breaking news
Guntur District Latest News
-
ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోటీలు గురువారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, యాగంటి దుర్గారావుతో కలిసి శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు పోటీలు ప్రారంభించారు. పోటీల నిర్వహణ కార్యదర్శి పులివర్తి వెంకటేశ్వరావు (అజార్) మాట్లాడుతూ.. పోటీలు నవంబర్ 3వ తేదీ వరకు జరుగుతాయని, ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. స్నూకర్ విభాగంలో 215 మంది, బిలియర్డ్స్లో 38 మంది పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు జనవరి 2026లో హరియాణలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
అంతర పంటల విధానాన్ని అవలంబించాలి
నరసరావుపేట రూరల్: ఒకే పంట పద్ధతికి బదులుగా అంతర పంటల విధానం అనుసరించడం ద్వారా చీడపీడల ఉధృతి తగ్గించడంతోపాటు పంట నష్టాలను నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని బృందావన్ మీటింగ్ హాల్లో రైతు శిక్షకులకు రెండు రోజుల శిబిరం నిర్వహించారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని తెలిపారు. రైతు శిక్షకులు తమ పరిధిలోని రైతులు ప్రకృతి పద్ధతులు ఆచరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 190 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్కు రైతు శిక్షకుడిని నియమించినట్టు తెలిపారు. ప్రతి క్లస్టర్లో 125 మంది రైతులు 125 ఎకరాల్లో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతకు ప్రకృతి వ్యవసాయమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం గ్రామ/వార్డు మహిళా పోలీసులకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అవగాహన వల్లే సైబర్ నేరాలు, మోసాలను నివారించవచ్చు అనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. 1930 జాతీయ సైబర్ భద్రత సహాయత నంబర్ 1930పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసంగా ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన సదస్సులు చేపడుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు ప్రతి రోజు ప్రజలతో మమేకమవ్వాలన్నారు. బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పాఠశాలల్లో మంచి–చెడుల స్పర్శ, సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాలు, మోసాలు ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరగాళ్ల బారినపడి, డబ్బు పొగోట్టుకుంటున్నారని అన్నారు. ప్రతి మహిళా పోలీస్ సమాజంలో సైబర్ భద్రత రాయబారి పాత్ర పోషించాలని అన్నారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆవిష్కరించారు. సదస్సులో ఐటీ కోర్ సీఐ నిస్సార్బాషా, హెడ్కానిస్టేబుల్ కిషోర్, మహిళా కానిస్టేబుళ్లు మానస, అరుణ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
పత్తి విక్రయాలకు ‘కపాస్’
కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం పత్తి విక్రయాలకు ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్’ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారానే విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టింది. అంటే సాగుదారులు ఖచ్ఛితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ను ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టింది. అయితే పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ఈసారి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయాధికారులు ఈ–క్రాప్ బుకింగ్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇవి తప్పనిసరి.. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదు. గతంలో 16 శాతం వరకు అనుమతి ఉండేది. పొడవాటి దూది గల(లాంగ్ స్టేఫుల్) పత్తికి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర, మధ్యస్థంగా ఉండే దూదికి టే క్వింటాలుకు రూ.7,710 కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. దళారుల దోపిడీకి చెక్.. రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. కొంతమంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. వివరాల నమోదు ఇలా.. రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు? ఎప్పుడు? ఎంత సరుకు? ఏ మార్కెట్? ఏ జిన్నింగ్ మిల్కు తెస్తున్నారు? తదితర విషయాలు పొందుపర్చాలి. పాసు పుస్తకం వివరాలు, బ్యాంక్ ఖాతానూ అందులో యాడ్ చేయాలి. లేదంటే పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవచ్చు. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు చాలామంది రైతులకు తెలియక తికమక పడుతున్నారు. కొందరు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. వారి వివరాలనూ ఇందులో నమోదు చేయాలి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చినా.. వారు ఇంత వరకు రైతులకు అవగాహన కల్పించలేదు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక అత్యధిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎరువుల కొరత లేకుండా చూడండి
మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వ్యవసాయ సిబ్బందితో ఎరువులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలకు రబీ సీజన్లో డీఏపీ ఎక్కువ అవసరం ఉంటుందని ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ కమిషనర్ మంజీర్ జిలానీకి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దంకి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం, సుదర్శన రాజు నియోజకవర్గ వ్యవసాయాధికారులు వెంకటకృష్ణ, రామ్మోహన్రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, వెంకటరామయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో తమ్ముళ్ల పాగా
లాం (తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి అడ్డదారుల్లో సొంతం చేసుకునేందుకు లీజు డ్రామా ఆడిన తమ్ముళ్ల ఆగడాలను ఈ నెల 8వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి సర్వే నెం 199/ఏలో ఉన్నది ప్రభుత్వ భూమే అంటూ తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ జారీ చేసినందుకు గాను గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అయితే సదరు కార్యదర్శి ఈ విషయం తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎన్ఓసీని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, కనెక్షన్ తొలగించాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ తొలగించకపోవడంతో ఆక్రమణదారులకు పని సులువైంది. బుధవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఎంచక్కా బ్రిక్స్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషినరీని తరలించి యంత్రాల సాయంతో దించి లోపల పెడుతున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకొని అనంతరం ఫోన్లు ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. 199/ఎ సర్వే నంబర్లో ఆక్రమనలు ఉన్నాయి తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేసి నిరుపేదలకు చెందిన 40 ఇళ్లు నిలువునా కూల్చిన నాయకుడే ఇప్పుడు తిరిగి అదే సర్వే నెంబర్లో అర్ధరాత్రి ఆక్రమణకు పాల్పడటం విశేషం. -
ఏఎన్యూలో ఎస్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
పెదకకాని: ఏపీ ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..ఎస్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్మెంట్, 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లను అప్గ్రేడ్ చేసే ప్రక్రియలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్, నాగార్జున వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాంప్రసాద్, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, పలువురు ముఖ్య అధికారులు, స్పాన్సర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఎన్యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన పలు డిగ్రీ, పీజీ కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం ఇన్చార్జి రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, దూర విద్యా కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు విడుదల చేశారు. డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్), బీబీఏ కోర్సుల 1, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. అలాగే, ఎంఏ ఎకనామిక్స్ 1, 2, 3, 4 సెమిస్టర్ల, బీఎల్ఏఎస్సీ కోర్సుల 1, 2 సెమిస్టర్ ఫలితాలు విడుదల య్యా యి. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ కోర్సులకు ఒక్కో పేపరుకు రూ.770, పీజీ కోర్సులు ఒక్కో పేవరుకు రూ.960 నవంబరు 11వ తేదీలోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెబ్సైట్లో పొందుపర్చామన్నారు. తెనాలి: ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న తెనాలిలో ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సూతపురాణం శత వసంతాల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటయ్యే సభకు ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ అధ్యక్షత వహిస్తారు. భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్/రచయిత రావెల సాంబశివరావు, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు బి.సాంబశివరావు సూతపురాణంపై ప్రసంగిస్తారు. -
ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాలి
బాపట్ల: ౖరెతులకు ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్ పేర్కొన్నారు. కళాశాలలో గురువారం రైతులకు మిల్లెట్ల ప్రాసెసింగ్, విలువ వృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పప్పుధాన్యాలకు సంబంధించిన ప్రాసెసింగ్పై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. గ్రామీణ యువత మిల్లెట్ల ప్రాసెసింగ్ ద్వారా కొత్త పారిశ్రామిక అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. మిల్లెట్లు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. విశ్వవిద్యాలయం వారు రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఆధునిక ప్రాసెసింగ్ సాంకేతికతలను అందుబాటులోకి తెస్తోందని ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు రైతులలో వ్యాపారస్ఫూర్తిని పెంచుతాయని పేర్కొన్నారు. విభాగాధిపతులు డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ కేవీఎస్ రామిరెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణువర్ధన్, డాక్టర్ కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్ -
ఆచార్యా... ఇంత నిర్లక్ష్యమా?
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ పరీక్షల తీరు, ఫలితాల విడుదలపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించామని వర్సిటీ అధికారులు పత్రికాముఖంగా తెలిపారు. అక్టోబర్ 23వ తేదీని పునఃమూల్యాంకనం (రీవాల్యుయేషన్)కు చివరి తేదీగా పేర్కొన్నారు. గతంలో ఫలితాలు ప్రకటించిన రోజునే మార్కులు వెబ్సైట్లో పొందుపరిచేవారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్సైట్లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 507 మంది పరీక్షలు రాయగా 357 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఆ ఫలితాలు అందకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఫొటోగ్రఫీ ఇన్ డిప్లమో, లా కళాశాలల వారి ఫలితాల విషయంలోనూ అధికారులు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారు. పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత ఉద్దేశపూర్వకంగానే మార్కులు వెబ్సైట్లో పొందుపరచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇదే సమస్య పరీక్ష ఫలితాల విడుదలలో ఇలా నిర్లక్ష్యంగా ఉండటం వర్సిటీ అధికారులకు కొత్తేమీ కాదని... గత 14 నెలలలో తాత్కాలిక అధికారుల హయాంలో పలుమార్లు ఇలా జరిగాయని విద్యార్థులు అంటున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు వెంటనే విద్యార్థులకు ఫలితాలు తెలియజేయడం గమనార్హం. గడువు దగ్గర పడటంతో మార్కులు తెలుసుకునేందుకు విద్యార్థులు వర్సిటీకి పరుగులు తీస్తున్నారు. సంబంధిత సిబ్బందిని సంప్రదించగా మార్కులు చెప్పేందుకు కూడా కొందరు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు మౌనం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యార్థులకు నోట్బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన టెల్సా
రొంపిచర్ల: మండలంలోని పాఠశాలకు టెల్సా సంస్థ రూ.6,51,500లతో సమకూర్చిన నోట్ పుస్తకాలు, స్టీల్ ప్లేట్లు, జామెంట్రీ బాక్స్లను గురువారం సంస్థ ప్రతినిధి కరిముల్లా, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మేశ్వరరావుకు అందజేశారు. బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు టెల్సా అందించిన నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్లు, స్టీల్ ప్లేట్లను అన్ని పాఠశాలలకు అందజేస్తామన్నారు. టెల్సా సంస్థ ప్రతినిధి కరిముల్లా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎం.సుభాని, పి.రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బగళాముఖి సేవలో బాలస్వామీజీ చందోలు(కర్లపాలెం): ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని పెనుగొండ వాస వీ పీఠాధిపతులు శ్రీబాలస్వామీజీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి ఆలయ పూజారులతో కలసి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవా రి దర్శనం అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్ర దీక్ష అనంతరం బగళా ముఖి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చి నట్లు తెలిపారు. అనంతరం స్వామీజీకి ఆల య మేనేజర్, అభివృద్ధి కమిటీ చైర్మన్, పూజా రులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చిలకలూరిపేట టౌన్: ఇద్దరు యువకులు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్ ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిలకలూరి పేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తెనపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఉయ్యాల శ్రీనివాసరావు తన విధుల్లో భాగంగా తిరుపతి నుంచి వయా చిలకలూరిపేట మీదుగా సత్తెనపల్లి వెళ్లే క్రమంలో బస్సును స్థానిన ఎన్ఆర్టీ సెంటర్లో నిలుపుదల చేసి పక్కన ఉన్న టీస్టాల్లో టీ తాగుతున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు డ్రైవర్పై పడ్డారు. వారిని కసురుకున్నందుకు వారిద్దరు వాగ్వాదానికి దిగి డ్రైవర్పై దాడి చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న మార్కెట్ను సీజ్ చేయాలి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : బుడంపాడు బైపాస్ సర్వీస్ రోడ్డులో అక్రమ లే అవుట్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహా హోల్సేల్ కూరగాయాల మార్కెట్ను వెంటనే సీజ్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ నూతన లీజు దారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కౌన్సిల్ సమావేశం వద్ద బ్యానర్ పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
ముగ్దమనోహరంగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం గాజుల తో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీ య, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజాము న అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతు లు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమా రు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికా రులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితోపాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చు కున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటలపాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించి న గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు. ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రద్దీ తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ పెరిగింది. -
ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించతలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావులతో కలసి అంబటి పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 28వ తేదీన ప్రజా ఉద్యమం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తోందని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై నిరసన గళం వినిపించేందుకు ప్రజాస్వామ్య వాదులు, ఉద్యమకారులు, మేధావులు తరలిరావాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తప్పదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. 28న జరిగే ప్రజా ఉద్యమ కార్యక్రమం కూటమి పతనానికి సంకేతాన్ని ఇవ్వబోతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, దానం వినోద్, సత్తెనపల్లి రమణి, యేటి కోటేశ్వరరావు యాదవ్, కొరిటెపాటి ప్రేమ్కుమార్, రూత్రాణి, అనిల్రెడ్డి, పార్టీ నేతలు చింతపల్లి రమణ, సూరసాని వెంకటరెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, కోటి, తోట వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఓర్సు శ్రీనివాసరావు, అరవింద్, కొల్లు శివప్రసాద్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి పిలుపు -
పులి వీరంగం!
‘ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్’... ఇవీ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరికలు. అదీ ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబుపై చేసిన వ్యాఖ్యలు. అదీ ఎందుకంటే... గుంటూరు నగర నడిబొడ్డున రూ.వందల కోట్లు విలువ చేసే నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు ఇలా వార్నింగ్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్: నగర పాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం గురువారం మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ప్రారంభమైంది. తొలుతే నార్ల ఆడిటోరియం వైఎస్సార్సీపీ సభ్యులు వ్యతిరేకించారు. ముందుగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఆర్థికంగా బలంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్లో రూ.6 కోట్ల కోసం విలువైన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజల పన్నులతో నగర అభివృద్ధి జరుగుతోందని గుర్తుచేశారు. అటువంటి నగరపాలక సంస్థ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా నార్ల ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ మోడ్లో అన్నమయ్య ట్రస్ట్కు కట్టబెట్టేందుకు అర్హతలు ఏంటి, ఓపెన్ ఆక్షన్ పెడితే బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. అలా కాకుండా కేవలం ఒక్క అన్నమయ్య ట్రస్ట్కే ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సదరు ట్రస్ట్ బాలాజీ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తూ ఒక్కో ఫంక్షన్కు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆడిటోరియాన్ని ఫినిషింగ్ పెండింగ్ ఉందని రూ.6 కోట్ల కోసం అన్నమయ్య ట్రస్ట్కు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలు అక్కడ ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉండదన్నారు. దీనిని కార్పొరేషన్ నిర్మించి, నిర్వహణ బాధ్యత కూడా జీఎంసీ చూడాలని మరో కార్పొరేటర్ షేక్ రోషన్ డిమాండ్ చేశారు. కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఆగ్రహం అన్నమయ్య సేవా సమితి సభ్యులకు నార్ల ఆడిటోరియాన్ని అప్పగించేందుకు కార్పొరేషన్కు ఉన్న అధికారాలు ఏంటి?, లీజుకు ఇవ్వొచ్చా? అద్దెకు ఏ ప్రతిపాదికన ఇవ్వొచ్చు? కస్టోడియల్ రైట్స్ ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం లేకుండా కౌన్సిల్ పెట్టి పాస్ చేయండి అని అడిగితే.. తాము దీనికి పూర్తి వ్యతిరేకమంటూ తన డిసెంట్ను రికార్డ్ చేయాలని కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకు ఇచ్చారు. అదే క్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా.. ‘నేను తీసుకోను.. అధికారులకు డిసెంట్ ఇచ్చే అధికారం సభ్యులకు లేదు.. మేయర్కు మాత్రమే ఇవ్వాలని. అవసరమైతే కమిషనర్ చాంబర్లో కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. ‘నువ్వెలా డిసెంట్ తీసుకుంటావు.. ఇచ్చేయ్’ అంటూ కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఊగిపోతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు డిసెంట్ ఇవ్వకూడదని రాసివ్వాలని కమిషనర్ను డిప్యూటీ మేయర్ కోరారు. మేయర్ రవీంద్ర సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తుండగా ‘మీరు ఉండండి..’ అంటూ మేయర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కమిషనర్. ఈ క్రమంలోనే మేయర్, కౌన్సిల్ సెక్రటరీ పాత్రలను కూడా కమిషనర్ చేస్తున్నారని డిప్యూటీ మేయర్ విమర్శించారు. ఈ క్రమంలో ‘ఎక్స్ట్రాలు మాట్లాడకు.. కంట్రోల్ యువర్ టంగ్’ అంటూ తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలా మాట్లాడటం తగదని అన్నారు. సభ్యులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కమిషనర్కు వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు వ్యతిరేకించినా ఈ తీర్మానాన్ని ఆమోదించారు. -
● నమ్మండి.. ఇది రాజధాని రోడ్డు..
తాడికొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన స్మార్ట్ రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పే కూటమి ప్రభుత్వం.. అమరావతికి వెళ్లే రహదారిని మాత్రం మరమ్మతులు కూడా చేయించలేకపోతోంది. గుంటూరు నుంచి తుళ్ళూరు వెళ్లే ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ప్రమాదాలకు నిలయమైంది. దీని దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ఇటీవల మాట్లాడినా పట్టించుకునే వారే కరువయ్యారు. పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోంది. పెదపరిమి– తుళ్ళూరు గ్రామాల మధ్య ఉదయం ఓ ఇసుక లారీ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు లాగారు. సాయంత్రం మరో లారీ గుంతలలో అదుపుతప్పి పక్కకు బోల్తా కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కనీసం ఆటోలు సైతం ప్రయాణించలేని దుస్థితిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యే లేవనెత్తినా మరమ్మతులు శూన్యం -
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
తాడికొండ: గుంటూరు నగరంలో, జిల్లాలోని వివిధ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం పర్యటించారు. ఉదయం నుంచి వర్షాలు విస్తృతంగా కురవడంతో లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మూడు వంతెనలు వద్ద, బ్రాడీపేట నాలుగవ లైన్ మీదుగా పట్టాభిపురం అండర్ వే బ్రిడ్జి (కంకర గుంట బ్రిడ్జి) వద్దకు వెళ్లారు. జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. మురుగు నీటి వ్యవస్థను మరింత పక్కాగా నిర్వహించాలని సూచించారు. అక్కడి నుంచి నంబూరు వద్ద బుడంపాడు కాలువను, గుంటూరు చానెల్, గుంటూరు నల్లాను పరిశీలించారు. నంబూరు గ్రామానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కంతేరు రోడ్ అండర్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. ఎర్రవాగు, కంతేరు వాగు, కోటెళ్లవాగులను పరిశీలించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం గుంటూరు వెస్ట్: మండలంలో ప్రతి రెవెన్యూ అంశం తహసీల్దార్లకు తెలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. తెనాలి రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలపై ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి అంశంలో తహసీల్దార్లు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రతి అంశంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. -
మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన
రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరందరకూ కౌలు చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. అయితే తేమ శాతం పేరుతో, గోనె సంచులు సరిపడా లేవన్న సాకులతో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ధాన్యం కొనుగోలుకు కీలకమైన తేమశాతం చూసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. తేమ శాతం చూశాక, ధాన్యాన్ని గోతాలకు ఎత్తి సంబంధిత రైస్మిల్లుకు పంపాక, అక్కడ మరోసారి తేమశాతం చూసి తిప్పి పంపిన సందర్భాలు అనేకం రైతులకు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిర్వహించినా, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కొన్నది తక్కువే అయినా డబ్బులు వెంటనే చెల్లించామని ప్రచారం చేసుకున్నారు. ఈ ఏడాదైనా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ తులసి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఏడాది 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, దీనికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నామని తెలిపారు. -
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్గా (హెచ్వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. పదోన్నతి కౌన్సెలింగ్కు 25 మంది హెచ్వీలను పిలువగా, వారిలో నలుగురు పదోన్నతి వద్దంటూ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో 21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సు (నాన్ టీచింగ్) నర్సుగా పదోన్నతి కల్పించి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్ ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్అనిల్ పాల్గొన్నారు. పదోన్నతి ఉత్తర్వులు అందించిన ఆర్డీకి వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి.. ఒంగోలు మలేరియా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరావుకు ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించి నెల్లూరు మలేరియా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరు ఆర్డీ కార్యాలయంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు. -
కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు సన్నద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: కౌశల్–2025 పేరుతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ క్విజ్ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. భారతీయ విజ్ఞానమండలి, ఏపీ సైన్స్ సిటీ, అప్కాస్ట్ సంయుక్తంగా తిరుపతిలో నవంబర్ 27న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్విజ్, రీల్ పోటీలతో పాటు, పోస్టర్ కాంపిటీషన్స్ జరుగుతాయని వివరించారు. పాఠశాలస్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 1,2,3వ తేదీలతో పాటు జిల్లాస్థాయిలో నవంబర్ 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బీఆర్క్ కోర్సు 1/5 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా ఐదుగురు ఉత్తీర్ణత సాధించారు. రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 38 మందికి 34 మంది పాస్ అయ్యారు. ఎంబీఏ కోర్సు రెండవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 754 మంది పరీక్షలు రాయగా వారిలో 610 ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్కు నవంబరు 3లోగా ఒక్కో పేవరుకు రూ.2070 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలానే ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ కోర్సు 1/5 రెండవ సెమిస్టర్ జూలైలో జరిగిన పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో ఒకరు ఉత్తీర్ణత సాధించారు. అలానే ఫార్మా డీ, ఎంఈడీ కోర్సు 4వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను కూడా ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్యూబీ సమీపంలోని హలోబ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోటా ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 04 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలపగా ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోటా సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. మంగళగిరి టౌన్: సాక్షి దినపత్రిక మంగళగిరి రిపోర్టర్ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి (52) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అస్వస్థతతకు గురికావడంతో చికిత్స నిమిత్తం మంగళగిరి నగర పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం మృతి చెందారు. వెంకటేశ్వరరెడ్డి స్వస్థలం నెలూరుజిల్లా, ఉదయగిరి. సుమారు దశాబ్దకాలం పైగా పాత్రికేయ రంగంలో విశేషసేవలు అందించారు. మంగళగిరి ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
వైభవంగా కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో కార్తిక మాస పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు, పందిళ్లు, దీపారాధన కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు అధికసంఖ్యలో జరిగాయి. పెదకాకాని శివాలయంలో భక్తుల సందడి -
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లలితకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి నైతిక విలువలు పతనమవుతున్నాయని అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, న్యాయ కళాశాలల్లో మానవ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. శ్రీశ్రీ,, వేమన, కరుణశ్రీ,, గురజాడ వంటి కవుల కలం నుంచి జాలువారిన సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతను ప్రభావితం చేస్తోందన్నారు. తన సోదరి ఓల్గా మరణానంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ భాషలు, వాటి సాహిత్య విలువలను విద్యార్థుల్లో ప్రేరేపించే ప్రక్రియలో భాగంగా తొలిసారి వర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. కవులు, విమర్శకులు, సాహిత్యాభిలాషులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఆలోచనల నుంచి వచ్చే నూతన సృజనలకు ప్రాణం పోయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఓల్గాను సత్కరించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ప్రేమ్కుమార్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్ డీన్ డాక్టర్ బిష్ణు పథ్, విభాగాధిపతి డాక్టర్ శయంటిన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. సీ్త్రవాద రచయిత్రి పి.లలితకుమారి -
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మహాధర్నాకు గుంటూరు జిల్లా నుంచి వందమందికిపైగా వైద్యులు, వైద్య సిబ్బంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆషా గుంటూరు నేతలు బుధవారం మీడియాకు వెల్లడించారు. పేరుకుపోయిన బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నెటవర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులు 95 ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 700 వరకు చికిత్సలు, ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం సుమారు రూ. 2,700 కోట్లు ఆసుపత్రులకు ఏడాది కాలంగా చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతోపాటుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ క్లయిమ్ అప్రూవల్స్ సుమారు రూ. 670 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క నిధులు చెల్లించకుండా మరోపక్క డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాటు చేసిన గైడ్లైన్స్ కమిటీలో కనీసం తమకు ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం తమను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆషా నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రూ.670 కోట్లు చెల్లించడంతోపాటు గైడ్లైన్స్ కమిటీలో తమను కూడా భాగస్వాములను చేయాలనే డిమాండ్తో ఈ నెల 10 నుంచి ఆషా ఆధ్వర్యంలో హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేశారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఆషా సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకర్ కోరారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించనందుకు నిరసన -
స్మార్ట్సిటీ కార్మికులకు పెండింగ్ జీతాలను చెల్లించాలి
తాడికొండ: రాజధాని అమరావతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ ఉన్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే చెల్లించాలని రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రవి మాట్లాడుతూ పెండింగ్ జీతాలు కోరుతూ ఈనెల 10వ తేదీన తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని గ్రామాలలోని పారిశుద్ధ్య కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అదేరోజు రాత్రి ఏజెన్సీ నిర్వాహకులు ఆగస్టు నెల జీతాన్ని కార్మికుల అకౌంట్లలో జమ చేశారన్నారు. కానీ సెప్టెంబర్ పెండింగ్ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని కోరగా 13వ తేదీన కొందరు కార్మికులకు మాత్రమే జమ చేసి, చాలామందికి వేయలేదన్నారు. ఈ విషయాన్ని సీఆర్డీఏ అధికారులు, ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ మండిపడ్డారు. కార్మికులకు పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించే విషయంలో ఏజెన్సీ సాకులు చెప్పడం మాని వెంటనే వారి అకౌంట్లో పెండింగ్ జీతాన్ని జమ చేయాలని రవి డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షురాలు సిహెచ్ సుశీల, నాయకులు ఎన్.వీర లంకమ్మ, వి.బుజ్జి, జె.లక్ష్మీ తిరుపతమ్మ, ఎం.మేరీ, కె.అరుణ్ కుమార్, మాలతి, పి.రూతమ్మ, జి.మల్లేశ్వరి, మధురవాణి, చలివేంద్రం జయమ్మ, జయమేరి తదితరులు పాల్గొన్నారు.రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.రవి -
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నేటికీ సీ్త్రశక్తి పథకానికి సంబంధించిన రాయితీ బకాయిలు రూ. 500 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. డీజిల్ కొనుగోలుకే నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. సీ్త్రశక్తి పధకం సాఫల్యవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీకి రాయితీ నిధులు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 3 వేల బస్సులను కొనుగోలుచేసి వాటికి 10 వేల మంది సిబ్బందిని అన్నికేటగిరీల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమల్లో కొన్ని డిపోల్లో అధికారులు కండక్టర్లను అనవసరంగా సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలు ఆందోళనకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, జిల్లా కార్యదర్శి విజయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మంగళగిరి డిపో కమిటీ అధ్యక్షులు సాంబశివరావు, జిల్లాలోని జోన్, డిపోస్ధాయి అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి చేటు
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన 17 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి, గవర్నర్ను కలసి ప్రజల గొంతుగా వినిపించేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొంత మందికే లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ● మాజీ ఎంపీ, ఎన్టీఆర్ పార్లమెంటరీ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ● పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ● పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ వైద్య కళాశాలల పీపీపీ పద్ధతితో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గం 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి) డివిజన్ నుంచి సంతకాలు సేకరించి, నియోజకవర్గ ఇన్చార్జి అంబటి రాంబాబుకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
ఆక్రమణలోని ప్రభుత్వ భూములను గుర్తించాలి
గుంటూరు వెస్ట్: ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నంబర్లవారీగా ఆక్రమణలు గుర్తించాలన్నారు. వాటి జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులను పరిశీలించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను సైతం సిద్ధం చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పూర్తి సహకారం అందించాలన్నారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్లు గంగ రాజు, విజయలక్ష్మి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం తొలి తరం ఐఏఎస్ అధికారిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా కొనియాడారు. ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి అధికారులు, సిబ్బంది తదితరులు ఎస్ఆర్శంకరన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శంకరన్ వ్యక్తిత్వం, సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కీర్తించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలి
కొరిటెపాడు(గుంటూరు): పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్, సీసీఐ కొనుగోలు కేంద్రాలపై గుంటూరు మార్కెట్ యార్డులో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులతో వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 సీసీఐ కొనుగోలు కేంద్రాలతోపాటు మరో 11 మార్కెట్ యార్డుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. పొడవు పింజ పత్తి క్వింటాకు రూ.8,110లు, మధ్యస్త పింజ పత్తి క్వింటాకు రూ.7,710లు చెల్లిస్తామని వివరించారు. కొనుగోళ్ల ప్రారంభ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత మిల్లుకు పత్తిని తీసుకువెళ్లి విక్రయించుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ సమస్యలపై రైతులు వాట్సాప్ హెల్ప్ లైన్ నంబరు 7659954529ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర షా, మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, కాకుమాను శ్రీనివాసరావు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన్నవ హరనాథబాబు తదితరులు పాల్గొన్నారు. -
మెడికవర్ హాస్పటల్స్తో ఆదిత్య హాస్పటల్ భాగస్వామ్యం
గుంటూరు మెడికల్: గుంటూరులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటైన ఆదిత్య హాస్పటల్ అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాల్లో గుర్తింపు పొందిన యూరోపియన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ మెడికవర్ హాస్పటల్స్తో కీలక భాగస్వామ్యంఏర్పాటు చేసుకుంది. ఈమేరకు బుధవారం బుడంపాడులో నూతనంగా నిర్మించిన హాస్పటల్లో ఇరు ఆసుపత్రుల యజమాన్యాలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రెండు ఆసుపత్రుల కలయిక గుంటూరు, పరిసర జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, సాంకేతికత పెంపుదలకు దోహదపడుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. గుంటూరులో 2018లో స్థాపించబడిన ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్, నేడు 350 పడకలతో ఏటుకూరు – బుడంపాడు మధ్య జాతీయ రహదారిపై నిర్మిత మైందన్నారు. ఈ ఆస్పత్రిని నవంబరు 27న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవల డాక్టర్ హనుమ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను ప్రవేశపెట్టామన్నారు. ఆదిత్య హాస్పటల్స్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అముల్య మాట్లాడుతూ మెడికవర్ భాగస్వామ్యంతో గుంటూరులో అంతర్జాతీయ ఆధునిక చికిత్సలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదిత్య హాస్పిటల్స్ డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో రోబోటిక్, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు అందుబాటులో తెచ్చామన్నారు. మెడికవర్ హాస్పటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంతో అత్యాధునిక వైద్యం లభిస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలోని ప్రతి నగరానికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
జీఎంసీ ‘పీ..పీ..పీ..’
తమ్ముళ్ల దోపిడీకి రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా ● కార్పొరేషన్ భూములను తమ వారికి కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం ● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని అన్నమయ్య ట్రస్టుకి ఇచ్చేందుకు చర్యలు ● రూ.వందల కోట్ల బడ్జెట్ ఉన్నా రూ.6 కోట్లు ఖర్చు చేయలేమని సాకులు ● రూ. 70 కోట్ల విలువైన స్థలం 20 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే యత్నం ● ఇప్పటికే చిన్మయా, వెంకటేశ్వర బాల కుటీర్కు కార్పొరేషన్ స్థలాలు అప్పగింత ● నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: బృందావన్ గార్డెన్స్లోని ప్రభుత్వ స్థలంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణానికి 1999లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ ఆడిటోరియం ప్రస్తుతం శ్లాబు దశ పూర్తి చేసుకుంది. ఫినిషింగ్ మాత్రమే మిగిలి ఉంది. సుమారు రూ.ఆరు కోట్లు ఖర్చు పెడితే నగరానికే తలమానికంగా మారనుంది. కానీ ఆడిటోరియంపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు తతంగాన్ని పూర్తి చేశారు. రూ.1500 కోట్ల బడ్జెట్ ఉన్న నగరపాలక సంస్థకు రూ.ఆరు కోట్లు ఖర్చు చేయడం పెద్ద పనేం కాదు. కానీ తమ వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీని వెనుక కేంద్ర మంత్రి సహకారం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను చిన్మయా విద్యాసంస్థలు, వెంకటేశ్వర బాలకుటీర్కు అప్పగించిన అధికారులు ఇప్పుడు మరో విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోనే ఈ అంశాన్ని టేబుల్ అజెండాగా పెట్టి చర్చించకుండానే ఆమోదించినట్లు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై వివరాలు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లేఖ రావడంతో దీన్ని మళ్లీ కౌన్సిల్ ముందుకు పెట్టారు. అభివృద్ధి ప్రాజెక్టు పరిధి మరియు వినియోగం, పీపీపీ ఒప్పందపు కాల వ్యవధి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు లభించే ఆదాయం వాటా, నిర్మాణ స్థిరత్వ బాధ్యత, ప్రాజెక్టు హక్కు/హోదా, ఒప్పందం నిబంధనలు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విజయవాడకు చెందిన వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి నివేదిక తెప్పించారు. రూ.8 లక్షలు ఖర్చు చేసి కన్సల్టెన్సీ నుంచి నివేదిక తయారు చేయించారు. ఆడిటోరియం పూర్తి అయిన తర్వాత వచ్చే ఆదాయంలో 60 శాతం కార్పొరేషన్కు, 40 శాతం అన్నమయ్య సేవా సమితికి కేటాయించేలా ఒప్పందం తయారు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఏ సమాచారం కూడా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ నివేదికలో ఏముంది? ఈ ఒప్పందాన్ని మొత్తం మున్సిపల్ కమిషనర్ ఆమోదించారా? ఎవరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు? వంటి అంశాలేవీ ఇప్పటి వరకూ కౌన్సిల్ ముందు ఉంచలేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 37వ వార్డులో పలు అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్ ఆమోదం కోసం చర్చించనున్నారు. కేవలం 37వ డివిజన్లోనే రూ.2.60 కోట్ల వర్కుల ఆమోదానికి అత్యవసర సమావేశంలో అంశాలను చేర్చారు. ఇంత అత్యవసరంగా మేయర్ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, నార్ల ఆడిటోరియం అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. అదే బాటలో గుంటూరు తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల విలువైన స్థలంలో నిర్మాణంలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని ఒక సంస్థకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసం ఏకంగా గురువారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్నే ఏర్పాటు చేసేశారు. -
పంట నమోదు చేయించుకుంటేనే పరిహారం
అచ్చంపేట: రైతులంతా పంటలను వ్యవసాయ సిబ్బందితో సంబంధిత యాప్లో నమోదు చేయించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాలు, రాయితీలు వర్తించవని జిల్లా వ్యవసాయాధికారి యం.జగ్గారావు తెలిపారు. మండలంలోని చిగురుపాడు, చింతపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పత్తి పొలాల్లో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులతో సంప్రదించి ప్రతి ల్యాండ్ పార్సిల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పంట నమోదుకు ఈనెల 25వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. ఈలోపు సాగులో ఉన్న పత్తి పంటను యాప్లో నమోదు చేయాలని తెలిపారు. రానున్న రబీ సీజన్లో రాయితీపై శనగలు, మినుములు ఇవ్వనున్నట్లు రైతులకు తెలిపారు. ఎరువుల దుకాణాల తనిఖీ.. అనంతరం ఆయన అచ్చంపేటలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎమ్మార్పీకి మించి విక్రయించరాదని, రైతు కోరిన ఎరువునే ఇవ్వాలని చెప్పారు. పురుగు మందు కొంటేనే యూరియా ఇస్తామని అనడం సరికాదని దుకాణాదారులను హెచ్చరించారు. దుకాణాల్లో స్టాకు బోర్డులు, వాటి ధరలను పొందుపరచాలని ఆదేశించారు. కొనుగోలు చేసే రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసిన నాణ్యత గల పురుగు మందులు, ఎరువులను విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. నాణ్యతలేని పురుగు మందులు విక్రయించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి పి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు -
అమరవీరుల వీరోచిత త్యాగాలు మరువలేం
నగరంపాలెం: సమాజ రక్షణ, దేశ భద్రతకై ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల వీరోచిత త్యాగాలను ఎప్పటికీ మరువలేమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. మంగళవారం నగరంపాలెంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. తొలుత అమరవీరుల కుటుంబ సభ్యులతో కలసి స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అరవింద్ (పశ్చిమ), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, పోలీస్ అధికార, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితం వల్లే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లాలోని పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చదువుతున్నారంటూ వారి బాగోగులపై జిల్లా ఎస్పీ ఆరాతీశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు అందించారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ , పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు బైపాస్లో అంబటి మురళిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదం -
నిరంతరం సాగునీటి సరఫరా జరగాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో సాగునీటి కాలువలు పరిధిలోని పంట పొలాలకు నిరంతరం నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, అభివృద్ధికి మంజూరు చేసిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు చానల్ అభివృద్ధి, విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలోని భారీ సాగునీటి కాలువలు కే డబ్ల్యూ డెల్టా, గుంటూరు కెనాల్స్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సత్తెనపల్లి, లింగాయపాలెం బ్రాంచ్ కాలువల పరిధిలోని సాగు భూముల విస్తీర్ణం, వరదనీటి డ్రెయిన్లు వివరాలను మ్యాప్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, ఈఈ రమేష్, డ్రైయినేజ్ విభాగం డీఈ ధనలక్ష్మి, ఏఈలు పాల్గొన్నారు. నీటి పథకాల వివరాలు సమర్పించాలి జిల్లాలో రక్షిత నీటి పథకాల వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, డీఆర్డీఏ కార్యక్రమాలపై స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీటి పథకం వసతులు, ఫిల్టర్ రకం, ఎన్ని ఆవాసాలకు సరఫరా చేస్తున్నది, పథకం వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 234 నీటి పథకాల వారీగా డేటాను అందించాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ బి.వి.నాగ సాయికుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. -
మల్లేశ్వరా.. మనసాస్మరామి..!
నేటి నుంచి పెదకాకాని శివాలయంలో కార్తిక పూజలు పెదకాకాని: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తికమాస పూజలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు వేడుకలు నిర్వహించేందుకు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు పూజలు జరుగుతాయన్నారు. లోకకళ్యాణార్థం ఆలయంలో నిత్యం ఉదయం మహన్యాసపూర్వక రుద్ర జపం, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందని తెలిపారు. 9 గంటలకు రుద్రహోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్తిక మాసంలో పరోక్ష అభిషేక పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిప్రాతమైన కార్తికమాసంలో భక్తులు రూ. వెయ్యి చెల్లించి పాల్గొంటే కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదంగా శేషవస్త్రం, పంచకజ్జాయ ప్రసాదము వారి చిరునామాకు పోస్టు ద్వారా అందిస్తామన్నారు. నిత్యాభిషేక పథకంలో చేరిన భక్తులకు కార్తికమాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి పర్వదినం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్తిక పర్వదినాలలో ప్రత్యేక పూల అలంకారం, విద్యుత్ కాంతులతో అలంకరణ ఉంటాయని డీసీ వివరించారు. -
నకిలీ బంగారం అమ్మిన ముఠా గుట్టురట్టు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరండల్పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులకు సెప్టెంబర్ 15వ తేదీన కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా తిమ్మాలాపురం గ్రామం, విట్లాపురం పంచాయతీకి చెందిన ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి ఒక రాంగ్ కాల్ చేసి తమ వద్ద తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని, దానిని తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు బాధిత దంపతులను నమ్మించారు. బాధితులతో నెల రోజులపాటు మాట్లాడి వారిని కర్ణాటకకు రమ్మని చెప్పడంతో దంపతులు వెళ్లారు. వారికి చిన్న బంగారం ముక్క ఇచ్చి దానిని పరిశీలించుకున్న తరువాత మిగిలిన బంగారం అప్పగిస్తామని నమ్మించారు. అయితే చిన్న బంగారం ముక్క తీసుకుని పరిశీలించగా బంగారం అని తెలిసింది. అత్యాశకు పోయిన బాధిత దంపతులను బళ్లారికి పిలిపించుకుని వారి వద్ద నుంచి రూ.12 లక్షలు తీసుకుని బాధితులకు రాగి, జింగ్ మిశ్రంతో కూడిన అర కేజీ నకిలీ బంగారం ముక్కలను ఇచ్చారు. అక్కడ నుంచి తిరిగి గుంటూరుకు వచ్చిన బాధితులు అరకిలో బంగారం ముక్కలను పరీక్షంగా నకిలీ బంగారం అని తేలింది. అప్పటికే మోసం చేసిన ముఠా సెల్ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసి ఆచూకీ అందకుండా పోయారు. బాధితులు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ సుబ్బారావు లతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో నకిలీ బంగారం విక్రయించే ముఠా గుంటూరుకు చెందిన మరొక దంపతులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆరా తీయడం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి కూడా నకిలీ బంగారం ముక్కలను విక్రయించడానికి నల్లపాడు హౌసింగ్ బోర్డ్ వద్దకు నిందితుల ముఠాలోని ఇద్దరు వ్యక్తులు రాగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అదుపులో తీసుకున్న ఇద్దరిని విచారించగా ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఒకే ప్రాంతానికి చెందిన వారుగా దర్యాప్తులో తెలింది. నమ్మకంగా మోసం చేసి బాధితుల నుంచి వసూలు చేసిన నగదులో రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మిగిలిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ ఎం.సుబ్బారావు, కానిస్టేబుల్ డేవిడ్, ఉమామహేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కర్నాటకకు చెందిన ఇద్దరి అరెస్ట్ రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
తాడికొండ: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తుళ్లూరు మండలం టిడ్కో గృహాల వద్ద జరిగింది. వివరాల ప్రకారం... తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం నుంచి తోరటి గోపీ(35) ద్విచక్ర వాహనంపై సీడ్ యాక్సిస్ రోడ్డుపై వస్తుండగా టిడ్కో గృహాల సమీపంలో ఈ3– ఎన్ 16 జంక్షన్ వద్దకు రాగానే టిప్పర్ వచ్చి ఢీకొంది. అతని తలకు బలమైన గాయమై చనిపోయాడు. సంఘటనా స్థలానికి తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంక్షన్ వద్ద రోడ్డుపైకి వచ్చే క్రమంలో నిర్మించిన షెడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదా స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేసి చర్యలు తీసుకోపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
రేపటి నుంచి ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నీ
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి నవంబరు 3వ తేదీ వరకు ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, కార్యదర్శి యాగంటి దుర్గారావు మంగళవారం తెలిపారు. క్లబ్లో నూతనంగా, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన బిలియర్డ్స్ అండ్ స్నూకర్ టేబుల్స్పై పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలను ఏపీ బిలియర్స్ అండ్ స్నూకర్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 2026 జనవరిలో హరియాణాలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బిలియర్డ్స్కు 38 ఎంట్రీలు, స్నూకర్కు 215 ఎంట్రీలు నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంట్రీలు అత్యధికంగా నమోదవడంతో ఈ టోర్నమెంట్ మరింత ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. క్లబ్ తరుఫున తమ అత్యుత్తమ క్రీడాకారులు ఎస్.శంకరరావు, ఎం.శ్రీనివాసరావులు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు 20 సార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరచి అనేక పథకాలు సాధించారన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్రహ్మేశ్వరరావు, దుర్గారావులతోపాటు కార్యదర్శిగా పులివర్తి వెంకటేశ్వరరావు (అజార్), ఉపాధ్యక్షులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ఏల్చూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాసరావు, టోర్నమెంట్ నిర్వాహక అధ్యక్షులు జి.స్వరాజ్యరావు, ఉపాధ్యక్షులు టి.పాండురంగారావు, సంయుక్త కార్యదర్శి వి.బాలాజీ పాల్గొన్నారు. -
అమృతరావు త్యాగం వృథా కాదు
మేడికొండూరు: విశాఖ ఉక్కుకోసం ఆమరణ దీక్ష చేసి రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీని సాధించిన తమనంపల్లి అమృతరావు త్యాగం వృథా కాదని ఆయన మనువడు, వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపల్లి శాంతయ్య చెప్పారు. మేడికొండూరు మండలంలోని అమృతరావు స్వగ్రామం విశదలలో మంగళవారం ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతయ్య మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ ప్రధాని మోదీకి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ ఉక్కు కార్మికులకు ఇటీవల వైఎస్ జగన్ భరోసా ఇచ్చిన విషయాన్ని కూడా శాంతయ్య గుర్తు చేశారు. పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు నాయకత్వంలో పార్టీని మరింత సమర్థంగా ముందుకుతీసుకెళుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రామంలోని తమనంపల్లి అమృతరావు విగ్రహం వద్ద నేతలు నివాళులర్పించారు. అనంతరం ఆయన బర్త్డే కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో మేడికొండూరు, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య, కత్రేణమ్మ, మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి వంశీ, శివారెడ్డి, పోలారెడ్డి, మైనేని నాగమల్లేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, రెడ్డి కొరివి చెన్నయ్య, షేక్ రబ్బాని, గండికోట రసూలు జిలాని, ముత్యాల బాలస్వామి, ఉడతా ప్రభాకర్, షేక్ బాజీ సుబ్బారెడ్డి, ఉడతా శ్రీనివాసరావు, పాములపాటి జయరావు, జి.రవి, షేక్ షరీఫ్, దయాకర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతయ్య -
కవి మాధవరావుకు కళామిత్ర సాహితీ అవార్డు
తాడికొండ: తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ప్రముఖ కవి బండ్ల మాధవరావుకు ఒంగోలు కళామిత్ర మండలి వారి కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం అందజేస్తున్నట్లు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. 24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు గుంటూరు ఎడ్యుకేషన్: మేడికొండూరు మండలం విశదలలోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యా విధానంలో మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించే విద్య అవసరమని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పరచి, ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 24న మధ్యాహ్నం 2.00 గంటలకు సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో ముఖ్యఅతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంట్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్కుమార్ పాల్గొని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్‘ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు చెప్పారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుర్రా శరత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్బాబు పాల్గొన్నారు. 24న జిల్లా ఫుట్బాల్ జట్ల ఎంపిక నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాల, బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24వ తేదీ కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మఽ ద్యాహ్నం 12.30 గంటల వరకు అండర్–14 బాల, బాలికల జట్ల ఎంపిక, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అండర్–17 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని వివరించారు. -
ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న 60, 61 జీఓలను సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న 60, 61 జీవోలను సవరించాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో మంత్రివర్గ సబ్ కమిటీతోపాటు సీఎం స్థాయిలో పలు విడతలుగా చర్చించిన తరువాత ఈనెల 20న విడుదల చేసిన 60, 61 జీవోల్లో అసంబద్ధ్దంగా ఉన్న అంశాలను సవరించాలన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ వస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారని, డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ తరువాత చెల్లిస్తామని ఆర్థిక శాఖ పేర్కొనడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. సీపీఎస్పై కనీస సమాచారం లేదని, పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు 2027–28 ఆర్థిక సంవత్సరం నుంచి 12 దఫాల్లో విడుదల చేస్తామని జీవోలో పేర్కొనటం, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉద్యోగుల, పెన్షనర్ల హక్కులను కాలరాయటమేనని అన్నారు. తక్షణమే జీవోలను సవరించి ఉద్యోగులకు డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాకు జమచేసి, సీపీఎస్ వారికి 90 శాతం నగదును, పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా సవరించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలతో కార్యాచరణ రూపొందించి నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జి.జోజప్ప, పి.దిబ్బయ్య, షేక్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు -
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమవర్మ, ఐజీ బీవీ రామిరెడ్డి ఆదేశాల మేరకు కమాండెంట్ డీఎన్ఏ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణాదళం(ఏపీ ఎస్పీఎఫ్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎన్యూలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడలు పోటీలు ఈనెల 14వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందేశాన్ని వివరించారు. -
రైలులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్టు
లక్ష్మీపురం: రైలులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. రైలు నంబర్ 07222 సంత్రాగచి– చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్లో రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఈనెల 13వ తేదీన మహిళా బోగిలో రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహిళ ఎక్కింది. చర్లపల్లి వెళ్తుండగా సుమారు రాత్రి 7.05 గంటల సమయంలో రైలు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరింది. మహిళా బోగిలో ఉన్న తోటి ప్రయాణికులందరూ బోగిలో నుంచి దిగిపోయారు. ఇది గమనించిన పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాజారావు, రైలు కదిలే సమయంలో మహిళా బోగిలో ఎక్కేందుకు తలుపు తీయాల్సిందిగా కోరాడు. దీంతో బాధితురాలు ఇది మహిళా బోగి అని ఎంత చెప్పిన వచ్చే రైల్వే స్టేషన్లో దిగి పోతానని చెప్పి బాధితురాలిని తలుపు తీసేందుకు ఒప్పించాడు. దీంతో బాధితురాలు బోగి తలుపులు తీయడంతో లోపలికి ప్రవేశించి తలుపులు లోపలి నుంచి మూసి వేశాడు. రైలు నల్లపాడు రైల్వే స్టేషన్ దాటిన తరువాత నిందితుడు, బాధితురాలికి కత్తి చూపించి, బెదిరించి ముఖంపై చేతులు వేసి ఆమెను కొట్టి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత రైలు నెమ్మదిగా పెదకూరపాడు రైల్వే స్టేషన్ను సమీపిస్తుండగా బాధితురాలి వద్ద ఉన్న రూ.5,600, పరుసు, సెల్ఫోన్ లాక్కుని నిందితుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. బాఽధితురాలు అదే రైలులో సికింద్రబాద్ స్టేషన్కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. నడికుడికి కేసు బదిలీ.. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతం నడికుడి జీఆర్పీ పరిధిలో ఉండడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దీంతో అప్రమత్తం అయిన నడికుడి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని గాలించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు 8వ ప్లాట్ఫారంపై ఓ వ్యక్తి పారిపోతుండగా అదుపులో తీసుకున్నారు. స్టేషన్కు తరలించగా సీసీ కెమెరాల్లో గుర్తించిన వ్యక్తిగా నిర్ధారించారు. విచారించగా నేరం అంగీకరించడంతో పోలీసులు రాజారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో గుంటూరు ఐఆర్పీ లైన్ సీఐ కరుణకరరావు, జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, ఎస్ఐలు పి.రమేష్, రాజమోహన్, శ్రీనివాసరారెడ్డి, కానిస్టేబుల్ ఆశ్వీన్, నాసర్ వలి, హెడ్ కానిస్టేబుల్ వి.శంకర్లను అధికారులు అభినందించారు. వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు -
బాణసంచాతో... జర భద్రం
పట్నంబజారు: సంతోష సంబరాలతో.. వెలుగులు నింపే పండుగ దీపావళి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి. వెలుగుల కాంతులు.. చిన్నారుల కేరింతలు.. ఆనందమయంగా జరుపుకోవాల్సిన పండుగ రోజున.. మనం చేసే చిన్న చిన్న పొరపాటులే.. ఎంతో విషాదాన్ని మిగిలుస్తాయి. దీపావళి చేసుకునే సమయంలో బాణాసంచా కాల్చే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలు ప్రారంభమూయ్యాయి. నేడు దీపావళి కావటంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు, యువత, చిన్నారుల బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 120 షాపులకుపైగా ఏర్పాటు చేశారు. ఏడాది మొత్తం నడిచే గోడౌన్లు సుమారుగా 22పైగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. టపాసులు కాల్చే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో మనమెప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆరేళ్ల చిన్నారి దుస్తులుపై నిప్పురవ్వలు పడి.. దుస్తులకు మంటలు అంటుకుని.. శరీరమంతా గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. ఇటువంటి జరగకుండా ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుల హరివిల్లు పూయించాలని కోరుకుందాం. నిబంధనల ప్రకారమే లైసెన్స్లు బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రెవెన్యూ, ఫైర్, పోలీసు అధికారుల అనుమతులు తప్పనిసరి. పూర్తిస్థాయిలో అధికారులు ధ్రువీకరించిన తరువాతనే షాపు ఏర్పాటుకు అనుమతినిస్తారు. ఖాళీ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎటువంటి పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్మాల్స్ వంటివి ఉండకూడదు. ఒక 50 షాపులు ఉంటే దానిని క్లస్టర్ అని అంటారు. అంతకు మించి ఆ గ్రౌండ్స్లో దుకాణాలకు అనుమతి ఇవ్వకూడదు. జిల్లా కేంద్రంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, గ్రామీణ ప్రాంతాలలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. హోల్సేల్ వ్యాపారాలకు సంబంధించి ఉన్న సరుకు లిస్ట్, కట్టిన జీఎస్టీ, తదితర అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. దీనితో పాటుగా ప్రతి బాణాసంచా దుకాణం వద్ద ఇసుకతో ఉన్న బక్కెట్లు, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రమాదమే.. చిన్నారులతో మరింత జాగ్రత్త అవసరం చిన్న ప్రమాదం జరిగినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే... షాపులు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి. జనావాసాలకు దూరంగా ఉన్న ఒక అంతస్తు మాత్రమే ఉండే భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దుకాణానికి, దుకాణానికి మధ్య ఖాళీ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే తక్షణం నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలి. -
హేతువాద సాహిత్య పితామహుడు త్రిపురనేని
లక్ష్మీపురం: తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామిచౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీ నరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ వందేళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యం రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆలా వెంకటేశ్వర్లులకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, డాక్టర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్, డాక్టర్ మూకిరి సుధ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య -
అట్రాసిటీ కేసుల్లో ఆలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు
నెహ్రూనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కొంత మంది పోలీసులు, అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు. జవహర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గుంటూరులోని ఎన్జీఓ కల్యాణ మండపంలో కెఎస్ జవహర్ దంపతులకు సత్కార సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చెప్పినప్పటికీ పోలీసులు, ఇతర అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని దీనిపై త్వరలో సీఎస్ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 19 వలన ఎస్సీ ఉద్యోగుల్లో తలెత్తుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ -
ఇవీ వ్యాధి లక్షణాలు...
గుంటూరు మెడికల్: గుంటూరు బ్రాడీపేటకు చెందిన జి.రామోహన్రావు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా నిత్యం ఏసీ గదుల్లో కూర్చుంటారు. ఇటీవల దసరా సెలవులకు సొంత ఊరు వచ్చి ద్విచక్ర వాహనంపై షాపునకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. పాతికేళ్లకే చిన్న ప్రమాదానికి ఎముక విరగడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. పరీక్షలు చేసి ఎండ తగలకుండా ఏసీ గదుల్లో ఆధునిక జీవనశైలి వల్ల ఆస్టియోపొరోసిస్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిస్ ఫౌండేషన్ (ఐఓఎఫ్) 1996 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 20న వరల్డ్ ఆస్టియో పొరోసిస్ డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎండ తగలక ఇబ్బందులు చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవటం ఆస్టియోపొరోసిస్ వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) సోకినవారిలో కనిపించే ప్రధాన లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల నేడు యువతలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల, పాఠశాలల పిల్లల్లో చాలా మంది ఎండ ఏ మాత్రం తగలకుండా ఏసీ గదుల్లో ఉంటున్నారు. వీరు ఆటలు ఆడేందుకు కూడా ఎండలోకి వెళ్లకపోవటంతో దెబ్బ తగిలిన సమయంలో ఎముకలు విరిపోతున్నాయి. బాధితులు అధికమే... సాధారణంగా ఆడవారిలో మోనోపాజ్ దశ దాటిన తరువాత 40 ఏళ్ల వయసులో, మగవారిలో 50 ఏళ్ల వయస్సు వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలి వల్ల నేడు 20 శాతం మంది యువత వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల్లో 33 శాతం మంది తుంటి విరిగి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా పడి మరణిస్తున్నారు. ఆడవారిలో 50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు, మగవారిలో 12 మందిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జిల్లాలో 200 మంది ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఓపీ వైద్య విభాగానికి 50 మందికి పైగా వివిధ రకాల ఎముకల సమస్యలతో వస్తున్నారు. వీరిలో 15 మంది ఆస్టియోపొరోసిస్ బాధితులే ఉంటున్నారని వైద్య నిపుణులు చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో కూడా రోజూ వివిధ రకాల ఆర్థోపెడిక్ సమస్యలతో 200 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 40 మంది ఈ వ్యాధి బాధితులే ఉన్నట్లు పరీక్షల అనంతరం వైద్యులు నిర్ధారిస్తున్నారు. కారణాలు ఇవీ ... కుటుంబంలో ఎవరికై నా ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు, థైరాయిడ్, లివర్ వ్యాధుల వల్ల, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రోజంతా ఏమాత్రం ఎండలోనికి రాకుండా ఏసీలోనే గంటల తరబడి గడపటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. శారీరక వ్యాయామం ఏమాత్రం చేయనివారికి, ముఖ్యంగా రోజూ కనీసం అరగంట కూడా నడవకపోవటం వల్ల ఇది సోకుతుంది. రక్తపరీక్షల ద్వారా, ఎక్స్రే ద్వారా, ఎముకల సాంద్రత పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. వయస్సుపైబడిన వారిలో నడుమునొప్పి, వెన్నెముక ఎదుగుదల లోపించి ఎత్తు ఆగిపోవటం, ఒంటి నొప్పులు, ఎలాంటి పనులు చేయలేక పోవటం, నీరసం,నిరాశ, ఓపిక లేకపోవటం తదితర లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి. ఎండ నుంచి శరీరానికి లభించే డి–విటమిన్ దొరక్కపోవడం కూడా వ్యాధికి ఒక కారణం. లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే వెన్నెముక, చేతి మణికట్టు, తుంటి వద్ద ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా.. చివరికి ఇంటి గడప కాలికి తగిలినా ఎముకలు విరిగిపోతాయి. -
అవగాహన ముఖ్యం
రోజూ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఓపీకి వచ్చే వారిలో 25 శాతం మంది ఈ వ్యాధి బాధితులే. యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్నిసార్లు వైద్య పరీక్షల్లో రిపోర్టులు నార్మల్గా ఉన్నా నొప్పులు ఉంటాయి. నొప్పులు ఉంటే వ్యాధిగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. ఈ వ్యాధి వల్ల వెన్నెముక కూడా బోలుగా మారిపోయి కొద్దిపాటి దెబ్బకే విరిగిపోయి జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. కీళ్లవాతం, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఆస్టియోపొరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ముందస్తుగా పరీక్షలు చేయించాలి. – డాక్టర్ జె. నరేష్బాబు, సీనియర్ స్పయిన్ సర్జన్, గుంటూరు -
పశ్చిమ డెల్టాకు 4,513 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 4,513 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కి 216 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,526 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 327, పశ్చిమ కాలువకు 118, నిజాంపట్నం కాలువకు 281, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు. సముద్రంలోనికి 43,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నేటి పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలికంగా రద్దు నగరంపాలెం: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని అన్నారు. రెడ ్లసత్రానికి రూ.5 లక్షల విరాళం నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ యోగి వేమారెడ్డి రెడ్ల సత్రంలో లిఫ్ట్ ఏర్పాటుకు పట్టణానికి చెందిన వెన్నపూస జోసెఫ్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు. సత్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో విరాళం మొత్తాన్ని దాత జోసెఫ్రెడ్డి సత్రం కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, ఉపాధ్యక్షడు నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు బ్రహ్మరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాంచీస్టేషన్ను సందర్శించిన డివిజనల్ మేనేజరు విజయపురిసౌత్: పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య ఆదివారం విజయపురిసౌత్లోని లాంచీ స్టేషన్ను సందర్శించారు. ముందుగా లాంచీలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లాంచీల్లో సందర్శకుల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హరిత రిసార్ట్ మేనేజర్ మస్తాన్బాబు, ఎత్తిపోతల మేనేజర్ యల్లాల బ్రహ్మం, వినయతుల్లా, దత్తు, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 588.40 అడుగులకు చేరింది. ఇది 307.2834 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,302, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,292, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 53,412 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 53,412 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మహాదేవిగా పూజలందుకున్న బగళాముఖి చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో బగళాముఖి అమ్మ వారు ఆదివారం మహాదేవి అలంకరణలో పూజలందుకున్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న బగళాముఖి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. పూజలు చేశారు. సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 81వ అమావాస్య హోమం, విశేష పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి తెలిపారు. -
కార్తిక పూజలకు శివాలయం ముస్తాబు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తికమాస ఏర్పాట్లపై ఆదివారం డీసీ మాట్లాడుతూ కార్తిక మాసం సందర్భంగా ఈనెల 22 నుంచి నవంబరు 20 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం నెలరోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందన్నారు. నెల రోజులపాటు నిత్య పరోక్ష అభిషేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రూ.వెయ్యి చెల్లించి ఈ పథకంలో పాల్గొనే భక్తులకు కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదం వారి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరిన భక్తులను కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిమిత్తం పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. కార్తిక మాసం పర్వదినమైన పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
క్యాల్షియం స్థాయిలు పెంచాలి
వ్యాధికి చికిత్సలో భాగంగా శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం ద్వారా క్యాల్షియం పెంచుకోవచ్చు. విటమిన్ – డి కోసం ప్రతిరోజూ కొంతసేపు ఎండలో ఉండాలి. వయస్సు మళ్లిన వారికి , గర్భిణులకు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నవారికి, పీరియడ్స్ రావటం పూర్తిగా ఆగిపోయిన వారికి అదనంగా రోజూ విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు ఇవ్వాలి. నిత్యం తగిన పోషకాహారాన్ని అందించాలి. పొగతాగటం, మద్యం సేవించటం వంటి చెడు అలవాట్లను అందరూ విడనాడాలి. రోజూ తప్పనిసరిగా అరగంటసేపైనా నడవాలి. –డాక్టర్ సూరత్ అమర్నాథ్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు -
సీ్త్రనిధి.. హతవిధి!
ప్రత్తిపాడు మండలంలో సీ్త్ర నిధి రుణాల ప్రక్రియ ప్రహసనంగా మారింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9 కోట్ల రుణాల మంజూరుకు అవకాశం ఉన్నప్పటికీ, పాత బకాయిలు ఎన్పీఏలోకి వెళ్లడంతో నూతనంగా ఇవ్వలేని పరిస్థితి చోటుచేసుకుంది. మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ అప్పులకు వడ్డీలు అధికంగా చెల్లిస్తూ రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రత్తిపాడు: మండలంలో 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 4,441 మంది మహిళలకు రూ. 23 కోట్ల మేర సీ్త్ర నిధి రుణాలిచ్చారు. ప్రస్తుతం అప్పు నిల్వ రూ. 4.84 కోట్లు ఉండగా, బకాయిలు రూ. 76.09 లక్షలు ఉన్నాయి. కాగా రూ. 57.68 లక్షలు ఎన్పీఏ కిందకు చేరాయి. మొత్తం మీద ప్రస్తుతం రూ. 1.23 కోట్ల మేర ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ ఉంది. పాతవి రికవరీ చెయ్యక.. కొత్తవి మంజూరు కాక.. సీ్త్రనిధి బకాయిల్లో ఓవర్ డ్యూ రూ. 57 లక్షలు రికవరీ అయితే గానీ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యపడదు. వెలుగు అధికారులు రికవరీపై దృష్టి సారించకపోవడంతో అప్పుల కుప్ప పెరిగిపోయి కూర్చుంది. కనీసం ఓవర్డ్యూలో సగం అయినా రికవరీ చేస్తే కొత్త వారికి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9.30 కోట్లు సీ్త్ర నిధి ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం కింద ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కానీ ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ. 20 లక్షల కన్నా అధికంగా ఉంటే సీ్త్రనిధి రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వని దుస్థితి చోటుచేసుకుంది. సుమారు 931 మంది మహిళలు రుణానికి అర్హులుగా ఉన్నారు. కానీ అప్పు ఇవ్వకపోవడంతో మహిళలు స్థానికంగా ఉన్న మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం .. సీ్త్రనిధి రుణాల రికవరీపై వెలుగు శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2022–23లో ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ.10.52 లక్షలు, 2023–24లో రూ. 2.81లక్షలు, 2024–25లో రూ.15 లక్షల మేర ఉంది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.1.23 కోట్లకు చేరిందంటే రికవరీ పట్ల అధికారుల అలసత్వం గురించి వేరే చెప్పనక్కర్లేదు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా.. అంతే కాకుండా మండలానికి చెందిన ఒక గ్రామంలోని డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న సీ్త్ర నిధి బకాయిలకు సంబంధించిన నగదు తమ వీవో ఖాతాలో వేశామని, ఆ మొత్తాన్ని సీ్త్రనిధి బకాయి కింద జమ చేసుకోవాలని కోరుతున్నా అధికారులు మాత్రం రకరకాల కారణాలను చూపుతూ జమ చేసుకోవడం లేదన్నారు. దీంతో సదరు ఖాతాలు ఎన్పీఏలోనికి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని సంబంధిత సభ్యుల కుటుంబీకులు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సీసీలకు మెమోలిచ్చాం సీ్త్రనిధి రుణాల రికవరీ అంతగా లేకపోవడంతో సంబంధిత క్లస్టర్ల సీసీలకు మెమోలు కూడా ఇచ్చాం. లోన్ పాలసీ ప్రకారం రూ.20 లక్షలకుపైన ఎన్పీఏ ఉంటే మండలం ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. రూ.20 లక్షల కన్నా దిగువకు ఎన్పీఏ తగ్గితే అప్పుడు రుణాలు ఇవ్వవచ్చు. రికవరీపై పూర్తి స్థాయి దృష్టి సారించాం. – ఎస్. హర్షవర్ధన్ , ఏజీఎం, సీ్త్రనిధి -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని జిల్లా అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరికి చెందిన రేటూరి గౌత్ను ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన కె.రామకృష్ణ, తాడికొండకు చెందిన గొంది రవి, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన బండారు మణికంఠ, మంగళగిరికి చెందిన పూసం రామ్గోపాలరెడ్డి, తాడికొండకు చెందిన నేలపాటి నాగేంద్రం, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఎస్.ప్రశాంత్, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈమని శివారెడ్డి, ఎరమాల మురళి, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కర్రా వేణు, జంగా సుందర్లను నియమించారు. అదేవిధంగా జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన నంద్యాల ఉదయ్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఉడతా శ్రీనివాసరావు, కార్యదర్శిగా బొల్లెద్దు శివాజీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇబ్రహీంపట్నం వెంకటేశ్వర్లు, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా తాడికొండకు చెందిన పి.ఫిరోజ్ఖాన్, ప్రత్తిపాడుకు చెందిన షేక్ అబ్దుల్ సలాం, ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన షేక్ అబ్దుల్ రజాఖా, తెనాలికి చెందిన షేక్ చాంద్బాషా, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన నూర్బాషా అలి అబ్బాస్, తాడికొండకు చెందిన షేక్ కరీముల్లా, షేక్ ఖాసీం, తెనాలికి చెందిన సయ్యద్ ఖలీల్, షేక్ ఆసీఫ్, మంగళగిరికి చెందిన షేక్ కిజార్ అల్లా సుభాని, మొహ్మద్ ఇర్ఫాన్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ప్రత్తిపాడుకు చెందిన షేక్ నాగుల్మీరా, తాడికొండకు చెందిన షేక్హసన్ అహ్మద్, మంగళగిరికి చెందిన సయ్యద్ సలాం, షేక్ జమీరా అహ్మద్, తెనాలికి చెందిన షేక్ బదుల్లాలను నియమించారు. వీరితోపాటు రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన పోరెడ్డి బాలిరెడ్డి, కార్యదర్శులుగా దండా కోటిరెడ్డి, ప్రత్తిపాడుకు చెందిన నెల్లూరి బాలకృష్ణ, ఎగ్జిక్యూటీవ్మెంబర్గా తాడికొండకు చెందిన నాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన జి.ప్రకాష్బాబు, ప్రధాన కార్యదర్శులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఇమ్మల త్రివేణి, తాడికొండ నియోజవకర్గానికి చెందిన మేకల రవి, తెనాలికి చెందిన కొమ్ము రాయల్, మంగళగిరికి చెందిన కొండూరు శేషయ్య, కార్యదర్శులుగా గుంటూరు తూర్పుకు చెందిన పోసిపోగు దేవసహాయం, తాడికొండకు చెందిన కఠారి కృష్ణ, తెనాలికి చెందిన అత్తోట కిషోర్కుమార్, పొన్నూరుకు చెందిన చందులో ఇమ్మానియేల్, మంగళగిరికి చెందిన పెరికి అంకయ్య, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గుంటూరుకు చెందిన వడ్డె కోటేశ్వరరావు, సంకూరు సురేంద్ర, తాడికొండకు చెందిన తలతోక వెంకటేశ్వర్లు, తెనాలికి చెందిన మువ్వా చందు, పొన్నూరుకు చెందిన బత్తుల వీరయ్య, గుండా బత్తిన శ్యామ్సన్, మంగళగిరికి చెందిన కె. పరమేశ్వర దాసు, కె.నాగరత్నం, జిల్లా బూత్ కమిటి ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన సి.హెచ్.భాగ్యారావు, కార్యదర్శిగా పులి ప్రకాష్; జిల్లా కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన మేరుగ యోహాన్, కార్యదర్శిగా పులివర్తి నాగరాజు, జిల్లా దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా గుంటూరు తూర్పుకు చెందిన షేక్ బషీర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా చెల్లి సతీష్, దేవినేని రమేష్, డాక్టర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్సలీం, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఇందూరి శ్రీనివాసరెడ్డి, కుర్రా హరిబాబు, జిల్లా ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన గొట్టిపాటి ఇజ్రాయేల్, కార్యదర్శిగా దివ్వెల రాజశేఖర్, ఐటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన నూతక్కి మనోహర్, కార్యదర్శులుగా గొల్లపూడి మహేష్, గుంటుపల్లి ప్రదీన్, లీగల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన దారా తిరుమలరావు, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంజుల భార్గవి, కార్యదర్శులుగా కొమ్ము రాజేశ్వరి, ప్రత్తిపాడుకు చెందిన కరసాల భవానీలను నియమించారు. జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో... అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన బొద్దు చిన్న సాంబశివరావు, ప్రత్తిపాడుకు చెందిన వై.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శులుగా దేవిరెడ్డి సాంబశివారెడ్డి, తాడికొండకు చెందిన కంభంపాటి శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా కంజుల బ్రహ్మారెడ్డి, సాతులూరి సురేష్, మువ్వా శ్రీదేవి, జిల్లా పబ్లిసిటీ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్లా, ప్రత్తిపాడుకు చెందిన లింగా సాగర్, కార్యదర్శులుగా బండారు రాజేష్, దాసరి శివాంజనేయులు, సంకూరి రత్తయ్య, కూచిపూడి విద్యాసాగర్, ఎగ్జిక్యూటీవ్మెంబర్లుగా మేదరమెట్ల సుధాకర్, షేక్ సుభాని, జిల్లా ఆర్టీఐ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఏరువ శౌరిరెడ్డి, కార్యదర్శిగా మిక్కిలి ప్రేమ్కుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా చెవుల కృష్ణమోహన్, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షుడు గా మంగళగిరికి చెందిన కర్రి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కొరిటెపాటి రాంబాబు, కార్యదర్శులుగా కొలకలూరి నందకిషోర్, పచ్చల రాజు, షేక్ రఫీ, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడికొండకు చెందిన రాపూరి మహేంద్రబాబు, కార్యదర్శిగా కొమరగిరి సూరిబాబు, జిల్లా విద్యార్థి విబాగం ప్రధాన కార్యదర్శిగా కంచర్ల రాజు, కార్యదర్శిగా జి.కామేశ్వరరావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా షేక్ బాజీ, వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండవీటి మగ్బుల్, కార్యదర్శిగా కాకర్ల నాగేశ్వరరావు, వలంటీర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా రాయపూడి సాగర్బాబు, కాళహస్తి భవానీ శంకర్, కార్యదర్శిగా తియ్యగూర అంజిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా షేక్ ఖాదర్వలి, వీవర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి జోసఫ్, కార్యదర్శిగా షేక్జాన్బాషా, వైఎస్సార్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, గుంటూరు వెస్ట్కుచెందిన నల్లమోతు విజయసాగర్, కార్యదర్శిగా కలవకొల్లు నరసింహారావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా యాదాల వీరవసంతరావులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
దేశం బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల స్వదేశీ నినాదమిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని వంద శాతానికి పెంచాలని నిర్ణయించడం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బీమా ఉద్యోగులు సంస్థలను కాపాడుకునేందుకు సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, ఎల్ఐసీ ఆఫీసర్స్ ప్రధాన కార్యదర్శి కోటేష్ బాబు, డెవలప్మెంట్ అధికారుల కార్యదర్శి సురేష్ బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, మహిళా కన్వీనర్ సీహెచ్ మధుబాల తదితరులు పాల్గొన్నారు. -
కేఎల్యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, కేఎల్యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్, వీసీ పార్థసారథి వర్మలతో కలిసి కాన్శాట్ను నింగిలోకి వదిలారు. తొలుత బెలూన్ సహాయంతో మొదటి కేఎల్ జాక్ శాటిలైట్ను పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. ఉదయం 5.45 నిమిషాలకు కేఎల్ జాక్ శాటిలైట్ను పీకో బెలూన్ సాయంతో వదిలారు. కేఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ సిహెచ్ కావ్యశ్రీ తెలిపారు. కేఎల్శాట్2ను ఫ్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏటీసీ గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 6.45 గంటలకు బెంగళూరుకు చెందిన రెడ్వింగ్ అనే సంస్థ సహకారంతో ఫ్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు. శాటిలైట్ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుంచి సుమారు 12 కి.మీ. ఎత్తులో 60 కి.మీ. సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాండ్ప్యాడ్పై విజయవంతంగా దిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈనెల 27న ఉత్తరప్రదేశ్లో జరుగనున్న మేక్ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పోటీల్లో కేఎల్యూ విద్యార్థులు రూపొందించిన కాన్శాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికై నట్లు పేర్కొన్నారు. మార్టూరు: మండలంలోని ఇసుకదర్శి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకట రమణయ్య (65) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడ ఉదయం నిద్ర లేచేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం గమనించిన కుమార్తె స్వగ్రామంలో బంధువులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని సాయంత్రం అక్కడకు తరలించారు. -
నవంబరులో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలనంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వంచనున్నారు. బాలానంద కేంద్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, నడింపల్లి వెంకట గురుదత్లు ఈ మేరకు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేట రెండో లైను లోటస్ ఆద్య పాఠశాలలో కార్యక్రమాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం నిర్వాహకుడు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక కూచిపూడి నృత్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు నృత్య ప్రభ (సోలో), నృత్యమణి (గ్రూపు) పేరుతో పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలు, తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, తెలుగులో మాట్లాడదాం, చిత్రలేఖనం, రంగులు వేద్దాం రండి, శాసీ్త్రయ గాత్ర సంగీతం, లలిత గీతాలు, వాద్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా అంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాలుగా పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని వివరించారు. 91826 85890, 89199 81839, 90300 88020, 738215 3390 ఫోను నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లోటస్ ఆద్య పాఠశాల అకడమిక్ డైరెక్టర్ వై.ఉమాదేవి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. పది లక్షలిస్తే దుకాణం పదిలం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కొల్లి శారద మార్కెట్ పాత లీజుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. మార్కెట్లో 25 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్న తమను లీజు గడువు పూర్తయిందంటూ హడావుడి చేసి బయటకు పంపారని కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ఇస్తే రెన్యూవల్? ఈ మార్కెట్లో 81 షాపులు ఉన్నాయి. ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున రూ.8.10 కోట్లు ఇస్తే రెన్యూవల్ చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు మధ్యవర్తుల ద్వారా చెప్పారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. అంత స్థోమత లేక అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడికి కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క తాము రైతులను కొల్లి శారద మార్కెట్కు వెళ్లనివ్వడం లేదనడం సమంజసం కాదని వ్యాపారస్తులు వాపోతున్నారు. వద్దని తాము ఆపితే వారు ఎలా ఆగుతారని.. ఇష్టపూర్వకంగా వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. లీజుకు ముందు చెప్పలేదు.. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న వారిని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 1999లో అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబు అక్కడి నుంచి పంపించేశారు. వారిని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద మార్కెట్కు తరలించారు. మార్కెట్కు వెళ్లే ముందు లీజు గడువు విషయం తమకు చెప్పకపోవడంతో 25 సంవత్సరాలుగా కార్పొరేషన్కు అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 2013లో జీఓ వచ్చిందని నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా వచ్చి షాపులను ఖాళీ చేయాలని, బహిరంగ వేలం పెట్టాలని చెప్పారు. మరో పక్క ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక బుడంపాడు బైపాస్ వద్ద 4 ఎకరాల స్థలం కొనుగోలు చేశామన్నారు. అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులను కోరినా కుదరదన్నారని చెప్పారు. కనీస వసతులు కూడా కల్పించలేమని తెలిపినట్లు పేర్కొన్నారు. లీజు గడువు పూర్తయిందని కొల్లి శారద మార్కెట్ షాపులకు వేలం పాట పెట్టేశారన్నారు. ఒక్కో షాపు రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షల వరకు పలికిందని చెప్పారు. అంత పెట్టి వ్యాపారం చేయలేమని బుడంపాడు బైపాస్ వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లోకి వెళ్లామన్నారు. వ్యాపారం చేయడానికి వీల్లేదని అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. రూ.లక్షలు కట్టి తాము కొల్లి శారద మార్కెట్లో వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవని వ్యాపారులు తెలిపారు. తాము ప్రైవేట్ స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో మార్కెట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. కానీ ఇంత వరకు స్పందన లేదని చెప్పారు. అన్నపూర్ణ కాంప్లెక్స్లో తమను వ్యాపారం చేసుకోనివ్వడం లేదని వాపోయారు. -
పేదల ప్రాణాలతో కూటమి చెలగాటం
గుంటూరు వెస్ట్ : గుంటూరు శివారు ప్రాంతం తురకపాలెం గ్రామంలో 45 మంది చనిపోతే ఇప్పటికీ సరైన కారణాలు కనుక్కోకపోవడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడుతూ పేదల మరణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. ఆ మరణాలకు కారణాలు తెలుసుకోలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన గనుక దాటవేసే ధోరణని అవలంబిస్తున్నారని తెలిపారు. తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేసి అసలు కారణాలకు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యమే మరణాలకు కారణం ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. దాని కారణంగానే 45 మంది మరణించారన్నారు. కంటితుడుపు చర్యగా రూ.5 లక్షలు కొందరి కుటుంబాలకే ఇచ్చారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలను రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిష్కారం గురించి ఆలోచించాలి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమస్యను దాటవేసే ధోరణితో కాకుండా పరిష్కారం చూపేలా వ్యవహరించాలన్నారు. తురకపాలెంలో కలుషిత నీటి సమస్య గత 5 నెలలుగా ఉందన్నారు. తాగునీటిలో హాని చేసే బ్యాక్టీరియా ఉందని తక్షణమే ప్లాంట్ను పరిశుభ్రం చేయాలని తెలిపారు. నగర పాలక సంస్థ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, మంగళగిరి సమన్వయ కర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ సమన్వయ కర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయ కర్త షేక్ నూరి ఫాతిమా, నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర వాలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడు వంగా సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, తురకపాలెం ఎంపీపీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పిల్లి మేరీ, నాయకులు, ఎంపీపీలు, జడ్పీపిపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ సేవల్లో నాణ్యత ముఖ్యం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యం కీలకం గుంటూరు జిల్లాను క్లీన్, గ్రీన్గా మార్చడానికి ప్రజల భాగస్వామ్యం కీలకం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంపౌండ్ వద్ద జీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అంశంపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్తోపాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగర మేయర్ కొవెలమూడి రవీంద్ర బాబులు ప్రారంభించారు. నగరంలో వాయు కాలుష్యం తగ్గించేలా ఈ సీజన్లో 5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, డీటీసీ సీతారామిరెడ్డి, డీప్యూటీ డీఎంహెచ్ఓ సువర్ణబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్ర
చేబ్రోలు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా శుక్రవారం సంతకాలు సేకరించారు. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై అవగాహన కల్పించారు. రచ్చబండ సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్య అందించటంతో పాటు బడుగులకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డి, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బి.భాస్కరరెడ్డి, అక్కిరెడ్డి, శంకరరావు, చందు సాంబశివరావు, పోతురాజు, గోపి, మమత, దాసరి దానమ్మ, చిరంజీవి, జానీ, వేణు, బాల చంద్రయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సుద్దపల్లిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం -
28న ధర్నాను జయప్రదం చేయండి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ షూటర్లు 20 మంది రైఫిల్, పిస్టల్ విభాగాలలో ప్రతిభ కనబరిచారని అకాడమీ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరిగే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. రైఫిల్ విభాగంలో వట్టిమల్లీ షణ్ముఖ రుష్యేంద్ర, శ్రీరంగ సాయి చరణ్, పారా ఆశ్రిత్ చౌదరి, వజ్జు దారియా, ఎం. కార్తికేయన్, దాసరి సౌమ్యశ్రీ, చిన్ను తేజస్, కాగిత విద్యావల్లి, కాగిత కుసుమవల్లి, కె.ఎస్.ఎస్ చక్రవర్తి, మట్లి యోక్షిత్ రెడ్డి, షేక్ హబీబా సుహానా, అన్నా బత్తిని రోహిత్ ఎంపికయ్యారని తెలిపారు. పిస్టల్ విభాగంలో కొసన పూర్ణిమ, సోడిశెట్టి ధరణీనాథ్, రాజ రాజేశ్వరి, ఒంటెద్దు నాగ లోహిత్ రెడ్డి, గ్రీష్మ సందేశి, అభిలాష్ చంద్ర, రిషిక్ బాబులు అర్హత సాధించారన్నారు. వీరిని రాప్ సెక్రెటరీ డి. రాజ్ కుమార్ తదితరులు అభినందించారన్నారు. నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై జెడ్పీటీసీ సభ్యుడు ఓబుల్రెడ్డి ఆగ్రహం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీటీసీ సభ్యురాలు తన మండలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి లోకేష్కు లేఖ రాయడం నేరమా అని రొంపిచర్ల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి ప్రశ్నించారు. దుగ్గిరాల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేసిన పిల్లి ఓబుల్రెడ్డి... ఈ ఘటనను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా బెల్టుషాపులకు, నకిలీ మద్యానికి తావు లేకుండా పాలన సాగిందని పేర్కొన్నారు. అరెస్టు విషయంలో న్యాయం జరిగే వరకు బాధితులకు తాము అందరం అండగా ఉంటామని ఆయన తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
టీడీపీ నాయకురాలి కుటుంబ సభ్యులుమంగళగిరి టౌన్: మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి కుటుంబంలోని కొందరు వైఎస్సార్సీపీలో చేరడమే దీనికి కారణం. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెల సెంటర్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం వరకు సుమారు వందమందికిపైగా యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జానకీదేవి తోటికోడలు అయిన తమ్మిశెట్టి అనూరాధతోపాటు జితేంద్ర, గౌతమి, బిట్ర శ్వేతలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి, అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడంతో పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పార్టీపై, అధినాయకుడిపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మురుగుడు, డీవీఆర్లు సూచించారు. జానకీదేవి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నారు. మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న ఆమె 2004లో మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
మాచర్ల రూరల్: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల డిజైనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి కుడి కాలువ సమీపంలోని మాచర్ల–సాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరులోని హస్తకళల వారికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ట్రైనర్లు ఎస్.సుగుణరాజు, ఫిలిప్, వంగడ రమేష్ కొత్తూరు నుంచి పోచం నర్సింహారావు అనే వృద్ధుడు ఆటోలో మాచర్ల బయలుదేరారు. ఏడో మైలులోని గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డన్ నాగ మల్లీశ్వరి, మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కారు. తాళ్లపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల ట్రైనర్ ఎస్.సుగుణరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. వార్డెన్ నాగ మల్లీశ్వరికి, ట్రైనర్ ఫిలిప్కు తీవ్ర గాయాలుకాగా వంగడ రమేష్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుగుణరాజుకు వివాహం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ తెలిపారు. నరసరావుపేటరూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. కాకాని జెడ్పీ హైస్కూల్కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ టోర్నీలో క్రీడాకారిణుల ప్రతిభ
గుంటూరు రూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్న్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు తదితరులు విజేతలను అభినందించారు. -
ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యుడిగా ఆస్కార్ వినోద్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ సభ్యునిగా గుంటూరుకు చెందిన మాజీ రంజీ ఆటగాడు డి.ఆస్కార్ వినోద్ కుమార్ (ప్లేయర్స్ రిప్రజెంటేషన్) ఎంపికయ్యారని గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు యు.మహతీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో వినోద్తోపాటు బీసీసీఐ నిర్వహించిన ఎన్నికల్లో ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యునిగా మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాఽథ్ ఎన్నికయ్యారన్నారు. లెఫ్ట్ హ్యాండరైన వినోద్ కుమార్ గుంటూరులోనే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989–96 మధ్య ఆంధ్ర జట్టు తరఫున 21 రంజీ మ్యాచ్లతోపాటు పలు టోర్నమెంట్లలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా మహతీశంకర్, వి.అర్జున్, బి.సుధాకర్లు అభినందనలు తెలిపారు. -
ఎరువుల విక్రయాలు నిలుపుదల
నగరంపాలెం: గుంటూరు పట్నంబజార్లోని బయో స్టిమ్యులేట్ ఎరువుల తయారీ షాపులు, ఇతర దుకాణాల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడు టోకు వర్తకుల దుకాణాల్లో రూ.1.01 కోట్ల విలువైన ఎరువుల విక్రయాలు నిలుపుదల చేశారు. మరో పదమూడు రీటైల్ వర్తకుల దుకాణాల్లో రూ.26.10 లక్షల విలువైన బయో స్టిమ్యులేట్ అమ్మకాలు, పార్శిల్ సర్వీసెస్లో రూ.5.15 లక్షల విలువైన సరుకుకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో వాటి విక్రయాలు నిలుపుదల చేశారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్రావు (గుంటూరు), టి.శ్రీనివాసరావు (మంగళగిరి), వి.కోటేశ్వరి (పొన్నూరు), ఆర్.విజయబాబు (తెనాలి), సీహెచ్ తిరుమలదేవి (పీటీఎల్), ఐ.సునీత (బీసీఎల్) పాల్గొన్నారు. అనుమతుల్లేకుండా ఎరువులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. -
వసతిగృహాల ముఖచిత్రం మారాలి
గుంటూరు వెస్ట్: పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉండే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజినీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల భవనాలు ఆహ్లాదకరంగా మారాలని సూచించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బీసీ సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలు సహా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరిశుభ్రమైన పరిసరాలు, రక్షిత తాగునీరు అందించాలన్నారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలకు నిధులు ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డి.శ్రీనివాసులు మాట్లాడుతూ అమృత్ కింద ఏడు ప్రాజెక్ట్లకు రూ.331 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. తక్కెళ్ళపాడు నుంచి బుడంపాడు వరకు పైపులైన్లు వేసి ఏటుకూరు గ్రామం వద్ద ఐదు లే అవుట్లకు నీరు ఇచ్చేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గోరంట్ల వద్ద రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. ప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ సుందరరామి రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన పాల్గొన్నారు. ఆహార సరఫరా సవ్యంగా సాగాలి పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా ఆహారం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పీఎం పోషణ్ – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతలో లోపాలు ఉండరాదని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం కింద నెలకు రూ.3.32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, డీఆర్డీఏ పి.డి. టి.విజయ లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జె.పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతను రూపుమాపేలా చర్యలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనతను రూపుమాపాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా సంస్థలలో బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమణ మూర్తి, జడ్పీ సీఈఓ వి. జ్యోతి బసు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గాబాయి, డీఈవో రేణుక, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
ఏ వార్త రాసినా తప్పే అనేలా కూటమి సర్కారు తీరు
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా నాలుగో స్తంభం అని పేర్కొన్నారు. వార్తలు రాసేందుకు సోర్సు ఎలా వచ్చిందని పత్రికలను అడగడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఏ వార్త రాసినా తప్పే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి హైదరాబాద్లో ఉంటే ఇంటికి వెళ్లి కుట్రపూరితంగా నోటీసులు జారీ చేశారని ధ్వజమెత్తారు. ఆయన్ను మానసికంగా వేధించాలనే కుట్రకు తెరలేపారని అన్నారు. ఏపీ అంతటా సాక్షి మీడియాపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ఈ విషయంలో పాత్రికేయులకు మద్దతుగా ఉంటాయని ప్రకటించారు. -
మెలోడియోసిస్ రోగికి విజయవంతంగా చికిత్స
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు నెలలకుపైగా అందరిని ఆందోళనకు గురిచేస్తున్న మెలోడియోసిస్ వ్యాధి బాధితునికి గుంటూరు జీజీహెచ్ వైద్యులు రెండు నెలలపాటు వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలేనికి చెందిన పి.ఎలీషా (42) ఆగస్టు 21న అడ్మిట్ అయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. మెలోడియోసిస్ ఉందని నిర్ధారించామని, రెండు నెలలపాటు వైద్యం అందించి వ్యాధి నుంచి విముక్తుడిని చేశామన్నారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.ఉషారాణి మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ బృందం, జనరల్ సర్జరీ విభాగం సహకారం అందించారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ సి.వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రభాకర్, పీజీ వైద్యులు డాక్టర్ కే ఆశాజ్యోతి, డాక్టర్ వి.స్వర్ణ సేవలు అందించినట్లు చెప్పారు. -
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా బెజ్జం అశోక్
తాడికొండ: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు కలిపి యూనిట్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా బి.కృష్ణ కిషోర్, సహాయ ఎన్నికల అధికారిగా కె. శేషగిరి రాజు వ్యవహరించారు. 16 మందితో కూడిన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎన్నికల పరిశీలకుడిగా కె. విజయ్ బాబు వ్యవహరించారు. అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ కుమార్, సహ అధ్యక్షుడిగా కె. రవిబాబు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, ఎ. లలిత కుమారి, ఇ. చంద్రబాబు, పి. మల్లికార్జున రావు, మహిళా ఉపాధ్యక్షులుగా సీహెచ్ శారదాదేవి, కార్యదర్శిగా షేక్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ డి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా వి. రామాంజనేయులు, డి.అరుణకుమార్, బి.రాంబాబు, పి.అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.నాగమణి, కోశాధికారిగా ఎ.పూర్ణయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్. ఏసునాథరావులు ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారని ఎన్నికల అధికారి ప్రకటించారు. అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఏపీఎన్జీజీవో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ హాజరయ్యారు. సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, ఎస్.వెంకటరెడ్డి సత్తెనపల్లి యూనిట్ అధ్యక్షుడు మణిరావు, అమరావతి యూనిట్ మాజీ అధ్యక్షుడు రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు తన భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా, రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవన్ కార్యాలయం ఎదుట శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వి. రాంప్రభాకర్, జి. నాగరాజులు నేతృత్వం వహించారు. దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, జిల్లా నాయకులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, విద్యుత్ సీఐటీయూ నాయకులు పవన్, రాంబాబు, శివనాగేశ్వరరావు, సురేష్, నాగరాజు, సలీంబాషా, వర్మ, వంశీ, బి. రవికుమార్, వీరారెడ్డి, లెనిన్ బాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలతో కూడిన నాయకత్వం అవసరం
చేబ్రోలు: విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువలతో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూడా ముఖ్యమని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం.పి.గణేష్లు కూడా ప్రసంగించారు. వంద మందికిపైగా ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
బాజీ బాబాకే టోకరా
గుంటూరు● ప్రణాళిక, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరణ ● ఐదు పంటల్లో 140 ప్రయోగాలు సూపర్ జీఎస్టీపై 19 వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ గుంటూరు జిల్లా ఉత్సవ్ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవ్ జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ధరలు తగ్గలేదని ఫిర్యాదులు రాకూడదని వ్యాపారులకు సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎస్టీ 2.0పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని, తద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన పొదుపును గృహ అవసరాలకు ఖర్చు చేయాలని సూచించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతా మాధురి మాట్లాడుతూ ప్రతి వస్తువుపై జీఎస్టీ ధరల తగ్గుదలను ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. ఏసీ కళాశాల ఆవరణలో ఏర్పాట్లు జీఎస్టీ 2.0పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాలులో ఉత్సవ్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా లోగో కూడా తయారు చేయించారు. ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్లో అమ్మకాలు జరుగుతాయి. పచ్చళ్లు, పొడులు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, జిమ్, ఫిట్నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, ట్రాక్టర్లతో 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆమె పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు వివరాలు, దిగుబడి, సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రాయితీల వివరాలు, పంటల వారీగా సాగు పెట్టుబడి, దిగుబడి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు. పెదకాకాని: బాజీ బాబా దర్గాలో కూటమి నాయకుల దందాలు, ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వక్ఫ్బోర్డు అధికారులతో కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్లో కొనసాగుతున్న హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. భక్తులు వచ్చి ప్రార్థనలను చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతోంది. పలువురు భక్తులు బాబావారిపై ఉన్న భక్తితో శక్తికొలది దర్గా అభివృద్ధికి కానుకలు నగదు రూపంలో చెల్లిస్తుంటారు. మరి కొందరు దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మించారు. గతంలో దర్గాకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా వంట అక్కడే చేసుకునేవారు. వర్షా కాలం భోజనం తినే సమయానికి వాన వచ్చి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు కొల్లలు. దీంతో దాతలు దర్గాలో మొక్కులు చెల్లించుకునే వారి సౌకర్యార్థం షెడ్డును నిర్మించారు. దీన్ని కూటమి నాయకులు ఆక్రమించుకుని అందులో టెంట్హౌస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాబాపై ఉన్న భక్తితో షెడ్డు నిర్మించానని, అందులో టెంటు సామాను ఖాళీ చేయించి భక్తులకు ఉపయోగపడేలా చూడాలని దాత కోరినప్పటికీ వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు దర్గాకు వస్తూ టెంటు, సామాన్లు తెచ్చుకున్నా అడ్డుకుంటున్నారు. తమ దగ్గరే తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. యడ్లపాడు: సంక్రాంతి పర్వదినం నాడు జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన కోటప్పకొండ, కొండవీడు ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫెస్టివల్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఇప్పటికే అటవీశాఖ, టూరిజం శాఖల అధికారులు దీనిపై రూపకల్పన చేశారన్నారు. కొండవీడుకోటను కలెక్టర్ కృతికా శుక్లా పలుశాఖల జిల్లా స్థాయి అధికారులతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిధిలోని అన్ని పర్యాటక కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డు ప్రారంభంలోని చెక్పోస్టు వద్దకు రాగానే కలెక్టర్కు డీఎఫ్వో జి కృష్ణప్రియ స్వాగతం పలికారు. రిజర్వ్ ఫారెస్టు భూముల వివరాలను కలెక్టర్కు వివరించారు. మొదలైన పంట కోత ప్రయోగాలు I పెదకాకాని బాజీ బాబా దర్గాలో దోపిడీల పర్వం యథేచ్ఛగా కూటమి నాయకుల దందా అధికారులతో కుమ్మక్కు కానుకల లెక్కింపులో చేతివాటం అక్రమాలను అరికట్టాలని ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ వక్ఫ్ బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలి. టెంట్ హౌస్ను వెంటనే తొలగించాలి. హుండీల కానుకలు లెక్కింపులో సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అనుకూలమైన ఫోటోగ్రాఫర్ను పెట్టుకుని కూటమి నాయకులు, వక్ఫ్బోర్డు అధికారులు కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. – షేక్ ఖాజావలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం క్రస్ట్ గేట్లు మూసివేశారు. ప్రస్తుతం నీటిమట్టం 589.30 అడుగులు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. దర్గాలో మూడు నెలలకు ఒకసారి హుండీలు తెరచి కానుకలు లెక్కింపు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చిల్లర నాణేలు సుమారు రూ. 2 లక్షల వరకూ వస్తుంటాయి. స్థానిక కూటమి నాయకుడి ఒత్తిడితో లెక్కించకుండానే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకుని అతనికి అప్పగిస్తున్నారు. హుండీల్లోని కానుకలు లెక్కింపు సమయంలో కూడా కూటమి వారికి అనుకూలమైన ఫోటో వీడియోగ్రాఫర్ను ఏర్పాటు చేసుకుని హుండీల్లోని నగదు కాజేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వక్ఫ్బోర్డు అధికారులు, స్థానిక ఈఓ, కూటమి నాయకులు కుమ్మకై ్క ఫోటోలకు, వీడియోకు దొరక్కుండా నగదు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు కూడా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, వక్ఫ్బోర్డు అధికారులు, చైర్మన్ స్పందించి అక్రమాలను అరికట్టాలని భక్తులు, పెదకాకాన్ని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
హత్య కేసులో నిందితుల అరెస్టు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, ఎస్హెచ్ఓ కె.వెంకట ప్రసాద్, ఎస్ఐ ఎన్.సి.ప్రసాద్లు గురువారం వివరాలను వెల్లడించారు. పొన్నూరు రోడ్డులో ఈనెల 7న కుర్రా నాగ గణేష్ (25)ను హత్య చేశారు. బుడంపాడులో నివాసం ఉండే నాగ గణేష్ కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం ఇష్టం లేని ఆమె సోదరుడు కీర్తి దుర్గారావు ఈనెల 7న స్నేహితులతో కలిసి నాగ గణేష్ను హత్య చేశాడు. ఈ క్రమంలో మృతుడు తండ్రి శివాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తెనాలి కొలకలూరు గ్రామానికి చెందిన షేక్ నూర్బాషా అలియాస్ జలాలి, బత్తిన లోకేష్, నందివెలుగు గ్రామానికి చెందిన తుమ్మల శివయ్య, జంపని వంశీ, గుంటూరు రూరల్ మండలం నివాసగొర్లవారిపాలేనికి చెందిన శాఖమూరి గోపీకృష్ణ, కీర్తిపాములు, కుంచనపల్లికి చెందిన దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులను ఆశ్రయించిన హతుడు సెప్టెంబరు 25న వివాహం జరిగిన తరువాత వీరాంజనేయదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని కుర్రా నాగ గణేష్ ఆమెతో కలిసి నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే పలుమార్లు గణేష్ను చంపుతామంటూ ప్రధాన నిందితుడు దుర్గారావు బెదిరింపులకు పాల్పడిన పరిస్థితులున్నాయి. నాగ గణేష్, స్నేహితుడు సంగుల కరుణతో కలిసి ఈనెల 7న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో పొన్నూరు రోడ్డులోని ఎం. కన్వెన్షన్ పంక్షన్ హాలు సమీపంలో దుర్గారావు ఇద్దరు వ్యక్తులతో వచ్చి మృతుడిని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉన్న స్నేహితుడు గణేష్ను ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 15న రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడు పంచాయతీ గొర్లవారిపాలెం వెళ్లే రోడ్డులో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులో ఏ–8గా పేర్కొన్న దాసరి వీరయ్య హత్యకు కుట్ర చేసి ప్రొత్సహించిన నేపథ్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దాసరి వీరయ్యకు రిమాండ్ గుంటూరు లీగల్: హత్య కేసులో దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను రిమాండ్కు పంపుతూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుడంపాడు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్ హత్య కేసులో వీరయ్య ప్రమేయం ఉందంటూ నేరారోపణ ఉన్న క్రమంలో 8వ ముద్దాయిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో వాద ప్రతివాదనల అనంతరం వీరయ్యకు 14 రోజుల వరకు రిమాండ్ విధించారు. ఆయన్ను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. -
డిసెంబర్ 12 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 8వ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి, ఏపీ రెరా మెంబర్ దామచర్ల శ్రీనివాసరావు, ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు, క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ గుంటూరు చాప్టర్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రాపర్టీ షోను డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇందులో నాణ్యమైన అపార్ట్మెంట్లు, స్థలాల వివరాలతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, ప్రాపర్టీ షో కన్వీనర్ టి.వినోద్రెడ్డి, గుంటూరు చాప్టర్ చైర్మన్ ఆరుమళ్ల సతీష్రెడ్డి, ప్రెసిడెంట్ మామిడి రాము, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రెజరర్ ఏ.వి. నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
కోనేరులోకి దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్ వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వం ఆదుకోవడంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు. -
జిల్లా స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎ ఎం.నహిద గురువారం తెలిపారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అండర్– 17 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాటం రాజు, 200 మీటర్లలో కిశోర్, కబడ్డీలో కాటంరాజు, చెస్లో గోపీకృష్ణ, వాలీబాల్లో కిశోర్, 3 కి.మీ., 5 కి.మీ. పరుగు పందెంలో గహత్, శ్రీను ప్రతిభ చాటారన్నారు. అండర్ –14 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు, వాలీబాల్లో వినయ్కుమార్, 400 మీటర్లలో సతీష్కుమార్, చెస్లో దేవరాజు, ఖోఖోలో చందు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ కార్యాలయంలో డీఆర్వో ఎన్.ఎస్.ఖాజావలి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నారు. సంఘం చేసే సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.లూర్థురెడ్డి, ట్రెజరర్ పి. నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. సుబ్బారావు, ఎం.ఎస్.నాగేంద్రం, కె.మురళి, సంయుక్త కార్యదర్శులు ఐ. సాయిబాబు, పెద మస్తాన్తో పాటు కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి కంటి హాస్పిటల్, కాస్వి డెంటల్ క్లినిక్ వైద్యులు పరీక్షలు చేసి సభ్యులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సందేహాలను నివృత్తి చేశారు. -
షార్ట్ హ్యాండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 4న షార్ట్ హ్యాండ్, జనవరి 25,26వ తేదీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైనట్లు ఆల్ ప్రిన్సిపాల్స్ టెక్నికల్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్బాబు గురువారం తెలిపారు. ఆయా పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు సమీపంలోని టైప్ ఇనిస్టిట్యూట్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు. గంజాయి స్వాధీనం పెదకాకాని: నగర శివారులోని బసవతారక రామనగర్ సమీపంలో ఇద్దరు గంజాయి తాగుతుండగా టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎర్ల వెంకటచిన్న, గుంజి మోహన్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వారికి విక్రమ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. రైలులో 4.4 కిలోలు.. తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ బాపట్ల: ప్రముఖ కవయిత్రి చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. రచయిత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత , సాహితీ విమర్శకులు బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని తెలిపారు. ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
వ్యవసాయశాఖ కమిషనర్కు అభినందనలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను గుంటూరు చుట్టుగుంటలోని కార్యాలయంలో ఏపీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి, అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల లభ్యత గురించి కమిషనర్కు వివరించారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జిలానీ సమూన్ తెలిపారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె.విజయకుమార్, ఉపాధ్యక్షులు చక్కా రవికుమార్, భీమవరపు శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్.చలపతిరావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. -
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు. -
రైలు ఎక్కితే రక్షణ కరువు
దాచేపల్లి : రైలు ప్రయాణికులకు భద్రత కరువైంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇటీవల ప్రయాణికుల నుంచి దుండగులు బంగారం, నగదు దోచుకున్న ఘటనలు భారీగా జరిగాయి. తాజాగా సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. రైలు ప్రయాణికుల్ని కలవరపాటుకు గురి చేసింది. ఏపీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు(35) సోమవారం రాజమహేంద్రవరం స్టేషన్లో చర్లపల్లి వెళ్లేందుకు సంత్రగాచి ప్రత్యేక రైలు ఎక్కింది. ఆమె అక్కడ ఇళ్లల్లో పని చేసుకుని జీవించేందుకు వెళుతోంది. రైలు గుంటూరు స్టేషన్కి చేరుకున్న తరువాత మహిళా బోగీలో ఉన్న ప్రయాణికులంతా దిగి పోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. బోగీలోని 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. బలవంతంగా ఎక్కాడు. గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత బోగీ తలుపులు మూసివేశారు. ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ. 5,600తో పాటు సెల్ఫోన్, హ్యాండ్బ్యాగ్ లాక్కొని దాడి చేసి, పెదకూరపాడు చేరుతుండగా కిందకు దిగి పారిపోయాడు. రైలు మంగళవారం చర్లపల్లి స్టేషన్కు చేరుకున్న తరువాత బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. ఇటీవల నడికుడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ స్టేషన్ల పరిధిలో రైళ్లల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదును దుండగులు దోచుకున్నారు. ఆగంతకులు రైళ్లను ఆపి పారిపోవడం ఆ శాఖకు సవాల్గా మారింది. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు తాజాగా ప్రయాణికురాలిపై అత్యాచారం సికింద్రాబాద్లో కేసు నమోదు చేసి నడికుడికి బదిలీ జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరత రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరతతో ప్రయాణికులకు సరియైన భద్రత కల్పించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు రైల్వే డివిజన్లో రెండో అతి పెద్ద స్టేషన్ అయిన నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని పిడుగురాళ్లకు తరలించారు. నడికుడి స్టేషన్లోని జీఆర్పీ కార్యాలయంలో ఎస్ఐగా నరసరావుపేట స్టేషన్లో పని చేస్తున్న అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. -
లలిత సంగీత సరస్వతి
తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్ మూతపడింది. తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడటం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్ఎంవీ (హిజ్ మాస్టర్స్ వాయిస్) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు. శ్రోతలను ఆకట్టుకునేలా.. అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్ఆర్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. భూములు పోయినా నష్టపరిహారం అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష నగదు, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు. తొలి అడుగులు గుంటూరులోనే.. బాలగాయనిగా ఇక్కడి నుంచే సినీప్రస్థానం గతంలో విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్. కోల్కతాలో ఈ షూటింగ్ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్ రోల్ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు. -
రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన కలాం
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాలక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడించిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు,సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కల్యాణి , కలెక్టరేట్ బ్బంది పాల్గొన్నారు. బాపట్ల: రైతు బజార్లో రైతులు పంటలు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ ఏడీ కారుమూరి రమేష్బాబు ఆదేశించారు. స్థానిక రైతు బజార్ని బుధవారం తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఘట్రాజు ఫణీంద్ర ఉన్నారు. -
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
బాపట్ల: కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించనున్న ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అన్నం సతీష్ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కార్తిక వన సమారాధన సమయంలో అందజేస్తున్న విధంగా నే నవంబరు 16వ తేదీన పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతున్న 60 శాతం మార్కులు మించిన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, జత చేసి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో అందజేయాలని సూచించారు. వివరాలకు కె.శ్రీనివాసరావు 9346569982ను సంప్రదించాలని కోరారు. -
ఆర్మీ మేజర్కు ఘన నివాళి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,073 ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి. జగనాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో వ్యాపారస్తులు సిండికేట్గా మారి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదన్నారు. క్వింటా పత్తిని రూ.5 వేలలోపునకు కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర రూ.7,710 ప్రకారమైనా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు కారంచేడు: తండ్రి మందలించినందుకు కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్ కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులు స్పందించ లేదు
రెండు నెలల కిందట నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకు తగ్గింది. తరువాత శరీరంపై గడ్డ వచ్చింది. వెంటనే గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రస్సింగ్, ఆరు నెలల పాటు పరిశీలనలో ఉండాలని చెప్పారు. గతంలో మా గ్రామానికి బోరు పని చేయకపోవడంతో క్వారీ గుంత నుంచి అందించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రతి రెండు రోజలకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు చికిత్సలకే రూ. 5 లక్షలు ఖర్చయింది. – మెట్టు నాగిరెడ్డి, గ్రామస్తుడు -
ముమ్మాటికీ కూటమి హత్యలే !
గుంటూరు రూరల్: తురకపాలెంలో మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో అకాల మరణాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు వైద్యుల బృందం బాధితుల రిపోర్టులు పరిశీలించి వైద్య సలహాలను అందించింది. గ్రామస్తులను పలకరించి వారి సమస్యలు, సంఘటనలు జరిగిన తీరును నాయకులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం కూటమి ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేశారు. గ్రామస్తులను సామాజిక బహిష్కరణ చేయడం సబబుకాదని నినాదాలు చేశారు. -
ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేం
నా భార్యకు నెల రోజుల కిందట శరీరంపై గడ్డ వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వెళితే పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాం. వేలకు వేలు ఖర్చవుతున్నాయి. జ్వరం రెండు రోజలు తగ్గుతుంది.. మరలా వస్తోంది. డాక్టర్లే ఇది అప్పుడే తగ్గదు టైం పడుతుంది అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోడంతో మా గ్రామస్తులు చనిపోయారు. – నక్కా నాగేశ్వరరావు గ్రామస్తుడు -
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
తిన్నారా.. తినలేక పడేశారా..?
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు బీసీ బాలుర వసతి గృహంలో పరిశుభ్రత మచ్చుకై నా కానరావడం లేదు. డస్ట్బిన్లో అన్నం పడేశారు. అసలు ఆహారం తిన్నారా? తినలేక పడేశారా..? ప్రభుత్వం ఇచ్చే బియ్యమే కదా అని అధికంగా వండి వ్యర్థాల డబ్బాలో పారవేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో కనిపించిన ఈ దృశ్యాలు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి, ఉన్నతాధికారుల ఉదాసీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పెదనందిపాడు మండలం అన్నపర్రు బాలుర హాస్టల్లో ఐదు రోజుల కిందట విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రత్తిపాడు హాస్టల్ సిబ్బందికి కనువిప్పు కలిగినట్లుగా లేదు. హాస్టల్ ఆరంభంలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. మిగిలిన వ్యర్థాలు డబ్బాలో పడేసి, మూత కూడా పెట్టలేదు. దోమలు, ఈగలు వాలి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మరుగుదొడ్ల నుంచి వచ్చే మురుగు సైతం ఆవరణలోనే నిలిచి ఉంది. నీటి కొళాయిలు ఉన్న ప్రదేశం అంతా పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. అయినా హాస్టల్ వార్డెన్కు కనీసం చీమ కుట్టినట్లయినా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహార పదార్థాల వ్యర్థాలు విచ్చలవిడిగా పడేయడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇకనైనా జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి హాస్టళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రత్తిపాడు బీసీ హాస్టల్లో మారని పారిశుద్ధ్య నిర్వహణ తీరు -
మొబైల్ఫోన్లు బాధితులకు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఫోన్లను తిరిగి అప్పగించారు. సుమారు రూ.50 లక్షల విలువైన 250 ఫోన్లను మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఫోన్లను పొగోట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే సమాచారం దుర్వినియోగం కాదని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.6.82 కోట్ల విలువైన 3,414 ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. హెల్ప్ నంబర్ 86888 31574 లేదా సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెచ్సీ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఏస్ హెచ్సీ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
ఈత పోటీలలో రైల్వే ఉద్యోగి ప్రతిభ
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూరు డివిజనులో లోకో పైలట్ (గూడ్స్) గంపల సాంబశివరావు ఈత పోటీలలో ప్రతిభ చాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సంస్థకు కీర్తి తెచ్చిపెట్టారని గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠసేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సాంబశివరావును ఘనంగా సత్కరించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో మంగళగిరిలో ఎస్.మహబూబ్ షంషేర్ ఖాన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలలో సాంబశివరావు 2 బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 8వ అంతర్ జిల్లాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో సైతం 4 బంగారు పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, అధికారులు అభినందించారు. -
వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలం
గుంటూరు మెడికల్: కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కురపం హాస్టల్లో ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు. , తాజాగా అనపర్రు హాస్టల్లో 31 మంది అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనపర్రు బీసీ హాస్టల్ వార్డెన్ వేధింపులను తట్టుకోలేక విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే, తురకపాలెంలో పదుల సంఖ్యలో చనిపోయినా ఇప్పటి వరకు కారణాలు నిగ్గుతేల్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గుంటూరు నగరంలో 200 మందికిపైగా డయేరియాతో జీజీహెచ్లో చికిత్స పొందినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనిచేయడం లేదని, అది పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. వారం రోజుల్లో హాస్టళ్లకు... సంక్షేమ హాస్టళ్లు నేడు సంక్షోభంలో ఉన్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో తాము తనిఖీలు చేశామన్నారు. వారం రోజుల్లో వాటిని పరిష్కరించని పక్షంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్స్ బాట పడతామని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాలవజ్రబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు. -
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో మంగళవారం పాడిరైతులతో కలసి మహాసభ ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి అయితానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కల్యాణమండపంలో 25న ఉదయం 10 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. గేదెపాలు లీటరుకు రూ.40, ఆవు పాలు రూ.20కు మించి డెయిరీల్లో ధర రావటం లేదన్నారు. పాడి పశువులకు బీమా మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సంఘం జిల్లా నాయకురాలు వేజెండ్ల తబిత కోరారు. తెనాలి శాంతకుమారి, మాన్యం పద్మ, ఎల్లమాటి మేరమ్మ, కె.శకుంతల ఎ.సరోజిని, టి.నిర్మల, సంతోషం, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు. -
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సకాలంలో చేరాలి
నరసరావుపేట: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయం నుంచి ఎయిడ్స్ నియంత్రణ చర్యలపై జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీటి, ఏఆర్టీ, డీఎస్ఆర్సీ, లింక్ ఏఆర్టీ, టీఐ, ఎన్జీఓఎస్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం పరీక్షలు పెంచాలని, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరిని ఏఆర్టీకి లింక్ చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ ఉన్న వారికి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేషెంట్కు ఏఆర్టీ కేంద్రాల ద్వారా పెన్షన్కు దరఖాస్తు చేయాలని, ఆయా కేంద్రాలలో ఎల్ఆఫ్యూ కేసులను కూడా తగ్గించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ చైతన్య, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్, టెక్నికల్ ఎక్స్ఫర్ట్ శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత -
నేడు విద్యుత్ లోక్ అదాలత్
తాడికొండ: విజయవాడకు చెందిన కన్సూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాయపూడిలోని విద్యుత్ భవన్లో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అమరావతి క్యాపిటల్ ఈఈ సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ భవన్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. సీఆర్డీఏ సర్కిల్, అమరావతి క్యాపిటల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. విజయవాడ సీజీఆర్ఎఫ్ చైర్మన్, రిటైర్డ్ జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయేల్, సాంకేతిక సభ్యుడు డి. కృపానాయక్, ఆర్థిక సభ్యుడు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్య్ర సభ్యులు సునీత, ఎస్ఈ ఎం. శ్రీనివాసరావు పాల్గొంటారని పేర్కొన్నారు. నెహ్రూనగర్: స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో (జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్) అవగహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలపై జిల్లాస్థాయిలో అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువత ఈ అవగాహన సదస్సుకు హాజరై ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. నరసరావుపేట రూరల్: అధిక ధరకు మొక్క జొన్న విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు విత్తన స్టాక్ రిపోర్ట్ను అందజేయాలని తెలిపారు. రైతుకు ఇచ్చే బిల్లు మీద తప్పనిసరిగా లాట్ నెంబర్ వేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేయాలని, విత్తన చట్టానికి లోబడి ప్రతి డీలరు వ్యాపారం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, ఏఓ శాంతి, డీలర్లు పాల్గొన్నారు. -
ఘనంగా ఏపీ ఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏఎన్యూ (పెదకాకాని): క్రీడల ద్వారా దేహదారుఢ్యం, ఐకమత్యం పెంపొందుతాయని ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఏపీ ఎస్పీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఏఎన్యూలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రివిక్రమ్ ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డితో కలసి ప్రారంభించారు. 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల తేడా లేదని, క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్గా త్రివిక్రమ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ ఎస్పీఎఫ్లో మార్పులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల మినీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందన్నారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలో మీటర్ల పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి దాదాపు రెండు వందల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే
గుంటూరు వెస్ట్: మంచినీటి సరఫరాలో అలసత్వం వహించే సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయొద్దని తెలిపారు. ఈ నెల 20వ తేదీన దీపావళి సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకోవడానికి అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దుకాణాల ఏర్పాటుకు 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వట్టిచెరుకూరు మండలం కూర్నూతలలో సీసీఐ పత్తి కొనుగోళ్లుకు నోటిఫై చేసిన గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో సన్నద్ధత ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. అమరేశ్వరుని హుండీ ఆదాయం అమరావతి:అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలలోని కానుకలను లెక్కించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వా మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో 12 హుండీలను తెరచి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నెలల 7 రోజుల కాలానికి దేవాలయంలో ఉన్న హుండీల ఆదాయం మొత్తం రూ. 20,07,999. అన్నదాన మండపంలోని హూండీ ద్వారా రూ.48, 809 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ తెలిపారు. అచ్చంపేట జెడ్పీ హైస్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అచ్చంపేట: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కావలసిన వసతులు, తరగతి గదులను పరిశీలించారు. ఇక్కడ 1950లో స్థలదాత తుమ్మేపల్లి శ్రీరాములు నిర్మించిన పురాతన భవనం శిథిలం కాగా, ఇటీవల పూర్వవిద్యార్థులు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఆధునీకరించారు. అందులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని ఆర్జేడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ గదులను ఇంకా ఆధునీకరించవలసి ఉందన్నారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 19న త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్ : తెలుగు సమాజంలోని గొప్ప సామాజిక విప్లవకారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. 2025వ సంవత్సరానికి రామస్వామి చౌదరి పురస్కారాలను సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మూకిరి సుధ, వీసీకే పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు కై లా జయసుధ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ పాల్గొన్నారు. -
సైబర్ కేటుగాడు అరెస్టు
నగరంపాలెం/గుంటూరువెస్ట్: కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడే ఓ పాత నేరస్థుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అతని నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఆరు నెలల క్రితం ఎస్వీఎన్ కాలనీలో ఓ వృద్ధుడికి(68) ఫేస్బుక్ మెసేంజర్లో శైలజ మార్ని పేరుతో హాయ్ అని మెసేజ్ వచ్చిందన్నారు. వృద్ధుడు కూడా హాయ్ పంపించాడని చెప్పారు. కాల్ బాయ్గా చేస్తే నగదు చెల్లిస్తామని పేర్కొనడంతో వృద్ధుడు వద్దని చెప్పాడన్నారు. తర్వాత పది రోజులపాటు అవతలి వ్యక్తి వాయిస్ కాల్స్ చేసినట్లు పేర్కొన్నారు. వేరే నంబర్లతోనూ కాల్ చేసి పోలీసులమని, మహిళలతో అసభ్యకరంగా చాట్ చేస్తున్నావని వృద్ధుడికి బెదిరింపులు వచ్చాయన్నారు. కేసు నమోదైందని, మాఫీకి నగదు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులమని, రైస్ మిల్లులో అక్రమ లావాదేవీలు జరిగాయని, తనిఖీలకు వస్తున్నామని హెచ్చరించారు. వృద్ధుడు భయపడి పలు ఖాతాలకు సుమారు రూ.కోటి జమ చేశారని తెలిపారు. తర్వాత మోసపోయినట్లు తెలిసి పట్టాభిపురం పీఎస్లో ఫిర్యాదు చేశాడన్నారు. సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సాయిబాబా గుడి బజారుకు చెందిన చోడ చైతన్యకృష్ణ పవన్ (27)ను నిందితుడిగా తేల్చారని పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించామని, నేరం రుజువు కావడంతో అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో విస్తుపోయే విషయాలు... ఇంటర్ వరకు చదివిన చైతన్యకృష్ణ పవన్ బెంగళూరు కేంద్రంగా కాల్బాయ్ పేరుతో మోసగిస్తున్నాడు. నాలుగేళ్లపాటు సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల వారిని మోసగించాడు. మహిళల పేర్లతో ఫేస్బుక్లో ఖాతాలు తెరిచి మెసేజ్ చేస్తూ పరిచయం చేసుకునేవాడు. కాల్బాయ్ కథ అల్లేవాడు. గొంతులు మార్చి కాల్ చేసేవాడు. వసూళ్లే వసూళ్లు ఒప్పుకొంటే ఏవేవో ఫీజుల కింద రూ.20 వేలు, రూ.30 వేలు తీసుకునేవాడు. తర్వాత బాధితులకు వేరే ఫోను నంబర్లతో కాల్ చేసి పోలీస్ అని బెదిరించేవాడు. ఆడవాళ్లతో అసభ్యంగా చాటింగ్, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కేసు నమోదైందని బెదరగొట్టేవాడు. మళ్లీ వేరే నంబర్లతో ఫోన్ చేసి హైకోర్టు న్యాయవాది, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా పలు విధాలుగా చెప్పేవాడు. కేసు లేకుండా చూసేందుకని 2022లో హైదరాబాద్లో ఓ వ్యక్తిని సుమారు రూ.1.70 లక్షలకు మోసగించాడు. సైబరాబాద్ క్రైం పీఎస్లో కేసు నమోదైంది. 2024 సైబరాబాద్కు చెందిన వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వాసి నుంచి రూ.2 లక్షలు, నిజామాబాద్కు చెందిన వ్యక్తి నుంచి రూ.37 వేలు జమ చేయించుకున్నాడు. కేసును ఛేదించిన పట్టాభిపురం పీఎస్ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్కుమార్, పీఎస్ఐ ప్రదీప్, హెచ్సీ ప్రసాదరావు, ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా, హెచ్సీ రాజాకిషోర్లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 81,966 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని సుష్మగౌడ్ ఫౌండేషన్ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్,ఎస్ఎన్వీఎస్ ప్రసాద్గౌడ్లు అందజేశారు.315 రోజులుగా దీక్షలు తాడేపల్లిరూరల్: బ్రహ్మానందపురంలో ఏసీసీ కార్మికులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 315వ రోజుకు చేరుకున్నాయి. శిబిరాన్ని కేసీ వర్క్స్ యూనియన్ నాయకులు సందర్శించారు.I -
పరిశ్రమలపై ‘చిన్న’చూపు
తాడేపల్లి రూరల్: నూతన రాజధాని అమరావతిలో ఉన్న చిన్న పరిశ్రమలను తరలించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానిలో భాగంగా తాడేపల్లిలో ఉన్న ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ రాష్ట్రం నుంచి తరలిపోతుంటే ఏమాత్రం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఫిల్లింగ్ ప్లాంట్ పరిశ్రమను నమ్ముకుని అందులో పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా 80 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ద్వారా మరో 120 మంది కుటుంబాలను పోషించుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్లు కాకుండా వాహన యజమానుల కుటుంబాలు ఈ కంపెనీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. చిన్న పరిశ్రమలను ప్రభుత్వం కాపాడాలని కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు. కంపెనీ మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారులే స్వయంగా వేరే ఉద్యోగాలు చూసుకోండంటూ కార్మికులకు చెబుతున్నారు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. 5 నెలల క్రితం వరకు ఇక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలో 2500 కేఎల్ ఇంజిన్ ఆయిల్ ఉత్పత్తి చేయగా, దానిని క్రమక్రమంగా వెయ్యి కేఎల్కు తీసుకొచ్చారు. త్వరలోనే కంపెనీ మూసివేస్తారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి (60) గ్రామంలోని తమ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గండికోట దుర్గ తెనాలి చెంచుపేటలోని ఎమ్మెల్యే బజారులో ఉంటోంది. బుజ్జి పది రోజుల క్రితం కుమార్తె వద్దకు వచ్చాడు. బైక్పై టిఫిన్ బండి వద్దకు మంగళవారం ఉదయం వెళ్లాడు దోశలు ఆర్డరిచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంతలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తిరుపతిరావును హత్య చేశాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేంటి? పాత కక్షలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కోరుతాడిపర్రులో ఆలయానికి సంబంధించిన నగదు పాట నిర్వహించడం, ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ వంటివి బుజ్జి చూస్తుంటాడు. అమృతలూరు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆలయ వ్యవహారం ఏళ్లుగా ఒక్కరే చూడాలా అంటూ గ్రామానికే చెందిన అల్లుడు వరుస అయ్యే వ్యక్తి ఇటీవల బుజ్జితో వాగ్వాదానికి దిగాడని, అలాగే తన తండ్రి మృతికి తిరుపతిరావు కారణమంటూ గతంలో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. అతనే ఈ హత్య చేసి ఉంటాడని అటు గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. మరో వైపు తిరుపతిరావు మనవరాలికి ఆమె భర్తకు మధ్య కలహాలు ఉన్నాయి. మూడు రోజులుగా చెంచుపేటలో పంచాయితీ నడుస్తోంది. కుటుంబ కలహాలకు తిరుపతిరావే కారణమని, అతడిని హతమారిస్తే కలహాలు ఉండవంటూ మనవరాలి భర్త సోమవారం రాత్రి హెచ్చరించాడని చెబుతున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరులో అల్లుడి వరుస అయ్యే వ్యక్తి లేదా మనవరాలి భర్త ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిద్దరూ ఒక్కటై పథకం వేసి హత్య చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
నేటి నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం కమిటీ జనరల్ బాడీ సమావేశం రామ్ప్రభాకర్, జి.నాగరాజుల అధ్యక్షతన జరిగింది. చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ నాగ బ్రహ్మచారి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని, దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు జానీ, పవన్, రాంబాబు, వంశీ, అందే రాజేష్, కొండా, చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
ఏకంగా బస్ షెల్టరుకే ఎసరు
బస్ షెల్టర్ను దుకాణాలుగా మార్చిన దృశ్యం మంగళగిరి టౌన్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నిడమర్రులో ఓ ప్రభుత్వ స్థలంలో బంధువుల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. 1978లో పాములపాటి రంగారెడ్డి, వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన శివారెడ్డి దీన్ని నిర్మింపజేశారు. 2024 జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చాక బస్ షెల్టర్ ఏర్పాటు చేసిన వారి సంబంధికులు దానిని టీడీపీ కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని తొలగించి, మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు. -
ఏఎన్యూలో ప్రపంచ హస్తకళల దినోత్సవం
పెదకాకాని: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో హస్తకళలు కీలకపాత్ర పోషిస్తాయని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్ అన్నారు. ప్రపంచ హస్తకళల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేవకాంత్ మాట్లాడుతూ హస్తకళలు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంలో, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయన్నారు. అనంతరం కొండపల్లి, ఏటికొప్పాక, చెన్నపట్నం బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం, కలంకారి, చేనేత వస్త్రాలను విద్యార్థులు ప్రదర్శించారు. అధ్యాపకులు బి.శేఖర్బాబు, జాన్రత్నబాబు, వి.వీరయ్య, విద్యార్థులు సీహెచ్ హెలీనా, చక్రిత విద్య, రేణుక, బాంధవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి
గుంటూరు మెడికల్: అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వార్డెన్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బీసీ వసతి గృహాలలో వసతులు మెరుగు పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి షేక్ నూరి ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ వార్డెన్ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆహారం విషపూరితంగా మారిందని, విద్యార్థులు తెల్లవార్లు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడినా సకాలంలో స్పందించలేదని వెల్లడించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్టళ్లలో భోజనం బాగుందని, మెను బాగా పెట్టేవారని విద్యార్థులు తమతో చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనం బాగుండటం లేదని వెల్లడించారన్నారు. అందుకే విద్యార్థులు నీరసించి పోయారన్నారు. ఎవరైనా సమస్యల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిస్తే చాలు ఆ విద్యార్థులను వార్డెన్ చితకబాదుతున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భయపడుతున్న తల్లిదండ్రులు విద్యార్థులను హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని, ఇళ్లకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. హాస్టల్నే సరైన దిశగా నడిపించలేని వీరు రాష్ట్రాన్ని పరిపాలించగలరా అని ప్రశ్నించారు. జిల్లాలో నెలరోజులుగా పలు పెద్ద సంఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. తురకపాలెంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని, అయినప్పటికీ నేటి వరకు కారణాలు ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందన్నారు. గుంటూరు నగరంలో గతనెలలో డయేరియాతో 200 మందికిపైగా చికిత్స పొందారని, తాజాగా బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతతో చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురై అవస్థలు పడుతున్నారని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. తక్షణమే హాస్టల్ను సందర్శించి వసతులు మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మూడు రోజుల్లో వసతులు మెరుగు పడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వార్డెన్ ఫోన్ చేసి చెప్పలేదన్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో అనుకూలంగా ఉన్న కొంత మందికి రూ. 5 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇక్కడ మరణాలకు కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నూరిఫాతిమా మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆ రంగాలు వెంటిలేటర్పై ఉన్నాయన్నారు. వరుసగా పలు సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, ప్రజలు చచ్చిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు నిర్లక్ష్యంగా ఉన్నారని, అందరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే సమయం తొందరల్లోనే ఉందన్నారు. పాలించే అర్హత మంత్రులకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రాణం విలువ రూ. 5 లక్షలా అంటూ ప్రశ్నించారు. పరిపాలన తెలియని వారు ఉన్నారని ఆరోపించారు. -
అడ్డగోలు వసూళ్ల రెవెన్యూ!
నెహ్రూనగర్: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేసిన ఫైళ్లు ఏకంగా 5,075 కావడం గమనార్హం. గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను పేరు మార్పు, కొత్త ఇంటి పన్ను, వీఎల్టీ, ఇతర పనుల నిమిత్తం మొత్తం వచ్చిన దరఖాస్తులు 14,936. ఏ దరఖాస్తు అయినా 15 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, గడువు పూర్తయిన తరువాత దరఖాస్తులు (బీయాండ్ ఎస్ఎల్ఏ) ఆమోదించినవి 1,600 ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రిజెక్ట్ కొట్టగానే సదరు దరఖాస్తుదారుడు రెవెన్యూ సిబ్బందిని కలిసి ప్రసన్నం చేసుకుంటే పనులు పూర్తి అవుతున్నట్లు పరిస్థితి నెలకొంది. ఇవిగో నిదర్శనాలు... ●పొన్నూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. సదరు స్థలానికి వీఎల్టీ (ఖాళీ స్థల పన్ను) ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత దానిని రెసిడెన్షియల్లోకి మార్చాలంటే ఖర్చు అవుతుందని రెవెన్యూ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పన్ను నుంచి రెండున్నర సంవత్సరాలపాటు వెనక్కి వేసే వెసులుబాటు ఉంటుంది. వారు అడిగింది ఇవ్వకపోయే సరికి పన్ను ఉన్నదానికన్నా అదనంగా పెంచడంతోపాటు సంవత్సరం వెనక్కి వేశారు. ●అరండల్పేటలో ఓ ఇంటికి టైటిట్ ట్రాన్స్ఫర్ (టీటీపీ) చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేశారు. విషయం చివరికి కార్పొరేషన్ కార్యాలయంలో తెలియడంతో కొంచెం వెనక్కి తగ్గారు. ●సంజీవయ్యనగర్లో ఓ వ్యాపార సంస్థకు కమర్షియల్ ట్యాక్స్ వేయాల్సి ఉండగా.. సదరు వ్యాపారస్తుల నుంచి మామూళ్లు తీసుకుని రెసిడెన్షియల్ ట్యాక్స్ వేసేందుకు దరఖాస్తు అప్పీలు చేశారు. దీనిని గమనించిన ఆర్వో సదరు దరఖాస్తును రిజెక్ట్ చేశారు. ●బృందావన్ గార్డెన్స్లో ఇంటి పన్ను పేరు మార్పు కోసం దరఖాస్తు వచ్చింది. కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది ఆ ఫైల్ తమ వారిదేనని, కొంచెం చేసి పెట్టాలని కోరినప్పటికీ డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆ పని కోసం వారు కూడా డబ్బులు సమర్పించుకున్న పరిస్థితి. ●కొత్తపేటలో కూడా టైటిల్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు వస్తే దానిని సకాలంలో పూర్తి చేయలేదు. సదరు దరఖాస్తుదారుడు బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కనీసం రూ.10 వేలు ఇవ్వాల్సిందే.. కొత్త ఇంటి పన్ను సదరు స్థల విస్తీర్ణం బట్టి రూ.10 వేల నుంచి రూ. 50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టైటిల్ ట్రాన్స్ఫర్కు సదరు భవనం స్థితిని బట్టి రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ఫిర్యాదు చేయండి రెవెన్యూ సెక్షన్లో సర్వీస్ రిక్వెస్ట్ కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయండి. సంబంధిత సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – చల్లా ఓబులేసు, అదనపు కమిషనర్ -
మహిళ అవయవాల దానం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం అవయవాల దానం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి, ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబులు మాట్లాడుతూ.. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన రాజులపాటి పాప (64) ప్రమాదానికి గురి అయిందన్నారు. ఆమె బంధువులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదని చెప్పారు. అనంతరం బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆమె అవయవాలను సేకరించి కాలేయాన్ని మణిపాల్లో ఒక రోగికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారన్నారు. కార్నియాను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామని వివరించారు. మంచి కార్యానికి ముందుకు వచ్చిన దాత కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తురకపాలెంలో ఎన్సీడీసీ బృందం గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ప్రతినిధులు సోమవారం పర్యటించారు. గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించి ఎస్సీ కాలనీలో ఒక ప్రాంతంలో , విలేజ్ క్లినిక్ ప్రాంతంలో మట్టిని సేకరించారు. బెంగళూరుకు చెందిన బృందంతోపాటు గుంటూరు జిల్లాలోని ఎన్సీడీసీకి చెందిన 40 మందికిపైగా పాల్గొన్నారు. అదేవిధంగా నీటి నమూనాలను కూడా సేకరించారు. మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం తీసుకెళుతున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. న్యాయవాద కోర్సుల పరీక్షలు ప్రారంభం పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) ద్వితీయ సెమిస్టర్, ఐదు సంవత్సరాల ఆనర్స్ బీబీఏఎల్ఎల్బీ, బీఏఎల్ఎల్బీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సుబ్బారావు తెలిపారు. ఎల్ఎల్ఎం పరీక్షలు ఏఎన్యూతోపాటు గుంటూరులోని జేసీ కాలేజ్ ఆఫ్ లా, ఏసీ కాలేజీ పరీక్ష కేంద్రాలలో కొనసాగుతున్నాయన్నారు. ఐదు సంవత్సరాల ఆనర్స్ పరీక్షలు విశ్వవిద్యాలయంలోని టీటీఎం విభాగంలో ప్రారంభం అయ్యాయన్నారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీల బృందాలను నియమించినట్లు వివరించారు. వర్సిటీలో జరుగుతున్న పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫలితాలు విడుదల ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు రెండో సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 507 మందికిగాను 357 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే వర్సిటీ అందిస్తున్న డిప్లమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేశారు. 15 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఈ నెల 23వ తేదీలోగా పేపరుకు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. టెయిల్పాండ్ నుంచి నీరు రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం తెలిపారు. -
అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం..
ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్లో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్రాజు, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.సుబ్రమణ్యేశ్వరిలు హాస్టల్లో విచారణ నిర్వహించారు. అధికారులు విద్యార్థులను ప్రశ్నించగా అవకాశం లేకనే బిర్యానీ తిన్నామని చెప్పారు. తాజాగా ఉందా, వాసన వస్తుందా అని అడుగగా తాజాగా లేదని తెలిపారు. హాస్టల్లోని వంటగది, విద్యార్థులు ఉండే రూమ్లు, బెడ్లు, వంట పాత్రలు, తాగు నీరు, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ వాతావరణం అపరిశుభ్రంగా, గదుల్లో బూజుపట్టి ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నించారు. ఇంత ఘటన జరిగిన తరువాత కూడా హాస్టల్ ఇలా ఉంటే ఎలాగని ఆగ్రహించారు. బయట నుంచి ఫుడ్ తెచ్చి ఎలా పెడతారు? సస్పెన్షన్కు గురైన హాస్టల్ వార్డెన్ మార్కండేయులును పిలిపించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అసలు బయట నుంచి ఫుడ్ను లోపలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. బయట ఫుడ్ అనుమతించకూడదు కదా అని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలనే ఘటన చోటుచేసుకుందన్నారు. అందువలనే ఫుడ్ పాయిజన్ అయ్యేది.. వంట మనిషి కల్పనతోనూ మాట్లాడారు. భోజనం వంట గది అపరిశుభ్రంగా ఉంటే చూసుకోవాలి కదా అని మండిపడ్డారు. పరిశుభ్రతకు సంబంధించి పలు సూచనలు అందించారు. వంట పాత్రలు శుభ్రంగా లేకున్నా కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయని సుబ్రమణ్యేశ్వరి స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పరిశీలించారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ఘటన ఎలా జరిగింది, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి తదితరులున్నారు. -
వర్షానికి పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు డీపీఓ వర్గాలు తెలిపాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన ద్వారం వద్ద పహారా నిర్వహించే పోలీస్ సిబ్బంది వారికి విషయం తెలిపారు. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్ఎస్ కొనసాగడంతో బాధితులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో షామియానాలు, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బాధితులు డీపీఓ ఎదుట మీడియాతో మాట్లాడారు. రూ.1.5 కోట్ల వరకు టోకరా.. ఏటీ అగ్రహారం 13వ వీధిలో ఉంటున్న ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు గత 25 ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తున్నారు. రోజూవారీ పనులకు వెళ్తూ చిట్టీలు చెల్లించాం. అడిగితే మాపై దాడికి సిద్ధమవుతున్నారు. అరవై మందికిపైగా బాధితులు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్లు వరకు చెల్లించాలి. – బాధితులు, ఏటీ అగ్రహారం ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం గుంటూరు వెస్ట్: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే అర్జీలు పెట్టుకుంటారని, దీనిని గుర్తించి అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో అర్జీలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలని దళిత బహుజన ప్రజా సంఘాలు, పార్టీల ఐక్యవేదిక నేతలు కోరారు. 228 అర్జీలను డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా పరిషత్ సీఈవో వి.జ్యోతి బసు, డ్వామా పి.డి. శంకర్ పరిశీలించారు. -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరు వెస్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది చేసిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అభిప్రాయాలుంటాయన్నారు. దానికి ఇలా దాడులు చేయడం అత్యంత హేయమన్నారు. దళితులు దేశంలో ఎన్నో వివక్షలకు గురౌతూ ఎదుగుతుంటే కొంత మంది ఓర్వలేక అక్కసుతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. దళితులు మరింత పట్టుదలతో ఉన్నత స్థానాలను పొందాలని కోరారు. గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... తగ్గిన పన్నుల శాతంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గత నెల 22 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తదితరులు ప్రసంగించారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల సెంటర్, జిన్నా టవర్, బస్టాండ్, మంగళగిరి రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు కొనసాగింది. -
ఎన్ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్వోసీ క్లియరెన్్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్. జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్ఎఫ్వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. మేనేజ్మెంట్స్, ఫారమ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుపెన్సీ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
గుర్తు తెలియని బస్సు ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34)లు పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాలనలో పారద ర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.శామ్యూల్ జోనాథాన్ పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్ జోనాథాన్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. సదస్సులో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడు ఈమని హనుమంతరావు, కార్యదర్శి మద్దెల విజయకుమార్, డాక్టర్ ఎం.సుధ, కె.జయసుధ, విల్సన్ పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విద్యుత్ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, స్ట్రగుల్ కమిటీ డిస్కం నాయకులు డి.వెంకటేశ్వరరావు, ఎల్.రాజులు ఆదివారం తెలిపారు. విద్యుత్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 15న విద్యుత్ కాంట్రాక్ట్, జేఎల్ఎం, గ్రేడ్ 2 ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. -
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన.. ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు. -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. తెనాలిలో ప్రతి ఆదివారం ఉచిత సమాచార సేవలను అందిస్తున్నట్టు గౌరవ అధ్యక్షుడు ప్రకాష్రావు చెప్పారు. సమాచార వేదికను ఏర్పాటుచేసిన సూర్యప్రకాశరావు, సుబ్బారావు సత్యబాబు, రామ్మోహనరావు ఆశయానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్టు కోశాధికారి రాజేంద్రప్రసాద్ చెప్పారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. ఏపీపీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేదం హరిప్రసాద్, నెల్లూరు హైదరాబాదు ప్రాంతాల ప్రతినిధులు ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం, మనవ రాము, కందాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఉపాధ్యక్షుడు ఆమంచి రాంబాబు, సంయుక్త కార్యదర్శి వేణుధర్, బీఎల్ సత్యనారాయణమూర్తి, పూర్ణ భాస్కర్, శ్రీనివాస్, కోదండ రామమూర్తి, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సాయి, శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
గుంటూరు రూరల్: రూరల్ మండలంలోని తురకపాలెంలో ఆకస్మిక మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉందని తెలిపారు. -
ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి
టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి సవిత స్పష్టం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మంత్రి సవిత శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వివరించారు. ఆ విద్యార్థి ఇంతకుముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఐసీయూలో వైద్యమందిస్తున్నామని తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. మంత్రి సవిత స్పందిస్తూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్ డేట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి డిశ్చార్జి అయిన వారితో పాటు హాస్టల్లో మిగిలిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, డైరెక్టర్ మల్లికార్జునను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్లో పరిశుభ్రతతపై తీసుకున్న చర్యల గురించి డీబీసీడబ్ల్యూవో మయూరిని అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటితోపాటు తాజా ఆహారమే వారికి అందివ్వాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ చల్లాలని స్పష్టం చేశారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్లకు వెళ్లదలుచుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిచి వారితో పంపించాలని సూచించారు. ఘటనలు పునరావృతం కానివ్వొద్దు అన్నపర్రు బీసీ హాస్టల్ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలని తెలిపారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం లోపలకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టెలీ కాన్ఫరెనన్స్లో మంత్రి సవిత స్పష్టం చేశారు. -
పెద్దాసుపత్రికి సుస్తీ
గుంటూరు మెడికల్: ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్లో సమస్యలు ఏకరవు పెడుతున్నాయి. ఇటీవల డయేరియా బాధితుల వార్డులో వసతులు లేక రోగులు నరకయాతన పడ్డారు. నేడు పెద్దాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. పిల్లల వార్డులో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇటీవల గుంటూరు నగరంలో డయేరియాతో సుమారు 200 మంది వరకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందారు. బాధితుల కోసం ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వసతులు కరువయ్యాయి. సైలెన్ స్టాండ్స్ సరిపడా లేక కిటికీలకు వేలాడదీశారు. పడకలపై బెడ్ షీట్స్ లేవు. మరుగుదొడ్లలో నీటి సమస్య నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. సమస్యల మధ్యే రోగులు చికిత్స పొందారు. సమస్యలు స్వాగతం నేడు వాంతులు, విరేచనాలతో అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పిల్లల వైద్య విభాగానికి వచ్చారు. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ, మరో పక్క వార్డులో వసతుల లేమి, సమస్యల మధ్యే చికిత్స పొందుతున్నారు. వార్డు వ్యాధి బాధితులతో కిక్కిరిసి పోయింది. ఏసీలు పనిచేయక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పడకలపై కనీసం బెడ్షీట్లు కూడా లేవు. మంచాలు సైతం తుప్పు పట్టిపోయాయి. రోగి పడుకుని చికిత్స పొందాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బందికి సైతం వసతులు లేక ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లల వార్డులోని బాత్రూమ్కు కనీసం డోర్ కూడా లేకపోవడం దారుణం. తనిఖీలకే అధికారులు పరిమితం ఆస్పత్రి అధికారులు ప్రతిరోజూ తనిఖీల పేరుతో పలు వార్డుల్లో తిరుగుతున్నా ప్రయోజనం లేదు. వార్డుల్లో సమస్యలు అధికారులు కనిపించటం లేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించటం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ‘మీ కోసం మేము’ అనే కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు నిర్వహిస్తున్నారు. రోగులను ఒకచోట సమావేశపరిచి సమస్యలు ఉంటే చెప్పాలని, తక్షణమే పరిష్కరిస్తామని భరోసా మాటలు చెబుతున్నారు. అయితే, అవి కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల తూతూమంత్రంగా తనిఖీలు చేసి సమస్యలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి, ప్రశాంతమైన వాతావరణంలో వైద్యసేవలు అందించేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. -
జీజీహెచ్ను సందర్శించిన కలెక్టర్
గుంటూరు మెడికల్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలియజేశారు. విద్యార్థులకు, అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో మరమ్మతులకు గురైన పరికరాలను ఉపయోగంలోకి తీసుకుని రావాలని చెప్పారు. విద్యార్థులంతా సేఫ్ అన్నపర్రు వసతి గృహంలో విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య తెలిపారు. జిల్లాలో ఉన్న 33 వసతి గృహాలకు గాను, 24 చోట్ల ఇప్పటికే నీటి నమూనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మిగిలిన చోట్ల త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయికుమార్, ఇతర అధికారులు అన్నపర్రులో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి పరిస్థితులు పరిశీలించారు. -
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం జాబ్ చార్టుకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల విధులను అప్పగించటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని డెమోక్రటిక్ ఏపీసీఎస్డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బండికల్ల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలోని సామ్రాట్ హోటల్లో శనివారం అత్మగౌరవ సభను నిర్వహించారు. సమావేశానికి జేఎసీ రాష్ట్ర చైర్మన్ జి. జోసఫ్ కిశోర్ అధ్యక్షత వహించారు. సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారి విధులను కూడా సచివాలయంలోని ఉద్యోగులకు అప్పగించడం వల్ల సతమతమవుతున్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్లను ఉద్యోగులకు బదలాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగులపై పని భారం పెంచటం వల్ల మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జేఎసీలుగా చలామణి అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రెండు వేల మందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం దిగిందని, వెంటనే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అప్పికట్ల కిశోర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాబ్ చార్టును ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ ప్రకటించటంతో పాటు హేతుబద్ధంగా పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ దుర్గాప్రసాద్, కన్వీనర్లు జీవన్ సాగర్, మదన్ మోహన్, శంకరరావు, శామ్యూల్, డైమండ్ బాబు, కీర్తి సాగర్ పాల్గొన్నారు. తెనాలిలో కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర జేఎసీ నాయకులు -
వ్యర్థాలతో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్
తెనాలి: ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పంట పొలాలు, నీటిలో కలుస్తుండటంతో క్యాన్సర్ వ్యాప్తి చెందుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉండరాదనే తెనాలికి రూ.30 కోట్ల వ్యయంతో 10 ఎంఎల్డీ లీటర్ల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. పట్టణ పూలే కాలనీలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ముఖ్య అతిథి పెమ్మసాని మాట్లాడుతూ తెనాలి రైల్వేస్టేషను అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెనాలి–మంగళగిరి రోడ్డు, నారాకోడూరు–తెనాలి రోడ్డును అద్దంలాగ తీర్చిదిద్దినట్టు చెప్పారు. డాక్టర్ ప్రతాప్ కోటి రూపాయల వితరణతో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వీటిన్నిటి నిర్వహణను ఎక్కడికక్కడ స్థానికులతో ఏర్పాటైన కమిటీలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలంతా నగదు స్థానంలో డిజిటల్ చెల్లింపులు చేస్తే అమరావతి అమెరికాలా అవుతుందని సూచించారు. జీఎస్టీ తగ్గింపు పాటించని వ్యాపారులను ప్రశ్నించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మురుగునీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుతం ప్రారంభించిన ప్లాంటుతో పాటు పట్టణానికి రెండో వైపున మరో 10 ఎంఎల్డీ లీటర్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యశాఖ, మున్సిపాలిటీలు ఒక నోడల్ అధికారితో ప్లాంట్ నిర్వహణను సమీక్షిస్తుండాలని సూచించారు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అమృత పథకం కింద నిర్మించిన చాలా ప్లాంట్లలో నిర్వహణ సరిగా లేదని తెలిపారు. తెనాలి ప్లాంటును సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి పలు ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు, ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
109 మంది వీవీఐబీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీవీఐబీయూ)కి చెందిన 109 మంది విద్యార్థులు కాగ్నిజెంట్ (డిజిటల్ నర్పూర్) డెల్టా ఎక్స్, ప్లిస్ట్ ల్యాబ్స్, జెన్ట్రీ ట్యాబ్స్, టెక్ అవుట్ సొల్యూషన్స్, ఈఫిల్ టెక్ సొల్యూషన్స్, పాలెక్, సెర్పాడ్ వంటి బహుళ జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందారని వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీ యూనివర్సిటీలో ఆగస్టు, సెప్టెంబర్లలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 2022–2026 బ్యాచ్ విద్యార్థులు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వార్షిక వేతనంతో నియామకాలు పొందారని తెలిపారు. -
విజ్ఞాన్ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్ ప్రారంభం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 5జీ ల్యాబ్ – గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.రాబర్ట్ జే రవి వర్చువల్గా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, స్మార్ట్ సిటీస్, లాజిస్టిక్స్, ఈ–గవర్నెన్స్ వంటి కీలక రంగాలలో నవీన ఆవిష్కరణలు, అనువర్తనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ల్యాబ్లో పూర్తిస్థాయి 5జీ స్టాండలోన్ సెటప్ ఏర్పాటు చేయబడిందని, ఇందులో సిమ్లు, డాంగిల్స్, ఐవోటీ గేట్వేలు, రౌటర్లు, అప్లికేషన్ సర్వర్లు మొదలైన పరికరాలు ఉంటాయన్నారు. బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు రియల్టైమ్లో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ ఆధారిత లెర్నింగ్, లైవ్ డేటా అనలిటిక్స్ ద్వారా పరిశోధన మరింత బలోపేతం అవుతుందని వివరించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతికతలలో ముందంజలో ఉండేందుకు 5జీ ల్యాబ్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు పాల్గొన్నారు. -
నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఉదయ్చంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడాడని.. నా చావుకు మధునే కారణం’’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. స్నేహితులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసినట్లు ఉదయ్చంద్ర తెలిపాడు. దీనిపై ఏఈ మధుసూదన్రావును వివరణ కోరగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్చంద్రపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేశారన్నారు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, లైట్లు ఆన్/ఆఫ్ సక్రమంగా చేయడం లేదని, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారన్నారు. కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించడం లేదని, ఉదయ్చంద్రను విధుల నుంచి తీసివేయాలని సూచించడంతో కొన్ని రోజులు ఆపామని ఏఈ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయనని చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 29, 30వ డివిజన్లలో పనిచేస్తున్న ఉదయ్చంద్రను బుడంపాడు లైట్లు ఆన్/ఆఫ్కు మార్చినట్లు తెలిపారు. ఆ విధులకు కూడా హాజరు కాకపోవడంతో అతన్ని ప్రశ్నించడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరింపులకు దిగాడని మధు వివరించారు. -
పసివాళ్లంటే ఎంత అలుసో..!
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రి పాలైన హాస్టల్ విద్యార్థులు ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ హాస్టల్లో నాలుగు నుంచి పది తరగతుల వరకు మొత్తం 107 మంది విద్యార్థులున్నారు. వీరికి గురువారం రాత్రి బెండకాయ వేపుడు, రసం, మజ్జిగతో భోజనం పెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒకరి తరువాత ఒకరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. గమనించిన నైట్ వాచ్మన్ విషయాన్ని ఉదయం విధులకు వచ్చిన కుక్ కల్పనకు చెప్పారు. అప్పటికే 17 మంది అస్వస్థతకు గురై బాధపడుతుండటంతో కల్పన వారిని ఆటోలో పెదనందిపాడు పీహెచ్సీకి తరలించారు. ఉదయం కిచిడీ, టమాట చట్నీతో టిఫిన్ చేసిన తరువాత అదేవిధంగా బాధపడుతున్న మరో 37 మంది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు 108 వాహనాల్లో పంపించారు. సాయంత్రానికి 21 మందిని డిశ్చార్జ్ చేసి హాస్టల్కు తరలించగా, 17 మంది శిబిరంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్సీకి చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి హాస్టల్ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరిపోని బెడ్లు ఒక్కసారే సుమారు యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రిలో ఉన్న బెడ్లు సరిపోలేదు. దీంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడా పడుకోబెట్టి చికిత్స అందించారు. మంచం చుట్టూ సైలెను స్టాండ్లు పెట్టడంతో చేతులు అటూ ఇటూ కదపలేక, కడుపునొప్పి తాళలేక విద్యార్థులు నరరకయాతన అనుభవించారు. అనంతరం వారి ఇబ్బందులను గమనించిన కలెక్టర్.. కల్యాణమండపంలో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. సైలెన్ స్టాండ్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో విద్యార్థులే ఒక చేతితో సైలెన్ బాటిల్ పట్టుకుని కనిపించగా, మరికొందరికి ఆశా కార్యకర్తలు బాటిళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో పదహారు మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జ్వరం కూడా ఉన్నట్లు వైద్యులు గమనించారు. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవ్వడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. దీంతో ఆయా శాఖల అధికారులు ఆహార పదార్థాల, తాగునీటి నమూనాలను సేకరించారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కూడా బయటి నుంచి బిర్యానీ, కలియా, పెరుగు చట్నీలు వచ్చాయి. వాటిని విద్యార్థులకు అందించారు. మరుసటి రోజు నుంచి కడుపునొప్పితో బాధపడినట్లు కొందరు విద్యార్థులు చెప్పారు. మంత్రి దుర్గేష్ ఆరా గుంటూరు మెడికల్: హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. వారు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అలసత్వం... బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల ఉదాసీనత వెరసి వసతి గృహ విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యేలా చేసింది. 54 మంది అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. ఘటనకు కారణం కలుషిత ఆహారమేనని అధికారులు భావిస్త్తున్నారు. పేద పిల్లల ప్రాణాలంటే కూటమి సర్కారుకు ఎంత అలుసో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గురువారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలోగానీ, ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడుగానీ, వారిని ఆస్పత్రికి తరలించే సమయంలోగానీ వార్డెన్ అందుబాటులో లేకపోవడం ఆయన విధుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కుక్కు సమీప బంధువు అయిన అశోక్ గత కొద్ది నెలలుగా హాస్టల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి జీతం కూడా వార్డెన్ తన జేబు నుంచే చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అశోక్ గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నీరు మాత్రమే తాగాడని సిబ్బంది చెబుతున్నారు. -
కేఎల్యూలో ‘సమ్యక్ 2025’
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో శుక్రవారం జాతీయస్థాయి టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘సమ్యక్ 2025’ ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి రాష్ట్ర క్రీడల అథారిటీ చైర్మన్ అనిమి రవినాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే జాతీయ స్థాయి వేదికను సృష్టించినందుకు కేఎల్యూను ప్రశంసించారు. అనంతరం ఆయన్ను వర్సిటీ వీసీ, ప్రో వీసీలు తదితరులు ఘనంగా సత్కరించారు. వీసీ డాక్టర్ పార్ధసారథి వర్మ మాట్లాడుతూ మొదటి రోజు కార్యక్రమంలో 23 రాష్ట్రాల నుంచి సుమారు 25 వేలం మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ప్రాజెక్ట్ ఎక్స్పో, ఏఐ, ఎంఎల్, మొబిలిటీ, హెల్త్ టెక్, ఎంబెడెడ్ సిస్టమ్లలో 450కుపైగా ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, సమ్యక్ చైర్మన్ డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎ.శ్రీనాథ్, డాక్టర్ మాధవ్, కన్వీనర్లు డాక్టర్ వి.రాజేష్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ ఎం.కిషోర్బాబు, సీనియర్ నిర్వాహకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పికిల్ బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): బెంగళూరులో శనివారం నుంచి జరగనున్న జాతీయ ఓపెన్ పికిల్ బాల్ టోర్నమెంట్కు జిల్లాకు చెందిన కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, విన్సెంట్ ఎంపికయ్యారని జిల్లా సంఘం చైర్మన్ టి.అరుణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీవీవీ హెల్త్ హబ్లో వారు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రీడాకారులను తనతోపాటు జిల్లా సంఘం అధ్యక్షుడు టి.హరికిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.శివకుమార్, హ్యాట్రిక్ స్పోర్ట్స్ అధినేత శ్రీకాంత్, అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్లు అభినందించినట్లు పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ వైద్యసేవ బంద్
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన నెట్వర్క్ ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. దీంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు. బంద్ పాటించారు. జిల్లా వ్యాప్తంగా 154 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటిల్లో 33 ప్రభుత్వ, 121 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అసోసియేషన్ పిలుపు మేరకు గుంటూరు కొత్తపేట ఓల్డ్క్లబ్ రోడ్డులోని పలు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. రోగులు, అంబులెన్సులతో నిత్యం కిటకిటలాడే ఈ రోడ్డు శుక్రవారం మామాలు రద్దీతో కనిపించింది. రోజూ పథకం ద్వారా చికిత్స అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు అనుమతి కోసం ట్రస్టు కార్యాలయానికి నివేదికలు పంపిస్తుంటాయి. బంద్ ప్రభావంతో శుక్రవారం ఈ అనుమతులు చాలా తక్కువ సంఖ్యలో కోరినట్లు సమాచారం. కీలక డిమాండ్లు తీరిస్తేనే... నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 2,700 కోట్ల బకాయిలు ఉన్నట్లు సంఘం నేతలు వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి హెల్త్ ప్యాకేజీల్లో పెరుగుదల నామమాత్రంగా ఉందని పేర్కొన్నారు. 2010 నాటి పరిస్థితితో పోలిస్తే నెట్వర్క్ ఆసుపత్రులపై భారం పడుతున్నట్లు వాపోయారు. ఆసుపత్రుల ఖర్చులు పెరిగిపోయినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం వల్ల సమ్మెకు పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. డిమాండ్లను పరిష్కరించే వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పేదల ప్రాణాలకు భరోసా కరువు కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠినాత్మక నిర్ణయం వల్ల పథకం ద్వారా లభించే ఉచిత వైద్య సేవలు పేదలకు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. తద్వారా వివిధ రోగాలకు చికిత్స చేయించుకునే వారు డబ్బులు పెట్టాల్సి వచ్చింది. కొంతమంది స్థోమత లేక అల్లాడిపోతున్నారు. పేదోళ్ల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండటం లేదు. సరిగ్గా వైద్య సేవలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రుల వైద్య సేవల నిలిపివేత ప్రభావం పేదలపై ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా పట్టువీడాలని రోగులు కోరుతున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి ఈత దోహదం
జస్టిస్ ఎన్. హరినాథ్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈతతో మెరుగైన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్యామలానగర్లోని ఈత కొలనులో కానాల అంజనీ శ్రీకాంత్ రెడ్డి స్మారక 8వ మాస్టర్స్ అంతర్ జిల్లాల పోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక క్రీడలో సాధన చేయాలన్నారు. యోగా కూడా ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమణ రావు మాట్లాడుతూ 20–90 ఏళ్ల వరకు వయస్సున్న వారికి ఈ పోటీలను ఏటా మాదిరిగానే నిర్వహించామన్నారు. 180 పాల్గొన్నారన్నారు. పోటీలను ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చల్ మోహన రంగా...
తెనాలి: పట్టణంలో శుక్రవారం రహదారిపై దౌడు తీస్తూ వస్తున్న గుర్రాన్నీ, బుర్రమీసాలు, తలపాగాతో దానిపై స్వారీ చేస్తున్న వ్యక్తిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి పేరు ఉయ్యూరు లక్ష్మారెడ్డి. చుండూరు మండల గ్రామం కార్మూరివారిపాలెం వాసి. ప్రఖ్యాత కవి సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.శివారెడ్డి స్వగ్రామం కూడా ఇదే. వేమూరు నియోజకవర్గంలోని ఆ గ్రామం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది. 61 ఏళ్ల లక్ష్మారెడ్డికి వ్యవసాయమే జీవనాధారం. 61 సెంట్ల పొలం ఉంది. అబ్బాయి, అమ్మాయి. కానీ బాధ్యతల బరువు లేదు. సంసార సాగరాన్ని అవలీలగా ఈదేసిన వ్యక్తికి, గుర్రం స్వారీ ఓ లెక్కా అన్నట్టుంది ఆయన తీరు. కళ్లెం లాగుతూ రెండో చేతితో చెర్నాకోలను పట్టుకుని ఒక లయ అతడి స్వారీలో కనిపించింది.15 ఏళ్లప్పుడు గుర్రం కొనాలని అనుకున్నా.. 30 ఏళ్లు వచ్చాక కొన్నారు. గుర్రాలు మారినా తన స్వారీ మాత్రం ఆగలేదు. అవసరమైతే మహారాష్ట్ర వెళ్లి గుర్రం తెస్తుంటానని చెప్పారు. రోజూ గుర్రానికి ఉలవలు, పచ్చిగడ్డి ఆహారంగా ఇస్తుంటారు. ఎక్కడికై నా ఇలానే వెళుతుంటానని చెప్పారు. -
సామాన్యుడి ధైర్యం.. సమాచార హక్కు చట్టం
మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టం సామాన్యుడికి కొండంత ధైర్యమని.. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హైకోర్టు విశ్రాంతన్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు మాజీ సమాచార కమిషనర్ కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమిషనర్లు శామ్యూల్, డాక్టర్ చావలి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం వల్ల దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండేలా చూడడంతోపాటు.. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. కాగా, కమిషన్ సజావుగా పనిచేయడానికి వీలుగా కార్యదర్శి, సహాయ కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, అకౌంట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సమాచార కమిషనర్లు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి వివరించామని తెలిపారు. అనంతరం ‘ఆర్టీఐ లిట్రసీ క్యాంప్స్ పుస్తకాన్ని’ జస్టిస్ రజని ఆవిష్కరించారు. -
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమన్నారు. మొబైల్ యాప్లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టిసారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి చెందిన వారమనే నీరివ్వడం లేదు!
వడ్డమాను(తాడికొండ): వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటామనే నెపంతో గత 10 రోజులుగా తమ బజారుకు నీరు ఇవ్వకుండా అధికారులు స్థానిక నాయకులతో కుమ్మకై ్క వేధిస్తున్నారని తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామ ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. గ్రామంలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వాటిలో తమ బజారుకు వచ్చే మోటారు మాత్రమే మరమ్మతులకు గురైందనే నెపంతో నీరివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గోడు చెప్పుకుందామని కార్యదర్శితోపాటు ఎవరిని ఆశ్రయించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. పైగా హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా సమస్యే ఉంటే మరమ్మతులకు 10 రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేసి కనీసం ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు ఒకసారి సరఫరా చేయాలని కోరారు. దీనిపై కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా మోటారు మరమ్మతులకు గురైన మాట వాస్తవమేనని చెప్పారు. గత 4 రోజులుగా తనకు ఇతర పనులు ఉండటం వలన సమయం కుదరలేదని తెలిపారు. పార్టీ, కుల వివక్ష వంటివి తాను చూపించలేదన్నారు. త్వరలో మోటారుకు మరమ్మతులు చేయించి నీటిని అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. -
కంపోస్ట్ యార్డుతో కష్టాలు
తెనాలి కంపోస్ట్ యార్డు వ్యర్థాల గుట్టలతో నిండిపోతోంది. రోజూ తెనాలిలో ఉత్పత్తి అయిన వ్యర్థాలను జిందాల్ సంస్థకు తరలించాలని ఆదేశాలున్నా అమలు కావడం లేదు. భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 1.07 లక్షల టన్నుల వ్యర్థాలుతెనాలి అర్బన్: కంపోస్ట్ యార్డులోని వ్యర్థాల గుట్టల కారణంగా సమీపంలోని పంట పొలాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. యార్డు ప్రహరీలు పడిపోతున్నాయి. చెత్త నుంచి మిథైల్ గ్యాస్ విడుదలవుతూ దానికదే తగులబడుతోంది. వ్యర్థాల దగ్ధంతో రోజుల తరబడి హానికరమైన పొగ చుట్టుపక్కల అర కిలోమీటరు వరకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రజలకు కళ్లు మండుతున్నాయి. ఊపిరి పీల్చుకోవటానికి కూడా వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. యార్డు దారిలోనే పలు విద్యాసంస్థలు, పప్పు మిల్లులు ఉన్నాయి. అతిదగ్గర్లోనే అపార్టుమెంట్లు, బీసీ కాలనీ ప్రజలు ఉంటున్నారు. యార్డు కారణంగా స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యార్డును తరలించాలని కోరుతున్నారు. మూలకు చేరిన కాంపాక్టర్లు తెనాలి పట్టణంలో చెత్త సేకరణ కోసం ఏడు కాంపాక్టర్లు వినియోగిస్తున్నారు. తెనాలిలో రోజూ ఉత్పత్తి అయ్యే 90 టన్నుల చెత్తలో 80 టన్నులను కాంపాక్టర్లలో గుంటూరు సమీపంలోని జిందాల్ సంస్థకు కొద్దినెలలుగా నిత్యం తరలిస్తున్నారు. మిగిలిన 10 టన్నులను ఇక్కడే యార్డులో పడేస్తున్నారు. నెల క్రితం ఒకటి పెద్దది, రెండు చిన్న కాంపాక్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. యార్డుకు వెళ్లే దారి కూడా వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తోంది. వాహనాలు పాడవడం వలన పట్టణంలో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగటం లేదని సమాచారం. యార్డులోని వ్యర్థాల పరిమాణం 1.07 లక్షల టన్నులు ఉండవచ్చని అధికారుల అంచనా. మున్సిపల్ అధికారులు 63,550 టన్నుల చెత్త తరలింపు కోసం టెండర్లు పిలిచారు. హైదరాబాద్కు చెందిన సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంసస్థీ టెండర్లు దక్కించుకుని ఫ్రిబవరిలో పని ప్రారంభించింది. మే నెలలో టెండర్లు రివైజ్ చేసి, 72 వేల టన్నుల చెత్తను తరలించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్లో మరోసారి మిగిలిన 35 వేల టన్నుల చెత్త తరలింపునకు టెండర్లు పిలిచారు. అదే సంస్థ టెండర్లు దక్కించుకుని, గత నెల చివరిలో పనులు ప్రారంభించింది. -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేదిలేదని స్పష్టం చేసిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
మనోవ్యాధులకూ మంచి ఔషధాలు
గుంటూరు మెడికల్: జిల్లాలో 25 మంది మానసిక వ్యాధి వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 30 నుంచి 50 మంది వివిధ రకాల సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రోజూ 160 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది మానసిక రోగుల సంఖ్య పెరిగిపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో సైతం మానసిక సమస్యలు రావటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ.. చిరాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలేమి, బరువు పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేయడం, తాను కూడా ఇబ్బందులకు గురవ్వటం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాలు వరకు వెళ్లటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. రోటీన్ లైఫ్కు భిన్నంగా ఉండే ప్రవర్తన కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉన్నట్లు గుర్తించాలి. చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవటం, ఎక్కువ సమయం సెల్ఫోన్లకే పరిమితమవ్వటం, ఉద్యోగం, ఇతర పనులు చేయకుండా ఉండిపోవటం లక్షణాలు వ్యాధి బాధితుల్లో ఉంటాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు.. ఏడాది రోగుల సంఖ్య 2023 22,189 2024 30,553 కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యానికి, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. -
నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా తెనాలి
తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ తెనాలి రూరల్: తెనాలి నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా మారింది. కొందరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, దళారుల అండతో యథేచ్చగా నకిలీ ధ్రువపత్రాల దందా కొనసాగుతోంది. ఈ పత్రాలతో ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన గాజుల బసవ పూర్ణకుమారికి చెందిన రెండెకరాల మాగాణి, 17 సెంట్ల ఇంటి స్థలాన్ని కాజేయడానికి సొంత మేనల్లుడు కోలపల్లి నరేష్, అతని తండ్రి సత్యనారాయణతో కలిసి పథకం పన్నాడు. 2020లో పూర్ణకుమారి మృతి చెందినట్లు, అంతకుముందే ఆమె భర్త సత్యనారాయణ కూడా మరణించినట్లు తప్పుడు మరణ ధ్రువపత్రాలు సృష్టించి నిందితుడు నరేష్ కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించాడు. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా డాక్యుమెంట్ రైటరుగా పనిచేస్తున్న తిరుపతి మరియదాస్ అలియాస్ దాస్, తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్లో మీ–సేవ కేంద్రం నిర్వహిస్తున్న దాసరి శివన్నారాయణతో కలసి దొంగపత్రాలు సృష్టించి, సదరు హక్కు విడుదల దస్తావేజులు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించిన నరేష్ తన మేనత్త పూర్ణకుమారికి చెందిన యావదాస్తిని విక్రయించి రూ.55 లక్షలు సొమ్ము చేసుకున్నాడు. అంతే కాకుండా ఆమెకు చెందిన 17 సెంట్ల ఇంటి స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హైదరాబాద్, దుగ్గిరాల, తెనాలి పట్టణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించాడు. మేనల్లుడి నిర్వాకం గురించి తెలుసుకున్న బసవ పూర్ణకుమారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నరేష్, అతని తండ్రి సత్యనారాయణ, డాక్యుమెంట్ రైటర్ మరియదాస్, మీ–సేవ శివలను అరెస్ట్ చేశారు. మంగళగిరికి చెందిన విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి 2019లో రిజిస్టర్డ్ వీలునామా చేయించి, 2020లో మృతి చెందారు. తన తదనంతరం ఆస్తి తన రెండో భార్య సంతానానికి చెందేలా వీలునామా రిజిస్టర్ చేయగా, మొదటి భార్య కుమారులు నకిలీ వీలునామా సృష్టించి ఆస్తిని తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. తాజాగా పట్టణ నందులపేటకు చెందిన ఓ వ్యక్తి 2017లో మృతి చెందాడు. ఇతని కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని నకిలీది సృష్టించి ఆస్తిని వినుకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగికి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించగా తహసీల్దార్ పరిశీలనకు పంపారు. తన సంతకాన్ని ఫోర్టరీ చేసి నకిలీ ధ్రువపత్రం తయారు చేశారని గుర్తించిన తహసీల్దార్ గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను తయారుచేసిన/తయారు చేయించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వెళ్లే వారు విక్రయదారులు ఇచ్చే పత్రాలను ఒటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని, అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా నకిలీ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
గుంటూరు మెడికల్: జిల్లాలో శుక్రవారం నుంచి ఉచిత వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేసిన ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మిన్నకుండి పోయింది. దీంతో ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు అందించిన ఆస్పత్రులు తమకు బకాయిలు చెల్లించే వరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కూటమి పాలనలో పేదల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించే ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్( ఆషా)కు కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిలుపుదల చేసింది. మహానేత ప్రవేశపెట్టిన పథకం పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల వారు సైతం అమలు చేసేలా గొప్ప పథకంగా డాక్టర్ రాజశేఖరరెడ్డి దానిని తీర్చిదిద్దారు. నేడు ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసింది. పథకం ద్వారా వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టడంతో ఆస్పత్రుల వారు శుక్రవారం నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అస్తవ్యస్తంగా పథకం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కూటమి పాలన ప్రారంభమయ్యాక అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఈ పథకంలో కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే గాని తాము కోలుకోలేమని, పేదలకు ఉచిత వైద్యసేవలు అందించలేమని ఆషా సంఘం నేతలు తెగేసి చెప్పారు. నేటి నుంచి ఉచిత వైద్యం బంద్ ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్(ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఆషా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకరయ్యలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.2,700 కోట్ల నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఏడాదిగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ క్లెయిమ్ అప్రూవల్స్ సుమారు రూ.670 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ముందుగా రూ.670 కోట్లు విడుదల చేస్తేనే ఉచిత వైద్యసేవలు అందించేందుకు ముందుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాన్ని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నంలో ఉన్న దృష్ట్యా పథకం గైడ్లైన్స్ ఏర్పాటులో ఆషా సభ్యులను తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పశు సంతతిని పెంచుకోవాలి
ప్రత్తిపాడు: గ్రామాల్లో రోజురోజుకీ తగ్గిపోతున్న పశుసంతతిని పెంచుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.వి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో గురువారం ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేలుజాతి లేగ దూడల ప్రదర్శనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన ప్రత్తిపాడు ఏడీ సుగణ్యరావు, ఇతర అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పాడి రైతులు లేగ దూడలకు సరైన పోషకాహారం అందించాలన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశు సంతతిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చన్నారు. లింగ నిర్ధారిత వీర్యం వలన బహుళ ప్రయోజనాలున్నాయని, రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి. శంకరరావు, పశువైద్యులు డాక్టర్ వై. ఈశ్వరరెడ్డి, సీహెచ్. హరీష్ ఖన్నా, కె.వి.ఎస్. నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
సహకారంలో జీతాల కుంభకోణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో పర్సన్ ఇన్చార్జులు కుంభకోణానికి తెరలేపారు. నష్టాలలో ఉన్న సొసైటీలలో కూడా జీతాలు పెంచేశారు. జీతాల అరియర్స్ కోసం లక్షకు రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 167 సొసైటీలు ఉన్నాయి. అందులో 100 సొసైటీల వరకు నష్టాలలో నడుస్తున్నాయి. మిగిలిన 67 సొసైటీలు మాత్రమే లాభాలలో ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల జీతాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ కింద జీఓ జారీ చేసింది. దీనికి జిల్లాలో డీఎల్ఈసీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్న్ వ్యవహరిస్తుండగా, డీసీసీబీ సీఈవో కన్వీనర్గా, జిల్లా సహకార అధికారులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయాలన్నా ఈ కమిటీలో చర్చించి చేయాలి. అలాగే సొసైటీ సిబ్బంది జీతాలు పెంచాలంటే ఈ కమిటీ ఆమోదం కావాలి. మూడేళ్లుగా అనేక జిల్లాల్లో సొసైటీ కమిటీతో ప్రపోజల్ పంపించమని అడిగి డివిజనల్ సహకార అధికారులు సొసైటీ సిబ్బంది జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇందులో నష్టాలలో ఉన్న సొసైటీల సిబ్బందికి కూడా జీతాలు పెంచేశారు. ఈ క్రమంలో జీతాల అరియర్స్ చెల్లించడం కోసం డిపార్టుమెంట్ వారు లక్షకు 30 శాతం మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది సర్వీస్ రిజిస్టర్ ప్రకారం డిపార్ట్మెంట్, బ్యాంక్ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి వారికి ఎన్ని ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, అంత పే ఫిక్సేషన్ చేసి డీసీసీబీ ద్వారా అరియర్ జీతాలు పెంచాలి. ఇవి అంతా డీసీసీబీలో జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందాలి. పర్సన్ ఇన్చార్జుల ఇష్టారాజ్యం అయితే కొందరు సహకార అధికారులు పర్సన్ ఇన్చార్జిగా పనిచేసిన కాలంలో ఒక్కో సొసైటీలో ఇష్టారాజ్యంగా ఎక్కువగా పెంచేశారు. కొన్ని సొసైటీలలో ఒక సంవత్సరానికి రెండు, మూడుసార్లు జీతాలు పెంచుతూ పాత బకాయిలు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ ఇచ్చేశారు. దీని కోసం డిపార్టుమెంట్ పర్సన్ ఇన్ఛార్జులు పాత బకాయిలను మామూళ్ల కింద తీసుకుని పెంచిన జీతం మాత్రం ఉద్యోగులకు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్ పర్సన్ ఇన్చార్జిలు గత ఏడాదిన్నర కాలంగా ఇటీవల కొత్త కమిటీలు వేసే వరకూ సొసైటీలలో అధిక మొత్తంలో కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు రాసేసుకుని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇవన్నీ పరిశీలించాలంటే 2024 మార్చి 31 నుంచి ఈ ఏడాది మార్చి 31కి, ఆగస్టు 10 వరకూ అంటే కొత్త కమిటీలు బాధ్యతలు తీసుకునే వరకూ కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు, సిబ్బంది జీతాలు ఎన్నిసార్లు పెంచారో, దానికి ఎంత చెల్లించారో పరిశీలిస్తే అన్ని వాస్తవాలు బయట పడతాయి. ఇటీవల నూతన కమిటీలు 10 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటాయని తెలిసిన వెంటనే వారు సిబ్బందికి జీతాలు పెంచేసినట్లు సమాచారం. నిబంధనలు తుంగలో తొక్కి... నాబార్డు నిబంధనలు ప్రకారం వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలు వస్తే జీతాలు పెంచడానికి వీలులేదు. సీఆర్ఎఆర్ 12 శాతం మించి వుండాలి, కానీ ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాసులకు అలవాటు పడి డిపార్ట్మెంట్ సిబ్బంది జీతాలు పెంచేశారు. ఒక్కొక్క సొసైటీలో ఇవ్వవలసిన దాని కన్నా ఎక్కువ ఇచ్చేశారు. ఉదాహరణకు బాపట్ల జిల్లా నగరం మండలంలో నగరం పీఎసీఎస్ రూ. 12 కోట్లు నష్టాల్లో ఉండగా, అందులో ఐదుగురు ఉద్యోగులకు జీతాలు పెంచేశారు. నిజాంపట్నం బ్రాంచ్ పరిధిలో కూచిపూడి పీఎసీఎస్ రూ.4.50 కోట్లు నష్టం ఉండగా అందులో టైమ్బార్డ్ అప్పులు ఉన్నాయి. అందులో నలుగురు ఉద్యోగులు పర్మినెంట్ ఉండగా నలుగురు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. ఇక్కడ పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు అడ్డదిడ్డంగా పెంచేశారు. ఈ ఆగస్టు నెలలో కొత్త పాలకవర్గం ఏర్పడగా ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పాలకవర్గం అధ్యక్షులు నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు పెంచాలంటే జిల్లా స్థాయి కమిటీలో పెంచాల్సి ఉండగా, మామూళ్లు తీసుకుని డివిజనల్ సహకార అధికారులు జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చేశారు. ఇందులో కొన్నిచోట్ల డిపార్ట్మెంట్ పర్సన్ ఇన్చార్జులు ప్రతిపాదనలు పంపిస్తే డిప్యూటీ రిజిస్ట్రార్లు మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేశారు. దీనిపై విచారణ జరిపితే కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది. -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నగరంపాలెం: పగలు పల్సర్ బైక్పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఇనుపరాడ్తో తాళాలు పగులకొట్టి.. గతంలో వెంకటేశ్వర్లు బేల్దారి పనులకు వెళ్లేవాడు. భార్యాభర్తలు కొద్దికాలంగా చోరీలకు శ్రీకారం చుట్టారు. భర్త ద్విచక్ర వాహనం (పల్సర్)పై వెళ్లి ఇళ్లకు తాళాలు వేసిన గృహాలను గుర్తించే వాడు. ఇరువురు కలసి చోరీకి వెళ్లేవారు. భర్త ఇనుపరాడ్డుతో తలుపులు పగలుకొట్టి, బంగారం, వెండి వస్తువులు, నగదుతో రెప్పపాటులో ఉడాయించేవారు. భార్య ఘటనా స్థలంలో ఉండి వచ్చే, పోయే వారి కదలికలను గుర్తించేది. చోరీలకు పాల్పడి వచ్చాక ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయేవారు. దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. నిందితుడైన వెంకటేశ్వర్లుకు పాత నేర చరిత్ర ఉందన్నారు. దాదాపు 13 కేసులు నమోదై ఉన్నాయి. త్వరితగతిన కేసు ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, హెచ్సీలు రామకోటేశ్వరరావు, మురళీకృష్ణ, పీసీలు కూర్మారావు, శివరామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలు
మానసిక వ్యాధులకు జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలోని 21వ నెంబర్ గదిలో వైద్య పరీక్షలు చేసి, అవసరం ఉన్న వారిని ఇన్పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్. -
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటా (100 కిలోలు) రూ.2,369, ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటా (100 కిలోలు) రూ.2,389లుగా నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69 అధికంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లా కంట్రోలు రూమ్ ఏర్పాటు చేసినట్లు(నెం.94913 92717) తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం తులసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండ్లమూడి వెంకయ్య చౌదరి, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు. -
12న బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
తెనాలి: స్థానిక ఆంధ్రాప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ‘రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక’ జరగనుంది. బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రం పాలకవర్గ అధ్యక్షుడు టి.దక్షిణామూర్తి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యంతోపాటు సమాచార బుక్లెట్ ఇస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్వీ సత్య కుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షుడు పీఎల్జీఎస్ ప్రకాశరావు, కోశాధికారి ఆర్.రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారు బీఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డీవీ సోమయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
13న పెన్షన్ అదాలత్
గుంటూరు ఎడ్యుకేషన్: కృష్ణనగర్లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు పెన్షన్ అదాలత్, ప్రయాస్ వెబినార్ నిర్వహించనున్నట్లు పీఎఫ్ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. వ్యక్తిగతంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చునని, ఆన్లైన్, ఈ–మెయిల్, వాట్సాప్ల్లోనూ పంపవచ్చని పేర్కొన్నాయి. మెయిల్తో పాటు వాట్సాప్ నంబరు: 94946 57469, 0863–2344106, 2232921 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని అధికారులు కోరారు. వెబ్ ఎక్స్ ఐడీ 2640 680 9421, పాస్కోడ్: ఈపీఎఫ్వో ఎట్ దరేట్ 1234 ద్వారా జాయిన్ కావాలని సూచించారు. మరొకరికి తీవ్రగాయాలు మేడికొండూరు: మేడికొండూరు మండలం గుండ్లపాలెం బస్టాండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్ ఆల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. టెంపో, ఎదురుగా వచ్చిన లారీ అతి వేగంగా ఢీకొనడంతో టెంపో ధ్వంసమైంది. మృతదేహం చెట్లలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. మేడికొండూరు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ సయ్యద్ బాబావలికి సొంతూరు మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామం అని గుర్తించారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. -
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి
నగరంపాలెం: జిల్లాలోని ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం నేర సమీక్షా సమావేశం (సెప్టెంబర్ – 2025) నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు రెండుసార్లు రోల్కాల్తోపాటు, వారంలో ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం చేపట్టాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలపై దృష్టి సారించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. రాత్రుళ్లు గస్తీ నిర్వర్తించే సమయంలో లాఠీలు, టార్చ్లైట్లు, విజిల్స్ తీసుకెళ్లాలని, పోలీస్ సైరన్ వినియోగించాలని చెప్పారు. పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి పదిన్నరలోపు దుకాణాలు మూసివేయించాలని, లేనిచో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాత్రుళ్లు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సాంకేతిక పరికరాలతో తనిఖీలు చేయాలని చెప్పారు. విద్యా, వ్యాపార సంస్థల వద్ద గస్తీ కొనసాగించాలని తెలిపారు. రహదారులపై అల్లర్లు సృష్టించే వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉండాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉండాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవాలన్నారు. రానున్న దీపావళి దృష్ట్యా ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని బాణసంచా విక్రయ దుకాణాలు, నిల్వలు, లైసెన్సులను పరిశీలించాలని సూచించారు. అనుమతుల్లేని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ.రవికుమార్ (ఎల్/ఓ), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


