breaking news
Guntur District Latest News
-
వైభవంగా బాల ఏసు తిరునాళ్ల
● ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం ● విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ అచ్చంపేట: క్రిస్మస్ వేడుకలలో భాగంగా మండలంలోని తాళ్లచెరువులోని బాల ఏసు దేవాలయంలో తిరువాళ్ల మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు మందిరానికి తరలి వచ్చి, కొవ్వొత్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో చర్చి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. గుంటూరు రోమన్ క్యాథలిక్ మిషన్ పీఠాధిపతి చిన్నాబత్తిన భాగ్యయ్య దివ్యపూజా బలి నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని బోధించారు. క్రిస్మస్ అనగా దేవుడైన క్రీస్తు మానవరూపుడై భువికి అరుదెంచిన వేళ అన్నారు. అందిరిపై క్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థించారు. లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పాపులను రక్షించుటకు భూమిపై అవతరించారని చెప్పారు. ఎదుటి వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని బోధించారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని ప్రబోధించారు. విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి, రెవ. ఫాదర్ తుమ్మా కరుణాకరరెడ్డి, రెవ. ఫాదర్ పవన్, రెవ. ఫాదర్ రేపూడి రాయప్ప, రెవ ఫాదర్ థామస్ బైబిల్ పఠనం చేశారు. 64 మంది కన్య సీ్త్రలు ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. ప్రత్యేక బృందాలచే కోలాటం ప్రదర్శన చేశారు. గ్రామ సృష్టికర్త అరళానందస్వామి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దేవాలయ సమీపంలో అన్నదానం నిర్వహించారు. బాలఏసు స్వరూపంతో అలంకరించిన తేరు ప్రదక్షిణ మహోత్సవం కనుల పండువలా జరిగింది. తాళ్లచెరువు గ్రామవీధులలో మేళతాళాలు, బాణసంచాలతో తేరు ఉరేగింపు ఆకట్టుకుంది. పలు గ్రామాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. క్రీస్తుకు కొవ్వొత్తులు సమర్పించుకున్నారు. రైతులు తమ వ్యవసాయ సామగ్రిని చర్చి చుట్టూ తిప్పి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా చర్చి ముందు స్టాల్స్, రంగుల రాట్నాలు, చెరుకు గడల విక్రయాలు ఏర్పాటయ్యాయి. మండలంలోని పలు గ్రామాలలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట, మాదిపాడు, తాడువాయి, చెరుకుంపాలెం, కోనూరు, గ్రంథసిరి, వేల్పూరు, చింతపల్లి, చిగురుపాడు తదితర గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాగరమాత ఆలయంలో ఘనంగా క్రిస్మస్ విజయపురి సౌత్: స్థానిక ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జోసఫ్ బాలసాగర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని, ఆయన సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు అనిల్, కిరణ్, సిస్టర్స్, భక్తులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఉత్తిదే
గుంటూరు మెడికల్: పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు ప్రభుత్వ వైద్యాధికారులు, ఆస్పత్రుల నిర్వాహాకులు తూట్లు పొడుస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించకుండానే అందించినట్లుగా ఆస్పత్రుల యజమానులు తప్పుడు రికార్డులు చూపెడుతూ పేదల ఉసురు పోసుకుంటున్నారు. వారి తప్పుడు పనులకు ప్రభుత్వ వైద్యాధికారులు అందినంత పుచ్చుకుని వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్కు, వారి కుటుంబ సభ్యులకు, ఎంఎల్ఏలకు, మాజీ ఎంఎల్ఏలకు, ఇతర సిబ్బందికి వైద్య సేవలందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, రిఫరల్ ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. సదరు సర్టిఫికెట్ను పొందాలంటే ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రీటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972’ను తప్పనిసరిగా పాటించాలి. జిల్లాలో ఉన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ నిబంధనలు అమలు కావటం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిబంధనలు ఇవీ.... తెల్ల రేషన్కార్డు ఉన్నవారు, దారద్య్రరేఖకు దిగువున ఉన్న వ్యక్తులకు ఉచితంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్పొరేట్, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలో ఉన్న పడకల్లో ఐదుశాతం ఈ పేదల కోసం కేటాయించి అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలను ఇవ్వాలి. అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయాలి. ఓపీ సేవలు, వార్డు సేవలు కూడా ఉచితంగా అందించాలి. అంతేకాకుండా రెండు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఒక ఉచిత వైద్యశిబిరం సదరు గ్రామంలో ఏర్పాటుచేయాలి. విద్యార్థులకు సైతం ఉచిత వైద్యం... కేవలం పెద్దవాళ్ళకే కాకుండా విద్యార్థులకు కూడా ఉచిత వైద్య సేవలను అందించాల్సి ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు , ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, బీసీ వెల్ఫేర్ స్కూల్, ఎస్టీ హాస్టల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్ విద్యార్థులకు, మాబడి స్కూల్స్ విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. వీరితో పాటు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, జిల్లా రిఫరల్ కమిటీ, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ,ఇతర ప్రభుత్వ అధికారులు రిఫర్ చేసే విద్యార్థులకు కూడా గుర్తింపు ఉన్న ఆస్పత్రులు ఉచితంగా సేవలందించాలి. కానీ జిల్లాలో రెన్యూవల్ అయిన ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ వైద్యుల మొక్కుబడి తనిఖీలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు విజయవాడకు చెందిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులను ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన సీనియర్ వైద్యులను నియమిస్తుంది. తనిఖీ కోసం వెళ్లే వైద్యులకు, వైద్యాధికారులకు సదరు ఆస్పత్రి నిర్వాహాకులే కారు ఏర్పాటుచేసి, మధ్యాహ్నం స్టార్ హోటల్స్లో విందు ఏర్పాటుచేసి, తిరిగి వచ్చే సమయంలో భారీగానే తాయిలాలు ఇస్తున్నట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. తప్పనిసరిగా తనిఖీలు చేయాలి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో సుమారు 80 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రతి నెలా ఎంత మంది రోగులకు చట్ట ప్రకారం ఉచిత వైద్య సేవలను అందించారో పూర్తి వివరాలతో నివేదిక పంపించాల్సి ఉంది. అయితే కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీల ఊసే లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలను అందించటం లేదనే విషయాన్ని నిర్ధారించారు. ఉచిత వైద్యం రికార్డులకే పరిమితం పేదల ఉచిత సేవలకు మంగళం సేవలను అందించకుండానే అనుమతులు నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆస్పత్రుల నిర్వాహకులు -
శివైక్యం చెందిన బ్రహ్మయ్య గురూజీ
బాపట్ల: ఆంజనేయస్వామి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఎందరో ప్రముఖులకు మార్గదర్శి అయిన బ్రహ్మయ్య గురూజీ(79) శివైక్యం చెందారు. బాపట్ల కేంద్రంగా గత 25 సంవత్సరాలుగా హనుమ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు, ఆశీర్వాదాలు అందజేస్తూ బ్రహ్మయ్య గురూజీ ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకొని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శిష్యులు, బంధువుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. భవిష్యత్తులో బ్రహ్మయ్య గురూజీ స్మృతి వనం ఏర్పాటు చేసి, గడిచిన 25 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు అందించిన ఆధ్యాత్మిక పరిమళాలను కొనసాగించేలా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు శిష్యులు సిద్ధమవుతున్నారు. అంతిమయాత్రలో ఆడిటర్ పుప్పాల చిన్న సాయిబాబు, బొమ్మిశెట్టి వెంకటరత్న గుప్తా, కొత్తమాసు సత్యనారాయణ, న్యాయవాది అలపర్తి నాగేశ్వరరావు, అలపర్తి శ్రీనివాసరావు, సామాజికవేత్త చింతకాయల పార్థసారథి, పెదమల్లు ఉదయ్ చందర్రావు, మూర్తి, పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని నివాళులర్పించారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం పదహారవ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 30– 35 మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు 86888 31386, 91548 76312 నంబర్లకు సమాచారం అందించాలని ప్రత్తిపాడు ఎస్ఐ కె.నరహరి తెలిపారు. -
పని దొరకడం లేదని..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురై గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు. -
క్రిస్మస్ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
ప్రత్తిపాడు: పెదనందిపాడులోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలో గురువారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఫాదర్లు ప్రార్థనల అనంతరం క్రీస్తు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా లావు నాగేశ్వరావు సంఘ పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ప్రేమ, కరుణకు ప్రతీక అని చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
బెడ్ సైడ్ బోధనకు మంగళం
● రోగుల పడకల వద్ద వైద్య విద్యార్థులకు బోధన చేయటం లేదు ● ఉదయం ఓపీ వేళల్లోనే అంతా మమ అనిపించేస్తున్నారు ● మధ్యాహ్నం నుంచి ఇళ్లకు, సొంత క్లినిక్లకు సీనియర్ వైద్యుల పరుగులు ● పట్టించుకోని కాలేజ్ ప్రిన్సిపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ బెడ్సైడ్ టీచింగ్ తప్పనిసరి పర్యవేక్షణ నిల్ -
క్రీస్తు జననం..లోకానికి పర్వదినం
ఏసు క్రీస్తు జన్మదినాన్ని విశ్వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు వాఖ్య పరిచయం చేశారు. ఫిరంగిపురంలో మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పునీత ఆగ్నేసమ్మ చర్చిలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు ఫిరంగిపురంలో రప్రార్థనలు చేస్తున్న మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పునీత ఆగ్నేసమ్మ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు నార్త్ ప్యారీస్ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు డాన్బాస్కో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బిషప్స్ 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. -
రంగం సిద్ధం
ఓఆర్ఆర్ భూ సేకరణకు గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు.. ● పల్నాడు జిల్లాలో 17 కిలోమీటర్లు... ● 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ... ● ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న జేసీ ● నందివెలుగు నుంచి కాజ వరకు 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు ● జాతీయ రహదారితో అనుసంధానం.... సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు భూ సేకరణకోసం అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఓఆర్ఆర్ ఐదు జిల్లాలు, 23 మండలాలు, 97 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. 189.90 కిలోమీటర్ల మేర పరిధిలో ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు, పల్నాడులో 17 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు గెజిట్ను ప్రచురించింది. గుంటూరు జిల్లాకు ఆదివారం కేంద్రం గెజిట్ను ప్రకటించిది. పల్నాడు జిల్లాకు ఈ నెల ఏడున గెజిట్ వచ్చింది. గుంటూరు జిల్లాలో త్వరలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 21 రోజులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. దీంతోపాటు తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుంచి జాతీయ రహదారి కాజ గ్రామం వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ● అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజ, చిన కాకాని గ్రామాలు, గుంటూరు నగరంలోని బుడంపాడు, ఏటుకూరు, పాతూరు, అంకిరెడ్డిపాలెం, మేడికొండూరు మండలం సిరిపురం, వరగాని, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు, తాడికొండ మండలం పాములపాడు, రావెల, దుగ్గిరాల మండలం చిలువూరు, గొడవర్రు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, పెదకాకాని మండలం నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం, తెనాలి మండలం కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠెవరం, సంగం జాగర్లమూడి, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, చేబ్రోలు మండలం నారా కోడూరు, వేజెండ్ల, శుద్దపల్లి, చేకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల గ్రామాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్పురం, కంభంపాడు, కాశీపాడు, అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాల మీదుగా వెళ్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయా సర్వే నెంబర్లను ప్రకటించారు. ఈ సర్వే నెంబర్లలో క్రయవిక్రయాలు నిలిపివేయనున్నారు. సర్వే నెంబర్లలో రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ చేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాతే కేంద్రం 3–డి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఓఆర్ఆర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. -
అయ్యో..‘పాప’ం ..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారిని చూడండి. ఈ పాపకు పట్టుమని ఆరేడేళ్లు కూడా ఉండవు. బడిలో పుస్తకాలతో, ఇంటి వద్ద ఆట బొమ్మలతో, కల్మషం లేని చిరునవ్వులతో సరదాగా ఆడుకోవాల్సిన పసిప్రాయం. కానీ ఆ చిన్నారి చేతిలో నెలల పసికందుతో బతుకు పోరు సాగిస్తోంది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును లాలిస్తూ భిక్షాటన చేస్తున్న చిన్నారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో కనిపించింది. అలసిపోయి దుకాణాల ఎదుటనే కూర్చుని ఏడుస్తున్న శిశువుని ఓదార్చుతున్న చిన్నారిని చూసిన వారంతా అయ్యో ‘పాప’ం అంటూ.. తమకు తోచిన సాయం అందించారు. ఆటపాటలు, అల్లరి పనులతో అందంగా సాగిపోవాల్సిన బాల్యాన్ని ఇలా యాచన బాటలో చూడడం బాధ కలిగిస్తోంది. – ప్రత్తిపాడు -
ప్రమాద భరితంగా ఘాట్ రోడ్ మార్గం
తెనాలి రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్ ఉళ్లక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్ హెల్త్ ఇన్ మిడ్ లైఫ్’ అనే అంశంపై డాక్టర్ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరప్రసాద్, డాక్టర్ జి.రవిశంకరరావు, డాక్టర్ టి.అఖిలేష్, డాక్టర్ కె.అనిల్ కుమార్, డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. తెనాలి టౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్వామివారిని పరశురామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
గత ప్రభుత్వంలో వెంటనే ఆదుకున్నారు
నేను కౌలు రైతును. ఖరీఫ్లో 1.5 ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో పసుపు సాగు చేశాను. ఎకరాకు రూ.60 వేలు కౌలు. ఎకరాకు 1200 చక్కెరకేళి మొక్కలు వేశాను. పంటంతా అరకాయపై ఉన్న సమయంలో మోంథా తుపానుతో 500 వరకు అరటి చెట్లు పడిపోయాయి. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అధికవర్షాలు, మోంథా తుపానుకు పసుపు దుంప గిడసబారి పుచ్చు వచ్చింది. చేతికొచ్చేది ఏమీ కనిపించడం లేదు. కొద్దిరోజుల్లో దున్నేసి మొక్కజొన్న వేయాలని చూస్తున్నా. అరటి, పసుపును అధికారులు, సిబ్బంది వచ్చి చూసి వెళ్లారు మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. గాలికి అరటి పడిపోతే నష్టపరిహారం ఉండదని చెప్పారు. గత ప్రభుత్వంలో పంటలకు ఉచిత బీమా చేశారు. వరదలకు పంట నష్టపోతే రోజుల వ్యవధిలోనే పరిహారం అందించారు. –గుదిబండి శేషిరెడ్డి, కౌలురైతు, గుదిబండివారిపాలెం -
పీఎంవీబీఆర్వై ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలోని వ్యాపార, పారిశ్రామిక రంగానికి చెందిన ఉద్యోగులు, యజమానులకు ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్ ఘర్ యోజన పథకం (పీ.ఎం.వీ.బీ.ఆర్.వై) ప్రయోజనాలు అందించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం పీఎంవీబీఆర్వై పథకంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, ఈఎస్ఐ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవ, తయారీ రంగ పరిశ్రమలలో ఉద్యోగాల సృష్టిని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎంవీబీఆర్వై పథకం ద్వారా కార్మికులకు, యజమానులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నారని తెలిపారు . అనంతరం కలెక్టర్, అధికారులు సంబంధిత బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్సింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగేశ్వరరావు, ఈఎస్ఐ అధికారి కె. చెన్నకేశవులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, విద్యా ప్రమణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం తెలిపారు. పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం ద్వారా పది పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా ‘మన బడి – మన బాధ్యత‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.. జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సెలింగ్ అందిస్తారని తెలిపారు. -
ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, త్యాగ సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమైనవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు అందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తోటి మనుషులపై ప్రేమ, నిస్సహాయులపై కరుణ, సహనం, త్యాగం వంటి విలువలు సమాజాన్ని మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్జీఎఫ్ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ●84 మందికి రూ.3.84 కోట్లు ఇవ్వాలని ఆరోపణ ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు యడ్లపాడు: ఓ స్వర్ణకారుడు నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆభరణాలు చేసిస్తానని చెప్పి సుమారు 84 మంది బాధితుల నుంచి రూ.3.84 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని వసూలు చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడులో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...యడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ సమీపంలో నివసించే ఏలూరి కామేశ్వరరావు అనే వ్యక్తి స్వర్ణకారుడు. గతంలో అతని తండ్రికి మంచి పేరు ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు కొత్త ఆభరణాల తయారీ కోసం పెద్ద మొత్తంలో బంగారం, అడ్వాన్స్ నగదు అందజేశారు. కొంతకాలంగా నగలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కామేశ్వరరావు, ఏడాదిగా బాధితులకు కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు ఫోన్ చేస్తే మాత్రం ‘త్వరలోనే ఇచ్చేస్తాను‘ అని నమ్మబలుకుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించి బుధవారం ఫిర్యాదు చేసేందుకు సుమారు 84 మంది బాధితులు వచ్చారని తెలిపారు. సుమారు రూ.3.84 కోట్లు నష్టపోయినట్లుగా బాధితులు పేర్కొంటున్నారని వెల్లడించారు. లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని కోరామన్నారు. కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ టి. శివరామకృష్ణ తెలిపారు. -
వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను నెరవేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను సైతం నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోఉన్న తరుణంలో నకిలీ వస్తువుల జాడ్యం మార్కెట్లను పట్టి పీడిస్తోందని అన్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. మరో అతిథి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి కె.విజయలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ఐఎస్ఐ, హాల్మార్క్ చిహ్నాలు కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాసరచనలో తెలుగు, ఇంగ్లిషు మీడియం వారీగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని భవిత, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కృష్ణతులసి, ఎలక్యూషన్లో మంగళగిరి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని కనకపుట్లమ్మ, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని సాక్షి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కోమల పద్మ, ఎంఈవోలు అబ్దుల్ ఖుద్దూస్, హవీలా, నాగేంద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ -
వైభవంగా బాల ఏసు ఉత్సవం
ఫిరంగిపురం: క్రీస్తు జన్మ దినోత్సవం సందర్భంగా స్థానిక బాల ఏసు దేవాలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైంది. ఆలయ ప్రాంగణంలోని అంథోని వారి మందిరం, చిన్న కొండపై గుహ, వ్యాకుల మాత స్వరూపం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో శోభాయమానంగా వెలిగి పోతున్నాయి. దేవాలయం లోపల బాలఏసు జన్మించిన పశువుల పాక ఏర్పాటు చేశారు. భక్తులు కొవ్వొత్తులు పెట్టేందుకు, బయట కొబ్బరి కాయలు కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని కథోళిక క్రైస్తవుల ఇళ్ల వద్దకు మేళతాళాలతో సంఘ పెద్దలు, సోడాలిటీ సభ్యులు, గుడి పెద్దలు బాణసంచా, చిచ్చుబుడ్లు కాల్చి ప్రార్థనకు గుడి వద్దకు రమ్మని పిలుపు నిచ్చారు. దివ్య పూజాబలికి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజనం, వసతి కల్పించారు. అర్థరాత్రి నిర్వహించే దివ్య పూజాబలి పూజలకు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరుకానున్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో గల క్రీస్తు, మరియమాత మందిరాలు కూడా ముస్తాబయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామాలో గురువారం మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారీయా, సీఆర్డీఏ జాయింట్ కమిషనర్ భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వీవీఐపీ, వీఐపీ రాకపోకల మార్గాలు, సభా వేదిక, విగ్రహావిష్కరణ స్థలం, భారీ కేడింగ్, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ పికెట్లు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ నుంచి కొలనుకొండ బైపాస్కు వెళ్లే రహదారిలో జరిగిన హత్య కేసును తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఈనెల 2న అరటితోటలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతుడిని బ్రహ్మానందపురంలో నివాసించే ఇళ్లచెరువు వెంకటరావు అలియాస్ వెంకట్ (32)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి, తమ అబ్బాయిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్ర కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించారు. అంజిరెడ్డి కాలనీకి చెందిన మల్లినేని సాయిభవాని, వేమూరు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మహిళతో సంబంధం మృతి చెందిన వెంకటరావు అంజిరెడ్డి కాలనీలో గతంలో నివసించే వాడు. అక్కడి నుంచి బ్రహ్మానందపురంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లాడు. అతడికి అంజిరెడ్డి కాలనీలో వేరే మహిళతో సంబంధం ఉండడంతో అక్కడకు వచ్చి వెళ్లే సమయంలో సాయిభవాని, మహేష్లతో గొడవ పడేవాడు. ఇది మనసులో పెట్టుకుని ఈనెల 20న అంజిరెడ్డి కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో కాపుకాసి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఐ వీరేంద్రను, ఎస్ఐ ఖాజావలిని, సిబ్బంది ప్రదీప్ను ఆయన అభినందించారు. హత్య జరిగింది ఇలా... బ్రహ్మానందపురంలో నివాసముండే వెంకటరావు ఈనెల 20న అంజిరెడ్డి కాలనీలోని ప్రియురాలి దగ్గర నుంచి రాత్రి 12 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో సాయి భవాని పుట్టినరోజు సందర్భంగా మహేష్, వారి చిన్ననాటి స్నేహితులు మరో ఐదుగురు మద్యం పార్టీని నడిరోడ్డులో జరుపుకుంటున్నారు. వెంకటరావు వారి వద్దకు వెళ్లి అడ్డు తప్పుకోవాలని కోరాడు. దీనికి సాయి భవాని, మహేష్లు ‘‘నీ కోసం ఎప్పటినుంచో చూస్తున్నామురా! ’’ అంటూ ఆటోలో కూర్చుని ఉన్న వెంకటరావును కొట్టి కిందికి దించారు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వెంకటరావును విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టడం వారు గమనించారు. అదే రాత్రి ఐదుగురిలో ఒక వ్యక్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఫేక్ కాల్ అని భావించి వదిలివేశారు. ఉదయం అంజిరెడ్డి కాలనీలో హత్య జరిగిందని తెలియడంతో సదరు యువకుడ్ని విచారించగా ఉదంతం బయట పడింది. అతిగా మద్యం తాగిన మత్తులో విచక్షణా రహితంగా వెంకటరావును మద్యం బాటిళ్లతో, రాళ్లతో కొట్టడంతో రోడ్డుపై మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి పక్కనే ఉన్న అరటితోటలో పడవేశారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకు కృషి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం కొత్త స్కీములను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు. మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళల సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచీలు విజయవాడ జోన్లో ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంబీలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే చంద్రబాబు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అడుగడుగునా వంచిస్తున్నారు. మోంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ పంటల సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతుల ఎదురుచూపులు మోంథా తుఫాను ధాటికి జిల్లాలో వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్ పంటలతో పాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పూలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి, పంటల నష్టాన్ని గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు పంట నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించి, నివేదికను ప్రభుత్వానికి పంపారు. అయితే, రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు నష్టపరిహారం అందజేయకపోవడంతో బాధిత రైతులు మౌనంగా రోదిస్తూ, భారంగా ఎదురు చూస్తున్నారు. రైతు కంట కన్నీరు ఏటా ప్రకృతి వపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుఫానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బ తింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం అందజేస్తే కొద్దిగా అయినా నష్టం భర్తీ అవుతుందనే భావనలో అన్నదాతలు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన సమయంలో కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే పంటలు ఎలా సాగు చేయాలంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్లో సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ఘోరంగా విఫలమైంది. కూటమి సర్కారు వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి మోంథా తుపాను నష్టపరిహారం అందజేయాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు. నేను కౌలు రైతును. ఖరీఫ్లో ఎకరం మెట్ట, అయిదెకరాల మాగాణి సాగు చేశాను. ఎకరానికి 1400 చక్కెరకేళి మొక్కలు వేశాను. కౌలు రూ.55 వేలు. గెలలు అరకాయ దశలో ఉండగా మోంథా తుపానుకు వీచిన గాలులకు 1100 మొక్కలు పడిపోయాయి. చేతికి ఏమీ రాలేదు. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అయిదెకరాల మాగాణిలో వరి వెదజల్లాను. ఎకరాకు రూ.34 వేల కౌలు చెల్లించాను. తుపాన్ కారణంగా పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు రూ.15 వేలు నష్టం. పొలం యజమాని లెటరుతో కౌలు కార్డు తెచ్చుకున్నాను. ఈ–క్రాప్ నమోదు చేశారు. అయినా పంట నష్టపరిహారం ఏమీ లేదు. రైతుభరోసా డబ్బులు కూడా పడలేదు. గత ప్రభుత్వంలో పడ్డాయి. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నారు. –కంకిపాటి శ్రీనివాసరాజు, గుదిబండివారిపాలెం పైరు నష్టం(ఎకరాల్లో) వరి 2,693.20 పత్తి 1,282.50 మినుము 1,243.55 సోయాబిన్ 234.61 కంది 10.02 అరటి 450.61 కూరగాయలు 123.27 తమలపాకు 24.43 పూలు 0.60 -
గోదాదేవి అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, రైల్వేస్టేషన్ రోడ్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన చేపట్టారు. రైల్వేస్టేషన్రోడ్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం స్వామివారిని వామనావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. మొదటి, రెండు సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అలానే బీటెక్, బీఆర్క్ పరీక్షల నూతన షెడ్యూల్ను విడుదల చేశారు. బీటెక్, బీఆర్క్ పరీక్షలు జనవరి 3వ తేదీ, 9వ తేదీ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని తెలిపారు. తెనాలి టౌన్: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేశారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వన్టౌన్ సీఐ వి.మల్లిఖార్జునరావు, ఆలయ సహాయ కమిషనర్/ కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ, అర్చకులు ఆలయ మర్యాదప్రకారం జయశ్రీకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: డ్రగ్స్ కేసులో చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన మాదిగాని బాలప్రకాష్ బాలు(ప్రస్తుతం బాపట్ల మండ లం స్టువర్టుపురంలో నివాసం) అనే వ్యక్తిని రెండు రోజుల కిందట హైదరాబాద్లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇతను ఏ3గా ఉన్నాడు. బాలప్రకాష్బాలుకు టీడీపీ కృష్ణాజిల్లాలో ఎంపీకి అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాదిగాని గురునాథానికి దగ్గరి బంధువు. ఇతను పుట్టింది చీరాల మండలం రామకృష్ణాపురంలో కాగా అసాంఘిక కార్యకలాపాలన్నీ రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాతో పా టు తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చీరాల, బాపట్ల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. -
27న కేఎల్యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎంటెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీటెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు ఆయన చెప్పారు. స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త , వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం ర్యాలీని మంగళవారం గుంటూరులోని మహాత్మగాంధీ పార్క్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, తూర్పు డీఎస్పీ అబ్దుల్అజీజ్, పోలీస్ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు. సమీక్షా సమావేషశం మాదక ద్రవ్యాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం(నవంబర్ – 2025) నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ ఏ ఒక్కరిపై అయిన ఒక మాదక ద్రవ్యాల కేసు నమోదైనా, అతని విధిగా సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సంకల్పం, డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి -
బాల్య వివాహాలరహిత భారత్పై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు లేని సమాజం నిర్మించడానికి 100 రోజుల అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటురులో మహిళా పోలీసులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆషా (అవైర్నెస్, సపోర్ట్, హెల్ప్ అండ్ యాక్షన్)–2025 కొత్త కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. ఈ పథకం ప్రకారం బాల్య వివాహాలను నిరోధించడంలో ఒకే విధమైన, సమర్థ, చట్టబద్ధమైన స్పందనను అందించడమే ఈ ‘ఆషా’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లా స్థాయిలో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. మన రాజ్యాంగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ – 12–సి ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. బాల్య వివాహ బాధితులకు, వేధింపులకు గురైన పిల్లలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా ప్యానెల్ లాయర్స్ ను నియమిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయన్నారు. అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. ఆషా యూనిట్ కొత్త నిబంధలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ సమన్వయ కర్త టి. శ్రీవాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్. విజయ్ కుమార్, ప్యానెల్ అడ్వకేట్ కొత్త నిబంధనల గురించి మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. -
క్రిస్మస్ సెలవులు కుదించడం తగదు
ఆర్జేడీకి ఫ్యాప్టో వినతి గుంటూరు ఎడ్యుకేషన్: క్రిస్మస్కు ముందు, తరువాత రోజు పాఠశాల మొత్తానికి సెలవుగా పరిగణించుకుంటున్న విధానాన్ని మార్చివేసి, క్రిస్మస్ ఒక్కరోజునే ఉపాధ్యాయులకు సెలవులు ఇచ్చే పద్ధతి తీసుకురావడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ వై.శ్యాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డితో పాటు డీఈవో షేక్ సలీమ్బాషాను వారి కార్యాలయాల్లో కలిసిన ఫ్యాప్టో నాయకులు క్రిస్మస్ సెలవులను కుదించడం తగదని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ క్రిస్మస్ ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలలు యథావిధిగా పని చేయాలని, పాఠశాలలో పని చేస్తున్న సగం మంది ఉపాధ్యాయులే ఆప్షనల్ హాలిడే ఉపయోగించుకుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, అనేక మంది క్రైస్తవ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారందరు క్రిస్మస్కు ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలకు హాజరు కాని నేపథ్యంలో పాఠశాల మొత్తానికి సెలవు పరిగణించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ఆర్జేడీని కలసిన వారిలో ఫ్యాప్టో జిల్లా నాయకులు షేక్ బాజీ, ఎం.కోటిరెడ్డి, బి.ప్రసాద్, జిలానీబాషా, పి.బాలాజీ, ఎస్కే రెహ్మాన్, వై.మనోజ్కుమార్ సయ్యద్ ఫర్హతుల్లా, జి.సుధాకర్, ఎండీ షుకూర్ ఉన్నారు. -
మైనారిటీల ఆస్తులు దోపిడీకి కుట్ర
పట్నంబజారు: ముస్లిం మైనారిటీల ఆస్తులు దోపిడీ చేస్తుంటే.. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతకాని దద్దమ్మలా చూస్తూ.. తనకేమి తెలియదంటూ వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నిప్పులు చెరిగారు. అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ఇండ్రస్టీయల్ పార్క్ పేరుతో దోచుకుంటుంటే.. మైనారిటీ ఎమ్మెల్యేగా నసీర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 71 ఎకరాల భూమి చినకాకానిలో ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన సోదరుడు రవి, ఎమ్మెల్యే నసీర్అహ్మద్, కూటమి పెద్దలు కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆ భూములను కై ంకర్యం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇండ్రస్టీయల్ పార్క్కు ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన తరువాత ఇవ్వాలని, అదేమి లేకుండా నేరుగా టెండర్లు పిలవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ ఈవిషయంపై ప్ర శ్నిస్తే తనకేమి తెలియదని చెప్పటం సిగ్గుచేటన్నారు. పర్సంటేజ్ తీసుకుని నోరు మెదపటంలేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, శాంతియుత వాతావరణంలో ఎంతటి పోరాటానికి వెనుకాడబోమన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాంరసూల్ మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్కు సంబంధించిన భూమి మొత్తం 81.22 ఎకరాలు ఉంటే.. ఇప్పుడు 71 ఎకరాలకు టెండర్లు పిలిచారని, అసలు ఆ 10 ఎకరాలు ఏమైందో తెలియకుండా పోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు, మైనారిటీ విభాగం నేతలు పఠాన్ సైదాఖాన్, పఠాన్ అబ్దుల్లాఖాన్, లియాఖత్ఆలీ, అప్సర్, కార్పొరేటర్లు ఫర్జానా, ఆబీద్బాషా, మెహమూద్, నేతలు వైఎస్సార్ రబ్బాని, జాఫర్, సలీం, షౌకత్, యూసఫ్, రహీమ్ పాల్గొన్నారు. -
సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి
కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు(సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితిలో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్ఓలకు కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి అందజేశారు. అదే విధంగా జనవరి 15 నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి ఈ–ఆఫీస్ విధానం ను అమలు చేయాలని ఆదేశించారు. -
గుంటూరు రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం
లక్ష్మీపురం: నాన్–ఫేర్ రెవెన్యూ చొరవలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్, గుంటూరు రైల్వే స్టేషన్న్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ఫారంలో మంగళవారం ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన స్లీపింగ్ ప్యాడ్స్ను ఆమె ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను, బెడ్స్, వాష్ రూమ్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం మొత్తం 64 పడకల సామర్ాధ్యన్ని కలిగి ఉందన్నారు. గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ ప్రారంభం లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ నూతన ప్యాసింజర్ ౖసర్వీస్ ప్రారంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 57407/ 57408 గుంతకల్లు – మార్కాపూర్ రోడ్– గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదితన కేటాయించడం జరిగిందని తెలిపారు. -
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
గుంటూరురూరల్: నగర శివారుల్లోని లాంఫాంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షత వహించగా, వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ అకాల పరిస్థితులను తట్టుకుని అధిక ఆదాయం పొందే రకాలను, శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తలు రైతులకు అందజేయాలన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, పరిశోధన సంచా లకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతులు కొలకలూరు గ్రామానికి చెందిన యన్నం లక్ష్మయ్య, గుడిపూడికి చెందిన గద్దె హనుమంతరావు, మోతడక గ్రామానికి చెందిన మన్నవ వెంకటేశ్వర్లు, గ్రంధసిరి గ్రామానికి చెందిన కిలారి రామారావు, మునిపల్లికి చెందిన గుంటుపల్లి వరప్రసాద్, వేజండ్లకు చెందిన తాడిబోయిన చంద్రశేఖర్లను సన్మానించారు. -
గుంటూరులో 104 ఉద్యోగుల ధర్నా
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : 104 ఉద్యోగులకు భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ చేస్తున్న అన్యాయానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ వద్ద మాస్ లీవ్ పెట్టి మంగళవారం ధర్నా చేపట్టారు. ధర్నాకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, ఎల్ఐసీ నాయకులు వీవీకే సురేష్, ఎం. రాజేశ్వరరావు, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్లు మద్దతు తెలిపారు. ● లక్ష్మణరావు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు తగ్గించిన వేతనాలు, రద్దు చేసిన క్యాజువల్ లీవులు పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులపై భవ్య యజమాన్యం వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి చాట్ల రాంబాబుకు ఇచ్చిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిపై వేధింపులకు పాల్పడాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐదు ఏళ్లు సర్వీసు దాటిన డ్రైవర్లకు స్లాబ్ వేతనాలు చెల్లించాలన్నారు. డీఈవోలకు డ్యూటీలను విధించకుండా జీవో ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. ప్రజలకు అవసరమైన మందులు 104 వాహనంలో అందుబాటులో ఉంచాలన్నారు. ● ఎల్ఐసీ నాయకులు వీవీకే సురేష్, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడంలో వెనుకబడిందన్నారు. భవ్య యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. రోడ్లపైకి వచ్చే ఆందోళన చేపట్టానికి పూర్తి బాధ్యత భవ్య యాజమాన్యందే అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. ● ధర్నా అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరంట్ల సురేష్ కుమార్, శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు సుధా, ఏడుకొండలు, సత్యరాజ్, బాలకృష్ణ, జి.సుబ్బారావు, శంకర్, విజయ్, సాయిరాం, వెంకట్రావు, హరి, విజయ్ 108 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు షేక్ హసన్, హాసన్ కమల్, రాజకుమార్, బాజీ, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
ఫిరంగిపురం:క్రిస్మస్ను పురస్కరించుకొని స్థాని క బాలఏసు దేవాలయంలో ప్రత్యేక పూజాబలి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. దేవాలయానికి విద్యుత్ దీపాలు వేయడంతో కాంతులీనుతుంది. నవదిన ప్రార్థనల్లో భాగంగా కొత్తపేటకాలనీ, లూర్దునగర్, క్రీస్తునగర్, జగన్ కాలనీ ప్రాంతాల్లో దేవాలయ సహాయ విచారణ గురువు కె.సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. 24న ఉదయం విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో దివ్యపూజాబలి, రాత్రి 11.30 గంటలకు క్రీస్తుజయంతి మహోత్సవం, జాగరణ దివ్యపూజాబలిలో మేత్రాసన గురువు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని చెప్పారు. 25న దివ్యపూజాబలి నిర్వహిస్తారని గురువులు ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్లు పాల్గొంటారని తెలిపారు. అదేరోజు రథోత్సవం, తేరు ప్రదక్షణ నిర్వహిస్తారని చెప్పారు. ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం ఫిరంగిపురం: ఆంధ్రారోమ్గా ఫిరంగిపురాన్ని పిలుస్తారని బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. బిషప్హౌస్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిరంగిపురం అనగానే కథోళిక క్రైస్తవులు ఎక్కువ మంది కలిగిన గ్రామంగా ప్రసిద్ధి చెందిందన్నారు. దేవాలయం నిర్మించి 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారిని నరసింహావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. తెనాలి తహసీ ల్దార్ కార్యాలయాన్ని దాతల సాయంతో ఆధునికీకరించి ఇటీవల పునఃప్రారంభించిన సంగతి విదితమే. ఈ కార్యాలయాన్ని తన పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నూతన సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కార్యాలయానికి అధునాతన శోభగులద్దిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, దాతలను అభినందించారు. కలెక్టర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా ఉన్నారు. ప్రత్తిపాడు: పోలేరమ్మ తల్లికి భక్తులు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో కొలువుదీరిన పోలేరమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన వి.వి శేఖర్రెడ్డి సుమారు రూ.5.60లక్షల విలువచేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు. హారాన్ని మంగళవారం ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జక్కా శ్రీనివాసరావుకు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గుంటూరు జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. లోక రక్షకుడైన క్రీస్తు ఆగమనాన్ని తెలిపే రకరకాల నక్షత్రాలను క్రైస్తవులు తమ ఇళ్లపై అలంకరించగా.. చర్చిలపై, ఆయా కూడళ్లలో భారీ స్టార్లు వెలిశాయి. గుంటూరు మార్కెట్లలో రకరకాల ఆకారాల్లో స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, ట్రీ అంలకరణ సామగ్రి, పశువుల పాక సెట్టింగులు, శాంటాక్లాజ్ మొదలైన క్రిస్మస్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు ‘‘లోక రక్షకుడి జననం సర్వమానవాళికి శుభదినం క్రీస్తు జననానికి దృగ్గోచ్చకం ఆకాశన వెలిసిన నక్షత్రం పశువుల పాకలో మహనీయుని జననం.. విధేయతా నిదర్శనం ఆయన జననం, జీవనం.. సర్వమానవాళికి పంచెను శాంతి సందేశం’’ విద్యుత్ వెలుగుల్లో గుంటూరులోని నార్త్ ప్యారిస్ చర్చివిద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న డాన్బాస్కో కార్యాలయంవిద్యుత్ కాంతుల్లో డాన్బాస్కో చర్చిఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ 41.6840 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం మంగళవారం 567.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 37,777 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బహిర్గతం చేయాలి
ఆర్వోబీ నిర్మాణ ప్లాన్ ● ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం గుంటూరులోనే జరుగుతోంది ● శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో చట్టబద్ధంగా వ్యవహరించాలి ● కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి ● ముందు చూపు లేకుండా బ్రిడ్జి కూల్చివేతతో నరకాన్ని చూస్తున్న ప్రజలు ● అధికారుల ఏకపక్ష వైఖరి ప్రజలందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టింది ● భూ సేకరణ చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ● క్షేత్రస్థాయిలో నిబంధనలు పాటించేలా చూడాలి ● బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరు నగరంలో శంకర్విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి, కొత్తది నిర్మించే వ్యవహారంలో అధికార యంత్రాంగం చేసిన తప్పి దాలతో ప్రజలు నరకాన్ని చవి చూస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జేఏసీ కన్వీన్ ఎల్.ఎస్.భారవి అన్నారు. ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం ఒక్క గుంటూరులోనే జరుగుతోందన్నారు. మంగళవారం గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా ఆగస్టు 9న పాత బ్రిడ్జి కూల్చివేసిన తరువాత గుంటూరు నగరంలో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు చవి చూస్తున్నా రని చెప్పారు. సాంకేతికంగా సర్వే నిర్వహించకుండా ఏకపక్షంగా కూల్చివేసిన అధికారులు కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల తప్పిదాలపై మొదటి నుంచీ చెబుతున్నాం బ్రిడ్జి కూల్చివేతకు రంగం సిద్ధం చేసిన సమయంలోనే అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష విధానాలపై జేఏసీ పరంగా తాము వెలుగులోకి తెచ్చామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి ముందుగా ఆర్యూబీ నిర్మించాలని చేసిన ప్రతిపాదనలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాజాగా దృష్టి సారించడం మంచి విషయమేనని అన్నారు. బ్రిడ్జి కూల్చివేత, పునఃనిర్మాణ పనుల పరిశీలనకు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ నెల రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన సమయంలో నిర్మాణ ప్లాన్ను ప్రజలకు తెలిసే విధంగా బహిరంగ పర్చాలని తాము చేసిన డిమాండ్పై అధికార యంత్రాంగం ఇప్పటికీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత బ్రిడ్జి స్థానంలో ఎటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 930 మీటర్ల పొడవు, 74 అడుగుల వెడల్పుతో చేపడుతున్న బ్రిడ్జి కారణంగా రెండు వైపులా సర్వీసు రోడ్లు కేవలం 17 అడుగుల మేర కు ఉంటాయని, అవి వాహనాల రాకపోకలకు, పార్కింగ్కు ఏ మాత్రం సరిపోవన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను కూల్చివేయకుండా ఒకే పిల్లర్తో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని జేఏసీ తరఫున మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ను పట్టించుకోలేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎట్టకేలకు గుర్తించిన మీదట భూ సేకరణ జరుపుతామని ప్రకటించడం మంచి పరిణామమేనని, దీనిపై జిల్లా కలెక్టర్తో నోటిఫికేషన్ జారీ చేయించి, నిబంధనల ప్రకారం చేయించాలని కోరారు. 930 మీటర్ల పొడవు, ఎర్త్వాల్తో కూడిన బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఏసీ కళాశాల కూడలిలో యూ టర్న్ తీసుకునే పరిస్థితులు ఉండవని, హిందూ కళాశాల కూడలికి వెళ్లి అక్కడ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ట్రాఫిక్ మొత్తం బ్రిడ్జిపైనే పడుతుందని, అంబులెన్స్లు, అత్యవసర ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే ఆర్యూబీ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు కమల్కాంత్, మద్ది రాధాకృష్ణ, బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు. -
సహకార ఉద్యోగుల ఆందోళన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్స్యూరెన్స్ను చేయించాలని సూచించారు. జీతభత్యాల్లో కోత విధించడం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కనీస వేతనం తగ్గకుండా ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జనవరి 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. -
పెండింగ్ లేకుండా అర్జీల పరిష్కారం
కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత, సామాజిక అంశాలపై ప్రజలు అందించిన అర్జీలను సక్రమంగా, సకాలంలో పరిష్కరించేలా అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సులభ మార్గాలను ప్రవేశపెట్టామని, అయితే కింది స్థాయిలో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. ఇంటి స్థలాల కోసం అర్జీలు అందించడానికి వచ్చిన వికలాంగుల నుంచి సమావేశ మందిరానికి వచ్చి వాటిని స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన 320 అర్జీలను జేసీ, డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ , జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కారుణ్య నియామక ప్రక్రియలో భాగంగా షేక్ అబ్దుల్ రవూఫ్, డి. భాను చరణ్, బి. శ్యామ్ ప్రకాశ్కు నియామక పత్రాలను అందజేశారు. -
ఆకాశమే హద్దుగా విజయాలు ఉండాలి
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలతఏఎన్యూ(పెదకాకాని): మారుతున్న కాలంలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎక్కువ కష్టపడే వారికి విజయావకాశాలు ఆకాశమే హద్దుగా మారిపోతాయని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రథమ సంవత్సర న్యాయ విద్యార్థుల స్వాగతోత్సవ కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువ న్యాయ విద్యార్థులు కోర్సు పూర్తి అయ్యాక ఏమి చేయాలో ఆలోచించడం కన్నా కోర్సు ఆరంభంలోనే వారు ఏమి కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ ప్రకారంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ లా బోర్డ్ స్టడీస్ చైర్ పర్సన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ విభాగం న్యాయ విద్యార్థులకు అన్ని విధాలుగా తోడ్పడుతూ వారి జీవన, విద్యా ప్రమాణాలను పెంపునకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ఆఫీసర్ మండూరి వెంకటరమణ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. న్యాయ విభాగం అధ్యాపకులు డాక్టర్ పి.వెంకటరమణ, డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ రామకోటిరెడ్డి, డాక్టర్ రామకృష్ణ బాబా, పరుచూరు కుమారి, దినకర్, మనోజ్, సైకాలజీ అధ్యాపకురాలు ప్రమీలారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
ప్రత్తిపాడు: అయ్యవార్లకు కొత్త అగచాట్లు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ నానా రచ్చ చేసిన అప్పటి ప్రతిపక్షం, గద్దెనెక్కిన తరువాత నాడు చెప్పిన మాటలను విస్మరించింది. బోధనేతర పనులు అప్పగిస్తుండడంపై ఉపాధ్యాయులు కస్సుబుస్సు లాడుతున్నారు. ఇప్పటికే పది తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకు నోడల్ ఆఫీసర్ చొప్పున ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇతర శాఖల కర్ర పెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న పంతుళ్లపై చంద్రబాబు సర్కారు ముస్తాబు పేరుతో మరో అదనపు పని భారం మోపింది. దీంతో విద్యార్థులను ‘ముస్తాబు’ చేయలేక చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల ప్రభుత్వ పాఠశాలల్లో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి అమలు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 43 ఇచ్చింది. తప్పనిసరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్ ఉంచాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. అంతేకాకుండా చేతులు శుభ్రం చేసుకోనే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభత్ర చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అనుకూలమైన ఐఈసీ మెటీరియల్ను కూడా ప్రదర్శించాలి. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్లను ఎంపిక చేయడం, రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చే విద్యార్థులు, తలదువ్వుకోకుండా వచ్చే విద్యార్థులను గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం, లేదా దువ్వించడం చేయించాలి. అయితే, ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు వర్గాలు, యూనియన్లు భగ్గుమంటున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక ముస్తాబు చేయాలా, చేయిస్తూ కూర్చోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం వాస్తవానికి ఈ కార్యక్రమం మూడు రోజుల కిందటే ప్రారంభమైనప్పటికీ సగానికి పైగా పాఠశాలల్లో నిర్వహించిన జాడలే లేవు. ప్రధానోపాధ్యాయుల్లో ఆసక్తి కరువడంతో కొన్ని బడుల్లో ముస్తాబు కార్నర్లు కనిపించని పరిస్థితి చోటుచేసుకుంది. మరికొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఎన్నికలకు ముందు కన్నీళ్లు తుడిచేందుకు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం నెట్టుకొచ్చిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు బోధనేతర బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దువ్విన తలనే దువ్వుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటివి అవసరమే. అయితే విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటివి ఉంచడం వల్ల వారు చదువుపై కన్నా వ్యక్తిగత సౌందర్యం పైనే శ్రద్ధ చూపే అవకాశాలూ లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎలా ఉన్నా ఆ ప్రభావం హైస్కూల్స్పై పడే ప్రమాదం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రులు, గురువులు ఇవేమి ఉత్తర్వులంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల లెక్క ప్రైమరీ స్కూల్స్ : 609 యూపీ స్కూల్స్ : 25 హైస్కూల్స్ : 130 విద్యార్థులు : 51,982 ఉపాధ్యాయులు : 3,429 -
ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారి
కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థులు వి. కార్తిక్, ఏ. కార్తిక్ రూపొందించిన వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టు ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారిగా ఉంది. పట్టణాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో మొక్కలు పెంచేందుకు స్థలం సరిపోక ఎదురవుతున్న సమస్యలకు విద్యార్థులు తమ ఆలోచనతో పరిష్కారం చూపారు. పెద్ద సైజు డబ్బాకు రంధ్రాలు చేసి, అందులో మట్టిని పోసి ఒకేసారి కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను పెంచారు. వర్షపు నీటి ఆధారంగా మొక్కలు పెంచే విధానంతో నీటిని కూడా ఆదా చేయవచ్చు. -
ముస్తాబుతో బోధనకు ఆటంకం
విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి,తరగతి, గృహం, పరిసరాల పరిశుభ్రత గురించి ఉపాధ్యాయులు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చేయవలసిన పనులకు కూడా ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడం బాధాకరం. ముస్తాబుపై ఎక్కువ దృష్టి సారిస్తే బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. అంత గౌరవం కూడా ఉండదు. ఈ కాన్సెప్ట్పై గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు చేరవేస్తే మంచిది. ప్రవీణ్ ప్రకాషే బాధపెట్టాడనుకుంటే అంతకు మించిన బాధను ఇప్పుడు పెడుతున్నారు. – కె.బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా -
న్యూజిలాండ్లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు
ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం న్యూజిలాండ్లో ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పరిపాలనలో వైఎస్. జగన్మోహన్రెడ్డి పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, సంక్షేమాన్ని వారి గడప ముందుకు చేర్చారని తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ) కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు న్యూజిలాండ్లో నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు మౌంట్ ఆల్చర్ట్ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ హాజరయ్యారు. కార్యక్రమంలో గోవర్ధన్ మల్లెల కళ్యాణ్ కసుంగాటి, బాల బీరమ్, ఇందిరా సిరిగిరి, వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, శివ కిలారి, జనక్, అరుణ్రెడ్డి, చంద్రశేఖర్ కోడూరి, మురళి, రోహిత్రెడ్డి, రామ్మోహన్ దంతాల, ప్రదీప్, నిర్మల్ పాండే, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ పానుగంటి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వానంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలు పనికిరాకుండా పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు. -
వక్ఫ్ భూముల్లో పరిశ్రమలు పెట్టనివ్వం
చిన కాకాని గ్రామంలో వక్ఫ్ బోర్డ్కు సంబంధించిన 77.57 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ ఏర్పాటుకు సిద్ధమవ్వడాన్ని ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ భూములు ముస్లిం, మైనారిటీల విద్య, ఇతర అభివృద్ది కోసం కేటాయించాలి. ప్రభుత్వం ఆలోచనలు అమలుకు ఏమాత్రం ఒప్పుకోం. –సయ్యద్ సలావుద్దీ, ముస్లిం సమైక్య వేదిక నాయకులు 2005 ఉపాధి హామీ హక్కు చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరు మార్చడంతోపాటు కొత్త నిబంధనలు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలను విరమించుకోవాలి. పేదవాడికి అన్యాయం చేసే కూటమి సర్కార్ ఆగడాలను సహించే ప్రసక్తే లేదు. దీనిపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. –పాశం రామారావు, కౌలు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు -
కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు సోమవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వారు వెళ్లి విజయవాడ నుంచి కృష్ణా కెనాల్కు వచ్చే రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఒక కన్ను పూర్తిగా పోయి లొట్టగా ఉందని తెలియవచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఉండొచ్చు. ట్రైన్లో నుంచి జారి పడ్డాడా? గతంలో మాదిరి రైల్వేబ్రిడ్జిపై హత్యచేసి కిందకు నీళ్లలోకి పడవేశారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ముందు వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక బైక్పై వస్తున్న వ్యక్తి టిప్పర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చిన్న కాకాని గ్రామానికి చెందిన వల్లభాపురం నరేష్(38) కృష్ణాయపాలెంలో ఓ కంపెనీలో పని చేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నరేష్ తమ్ముడికి కంపెనీ నుంచి ఫోన్ చేసి మీ అన్నయ్య వెస్ట్ బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీయగా, నున్నలో ఓ పని కోసం వచ్చి, ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో నరేష్కు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాడు. దీంతో మృతుని భార్య కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. వారి మొరను ఆయన అలకించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు. అనధికారికంగా షెడ్ల నిర్మాణం కోనేరు వెనుక హిందూ అపరకర్మలకు స్థలం ఉంది. మేం ఊరెళ్లిన సమయంలో ఆవరణలో, రహదారిపై అక్రమంగా షెడ్లు నిర్మించారు. తీసేయాలని సదరు వ్యక్తులకు విన్నవించినా పట్టించుకోలేదు. అందులో మూడు షెడ్లను నిర్మించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. సిబ్బందికి రక్షణతో పాటు సంఘ ఆస్తులకు భద్రత కల్పించాలని విన్నవించాం. అయినప్పటికీ చర్యల్లేవు. జీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – జీవీ. కుమార్, అన్నవరపు పాండురంగరావు ( హిందూ అపరకర్మల నిర్వహణ సంఘం ) -
కాకుమానులో గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ జి. భానోదయ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం కాకుమాను ఎస్ఐ ఏక్నాథ్ స్థానిక అప్పాపురం రోడ్డు సమీపంలోని కరుణ రూరల్ గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పెదనందిపాడు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆటోని నిలిపి తనిఖీ చేస్తుండగా, ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి దూకి పొలాల్లోకి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న బాపట్ల మండలం చెరువుజమ్ముల పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. ఈ మేరకు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్ఐ. ఏక్నాథ్లు బాలుడిని అదుపులోకి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
విభిన్న ప్రతిభావంతులకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే సౌరశక్తితో పని చేసే చైర్ను మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజీ ఎయిడెడ్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థినులు ఎం. మాన్యశ్రీ , ఏ. కౌశిక్ గైడ్ టీచర్ బి. టైటస్ సహకారంతో రూపొందించారు. అడ్జస్ట్ చేసుకునే టేబుల్, ఆటోమెటిక్గా సెన్సార్ ద్వారా తాగునీరు, హ్యాండ్వాష్ బేసిన్, లైట్, ఫ్యాన్తో పాటు కుర్చీని బెడ్గా మార్చుకునే విధానం బాగుంది. ఇటీవల చైన్నెలో వరదలతో ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తించిన విద్యార్థులు డి.మల్లిఖార్జున్, టి. విలియం కేరీ, సీహెచ్. శివ శంకర్ ఫ్లడ్ గేట్ ప్రాజెక్టుతో పరిష్కారం చూపించారు. పెదనందిపాడు మండలం అనపర్రు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నూతన ఆలోచనతో ఇంటి ముందు ఇనుప గేటును బిగించడం ద్వారా వరద నీరు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే మార్గాన్ని చూపారు. రైతన్నలకు అండగా నిలిచి పంటలను కోసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు పీఎస్ఎస్ జెడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులు షేక్ అర్షద్, కె.భావేజ్ రూపొందించారు. ట్రాక్టర్కు వెనుకవైపు రెండు వైపులా తిరిగే రంపాన్ని అమర్చి, దాని ద్వారా పొలంలో గడ్డిని, పంటను సులువుగా కత్తిరించవచ్చు. రైతు ప్రయోజనకారిగా దీనికి రూపకల్పన చేశారు. -
ఆర్వీఆర్జేసీలో నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్ ప్రారంభం
గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు అన్నదాతకు అండగా నిలవాలని, ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యవసాయ వృత్తిలో భాగస్వాములవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఐసీఏఆర్ నారమ్ ఏఐడీయా అడిషనల్ సీఈఓ డాక్టర్ విజయ్ తెలిపారు. చౌడవరంలోని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్.టి.పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో రెండు రోజుల పాటు జరగనున్న నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్–2025 సోమవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 66 జట్లు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, చిరుధాన్యాల రంగాల్లోని సవాళ్లకు సాంకేతిక పరిష్కార మార్గాలను సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యార్థుల నూతన ఆవిష్కరణల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాంకేతిక ఆవిష్కరణలను మరింత అభివృద్ధి చేసేందుకు డాక్టర్ విజయ్, కళాశాల సెక్రటరీ ఆర్ గోపాలకృష్ణలు ఎమ్వోయూ కుదుర్చుకుని ఒప్పంద పత్రాలను అందుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల నాబార్డ్ ఏసీఎం జి. శరత్ బాబు, ఢిల్లీ ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రాంనారాయణరెడ్డి, కళాశాల అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జె. మురళీమోహన్, ఎం. జగదీష్ , కళాశాల సెక్రటరీ ఆర్. గోపాలకృష్ణ, ట్రెజరర్ కె. కృష్ణప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్, డైరెక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, ఎం.వి.పి. చంద్రశేఖర్రావు, సీఈఓ ఆర్. హఫీజ్ బాషా, శోభ, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
సందడిగా వివా– వీవీఐటీయూ యువజనోత్సవం పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జాతీయస్థాయి యువజనోత్సవం (వీవా–వీవీఐటీయూ 2025–26) వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల యువజనోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు. ● వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు రోజుల యువజనోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని, మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని తెలిపారు. ● వీవీఐటీయూ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు విజయవంతంగా యువజనోత్సవాన్ని నిర్వహించారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు. ● ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ● ఈ వేడుకలో చాంపియన్ చిత్ర బృందం హీరో రోషన్, హీరోయిన్ అనస్వరా రాజన్ బృందం, వానర చిత్ర బృందం హీరో అవినాష్ తిరువీధుల, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. కార్యక్రంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, ఆధ్యాపకులు పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్
నగరంపాలెం: ఆన్న్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు కేసులో ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హోలులో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం టాస్క్ఫోర్స్ సమాచారంతో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వికాస్ నగర్ మూడో వీధిలోని ఓ డాబాపై ఆకస్మిక తనిఖీలు చేశారు. హాలులో ఇద్దరు టేబుల్ ఎదురు కూర్చొని ఉండగా, మరో ఆరుగురు ఫోన్లల్లో బెట్టింగ్లు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్ తొమ్మిదో మ్యాచ్ (సిడ్నీ థండర్/బ్రిస్బానే హార్ట్) బెట్టింగ్ నిర్వర్తించే క్రమంలో వీరందర్ని పట్టుకున్నారు. నిర్వాహకుడైన తాతినేని శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి, కొరిటెపాడు నాలుగో వీధికి చెందిన షేక్ సలీం అలియాస్ శ్రీను, తిరుమలశెట్టి నాగు, శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న కోటపాటి వెంకటరెడ్డి, పొన్నూరు రోడ్ సాయిబాబాకాలనీ ఒకటో వీధి వాసి దొడ్డా శ్రీకాంత్, బృందావన్ గార్డెన్స్ ఏడో వీధిలో ఉంటున్న జిల్లేలమూడి బ్రహ్మతేజ, నెహ్రునగర్ తొమ్మిదో వీధికి చెందిన పల్లె సుధాకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.60 లక్షలు, ఆన్లైన్లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్, ల్యాప్టాప్, ఎనిమిది సెల్ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో నల్లచెరువు మేనకగాంధీనగర్కు చెందిన తాతినేని శ్రీనివాసరావు గత పదేళ్లుగా ఆనన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కొరిటెపాడు పార్కు వెనుక ఉండే యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలసి శ్రీనివాసరావు బెట్టింగ్లు నిర్వహించే వాడని చెప్పారు. ఇద్దరూ ఒక బెట్టింగ్లను పలువురికి అలవాటు చేశారని, యాప్ల ద్వారా బాల్ టు బాల్ బెట్టింగ్ నిర్వహించే వారని వివరించారు. పేకాటలో మోసం అంతర్జాతీయ, జాతీయ, లీగ్ క్రికెట్ మ్యాచ్ల వేళ తాతినేని శ్రీనివాసరావు సెల్ఫోన్లో వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు సమాచారం చేర వేసేవాడని ఎస్పీ తెలిపారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ సంబంధించి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు పంపించి బెట్టింగ్లు చేసేవాడని వివరించారు. ఇదిగాక శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలిసిన వ్యక్తులతో పేకాట ఆడేవాడని చెప్పారు. ఇందులో సెల్ఫోన్, రిస్ట్ వాచీ, చెవిలో బ్లూ టూత్ ఉపయోగించి మిగతా ఆటగాళ్లను మోసగించేవాడన్నారు. ఆటగాళ్లకు ఫోన్పేల నగదు చెల్లించేవారని, వంద నుంచి పదివేల రూపాయల వరకు పందేలు ఉంటాయని తెలిపారు. అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ చెప్పారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ వెనుక ఎవరూ ఉన్నారనేది విచారిస్తున్నామని, గత పదేళ్లల్లో శ్రీనివాసరావుపై ఒక్క కేసు నమోదై ఉందని వెల్లడించారు. కేసుని ఛేదించిన డీఎస్పీలు అరవింద్ ( గుంటూరు పశ్చిమ), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), ఎస్ఐ నాగేంద్ర, పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
మాదక ద్రవ్యాలతో సమాజానికి పెనుముప్పు
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జేకేసీ కళాశాలలో నిర్వహించిన ‘‘రోటోఫెస్ట్–2025’’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికృష్ణ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ అనేది మానవాళి ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అనేక మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధులు మామిడి సుబ్బారావు, నంబూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రవి కిరణ్, ఏవీ హరనాథ్ బాబు, గార్లపాటి రవి కిరణ్, ముప్పవరపు వెంకట సత్యనారాయణ, పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు, ఈగల్ సీఐ విక్టర్, ఎస్సై సునీల్ బాబు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ -
ప్రతి గడపకు సంక్షేమం అందించిన జగన్
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. తొలుతగా 53 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో భారీగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నేతలు, యువకులు, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంతోష సంబరాల నడుమ ఒక పండుగ వాతావరణంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి పేద గడప ముందుకు సంక్షేమాన్ని పంపిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగన్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టారని, దానిలో భాగంగానే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏడాది రక్తదానం చేసే వారి సంఖ్య పెరుగుతోందని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఏకై క నేత వైఎస్ జగన్ అని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో సాటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఎంతో అవసరమని, అటువంటి పరిస్థితుల్లో ఎంతో మందికి ప్రాణదానం చేసేందుకు రక్తం ఇవ్వటం అభినందనీయమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో సభ్యుడి పుట్టినరోజుగా ఎంతో ఆప్యాయంగా జరుపుకుంటున్నారన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం, చదలవాడ రవీంద్రనాథ్, పఠాన్ సైదాఖాన్, సత్తెనపల్లి రమణీ, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, సీహెచ్ వినోద్, సీడీ భగవాన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, యేటి కోటేశ్వరరావు, కానూరి శశిధర్, భాను, ప్రభు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గుంటూరులో జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 240 మంది -
పోలియో చుక్కలతో నిండు జీవితం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు మెడికల్: రెండు పోలియో చుక్కల ద్వారా చిన్నారులకు నిండు జీవితాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాసతోట అర్బన్ పీహెచ్సీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారన్నారు. మొత్తం 4,406 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ బాబు తదితరులు పాల్గొన్నారు. -
క్రీస్తు చూపిన బాటలో నడవాలి
కొల్లిపర: ఏసు క్రీస్తు బోధనలను ఆచరించి, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషేన్ రాజు అన్నారు. తెనాలి నియోజవర్గ వైఎస్సార్ క్రాంగెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో కొల్లిపర గ్రామం మాయబజార్ సెంటర్లో తెనాలి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు పార్టీ ముఖ్య నేతలు నడుమ గ్రామ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులుగా తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహించారు. ముఖ్యఅతిథిగా కొయ్యే యోషేన్ రాజు మాట్లాడుతూ ఏసు జన్మదినం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టిన రోజున ఈ ప్రాంత ప్రజలు రెండూ కలిపి ఒకే రోజు జరుపుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఏసుప్రభువు దేవుడై ఉండి.. ప్రజలందరి రక్షణ నిమిత్తం ఈ లోకానికి వచ్చారన్నారు. మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ అనే సూత్రాలను క్రైస్తవులు పాటించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఏసు జన్మించడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథులతో చర్చి పాస్టర్లు, గ్రామ పార్టీ నాయకులు కలిసి సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. వందలాది మంది క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యఅతిథులను ఉన్నవ నాని కుటుంబసభ్యులు, ఇతరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం అనంతరం 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు, 150 మంది పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెద్దటి సురేంద్ర, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ తాడిబోయిన రాధికా రమేష్ , వైఎస్సార్సీపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కళ్ళం వెంటప్పారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉపసర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఎండ్రపాటి స్టాలిన్, ఉన్నవ నాని, కనపర్తి రంగరావు, అక్కిదాస్ కిరణ్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, బడుగు కాటయ్య, నాల్లాడి బుజ్జిబాబు, ఎంపీటీసీ ఝూన్సీ, పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అవుతు సాంబిరెడ్డి, వంగా సుజాత, మర్రెడ్డి బ్రహ్మరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, మోర్ల శ్రీను, భీమవరపు సంజీవరెడ్డి, బొల్లిముంత పోతురాజు, కళ్ళం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలుపట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా 53 కిలోల కేక్ను కట్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్తోపాటు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అనేక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో అంబటి రాంబాబు, నేతలు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని డివిజన్లలో కేక్ కటింగ్ నిర్వహించారు. పార్టీ కార్యకర్త గౌస్ ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక మహిళకు తోపుడు బండిని అందించారు. కార్యకర్త కుటుంబానికి కుట్టుమిషన్ అందజేశారు. తూర్పు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. నూరి ఫాతిమాతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో.. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేశారు. పట్టణంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు 70 మంది రక్తదానం చేశారు. 500 మందికి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. తెనాలి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల కేక్ను కట్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో... ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్తిపాడులోని వైఎస్సార్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బలసాని కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బలసాని ప్రారంభించారు. పెదనందిపాడు మండలంలోని వరగాని, జీజీపాలెం, నందిపాడు గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వస్త్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ తదితరులున్నారు. తాడికొండ నియోజకవర్గంలో.. తాడికొండ నియోజకవర్గ సమన్వయర్త వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాడికొండ అడ్డరోడ్డులో భారీ రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. పార్టీ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ హాజరయ్యారు. 180 మంది రక్తదానం చేయగా, వెయ్యి మందికి అన్నదానం చేశారు. లాం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మండలాల్లో అన్నదానాలు జరిగాయి. లాం, పొన్నెకల్లులో భారీ స్థాయి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్ళూరులో అన్నదానం, కేక్ కటింగ్ జరిగాయి. -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో కీలకపాత్ర
తెనాలి: సంఘ గుర్తింపు రద్దయినప్పటికీ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నామనీ, రాబోయే ఉద్యమాల్లో సంఘం కీలక పాత్ర పోషిస్తుందని తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా స్పష్టం చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ)గ్రూప్–సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్లో ఘనంగా ప్రారంభించారు. గ్రూప్–సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు, కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డీఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటి తరం కార్మికుల పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రూప్ ‘సి’ సంఘం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉద్ధతమైన పోరాటాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఎఫ్పీఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.పరాశర్ మాట్లాడుతూ అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్ ‘సి’ సంఘ గుర్తింపును కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులున్నా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పి–4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, పీ3, పీ4, జీడీఎస్ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా -
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్హామ్ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ ఇయర్ని పరిష్కరించుకుని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన మంగళగిరి సమీపంలోని హాయ్ ల్యాండ్లో మ్యూజికల్ నైట్ జరగనుందని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. మ్యూజికల్ నైట్లో మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ఈవెంట్లో విజయవాడ గుంటూరు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో న్యూ ఇయర్ వేడుకల పోస్టర్ను రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మ్యూజికల్ నైట్లో తనతోపాటు మరో 30 మంది సింగర్లు పాల్గొంటారని తెలిపారు. ఆరు వేల మంది పాల్గొనవచ్చని, టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నెహ్రూనగర్: ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో పౌర హక్కులు అడుగంటి పోతున్నాయని రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు నేడు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాదిమంది పోలీసు బలగాలని అడవుల్లో దింపి అక్కడ ఆదివాసుల జీవితాలను సర్వనాశనం చేస్తుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం వంటి చర్యలను నిలిపివేయాలన్నారు. జాయింట్ సెక్రెటరీ చిన్న మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పుతూ ఈ దేశ ప్రజల పైన మతదాడులు చేస్తుందన్నారు. జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో జరిగే పౌర హక్కుల సంఘం మహాసభలకు మేధావులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. వి ప్రభాకర్ ఎన్ నీలాంబరం, డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గెలుపును పంచడమే నిజమైన ఆట విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత గుంటూరు ఎడ్యుకేషన్ క్రీడలంటే పతకాలు కాదని, గెలుపును పంచడమే ఆటకు నిజమైన నిర్వచనమని విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత అన్నారు. వికాస్నగర్లోని వికాస్ క్రీడా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయన్నారు. మన అనే భావన క్రీడా స్ఫూర్తి ద్వారా పెంపొందించబడుతుందన్నారు. దేశానికి వన్నెతెచ్చిన ఎంతోమంది క్రీడాకారులు మీకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తొలుత డీసీపీ సరిత భాష్యం స్పోర్ట్స్ మీట్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన ఓపెన్ పరేడ్ లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీసీపీ సరిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈఓ లు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణంలో శానిటరీ సెక్రటరిగా విధులు నిర్వర్తిస్తున్న యువతి గుండెపోటుతో ఆదివారం మృతి చెందింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని 1వ వార్డు, పోలకంపాడు, పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో మేడూరి ప్రవల్లిక(30) శానిటరీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవల్లిక భర్త రాజకుమార్ కూడా ఇదే శాఖలో పనిచేస్తున్నారు. ప్రవల్లిక నిండు గర్భణి. గుండెపోటుతో మృతిచెందింది. ప్రవల్లిక మృతివార్త తెలుసుకున్న మున్సిపల్ అధికారులు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల లక్ష్మీపురం: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులను సాధించుకున్నది కమ్యూనిస్టు ఉద్యమం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్కుమార్ మాట్లాడారు. -
ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపింవేసిన గుర్తుతెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పార్టీ ఉండవల్లి కమిటీ అధ్యక్షులు వీర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా ఉండవల్లిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఒకేచోట, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ఎవరైనా వేరే పార్టీవారి ఫ్లెక్సీ ఉంటే మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని తొలగిస్తారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం దారుణమన్నారు. తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఇటువంటి విషయాలపై దృష్టి సారించి, ఫ్లెక్సీలు చించిన వారు ఏ పార్టీ వారు అయినా కఠినంగా శిక్షించాలని కోరారు. శనివారం రాత్రి 12 గంటలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి 2 గంటలకు చింపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎవరి ఫ్లెక్సీలకు వారే బాధ్యులు: సీఐ వీరేంద్ర ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అవి ఎవరు చించినా మాకు ఎటువంటి సంబంధం లేదని, ఫ్లెక్సీలు ఏ పార్టీ వారు ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీ వారే సంరక్షించుకోవాలని సీఐ వీరేంద్ర తెలిపారు. ఫ్లెక్సీలు తొలగిస్తే వెంటనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ మోడల్ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూశాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచడంతో పాటు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉపాధ్యాయుల మ్యాచింగ్ గ్రాంట్ సమస్యను పరిష్కరించడంతో పాటు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగోన్నతులను చేపట్టాలన్నారు. ఫిట్మెంట్ అమలుతోపాటు, పే ప్రొటెక్షన్, సర్వీస్ రూల్స్, సెలవు రోజుల్లో స్టడీ అవర్స్ తగ్గింపు, తెలుగు, హిందీ భాషా పండితుల అప్గ్రేడేషన్కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ముందు ఉంటుందని అన్నారు, ఏపీ మోడల్ స్కూల్స్ రాష్ట్రోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ స్టడీ అవర్స్ విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, స్లిప్ టెస్టులను నిర్వహించి, తక్షణ మూల్యాంకనం, మార్కులు ఆన్లైనంలో అప్లోడ్కు తగిన పమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెబ్ ఎక్స్ సమావేశాలను తగ్గించాలని కోరారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూ అధ్యక్షుడు పి.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శౌరిరాజు, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు ఎం.ప్రభుదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లెపు శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ మేరీ వేలాంగిణి, సీహెచ్ ఝాన్సీవాణి, పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి, మేరీ సూజన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
పెదకాకాని: అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జీవీఆర్ ప్రైమ్ హోటల్లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు మహిళలు, 9 మంది పురుషులు (విటులు), ఒక మేనేజర్, ఒక ఆర్గనైజర్ మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోనన్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునేందుకు పెదకాకాని పోలీసుస్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, పేకాట, వ్యభిచారం, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీలు వంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంహించేది లేదన్నారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు, నిర్వహించే వారు, వాటికి సహకరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
గుంటూరు
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు అలంకరించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తాడికొండలో కేక్ కట్ చేస్తున్న నియోజకర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు వెనిగండ్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ 7 -
మంగళగిరిలో యువత భారీ ర్యాలీ
మంగళగిరి టౌన్: జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి పాత మంగళగిరి వరకు, అక్కడి నుంచి జాతీయ రహదారిపై నుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ను నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కట్ చేశారు. సుమారు 800 మందికి పైగా వివిధ విభాగాల యువత పాల్గొని జగనన్న పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు పులగం సందీప్రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ గౌస్మొహిద్దీన్, మంగళగిరి మండల, పట్టణ, రూరల్ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపి, కె.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిన్నారి యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, కొల్లిపర మండల యువత అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల తాట తీయండి వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ తాడికొండ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాట తీస్తా చాలా మందికి రోమాలు లెక్కబెడతా అని మాట్లాడుతున్నాడని, ఆయన ఆ మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని అవినీతి, అక్రమాలు, భూ సెటిల్మెంట్కు పాల్పడుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల తాట తీయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ రక్తదాన, అన్నదాన శిబిరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో నిన్నే డబ్బులు అడిగిన మీ ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, అవినీతికి రసీదులు ఇచ్చి సంవత్సరానికి రూ.5–6 కోట్లు వసూలు చేస్తానని చెప్పిన మీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అమ్మాయిలను లోబర్చుకున్న జానీ మాస్టర్ లాంటి వాళ్ల తాట తీయాలని అన్నారు. కులాలు, మతాల పేరుతో దూషిస్తున్న జనసేన నాయకుల తాట తీయాలని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పరిగెత్తుకొని ముందుకెళుతుందని పవన్ అంటున్నారని 18 నెలల్లో రూ.2.65 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నందుకు అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళుతుందా అని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిపై పవన్ ఇష్టాను సారం మాట్లాడడం కాదని దమ్ము, ధైర్యం ఉంటే జగన్మోహన్రెడ్డి పాలనతో పోటీపడి ఆయన కంటే మెరుగ్గా పాలన చేయండి అంతే కానీ చావలేని మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా పాలన మీద, మీ ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకునేలా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్కు ఆయన సూచించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్) పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మట్టి మాఫియాకు ‘హైవే’
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా కాజ నుంచి ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ప్రధానకారణం అవుతోంది. వారి అవసరాల కోసం మట్టిని తరలించే క్రమంలో రాజధానిలో పూలింగ్కు ఇచ్చిన, ఇవ్వని భూముల్లో రాత్రి వేళ తవ్వి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా మాఫియా మట్టిని తరలించి జేబులు నింపుకొంటోంది. తాజాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు యర్రబాలెం శివారులోని కొత్త జాతీయ రహదారి వెంబడి ఆకుల శంకర్ అనే రైతు పొలంలో తవ్వకాలు జరిగాయి. నిన్నమొన్నటి వరకు ఆ పొలంలో మునగతోట, ఇతర కూరగాయలు సాగయ్యేవి. మంత్రి ఆదేశాలతో కాలువ... ఇటీవల రాజధానిలో వరద ముంచెత్తి చుట్టుపక్క ప్రాంతాలు నీళ్లతో నిండిపోవడంతో మంత్రి నారాయణ ఆకుల శంకర్ పొలంలో నుంచి కొండవీటి వాగుకు గండికొట్టించారు. సీఆర్డీఏ అధికారులు ఆ కాలువను పూడుస్తామని రైతుతో చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. గురువారం రాత్రి జాతీయ రహదారి కింది స్థాయి సిబ్బంది అడ్డుగా ఉన్న మట్టిని తొలగించాలని కొంతమంది లారీ యజమానులకు తెలిపారు. ఇదే అదునుగా ఆ మాఫియా మట్టిని తొలగించకుండా పూలింగ్కు ఇవ్వని ఆకుల శంకర్ పొలంలో మట్టిని బయటకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందడంతో రైతు తన పొలం దగ్గరకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ, పొక్లెయిన్ను సీజ్ చేశారు. జగనన్న కాలనీలోనూ... శంకర్ పొలం పక్కనే మరో నాలుగు అడుగుల గొయ్యి పెట్టి 20 సెంట్లపైన తవ్వేశారు. అక్కడి నుండి యర్రబాలెంలో ఉన్న జగనన్న కాలనీలో 20 ప్లాట్లలో ఉన్న మట్టి కుప్పలను రాత్రికి రాత్రే తరలించారు. ఇలా ఒక రాత్రిలో సుమారు వంద లారీల మట్టిని తరలించారు. ఇంత జరుగుతున్నా సీఆర్డీఏ అధికారులు గానీ, సంబంధిత కాంట్రాక్టర్లు గానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ఇప్పటికై నా మేల్కొని మట్టిమాఫియా ఆగడాలను అరికట్టాలని రాజధాని రైతులు కోరుతున్నారు. ఈ మాఫియాకి అండగా యర్రబాలెంకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు ఉన్నట్లు తెలియవచ్చింది. సీజ్ చేసిన లారీ, ప్రొక్లయిన్పై కేసు నమోదు చేస్తారా? వదిలేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. కాగా, మరోచోట మట్టి తవ్వకాలు నిర్వహించాక ప్రొక్లయిన్ను వంద మీటర్ల దూరంలో ముళ్ల కంచెల్లో మట్టి మాఫియా దాచిపెట్టింది. -
జగన్ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట
తెనాలి: ఉచిత బీమాతో ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు మళ్లీ సీజను వచ్చేలోగా పరిహారం అందచేసి ధీమానిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వ్యవసాయంలో సంస్కరణలకూ పెద్దపీట వేసింది. భారత ప్రభుత్వ సంస్థ ‘క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా’ 2021లో ‘ఇండి గ్యాప్’ ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావటం అందులో ఒకటి. కేంద్రప్రభుత్వ ‘గున్వత్తా సంకల్ప్’ పథకం కింద అమలవుతున్న ఈ కార్యక్రమం ఫలాలను గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని రైతులు అందుకున్నారు. శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం కై వసం.. ఈ అవకాశాన్ని జిల్లాలోని కొల్లిపరలో గల శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం అందుకుంది. ఈ సంఘంలో మొత్తం 300 మంది రైతులున్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ.18 వేల ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నారు. తొలి ఏడాది 24 మంది రైతులు ఆ ప్రమాణాల ప్రకారం 50 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. నిబంధనల ప్రకారం పది శాతం రసాయన ఎరువులు, 90 శాతం సేంద్రియ ఎరువులు వాడారు. నిషేధిత పురుగుమందుల వాడకుండా, ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచించిన విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించారు. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికెట్ను ఇచ్చింది. శ్రేష్ట కంపెనీ తరపున 24 మందికి ఇచ్చిన సర్టిఫికెట్లను అప్పట్లో విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి చేతులమీదుగా ఉయ్యూరు సాంబిరెడ్డి స్వీకరించారు. రైతులను ప్రోత్సహించేందుకని, వారు చెల్లించిన రూ.18 వేల ఫీజును ప్రభుత్వం తిరిగి రీయింబర్స్ చేసింది.. ఆ గుర్తింపుతో రైతుల పసుపును కేరళలోని ప్రముఖ ఆహారసంస్థ కొనుగోలు చేసింది. అప్పట్లో మార్కెట్లో ఉన్న ధరపై క్వింటాలుకు రూ.300–350 చొప్పున అదనంగా చెల్లించి మరీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత పసుపు సాగుచేసినా, ఆనాటి ప్రోత్సాహం ఇప్పుడు లేదంటున్నారు. -
మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తరణ అవసరం
ఏఎన్యూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ చేబ్రోలు: ప్రాంతీయ, మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్– భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అనువాద మోడళ్లు భాషా అవరోధాలను తొలగించి భాషల మధ్య అనుసంధానాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. ఒక భాషలోని సమాచారాన్ని మరో భాషలో వేగంగా, కచ్చితంగా అందించడంలో ఏఐ అనువాద సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, న్యాయం, పరిపాలన వంటి రంగాల్లో ఏఐ ఆధారిత అనువాద వ్యవస్థలు ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నాయన్నారు. గ్రామీణ మరియు అట్టడుగు వర్గాలకు జ్ఞానం, ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా ఏఐ అనువాద మోడళ్లు దోహదపడుతున్నాయని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్లో బహుభాషా సేవల అమలుకు ఏఐ అనువాద వ్యవస్థలు సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సీఎల్ఎల్ జయప్రద మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 భారతీయ భాషల ద్వారా విద్య, పరిశోధనలకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, అనువాద సాధనాల ద్వారా భారతీయ భాషల్లో జ్ఞాన వ్యాప్తి వేగవంతమవుతోందని అన్నారు. భారతీయ భాషల్లో పరిశోధనలు జరిగితే జ్ఞానం సమాజానికి మరింత దగ్గరవుతుందన్నారు. హైదరాబాద్లోని సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సురేష్ బాబు మాట్లాడుతూ వేద గణిత సూత్రాలను ఆధునిక భాషా మోడళ్లతో అనుసంధానించడం ద్వారా గణిత బోధన మరింత సులభంగా, వేగంగా మారుతోందని తెలిపారు. వేద గణిత పద్ధతులు మరియు ఆధునిక ఏఐ సాంకేతికత కలయిక విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో వేద గణిత డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా గణిత విద్య చేరువవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న భాషా నిపుణులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి భారతీయ భాషల అధ్యయనంలో ఆధునిక దృక్పథాలపై చర్చించారు. ఉత్తమ పరిశోధకులకు ప్రశంసా పత్రాలను అందజేసారు. -
క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
భాష్యం స్పోర్ట్స్ మీట్లో వక్తలు గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్నగర్లోని వికాస్ గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయన్నారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమన్నారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈ రోజు నా భర్త ఇలా ఉన్నారంటే ఆయన చలవే
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సమాజంలో వైద్యులను దేవుడితో సమానంగా ప్రజలు చూస్తారు. అలాంటి వైద్యుడికి ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాణాలు కాపాడారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ‘‘కరోనా రోజుల్లో నా భర్త నర్తు భాస్కరరావు అప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. నేను గుంటూరు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్నాను. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ 2021 ఏప్రిల్లో కరోనా బారిన పడ్డాం. కొద్దిరోజుల్లోనే కోలుకున్నా. నా భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంతోమంది మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మానవత్వంతో సహాయం చేశారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. కష్టాలు పడుతూనే వైద్యం అందించాం. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, మారిస్తేగానీ బతకరని తెలియడంతో చైన్నె తీసుకువెళ్లాలంటే ఎయిర్ లిఫ్టింగ్కే రూ. 26 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ కిమ్స్కు తీసుకువెళ్లాం. అక్కడ ఎక్మో దొరకడం ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. బ్రెయిన్డెడ్ అని నిర్ధారించి ఇంటికి తీసుకెళ్లమన్నారు. వైద్యురాలిగా బతికించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బతిమాలడంతో మరిన్ని పరీక్షలు చేసి మెదడు పని చేస్తుందని గుర్తించారు. హైదరాబాద్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. 40 రోజులు ఎక్మో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. జూన్ 4న ఆసుపత్రిలో చేరాం. జూలై 14న ఊపరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఊపిరితిత్తులు డోనర్ దొరకడానికి జాప్యం జరగడంతో 40 రోజులు ఎదురుచూశాం. ఆపరేషన్ సుమారు పది గంటలకు పైగా పట్టింది. మొత్తం ఖర్చు రూ. 1.17 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే మంజూరు చేసింది.వంద రోజులకుపైగా బెడ్పైనేఆపరేషన్ అనంతరం వంద రోజులకుపైగా బెడ్పై ఉంచారు. నరాలు చచ్చుపడిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రతి పని నేర్పించాను. ఊపిరితిత్తులు నూతనంగా అమర్చడంతో ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో డాక్టర్ భాస్కరరావు, నేను క్లాస్మేట్స్. 2001లో ఎంబీబీఎస్ అభ్యసించాం. ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో కూడా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. జగన్మోహన్రెడ్డి చేసిన సాయం మాకు ఊపిరిగా మారింది. ’’ -
కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు..
వైఎస్సార్ రైతు భరోసా : రూ. 46,000 వసతి దీవెన: రూ. 10,000 అమ్మ ఒడి: రూ. 42,000 సున్నా వడ్డీ: రూ. 2,800 విద్యా దీవెన: రూ. 42,500 వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ 18,000 జగనన్న తోడు: 20,000 వైఎస్సార్ ఆసరా: రూ.33,286 వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ. 87,000 మొత్తం: రూ. 3,01,586 -
జన గుండె చప్పుడు జగన్!
నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అన్ని రంగాలలో సమీకృత ప్రగతి జరిగేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. రెండేళ్లు కరోనా సంక్షోభం వెంటాడినా ఆయన వెనుకంజ వేయలేదు. కరోనా కాలంలోనూ ప్రజలందరికీ అండగా నిలబడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. వలంటీరు వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఇంటి ముంగిటకు సుపరిపాలన అందించడంలో సచివాలయ వ్యవస్థ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. వైఎస్ జగన్ తన పాదయాత్రలో లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలో కొత్తగా నరసరావుపేట, బాపట్ల కేంద్రాలుగా పల్నాడు, బాపట్ల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. పరిపాలన అందరికీ అందుబాటులోకి వచ్చింది. పలు పథకాలతో తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గుంటూరు నగరాన్ని కూడా రూ. 300 కోట్ల పనులతో అభివృద్ధి బాట పట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 872 గ్రామ సచివాలయాలు, 462 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, 11 వేల మంది సిబ్బందిని నియమించడం జరిగింది. గుంటూరు వైద్య కళాశాలకు మహర్దశ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వైద్య కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి నాడు–నేడు కార్యక్రమాల్లో భాగంగా వైద్య కళాశాలకు రూ. 500 కోట్లు మంజూరు చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎనిమిది నూతన పీహెచ్సీ భవనాల నిర్మాణం, 77 పీహెచ్సీల భవనాల ఆధునీకరణకు రూ.49.24 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 67,678 ఇళ్లు పేదలకు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కింద మరో 3,190 మందికి స్థలాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 65,719 ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. చంద్రబాబు పాలన వచ్చాక గృహనిర్మాణం అటకెక్కింది. పాత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసి క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అన్నింటిని అటకెక్కించింది. దీంతో ప్రజలు మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. -
కుటుంబానికి కొండంత అండ
ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మొబీన్సుల్తానా, షేక్ మస్తాన్ వలిలకు ఇద్దరు సంతానం. కుమార్తె మున్వర్ సుల్తానా, కుమారుడు సుభాని. చిన్న ఫ్యాన్సీ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కుమార్తెను ఇంటర్ చదివించారు. ఉన్నత చదువులు చదివిస్తే రూ.వేలల్లో ఖర్చు అవుతుందని భావించారు. ఆమెకు ఆసక్తి ఉండటంతో బీటెక్ చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కుమారుడి చదువు కూడా పది నుంచి ఇంటర్కు వచ్చింది. ఆ ఖర్చు భరించడం తన వల్ల అయ్యే పని కాదని మస్తాన్వలికి అర్థమైంది. ఏం చేయాలో పాలుపోని ఆయనకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఊపిరినందించాయి. ఇంట్లో ఉన్న నలుగురిలో ముగ్గురికి సంక్షేమ పథకాలకు అర్హత ఉండటంతో ఫలాలను పొందారు. తండ్రికి జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, కొడుకు ఇంటర్ చదువుతున్నందుకు తల్లికి అమ్మ ఒడి, డ్వాక్రా సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, కుమార్తెకు దివ్యాంగుల పింఛను, వైఎస్సార్ పెన్షన్ కానుకతోపాటు కళాశాల విద్య చదువుతున్నందుకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు వంటివి అందాయి. ఇవి కాక అదే ఇంట్లో ఉంటున్న మస్తాన్వలి తాత పెద్ద మొహిద్దీన్కు కూడా వైఎస్సార్ పెన్షన్కానుక కింద లబ్ధి అందింది. – ప్రత్తిపాడు -
ఆధునిక విద్యాప్రదాత జగనన్న
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారు. పాఠశాలలను ఆధునిక బాట పట్టించేందుకు ఆయన అమలు పరిచిన మనబడి నాడు–నేడు చరిత్రను తిరగరాసింది. మొదటి విడతలో గుంటూరు జిల్లాలోని 380 పాఠశాలలను రూ.68.88 కోట్ల వ్యయంతో సకల వసతులతో తీర్చిదిద్దారు. రెండో దశలో 563 పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.215.75 కోట్లతో పనులు ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 165 పాఠశాలల్లో కొత్తగా 656 అదనపు తరగతి గదులు అందుబాటులోకి తెచ్చారు. బ్రాండెడ్ మెటీరియల్ దశాబ్దాల తరబడి మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బ్రాండెడ్ మెటీరియల్ను ఇచ్చి పనులు చేయించిన గత ప్రభుత్వం ప్రతి పాఠశాలకు కనీసంగా రూ.25 లక్షలు మొదలు అత్యధికంగా రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేసింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. టాయిలెట్లలో ఏర్పాటు చేస్తున్న మెటీరియల్ అంతా బ్రాండెడ్దే కావడం విశేషం. విద్యార్థులు తరగతి గదిలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్లు, ప్రతి తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లతో పాటు బ్లాక్ బోర్డుల స్థానంలో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) ల ద్వారా ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులను బడి బాట పట్టించేలా వసతులు వచ్చాయి.జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. గతంలో నేలపై కూర్చునేవాళ్లం. జగన్ మావయ్య సీఎం అయ్యాక పాఠశాలను డెవలప్ చేసి, మాకు కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్లు ఇచ్చారు. యూనిఫామ్తోపాటు బూట్లు, బెల్టు, సాక్సులు, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్.. ఇలా అన్నీ ఇచ్చారు. అమ్మకు జగనన్న అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం చేశారు. గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టి రుచికరమైన భోజనం అందించారు. గతంలో టాయిలెట్కు వెళ్లాలంటే ముక్కు మూసుకునే పరిస్థితుల్లో టాయిలెట్లను ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. జగన్ మావయ్య ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుండేవి. – ఎంవీఎన్ సాయి వైష్ణవి, కల్లం అంజిరెడ్డి జెడ్పీ హైస్కూల్, తాడేపల్లి జగన్ మావయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా స్కూల్లోనే అమ్మ ఒడి పథకం ప్రారంభించారు. ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నా. 2022 సంవత్సరంలో మా పాఠశాలలో నాడు–నేడు పనులు జరిగాయి. నేను 9,10 తరగతుల్లో ఉండగా, చెట్టు కింద కూర్చుని చదువుకున్నాం. టెన్త్ పూర్తి చేసే సమయానికి స్కూల్లో కొత్త భవనాలు నిర్మించారు. నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన మా పాఠశాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మేం చదువుకునే సమయంలో ఆడుకోవడానికి స్కూల్లో మైదానం కూడా సరిగా లేదు. జగన్ మావయ్య వచ్చిన తర్వాత స్కూలు గ్రౌండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. – షేక్ షణమ్, పెనుమాక జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థిని -
వైఎస్ కుటుంబం చలవతోనే వైద్య విద్య
నా పేరు షేక్ ఖాదర్ అఫ్రిది. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామం. తండ్రి షేక్ సుభాని రోజు వారి కూలీగా పనిచేస్తారు. అమ్మ హుస్సేన్బీ గృహిణి. సోదరికి వివాహమైంది. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన నేను ఉన్నత చదువులతో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కన్నా. ఆ కలలు నిజం కావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంతో తోడ్పడింది. నీట్లో 4,700 ర్యాంక్ సాధించిన నాకు ముస్లింలకు వైఎస్ఆర్ తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ వలనే శ్రీకాకుళం రిమ్స్లో 2019లో కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు, హాస్టల్ ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. సంవత్సరానికి రూ.45 వేల వరకు ప్రభుత్వం అందజేసింది. వైద్య విద్య చదివేందుకు తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడలేదు. ప్రస్తుతం రిమ్స్లో ఇంటర్న్షిప్ చేస్తున్నా. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఎస్ కుటుంబ సహకారం మరువలేనిది. నాలాంటి ఎంతో మంది నిరుపేదలకు డాక్టర్ కలను సాకారం చేసిన వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ఆయన వందేళ్లు చల్లగా బతకాలి. – షేక్ ఖాదర్ అఫ్రిది, చినతురకపాలెం గ్రామం, నరసరావుపేట మండలం -
భారీ వాహనాలను నిషేధించాలి
నంబూరుతోపాటు కాజా గ్రామంలోని ఇతర రహదారుల్లో రాత్రి సమయంలో టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల వల్ల గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా నంబూరు – కాజ రోడ్డు అధ్వానంగా మారింది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి మార్జిన్ దగ్గర ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాల పాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని వెడల్పు చేయాలి. భారీ వాహనాలతోపాటు టిప్పర్లను గ్రామంలోకి రాకుండా నిషేధించాలి. – కంకణాల శంకర్, జనసేన సీనియర్ నేత -
నేరెళ్లవాగుపై కుంగిన చప్టా
ఫిరంగిపురం: మండల కేంద్రం ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి దారిలో అల్లంవారిపాలెం దాటిన తరువాత నేరెళ్లవాగుపై దశాబ్దాల కిందట నిర్మించిన చప్టా శుక్రవారం ఉదయం కొంత భాగం కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలల కిందట చప్టా నెర్రెలిచ్చి ఉండటం గమనించి ‘ప్రమాదం మాటున ప్రయాణం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురించింది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఫిరంగిపురం నుంచి అల్లంవారిపాలెం, 113.తాళ్లూరు, శిరంగిపాలెం, తక్కెళ్లపాడు, కొమెరపూడి, కంటిపూడి గ్రామాల మీదుగా సత్తెనపల్లి దగ్గరి దారి కావడంతో ఎక్కువ మంది కార్లు, లారీలు, ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తుంటారు. చప్టా కుంగిపోవడంతో పూర్తిగా కార్లు, బస్సులు, లారీలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పట్టించుకోని అధికారులు నిలిచిన వాహనాల రాకపోకలు -
కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేంద్రబాబు, రాఘవయ్య
కొరిటెపాడు(గుంటూరు): ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా కేఎస్ రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎస్వీ కోల్డ్స్టోరేజ్కి చెందిన పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా శ్రీ మంజునాథ కోల్డ్ స్టోరేజ్కి చెందిన కేఎస్ రాఘవయ్యలతో పాటు కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా కె.అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా వి.వెలుగొండారెడ్డి, జుగిరాజ్ భండారి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టి.గోపాలరావు, మానం శ్రీనివాసరెడ్డి, బి.పేరయ్య, ఎ.సుబ్బారావు, శ్రీపాల్ భండారిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు సురేంద్ర బాబు, రాఘవయ్యలు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న టీఎస్ ప్రకాశరావు కాలం చేసిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని వెల్లడించారు. రాబోయే రెండు సంవత్సరాలు కాలంలో అసోసియేషన్ కలిసికట్టుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ తమ వద్ద పనిచేసే వందలాదిమంది కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
ముందుకు సాగని రబీ సాగు
ముగిసిన మంచి శనగ సాగు సీజన్... జొన్న, మొక్కజొన్న, మినుము సాగుకు అదును.. జిల్లా వ్యాప్తంగా 32.71 శాతం మేర పంటల సాగు వరుస తుపాన్లు, అధిక వర్షాలే ఇందుకు కారణం 65,295 హెక్టార్లకు గాను 21,356 హెక్టార్లలోనే సాగు మినుము, జొన్న, మొక్క జొన్న సాగు అంతంతే.. జిల్లాలో పంటల సాగు (హెక్టార్లలో..) -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన అన్నారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో శుక్రవారం 28వ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసూన మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, మేటి క్రీడాకారిణిలుగా ఎదగాలని సూచించారు. సాంతిక విద్యాశాఖ ఆర్జేడీ వి.పద్మారావు మాట్లాడుతూ ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీలకు ఎస్వీయూ ప్రాంతీయ ఆర్జేడీ ఎ.నిర్మల్కుమార్ ప్రియ కన్వీనర్గా వ్యవహరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో విజేతలు వీరే వాలీబాల్లో సెయింట్ మేరీస్ (బుడంపాడు), ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), షాట్పుట్లో ఎం.సాయిజ్యోతి, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), పి.దివ్యాజంలి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), లాంగ్ జంప్లో బి.రుచిత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), డి.ప్రియాంక, సెయింట్ మేరీస్ (బుడంపాడు), డిస్క్త్రోలో ఎం.సాయి ఖాద్యోత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), వై. వైష్ణవి, సెయింట్ మేరీస్ (బుడంపాడు), చదరంగంలో టి. తన్మయ రెడ్డి, ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (గుంటూరు), ఎస్. త్రిష రెడ్డి (బాపట్ల పాలిటెక్నిక్), టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో ఎస్. సుస్మిత, సెయింట్ మేరీస్ (బుడంపాడు), శ్రీ సాహితి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), డబుల్స్లో ఎస్.సుస్మిత, పి.భవ్య, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), ఎం.నందిని, కె.షెరిష్మా సెయింట్ మేరీస్ (బుడంపాడు) విన్నర్, రన్నర్లుగా నిలిచారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ ప్రసూన పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులకు క్రీడా పోటీలు -
అడుగడుగుకో గొయ్యి!
తాడేపల్లి రూరల్ : మంగళగిరి నియోజకవర్గంలోని కాజ, పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరుల మధ్య రహదారి అధ్వానంగా మారింది. దాదాపు 3.5 కి.మీ. పొడవున ఈ రహదారి ఉంది. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు, కార్లలో, ఆటోల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే రహదారిలో గుంటూరు చానల్పై బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ రుసుం తప్పించుకోవాలని.. ఈ మార్గంలో నిత్యం నంబూరుతోపాటు గోళ్లమూరు, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కాజా వద్ద టోల్గేటు రుసుం చెల్లించాల్సి వస్తుందని భారీ వాహనాలు ఈ రోడ్డులో వందల సంఖ్యలో రాత్రీపగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. రోడ్డు పొడవునా రెండువైపులా పంట కాలువ డ్రైనేజీలు ఉండడంతో మార్జిన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎదురుగా వాహనం వస్తే మార్జిన్ దిగాలంటే భయమేస్తోందని వాహనదారులు తెలిపారు. కాజ గ్రామంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ వరకు రోడ్డు గజానికొక గొయ్యి ఉంది. భారీగా దుమ్ము లేవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నుంచి ఈ రహదారి వెళుతుండడంతో రోడ్డు పక్కనే ఉన్న నివాసాల్లో దుమ్ము చేరుతోంది. అనారోగ్యం పాలవుతున్నామని కాజ గ్రామస్తులు వాపోతున్నారు. భారీ లారీలతో ... గుంటూరు చానల్పై బ్రిడ్జి సైడు ఐరన్ గడ్డర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కింద పిల్లర్లు సైతం ధ్వంసం అయ్యాయి. రోజూ ఈ రోడ్డులో ట్రాన్స్పోర్ట్ లారీలతో పాటు 50 టన్నుల లోడ్తో కంకర, మట్టి టిప్పర్లు తిరుగుతున్నాయి. ఈ వాహనాల వల్ల బ్రిడ్జి మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆ బ్రిడ్జిని నిర్మించి, రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘ఆదర్శ్ 2025 – స్పోర్ట్స్ ఫర్ హార్మనీ‘ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. రవినాయుడు మాట్లాడుతూ చదువు ఒక్కటే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 15 క్రీడా అంశాలపై స్పోర్ట్స్మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రీడల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళాశాలగా హిందూ కళాశాల పేరు పొందిందని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్, ఏపీ శాప్ సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎస్వీఎస్.సోమయాజి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కె.రవి పాల్గొన్నారు -
నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష
● ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఏటా ఉచిత మెటీరియల్ ● ఈ ఏడాది ప్రశ్నార్థకంగా పంపిణీ ● గత వైఎస్సార్ సీపీ పాలనలో నిరాటంకంగా అందజేత ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 వేల మంది విద్యార్థులు ● ‘అల్పాహారం’ కూడా లేక అవస్థలుగత ప్రభుత్వంలో నిరాటంకంగా.. అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సిద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు వారు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో నెట్టుకువస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి వస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్బంధంగా అమలు చేస్తోంది. వారి ఆకలిని మాత్రం మరిచిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10,384 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది కూడా జిల్లా పరిషత్ ద్వారా నెల రోజులు మాత్రమే అమలు చేశారు. విద్యార్థికి రూ.10 చొప్పునే కేటాయించారు. ఈ సారి కనీసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. మరోవైపు అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. చంద్రబాబు పాలనలో పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు... బాలలకు ఆ మేరకు వసతులు కల్పించడంలో చేతులెత్తేసింది. కనీసం ప్రణాళిక కూడా లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ విద్యార్థులను అర్ధాకలితో అలమటింపజేస్తోంది. స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అదనపు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడానికీ చంద్రబాబు సర్కారుకు మనసు కూడా రావడం లేదు. -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.42 లక్షలు స్వాహా
నగరంపాలెం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ హెడ్మాస్టర్ను మోసగించిన ఐదుగురిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. కాకుమాను పీఎస్ పరిధిలోని కొమ్మూరుకు చెందిన మోపర్తి మేరీ మంజులవాణి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్డు కాగా వచ్చిన నగదు, నెలనెలా పెన్షన్ డబ్బులను ఆమె బ్యాంక్ ఖాతాలో దాచుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న గుర్తుతెలియని ఓ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ముంబాయి సీఐడీ అధికారులమని నమ్మించినట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణా కేసులో ఒకర్ని అరెస్ట్ చేశామని, అందులో మీ పేరు ఉందని చెప్పి బెదిరించినట్లు పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని, డిజిటల్ అరెస్ట్ లేకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించాలని ఐదు రోజులు ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేయగా ఆమె బెదిరిపోయి బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లుగా రూ.42 లక్షలను రెండు ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. గత నెల ఏడో తేదీన ఆమె కాకుమాను పీఎస్లో ఫిర్యాదు చేశాయగా ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను పీఎస్ ఎస్ఐ ఏకనాథ్ దర్యాప్తు చేపట్టారు. రెండు బ్యాంక్ ఖాతాల్లో జమ.. రెండు బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన రూ.42 లక్షల్లో రూ.22 లక్షలు గతనెల ఒకటిన విశాఖపట్నంలోని ఇంద్రప్రస్థ హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్ మరపు సురేష్నాయుడు ఖాతాకి జమ అయినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మరపు సురేష్నాయుడ్ని విచారించగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించాలని ఇంటర్నెట్ ద్వారా కార్పొరేట్ అకౌంట్లను మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించి కమీషన్ తీసుకునేలా వ్యవహరించినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో హిందూపురం వాసి లక్ష్మణ్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి మోహన్ ద్వారా కాకినాడకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్, కారే స్టీవెన్న్లను పరిచయం చేసుకున్నారని అన్నారు. వీరి ద్వారా ఆగ్రాకు చెందిన మోహిత్ శిఖర్వార్(టేకి) అనే వ్యక్తితో మాట్లాడి, ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం ఇండోర్, జైపూర్ వెళ్లి, కార్పొరేట్ అకౌంట్కు డిజిటల్ అరెస్ట్ ద్వారా వచ్చిన నగదును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారని చెప్పారు. దీంతో సురేష్నాయుడు, పార్వతీపురం జిల్లాకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్, ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన మోహిత్ శిఖర్వార్, అనకాపల్లి జిల్లాకు చెందిన కారే స్టీవెన్, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు చెందిన పొదల మోహన్ అరెస్ట్ చేశారని వివరించారు. వారి నుంచి మూడు స్మార్ట్ఫోన్లు, రూ.50 వేలు, ఇంద్రప్రస్థ కార్పొరేట్ అకౌంట్ కిట్ను సీజ్ చేసుకున్నట్లు వెల్లడించారు. కంబోడియా దేశానికి చెందిన ఫోన్ నంబర్లుగా గుర్తించామని అన్నారు. అక్కడ్నుంచి ఇటువంటి సైబర్ నేరాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కేసులో మిగతా వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. దక్షిణ డీఎస్పీ భానోదయ, ప్రత్తిపాడు పీఎస్ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ నిస్సార్బాషా, కాకుమాను పీఎస్ ఎస్ఐ ఏకనాథ్, హెచ్సీలు జె.జె.నరసింహారావు, కె.చిరంజీవి, రాజాకిశోర్, కానిస్టేబుళ్లు ఎం.అశోక్, జి.ఖజాకరీమా, రాము, ఎస్కె.ఇమామ్, యాసిన్, ఉపేంద్రసాయిని అభినందించి, ప్రశంసపత్రాలను అందించారు. ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలు బలోపేతం ప్రత్తిపాడు: ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందని గుంటూరు జిల్లా డీఈవో షేక్ సలీం అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాద్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) పై మూడు రోజుల పాటు నిర్వహించిన బూట్ క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ● ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ప్రారంభించిన ఈ బూట్ క్యాంప్ ఎంతో విలువైనదన్నారు. సాంకేతికంగా రోజురోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమను తాము మెరుగు పరుచుని సాంకేతికంగా ధృఢం అయ్యేందుకు క్యాంప్ ఉపకరిస్తుందన్నారు. ● కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ క్యాంపస్లో అవిఘ్నంగా బూట్ క్యాంప్ జరిగిందన్నారు. తమ కళాశాలను నోడల్ సెంటర్గా ఎంపిక చేసిన ఏఐసీటీఈ, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ● కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నవీనత, డిజైన్ థింకింగ్, పారిశ్రామిక నైపుణ్యాలను పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్తో కలిసి జాతీయ స్థాయిలో ఐడిఇ బూట్ క్యాంప్ను నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కె. శేఖర్, డైరెక్టర్ కె. హరిబాబు, అరుణ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశ్రాంత హెచ్ఎంను మోసగించిన ఐదుగురు అరెస్ట్ మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు -
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సేకరించారు. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తొలి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. సైనికుల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల తదితరులు పాల్గొన్నారు. నేడు ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గ్రామ, మండల స్థాయి నుంచి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమర్థంగా ప్రణాళికతో, సమన్వయంతో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్య విలువలను ప్రోత్సహించేందుకు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
భారతీయ భాషల వినియోగాన్ని విస్తృతం చేయాలి
చేబ్రోలు: ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు భారతీయ భాషల వినియోగాన్ని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్–భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో ముందుగా ‘భారతీయ భాషా పరివార్–ఏ న్యూ ఫ్రేమ్ వర్క్ ఇన్ లింగ్విస్టిక్స్’, ‘భారతీయ భాషా పరివార్–పర్సప్షన్ అండ్ హారిజన్స్’ అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ● రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతి రావు మాట్లాడుతూ భారతీయ భాషలు, సాహిత్యం, తత్వశాస్త్రం కేవలం గతానికి చెందినవిగా కాకుండా, నేటి సమాజానికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే శక్తిని కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. ● జాతీయ విద్యా విధానం–2020లో మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భాషా అధ్యయన రంగంలో విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు. ● నెల్లూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సంపత్కుమార్ మాట్లాడుతూ స్థానిక భాషల్లో పరిశోధనలు జరగడం వల్ల జ్ఞానం సమాజానికి మరింత చేరువవుతుందని అన్నారు. ● కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీమ్ రావ్ భోసాలే మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక భాషా సాధనాల వినియోగం ద్వారా భారతీయ భాషలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భాషా వైవిధ్యమే భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు బలమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్, డీన్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతిరావు -
● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే పాఠశాలకు డిప్యూటేషన్పై పంపారు. పిల్లలను చేర్పించడంపై దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి పట్టిందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంటున్నారు. – ప్రత్తిపాడు -
జయహో జగన్
పొన్నూరు/తాడేపల్లి రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమంలో నిరంతరం పాల్గొని, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలకు అండగా ఉండటంలో పార్టీ నాయకులు ముందుండాలని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి నాలుగు లక్షల సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో గురువారం జగనన్న వెంట నడిచేందుకు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో పొన్నూరు మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మండల వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు రుద్రపాటి నాగేశ్వరరావు, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు తురిమెళ్ళ రాజశేఖర్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మరియరాణి, నాయకులు షేక్ నాజర్, డక్కుమల్ల రవి, షేక్ షరీఫ్, కాలింత సునీల్, పెరికల చైతన్య, దేవరకొండ గోపి, కాలింత రమేష్, పెదకాకాని చేబ్రోలు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరలివచ్చిన మంగళగిరి నాయకులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల వద్ద సంతకాలు సేకరించారు. గురువారం ఆ పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేసే కార్యక్రమానికి పిలుపునివ్వడంతో మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకట కృష్ణ, అమరా నాగయ్య, దుగ్గిరాల అధ్యక్షుడు శివగోపయ్యల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పాదయాత్రగా కార్యకర్తలతో వైఎస్సార్సీపీ కార్యాలయానికి దొంతిరెడ్డి వేమారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యతోపాటు వైద్యవిద్యను ఉచితంగా అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. కాసుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని, ప్రైవేటు వ్యక్తులకు బహుమతిగా ఇచ్చినందుకు టీడీపీ నాయకులు భారీగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. సంబంధిత జీవోను పరిశీలిస్తే మెడికల్ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి సైతం రెండు సంవత్సరాలు జీతాలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము చంద్రబాబు అనుయాయులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమైన విషయమని అన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి, మంగళగిరి పట్టణ రూరల్, దుగ్గిరాల మండల వైఎస్సార్సీపీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు గుంటూరు రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్కు అందజేసేందుకు నియోజకవర్గం నుంచి విజయవాడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమం అనంతరం అక్కడి స్వరాజ్ మైదాన్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో గురువారం బలసాని కిరణ్కుమార్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం
ఫిరంగిపురం: బాల ఏసుకు జన్మనిచ్చిన మరియ మాత తన పుత్రుడిపై చూపే ప్రేమను గుర్తుకు తెచ్చే మహిమాన్విత పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాల ఏసు దేవాలయం. ఎత్తయిన గోపురంతో ఎలాంటి ఆధారం లేకుండా లండన్ మిల్హిల్కు చెందిన విచారణ గురువు ఫాదర్ డిక్మన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. అందుకే రాష్ట్రంలోనే ఎత్తయిన బాల ఏసు కథెడ్రల్ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు ప్రాంతాల నుంచి మత గురువులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో క్రీస్తు జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. ఈ ఆలయానికి విచారణ గురువులుగా వచ్చిన అనేక మంది ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో గ్రామాభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులలో భాగంగా వ్యాకుల మాత విగ్రహం, బెల్ టవర్, పునీత గురువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్ర ఇదీ... 18 శతాబ్దంలో కథోళిక సంఘం ఫిరంగిపురంలో ఏర్పాటు చేశారు. కొండమెట్లకు వెళ్లే దారిలో చిన్న ఆలయం ఉండేది. దానికి విచారణ గురువులుగా లండన్ మిల్హిల్కు చెందిన థియోడర్ డిక్మన్ వచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆయన బాధపడ్డారు. 1888లో ఆలయ పునర్నిర్మాణానికి తన సొంత నిధులను వెచ్చించి శంకుస్థాపన చేశారు. 1891 నాటికి అద్భుతంగా బాల ఏసు దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయం పూర్తిగా ఫ్రెంచి నిర్మాణ శైలిలో ఉండటం విశేషం. ఆలయం పైభాగంలో ఉన్న డోమ్కు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా దీనిని నిర్మించారు. పండుగకు సర్వం సిద్ధం క్రిస్మ్స్ సందర్భంగా 15వ తేదీ నుంచే ఆలయంలో నవ దిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 23న సహాయ విచారణ గురువు కె.సాగర్ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. 24న బాల ఏసు దేవాలయ విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి మహోత్సవాలు, దివ్యపూజాబలి ఉంటాయి. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దివ్యపూజాబలి నిర్వహిస్తారు. 25న విచారణ క్రైస్తవుల ఆత్మ శరీర మేలు కోసం దివ్యపూజాబలి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన యాజకులుగా ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్లు వ్యవహరిస్తారు. రాత్రి బాల ఏసు కథెడ్రల్ దేవాలయ రథోత్సవం (తేరు ప్రదక్షిణ) నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలలో మఠకన్యలు, గుడి పెద్దలు, సోడాలిటీ సభ్యులు, మరియ దళ సభ్యులు, కథోళిక సంఘ సభ్యులు కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శివరామకృష్ణ తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఇప్పటికే తాము పరిశీలించామన్నారు. ఆలయం లోపలి భాగం ఫాదర్ డిక్మన్ విగ్రహం -
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
ప్రత్తిపాడు: నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి అన్నారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో గురువారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, సాగు చేయవద్దని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 740 జారీ చేసిందని, అతిక్రమించి సాగు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. టాస్క్ఫోర్స్ టీంలు, ఆర్ఎస్కే సిబ్బంది నల్లబర్లీ సాగు చేయవద్దంటూ అవగాహన కల్పిస్తున్నా, కొందరు రైతులు వినడం లేదన్నారు. అందుకే గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలను జిల్లా టాస్క్ఫోర్స్ టీంకు పంపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆమె వెంట మార్క్ఫెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్రావు, తహసీల్దార్ ఉన్నారు. మాచర్ల: మాచర్ల బస్టాండ్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. పాత మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కొండవీటి రాఘవాచార్యులు, అధ్యక్షులు భవనాశి వెంకటేశ్వర్లు, పట్టణంలోని ప్రధాన వీధిలోని కోదండ రామాలయంలో అర్చకులు కొండవీటి వేణుగోపాలాచార్యులు, అధ్యక్షులు బచ్చు రామారావులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అమృతలూరు(భట్టిప్రోలు):గోవాడలోని గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కోటి కుంకుమార్చన, సామూహిక లలితా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఎస్ఎస్ఎఫ్ బాపట్ల దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు, ఎక్స్అఫిషియో సభ్యులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉపముఖ్య అర్చకులు చావలి శ్రీధరశర్మ, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. అన్నదానం కూడా చేస్తున్నట్టు వివరించారు. తాడికొండ: మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2025 నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. ఆనంద్ ఈ చెస్ వింగ్స్, ఏపీసీఏ విభాగం, గుంటూరు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల నుంచి ఏ వయసు వారైనా పాల్గొనవచ్చన్నారు. ఎంట్రీ ఫీజు రూ.500 అని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు, భోజన వసతి ఉంటుందన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నల్లాని వెంకట రామారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని శ్రీ కట్లమ్మతల్లి పరివార దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట ఈ నెల 23న జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది.ఆరుగాలం కష్టపడిన రైతన్నలు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర రాక అప్పుల పాలు కావడంతో మృత్యువును ఆశ్రయిస్తున్నారు. కొందరు పొలాల్లో ఉరికొయ్యలకు వేలాడుతుండగా, మరికొందరు సాగు చేసిన భూమిలోనే పురుగుమందు తాగి తనువు చాలిస్తున్నారు. జిల్లాలో ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.7 -
పరిశోధన ప్రణాళికపై వర్క్షాప్
గుంటూరు రూరల్: హైదరాబాద్కు చెందిన ఐసీఏఆర్ జాతీయ నూనెగింజల పరిఽశోధన సంస్థ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో గుర్తించిన వ్యవసాయ ప్రాముఖ్యత అంశాల ఆధారంగా పరిశోధన ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్రస్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. గురువారం నగర శివారులోని లాంనందున్న విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జాతీయ పరిశోధన స్థానాలకు చెందిన ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ పశుసంవర్ధక, ఉద్యాన శాఖల ప్రతినిధులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐఐఓఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే మాధుర్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలకు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు, మామిడి తదితర పంటల్లో పరిశోధన, విస్తరణ అవసరాల ఆధారంగా తయారు చేసిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఆర్కు పంపుతామన్నారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ పంటల్లో అవసరమైన కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, నైపుణ్యం, కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. శాక్ విద్యార్థి తనువుద్ధి నవ్య మాట్లాడుతూ, వీవీఐటీ నిర్వహించే యువజనోత్సవం వివా వీవీఐటీయూ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువజనోత్సవంలో పాల్గొనే విద్యార్థులు వివావీవీఐటీ.కామ్ వెబ్సైట్ నందు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే పాలన విజయవంతమవుతుందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ‘సూపర్ సిక్స్‘ హామీలను పక్కన పెట్టి ‘సూపర్ సక్సెస్’ అని చెప్పుకోవడం ఆత్మ సంతృప్తికి తగదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఉపాధి భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఆ హామీ అమలులో ఎందుకు వెనుకంజ వేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగరకార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు. నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు -
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్ను అభినందించారు. కార్యక్రమంలో మహతి క్యాంపస్ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
తెనాలి నుంచి పెద్దాపురానికి ధాన్యం రవాణా
తెనాలి: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుంచి తొలిసారిగా రైల్వేర్యాక్తో 30 వ్యాగన్ల ధాన్యాన్ని బుధవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్కు తరలించారు. తెనాలి రైల్వేస్టేషన్కు లారీల్లో చేర్చిన ధాన్యాన్ని వ్యాగన్లలో లోడు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు కె.తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్టు తెలియజేశారు. ఇందుకుగాను రూ.63 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. తెనాలి నుంచి రైల్వే ర్యాక్లో ధాన్యం రవాణా ఇదే ప్రథమంగా చెప్పారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్డు మార్గాన తరలివెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్మిల్లర్లు సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ–5204 ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపర మండలాల వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. -
కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 2026 మార్చి 1వ తేదీ నుంచి కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏ, వెలుగు సౌజన్యంతో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే జనవరి 22 వరకు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరగుతోందని, జూట్ ప్రొడక్ట్స్లో వచ్చే జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు 19 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని స్పష్టం చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనంతో పాటు, వసతి కల్పించడం జరుగుతోందని వివరించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఓల్డ్క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు, 0863–2336912, 8125397953, 9700687696 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు జిల్లాలో 474 మందికి కౌన్సెలింగ్ నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్, ఇష్టానుసారంగా మోటారుసైకిళ్లను నడిపే వారిని గుర్తించే ప్రత్యేక డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఈవ్టీజింగ్కి పాల్పడిన 260 మంది, బైక్ పోటీలు, బైక్లపై వంకర్లుగా వెళ్తూ మిగతా చోదకులను ఇబ్బందులకు గురిచేసే 214 మందిని గుర్తించారు. ఈ మేరకు వారికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. స్కూళ్లు, కళాశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, థియేటర్లు, రైల్వే/బస్టేషన్లు వద్ద డ్రైవ్ కొనసాగింది. ఈవ్టీజింగ్, బైక్ పోటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి డీడీఓలను ఆశ్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు, బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత, సర్వీసు రూల్స్, ఫిర్యాదులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) ద్వారా పరిష్కరించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీవో స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, ఫిర్యాదులను డీఈవో, ఆర్జేడీకి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పీల్స్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులను సంప్రదించిన పక్షంలో సీసీఏ నిబంధలన ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
కొనసాగిన ఐటీహెచ్పీబీఏబీ గ్లోబల్ కాన్ఫరెన్స్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్స్ కాన్ఫరెన్స్ రెండవ రోజు బుధవారం కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ఉపన్యాసాలు, పరిశోధనలపై సదస్సు నిర్వహించారు. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ విత్ హెల్త్కేర్ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బయోమెడికల్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (ఐటీహెచ్బీఏబీ–2025) గ్లోబల్ కాన్ఫరెన్స్లో జపాన్ దేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా న్యూరాలజీ రంగంలో విశేషమైన పరిశోధనా, వైద్య అనుభవాన్ని వివరించారు. ఫార్మసీ రంగంలో జీవితకాల సేవలకు ప్రొఫెసర్ జి.నరహరిశాస్త్రికి, బయోటెక్నాలజీ రంగంలో జీవితకాల కృషికి డాక్టర్ శ్రీనివాసులుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పరిశ్రమలలో బయోటెక్నాలజీ అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ కె.సురేష్బాబుకు టాలెంటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు అందించారు. ఏబీఏపీ సీనియర్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ బిపిన్నాయర్, డాక్టర్ వెంకటదాసు వీరంకి, డాక్టర్ లతారంగన్లకు అందించి సత్కరించారు. యువ పరిశోధకుల ప్రతిభను గుర్తిస్తూ ఏబీఏపీ టాలెంటెడ్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ శ్రీకాంత్గడాడ్, డాక్టర్ బృందా గన్నేరు, డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాలాలకు అవార్డులు అందజేశారు. నానో సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నత పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి బోనం, ఏబీఏపీ గోల్డ్ మెడల్ను, పరిశ్రమలలో వినూత్న ఆవిష్కరణలకు డాక్టర్ జి.వివేకానందన్కు ఏబీఏపీ ఇండస్ట్రీ ఇన్నోవేటివ్ అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 161 ఒరల్ ప్రెజెంటేషన్లు 104 పోస్టర్ ప్రెజెంటేషన్లు జరిగాయి. చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు నాదెండ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి నళినిదేవిలు రచించిన ఎమ్సీక్యూస్ ఇన్ పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని జపాన్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్లో పరిశోధనలకు పెద్దపీట
మంగళగిరి టౌన్: వైద్య రంగంలో మంగళగిరి ఎయిమ్స్ గణనీయమైన పరిశోధనలు చేపడుతోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో బుధవారం అనుసంధాన దివస్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాల్గవ వార్షికోత్సవ పరిశోధన దినోత్సవాన్ని డాక్టర్ అహంతం శాంతసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ గురువారంతో ముగియనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైద్యవిద్య, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎయిమ్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపడుతోందని, రక్తహీనత, సికెల్ సెల్ వ్యాధి వంటి సాధారణ, సంబంధిత ప్రజా సవాళ్లపై కూడా దృష్టి పెడుతోందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాపులో వివిధ విభాగాల వైద్య విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేశారని చెప్పారు. ఎయిమ్స్లో పేషెంట్ కేర్, మెడికల్ స్టూడెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ చక్కగా జరుగుతోందని ఇందుకు నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ నిదర్శనమన్నారు. మెడికల్, సర్జికల్, డెంటల్, నర్సింగ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో 40 సెక్షన్లలో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు కేటగిరీల కింద రీసెర్చ్ చేసిన వారికి బహుమతులు అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజ్డ్ చైర్పర్సన్, డీన్ (రీసెర్చ్) డాక్టర్ జాయ్ ఎ.గోషల్, అసోసియేట్ డీన్ (రీసెర్చ్) డాక్టర్ మాధవరావు, అసిస్టెంట్ డీన్ (రీసెర్చ్) ఆర్తి గుప్త, ఆంధ్రప్రదేశ్ మాజీ డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కె. బాబ్జీ, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ గోపాలన్, శోద్ క్లినికల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోనికా బహల్, నోవార్టిస్కు చెందిన డాక్టర్ అరుణ్భట్తో పాటు పలువురు ప్రతినిధులు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈడీ డాక్టర్ అహంతం శాంతసింగ్ -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్–నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూలుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
అలరించిన జానపద సాంస్కృతిక సంబరాలు
నగరంపాలెం: భావితరాలకు భారతీయ కళల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తెలిపారు. మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో బుధవారం రాత్రి నాట్స్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు, ఉత్తమ ఉపాధ్యాయులు, కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు నిర్వహణలో అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ భారతీయ కళలు అంతరించపోకుండా జానపద, సాంస్కృత సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని చెప్పారు. జానపద కళలను చిన్నతనంలో తిలకించానని, ప్రస్తుతం నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాలలో జానపద కళలను ప్రోత్సహించేందుకు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు నాట్స్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్కో లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రజా గాయకుడు పి.వి. రమణ నేతృత్వంలో కళాకారుల విన్యాసాలు అలరించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ జిల్లాలతోపాటు మలినేని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాటం, డప్పు, కొమ్ము కోయి తదితర నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మందాడి కిరణ్, వేమూరి శ్రీనివాసరావు, వైద్యులు ఏ.ఆంజనేయులు, జన చైతన్య వేదిక నిర్వాహకులు లక్ష్మణ్రెడ్డి, కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రైవేటు సేవలో సూపర్ స్పెషలిస్టులు
గుంటూరు మెడికల్ : సాధారణ వైద్య సేవలు సైతం ఖరీదైపోతున్న నేటి రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలంటే పేద రోగులు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరు జీజీహెచ్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల కంటే మెరుగైన, అధిక సంఖ్యలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలు కలిగి ఉన్న గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషలిస్టుల సేవలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాటించని సమయవేళలు మధ్యాహ్నం వైద్యం నిల్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పేద రోగులకు తప్పని తిప్పలు ... -
మురుగు నీటికి అడ్డు తొలగింపు
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లి బైపాస్ రోడ్డులో గల ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువకు అడ్డుకట్ట తొలగించడంతో మురుగునీరు మొత్తం బయటకు వెళ్లిపోయింది. బుధవారం సాక్షిలో ముంచెత్తుతున్న మురుగునీరు, పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కథనం వెలువడింది. దీనికి స్పందించిన కార్పొరేషన్ అధికారులు ప్రాతూరు, కుంచనపల్లి మధ్య కాలువకు రైతులు అడ్డంగా వేసిన కట్టను తొలగించారు.దీంతో ఒక్కసారిగా మురుగు నీరు మొత్తం కిందకు వెళ్లింది. పంపింగ్ స్కీంతో పాటు అపార్ట్మెంట్ల వద్ద నిలిచిపోయిన మురుగునీరు కిందకు వెళ్లింది. రైతులు మాత్రం మురుగు నీరు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, కార్పొరేషన్ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయం చూసుకుని, పంట కాలువలో మురుగునీరు పారకుండా చూడాలని కోరుతున్నారు. -
గిట్టుబాటు.. కప్పదాటు
గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ అరకొరగానే జరుగుతోంది. గోతాలు లేవని,మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ (బిజీ) పూర్తయింది అని జాప్యం చేస్తున్నారు. 75 కిలోల ధాన్యం బస్తా రూ.1792 కొనుగోలు చేయాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.1400 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. – మట్టుపల్లి పోతురాజు, రైతు, సుద్దపల్లి, చేబ్రోలు మండలం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆరుగాలం శ్రమించి తుపాన్లు, భారీ వర్షాలను తట్టుకుని పండించిన రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తేమ, నూక శాతం పేరుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే, దళారులు ధర తగ్గించి రైతులను నష్టాలపాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 66,082.46 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు 64 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. అంటే మొత్తం 4,22,928 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలి. వాస్తవంగా జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే వచ్చే పరిస్థితులు లేవని రైతు సంఘాలు, నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 188 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల వద్ద దండిగా ఉన్న సమయంలో తుపాన్లు, తేమ శాతం నిబంధనల పేరుతో సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి, వారు చెప్పిన తక్కువ ధరకే అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యానికి దూరంగానే మిగిలిపోయింది. కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు ప్రభుత్వం ఏ– గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర ప్రకటించింది. అయితే, తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీకి కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి సేకరణ నిబంధనల మేరకు గరిష్ట తేమ 17 శాతం ఉండాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాలుగు, ఐదు రోజుల పాటు ఆరబోసిన ధాన్యాన్ని మిల్లుకు పంపితే నూక పేరుతో, తేమ అధికంగా ఉందంటూ తరుగు తీస్తున్నారు. ఆరబెట్టినా, పెట్టకపోయినా బస్తాకు మూడు కిలోల కోత మాత్రం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన ధాన్యాన్ని ఒకే లారీలో మిల్లుకు పంపుతుంటారు. వీరు పంపిన లోడులో ఇతరుల పేరుతో కొన్ని బస్తాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 75 కిలోల బస్తాకు ఒక్కో రైతు రూ.70 నుంచి రూ.100 వరకు నష్టపోతున్నాడు. గత్యంతరం లేక రైతులు, దళారులను ఆశ్రయిస్తూ వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఇప్పటి దాకా వారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతుల సమస్యలు పట్టడం లేదు . మండలాల్లో అధికార యంత్రాంగం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కల్లాల్లోనే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం బస్తా రూ.1400 లకే వ్యాపారులు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. కూలీ, బాడుగకు రూ. 44 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 75 కిలోల బస్తాకు 60 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. నిలదీస్తే కొర్రీలు అక్రమ కోత, తరుగును ప్రశ్నిస్తే ధాన్యం సేకరణలో కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మిల్లుల వద్ద రైతులు, నిర్వాహకుల మధ్య నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. 75 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగును అనుమతిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారని సమాచారం. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలుతో పాటు కోత ధరలు అమాంతం పెరగడంతో నష్టాలను ఎదుర్కొంటున్నారు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసినా ఆశించిన ఫలితంలేదు. ఎకరాకు 40 బస్తాలు ధాన్యం వస్తుందని ఆశిస్తే 28 బస్తాలు మాత్రమే దక్కింది. ఎండలో తిరగబెడుతూ పది రోజులు ఆరబెట్టినా ధర రూ.1520 దాట లేదు. – వెంకటాద్రి, రైతు, పచ్చలతాడిపర్రు చేతికి అందివచ్చిన ఖరీఫ్ పంట ఇక నోటికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై అధిక వర్షాలు, వరుస తుపాన్లు నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి, కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం నిబంధనల పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. మరో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. -
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్ను బుధవారం వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996–2000 సంవత్సరాల మధ్య విద్యనభ్యసించిన విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ కావ్య, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలయ ఎగువ దిగువ సన్నిధులు, శ్రీ గండాలయస్వామి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ను నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలి పారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు. కొండపై గల శ్రీ గండాలయస్వామి వారిని దర్శించి దీపం పెట్టే భక్తులు వారి వెంట తీసుకువచ్చే ప్లాస్టిక బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు తిరిగి వారితోపాటే తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై వదిలి వెళ్లరాదని ఆయన కోరారు. దేవాలయ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. కారంచేడు: బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 103 సంవత్సరాల శతాధిక వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మృతితో గ్రామంలోని పాలేటి వారి బజారులో విషాదఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన పాలేటి సుబ్బారావు (103)కు 92 సంవత్సరాల భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవలు, మనవరాళ్లు, ముదిమనవలతో కలిపి సుమారు 20 మందికి పైగా సంతానం ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బారావు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం నేతృత్వంలో నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యంపై పుస్తకాల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మి దేవి మాట్లాడుతూ రైతులు క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించి, సరైన యాజమాన్య చర్యలు చేపట్టేటట్లు సరళంగా, పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. వీఆటి రూపకల్పనలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. రైతులు ఈ పుస్తకాలను సద్వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని శారదజయలక్ష్మి దేవి కోరారు. -
ఇంధన పొదుపు అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపు పాటించటం వల్ల భవిష్యత్ తరాలకు ఇంధన భద్రత, భరోసా కల్పించటం సాధ్యం అవుతుందన్నారు. జాతీయ ఇంధన వనరుల వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబరు 14వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. వారోత్సవాలలో విద్యుత్ వంటి ఇంధన వనరులను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించటంపై ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇంధన పరిరక్షణ , పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లును ఆవిష్కరించి, ఇంధన వనరులను పొదుపు పాటిస్తామని, వృథాను అరికడతామని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీడీసీఎల్ ఎస్ఈ చల్లా రమేష్, సీఆర్డీఏ సర్కిల్ ఎస్ఈ ఎం. శ్రీనివాసరావు, ఈఈ కె.సత్యనారాయణ, డీఈలు శ్రీనివాసబాబు, నాగేశ్వరరావు, జె.హరిబాబు, సూర్యప్రకాష్, ఎస్ఏఓ రామిరెడ్డి, ఏడీఈలు బి.రాజమోహనరావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
ఇంటర్ పరీక్షల మార్పులకు సన్నద్ధం కావాలి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో పల్నాడుజిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సైమన్ విక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పాత విధానాన్నే అమలు చేస్తుండగా, ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం సిలబస్లో భారీ మార్పులు జరిగాయనీ, అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, అన్సర్ బుక్లెట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బోటనీ, జువాలజీ పేపర్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వీటి ప్రశ్నాపత్రం 43, 42 మార్కులకు కేటాయించగా ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయని, రెండు సంవత్సరాలకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్పులను విద్యార్థులకు వివరించి వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షల స్పెషల్ ఆఫీసర్ వి.వి.సుబ్బారావు, రమేష్, ఆర్జేడి జె.పద్మా, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు టి.ప్రభాకర్, కె.వేణు, ఎస్ఎస్ అండ్ ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణాధికారి సైమన్ విక్టర్ జూనియర్ ఇంటర్ పరీక్ష మార్పులపై అవగాహన సమావేశం -
పీఎఫ్ రుణాలపై ఆడిట్ అభ్యంతరాలు తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర ఖర్చుల కోసం ఉపాధ్యాయులు దాఖలు చేస్తున్న పీఎఫ్ రుణాల దరఖాస్తులను అసంబద్ధమైన ఆడిట్ అభ్యంతరాలతో తిరస్కరించడం మానుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమను గుంటూరులోని ఆడిట్ కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ బృందం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. బసవ లింగరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల అవసరాలకు ఉపయోగపడతాయని నెల నెలా పీఎఫ్లో దాచుకున్న సొమ్ము అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సల కోసం దాఖలు చేసుకున్న రుణ దరఖాస్తుల్లో రూ.ఐదు లక్షలు దాటితే అసిస్టెంట్ సివిల్ సర్జన్, మెడికల్ సర్టిఫికెట్ తేవాలని లేదంటే పీఎఫ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారని అన్నారు. ● పీఎఫ్ రుణాల మంజూరులో అర్థం లేని నిబంధనలు విధించడం తగదని, లేని నిబంధనలు చూపి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఆడిట్ కార్యాలయం నుంచి లేవనెత్తుతున్న అభ్యంతరాలు పూర్తిగా విరుద్ధమన్నారు. ● ఎన్జీవోలకు వర్తించే నిబంధనలను ఉపాధ్యాయులకు అన్వయించడం సహేతుకం కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి అయినా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ● పీఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్న పరిస్థితుల్లో జెడ్పీ పీఎఫ్ విభాగం, జిల్లా ఆడిట్ కార్యాలయం ఒకరిపై ఒకరు చెప్పుకుని రుణ దరఖాస్తులను కొర్రీలు వేస్తూ, కాలయాపనతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ పీఎఫ్ రుణాలపై జెడ్పీ కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న అసంబద్ధ విధానాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ● రుణానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, ఉద్యోగ విరమణ అనంతర తుది చెల్లింపులకు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలవాలని చెబుతున్నారని, ఈ విధంగా ప్రవర్తించడ సరికాదన్నారు. ● జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమ స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆడిట్ అధికారిని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, జి.దాస్, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యూ.వందనం, జిల్లా కౌన్సిలర్లు సయ్యద్ జహంగీర్, కృష్ణారావు, గురుమూర్తి, అప్పారావు, తదితరులు ఉన్నారు. ఏపీటీఎఫ్ డిమాండ్ -
21న సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన జరుపుకుంటోందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ‘భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ వాకథాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి‘ అనే థీమ్తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శారీరక ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో ఒక వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ అధిపతి ఇ. వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు. -
ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్
ప్రత్తిపాడు: పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్ తమ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కిట్స్ కళాశాలలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) బూట్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాధ్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ క్యాంప్కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సంబంధిత స్కూల్స్ ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల్లో ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ వ్యాపారోన్ముఖ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంప్ చేపడుతుందని వివరించారు. బూట్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆర్జేడీ వి.లింగేశ్వర రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు నిపుణులైన రిసోర్స్ పర్సన్లతో లెక్చర్లు, వర్క్ షాపులు, హ్యాండ్స్–ఆన్ సెషన్లు నిర్వహించబడతాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ కోయి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాబు, బూట్ క్యాంప్ ఇన్చార్జి ఎస్పీవోసీ డాక్టర్ అరుణ పాల్గొన్నారు. కిట్స్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నరసరావుపేట టౌన్: పగలు దుప్పట్లు విక్రయిస్తూ రెక్కీ నిర్వహించి తాళ్లాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బైరా సుజాత గృహంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోని 21 సెవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాచీలు, రూ.లక్ష నగదును ఈ ఏడాది నవంబర్ 28న దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చిలకలూరిపేట పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్రాలచావిడి, పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర సోమవారం సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో పైనేరాన్ని వారే చేసినట్లుగా అంగీకరించారన్నారు. నిందితులు నూర్ హసన్, నొసద్, మిన్నా యామిన్, అబ్దుల్ గప్పార్, సాహుల్ జబ్బార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,25,800 విలువైన చోరీ సొత్తును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం మిగిలిన సొత్తు రికవరీ కోసం పోలీస్ కస్టడీ కోరతామన్నారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్ , ఎస్ఐ హజరత్తయ్య, సిబ్బంది వై.శ్రీనివాస్, ఎస్.వణుకుమార్, వి.హరీష్, కె. శ్రీరాములు, వి.నారాయణరావు, జి.జాన్బాబు, కె.శివకృష్ణ, షేక్ జాన్బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
80 లోనూ పతకాల పంట
తెనాలిటౌన్: రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య 80 సంవత్సరాల వయస్సులోనూ అథ్లెటిక్స్లో పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 7వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో జావెలెన్ త్రో, లాంగ్ జంప్, త్రో బాల్ పోటీలు 80 సంవత్సరాలు దాటిన వారికి నిర్వహించారు. కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య పాల్గొన్నారు. ● బుల్లయ్య జావెలెన్ త్రో, త్రోబాల్, లాంగ్ జంప్లో ప్రథమ బహుమతి సాధించగా, ఆళ్ళ వీరారెడ్డి షార్ట్ఫుట్లో ప్రథమ బహుమతి సాధించినట్లు చెప్పారు. ● చిన్ననాటి నుంచి క్రీడల్లో ఈ ఇరువురు ఉత్సాహంగా పాల్గొంటారని గ్రామస్తులు వివరించారు. ఈ సందర్భంగా ఇరువురుని సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, లక్కరాజు ఉమాకాంత్, కొల్లి ఉమాశంకర్రెడ్డి, పుట్టా రవికిషోర్, లక్కరాజు హరి, ఎం.నరేంద్ర, ఎస్.కోటేశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వేడుకలను మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో ధనుర్మాస వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం గోదా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం 1వ పాశుర విన్నపం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో... పొన్నూరు: పట్టణంలోని స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేవాలయం అర్చకులు గోవర్ధనం రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ్నిక స్వామి వేదాంతం అనంత శ్రీనివాస భట్టాచార్యులు, తిరుప్పావై ప్రవచకులు తిరువాయిపాటి గోవర్ధనాచార్యులు పాల్గొన్నారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. వాజ్పేయి విగ్రహానికి రూ.8 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గుంటూరులో సోమ వారం శంకుస్థాపన జరిగింది. గుంటూరు లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త మాదల రత్నగిరిబాబు రూ.8 లక్షలు విగ్రహ నిర్మాణ కమిటీకి మంగళవారం అందజేశారు. వైభవంగా స్వామి వారి ఆరాధన మహోత్సవం నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరులోని శ్రీకంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో శ్రీకంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష పూజలు తెనాలి: నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి ప్రవచనం చెప్పారు. 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.45 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళుతున్న ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి నుంచి నందివెలుగు మీదుగా ఆర్టీసీ బస్సు గుంటూరు వెళుతుండగా కాజీపేట ఏ–వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ సైకిల్, బైక్ ఢీకొని దానిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన వారిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కొలకలూరు బాపయ్యపేటకు చెందిన పురంశెట్టి రామకృష్ణ, నీలి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఇరువురిని స్థానికులు తెనాలి వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వైద్యశాలలో నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు తెనాలి అర్బన్: జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెనాలి జిల్లా వైద్యశాలలో ఇప్పటికే 10 మంది చికిత్స పొందారు.మరి కొందరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మరో నలుగురు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చేరినట్లు చెప్పారు. వీరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, బుధవారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాలుడు బలవన్మరణం మార్టూరు: ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్టూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన దేసు ప్రసన్నకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భద్రి ( 14) సంతానం. భద్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్గా ఉండే భద్రి.. ఇటీవల తన అమ్మమ్మ మృతి చెందినప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటల సమయంలో భద్రి తన తాతయ్యకు టీ పెట్టి ఇచ్చి.. ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటికి రాలేదు. మనుమడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు తల్లి చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేయగా వారు కింద దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎప్పుడూ చదువులో ముందుందే భద్రి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మనస్తాపంతో లారీ డ్రైవర్ ఆత్మహత్య బల్లికురవ: మనస్తాపంతో ఓ లారీ డ్రైవర్ మద్యంలో గడ్డి నివారణకు వాడే పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 65 గంటలపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం చనిపోయాడు. అందిన సమాచారం ప్రకారం మండలంలోని వైదన గ్రామానికి చెందిన శాయిని వేణుగోపాల్ (52) లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈయనకు భార్య రామాంజమ్మ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ముంచెత్తుతున్న మురుగు
పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లి బైపాస్ రోడ్డుకు మురుగు నీటి ముంపు తీవ్రమౌతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని నివాసాల నుంచి వెలువడే మురుగుతోపాటు ఇతర వ్యర్థాలు ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువలోకి వచ్చి చేరుతున్నాయి. రైతులు కోతలు కోయడంతో కాలువలో మురుగు పంట పొలాల్లోకి రాకుండా ప్రాతూరు రోడ్డులోని అపర్ణ సమీపంలో కాలువకు అడ్డంగా కట్ట ఏర్పాటు చేశారు. కట్ట ఏర్పాటు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 2 కి.మీ. పొడవున ఉన్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్లో కుంచనపల్లి బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మురుగునీరు వచ్చి పంట కాలువలో చేరడంతో పొంగిపొర్లుతోంది. పంట పొలాలకు తప్పని ముప్పు మురుగు పంట పొలాల్లోకి వచ్చి చేరుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వద్ద మురుగు షెడ్డులోకి చేరుతున్నాయి. కుంచనపల్లి, ప్రాతూరు రోడ్డులో కుంచనపల్లి బ్రిడ్జి వద్ద నుంచి రైతులు కాలువకు అడ్డు వేసిన కట్ట వరకు సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో అరటి, పసుపు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కడైనా కాలువ కట్ట తెగితే ఆ మురుగు అంతా ఒక్కసారిగా వచ్చి పంటపొలాలను ముంచెత్తుతుందని, పండించిన పంటలు దేనికీ పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్కి మురుగు భారీగా వచ్చి చేరుతోందని రైతులు చెబుతున్నారు. కొన్నిప్రాంతాల వారు మురుగు ఎత్తి ఈ కాలువలోకి పంపిస్తున్నారని రైతులు అంటున్నారు. పలు బహుళ అంతస్తుల నుంచి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్కు మురుగు వచ్చి చేరుతోంది. ఆ కాలువకు అడ్డుకట్ట వేయడంతో అపార్ట్మెంట్లలో మురుగు వెనక్కి తంతున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలుపుతున్నారు. అర ఎకరంలో పసుపు పంట సాగు చేశా. కాలువలో మురుగు పొంగి పొర్లడంతో పసుపు పంట తడిసి పోయింది. దీని వల్ల పసుపు కుళ్లిపోతోంది. ఇప్పటికే మూడుసార్లు ఇలా జరిగింది. ఇది నాల్గవ సారి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మురుగుని మళ్లించే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. –దాశెట్టి శంకరరావు, రైతు -
చలపతి ఫార్మసీలో ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సహకారంతో నిర్వహిస్తున్న ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్ కాన్ఫరెన్స్) మంగళవారం ప్రారంభమైంది. స్థిరమైన అభివృద్ధి కోసం హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయో మెడికల్ సైన్సెస్తో సాంకేతికత సమన్వయం అనే ప్రధాన అంశంతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అకడమిషీయన్లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవి ఆంజనేయులు, సెక్రటరీ వై. సుజిత్కుమార్లు అధ్యక్షత వహించారు. ఏబీఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. ● ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ ఉన్నతవిద్య, పరిశోధన నాణ్యత, పరిశ్రమ అకాడమీ అనుసంధానం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ● ఏఎన్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న పరిశోధనాధోరణులు, వైద్య శాస్త్రాల్లో సాంకేతికతపై విలువైన అవగాహన కల్పించారు. ● యూనివర్సిటీ ఆఫ్ అలబామా, ట్రాన్స్లేషనల్ సైన్స్ మెడిసిన్ విభాగం డాక్టర్ ఎం.ఎన్.వి.రవికుమార్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలుగా సమాజానికి ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ● ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు వ్యవసాయ పరిశోధనల్లో బయోటెక్నాలజీ పాత్ర, ఆహార భద్రత, సమగ్ర అభివృద్ధి అంశాలపై వివరించారు. ● హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి. నరహరిశాస్త్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర శాఖల పరిశోధనలు ఇన్నోవేషన్పై సమాచారాన్ని అందించారు. ● అలబామా స్టేట్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మనోజ్ కె. మిశ్రా బయోమెడికల్ సైన్సెస్, గ్లోబల్ రీసెర్చ్ సహకారం యువ పరిశోధకులకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో దేశంలోని సుమారు 12 రాష్ట్రాలకు చెందిన 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి 1250 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ప్రారంభమైన గ్లోబల్ కాన్ఫరెన్స్ -
విద్యార్థుల శ్రేయస్సును విస్మరిస్తే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల శ్రేయస్సుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో షేక్ సలీమ్ బాషా హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని స్పష్టం చేశారు. ● వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనైతిక అడ్మిషన్లకు పాల్పడుతున్నాయని, ఒక పాఠశాలలో విద్యార్థులను మరొక పాఠశాలలో చేర్చుకుని, ఫీజుల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యలతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడటంతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోందన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన విధి, విధానాల ప్రకారం పాఠశాలలు నిర్వహించాల్సిందేనని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష ఫీజులు వసూలు చేయడం తగదని స్పష్టం చేశారు. ● నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెనాలి డీవైఈవో శాంతకుమారి, గుంటూరు తూర్పు ఎంఈవో నాగేంద్రమ్మ, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్య నేర్పించాలి గుంటూరు ఎడ్యుకేషన్: వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు విద్యనందిస్తున్న వలంటీర్లు, కేర్ టేకర్లకు కెపాసిటీ బిల్డింగ్. కార్యక్రమాన్ని మంగళవారం సాంబశివపేటలోని సెయింట్ జోసఫ్ బీఈడీ కళాశాలలో ప్రారంభించారు. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడం మన బాధ్యత అని అన్నారు. ● ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో బిహార్ వాసులు అత్యధికంగా ఉన్నారని, వారి పిల్లలకు లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చే విషయమై బిహార్ నుంచి ప్రథమ్ ఎన్జీవో టీం ప్రత్యేకంగా వచ్చారని, సంబంధిత ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీంతో సమన్వయం చేసుకుని మూడు రోజులపాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ● బిహార్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి పిల్లల స్వభావంతో భిన్నంగా ఉన్నాయని, ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య ఉత్పన్నమవుతోంద్నారు. ● గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఐ.పద్మావతి మాట్లాడుతూ ఎన్సీపీసీఆర్ గైడెన్స్, సమగ్రశిక్ష ఎస్పీడీ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్లో నిర్వహించిన సర్వే ద్వారా వలస కుటుంబాల్లోని 2,196 మంది పిల్లల వివరాలు సేకరించామని, వారికి విద్యను కొనసాగించేందుకు అవసరమైన లెర్నింగ్ సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీం కంటెంట్ ప్రతినిధి లీలా పద్మావతి, బిహార్ ప్రథమ్ టీం ప్రతినిధి దీనానాద్ కుమార్ సిన్హా, గుంటూరు ఈస్ట్ ఎంఈవో ఎస్ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్ పాల్గొన్నారు. డీఈఓ సలీమ్ బాషా -
కార్టూనిస్ట్ సుభానీకి ‘బాపు’ అవార్డు
కారంచేడు: ప్రముఖ కార్టూనిస్ట్గా, అనతికాలంలోనే కార్టూన్ ఎడిటర్గా అంచలంచలుగా ఎదిగిన పొలిటికల్ కార్టూనిస్ట్ షేక్ సుభానీకి ‘బాపు అవార్డు’ దక్కింది. కారంచేడు గ్రామానికి చెందిన సుభానీ షేక్ గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లోని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గా పనిచేశారు. కార్టూన్ ఎడిటర్గా.. ఎన్నో పొలిటికల్ కార్టూలను వేసి అనేక మంది మన్ననలు పొందారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. దీంతో హైదరాబాద్లోని బాపు–రమణ అకాడమీ వారు గుర్తించి సుభానీకి బాపు అవార్డును అందించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు రమణ అవార్డు, సినీ నటుడు మురళీమోహన్కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. సుభానీకి పలువురు అభినందనలు తెలిపారు. -
నిమ్మ రైతులకు తప్పని కన్నీరు
నికర ఆదాయం... 2017–18లో చేదు అనుభవాలు... కరోనాలో ఆదుకున్న ప్రభుత్వం... మళ్లీ పెరిగిన ధర... నిమ్మ రైతులకు మార్కెట్ ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వరకు కిలో రూ.90 వరకు పలికినా, తర్వాత ధరలు తగ్గినప్పటికీ నిలకడగానే ఉంటూ వచ్చాయి. నెల రోజులుగా ధరలు భారీగా పతనం చెందాయి. ఇటీవల వరకు కిలో రూ.6–12 వరకు అమ్మకాలు జరిగాయి. సగటు ధర రూ.10–12 మధ్యనే ఉంటూ వచ్చింది. తాజా రూ.15కు చేరుకుంది. అయినా ఈ ధరలతో నష్టపోక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో హఠాత్తుగా తగ్గిన ధర కాయ ఆధారంగా కిలో రూ. 12–18 సగటున కిలో ధర రూ.12–15 నెల రోజులుగా ఇదే తీరులో అమ్మకాలు ఖర్చులు కూడా రావని రైతుల గగ్గోలు -
విద్యార్థినికి దండన ఘటనపై చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: వుూడో తరగతి విద్యార్థినిని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనలో ప్రైవేటు పాఠశాలకు చెందిన ఇన్చార్జ్ హెచ్ఎంతో పాటు మరొక ఉద్యోగినిపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థిని తల్లి గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఆదేశాలతో మంగళవారం గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. అత్యవసరంగా టాయిలెట్కు వెళ్లేందుకు మూడో తరగతి విద్యార్థిని పడిన ఇబ్బందిని గుర్తించకుండా నిర్థాక్షిణ్యంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను తిలకించారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ఆధారంగా విద్యార్థినిపై క్రమశిక్షణ చర్యల పేరుతో విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈవో సలీమ్బాషా ఆదేశాలతో జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ఇన్చార్జ్ హెచ్ఎంతో పాటు మరొక నాన్ టీచింగ్ ఉద్యోగినిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. -
అమరజీవికి జిల్లా ఎస్పీ ఘననివాళి
నగరంపాలెం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పొట్టిశ్రీరాములు కీలకపాత్ర పోషించారన్నారు. ప్రాణాలను సైతం ఏమాత్రం ఖాతారుచేయకుండా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల సాధనకై అహింసాయుత దీక్షతో పోరాడి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి, కార్యాలయ ఏఓ వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పలువురు సీఐలు, ఆర్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్జీ రంగా వర్సిటీలో ... గుంటూరు రూరల్: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మిదేవి తెలిపారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకుని నగర శివారు లాంఫాంనందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, పీజీ డీన్ డాక్టర్ ఏవీ రమణ, కంట్రోలర్ డాక్టర్ బి. ప్రసాద్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఎ. మణి, అగ్రికల్చర్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, లైబ్రేరియన్ జి. కరుణ సాగర్, జాయింట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన్ యూనివర్సిటీకి పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరు
చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఢిల్లీలోని నావల్ రీసెర్చ్ బోర్డ్ (ఎన్ఆర్బీ) – డీఆర్డీఓ నుంచి ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్ట్ మంజూరైనట్లు వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ సోమవారం తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్య, భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్ – ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీకి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కాలి సంజయ్లకు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పైలెట్ స్కేల్ టెస్టింగ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో షీట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎన్హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ ఫ్రమ్ సీ వాటర్ బిట్టెర్న్స్’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ పరిశోధనకు రూ. 74.35 లక్షల గ్రాంట్నుఎన్ఆర్బీ–డీఆర్డీఓ మంజూరు చేసిందని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా సముద్ర జలాల్లో మిగిలే బిట్టెర్న్స్ నుంచి అధిక స్వచ్ఛత గల ఎన్హైడ్రస్ మెగ్నీషియం క్లోరైడ్ తయారీకి వినూత్నమైన సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ పి.అశోక్ కుమార్, రీసెర్చ్ అడ్వైజర్ డాక్టర్ తొండెపు సుబ్బయ్యలను చైర్మన్ లావు రత్తయ్య, సీఈఓ మేఘన కూరపాటి అభినందించారు. -
రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డివిజన్కు రజత పతకం
క్రీడాకారుడు శివరామకృష్ణ యాదవ్ను అభినందించిన డీఆర్ఎం లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో గుంటూరు రైల్వే డివిజన్లో కమర్షియల్ క్లర్క్ కమ్ టిక్కెట్ క్లర్క్ ఎ.శివరామకృష్ణ యాదవ్ రజత పతకం దక్కించుకోవడం అభినందనీయం అని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం దక్కించుకున్న శివరామకృష్ణ యాదవ్ను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ తూర్పు కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో చాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొనగా 88 కిలలో విభాగంలో గుంటూరు డివిజన్కు చెందిన ఉద్యోగి శివరామకృష్ణ యాదవ్ వెండి పతకం కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. డివిజన్ ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని, డివిజన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిందిగా కోరారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మార్పులకు సన్నద్ధం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఆర్ఐవో జి. సునీత పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై సోమవారం గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సాంబశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా ఆర్ఐవో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ సంస్కరణలు, సబ్జెక్టుల వారీగా సిలబస్, మార్కుల విభజనపై వివరించారు. ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల విధానంతో పాటు సిలబస్లో చోటు చేసుకున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి, ఇంటర్మీడియెట్ బోర్డు పరిశీలకురాలు పి.రేఖావాణి పాల్గొన్నారు. ఆర్ఐఓ జి. సునీత -
సాహిత్యంలో రారాజు కొసరాజు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : కొసరాజు సాహిత్యం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరమంతా ఉన్నతంగా వెలుగుతుందని మహా సహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. సోమవారం గుంటూరులోని జేకేసీ కళాశాల సమావేశ మందిరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక, మనసు ఫౌండేషన్ సంయుక్తంగా సాహిత్య పరిశోధకులు పారా అశోక్కుమార్ నేతృత్వంలో రూపొందిన కొసరాజు సర్వలభ్య రచనల సంకలనం పుస్తకావిష్కరణ సభ జరిగింది. తొలుత ఈ గ్రంథాన్ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం కొసరాజు జీవిత మాలికపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను అతిథులు ప్రారంభించి, కొసరాజు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పత్తిపాటి దేవాక్షమ్మ, చలసాని అనురాధ, కస్తల పద్మ, డాక్టర్ కొసరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు -
ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం స్థానిక కలెక్టర్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ యు.చెన్నయ్య, జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, డిఎస్ఓ పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమర్థంగా విధులు నిర్వహించాలి మంగళగిరి టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో సమర్థంగా బందోబస్తు విధులు నిర్వహించాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై సోమవారం అధికారులకు సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందాల్ సూచనలు చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి సీసీ కెమెరాల అమరికలు, పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు రమణమూర్తి, రవికుమార్, హనుమంతు, స్పెషల్ బ్రాండ్ డీఎస్పీ శ్రీనివాసులు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వడ్డేశ్వరం విద్యార్థులు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రగ్బీ సౌత్జోన్ ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్ర సబ్జూనియర్ బాలికలు అండర్–15 విభాగంలో గుంటూరు కొత్తపేటలో ఎంఆర్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం జూనియర్ క్యాంపస్లో ఈనెల 14వ తేదీన ఎంపిక పోటీలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేగావత్ భువనేశ్వరి భాయి ఎంపికై ందని తెలిపారు. ఎంపికై న విద్యార్థిని ఈనెల 27, 28 తేదీల్లో చైన్నె జేఎన్ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా సౌత్జోన్ అస్మిత లీగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలియజేశారు. అలానే కృష్ణాజిల్లా, గన్నవరంలో ఈనెల 1, 2 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో తమ పాఠశాల విద్యార్థిని రావిపాటి దివ్య(8వ తరగతి) ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై ందని వివరించారు. రావిపాటి దివ్య ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొనన్నుట్లు ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణులను, వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, పి.సతీష్కుమార్లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
రైల్వే పెన్షన్ అదాలత్ బహిష్కరణ
గుంటూరు మెడికల్: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిపాలన విభాగంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ను ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు బహిష్కరించారు. సోమవారం జరిగిన పెన్షన్ అదాలత్లో ఒక పెన్షనర్ల సంఘానికి అనుమతి ఇచ్చి, తమ సంఘానికి అనుమతి ఇవ్వకపోవడంతో బహిష్కరించామని అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కె.నారాయణరెడ్డి, సెక్రటరీ ఎల్.రాఘవబాబు తెలిపారు. గుంటూరు డివిజన్లో పనిచేస్తున్న ప్రధాన పెన్షన్ల సంఘాల్లో తమ సంఘం ఒకటని పేర్కొన్నారు. 300 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు పెన్షన్ అదాలత్లలో అన్ని గుర్తింపు పొందిన పెన్షనర్ల సంఘాలు పాల్గొనేందుకు, అభిప్రాయాలు తెలియజేసేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా తమ సంఘం పాల్గొనకుండా ఉండేందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన సమావేశంలో సుధాకర్, కోశాధికారి ఆదినారాయణరెడ్డి, చెన్నయ్య, కోటేశ్వరరావు, శివరామ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ -
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీష
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్ పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పురోగతి పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక డ్రగ్స్ సేవించిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం వరకు... గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లోని లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్న బజార్లో నివాసం ఉండే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక మైనర్ బాలికకు కొందరు యువకులు ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయమయ్యారు. డ్రగ్స్కు బానిసగా మార్చడంతో ఆమె తల్లి వంగల స్వప్న ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇన్స్ర్ట్రాగామ్ ద్వారా పరిచయమైన కొంతమంది యువకులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు యువకులను గుర్తించినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ద్వారా ఇన్స్ర్ట్రాగామ్లో బాలికకు పరిచయమైన యువకులు అంశాలను పరిశీలిస్తున్నారు. బాలిక చెప్పిన వాస్తవాలు ఆధారంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వారికి అందుతున్నాయి? ఈ విద్యార్థిని కాకుండా మరెవరికై నా డ్రగ్స్ అందజేస్తున్నారా? రక్షణలో చేస్తున్న యువకులకు ఎక్కడినుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది యువకులను విచారించే నేపథ్యంలో అసలు నిందితుల కోసం వెతుకులాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను సమాచారం అడగక దర్యాప్తులో ఉందని చెబుతున్నారు. యువకులను రిమాండ్ కూడా తరలించారని వాదనలు వినవస్తున్నాయి. ఏపీలో 15 ఏళ్ల తరువాత ఫార్మాసిస్ట్ల ఎన్నికలు గుంటూరు మెడికల్: విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 2025 డిసెంబర్లో ఏపీ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..15 ఏళ్లఅనంతరం ఏపీలో ఫార్మాసిస్ట్ల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది ఫార్మాసిస్ట్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానల్ అభ్యర్థులైన వేమూరు మాలతి, నరేష్ లుక్కాకు వేయాలని అభ్యర్థించారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారు ఈనెల 24లోపు పోస్టల్ బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా విజయవాడలోని ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయానికి చేరేలా చూడాలని కోరారు. ఈ నెల 24లోపు పోస్టల్ బ్యాలెట్లు చేరాలి యునైటెడ్ రిజిస్టర్ ఫార్మాసిస్ట్ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని వినతి -
ఉపకార వేతనాలతో ఉన్నతస్థాయికి ఎదగాలి
తెనాలి: విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పారిశ్రామికవేత్త, తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్రప్రభు పేర్కొన్నారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు. పట్టణానికి చెందిన కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రొగ్రెసివ్ అసోసియేషన్ (కెపా) 21వ ప్రతిభా స్కాలర్షిప్ల ప్రదానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో 2024–25 విద్యా సంవత్సరానికి 430 మంది విద్యార్థులకు రూ.14.53 లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. రామచంద్రప్రభు మాట్లాడుతూ తాను ఎస్ఎస్ఎల్సీ పరీక్ష ఫీజు రూ.16 కోసం నాలుగిళ్లు తిరగాల్సి వచ్చిందని, పీయూసీ, బీటెక్ను మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకున్నట్టు గుర్తుచేసుకున్నారు. స్కాలర్షిప్ ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తెరగాలని చెప్పారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్బాబు మాట్లాడుతూ ఇరవైఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్, గుంటూరు ఏజీఎం దాసం శివనాగరాజు, శింగులూరి వీరన్న, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బళ్లా నరేంద్రకుమార్, భావనా పవన్కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవ్వాజి కోటినాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లిముంత అమరేశ్వరరావు, వెంకటపున్నారావు, బొల్లిముంత శివరామకృష్ణ, సాయికృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహనరావు, సోమరౌతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికై న ముళ్లపూడి సాయికృష్ణను అతిథుల చేతులమీదుగా సత్కరించారు. పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు 430 మందికి రూ.14.53లక్షల ఉపకార వేతనాల పంపిణీ -
సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలు రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నేతృత్వంలో పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి వేణుమాధవరావు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని కృషి భవన్లో నిర్వహించారు. వేణుమాధవరావు మాట్లాడుతూ వ్యవ సాయ విస్తరణాధికారులకు జాబ్ చార్ట్, నామిలికేచర్ మార్పు తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో ఏపీ జేఏసీ సహకారంతో పరిష్కారం అవుతాయన్నారు. జిల్లావ్యవసాయ విస్తరణ అధికారులు తమ సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుభాని గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సురేష్ గోపి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణయ్య పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కార్యవర్గం గుంటూరు జిల్లా ఏఈఓ సంఘం అధ్యక్షులుగా ఆలా రమేష్బాబు, కార్యదర్శిగా ఎన్ ప్రసాద్బాబు, కోశాధికారిగా ఎంఎన్ కృష్ణారావు, సహాధ్యక్షులుగా ఐ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా పి రవికుమార్, ఆర్ వెంకయ్య, వీరంకి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివరావు, ప్రచార కార్యదర్శిగా కె రమేష్బాబు, సంయుక్త కార్యదర్శులుగా ఐ జ్యోత్స్న, పి రాజేంద్రప్రసాద్, బి సౌజన్య, కార్యవర్గ సభ్యులుగా దేవ సమర్పణరావు, ఆదిలక్ష్మి, మురళి ఎన్నికై నట్లు ఎన్నికలు ఎన్నికల అధికారి రమణయ్య ఈ సందర్భంగా తెలిపారు. -
నేటి ర్యాలీని జయప్రదం చేయండి
పట్నంబజారు: పేద ప్రజల పక్షాన.. వారి గొంతుకై పేద విద్యార్థుల కోసం చేపట్టిన పోరాటంలో భాగంగా సోమవారం కోటి సంతకాలకు సంబంధించి పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల 80 వేల సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు. ఇందులో కార్యకర్తలు, పార్టీ నేతలు చేసిన శ్రమ ఎనలేనిదని కొనియాడారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన గుంటూరు పశ్చిమం, తూర్పు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుండి సంతకాలు జిల్లా కార్యాలయానికి చేరుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు. సంతకాల సేకరణలో భాగంగా నేడు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయం నుండి లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వామ్యులు కావాలని ఆయన తెలిపారు. లాడ్జి సెంటర్ నుంచి తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లి సంతకాలను అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో భాగంగా అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శనను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, వంగల వల వీరారెడ్డి, కార్పొరేటర్లు ఆచారి, అచ్చల వెంకటరెడ్డి, వంశి, సుబ్బారెడ్డి, ఆబిద్, మెహమూద్, కిషోర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు సిడి భగవాన్, పఠాన్ సైరా ఖాన్, కోరిటిపాటి ప్రేమ్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
కుంచెతో తెలుగును వెలిగించిన బాపు
నగరంపాలెం: చిత్రాలు, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం అందరి బాధ్యతని గజల్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో ఆదివారం బాపు– రమణ–బాలు కళాపీఠం, మల్లెతీగ సంయుక్తంగా బాపు జయంతి – బాపు స్మారక పురస్కారాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందమైన సీ్త్రని బాపు బొమ్మగా ప్రశంసిస్తున్నామంటే అది ఆయన చిత్రాలకున్న గొప్పతనమని తెలిపారు. తెలుగు వారు ఉన్నంత కాలం బాపు సినిమాలు, చిత్రాలు, కార్టూన్లు సజీవంగా ఉంటాయని చెప్పారు. తెలుగు అమ్మ ఒడి భాష కావాలన్నారు. తెలుగును అధికార భాషకంటే ముందు మన మమకార భాషగా గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాపు– రమణ – బాలు కళాపీఠం వ్యవస్థాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి మాట్లాడుతూ బాపును స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. బాపు సినిమాల్లోని ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని ఆత్మీయ అతిథి, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ గుర్తు చేశారు. సాహితీ సమాఖ్య గుంటూరు కార్యదర్శి ఎస్వీఎస్.లక్ష్మీనారాయణ బాపు ప్రతిభను తెలిపే సంగతుల్ని వివరించారు. మల్లెతీగ కలిమిశ్రీ మాట్లాడుతూ బాపు దర్శకునిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించారని పేర్కొన్నారు. అనంతరం సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్లపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకు బాపు స్మారక పురస్కారాలను అందించారు. బాపుతో ఉన్న అనుబంధాన్ని పురస్కార గ్రహీతలు గుర్తు చేసుకున్నారు. కార్టూనిస్టు హరి వెంకటరమణకు సత్కారంచిత్రకారుడు అరసవల్లి గిరిధర్కు సన్మానంముగ్గురికి స్మారక పురస్కారాల ప్రదానం -
చంద్రబాబు పాలనలో విద్యా రంగం నిర్వీర్యం
చేబ్రోలు: కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, ఆన్లైన్ యాప్ల విధానంతో ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) గుంటూరు జిల్లా 51వ కౌన్సిల్ సమావేశం ఆదివారం చేబ్రోలులో ఘనంగా జరిగింది. స్థానిక ఆర్వీటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖరరావు అధ్యక్షత వహించారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా జాతీయ, ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ జెండాలను నారాకోడూరు హైస్కూల్ హెచ్ఎం ఎం. ఏడుకొండలు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభుదాసు, సీనియర్ నాయకులు ఆర్వీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. యూటీఎఫ్ బలోపేతం, ిసీపీఎస్ రద్దు, ఉపాధ్యాయుల సంక్షేమం, టెట్ అర్హత పరీక్ష, బోధనేతర పనులతో విద్యార్థికి దూరమవుతున్న ఉపాధ్యాయుడు, అభ్యుదయ భావాలతో కూడిన విద్య అందరి బాధ్యత అనే అంశాల గురించి సమావేశంలో చర్చలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో ఎనిమిది తీర్మానాలు చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాయుడు, యూటీఎఫ్ నాయకులు ఎన్. కుమారరాజా, యన్. తాండవ కృష్ణ, ఎం. కళాధర్, వై. నాగమణి, జి. వెంకటేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, స్థానిక ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్వీ కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యూటీఎఫ్ నూతన కార్యవర్గం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా యు. రాజశేఖర్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం. కళాధర్, సహాధ్యక్షుడిగా జి వెంకటేశ్వర్లు, మహిళా సహాధ్యక్షులుగా షకీలా బేగం, కోశాధికారిగా గయా శుద్ధవుల, జిల్లా కార్యదర్శులుగా సీహెచ్. ఆదినారాయణ, జి. వెంకటేశ్వరరావు, సాంబశివరావు, కేదార్నాథ్, గోవిందు, రంగారావు. ప్రసాద్ , కామాక్షి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఘనంగా ముగిసిన యూటీఎఫ్ 51వ జిల్లా మహాసభలు -
ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్టీజింగ్ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు. ఈవ్టీజింగ్పై విద్యార్థులు, ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలు, ఆడపిల్లల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శక్తి బృందాలు, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో 10 మంది స్క్రబ్ టైఫస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన మహిళ, కొల్లూరు మండలం క్రాప, పొన్నూరు, దుగ్గిరాల, తెనాలి ఐతానగర్, కొల్లిపర, కొల్లూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరికి వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో గర్భిణి ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం లేదని సీనియర్ ఫిజిషియర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)ను అనివార్య కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జిల్లాలోని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ వారికి సహకరించాలని కోరారు. -
ప్రైవేటీకరణను సహించం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు. చంద్రబాబు సర్కార్ కమీషన్ల కోసమే ప్రైవేటీకరణకు యత్నిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు మంగళగిరి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. గాలిగోపురం మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్, బీఎండబ్ల్యూ షోరూమ్ వరకు సాగుతుంది. అక్కడి నుండి గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి ర్యాలీ చేరుకుంటుంది. అక్కడి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ర్యాలీని జయప్రదం చేయండి
నేడు ఉదయం 10 గంటలకు గుంటూరు కేంద్రంగా బృందావన్ గార్డెన్స్ నుంచి జరిగే కోటి సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి చేర్చేందుకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసి, తమ జేబులు నింపుకొనేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. చంద్రబాబు నిర్ణయంపై నిరసనగా రాష్ట్రంలో కోటి సంతకాలకు పిలుపునిస్తే.. కోటిన్నర సంతకాలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత దీనిబట్టి అర్థమవుతోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ నేడు జరిగే ప్రదర్శనకు తరలిరావాలని కోరుతున్నాం. – అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు -
బాబు కుట్రలపై నిరసన ‘సంతకం’
పట్నంబజారు: వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు చేసిన ఒక్కో సంతకం చంద్రబాబు సర్కారు కుట్రలపై నిరసన తీవ్రత తెలుపుతోంది. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అయింది. ప్రజా ఉద్యమంలా ముందుకు సాగింది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలకు అందకుండా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాలతో మద్దతు తెలిపారు. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజలు భారీగా తమ సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. అవగాహన కల్పించి మరీ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్లలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 1వ డివిజన్ నుంచి 15వ డివిజన్ వరకు, 17, 50, 51, 53, 54, 55. 56, 57 డివిజన్లలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నూరి ఫాతిమా 14 డివిజన్లలో స్వయంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. అనేక డివిజన్లలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే జరిగే అనర్థాలను ప్రజలకు స్వయంగా వివరించారు. అందరితో మమేకమవుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజెప్పారు. అనేక డివిజన్లలో ఆమె పర్యటించిన నేపథ్యంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 65 వేల సంతకాలను సేకరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, యువజన విద్యార్థి విభాగం నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోర్ కమిటీ నేతల సహాయ సహకారాలతో సంతకాల సేకరణ పూర్తయింది. కార్యక్రమానికి మైనార్టీ అసోసియేషన్ నేతలు, అఖిల భారత వడ్డెర సంఘం, మాదిగ సంక్షేమ పోరాట సమితి, ఆటో యూనియన్ నేతలు మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయానికి నియోజవకర్గం నుంచి సేకరించిన సంతకాల పత్రాలను పంపారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి. -
ప్రజా ఉద్యమం విజయవంతం
చంద్రబాబు నిరంకుశ పాలన, రూ.లక్షల కోట్ల అప్పులు, అందని ద్రాక్షగా సంక్షేమం, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులను ధారదత్తం చేస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారు. అందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నియోజకవర్గంలో 72 వేల మందికిపైగా ప్రజలు కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తన వర్గానికి రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించారు. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – బలసాని కిరణ్కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం
పేదలకు వైద్య విద్య, పేద విద్యార్థులకు వైద్యాన్ని దూరం చేసి కార్పొరేట్ శక్తులకు మరింత ఊతం ఇచ్చేలా చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించకూడదా..? వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వాటిని చంద్రబాబు తన తాబేదార్లకు దోచిపెట్టేందుకు దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. కచ్చితంగా కళాశాలల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆగదు. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల పరిశీలకుడు -
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రభుత్వం నిర్వహించాల్సిన వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ప్రకారం కోటి సంతకాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేయటం ఇందుకు నిదర్శనం. జిల్లా కేంద్రం నుంచి సంతకాల పత్రాలను రాష్ట్ర పార్టీ ఆఫీసుకు తరలించే ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలి. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయటం వలన అన్నివర్గాల విద్యార్ధులకు అపార నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్లు, ప్రతిభతో ముందుకు సాగే విద్యార్థులకు ఇదోక శాపంలాంటి నిర్ణయం. కేవలం దోచుకో, దండుకో, దాచుకో అనే సిద్ధాంతంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. వైఎస్ జగనన్న నేతృత్వంలో కచ్చితంగా ఎంతటి ఉద్యమాలకై నా వెనుకాడం. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనను విరమించుకునే వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తాం. – షేక్ నూరి ఫాతిమా, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ ద్వారా పేదలకు, వైద్య విద్య అభ్యసించే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణం. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు పొన్నూరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. సోమవారం ఉదయం గుంటూరులో జరిగే భారీ ర్యాలీకి అందరూ భారీగా తరలిరావాలి. – అంబటి మురళీకృష్ణ , పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు రెండో రోజూ అదే ఉత్సాహాన్ని కనబరిచారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ ఆధ్వర్యంలో జరుగుతున్న 45వ రాష్ట్రస్థాయి వెటరన్న్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, శ్రీ హాస్పిటల్ అధినేత చెరుకూరి పవన్కుమార్లు హాజరయ్యారు. విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్తోపాటు, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ మంగా వరప్రసాద్ తెలిపారు. విజేతల వివరాలు.. రెండో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరనన్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావు వెల్లడించారు. 5కె రన్నింగ్ పురుషుల 65 ప్లస్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన వి.సుధాకర్, 70 ప్లస్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎం. శంకరరావులు ప్రథమ స్థానం సాధించారు. మహిళల 5కె రన్నింగ్ 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి.కోటేశ్వరమ్మ, కె.శారదలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 1కెఎం వాక్ 90 ప్లస్ విభాగంలో డి.శేషగిరిరావు (గుంటూరు), 3కె వాక్ 70 ప్లస్లో బి.వెంకటలక్ష్మిలు ప్రథమ స్థానం సాధించారు. 481 పాయింట్లతో నెల్లూరు జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్, 431 పాయింట్లుతో విశాఖ జిల్లా రన్నర్స్గా నిలిచింది. బెస్ట్ మార్చ్ఫాస్ట్ వైజాగ్ ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కె.శ్రీనివాసరావు, ఇస్మాయిల్, రాఘవరావు, కృపారావు, అనిల్, ఎం.సత్యనారాయణలు వ్యవహరించారు. -
అన్ని వర్గాల నుంచి స్పందన
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో భారీ మద్దతు లభించింది. ప్రజల్లో తిరుగుతుంటే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. పేదవాడికి వైద్యం, వైద్య విద్యను దూరం చేసి కార్పొరేట్ వారికి ఆసుపత్రులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ప్రజలకు తెలిసిపోయింది. ఇకనైనా బాబు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి.పేదలకు న్యాయం చేయాలి. లేకుంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. – వనమా బాల వజ్రబాబు, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
పేదలంటే చంద్రబాబుకు చిన్నచూపు
పేదలన్నా, పేద విద్యార్థులన్నా చంద్రబాబు చిన్న చూపుతో చూస్తున్నారు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగడం సిగ్గుచేటు. జగనన్న పేద విద్యార్థుల కోసం అనేక కళాశాలలను, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. వాటన్నింటినీ చంద్రబాబు నాశనం చేస్తున్నారు. సంతకాల సేకరణ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమైంది. చంద్రబాబు సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – షేక్ నూరి ఫాతిమా, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ప్రైవేటీకరణపై నిరసన సంతకం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన ప్రత్తిపాడు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న అనాలోచిత నిర్ణయంపై ప్రజల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. ఊరూ, వాడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజా ఉద్యమంలో మేము సైతం అంటూ నిరసన ‘సంతకం’ చేశారు. చంద్రబాబూ.. ఇదేం తీరు... అంటూ తల్లిదండ్రులు ఆవేదన వెళ్లగక్కారు. సారూ.. భవిష్యత్తు ఏంటంటూ యువత నిగ్గదీసి అడిగింది. ఇక ఆరోగ్యం దేవుడి దయేనా.. అంటూ పేదలు నిష్టూర్చారు. యువత, మహిళలు, పెద్దలు, పేద, మధ్య తరగతి ప్రజలు ముక్తకంఠంతో నిరసన గళం వినిపించారు. తమ నిరసనను ప్రజాస్వమ్య పద్ధతిలో వ్యక్తం చేస్తూ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. నియోజకవర్గంలో అనూహ్య స్పందన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకారం చుట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామంలో అక్టోబరు 17వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో రచ్చబండలు అప్పటి నుండి గుంటూరు రూరల్ మండలం పరిధిలోని 11 గ్రామాల్లో, అర్బన్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో, ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు, గనికపూడి, పాతమల్లాయపాలెం, కొత్తమల్లాయపాలెం, కోయవారిపాలెం, కొండేపాడు, యనమదల, ఈదులపాలెం, తుమ్మలపాలెం.. సహా మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో, పెదనందిపాడు మండలంలోని కొప్పర్రు, పెదనందిపాడు, అన్నపర్రు, పాలపర్రు, జీజీపాలెం, గోగులమూడి.. సహా పద్నాలుగుకు పైగా గ్రామాల్లో, కాకుమాను మండలంలోని కొండపాటూరు, రేటూరు, కెబిపాలెం, చినలింగాయపాలెం.. సహా పదికి పైగా గ్రామాల్లో, వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు, వట్టిచెరుకూరు, అనంతవరప్పాడు, ఐదవమైలు, పుల్లడిగుంట, గారపాడు సహా మొత్తం పదమూడుకు పైగా గ్రామాల్లో రచ్చబండలో నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛందంగా సంతకాలు.. నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ప్రైవేటీకరణ వలన కలిగే అనర్థాలను వివరిస్తూ, అన్ని వర్గాల ప్రజలు తమకు తాముగా సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళికలు రచించారు. ప్రజలు తమ నిరసన గళాన్ని స్వచ్ఛందంగా సంతకాల రూపంలో వినిపించేలా పార్టీ క్యాడర్ను సమాయత్తం చేశారు. ఇప్పటివరకు గుంటూరు రూరల్ మండలంలో సుమారు 8,245, పెదనందిపాడు మండలం 4,416, కాకుమాను మండలం 10,498, ప్రత్తిపాడు మండలం 16,419, వట్టిచెరుకూరు మండలం 3,921, గుంటూరు అర్బన్ మండలం 27,727 కలిపి నియోజకవర్గం మొత్తం మీద సుమారు 71,226 సంతకాల సేకరణ పూర్తి అయింది. చంద్రబాబు ప్రభుత్వం తమకున్న వ్యతిరేకతను ప్రజలు సంతకాల రూపంలో చాటి చెప్పారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించిన దాని కంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రచ్చబండ వద్దకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసి నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు కూడా సంతకాల ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో ఏకంగా ఏపీకి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారు. వాటిలో ఐదు కళాశాలలను పూర్తి చేశారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం సిగ్గుచేటు. ఈ నిర్ణయంపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. –బలసాని కిరణ్కుమార్, సమన్వయకర్త, ప్రత్తిపాడు నియోజకవర్గం -
ఘనంగా ముగిసిన విజ్ఞాన్ బాలోత్సవ్
●జోనల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ● హజరైన ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట రూరల్: విద్యార్థులు బాల్యం నుంచే విభిన్నంగా ఆలోచించే దృక్పఽథాన్ని అలవరచుకోవాలని ఎంపీ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎస్ఏ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన విజ్ఞాన్ బాల మహోత్సవ్ జోనల్ ఆటల పోటీలు శనివారం ముగిశాయి. ఎంపీ లావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రియేటివిటీ, ఇన్నోవేషన్, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇండోర్ గేమ్, అవుట్ డోర్ గేమ్, వ్యక్తిగత హాబీ వంటి మూడు వ్యాపకాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మూడు వ్యాపకాలను పాటిస్తే విద్యార్థులు కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారని వివరించారు. జీవితంలో ఎప్పుడూ సెల్ప్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటి విషయంలో రాజీపడకూడదని, తల్లిదండ్రులు గర్వపడేలా మన పనులు ఉండాలని హితవు పలికారు. దేశం యువతపై ఆశలు పెట్టుకుందని, మీ జీవిత కథలో మీరే హీరోలుగా మారాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఎలా మెలగాలి, ఎలా పనిచేయాలో తెలుస్తుందన్నారు. బాల మహోత్సవ్లో భాగంగా బాలబాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, 100 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్జంప్, షాట్పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలను, గుంటూరు జిల్లా కోర్ట్ ప్రాంగణంలో 17 బెంచీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట ఎన్హెచ్16 వంతెన వద్ద జరిగిన ఒక ప్రమాదంలో అశోక్కి సంబంధించిన ప్రమాద బీమా కేసులో బాధిత కుటుంబానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ రూ. కోటి అందించింది. విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్, డాక్టర్ పి. రాజారామ్మోహన్ మధ్య ఐదు ముఖ్యమైన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. బెంగళూరులోని ఒక భూమి విక్రయ ఒప్పందం విఫలమైన వివాదంలో లోక్ అదాలత్ ద్వారా రూ.20 కోట్ల మేరకు రాజీ కుదిర్చారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ కేసులు 1,376, క్రిమినల్ కేసులు 21,415, చెక్ బౌన్స్ కేసులు 578, ప్రీ లిటిగేషన్ కేసులు 97 కలిపి మొత్తం 23,466 కేసులు పరిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విడిపోయిన జంటను ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా కలిపారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు. 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి ఔట్ఫ్లోగా 49,995 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 49,995 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్, కలైపట్టు పోటీలు ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులంతా క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాయా మోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుక్కా కొండయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి కలైపట్టు, ఫెన్సింగ్ పోటీలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధునిక నర్సింగ్ హోం డాక్టర్ వీర్నల ప్రత్యూష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేహదారుఢ్యం, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. కలైపట్టు అండర్– 17 బాలబాలికల విభాగాల్లో 60 మంది పాల్గొన్నారన్నారు. ఫెన్సింగ్ అండర్– 17, అండర్– 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 360 మంది క్రీడాకారులు హాజరు పోటీలకు రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల నుంచి సుమారు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీలు ఎం. గోపి, కె. నాగశిరీష ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప సిందూర, పర్యవేక్షకులు మోహనలక్ష్మి, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీపతి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు. -
యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు ●వాచ్మన్ను బంధించి రూ. 5 లక్షల విలువైన రాళ్లు అపహరణ మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెంలో క్రిస్టల్స్ (స్పటిక రాళ్లు) చోరీకి గురైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. యర్రబాలెం – పెనుమాక రహదారిలో కొన్నేళ్లుగా పలువురు భాగస్వామ్యంతో క్రిస్టల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు బీభ త్సం సృష్టించారు. నెంబరు ప్లేట్లు లేని మూడు కా ర్లలో వచ్చి వాచ్మన్ కుటుంబాన్ని బెదిరించి, తాళ్ల తో బంధించారు. కేకలు వేయకుండా నోటిపై ప్లాస్టి క్ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గోడౌన్ షట్టర్ తాళాన్ని కటింగ్ మిషన్తో కట్ చేసి, సీసీ కెమెరాల కనెక్షన్ను సైతం తొలగించారు. గోడౌన్లోకి ప్రవేశించి కొన్ని క్రిస్టల్స్ను గోతాల్లో నింపుకుని, వారు వచ్చిన కారుల్లో వేసుకుని పరారయ్యారు. అపహరణకు గురైన క్రిస్టల్స్ విలువ 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ముందుగానే చోరీకి వ్యూహం దుండగులు పక్కా వ్యూహంతోనే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్టల్స్ చోరీకి యత్నించారు. గోడౌన్ బయట వున్న కెమెరాల కనెక్షన్ను కూడా కత్తిరించారు. గమనించిన వాచ్ మన్ కుటుంబీకులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే క్రమంలో వాకీటాకీని జారవిడుచుకున్నారు. అప్పట్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి, దుండగులు వదిలి వెళ్లిన వాకీటాకీని సైతం పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలే కారణమా? నలుగురు భాగస్వాములు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మధ్య విభేదాల కారణంగానే ఈ చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒక భాగస్వామి వేరే ప్రాంతంలో క్రిస్టల్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆయనే ఈ ముఠాను పంపి భీభత్సం సృష్టించడంతో పాటు దొంగిలించుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీకి జరిగిన తీరులో కొంత భాగం కెమెరాల్లో నమోదైంది. గోడౌన్ లోపలికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి గతంలో ఇదే గోడౌన్కు వచ్చాడని, వాచ్మేన్ కుటుంబ సభ్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ పోలీసులు ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం గోడౌన్ను సీఐ ఎ.వి. బ్రహ్మం, ఎస్ఐ వెంకట్ సిబ్బందితో పరిశీలించారు. లోపల, బయట పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
వెటరన్.. అదిరెన్
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు అదరగొట్టారు. వయస్సును లెక్కచేయకుండా మూడు పదుల నుంచి ఏడు పదుల వయసు వరకూ సత్తా చాటారు. ప్రతిభకు ఆసక్తికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 45వ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. జాతీయ పతాకంతోపాటు క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో భాగంగా తొలిరోజు లాంగ్ జంప్, షాట్ పుట్, 100, 800 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి 35 ప్లస్, 40 ప్లస్ , 45 ప్లస్ , 50 ప్లస్ , 55 ప్లస్ , 61 ప్లస్ , 65 ప్లస్, 70 ప్లస్.. ఇలా వయస్సుల వారీగా మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇవీ.. తొలిరోజు విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావులు వెల్లడించారు. షాట్పుట్ 30 ప్లస్ మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో వి. సుదీప్తి (కృష్ణా జిల్లా), ద్వితీయ స్థానం ఎ. సావిత్రి (గుంటూరు), 40 ప్లస్ విభాగంలో డి. స్వర్ణవాహిణి (కృష్ణా) ప్రథమ స్థానం, ఆర్. నిర్మల (విశాఖపట్నం) ద్వితీయ స్థానం, 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ సి. విజయకళ ప్రథమ, కె. పద్మావతి ద్వితీయ స్థానాలు, 65 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన జె. లక్ష్మీ నరసమ్మ ప్రథమ స్థానం సాధించింది. మహిళల 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి. కోటేశ్వరమ్మ ప్రథమ స్థానం, పి. రాజేశ్వరమ్మ ద్వితీయ స్థానం, 65 ప్లస్ విభాగంలో నెల్లూరుకు చెందిన జె. లక్ష్మీనరసమ్మ ప్రథమ స్థానం సాధించారు. షాట్పుట్ 70 ప్లస్ మహిళల విభాగంలో విశాఖపట్నానికి చెందిన బి. వెంకటలక్ష్మి ప్రథమ స్థానం సాధించింది. 100 మీటర్ల పురుషుల పరుగు పందెం 70 ప్లస్ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ధనుంజయ, గుంటూరుకు చెందిన పి. వెంకటప్పయ్య, విశాఖకు చెందిన శంకరరావులు విజయం సాధించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. రన్నింగ్ పోటీల్లో క్రీడాకారుడులాంగ్ జంప్ పోటీల్లో మహిళఉత్సాహంగా ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ఆరంభం -
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ●తుళ్లూరులో ఘనంగా నయీ చేత న 4.0 కార్యక్రమం ●పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తాడికొండ: మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరు మేరీమాత హైస్కూలులో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సీఆర్డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వివక్ష తగ్గించడమే నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురౌతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని, ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ సమానత్వం వంట గది నుంచి ప్రారంభం కావాలని, అప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలరన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు. జెండర్ చాంపియన్లు చలివేంద్రి సుగంధి, తురకా శ్యామల మాట్లాడారు. జెండర్ చాంపియన్లను మంత్రులు సత్కరించారు. అనంతరం లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కరదీపికను విడుదల చేసి సెల్ఫీ తీసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసీడీఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సెన్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డీడీయు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్–డీఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డీఆర్డీఏ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఏపీఆర్జేసీలో ఘనంగా స్వర్ణోత్సవాలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్ పరివార్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైమ్యాట్ డైరెక్టర్, ఏపీఆర్ఈఐ కార్యదర్శి వి.ఎన్.మస్తానయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు రోజులుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురు సత్కారం జరిగింది. 1975వ సంవత్సరం నుంచి ప్రస్తుతం అధ్యాపకులుగా ఉన్న 118 మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్.సరోజిని మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఆర్ఎస్ఐ, ఎఫ్ఎస్ వంటి ఉన్నత ఉద్యోగులుగా, వివిధ రంగాలలో ఉన్నతులుగా చేసిన కళాశాలకు ప్రిన్సిపాల్గా పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. గురువుల గౌరవం మసకబారుతున్న ఈ తరుణంలో దాన్నిసజీవంగా ఉంచి, గురుభక్తిని చాటుకుని కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమాన్ని ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థులు ఎ.సైదారెడ్డి, ఎస్.నాగచారి, కె.వీరనంది, చక్రపాణి, జి.గోపాలరావులు నిర్వహించారు. తెలంగాణ విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, తెలంగాణ ఐజీ రమేష్రెడ్డి, ఐఏఎస్ అధికారి కె.వెంకటేశం, ఐఎఫ్ఎస్ అంబాసిడర్ సీహెచ్ రాజశేఖర్, పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.


