ఉదయం సమయంలో కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలోని బకింగ్హామ్ కెనాల్ వద్ద రైల్వేట్రాక్పై తలపెట్టాడు. అదే సమయంలో ట్రైన్ రావడంతో తలతెగిపోయి సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి తెనాలి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సాయి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు. భార్య ప్రవర్తనలో మార్పు రావడంతోనే అంటున్న మృతుడి బంధువులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్లో వణుకూరి పవన్కుమార్ కార్ఖానాలో నాలుగు ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
విశ్వశాంతి స్థాపనకు కవులు పునరంకితం కావాలి
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్ తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు. -
కువైట్లో మేం క్షేమంగానే ఉన్నాం..
తెనాలి: యుద్ధ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్త్తుందో అర్థంకాని పరిస్థితి. ఆయా దేశాల్లోని తమ వారికోసం ఇక్కడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. కువైట్లోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్గా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పట్టణ గంగానమ్మపేటకు చెందిన ఎ.శివనాగేశ్వరరావును ‘సాక్షి’ ఫోనులో పలకరించింది. అక్కడి పరిస్థితి ఆయన మాటల్లోనే... ‘‘నేను రెండు దశాబ్దాలకు పైగా కువైట్లో సీబీఎస్ఈ బోర్డు పరిధిలోని ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నా. యుద్ధం నేపథ్యంలో యూఏఈలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై ఇరాన్ గురిపెడుతోంది. ఆర్థిక వనరులైన ఆయిల్ఫీల్డ్స్, రిఫైనరీలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కువైట్లో చాలా రిఫైనరీలున్నాయి. ఇక్కడ సరిహద్దుల్లో అమెరికాకు చెందిన సైనిక స్థావరాలున్నాయి. కువైట్ ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ చాలా యాక్టివ్గా ఉంటాయి. ప్రతి పేటకో ఫైర్ స్టేషన్ ఉంటుంది. నిమిషాల్లోనే ప్రమాదస్థలానికి సిబ్బంది చేరుకుంటారు. దాడికి గురైన రిఫైనరీలోని మంటలను గంటల వ్యవధిలోనే కంట్రోలు చేయగలుగుతున్నారు. ఇళ్లపై దాడులు లేవు.. జనావాసాలపై దాడులు జరగకపోవటంతో అందరం క్షేమంగానే ఉన్నాం. జనజీవితం సాధారణంగానే ఉంటోంది. కువైట్ ప్రభుత్వం తెలుగువారిని కూడా గుర్తించింది. భద్రతకు సంబంధించిన హెచ్చరిక సందేశాలను తెలుగు భాషలోనే పంపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో రెండు షిఫ్టులుగా నడుస్తున్నాయి. ఇండియాలోని సీబీఎస్ఈ బోర్డు పరిధిలో నడుస్తున్న యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా దేశాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం. 1 నుంచి 9 తరగతుల వరకు, 11వ తరగతి పరీక్షలు రద్దుచేశారు. ఆయా తరగతుల విద్యార్థులకు యూనిట్ టెస్టుల్లో వచ్చిన మార్కులను లెక్కించి ఆ ప్రకారం పై తరగతులకు ప్రమోషన్ ఇస్తారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ జూన్లో వేసవి సెలవులు ఇస్తారు. గతంలో కువైట్ పౌరులకు కూరగాయలు భారతదేశం నుండి వస్తుండేవి. అయిదారేళ్లుగా ఈ పరిస్థితి మారిపోయింది. సమీప ఎడారి దేశాల నుంచే కూరగాయలు ఇప్పుడు వస్తున్నాయి. కువైట్లోనూ కూరగాయలను పండిస్తున్నారు. క్యాబేజి, కాలీఫ్లవర్, తమ్మకాయలు, బంగాళాదుంపలు, టమాటా, మునగ, ఆకుకూరలను పండిస్తున్నారు. గతంలో ఎక్కువగా ఖర్జూర పండించేవారు. కొంతకాలంగా ప్రభుత్వం సబ్సిడీనిచ్చి మరీ కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో మునగ తోటలను బాగా వేస్తున్నారు. టీలోనూ మునగ ఆకును వినియోగిస్తున్నారు. ఇప్పటివరకై తే అంతా బాగానే ఉన్నాం.’’ పాఠశాలలకు సెలవులిచ్చి ఆన్లైన్లో బోధన ప్రభుత్వ కార్యాలయాల్లో షిప్టులవారీగా విధులు సాధారణంగానే జనజీవనం తెలుగులోనే ప్రమాద హెచ్చరికల జారీ కువైట్ నుంచి చిత్రలేఖన ఉపాధ్యాయుడు శివనాగేశ్వరరావు -
తెనాలిలో ట్రాఫిక్ జామ్
తెనాలి రూరల్: తెనాలిలో శనివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పాలకవర్గ సభ్యులు పట్టణంలో శనివారం రాత్రి భారీ ర్యాలీలు నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు వేర్వేరుగా ర్యాలీలు, డీజేలతో హోరెత్తించారు. దీంతో మార్కెట్ వంతెన నుంచి సుల్తానాబాద్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటన్నరకుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు మార్కెట్ యార్డు వద్ద బందోబస్తులో బిజీగా ఉండడం, సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టమైంది. పండుగ, సెలవు కావడంతో సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
కాలువలో ఈతకు దిగి వ్యక్తి మృతి
తెనాలి రూరల్: రంజాన్ పండుగ రోజున పట్టణంలో విషాదం నెలకొంది. కాలువలో ఈతకు దిగి వ్యక్తి మరణించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని సుల్తానాబాద్కు చెందిన మహబూబ్ వలి (38) తన మిత్రుడు బుజ్జితో కలసి రంజాన్ పండుగ సందర్భంగా మద్యం తాగాడు. అనంతరం సాయంత్రం మార్కెట్ సమీపంలో తూర్పు కాలువలో ఈతకు దిగాడు. వలి మునిగిపోగా స్థానికులు గమనించి ఒడ్డుకు లాగారు. కొన ఊపిరితో ఉన్న అతను కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మద్యం తాగి ఈతకు దిగామని, వలి నీటిలో మునిగి మృతి చెందాడని బుజ్జి తెలిపాడు. వలి మార్బుల్, ఇతర పనులకు వెళుతూ లాడ్జీల్లో ఉంటుంటాడని పోలీసులు తెలిపారు. -
పెదకాకాని శివాలయంలో హుండీల కానుకల లెక్కింపు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను కానుకల హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.2,81,368 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కూడా వచ్చిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో గల వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మత్స్య జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామిని మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేబ్రోలు: ిహందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం చంద్రమాసం ఆధారంగా రూపొందించిన శుభతిథి క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల శివారు బ్రాహ్మణ కోడూరులో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. దర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ నూతన ఒరవడితో ఆకట్టుకుందన్నారు. తెలుగు నెలలు, తెలుగు వారాలు, తిథులతో కూడిన క్యాలెండర్ను హిందూ ఉపాధ్యాయ సమితి చేయటం అభినందనీయం అన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శి మట్టపూడి కిరణ్ కుమార్, ఎస్ఎస్ఎఫ్ పొన్నూరు ఖండ ఇంటూరి శివ రామకృష్ణ, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూజండ్ల: గుర్తు తెలియని వ్యక్తులు సుబాబుల్ తోటను నరికివేసిన సంఘటన నూజండ్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమేపల్లి వెంకటరత్నంకు సుబాబుల్ తోట ఉంది. శనివారం ఉదయం తోటకు వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో చెట్లను విచ్చలవిడిగా నరికివేసినట్టు గుర్తించి ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. -
జీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ
తెనాలి ప్రత్యేకాధికారిగా జేసీ తెనాలి అర్బన్: తెనాలి పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని ఆయన కార్యాలయానికి మున్సిపల్ అధికారులు వెళ్లి సంతకం చేయించారు. మంగళవారం తెనాలి వచ్చి రివ్యూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకాధికారిని కలిసిన వారిలో ఎంఈ పినప శ్రీకాంత్, ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా ఏసుబాబు, ఏసీపీ వాణి, ఆర్వో రాంప్రసాద్, శ్యామలదేవి తదితరులు ఉన్నారు. -
రైల్వే వైర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్
60 కిలోల రాగి తీగలు స్వాధీనం తెనాలిరూరల్: ౖరెల్వేకు సంబంధించిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి. హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితులు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వ కట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నారు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. నందివెలుగు అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు, సిబ్బంది ఉన్నారు. -
బాణసంచా మంటల్లో చిక్కిన ఇద్దరు చిన్నారులు
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో నాయకుల పర్యవేక్షణలో జరిగిన బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మహోత్సవం పెదకాకాని పొలిమేర సెంటర్ జెండా చెట్టు నుంచి బయలుదేరి గురువారం రాత్రి 2 గంటలకు వెనిగండ్లలోని వేమారెడ్డి గుడి సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో ఆటో పక్కనే నిలబడి బాణసంచా కాలుస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఆకాశంలోకి వదిలిన తారాజువ్వ నుంచి నిప్పురవ్వలు ఆటోలో నిల్వ ఉన్న బాణసంచాపై పడ్డాయి. ఆటోకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బాణసంచాపై పడుకుని నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అనాస్ పరిస్థితి విషమంగా ఉండగా.. అజయ్ అనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ తండ్రులు లేదు. తల్లులు దర్గా వద్ద పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ కృష్ణకాంత్, టీపీ నారాయణస్వామిలు పరామర్శించారు. నిద్ర వస్తుండటంతో బాణసంచాపై పడుకుని ఉన్నామని, పక్కకు వెళ్ళి కాల్చాలని ఆ వ్యక్తిని కోరామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని వాపోయారు. -
విశ్వాసం.. ప్రేమ.. ఈద్
ప్రత్యేక నమాజ్లు జరిగే ఈద్గాలు ఇవే.... లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్):నెలవంక దర్శనంతో ఈద్ సంబరాలు ఆరంభమయ్యాయి, శనివారం ఈద్–ఉల్–ఫిత్ర్ జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమవుతున్నారు. ఈద్గాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు శుక్రవారం మగ్రిబ్ నమాజ్ తర్వాత నెలవంకను దర్శించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ ముబారక్ తెలుపుకొన్నారు. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో జిల్లాలోని మసీదుల వద్ద సందడి నెలకొంది. జిల్లాలో గురువారం ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈద్గా వద్ద ప్రార్థన ప్రతి ముస్లిం రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక సమాజ్ చేయాలన్నది మహ్మద్ ప్రవక్త ఆజ్ఞ. వృద్ధులు, దివ్యాంగులు, ఈద్గా (వసతులు) లేని వారు తప్ప మిగిలిన వారంతా ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక నమాజ్ చేయాలని మత పెద్దలు పేర్కొంటున్నారు. ఈద్గాలో సామూహిక నమాజ్ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్మకం. అంతేగాక పేద, ధనిక అనే తారతమ్యం ఉండదని, తోటి వ్యక్తుల సాధకబాధలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఇమామ్లు, మౌల్వీలు చెబుతున్నారు. ఈద్గా వద్దకు వెళ్లేటప్పుడు ఒక దారిలో తిరిగి వచ్చేటప్పుడు మరో దారిలో నుంచి రావాలని ప్రవక్త సందేశం. తక్బీర్ తప్పనిసరి ముస్లింలందరూ నూతన దుస్తులు ధరించి (వారి శక్తి కొలది) ఒకచోటకు చేరి అక్కడి నుంచి తక్బీర్ చదువుతూ ఈద్గా వద్దకు చేరుకోవాలి. ఈద్గాలో ఇమామ్ ఖురాన్ వాక్యాలు, దైవ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) ప్రత్యేక సమాజు చదివిస్తారు. ఆ తర్వాత దువాతో ప్రార్థనలు ముగుస్తాయి. ఈద్–ఉల్–ఫిత్ర్ సందేశమిదే.. సర్వ మానవాళికి కారుణ్య వర్షిణి అయిన రంజాన్ మాసంలో చివరి రోజు ఈద్ ఉల్ ఫిత్ర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. కఠోర దీక్ష ఆచరించిన ముస్లింలు తగిన ప్రతిఫలాన్ని అల్లాహ్ నుంచి పొందే రోజే ఈద్ ఉల్ ఫిత్ర్. రంజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ ఆనందంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు ముస్లింలు ప్రయత్నించాలి. జకాత్, ఫిత్రా పేరుతో సమాజంలోని అభాగ్యులకు బాధ్యతగా దానం చేయాలి. కుల మతాలు, వర్గ విభేదాలకు అతీతంగా మంచి మనుషులుగా స్పందిస్తూ సమాజంలోని దారిద్య్రం, పేదరికం, అసమానతలను దూరం చేయాలి. శాంతిసామరస్యాలను, సంతోషాన్ని పెంపొందింప చేయాలనేదే ’ఈద్ ఉల్ ఫిత్ర్ సమాజానికి అందిస్తున్న సందేశం. నగరంపాలెంలోని పురానీ ఈద్గాలో ఉదయం 9.30 గంటలకు, పాత బస్టాండ్లోని ఉర్దూ పాఠశాల ఆవరణలోని ఈద్గాలో 9 గంటలకు, ఐపీడీ కాలనీ ఈద్గాలో 9.30 గంటలకు, ఆంధ్రా ముస్లిం కళాశాల ఆవరణలోని ఈద్గాలో 10 గంటలకు ఈద్ సమాజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలకు అసౌకర్యం కలుగకుండా తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశారు. -
పండగ పూటా గుండైపె బండ
పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. ముస్లింలకు గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఏకంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలోనే గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఏజెన్సీలు, అధికారులు కుమ్మకై ్క సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. బుక్ చేసుకున్న వారికి ఫోన్లు చేసి ఓటీపీ కనుక్కుని మరీ ఈ దందా సాగిస్తున్నారు. అధికారులు సమీక్షలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గ్యాస్ సిలిండర్ సమస్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తప్పడం లేదు. చంద్రబాబు సర్కార్ ఇదేమీ పట్టినట్లు లేదు. శనివారం పవిత్ర రంజాన్ పండుగ. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులతోపాటు ఇతర వర్గాల ప్రజలకు గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయి. కొందరు ఇబ్బందులను తాళలేక గ్యాస్ గోడౌన్లకు సిలిండర్లతో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, గ్యాస్ ఏజన్సీలు కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పవిత్ర పండుగ రోజున గ్యాస్ కొరతతో ఇబ్బందికి గురి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తున్నారు. అధికారులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నామమాత్రంగానే మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 7.80 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. సుమారు 15 వేల మంది కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. మొత్తం 55 ఏజన్సీల ద్వారా బుక్ చేసుకుంటే రెండు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరేది. సాధారణ రోజుల్లో రోజూ జిల్లాలో సుమారు 10 వేల సిలిండర్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపయ్యింది. కానీ 10 వేలు నుంచి 14 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. స్పందించని ప్రజాప్రతినిధులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బదిలీ చేయాలన్నా తమ అనుమతి ఉండాల్సిందే అని నిత్యం అధికారులకు హుకుం జారీ చేసే ప్రజాప్రతినిధులు గ్యాస్ ఇబ్బందులపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మంత్రి సమీక్షలకే పరిమితం అయ్యారు. అఽధికారులు కూడా హెచ్చరికలతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల్లోనే సిలిండర్ ఓటీపీ ద్వారా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వారం పడుతోంది. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు ఖాళీ ఉంటే సిలిండర్లు నింపుకొనేందుకు అధిక సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్ మార్కెట్లో ఎవరైనా గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అవసరమైన వారు 83091 60972, 63095 20569 ఫోను నంబర్లకు కాల్ చేయొచ్చు. – కోమలి పద్మ, డీఎస్ఓ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెచ్పీ గ్యాస్ మార్చి 2వ తేదీన బుక్ చేశాం. ఆ తర్వాత కొన్ని రోజులకు గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి సిలిండర్ ఇవ్వకుండా అమ్మగారి నుంచి ఓటీపీ కనుక్కొని వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్నాక ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్య ఎప్పడటికి తీరుతుందో అర్ధం కావడం లేదు. – షేక్ మస్తాన్, పాత గుంటూరు యుద్ధం జరుగుతున్నందున గ్యాస్ కొరతగా ఉందంటున్నారు. మరి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. చాలా రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నాం. అయినా సిలెండర్ దొరకడం లేదు. పండుగను ఎలా జరుపుకోవాలి. కొందామంటే కరెంటు పొయ్యలు కూడా దొరకడంలేదు. – షేక్ మెహరున్నీసా, గుంటూరు గ్యాస్ బుక్ చేసిన తర్వాత ప్రతి వినియోగదారుడికి ఒక ఓటీపీ వస్తుంది. అది చెబితేనే గ్యాస్ డెలివరీ చేస్తారు. కొన్ని ఏజన్సీలతోపాటు కొందరు సిబ్బంది మాయాజాలంతో ఓటీపీ వచ్చినా సిలిండర్ మాత్రం రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరికొందరు బ్లాక్ మార్కెట్లో రూ.1,300–1,600 వరకు సిలిండర్ కొంటున్నట్లు చెబుతున్నారు. గ్యాస్ డెలివరీ చేసే బాయ్స్ చేతివాటం గురించి మొదటి నుంచి అనేక ఫిర్యాదులున్నా ఏజెన్సీలు పెద్దగా స్పందించకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతోంది. పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేదని, ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ఒకసారి దొర్లిన పొరపాట్లను మరలా జరగకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవా లని అన్నారు. జిల్లాలోని ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ సిబ్బంది సమస్యలను విధిగా పరిష్కరిస్తామని అన్నారు. ఫిరంగిపురం: మండలంలోని పొనుగుపాడు గ్రామంలో నుదురుపాడు పశువైద్యశాల ఆధ్వర్యంలో పశువులకు వేస్తున్న గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు పరిశీలించారు. గాలికుంటు టీకాలకు సంబంధించి పశువుల రక్తనమూనాల సేకరణ, క్షేత్రస్థాయిలో టీకాలు వేసిన పశువులను ఆయన పాడి రైతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి శాఖపరమైన సూచనలు చేశారు. ఆయన వెంట పశువైద్యాధికారి షేక్.పీర్ అహ్మద్, జిల్లా ఏడీడీఎల్ ల్యాబ్ పశువైద్యాధికారి లావణ్య, లైవ్స్టాక్ అసిస్టెంట్ ఆర్.వినీల, సిబ్బంది ఉన్నారు. దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టా కు శుక్రవారం 1,016 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపా రు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 145, పశ్చి మ కాలువకు 110, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కులు బ్యారేజీ నుంచి విడుదల చేశారు. -
గుంటూరు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. ధనలక్ష్మీగా అమ్మవారు పిడుగురాళ్ల: నాగులగుడిలో దేవీ వసంత నవరాత్రులలో భాగంగా మహా సరస్వతి అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
కార్మెల్ కొండ వద్ద విద్యార్థుల ప్రార్థనలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్ మాత వద్ద సెయింట్ ఆన్స్ సెంటినరీ ఇంగ్లిషు మీడియం పదవ తరగతి విద్యార్థులు ప్రార్థనలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ కె.నిర్మల తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా దైవానుగ్రహం అందేలా ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాథ్యాయులు కె.అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు. పోలేరమ్మ తిరునాళ్ల వేడుకలు రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ 37వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామస్తులు విద్యుత్ ప్రభను నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రొంపిచర్ల పోలీసులు తిరునాళ్లలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నీటి మట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 535.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 18,864 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 18,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గ్యాస్ కొరతతో హోటళ్లు మూత
బ్లాక్లో సిలిండర్ ధర రూ.2,500 నుంచి రూ. 3 వేలు గుంటూరు రూరల్: గ్యాస్ కొరతతో టీ దుకాణాలు, హోటళ్లు, భోజనం మెస్లు మూతపడ్డాయి. ముందు ముందు గ్యాస్ దొరకదేమోనన్న అపోహలతో ప్రజలు గ్యాస్ కొనుగోలుకు తహతహలాడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రతి నిత్యం బారులు తీరుతున్నారు. గ్రామాల్లో ఐతే వీధులకు వీధులు ప్రజలు గ్యాస్ సరఫరా కేంద్రాలకు ట్రాక్టర్లతో వస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ చెల్లించాల్సిందే. బ్లాక్ మార్కెట్ నిర్వాహకులు అత్యవసరంగా ఉండే వారిని, ఫంక్షన్లు తదితర కార్యక్రమాలు చేసుకునే వారినే లక్ష్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పెసర రైతులకు మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కీలకమైనదని తెలిపారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలున్నాయని పేర్కొన్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పెద్ద వ్యాపారులు విదేశాల నుంచి తక్కువ ధరలకు దిగుమతులు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మొక్కజొన్న ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిందని, డెల్టా ప్రాంతంలో కూడా మరో 20 రోజుల్లో రాబోతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2400 మద్దతు ధర రావాల్సిన రైతులు రూ.1500, రూ.1550కే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మినుము, పెసరకు సంబంధించి కూడా మార్కెట్లో ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. మినుము మద్దతు ధర రూ.8760 ఉండగా, రైతులు సుమారు రూ.8000కే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు మరింత నష్టపోతున్న నేపథ్యంలో, పంటలను తక్కువ ధరలకు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు -
ఆరంభమైన వసంత నవరాత్ర మహోత్సవాల సందడి
తెనాలి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలో వసంత నవరాత్రి మహోత్సవాల సందడి ఆరంభమైంది. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం రాత్రి మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తొలిగా ప్రఖ్యాత గాయని వేంపాటి కృష్ణశ్రితచే శాసీ్త్రయ సంగీత కచేరీ సంగీతాభిమానులను పరవశింపజేసింది. పలు కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించారు. వయొలిన్పై గౌరావఝుల ఆంజనేయశాస్త్రి, తబలపై పెరవలి వంశీకృష్ణ వాయిద్య సహకారం అందించారు. తదుపరి కళ్యాణి కూచిపూడి ఆర్ట్ అకాడమీ నృత్యగురువు డాక్టర్ చల్లా బాలత్రిపురసుందరి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. శ్రీసీతారామ మందిర నిర్వహణ సేవాసంఘం కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి పర్యవేక్షించారు. అగ్నిహోత్రం నరసింహాచార్యులు పూజాదికాలను జరిపించారు. -
ముగిసిన బాజీబాబా ఉరుసు మహోత్సవం
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్బోర్డు ఈఓ షేక్ ఖాజావలి తెలిపారు. -
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈనెల 24 వరకు ఏపీ ఈఏపీ సెట్–2026 దరఖాస్తుల స్వీకరణ గుంటూరుఎడ్యుకేషన్:ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీఈఏపీసెట్–2026(గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరై న విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్– 2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 36 ఇంజనీరింగ్ కళాశాలల్లో 30,240 సీట్లు ఏపీ ఈఏపీసెట్ సైట్లో పూర్తి సమాచారం ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు ఇలా -
శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
అమరావతి: ఉగాది పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారికి గురువారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.దేవాలయ ఈవో సునీల్కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామి వారిని ఉంచి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం భక్తులందరికి ఉచితంగా పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలకు ప్రముఖ ప్రవచన కర్త ఎం.కృష్ణకిషోర్ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పంచాంగ శ్రవణం విని ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో గురువారం ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆలయంలో వేదపండితులకు సన్మానం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండకావూరి సత్యనారాయణ, కొండకావూరి రామకృష్ణ, శ్రీరాముల రాజశేఖరశర్మలను సన్మానించి సంభావన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు పిడుగు పడి ఓ వరికుప్ప దగ్ధమైంది. స్థానిక వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియటంతో బుద్ధాం గ్రామంలో నర్రా నాగరాజుకు చెందిన వరికుప్పపై పిడుగు పడి మంటలు ఎగశాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కుప్పను కల్లంలో ఆరబెట్టారు. రైతుకు సుమారు రూ.70వేల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు నూతన వస్త్రాలను బహూకరించగా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దుశ్శాలువాతో వైఎస్ జగన్ను సన్మానించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్, షేక్ నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వరికూటి అశోక్బాబు, పి. నాగమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్య గ్యాస్ కొరత
తాడేపల్లి రూరల్: యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడుతోంది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. పెద్ద హోటళ్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ప్రతి రోజు ఆరు వందల వరకు కమర్షియల్ గ్యాస్ బండలను వినియోగిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారుల సూచనల మేరకు గృహావసరాలకు గ్యాస్ కూడా బుక్ చేసిన 25 నుంచి 30 రోజులలోపు వస్తోంది. కొంతమంది గ్యాస్ బుక్ చేస్తుంటే నో సర్వర్ అని ఫోన్లో చూపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల కొన్నిచోట్ల హోటళ్లు మూతబడ్డాయి. కొంతమంది కమర్షియల్ గ్యాస్ బండ ధర రూ. 1700 ఉండగా, రూ. 3,400కు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రూ.6 వేల నుంచి రూ. 7 వేలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. యజమానులు ఇప్పటికే ప్రతి టిఫిన్పై రూ.5 నుంచి రూ. 10 వరకు పెంచారు. టీ దుకాణాల్లో గతంలో ఆఫ్ టీ రూ.7 ఉండగా ఇప్పుడు రూ.10–12 చేశారు. కాఫీ ధర రూ.25కు పెంచారు. మరో 20 రోజులు గ్యాస్ సరఫరా చేయకపోతే లాక్డౌన్ తరహా పరిస్థితి చూడాల్సిన వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సమయం పడుతుందని చెబుతున్నారు. -
తెలుగు నూతన సంవత్సరం దివ్యంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అందరికీ మంచి జరగాలని, జిల్లా మరింత అభివృద్ధి పథంలో సాగాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఉత్సవాలు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్తోపాటు జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో ప్రతి ఇంట్లోనూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేయాలన్నారు. గౌరీపెద్ది మురళి పంచాంగ పఠనం చేశారు. టీటీడీ వేద పండితులు లంకా నాగేశ్వర అవధాని, వైఖానస ఆగమ ముఖ్య ఆచార్య అళహరి రవికుమార్, ములుకుదురు చెన్న కేశవస్వామి దేవాలయం అర్చకులు నారాయణం కేశవ మూర్తి, దొండపాడు శ్రీ రాజ మల్లేశ్వరి దేవస్థానం అర్చకులు యనమదల హనుమంతరావులను పట్టు శాలువా, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం, నగదుతో జిల్లా కలెక్టర్, కమిషనర్ మయూర్ అశోక్, జేసీలు ఘనంగా సత్కరించారు. సాహితీవేత్తలు, కవులు, కవయిత్రిలు పింగళి భాగ్యలక్ష్మి, చుండూరి శేషమాంబ, సంబరాజు రమణి, అస్మతున్నీస, లంకా మాధవి, బాసరాజు శంకర్రాజు, రాయల సుబ్బారావు, ఆవుల తిరుమలేష్, పి. శివ పార్వతి, కొమ్మడి శివశంకర ప్రసాద్, డాక్టర్ రావెళ్ళ శ్రీనివాసరావు, చెట్టి వెంకట రమణ, చెరుకూరి వెంకట సాయి రమేష్, ఎస్ఎంఎం ఖుద్దూస్లను పట్టు శాలువా, మెమోంటో, సర్టిఫికెట్, ఉగాది పురస్కారాలతో సత్కరించారు. తొలుత ఉగాది విశిష్టత, వైభవాన్ని తెలియజేసేలా సభలో చిన్నారులు, యువతులు సంప్రదాయ గీతాల ఆలాపన, నృత్యాల ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఆర్వో షేఖ్ఖాజా వలి, జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గ్రంధి మాధవి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీఆర్డీఏకు జాతీయస్థాయి గుర్తింపు
తాడికొండ: రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళికా విధానానికి జాతీయ గుర్తింపు లభించిందని ఏపీ సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్కు ఎకనామిక్ టైమ్స్ గోవ్టెక్ అవార్డు– 2026 కార్యక్రమంలో గోల్డ్ అవార్డు లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుంచి ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు ఢిల్లీలో గురువారం అవార్డు అందుకున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉత్తమ సాంకేతిక ప్రాజెక్టులకుగాను ఈ అవార్డును అందించారని తెలిపారు. -
పిన్నెల్లికి జన నీరాజనం
నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. జయజయ నినాదాలతో హోరెత్తించారు. అడ్డరోడ్డు వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూడడమే కాక తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో దుర్మార్గంపై పోరాడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు. దాచేపల్లిలో.. దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్ సాంబయ్య నివాసంలో అల్పాహారాన్ని పీఆర్కే స్వీకరించారు. అనంతరం నారాయణపురం బంగ్లా సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా రంజాన్ పండుగ సందర్భంగా పీఆర్కేకు టోపీ, చౌకన్, కంకణం బహూకరించారు. నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్ బాషా, కొమరభత్తిన విజయకుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రా విజయ్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు. ప్రత్యేక పూజలు మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు. -
విజయకీలాద్రిపై ఉగాది వసంత నవరాత్రోత్సవాలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, శ్రీ చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
అకాల వర్షానికి నేలకొరిగిన పైర్లు
అకాలవర్షం, ఈదురు గాలులకు తెనాలి నియోజకవర్గంలో పలుచోట్ల పైర్లు నేలకొరిగాయి. తెనాలి ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు వీచి, అక్కడక్కడా వర్షం కురిసింది. మళ్లీ గురువారం కూడా భారీ వర్షం వచ్చింది. చిత్రంగా ఒక ఊళ్లో వర్షం కురుస్తున్న సమయంలో మరో ఊరిలో చిన్న జల్లు కూడా పడలేదు. అకాల వర్షాలకు రైతులు బెంబేలెత్తారు. ఈదురు గాలులకు కొన్నిచోట్ల అరటి చెట్లు విరిగిపడ్డాయి. ప్రస్తుతం జొన్న పైరు కోతలు జరుగుతున్నాయి. చేలల్లో ఉన్న కంకులు వర్షానికి తడిచాయి. మరో మూడు వారాల్లో కోతకు రానున్న మొక్కజొన్న పైరు పలుచోట్ల నేలవాలింది. మరోసారి భారీ వర్షం కురిస్తే జొన్న, మొక్కజొన్నకు నష్టం తప్పదని రైతులు ఆందోళన పడుతున్నారు. మెట్టలో సాగుచేసిన పసుపు పైరును ఇప్పుడు దున్నుతున్నారు. ముందుగా దున్నిన రైతులు పసుపును వండి ఆర బెట్టే పనిలో ఉన్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే పసుపు రైతులు నష్టపోక తప్పని పరిస్థితి. – తెనాలి/కొల్లిపర -
నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..!
గుంటూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. మృతదేహం కూడా కనిపించకుండా చేసేందుకు శరీరానికి హద్దు రాయి కట్టి గోనెసంచిలో చుట్టి చెరువులోకి పడేసిన దారుణ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు గురువారం ఒక యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో చెరువులో తెలియాడుతూ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరహరి స్థానికులు, సిబ్బందితో కలిసి మృత దేహాన్ని బయటకు తీయించారు. -
వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యం
తెనాలి:మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే అందరి లక్ష్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గత అయిదేళ్లు చైర్పర్సన్లుగా, కౌన్సిలర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా బుధవారం రాత్రి అభినందన సత్కారాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శశివేదికలో జరిగిన సభకు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా, పార్టీకి ఎలాంటి డ్యామేజి లేకుండా, తనకు ఎలాంటి మచ్చ తేకుండా పరిపాలన చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికను శివకుమార్ ముందుగా అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ పాటుపడిందని చెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అయిదేళ్లపాటు దిగ్విజయంగా ప్రజాసేవలో గడిపే అవకాశం దక్కిందని గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో రూ.1800 కోట్ల సంక్షేమం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1800 కోట్ల సంక్షేమాన్ని అందించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. ఓసీలకు రిజర్వు చేసిన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ప్రకటించినట్టు శివకుమార్ గుర్తుచేశారు. ఆ ప్రకారం తొలిగా ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ ఖలేదా నసీమ్, తర్వాత బీసీ వర్గానికి చెందిన తాడిబోయిన రాధికకు చైర్పర్సన్గా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తికాలం వైఎస్సార్ సీపీ కౌన్సిల్ నడిచేందుకు తాడిబోయిన రమేష్ కృషిచేశారని చెబుతూ ఆయన్ను అభినందించారు. అనంతరం చైర్పర్సన్, వైస్చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను శివకుమార్ సత్కరించారు. మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, మాజీ వై స్చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, కోటేశ్వరరావు, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గెడ్డటి సురేంద్ర, ఝాన్సీవాణి, కుర్రా సుజాత, అన్నాబత్తుని పద్మజ, కఠారి రత్నకుమారి, మల్లెబోయిన సురేఖ, పెదలంక లక్ష్మీలావణ్య, మట్లపూడి సంధ్యారాణి, వీర్లపాటి విజయలక్ష్మి, షేక్ దుబాయ్బాబు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కో–ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, షేక్ గౌసియా, పార్టీ నాయకులు తపాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ -
తాడేపల్లిలో 24.4 మి.మీ వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా తాడేపల్లి మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1 మి.మీ వర్షం పడింది. సగటున 5.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 19 మి.మీ., తుళ్ళూరు 18.2, తాడికొండ 17.4, మంగళగిరి 13, పెదకాకాని 5.2, గుంటూరు తూర్పు 1.4, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడింది. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు. లక్ష్మీపురం: గుంటూరు అరండల్పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు
పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్మార్ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్మేళాలు, విద్యుత్ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్ ఖాజావలి తెలియజేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
24న ధర్నాకు యూటీఎఫ్ పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ చేపట్టేందుకు తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న అన్ని నియోజకవర్గాల్లో ధర్నా చేపడుతున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ ప్రయోజనాలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఎలా భావించాలో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్, వి.వినోద్ రాష్ట్ర కౌన్సిలర్ గఫార్ పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు...
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎల్.పి.జి. ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్ పంపిణీ చేయాలని గోడౌన్ ఇన్చార్జిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బుకింగ్లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్ నుంచి లోడ్ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్ ఇన్చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరియైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
న్యాయస్థానమే ఆదుకుంది
మంగళగిరి టౌన్: పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల 2024– 25లో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి మాట్లాడుతూ, 2024–25లో నిర్మల సీబీఎస్ఈ పాఠశాల నందు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. ఈనెల 9వ తేదీన జస్టిస్ న్యాపతి విజయ్ రెండు వారాల లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ -
గోలివాగులో సంచరిస్తున్న మొసలి
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ప్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రూ.1.15 కోట్లకు మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్, కురవ వెంకటేశ్ (సర్పంచ్), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్ ట్రేడింగ్ సంస్థల నిర్వాహాకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహాకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహాకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహాకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహాకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్ కంపెనీల నిర్వాహాకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. -
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్తాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. -
యడ్లపాడులో జాతీయస్థాయి నాటిక పోటీలు
యడ్లపాడు: కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళానిలయం, తెలుగు నాటక కళా పరిషత్తుల సంఘం వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ కళాజాతరకు యడ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణం వేదిక అవుతుందన్నారు. ప్రతిరోజు మూడు చొప్పున ప్రధాన నాటికలతో పాటు ఒక ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను అలరించనున్నాయని వెల్లడించారు. యడ్లపాడు: మండల పరిధిలోని బోయపాలెంలో విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉన్నవ గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న విశ్వథన్ హోటల్పై మంగళవారం అధికారుల బృందం ఈ దాడులు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి, వాటిని సీజ్ చేసి, యడ్లపాడులోని వీణా గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. హోటల్ యాజమాన్యంపై స్థానిక తహసీల్దార్ 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో యడ్లపాడు మండల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, రెవెన్యూ ఇన్న్స్పెక్టర్ సుబ్బారావు, ఉన్నవ గ్రామ వీఆర్వో జగన్మోహనరావు, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
మరో బాలుడిపై కుక్కల దాడి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలోని నల్ల చెరువులో కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. కొద్దిరోజుల కిందట నల్లచెరువులో ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆ చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. ఆ సందర్భంలో నల్లచెరువు వాసులంతా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. అధికారులు వారికి నచ్చచెప్పి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మంగళవారం మరో బాలుడి పై కుక్కలు దాడి చేసి గొంతు, తలపై గాయపరిచాయి. దీంతో బాలుడిని వెంటనే కుటుంబ సభ్యులు పెద్దాసుపత్రికి తరలించారు. అనంతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. -
ఆచార్య... ఉద్యోగినులపై వేధింపులు ఆగవా?
పాట్లు పట్టని పాలకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఓ సదస్సు విషయంలో సీనియర్ మహిళా ఆచార్యులు గవర్నరుకు ఫిర్యాదు... పీహెచ్డీ సంతకం వ్యవహారంలో మరో మహిళా ప్రొఫెసర్కు వేధింపులు... ఇలా ఏఎన్యూలో ఇన్చార్జి పాలనలో మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కొందరి తీరుతో ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం పాకులాడటం తప్ప. విశ్వవిద్యాలయం భ్రష్టుపడుతున్నా పట్టించుకోని తాత్కాలిక పాలకుల ఉదాసీనత యూనివర్సిటీ ప్రతిష్టను మంట కలుపుతోంది. గత 18 నెలల తాత్కాలిక పాలకుల హయాంలో కొందరు మహిళా ఉద్యోగులు రాత పూర్వకంగా, మరి కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. తమ పదవులు నిలుపుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తున్న వివాదాస్పద అధికారులు విద్యావ్యవస్థను దిగజారుస్తున్నారు. మహిళలపై బాడీ షేమింగ్కు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. వారి వెతలెన్నో.. వర్సిటీలో గత ఏడాదిన్నర పాలనలో అనేక మంది మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక ఉన్నతాధికారి అండతో బాడీ షేమింగ్కు పాల్పడటం, మహిళలను దూషించటం, బెదిరించటం చేసినా పట్టించుకునే నాథుడే లేరని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్సిటీలోని ఒక కీలక వ్యక్తిపై సీనియర్ మహిళా అధ్యాపకురాలు ఒకరు గవర్నరుకు, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ మహిళా ఆచార్యురాలికి అవమానం జరిగినా స్పందన లేదు. పీహెచ్డీ వ్యవహారంలో ఒక మహిళా ప్రొఫెసర్ను నిబంధనలకు విరుద్ధంగా సంతకం చేయాలని ఓ అధికారి ఒత్తిడికి గురిచేశారు. సదరు వ్యక్తిపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా స్పందన లేదు. ఒక దళిత మహిళాధికారిపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఒకరు దూషించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు లేవు. దూరవిద్యలో గత అక్టోబరు నెలలో ఒక మహిళా అధికారి నాన్ టీచింగ్ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇటీవల ఒక మహిళా ప్రొఫెసర్పై నేరుగా ఒక వివాదాస్పద వ్యక్తి వాగ్వివాదానికి దిగినా ఇతర ఆచార్యులు ప్రేక్షకుల్లా వ్యవహరించారేగానీ వర్సిటీకే శాపంగా మారిన సదరు అయ్యవారిని ఇదేం తీరు అని ఒక్క మాట అనలేదు. పరీక్ష భవన్లో ఒక నాన్ టీచింగ్ ఉద్యోగి కిందిస్థాయి మహిళా ఉద్యోగిని వేధించినా పట్టించుకోలేదు. ఒక అధికారి ఉద్యోగులతో సమావేశాలు పెట్టడం, సంబంధం లేని విషయాలు చెప్పి అసభ్య పదజాలం వాడుతున్నారని ఆ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగులే వాపోతున్నారు. ఇన్చార్జి వీసీ పాలనలో ఒక మహిళా స్కాలర్ను ప్రొఫెసర్ కారుతో ఢీకొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని సంగతి తెలిసిందే. ఇన్చార్జి అధికారుల పాలనలో ఏఎన్యూలోని పాలన పూర్తిగా పక్కదారి పట్టింది. కొందరు వివాదాస్పద అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పేట్రేగిపోతున్నారు. ఎడ్యుకేషన్ ఫర్ సేల్ అంటూ వ్యాపారంగా మార్చినా, మహిళా ఉద్యోగులను దూషించినా వారికే కమ్మని న్యాయం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశించినా పచ్చ పైత్యంతో వర్సిటీకి శాపంగా మారిన కళంకిత అధికారులకు కొమ్ముకాస్తున్నారు. ఏఎన్యూ అన్ని విధాల అప్రతిష్ట పాలయినా, విద్యను వ్యాపారంగా మార్చినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. -
టీటీడీ చైర్మన్ను తొలగించండి
చంద్రబాబు సర్కారు తీరుపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులుపట్నంబజారు (గుంటూరు ఈస్ట్): అప్రజాస్వామికంగా, అత్యంత పాశవికంగా తిరుపతిలో మహిళలను అరెస్ట్ చేసి, వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
శ్రీరామ పట్టాభిషేక అలంకారం
మంగళగిరి టౌన్ : మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు భక్తులకు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కారుమంచి మురళీసాయి, సోదరులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన యేనుగ కిషోర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు గోవాడలో కోటి కుంకుమార్చన అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్ఐ అపర్ణ సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం తెనాలిఅర్బన్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్ కంపోస్టు, కోకో పిట్ కేంద్రాన్ని, ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.ఆర్.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పంచాయతీ రాజ్ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గుంటూరు మెడికల్ కాలేజీకి డబుల్ విజయం
– జాతీయ సదస్సులో రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు జాతీయ సదస్సులో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడం విశేషం. డాక్టర్ నమ్రితా ఓరల్ ప్రెజెంటేషన్లో ప్రథమ బహుమతి సాధించగా, డాక్టర్ వీణ ప్రియా పోస్టర్ ప్రెజెంటేషన్లో మొదటి స్థానం దక్కించుకుని కాలేజీకి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మంగళవారం విజేతలను అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, ప్రొఫెసర్ – ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ పూర్ణమ్మ, ఇతర అధ్యాపకులు, సహాయ ఆచార్యులు, పీజీ వైద్యులు పాల్గొన్నారు -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుచేయాలి
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషనన్ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలి హెడ్ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్ పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక డివిజనల్ కార్యదర్శి ఎల్.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్, రషీద్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్ కార్యదర్శి ఎన్జీ ఘోష్, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు. తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్వీ అపార్ట్మెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో 2025 డిసెంబర్లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు. -
నేతి వెంకన్న స్వామికి మొక్కులు తీర్చుకున్న అంబటి
రాజుపాలెం: పల్నాడు జిల్లా దేవరంపాడు కొండపై స్వయంభూగా మత్య్సరూపంలో వెలసిన నేతి వెంకన్నస్వామిని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిలు సోమవారం కొండకు విచ్చేసి దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబును, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిలను నాయకులు, కార్యకర్తలు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం మత్య్సరూపంలో ఉన్న నేతి వెంకన్నస్వామి వద్ద పూజారులు మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందించారు. వారి వెంకట పార్టీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దొంతిరెడ్డి సునీత శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి తదితరులు ఉన్నారు. -
మొక్కజొన్నకు మద్దతు ధర ఏదీ ?
పొన్నూరు: రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల నుంచి మొక్కజొన్న పంటను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవసరమైన అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ● ఈ రబీలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈసారి 29, 298 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారన్నారు. ఒక్క పొన్నూరులోనే సుమారు 25 వేల ఎకరాలలో సాగు చేయగా, నియోజకవర్గంగా చూస్తే మొత్తంలో 40 వేల ఎకరాలలో పంట పండించారన్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే మొక్క జొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేసే నియోజకవర్గంగా పొన్నూరుకు గుర్తింపు ఉందన్నారు. ● అలాంటి పంటకు క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 కూడా అందడం లేదని అన్నారు. ● దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల నుంచి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రైతుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ● చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానం ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ● రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. ● ప్రస్తుతం ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ● కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.2400 చొప్పున రైతులకు అందాల్సి ఉండగా, వ్యాపారస్తులు క్వింటాకు రూ.1700 మాత్రమే అందించి, వారు ప్రభుత్వానికి మాత్రం రూ.2400 చొప్పున విక్రయిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ● దళారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి మార్కెట్ యార్డ్, మార్క్ఫెడ్ రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించాలని అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. -
అమరజీవి త్యాగం అజరామరం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి చిరస్మరణీయుడని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షురాలు నిర్మల భారతి, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్యూలో .... ఏఎన్యూ(పెదకాకాని): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం శ్లాఘనీయమని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరుపుకొన్నారు. వర్సిటీలోని తెలుగుభాషా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విభాగాధిపతి ఆచార్య ఎన్వీ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం పాల్గొన్నారు. -
31న గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతాయని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16,17 తేదీల్లో నామినేషన్ల దాఖలు, 23 ఉపసంహరణకు తుది గడువు.. అదేరోజు సాయంత్రం 4 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. 31వ తేదీ ఎన్నికలు.. అదేరోజు సాయంత్రం లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. గుంటూరు రూరల్: వాణిజ్య అవసరాలకు, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా రూరల్ మండలం దాసరిపాలెంలో బ్లూ వేల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీ చేయగా 4 గృహ వినియోగ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చౌడవరం లలితాపీఠం వద్ద చెన్నుపాటి వీరయ్య అనే వ్యక్తి వద్ద తనిఖీ చేయగా 10 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేశారు. తక్కెళ్లపాడు వద్ద గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీ చేసి 3 గృహ వినియోగ సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలలో మొత్తం 17 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి స్థానిక సీఎస్డీటీలకు అప్పగించారు. అత్యవసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6ఏలో మొత్తం 3 కేసులు నమోదు చేసి సంబంధిత జాయింట్ కలెక్టర్కి నివేదిక సమర్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నరసరావుపేట టౌన్: మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంక్ రుణాల్లో మోసానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ ఫిరోజ్ సోమవారం తెలిపారు. పిడుగురాళ్ల, నరసరావుపేట ఇండియన్, స్టేట్ బ్యాంక్లలో మహిళ సంఘాల పేరుతో నకిలీ గ్రూప్లు సృష్టించి షేక్ ఉమర్వలి రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తం 81 నకిలీ గ్రూప్ల పేరుతో రూ.9.59 కోట్లు రుణాలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్లో నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసులో ఇప్పటికే ఐదవ నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారన్నారు. -
రాడ్ బెండింగ్ కార్మికుడు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: రాడ్ బెండింగ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన రాడ్ బెండింగ్ కార్మికుడు నారాయణ నరేంద్ర, శ్రీవాణి ప్రేమించుకుని 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పనుల కోసం తెనాలి వచ్చి ఇక్కడి నందులపేట లెనిన్ రోడ్డులో నివసిస్తున్నారు. ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఆదివారం రాత్రి అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక మెలకువ వచ్చి చూడగా భర్త ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఉన్నాడని, తెలిసిన వారికి చెప్పి వైద్యశాలకు తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని శ్రీవాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద సోమవారం కేసు నమోదు చేశారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు హనుమాన్నగర్కు చెందిన వెంకట సాయిరామ్ తన భార్యతో కలసి శనివారం రాత్రి నులకపేటలోని అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం తన ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరచి ఉంచడం గమనించి లోపలకు వెళ్ళాడు. బీరువా తాళాలు పగలకొట్టి బట్టలు చిందరవందరగా పడవేసి ఉండడం గమనించాడు. బీరువాలో వున్న సుమారు 2 లక్షల నగదుతో పాటు 3 బంగారపు ఉంగరాలు, జత చెవి కమ్మలు, ఒక వెండి గిన్నె చోరీకి గురైనట్లు గుర్తించాడు. బంగారం సుమారు 20 గ్రాముల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాచారం ఇవ్వడంతో మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 27,699 మంది విద్యార్థులకు గానూ 27,123 మంది హాజరయ్యారు. టెన్త్ పరీక్షల్లో మొదటి రోజు కావడంతో గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల వారీగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచి కోలాహలం నెలకొంది. విద్యార్థులను వెంట పెట్టుకుని తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళగిరిలో కేంద్రాన్ని, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఎనిమిది కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 38 కేంద్రాలతో పాటు రాష్ట్ర పరిశీలకులు 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో సలీమ్ బాషా చెప్పారు. దూరవిద్య టెన్త్ పరీక్షలకు 781 మంది హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ప్రారంభమైన దూరవిద్య పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 970 మంది అభ్యర్థుల్లో 781 మంది హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి పి.పార్వతి రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. -
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి రాజధాని ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని పెద్ద పెద్ద లారీలలో తీసుకువచ్చి చేబ్రోలు ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఐదు టర్బో లారీలలో మట్టి తీసుకువచ్చి స్థానిక జీబీసీ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో మెరక చేస్తుండటంతో కొంతమంది పోలీసులకు, రెవెన్యూ, అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మట్టిలోడ్తో వచ్చిన లారీలను స్థానిక ఎస్ఐ పి.వీరనారాయణ ఆధ్వర్యంలో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం ఐదు లారీలకు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా చేబ్రోలు పరిసర గ్రామాల్లో మట్టిని పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడకు తరలించి బ్రోకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడ్డ లారీలు అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.రాజధాని ప్రాంతం నుంచి చేబ్రోలుకు తరలిస్తున్న అధికార పార్టీ నేతలు -
భక్తిశ్రద్ధలతో సత్తెమ్మతల్లి 16 రోజుల పండుగ
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కళ్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గుంటూరురూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి.శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026Iరేపల్లె: కారుమూరులో వేంచేసియున్న లలితా పరబ్రహ్మేశ్వరి సమేత అమరలింగేశ్వరస్వామి వారికి సోమవారం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,800, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.8,500 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గత కౌన్సిల్ ఆమోదించిన పనులు నిలిచిపోయాయి..కాంట్రాక్టర్లు స్పందించడం లేదు..అంటూ పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల చుట్టూ తిరిగినా.. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప.. పనులు జరగటం లేదన్నారు. పాలకవర్గం పదవీ కాలం ముగి యనున్న నేపథ్యంలో సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన చివరి సమావేశం నిర్వహించారు. కొద్ది మందికే కాంట్రాక్టు పనులు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొద్దిమంది కాంట్రాక్టర్లే అత్యధిక శాతం పనులు తీసుకున్నారని, అయితే పనులు మాత్రం చేయటంలేదని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆరోపించారు. అధికారుల భాగస్వామ్యంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. క్వాలిటీ, నిర్ణీత సమయంలో పనులు చేసిన వారికి మాత్రం బిల్లుల చెల్లింపు జరగటం లేదని, బిల్లులు చెల్లించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వేసవిలో తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తమేనని, పలు ప్రాంతాల్లో ఇబ్బందికరర పరిస్థితులు ఉన్నాయన్నారు. అనేక డివిజన్లలో బోరింగ్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. నగరంలో అనధికారిక హోర్డింగ్స్ ఉన్నాయని, వాటికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎల్ఈడీ బల్బులు పెడుతున్నారని, దాని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో ఆశీలు వసూలు చేస్తున్నారని ఇది ఎవరూ వసూలు చేయిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నగరంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 3వేల మందిని కుక్కలు కరిచాయని, పశ్చిమ నియోజకవర్గంలోనే 900 మంది ఉన్నారనని తెలిపారు. పూడికతీత పనులతో ఇబ్బందులు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కాలువల్లో పూడికతీత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలో కుక్కల సమస్య అధికంగా ఉందని, దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. పాతగుంటూరు, ఏటుకూరు రోడ్డులోని శ్మశానవాటికలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సచివాలయాల్లో పలు వస్తువులు పనిచేయటంలేదని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మొక్కల టెండర్లలో అవకతవకలు కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మొక్కల టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఆరోపించారు. పనులు పూర్తయిన వాటికి కూడా టెండర్లు వేసి కొంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు డబ్బులు కై ంకర్యం చేశారని అన్నారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 2024 సెప్టెంబర్ నుండి ఎంత వరకు బిల్లులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారులకు కృతజ్ఞతలు మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ నగరంలోని 57 డివిజన్ పరిధిలో అభివృద్ధి చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈస్ట్లో 532 పనులు రూ.270 కోట్లు, వెస్ట్లో రూ.290 కోట్ల పనులు మంజూరు చేశామని, వాటిలో రూ.140 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. బీఆర్ స్టేడియం, శంకర్విలాస్ బ్రిడ్జి, తక్కెళ్లపాడు ఆర్వోబీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. 14 ప్రియాంబుల్స్, ఒక ప్రతిపాదనను ఆమోదించటం జరిగిందన్నారు. అనంతరం కమిషనర్ మయూర్ అశోక్ను సత్కరించి, షీల్డ్ను అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మేయర్ చుక్కా ఏసురత్నం, మాజీ కార్పొరేటర్ పోతురాజు సుబ్బరావమ్మ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గుంటూరు నగరంలో కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారని, ఎవరి హయాంలో నగర అభివృద్ధి జరిగిందనేది రికార్డులు చెబుతాయని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అన్నారు. పాలకవర్గం పదవీ కాలం ఐదేళ్లలో మూడేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ సమయంలో అభివృద్ధి జరిగిందన్న వాస్తవం ప్రజలకు తెలుసునన్నారు. మూడేళ్లలో 25వ డివిజన్ పరిధిలో రూ.50 కోట్లకుపైగా పనులు జరగడమే అందుకు నిదర్శనమన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో అనధికారిక లే అవుట్లు పెరిగిపోతున్నాయని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హాస్టల్స్ భద్రతపై అధికారులు దృష్టి సారించాలని, ప్రైవేట్ వసతి గృహాల్లో శానిటేషన్, ఒకే రూములో ఐదారుగురు ఉండటం వంటివి గమనించి చర్యలు తీసు కోవాలన్నారు. కూటమి కార్పొరేటర్ల వాగ్వాదం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది కూటమి కార్పొరేటర్లు ఆయన ప్రసంగాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్ సీపీ హయాంలో సింహ భాగం అభివృద్ధి జరిగిందని చెప్పటంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా ప్రతి వాదనకు దిగారు. కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో తాము అడ్డుపడలేదని, కానీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న సమయంలో ప్రసంగానికి అడ్డురావటం భావ్యం కాదని చెప్పటంతో వివాదం సర్దుమణిగింది. -
అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం వేగవంతంగా చేయాలని డీఆర్వో షేఖ్ ఖాజావలి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ అధికారులకు అందిన అర్జీలపై అవగాహన ఉండాలన్నారు. పరిష్కారానికి వీలుకాని అర్జీల గురించి అర్జీదారులకు వివరించి చెప్పాలన్నారు. అనంతరం వచ్చిన 238 అర్జీలను డీఆర్వో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులు పరిశీలించారు. -
పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బ్రహ్మాస్త్రం
రాష్ట్ర సమాచార కమిషనర్ పి.సింహాచలం నాయుడు చేబ్రోలు: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే శక్తివంతమైన సాధనమని, ప్రజాస్వామ్యానికి ఇది బ్రహ్మాస్త్రం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.సింహాచలం నాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ‘20 సంవత్సరాల ఆర్టీఐ, గుడ్ గవర్నెన్స్’ అనే అంశంపై వర్క్షాప్ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన ఆర్టీఐ కేవలం ఒక చట్టం కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చిన కీలక సంస్కరణ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందే హక్కును ఈ చట్టం కల్పించిందని చెప్పారు. సమాచార హక్కు భావనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రను వివరించారు. భారతదేశంలో ఆర్టీఐ చట్టం ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితంగా అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజస్థాన్లోని బేవర్ ప్రాంతంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎంకేఎస్ఎస్) వంటి ప్రజా ఉద్యమాలు ‘హమారా పైసా – హమారా హిసాబ్’ అనే నినాదంతో సమాచార హక్కు కోసం పోరాడినట్లు వివరించారు. ఆ ఉద్యమాల ప్రభావంతోనే ఆర్టీఐ రూపుదిద్దుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ అమలుతో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు ఆర్టీఐని సమర్థంగా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ పి.మనోజ్ కుమార్ విద్యార్థులకు ఆర్టీఐ పిటీషన్ ఎలా దాఖలు చేయాలో వివరించారు. కార్యక్రమంలో లా డైరెక్టర్, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
కనుల పండువగా బదరీ కేదారేశ్వర శాంతి కల్యాణం
కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్
పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● ఫూలింగ్కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకుంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యఽథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతోంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్– గ్రీవెన్స్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ అధికార వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ మేరకు జిల్లాలోని ప్రజలు గమనించాలని కోరారు. లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షునిగా వెలుగూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా కోట శివకృష్ణ, కోశాధికారిగా కొలిపాకుల లక్ష్మీకాంత్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా చిట్టెపు శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గం సభ్యులతో జిల్లా అధ్యక్షులు చక్కా సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. సభలో నూతన అధ్యక్షులు కృష్ణ్ణమూర్తి మాట్లాడుతూ నూతన సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యదర్శి శివకృష్ణ్ణ మాట్లాడుతూ వ్యాపార ధోరణే కాకుండా సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్టర్ ప్రింటర్స్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శి నేతగాని ఫిలిప్స్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్పై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్కు సంబంధించిన ముఖ్యాంశాలు, తాజా నియమాలు, మార్గదర్శకాలు, ఆడిట్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్రాంచ్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్ బ్యాంకు శాఖల ఆడిట్ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించేందుకు బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ దోహదం చేస్తుందని చెప్పారు. వర్క్షాప్లో ఐసీఏఐ గుంటూరుశాఖ వైస్ చైర్మన్ వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శి కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాఽ దికారి నాగబీరు రాజశేఖర్, సి కా సా చైర్మన్ షేక్ బాజీ, కమిటీ సభ్యులు దేసు సంపత్ , చింతా రఘు నందన్ పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్లో కృష్ణవేణి కళాశాల జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించటంతోపాటు జట్టులోని పి.గోపినాథ్, బి.దిలీప్, ఎన్.అనిల్, పి.వెంకట్రావు, ఎం.యూష్లు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న సౌత్జోన్ ఖోఖో పోటీల్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జట్టు విజయానికి కృషి చేసిన వ్యాయామ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, అధ్యాపకులు ఎం.తిరుపతిరావు, మహమ్మద్ పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. -
డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
గుంటూరు మెడికల్: కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు అందుకున్నారు. తలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేయడం, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించిన డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
అక్షరాస్యత అతివలకు ఎంతో ఉపయోగం
● డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి.ఝాన్సీరాణి అకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి.హేమలత, డెప్యూటీ ఎంపీడీఓ షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె.రవీంద్రకుమార్, ఏపీఓ డి.సుందరరావు, సీసీలు వై.పెద్దయ్య, సిహెచ్. నాగేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, ఎం.ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బ్రహ్మారెడ్డి గెలుపు
నగరంపాలెం: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఫలితాలను ప్రకటించారని ఆదివారం బ్రహ్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న ఏపీలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 141 మంది పోటీ చేయగా, అందులో 31 మంది మహిళా న్యాయవాదులు కూడా బరిలో నిలిచారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యునిగా బ్రహ్మారెడ్డి 1,409 ఓట్లతో విజయం సాధించారు. ఆయన బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలవడం ఇది మూడోసారి. గెలుపునకు సహకరించిన ఏపీలోని న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బ్రహ్మారెడ్డిని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, పట్టణ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసు వెంకట రెడ్డి, న్యాయవాదులు అలికపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందించారు. 1991లో న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించిన బ్రహ్మారెడ్డి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా, బార్ కౌన్సిల్ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా, గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ పీపీగా పనిచేశారు. -
అండర్–17, 19 బాక్సింగ్ జట్లు ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు అండర్–19: సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు. -
వంటలకు గ్యాస్ మంట
నరసరావుపేట టౌన్: వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. హోటళ్లు, టీస్టాల్స్, ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ లేక తలలు పట్టుకుంటున్నారు. సరిపడ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిచిపోవటంతో రెస్టారెంట్లలో మెనూలను కుదించారు. రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ గ్యాస్ సిలీండర్లు అందుబాటులో లేకపోవటంతో ఇప్పటికే కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. బ్లాక్లో అధిక ధరకు సిలిండర్లు కొనుగోలు చేస్తుండటంతో కొన్ని రెస్టారెంట్లలో ఆహార ధరలను పెంచారు. టీస్టాళ్లలో గ్యాస్ లేక ఎలక్ట్రిక్ స్టౌలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. అయితే గ్యాస్ కన్నా విద్యుత్ ఖర్చే అధికం అవుతుందని, దీంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. మరో వైపు హోటళ్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. వాటికి డిమాండ్ పెరగటంతో ధరలు అమాంతం పెరిగాయి. వ్యాపారులకు ఇది అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారాల బతుకుబండిని నడిపించటంలో గ్యాస్ కీలకం. హోటళ్లు, టీస్టాల్స్, బేకరీ, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్ వంటివి పూర్తిగా గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడం యజమానులతోపాటు అక్కడ పనిచేసే కార్మిక కుటుంబాలను ఆందోళన కలిగిస్తోంది. హాస్టళ్లలో మెనూ కుదింపు.. వంట గ్యాస్ కొరత ప్రభావం ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే వారిపై పడింది. విద్యా కేంద్రంగా విరజిల్లుతున్న నరసరావుపేట పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటూ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉదయం టిఫిన్కు బదులు రాగిజావ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో ఒక కూర, పెరుగు మాత్రమే అందిస్తున్నారు. వారం క్రితం మూడు కూరలు, ఒక ఫ్రై వడ్డించారు. విద్యార్థులు కడుపునిండా తినలేక ఇబ్బందులు పడుతున్నారు. 8 నుంచి సరఫరా బంద్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఈ నెల 8వ తేదీ నుంచి డీలర్లు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గ్యాస్ సరఫరాలో సమస్య లేదని చెప్పుకొస్తుంది. వాస్తవానికి అనేక హోటళ్లు, వ్యాపార సంస్థలు మూసివేసి ఉండటం బహిరంగంగానే కనిపిస్తోంది. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గృహవినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభం చిన్న వ్యాపారుల ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది. -
రవాణాశాఖలో జోన్–3 ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం (జోన్–3) ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 9 మంది ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికైనది వీరే... ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షునిగా వి.బాలకృష్ణ, (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మంగళగిరి), గుంటూరు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా కె.జయప్రకాశ్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ఒంగోలు), ట్రెజరర్గా కె.కరుణాకరన్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా) ఎన్నికై నట్లు వెల్లడించారు. జిల్లా రిప్రజెంటేటివ్ పోస్టులు మొత్తం ఆరు ఏకగ్రీవం కాగా, వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జి.అమృతరాణి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తెనాలి), పల్నాడు జిల్లాకు చెందిన సీహెచ్ మనీషా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నరసరావుపేట), బాపట్ల జిల్లాకు చెందిన కె.రవినాయక్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, చీరాల) ప్రకాశం జిల్లాకు చెందిన బి.భాను ప్రకాష్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ప్రకాశం) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏ మల్లికార్జున్రెడ్డి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), మార్కాపురం జిల్లాకు చెందిన కె.ఎల్.రావు (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, మార్కాపురం) ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో జోన్ 3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నికై న జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. -
మైనింగ్లో నేనే కింగ్!
కృష్ణా జిల్లాలో మైనింగ్ శాఖలో డీడీగా పనిచేస్తున్న వ్యక్తి ఆ శాఖకు తానే రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా తన కొత్త నిబంధనలతో పాత జీవోలను జోడించి అనుమతులు ఇవ్వడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఒక అనుమతి వల్ల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పలు లంక భూముల రైతులతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాడేపల్లి రూరల్: కృష్ణానదిలో ఎక్కడ తవ్వకాలు నిర్వహించాలన్నా ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవో నంబరు 49, 100లకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ కృష్ణా జిల్లాకు చెందిన మైనింగ్ శాఖ డి.డి. శ్రీనివాసరావు దానికి విరుద్ధంగా ప్రభుత్వ జీవోలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన 1966లో విడుదల చేసిన జీవోల ప్రకారం అనుమతులు ఇస్తున్నారు. గతంలో కూడా పలు క్లస్లర్ మిషన్లకు ఇదేవిధంగా అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అడ్డగోలుగా అనుమతులు తాజాగా ఒక రైతు పొలం మిగతా పొలాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉందని, ఇతర పొలాలతో సమానం చేసేందుకు మట్టిని తొలగించాలని, ఆ మట్టిని ఇటుక రాళ్ల బట్టీకి వినియోగించుకుంటామని ఓ టీడీపీ నేత లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నాడు. సదరు మైనింగ్ డి.డి. నిబంధనల ప్రకారం కలెక్టర్తో చర్చించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా నేరుగా ఫిబ్రవరి 4వ తేదీన అనుమతులు ఇచ్చారు. 120 రోజుల్లో ఆ పొలాన్ని చదును చేసి, వచ్చిన 13,355 టన్నుల మట్టిని తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చారు. లంక భూముల్లో తీసిన మట్టి ఇటుక బట్టీ రాళ్లకు పనికి వస్తుందా లేదా అనే విషయం పరిశీలించలేదు. లంక భూముల్లో నాలుగైదు అంగుళాల మందంలో ఇసుక పొరలు తగులుతాయి. అలాంటి మట్టి ఇటుక బట్టీలకు ఎలా పనికి వస్తుందని రైతుల ప్రశ్నిస్తున్నారు. మట్టి చాటున ఇసుకను తరలించేందుకు ఇలాంటి అనుమతులు తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు కనీసం ఆ భూమిని పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించడాన్ని ఖండించారు.కృష్ణానదిలో లంక భూముల్లో అనుమతి ఇచ్చే సమయంలో మైనింగ్ శాఖ అధికారులు వివిధ శాఖల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా కొత్త జీవో నంబరు 49 ప్రకారం కలెక్టర్ అనుమతి తప్పనిసరి. పక్క పొలాల రైతులు ఎటువంటి అభ్యంతరం చెబుతారో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండానే మైనింగ్ వే బిల్లులు సహా అందజేసి గ్రామ సభను నిర్వహించి ప్రస్తుతం అభిప్రాయ సేకరణ తీసుకోవడంతో మైనింగ్ శాఖ డి.డి. శ్రీనివాసరావు చేసిన ఈ విషయం బయటకు వచ్చింది. లంక భూముల్లో ఎక్కడ ఎత్తుపల్లంగా ఉన్నాయి, తీసిన మట్టి ఇటుక బట్టీలకు పనికివస్తుందని ఎలా నిర్ధారించారో అధికారులు తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చోడవరం లంక భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తే మిగిలిన రైతులకు చావే శరణ్యం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల్లో మట్టి తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను పునరాలోచించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో జాలాది వాసి మృతి
చిలకలూరిపేటటౌన్: బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన పిల్లి దొరకరాజు (38) ఆదివారం తెల్లవారుజామున వ్యక్తిగత పనులపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామం దాటిన తర్వాత, బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఎండిపోయిన పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు తలకు బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అమరావతి: విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు గ్రామ సమీపంలో ఒక్కసారిగా ముందు టైరు పేలి రోడ్డు పక్కన కందకంలో దిగబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అమరావతి వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని పెదమద్దూరు దాటి అమరావతి సమీపానికి రాగానే ఒక్కసారిగా ముందుటైరు పేలింది. ఈక్రమంలో బస్సు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూసుకు వెళ్లి దిగబడి పూర్తిగా ఒకపక్కకి ఒరిగి పోయింది. ఈసమయంలో బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్లు ఎలాగోలా బస్సు నుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు నాగవర్ధిని, శివపార్వతి, రమాదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిండంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అమరావతి: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో త్రిపుర రాష్ట్రం నుంచి యువతీయువకులు క్షేత్ర దర్శనంలో భాగంగా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించారు. త్రిపుర రాష్టానికి చెందిన 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తుళ్ళూరి సాంబశివరావు బెజ్జం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు
పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్కు మారిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
అక్షర ఆంధ్రా పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు వెస్ట్: ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక లాలుపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేయడంతోపాటు కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో నూరు శాతం అక్షరాస్యత సాధించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు జిల్లాలో 90,426 మంది అభ్యర్థులు 1485 కేంద్రాల్లో హాజరయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించారు. కార్యక్రమంలో వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆది మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం ఈనెల 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం బాజీబాబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వహణకు రాష్ట్ర వక్ఫ్బోర్డు రూ.17.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఉరుసు నిర్వహణకు వక్ఫ్ బోర్డు సూపరిండెంట్లు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19వ తేదీ సాయంత్రం చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు పెదకాకాని ముస్లింపాలెం జెండా చెట్టు నుంచి వైభవంగా ఉరుసు మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. 20వ తేదీ దీపారాధన, గంధం పంపిణీ, ఖురాన్ పఠనం, సలామి ప్రార్థనలు జరుగుతాయన్నారు. 19వ తేదీ రాత్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలసి దర్గాలో ఉరుసు మహోత్సవ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. దుగ్గిరాల: దుగ్గిరాల రైలుపేటలోని పసుపు యార్డు సమీపంలోని వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, శాంతి హోమంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణం కనులారా తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది. -
విజయోస్తు... పదిలం!
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి జీవితానికి తొలిమెట్టు వంటి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 149 కేంద్రాల పరిధిలో 27,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 నుంచి ఆయా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. పాఠశాలల్లో హెచ్ఎంలు నుంచి పొందిన, వెబ్సైట్, వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అధికారుల పరిశీలన ఆదివారం గుంటూరు నగరంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆర్జేడీ, డీఈవోలు వేర్వేరుగా 20 కేంద్రాల చొప్పున పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద కోడ్ నంబరుతో కూడిన బోర్డులు, రోల్ నంబర్లు ప్రదర్శించడం, మౌలిక వసతులను తనిఖీ చేశారు. సోమవారం ఉదయం పరీక్షలు ప్రారంభం కానుండగా, గుంటూరు నగర పరిధిలోని పలు కేంద్రాల వద్ద సెంటర్ కోడ్ నంబర్లు కనిపించలేదు. కేవీపీ కాలనీలోని కేఎస్ఆర్టీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు కనిపించేలా సెంటర్ కోడ్ నంబరు, రోల్ నంబర్లతో కూడిన వివరాలను ప్రదర్శించలేదు. -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
● డీఈఓ షేక్ సలీమ్ బాషా ● పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి ● ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు ● రేపటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలు ● గుంటూరు జిల్లాలో హాజరు కానున్న 27,699 మంది విద్యార్థులు ● జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా ఉన్న 149 పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. -
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన
గుంటూరు లీగల్: ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండో అదనపు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్చార్జి చైర్మన్ వై.నాగరాజా ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 41 బెంచ్లు, గుంటూరు జిల్లా కోర్డు ప్రాంగణంలో 15 బెంచ్లను ఏర్పాటు చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ ద్వారా సివిల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ కుదుర్చారు. 2009నాటి కేసులో ఇరువర్గాల అంగీకారంతో రూ.2,68,60,000 రాజీ కుదిర్చా రు. రెండో అదనపు జిల్లా కోర్టులో ఒక సివిల్ దావాలో రూ.25కోట్లకు రాజీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బార్ మెంబర్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లాలోని వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. మొత్తం 24,756 కేసులు పరిష్కరించగా, వీటిలో సివిల్ కేసులు 1,694, క్రిమినల్ కేసులు 22,983, ప్రీ లిటిగేషన్ కేసులు 79, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులలో పరిష్కారమైన మొత్తం కేసుల విలువ మొత్తం విలువ రూ.42,58,65,889. జాతీయ లోక్ అదాలత్ ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహణకు సహకరించిన న్యాయవాదులకు, పోలీసు సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు. -
రైతుల అభ్యంతరాలు పరిశీలిస్తాం..
● కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి ● చోడవరం రీచ్ పరిశీలన ● ఆర్డీఓ రాకతో భారీగా చేరుకున్న రైతులుతాడేపల్లిరూరల్: రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని, ఉన్నతాధికారులకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామని కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. కృష్ణా జిల్లా చోడవరంలోని లంక భూముల్లో మేట పేరిట తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ‘మేట... బడాబాబులకు మేత’ శీర్షికన సాక్షి దినపత్రికలో శనివారం కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన ఉయ్యూరు ఆర్డీఓ శ్రీదేవి వివిధ శాఖల అధికారులతో కలసి చిర్రావూరు వైపు లంక భూములను పరిశీలించేందుకు మధ్యాహ్నం సమయంలో విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు అక్కడకు చేరుకున్నారు. లంక భూమి భౌతిక స్వరూపాన్ని ఆర్డీఓ శ్రీదేవికి వివరించారు. గతంలో అనుమతులు ఇచ్చిన ఇసుక రీచ్ల వల్లే వేలాది లంక భూములు కృష్ణానదిలో కొట్టుకుపోయాయని, పట్టా భూములు ఉన్న రైతులు కౌలు రైతులుగా మారారని తెలిపారు. చోడవరం ఇసుక రీచ్–2తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను అనుమతి ఇస్తే మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావూరు, రామచంద్రాపురం, గొడవర్రు, ఇతర ప్రాంతాల్లో లంక భూములతోపాటు రేపల్లె కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయని పేర్కొన్నారు. సొసైటీల కింద ఎంతో మంది వ్యవసాయం చేసుకుంటున్నారని, మట్టి తీసుకోవడానికి అనుమతి ఇస్తే చిన్నపాటి రైతులు తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుందని, అందువలన అనుమతులు ఇవ్వవద్దంటూ వారు కోరారు. సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, కాశయ్యలు మాట్లాడుతూ లంక భూముల తవ్వకాల విషయంలో రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.చోడవరం–2 ఇసుక రీచ్తోపాటు పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ దినేష్ తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఇప్పటి వరకు రహదారి నిర్ణయించలేదని, డిస్ట్రిక్ శాండ్ నిబంధనల ప్రకారం ఏ జిల్లాలో ఇసుక రీచ్లు నిర్వహిస్తే ఆ జిల్లాలోనే అనుమతులు ఇస్తారని అన్నారు. అనుమతులు ఇవ్వకుండా గుంటూరు జిల్లా లోని కృష్ణానదిలో రహదారులు ఎలా నిర్మించారని రైతులు ప్రశ్నించగా ఆయన మాట దాటవేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026గుంటూరులో ట్రాఫిక్ నిలిపివేసి చేపట్టిన చెట్ల నరికివేత పనులు గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ పాలనలో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతోంది. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లు నిలువునా నరికివేతకు గురవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా పచ్చదనం కనుమరుగైపోతోంది. గుంటూరు లక్ష్మీపురం మెయిన్రోడ్డు పొడవునా కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. ● లక్ష్మీపురం మెయిరోడ్డు ముఖద్వారమైన మదర్థెరిస్సా విగ్రహం నుంచి స్తంభాలగరువు వరకు కాలువల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన నగరపాలక సంస్థ అధికారులు మొదటి దశలో హాలీవుడ్ థియేటర్ నుంచి బేకర్స్ ఫన్ వరకు చెట్లను తొలగించారు. ● ప్రస్తుతం రెండో దశలో బేకర్స్ ఫన్ నుంచి శనివారం ఉదయం చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల ఎదుట నిర్మించిన మెట్లు, ర్యాంపులను తొలగించిన అధికారులు కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని భారీ వృక్షాలను వేళ్లతో పెకిలించి వేస్తున్నారు. ● వాస్తవానికి వాణిజ్య సముదాయాల ముందు మెట్లు, ర్యాంపులను తొలగించి, కాలువలు నిర్మించేందుకు అవకాశం ఉన్నా చెట్లను సైతం నరికి, వేర్లతో పెకిలించి వేయడం గమనార్హం. ● ఒక వైపు వేసవి మొదలై ఎండల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో రోడ్డు పక్కన చెట్లను నరికివేయడం వల్ల మండు టెండల్లో నీడ కరువై అల్లాడాల్సిన దుస్థితి ఎదురుకానుంది. ● మొక్కలను పెంచి, చెట్లను సంరక్షించాల్సిన అధికారులే ఈ విధంగా చెట్లను నిలువునా నరికి వేస్తుండటంతో పర్యావరణ వేత్తలు, నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. 7టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. 2016లో సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు వస్తున్నారని, కొరిటెపాడు నుంచి గుజ్జనగుండ్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అప్పట్లో ఫుట్పాత్ల నిర్మాణం కోసమే వందలాది చెట్లను నరికివేశారు. మళ్లీ టీడీపీ అధికారంలో ఉండగా, చెట్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ నిలిపివేసి, చెట్లను నరికివేత పనులు చేపట్టారు. చెట్లతో నిండి పచ్చదనం పంచుతున్న లక్ష్మీపురం ప్రధాన రహదారి చెట్ల నరికివేతతో వెలవెలబోతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం శనివారం 537.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గొరిగపూడి(భట్టిప్రోలు):గొరిగపూడి పంచాయ తీ వరికూటివారిపాలెంలో శనివారం సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. -
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
రేపల్లె: మైనేనివారిపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున గురు నిలయం ఆవరణంలోని శ్రీ గాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు శనివారం మూడవ రోజు కనుల పండువగా జరిగాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు ఆచరించి వధువరులుగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడము శాంతి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు కళ్యాణ్ చక్రవర్తి స్వామివారి కల్యాణ ఘట్టాలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కన్నులారా తిలకించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బాపట్ల: బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లో ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి 55వ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివా రం ఉదయం స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళలు కోలాటం నిర్వహించారు. తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తుళ్లూరులో నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనా న్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలి పారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ రూండి రాకేష్ వివరాలను అందిస్తూ పదివేల మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి 36వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. కానుకమాత చర్చి సహాయ గురువులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా విభాగానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా ఎన్. నిర్మల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘ ప్రధాన కార్యదర్శిగా పి. శామ్యూల్ పాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎల్ఎల్వీ. ప్రతాప్, కోశాధికారిగా ఎల్. రవీంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి. గణేష్ కుమార్. ఎస్. పురుషోత్తం రాజు, బి. నాగేశ్వరరావు నాయక్. జి.వి.ఆర్.ఏ. శేషారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, ఎం. బుల్లయ్య, ఎస్కే. నీలోఫర్, వి. పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి గా ఆర్. శివరామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, కె. మోహన్ రావు, వి. చంద్ర మోహన్, కె. విద్యాసాగర్ రెడ్డి, జేఏసీ సభ్యుడిగా బి. మధుసూదన్ ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితులుగా బి.సిరిల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు షేక్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలు నిర్మల భారతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చంద్రమోహన్ పూర్ణ చంద్ర రెడ్డి, రామచంద్రరావు, తోట ఉషాదేవి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వృద్ధుడి బలవన్మరణం
నాదెండ్ల: అసలే వృద్ధాప్యం.. ఆపై పక్షవాతం.. ఈ కారణంగా మతిస్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామంలో నివాసం ఉండే పోతురాజు కృష్ణారావు (70) ముఠా పనులకు వెళ్తుండేవాడు. గడిచిన నాలుగేళ్ళుగా పక్షవాతంతో బాధపడుతూ చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధాప్యం పైబడటంతో కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఉదయం గణపవరం నుంచి నాదెండ్ల వెళ్ళే డొంక రోడ్డులో ఐసీఎం కంపెనీ సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్ఐ వెంకయ్య సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
నరసరావుపేట: గౌరవ వేతనంతో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేనిపక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు. పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎల్ ప్రసన్న అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలనే దశలవారీ పోరాటాలలో భాగంగా ఇటీవల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు 10 డిమాండ్లకు గాను తొమ్మిది నెరవేర్చామని అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగాది సందర్భంగా పండగ నాటికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా శిబిరానికి వచ్చిన కూటమి అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి కోశాధికారి మాధవి, సభ్యులు సావిత్రి, జయలక్ష్మి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.మల్లేశ్వరి -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
గుంటూరు ఎడ్యుకేషన్ : పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్యా బాటలు వేసిన కమ్మ హాస్టల్ సేవలు 102 వసంతాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విశేషమని, విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం అరండల్ పేటలోని కమ్మ విద్యార్థి సహాయ సంఘం (కమ్మ హాస్టల్) 102 వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.15 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘శ్రీ యలమంచిలి జనార్దనరావు కంప్యూటర్ ల్యాబ్’’ ను సుజనా చౌదరి ప్రారంభించారు. అనంతరం కమ్మ హాస్టల్ చరిత్రను ప్రతిబింబించే ‘‘కమ్మ హాస్టల్ చరిత్ర’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాఖమూరి లక్ష్మీదేవమ్మ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన సభకు కమ్మ విద్యార్థి సహాయ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మనిషి ఉన్నత మనుగడకు అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య రంగాల్లో కొండబోలు బసవపున్నయ్య నేతత్వంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సేవాభావంతో కొనసాగుతున్న ఈ సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు వచ్చి చేయూతనందించాలన్నారు. కార్యక్రమంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘ కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు ఎం. బంగారు బాబు ఉపాధ్యక్షుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్యన్నారాయణ, ఎన్. కోటేశ్వరరావు, అట్లూరి సుబ్బారావు, రత్నబాబు, డాక్టర్ యర్రా నాగేశ్వర రావు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుంటూరులో జోయాలుక్కాస్ రెండో షోరూం ప్రారంభం
నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం మెయిన్రోడ్లో జోయాలుక్కాస్ వరల్డ్స్ ఫేవరేట్ జ్యూవెలర్ షోరూంను శనివారం సాయంత్రం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నజీర్ అహ్మాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరులో రెండో షోరూమ్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. విస్తరణలో భాగంగా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన ప్రతి షోరూంను ఆధునిక ఇంటీరియర్లు, విశాలమైన లేఅవుట్లు అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు మంచి అనుభూతి అందించేలా రూపొందించారని చెప్పారు. సినీ నటి సౌందర్యరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ మాట్లాడుతూ మూడు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల నిరంతర విశ్వాసం, ఆదరణ తమ వృద్ధికి చోదక శక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి షోరూంలో అత్యుత్తమ నాణ్యత, వినూత్న డిజైన్లు ఉన్నాయని తెలిపారు. సీఓఓ హెన్రీ గెర్గో, మార్కెటింగ్ హెడ్ అనిష్వర్గేష్, రిటైల్ హెడ్ రాజేష్కృష్ణన్, రీజనల్ మేనేజర్ రాజేష్ ఓఎస్ పాల్గొన్నారు. -
గుంటూరులో ఐబీ మెగా క్రెడిట్ అవుట్ రీచ్
కొరిటెపాడు(గుంటూరు): ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ మెగా క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం అమరావతి జోన్కు సంబంధించి జేకేసీ కళాశాల రోడ్లోని ఆ బ్యాంక్ జోనల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 జోన్లు, మూడు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బ్రాంచ్లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా రూ.1,422 కోట్ల రుణాలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బ్యాంక్ తిరుపతి జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం సహా, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణేష్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్ కేంద్రిత రుణ సేవల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు బ్యాంక్ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఉత్పత్తులను ప్రత్యేక స్టాళ్లలో ప్రదర్శించారు. అమరావతి జోనల్ మేనేజర్ ఎన్.గౌరి శంకర్ రావు, విజయవాడ జోనల్ మేనేజర్ ముచ్చినా రాజేష్, రాజమండ్రి జోనల్ మేనేజర్ కత్తుల రాజ్ కుమార్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ పి.అవధేష్ కుమార్, డీఆర్డీఏ, మెప్మా అధికారులు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. -
‘సాహితీ కిరణం’లో ముందస్తు ఉగాది వేడుకలు
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మిల ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు శనివారం సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పర్యావరణ రచయిత డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజిక స్పృహతో రచనలు చేయాలన్నారు. కార్తికా డెవలపర్స్ అధినేత వి.వి రాఘవరెడ్డి, జల్ది విద్యాధరరావులు ప్రసంగించారు. విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు ప్రముఖ రంగస్థల నటులు, రచయిత విడుదల సాంబశివరావు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ కథా రచయిత్రి తాటికోల పద్మావతి రచించిన కథా పద్మాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనాన్ని ప్రముఖ రచయిత వడలి రాధాకృష్ణ నిర్వహించారు. సయ్యద్ జానీబాషా, బండికల్లు జమదగ్ని, ఎస్.ఎం సుభాని, వీఎస్వీ ప్రసాద్, సోమేపల్లి వశిష్ట, కొణతం నాగేశ్వరరావు, దార్వేముల అనిల్, సుభద్రాకృష్ణ, సుబ్బయమ్మ, పుల్లారావు, శ్రీనివాసరావులు కవితా పఠనం చేశారు. వివిధ రంగాలలో పేరు పొందిన చలపాక ప్రకాష్ (పత్రికా రంగం), కడియాల ప్రభాకరరావు (సంగీతం), రాసంశెట్టి నరసింహారావు(గాయకులు), వై. కనకదుర్ (సాహిత్యం), అత్తోట సౌజన్య (గాయని)లను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. కథల పోటీలలో విజేతలైన ఇంద్రగంటి మధుసూదన్రావు, మొగిలి పద్మ, మౌనశ్రీ మల్లిక్, కోరాడ అప్పలరాజు, చిట్యాల శ్రీధర్కుమార్, పట్నాల ఈశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, ఎం సత్యగౌరీ, బీవీ మిత్ర కొత్తూరు సీతారామరాజు, సి రాజేశ్వరి, కిషోర్ కుమార్లకు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ వ్యాఖ్యాత పెద్దూరి దాసు సభా సమన్వయం చేశారు. వేడుకలు పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం పత్రిక కార్యాలయంలో పొత్తూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొంచెం కావాలిపుడు శీర్షికన కవితా గానం చేసిన ఎస్. ఎం. సుభానిని జాస్తి వీరాంజనేయులు శాలువాతో సత్కరించారు. ప్రముఖ సాహితీ వేత్త పెద్దురి వెంకటదాసు, ప్రముఖ కథా రచయిత వడలి రాధాకృష్ణ, పట్టాభి కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ కవి రచయిత డాక్టర్ జెల్ది విద్యాధరరావు, జమదగ్ని, వశిష్ఠ సోమేపల్లి, సయ్యద్ జానీబాషా, తాటికోల పద్మావతి, ఎం. సుభద్రకృష్ణ, ప్రముఖ సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, ముట్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్. దమయంతి తదితరులు సుభానికి అభినందనలు తెలిపారు. -
శాసీ్త్రయ పరిశోధనల్లో నైతిక ప్రమాణాలు ముఖ్యం
చేబ్రోలు: పరిశోధనల్లో జంతువుల వినియోగం విషయంలో ఎథికల్ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించడం అవసరమని ఢిల్లీలోని సీసీఎస్ఈఏ సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ వివేక్ త్యాగి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీసీఎస్ఈఏ (కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సిపెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) ఆర్థిక సౌజన్యంతో ‘‘రీడిఫైనింగ్ ఎక్సిపెరిమెంటల్ ఫార్మాకాలజీ’’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎథికల్, ఆల్టర్నేటివ్ అండ్ డిజిటల్ ఫ్రాంటియర్స్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. డాక్టర్ వివేక్ త్యాగి మాట్లాడుతూ పరిశోధనల కోసం ప్రయోగ జంతువులను ఉపయోగించే సందర్భంలో జంతు సంక్షేమాన్ని కాపాడడం అవసరం అన్నారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్. హరీష్ శంకర్ మాట్లాడుతూ వైద్యశాస్త్రం, ఫార్మకాలజీ మరియు జీవశాస్త్ర పరిశోధనల్లో జంతు నమూనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ అనేక రోగాలపై పరిశోధనలు చేయడంలో జంతు నమూనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. 350 మందికిపైగా విద్యార్థులకు నిర్వహించిన ఓరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్లలో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జే. మహేష్ కుమార్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే. సురేష్ బాబు, బెంగళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
గుంటూరు వెస్ట్: కవయిత్రి మొల్ల అసమాన ప్రజ్ఞావంతురాలని, ఆమె రచించిన రామాయణం నిత్యనూతనమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కవియిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జేసీ మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను, ఆమె జీవిత చరిత్రను వివరించారు. అచ్చ తెలుగు పదాలతో గద్యరూపంలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేట్లు ఆమె రామాయణాన్ని రచించారని చెప్పారు. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి రాజులు మొల్లమాంబకు కవిరత్న బిరుదుతో సత్కరించారని తెలిపారు. ఆమె పాండిత్యం, అసమాన ప్రజ్ఞ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, వేములకొండ శ్రీనివాస్, చింతనగుండ వాసు, జె.నాగేశ్వరరావు, యు.వెంకటేశ్వర్లు, రాజవరపు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్లో సురక్షితమైన, నమ్మదగిన నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం బ్రాడీపేటలో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ సురక్షితమైన ఉత్పత్తులతోనే విశ్వసనీయ వినియోగదారులు ఉంటారని చెప్పారు. వినియోగదారులకు రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అధునాతన డిజిటల్ వస్తువుల వరకు సాంకేతికతతో నడిచే మార్కెట్లో అందుబాటులో ఉండటం వలన అవి సురక్షితంగా, నమ్మదగినవిగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యమని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, చట్టాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, లీగల్ మెట్రోలాజీ జాయింట్ కంట్రోలర్, వినియోగదారుల ఫోరం సభ్యులు, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుంటూరు జీజీహెచ్లో కేంద్ర కమిటీ పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు పలు వార్డులను పరిశీలించారు. ఎన్ఐసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రవీంద్రకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజ్కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చెందిన రూపల్ ప్రకాష్, శ్యామల్రావు, హుస్సేన్లు అధికారుల బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు ఆన్లైన్లో నెక్ట్స్జెన్ పేరుతో నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్లో కాగిత రహిత ఓపీ సేవలు రోగులకు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జీజీహెచ్ అధికారులు నెక్ట్స్జెన్ పేరుతో రోగుల డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను నమోదు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం స్వయంగా పరిశీలించారు. అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రిలో పరిశీలనకు తరలి వెళ్లారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి, అడ్మినిస్ట్రేటర్ డి.ప్రవీణ్కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు కేంద్ర బృందం వెంట ఉండి వారికి సమాచారం అందజేశారు. -
అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం ప్రారంభం
ఏఎన్యూ(పెదకాకాని): దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కేంద్రం గుంటూరు వారు నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఏఎన్యూలో జరిగిన ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్రం నుంచి మొత్తం 37 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో సంస్కృతి, ఉపాధి అవకాశాలు, సాంకేతికత వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ జానపద నృత్య ప్రదర్శనలు, క్షేత్రస్థాయి సందర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడంలో ఇటువంటి యువజన సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.సుధాకర్, మై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్వీఎస్ఎస్ఎన్ రవి కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దివ్యతేజోమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో యువత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మంగళగిరి టౌన్ : విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఉయ్యాల చందు (27) మంగళగిరి మండలం ఆత్మకూరులోని వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం పని నిమిత్తం ఆత్మకూరు వాటర్ ప్లాంట్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ ఉన్న ఆటోతో మంగళగిరి పట్టణం టిప్పర్ల బజార్లో నారాయణ స్కూల్కు చేరుకున్నాడు. అక్కడి వాటర్ ట్యాంక్లోకి ఆటోలోని ట్యాంక్ నుంచి పైపు ద్వారా నీరు నింపుతున్నాడు. విద్యుత్ వైర్లు, వాటర్ ట్యూబ్స్ ఎర్త్ కావడంతో ఆటోలో కూర్చుని ఉన్న చందుకు విద్యుదాఘాతం తగిలింది. సిబ్బంది అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఇంద్రపాల్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ సమాచార హక్కు కమిషన్ పనితీరు, సెకండ్ అప్పీల్ కేసులను ఎలా డిస్పోజ్ చేస్తున్నారో వివరించారు. అనంతరం ఇంద్రపాల్ సింగ్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ పాల్గొన్నారు. నెహ్రూనగర్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండో రోజు కూడా కొనసాగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మీట్లో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు శుక్రవారం క్రికెట్, ఇతర పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, త్రోబాల్, స్కిప్పింగ్, 100 మీటర్స్ వాకింగ్, టెన్నికాయిట్ డబుల్స్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలు జరిగాయి. స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగుస్తుందని డీసీ శ్రీనివాసులు చెప్పారు.


