breaking news
Guntur District Latest News
-
మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం తాడికొండ: అమరావతి రాజధానిలోని వేంకటపాలెంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 108 కిలోల గంధంతో అభిషేకార్చన నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక అరండల్పేట శ్రీఅష్టలక్ష్మీ మందిరం కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ మంగళవారం స్వామి, అమ్మవారికి విశేష పూజలు, శ్రీచక్ర మహామేరుకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కిలోల గంధంతో విశేష అభిషేకార్చన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హారతులు, మంత్రపుష్పం అనంతరం కుంకుమార్చనకు హాజరైన వారు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు నిర్వాహకులు అందించారు. నిర్వాహకులు మర్రిపాటి ప్రసాద్శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణ గుంటూరు మెడికల్: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రచార ఫ్లెక్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డీపీహెచ్ఎన్ డాక్టర్ ప్రియాంక, స్టాటిస్టికల్ అధికారిణి పద్మజ, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సూట్కేసులు
రైతుల తరఫున పోరాడితే కేసులు...పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రైతుల పక్షాన పోరాడే వారిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కేసులు పెడుతున్నారని, ఆయనకు మాత్రం సూట్కేసులు వెళ్తున్నాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. కూటమి ఏడాదిన్నర కాలం పాలనలో రైతుల సమస్యలను నరేంద్ర పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు చానల్కు గండ్లు పడ్డాయన్నారు. ఫలితంగా పెదకాకానిలో 11 వేల ఎకరాలు, చేబ్రోలులో 5 వేల ఎకరాలు, పొన్నూరు రూరల్లో 15 వేల ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు చానల్లోకి చేరడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంతటి భారీ నష్టం సంభవిస్తే గుంటూరు చానల్ లాకులు మూసినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమేనన్నారు. అయితే ఆ నీరంతా ఆకాశం నుంచి వచ్చిందా, భూమి లోపలి నుంచి పైకి వచ్చిందా అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలన్నారు. రైతులు మాత్రం కొండవీటి వాగు నుంచే భారీగా నీరు వచ్చి నష్టం చేసిందని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలి గత ఏడాది పంటలు మునిగిపోయిన నేపథ్యంలో రూ.16 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారని, అయితే ఈ ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనవసరం లేదా అన్ని అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అంతేగాక గతంలోనే నష్టపరిహారం చెల్లించామని, కాల్వలు కూడా బాగు చేయించామని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అదే నిజమైతే ఈ వర్షాలకు గండ్లు ఎలా పడ్డాయో చెప్పాలన్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రెండుసార్లు రూ. 20 వేలు ఖర్చు చేశారన్నారు. మూడోసారి నారుమడి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే ఎకరాకు తాత్కాలిక పరిహారంగా రూ.10 వేల నగదు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాతలు ఇంతటి దయనీయ స్థితిలో ఉంటే రెండు నెలలుగా ఎమ్మెల్యే నరేంద్ర నియోజకవర్గంలోనే కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. పంటల నష్టపోయినట్టు రైతులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెబితే... పంటలు పోతే పోయాయని, రియల్ ఎస్టేట్కు ఇవ్వాలని చెప్పడం ఆయన దుర్బుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చేబ్రోలు, కొమ్మమూరు బ్రిడ్జికి సంబంధించి గుంతలు తీసి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు భారీగా వచ్చి నడిరోడ్డుపై గుండాలు ఏర్పడ్డాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని అంబటి మురళీకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపణ -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అవసరమైతే ఈ క్లినిక్ను సందర్శించాలని తెలిపారు. దీనికి ప్యానెల్ అడ్వకేట్గా పి.రాజేష్ లింగం, పారా లీగల్ వలంటీర్గా పి.శిరీషను నియమించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల, మాజీ సైనిక ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
క్రోసూరు: మండలంలోని విప్పర్ల గ్రామంలోని ఎస్సీకాలనీ (గోవిందపురం)కు చెందిన బాలుడు రెండు మాసాల క్రితం మృతి చెందగా, బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసుస్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన జరిగింది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాల మేరకు.. జూన్ నెల రెండవ తేదీన విప్పర్ల గ్రామానికి చెందిన ఎర్రగుండ్ల జోష్ణప్రకాశ్ (8) బావిలో పడి మృతి చెందాడు. అప్పుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనుకుని ఖననం చేశారు. పది రోజుల క్రితం మృతుడి తల్లి శ్రావణి తన కుమారుడిని చంపి బావిలో వేసారన్న అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని క్రోసూరు సీఐ రమేష్, ట్రైనీ ఎస్ఐ గోపిల పర్యవేక్షణలో గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులు, తహసీల్దార్ వి.వి.నాగరాజు, వీఆర్వోల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మరణించిన రెండు మాసాల అనంతరం పోస్టుమార్టం -
బంగారు గొలుసు అప్పగింత
అద్దంకి రూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైన్ను డిపో మేనేజర్ ఆ ప్రయాణికుడికి అందజేశారు. డీఎం తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు సమతా నగర్కు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మంగళవారం అద్దంకి డిపోకు చెందిన బస్సులో అద్దంకి నుంచి ఒంగోలు బయలుదేరాడు. బస్సులో తన బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. ఈ విషయం గమనించి అద్దంకి డిపో మేనేజర్ రామ్మోహనరావుకు తెలియజేశారు. డీఎం వెంటనే సంబంధిత బస్సు డ్రైవర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ బస్సును పరిశీలించగా 2 సవర్ల బంగారు చైన్ కనబడటంతో తీసుకువచ్చి డీఎంకు అందజేశారు. -
‘కూటమి’గా
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల వేలం పాట ప్రహసనంగా మారింది. వేలంటపాట నిర్వహణ గత రెండు రోజులుగా ఇది కొనసాగుతోంది. షాపుల ద్వారా మంచి ఆదాయం వస్తున్న నేపథ్యంలో వాటిని దక్కించుకోవాలని కూటమి నేతలు పావులు కదిపారు. సోమ, మంగళవారాల్లో జరిగిన వేలం పాటల్లో కూటమికి చెందిన కార్పొరేటర్లు, నేతలు ఈ మేరకు చక్రం తిప్పారు. ఏకంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే పాగా వేసి.. వేలం పాట దగ్గరుండి పరిశీలిస్తూ తమ బినామీల ద్వారా షాపులను దక్కించుకున్నారు. దుకాణం తెరిచారు! నెహ్రూనగర్ (గుంటూరు): కొల్లి శారద మార్కెట్లో 81 షాపులకుగాను వేలం పాట 18, 19, 20వ తేదీల్లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం 29, మంగళవారం 26 దుకాణాలకు వేలం పాట నిర్వహించారు. బుధవారం మిగిలిన 26 షాపులకు పాట జరగనుంది. దుకాణాలలో వ్యాపారాలకు మంచి గిరాకీ ఉండటంతో వేలం పాటలో పాల్గొనేందుకు పోటీ పెరిగింది. 10 మంది నుంచి 20 మంది వరకు పోటీ పడేందుకు వచ్చారు. మరోవైపు వీటిపై కన్నేసిన ఓ మంత్రి వర్గం, ఇతర కూటమి ప్రజాప్రతినిధులకు చెందిన వారు రెండు రోజులపాటు చక్రం తిప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే పాగా వేసి నోట్ల కట్టలతో హడావుడి చేశారు. ఒక్కో షాపునకు సగటున రూ.7 వేలుగా ప్రభుత్వ అద్దెగా నిర్ణయించగా.. దానిని రూ.30 వేల నుంచి రూ.1,06,000 వరకు పెంచుకుంటూ పోయారు. వేలం పాట వద్ద రభస మంత్రి వర్గీయులు సోమవారం 7, మంగళవారం కూడా మరో 7 దుకాణాలు దక్కించుకున్నట్లు సమాచారం. బుధవారం మరో పది షాపులను తన బినామీల పేరిట కై వసం చేసుకునేందుకు ఎంతైనా వేలం పాట పాడే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించాలని నగర కమిషనర్ సూచించారు. ఆ ప్రకారం ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, బీసీలకు 4, దివ్యాంగులకు ఒకటి చొప్పున కేటాయించారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు ఆయా వర్గాల పేరుతో వేలం పాటలో పాల్గొన్నారు. మరోవైపు కావాలనే ఎక్కువ పాట పాడుతూ అద్దె పెంచేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం 31వ నంబర్ షాపును ఎస్సీలకు కేటాయించగా వేలం పాటలో ఇతర కులాల వారు వెనుక కూర్చొని పాట పెంచడం గమనించారు. వారిని బయటకు పంపించేయాలని అసలైన అర్హులు అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్సీలు కాని వారిని అధికారులు బయటకు పంపించేశారు. చివరికి ఆ షాపు వేలంపాటను సాయంత్రం అన్నీ అయ్యాక వేస్తామని అధికారులు చెప్పడంతో ఎస్సీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం వస్తున్నప్పుడు అదే రీతిలో నిర్వహించకుండా ఇలా చెప్పడం ఏంటని మండిపడ్డారు. చేసేదేమీ లేక వేలం పాట కొనసాగించారు. దీనిని రూ.47 వేలకు ఎస్సీ వర్గం వారు పాడుకున్నారు. రైతుల నెత్తిన ఎరువు బరువు వైభవంగా వీరభద్రుడి పల్లె జాతరనిజంగా చెల్లిస్తారా? ఎవరైనా వేలం పాటలో పాల్గొనేందుకు వస్తుంటే పక్కకు తీసుకువెళ్లి సిండికేట్గా వారితో మాట్లాడుకుని కొంత డబ్బు ముట్టజెప్పి పంపించేస్తున్నారు. మార్కెట్లోని పాత లీజుదారులందరూ ఏటుకూరు, బుడంపాడు బైపాస్కు దుకాణాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో పక్క ఇంత ఖర్చుపెట్టి వేలం పాటలో వీరందరూ పాల్గొనడం చూసి అధికారులు కూడా కంగుతింటున్నారు. జీఎస్టీ, అడ్వాన్ కూడా భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కార్పొరేషన్కు జమ చేస్తారా? లేదా? అని అధికారులే ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహసనంగా మారిన కొల్లి శారద మార్కెట్లోని షాపుల వేలంపాట రూ. 1.6 లక్షలు పలికిన 43వ షాపుగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కొల్లి శారద మార్కెట్ షాపుల వేలం పాట జరుగుతున్న విషయం విదితమే. మంగళవారం జరిగిన వేలం పాటలో అత్యల్పంగా 22ఏ దుకాణం రూ. 32 వేలు, అత్యధికంగా 35వ షాపు రూ.90 వేలు వేలంపాటలో పలికాయి. ఆ తర్వాత జరిగిన 43వ నెంబరు షాపునకు జనరల్ కేటగిరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 1,06,000కు పాట పాడి దుకాణం దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో పాట పాడడం ఇదే మొదటి సారి అని అధికారులు, వేలంపాటదారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి
కొల్లిపర: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీతో కృష్ణా నదికి సుమారుగా 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా, మంగళవారం అధికారులు ఈ మేరకు దిగువకు వదిలారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తహసీల్దార్ జి.సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావులు తెలిపారు. మండలంలోని లంక గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామంలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. జీజీహెచ్లో ఫిర్యాదుల బాక్సు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, హెచ్డీఎస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఫిర్యాదుల బాక్స్లో పది ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై హెచ్డీఎస్ కమిటీ చర్చించి, పరిష్కరించేందు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. హిందూ కళాశాల సెంటర్లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్వలి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ఉపాధి చూపాలన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
మేదరమెట్ల: వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల ఫైలాన్ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జే.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ (37) భార్య వెన్నెలతో కలసి ఒంగోలులో ఉంటున్న కుమారుని కలసి మోటారు బైకుపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. బైకు ఫైలాన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్ను లారీ కొద్ది దూరం లాక్కొనిపోయింది. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ భార్య వెన్నెల రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
త్వరలో అనుబంధ విభాగాల నియామకాలు
నెహ్రూనగర్: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, డివిజన్ అనుబంధ విభాగాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్లు తెలిపారు. గుంటూరు నగరంలోని అంబటి రాంబాబును, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ను వారి కార్యాలయాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి షేక్ మస్తాన్వలి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాతోపాటు, గుంటూరు పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీల గురించి ప్రస్తావించారు. త్వరితగతిన కమిటీలు పూర్తి చేసేలా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించేలా పదవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. -
బార్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 159 బార్ల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుంటూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 110 బార్లకు, పల్నాడు జిల్లాలో 49 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మూడు విధానాల (ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మూడు సంవత్సరాల కాల పరిమితితో కొత్త బార్ పాలసీ మేరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చని, ఏ షాపుకై నా కనీసం నాలుగు దరఖాస్తులు వస్తానే లాటరీ తీస్తామని చెప్పారు. షాపు దక్కించుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు మూడేళ్ల కాల పరిమితితో బార్లను నిర్వహించుకోవచ్చని వివరించారు. 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు, 5 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఉంటుందని, దీన్ని ఏడాదిలోగా ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. ప్రతి దరఖాస్తుకు రూ .5.10 లక్షలు చెల్లించాలన్నారు. అందులో రూ. 5 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ. పదివేలు ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారుడికి వయసు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 28వ తేదిన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారిణి అరుణ కుమారి, సీఐ లత తదితరులు పాల్గొన్నారు. -
పశువుల దొంగతనాలతో నష్టపోతున్నాం
మేమంతా కోడె దూడల వ్యాపారం చేస్తుంటాం. ఇళ్ల వద్దనున్న కొట్టాల్లో కట్టేసిన ఆవులు, గేదెలు, కోడె దూడలను దొంగలిస్తున్నారు. ఈనెల 10న దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పట్టుకునే ప్రయత్నంలో నలుగురు పారిపోగా, ఒకరూ పట్టుబడ్డారు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించాం. పారిపోయిన ఆ నలుగురి పేర్లను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యల్లేవు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి, అర్ధరాత్రుళ్లు కట్టేసిన జీవాల తాళ్లను తెంచుకెళ్లి తరలిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇదే వృత్తిగా జీవిస్తున్నారు. నాలుగేసి చొప్పున హైదరాబాద్కు తరలించి, అక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు నెలల్లో 16 జీవాలను దొంగలించారు. రెండు నెలలో మరో పదహారు గేదెలను ఎత్తుకెళ్లారు. ముఠాపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. – దొడ్డి సుధీర్ (సంపత్నగర్) అబ్దుల్, ఇర్ఫాన్ (ఆనందపేట ఏడో వీధి) -
జీవాల దొంగతనాలపై పోలీసుల నిర్లిప్తత
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదు నగరంపాలెం: జీవాలను దొంగలించే ముఠాలోని వారిని అప్పగించినా పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోయారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరి పాలన), ఎ.హనుమంతు (ఏఆర్) బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లల్లో మాట్లాడారు. బాధితుల అర్జీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమాచారాన్ని నిర్ణీత గడువులోగా డీపీఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు. -
సీజీహెచ్ఎస్లో ఆధునిక సౌకర్యాలు
గుంటూరు మెడికల్: మారుతున్న కాలానుగణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సీహెచ్.కోటేశ్వరరావు పేర్కొన్నారు. నగరంపాలెంలోని సీజీహెచ్ఎస్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఏర్పాటైన లేబొరేటరీ, ఇంజెక్షన్, బీపీ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సీజీహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమాసుందరి అధ్యక్షత వహించారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా, సీజీహెచ్ఎస్ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన స్థితికి తీసుకొస్తామని వెల్లడించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవాల ద్వారా మరిన్ని వైద్య సౌకర్యాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. రోగుల ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. సీజీహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి, ఫార్మాసిస్టు ఆయోషా బేగం, సునీల్, లేబొరేటరీ అసిస్టెంట్లు మురళి, రామారావు, సిబ్బంది మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి పాల్గొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోటేశ్వరరావు -
ఉచిత ఉపకరణాలు వినియోగించుకోండి
పెదకూరపాడు: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ అన్నారు. పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సెల్వరాజ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో 520 మంది విద్యార్థులు భవిత పాఠశాలలో ఉన్నారని తెలిపారు. వారిలో ఉపకరణాల అవసరమైన వారికి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రత్యేక ప్రతిభావంతులను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకారణాలను అందించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం డాక్టర్ నితీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధి కారి ఏకుల ప్రసాదరావు, సత్యనారాయణ, హెచ్ఎం కేవీ రమణ, స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారావు, సుశితాప్రియ, లక్ష్మీనారాయణ, నూర్జహాన్, అచ్చయ్య, నసీమా బిగ్, బాబు, ఐఈఆర్పీ టీచర్లు లక్ష్మీ, కమల, స్వాతి, రమాదేవి, రహీం పాల్గొన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ -
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
డీఆర్వో ఖాజావలి గుంటూరు వెస్ట్ : అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం చాలా ముఖ్యమని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే అర్జీల పరిష్కారం ఆలస్యమవుతుందని తెలిపారు. ప్రతి శాఖలో ఎన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయో అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అర్జీల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి ఆన్సర్లు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను స్థానిక మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం వచ్చిన 198 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలు
తెనాలి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలను సోమవారం తెనాలిలో ప్రకటించారు. డాక్టర్ ఎన్.భగవాన్దాస్, బండి రాజన్బాబు స్మారకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ పోటీలను నిర్వహించారు. కలర్ విభాగంలో బి.జోగారావు తీసిన ‘విద్యార్థినిపై పోలీసు జులుం’ ఫొటో ప్రథమ బహుమతికి ఎంపికకాగా, ‘తాజ్మహల్ అందం’పై జీజేవీఎస్వీ ప్రసాద్ తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి, పిట్టల మహేష్ తీసిన ‘ప్రభల తీర్థం’ ఫొటో తృతీయ బహుమతికి ఎంపికయ్యాయి. మోనోక్రోమ్ విభాగంలో వనం శరత్బాబు ఫొటో ‘నీరు విలువైనది’ ప్రథమ బహుమతికి ఎంపికకాగా, మహేష్.జి తీసిన ‘బ్లడీ ఫైట్’కు ద్వితీయ బహుమతి, వనమామలై శ్రీనివాసాచారి ఫొటో ‘కమ్యూనిటీ బావి’కి తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. రెండు కేటగిరీల్లోనూ అయిదేసి ఫొటోల చొప్పున పది ఫొటోలు మెరిట్ సర్టిఫికెట్కు ఎంపికయ్యాయి. సబ్జెక్ట్, కంపోజిషన్, టెక్నికల్స్, లైటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించినట్టు ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ కానాల సుధాకరరెడ్డి తెలియజేశారు. త్వరలో జరగనున్న ప్రత్యేక సభలో విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. -
తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
తాడికొండ: మండలంలోని బండారుపల్లి కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా పార్టీని మోస్తున్న తమకు తెలియకుండా ఇటీవల పార్టీలో చేరిన గుంటుపల్లి పానయ్యకు పదవిని షాడో ఎమ్మెల్యే రూ.20 లక్షలకు అమ్ముకున్నాడని పలువురు ఆరోపించారు. సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం అడ్డుకుంటామంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. పార్టీ గ్రామ అధ్యక్ష పదవిని కూడా రూ.8 లక్షలకు బేరం పెట్టి, తమకు తెలియకుండా వేరొకరికి కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు అమ్మకం పార్టీలో తమకు ప్రాధాన్యత లేకుండా, కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా ఇష్టారీతిగా అమ్ముకుంటే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని మాజీ సర్పంచ్ శేషగిరిరావు, సొసైటీ మాజీ చైర్మన్ దండమూడి సాంబశివరావు తదితరులు మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, ఎంపీ పెమ్మసాని సోదరుడు రవి సమక్షంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరుగుతున్న వైఖరిపై తెలియజేశామని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడితే తాను వచ్చి నచ్చ చెబుతానని దాటవేశాడని ఆరోపించారు.తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం వాయిదా వేయమని చెప్పినా ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసులు పెట్టి జైలుకు పంపించిన కుటుంబానికి పార్టీ పదవులు అమ్ముకోవడం సిగ్గుచేటుగా ఉందని, పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఫలించని చర్చలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి రాజీ నిమిత్తం వచ్చిన జిల్లా అధికార ప్రతినిధి గుంటుపల్లి మధుసూదనరావు సముదాయించేందుకు యత్నించినా ససేమిరా అనడంతో ప్రమాణ స్వీకారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరిపిన అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. నిరసనలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, నేతలు దండమూడి వెంకట్రావు, నిమ్మగడ్డ జానకీ రామయ్య, పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు, రేపు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరిలో మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. నగర పరిధిలోని సీకే కన్వెన్షన్లో జీరో ప్రావర్టీ పి–4 కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీటింగ్, సభాస్థలి, వీడియో గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నగర పరిధిలోని ఎన్ఆర్ఐ ఫ్లైఓవర్ వద్ద ఉన్న మయూరి టెక్ పార్క్లో బుధవారం జరగనున్న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న దృష్ట్యా, అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ శంకరరావు, సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా పాల్గొన్నారు. విరిగిన ఇనుప గడ్డర్తో ఇబ్బందులు తెనాలి రూరల్: తెనాలి–చందోలు మార్గంలోని వైకుంఠపురం రైల్వే వంతెన వద్ద తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగి కింద పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం మరమ్మతులు చేయించారు. తరచూ గడ్డర్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గాంధీ ఆశ్రమానికి రూ.లక్ష విరాళం తెనాలి అర్బన్: పెదరావూరుకు చెందిన షేక్ హానీఫ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బాషా మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమ నిర్వాహణకు రూ.లక్ష చెక్కును నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో షేక్ జానీ సైదా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 15 మండలాల్లో మోస్తరు వర్షం -
‘పండుటాకు’పై ప్రతాపం
తెనాలి: వృద్ధులను ఆదరంగా చూసు కోవాల్సిన వారసులు బాధ్యతలను మరిచిపోతున్నారు. మనుషుల కన్నా ఆస్తుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. పండుటాకులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఇంట్లోంచి వెళ్లగొట్టేందుక్కూడా వెనుకాడటం లేదు. పట్టణంలోని శాంతీనగర్కు చెందిన చిలుకూరి వెంకటమ్మ (84)ఇందుకో నిదర్శనం. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె తన కష్టాలను పరిపాలన అధికారి శ్రీధర్బాబుకు ఏకరువు పెట్టారు. లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. ఆ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషను పరిధిలోని శాంతినగర్లో వెంకటమ్మకు పక్కా ఇల్లు ఉంది. భర్త ఎప్పుడో చనిపోయారు. ఆమె కుమారుడు చిలుకూరి రామయ్య, మంగమ్మకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో భార్యాభర్తలు కాలం చేశారు. మనవరాళ్లు ఇద్దరు, ఒక మనవడు ఉన్నారు. ముగ్గురిలో లలిత అనే మనవరాలు నన్గా మారి ఇటలీలో ఉంటోంది. మనవడు చిలుకూరి రాజేష్బాబు ఎనిమిదేళ్ల క్రితం చిలకలూరిపేటకు చెందిన శాంతకుమారిని వివాహం చేసుకున్నాడు. ఎమ్మెస్సీ చేసిన శాంతకుమారి, గతంలో చిలకలూరిపేట, హైదరాబాద్లో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం తెనాలిలోనే ఓ కార్పొరేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. వెంకటమ్మకు గల ఇంకో మనవరాలు అమల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె సంరక్షణ బాధ్యతను తల్లిదండ్రులు లేని కారణంగా నాయనమ్మ అయిన వెంకటమ్మ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిలకలూరిపేట నుంచి వచ్చిన తల్లి శారదతో కలసి శాంతకుమారి దౌర్జన్యంగా తన ఇంట్లోకి చొరబడినట్టు వెంకటమ్మ ఆరోపించింది. అంతేకాకుండా తనను కొట్టి, తనను, మనవరాలిని బయటకు వెళ్లగొట్టినట్టు ఆరోపించారు. సొంత ఇంటిని కబ్జా చేసి, వృద్ధురాలినైన తనను గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించినట్టు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు మొరపెట్టుకున్నారు. తనకు తగిన న్యాయం చేసి, ఇల్లు ఇప్పించాలని వేడుకున్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తాడికొండ: అమరావతిలోని వేంకటపాలెంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్థం మొదటిసారిగా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. 19వ తేదీ ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజ నం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ ఎం.మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ. రామకృష్ణ, ఎం.సందీప్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకవైపు కృష్ణమ్మ వరద దోబూచులాటలు.. మరోవైపు ముసురుతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వరుణుడి ప్రకోపంతో అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గడంతో పంట ముంపు నుంచి బయటపడతామనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. మళ్లీ వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో పాటు ఉపరితల అవర్తన ప్రభావంతో జిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా కాకుమాను మండలంలో 37.2 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 0.6 మి.మీ. పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బ్యారేజీకి వరద నీరు తాకిడి మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి క్రమేపీ పెరుగుతోంది. రెండు రోజుల కిందట రెండో ప్రమాద హెచ్చరిక వరకూ వెళ్లి, మళ్లీ వరద ప్రవాహం తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నిదానంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం బ్యారేజీకి వచ్చిన 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు వద్దకు వచ్చే అవకాశముందని, ఆ తర్వాత రోజుకు సుమారు ఏడు లక్షల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగితే మరింత ఉధృతి పెరిగే అవకాశం కనపడుతోంది. 26 క్రస్ట్గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం 26 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 2,51,182 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 3,31,699 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. రెంటచింతల మండలం సత్రశాల వద్ద నున్న నాగా ర్జున సాగర్ టైల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 16 క్రస్ట్గేట్లు ద్వారా 2,92,192 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా పులి చింతల మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 2,47,951 క్యూసెక్కులు వచ్చి చేరింది. దిగువకు 10 క్రష్ట్ గేట్లద్వారా 3,10,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణతోపాటు, ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం పులిచింతల నుంచి 2,51,743 క్యూసెక్కులు, పాలేరు నుంచి 25,716 క్యూసెక్కులు, వజినేపల్లి నుంచి 1,76,542 క్యూసెక్కులు, కట్లేరు నుంచి 10 క్యూసెక్కులు, కొండవీటి వాగు నుంచి 2,100 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని సమాచారం. తెలంగాణాలో పడుతున్న భారీ వర్షాలకు మూసీతో పాటు ఇతర వాగుల నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటుతాడేపల్లి రూరల్: కృష్ణా నదికి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్లలో భద్రత దృష్ట్యా సోమవారం తాడేపల్లి పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందర్శకులు మెట్ల మీద నుంచి నీళ్లలోకి దిగుతున్నారని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు పుష్కర ఘాట్లన్నింటిలో కంచెను ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. తీరంలో ప్రజలు నదిలోకి దిగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
వేర్వేరు గంజాయి కేసుల్లో 15 మంది అరెస్టు
తెనాలి రూరల్: రెండు వేర్వేరు కేసుల్లో 15 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, 3300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలు వెల్లడించారు. స్థానిక సుందరయ్యనగర్లో యువకులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందుకున్న త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. వారి నుంచి 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మృత్యుంజయ కుమార్ సింగ్, కరికట్ట మధు, దాది షణ్ముఖ అలియాస్ బన్ను, పఠాన్ మహమ్మద్ అలియాస్ ఫర్దీన్ ఖాన్, ఆకుల మారన్న అలియాస్ మారి, బుంగ అలియాస్ సయ్యద్ సైదా, ఆరిమళ్ల విజయ్ కుమార్ అలియాస్ జగ్గం నాని, సంతోష్ కుమార్ ఉన్నారు. వీరిలో మృత్యుంజయ కుమార్ సింగ్ బిహార్ వాసి. ఆ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెనాలి ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
అంబేడ్కర్ రాజ్యాంగానికి అవమానం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏకంగా అంబేడ్కర్ రాజ్యాంగం తమకు అక్కర్లేదని, సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. జీవో కాపీలను తగులబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యాంగం అవహేళన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతన్య మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత నీచానికి దిగజారారని ధ్వజమెత్తారు. కనీసం మౌలిక వసతులు కూడా లేక సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి సంఘాలపైనే ఉందని పేర్కొన్నారు. విద్యా శాఖా మంత్రి లోకేష్ నిజాయతీపరుడైతే ముందుగా విద్యా సంస్థలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అది మానేసి విద్యార్థి సంఘాల ప్రవేశంపై నిషేధం వంటి దుర్మార్గపూరితమైన చర్యలకు దిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపతి నాగరాజు, గుంటూరు నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, కరీం, కిరణ్, రామకృష్ణ, మస్తాన్, జిల్లా కార్యదర్శులు అరుణ్, సన్ని, వినయ్, సతీష్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేటేటి నవీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు సాజిద్, తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు శామ్యూల్, ప్రత్తిపాడు నియోజకవర్గం అధ్యక్షుడు కెనడీ, మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆదివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. తొలుత బీఆర్ స్టేడియం నుంచి సీపీఐ జిల్లా కార్యాలయం వరకు ప్రజాప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లా డుతూ సంవత్సర కాలంలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్–6 హామీ లన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. ● నూతన బస్సులు కొనుగోలు చేయకుండా, తగిన సిబ్బంది నియామకం జరగకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తాము చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాజధానికి మరో 40 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. లూలూ కంపెనీకి రూ.400 కోట్ల విలువైన భూములను 99 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరికం పోతుందని చంద్రబాబు చెబుతున్నారని, ఇటువంటి విధానాలతో పాలన చేస్తే 1000 ఏళ్లకు కూడా పేదరికం పోదని స్పష్టం చేశారు. ఒంగోలులో ఈనెల 23, 24, 25 తేదీలలో జరగనున్న రాష్ట్ర మహాసభలకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర వేడుకలలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని విస్మరించి అసలు పోరాటంలో భాగస్వాములు కాని ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలకు ఆయుధంగా ఇచ్చిన ఓటు హక్కును రద్దు చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్, దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీతో లాలూచీ పడిందని, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే గాని ఓటర్ లిస్టు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారని విమర్శించారు. మోదీ పాలనలో అంబానీ, అదాని వంటి కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులుగా ఎదిగారని దుయ్యబట్టారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి అరుణ్కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ జిల్లా మహాసభలు ప్రారంభం -
గుంటూరు
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఇంజినీరింగ్కు ఫుల్ డిమాండ్ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ● ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇంజినీరింగ్ సీట్లు దాదాపు భర్తీ ● 36 కాలేజీల్లో తొలి విడత కౌన్సెలింగ్లోనే 90 శాతానికిపైగా భర్తీ ● ప్రస్తుతం చివరి విడతలో మిగతా సీట్ల భర్తీకి సన్నాహాలు ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత ప్రక్రియ ముగిసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా మొదటి విడతలో ఇప్పటికే సీట్ల కేటాయింపు పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తాడికొండ: కొండవీటి వాగు ముంపునకు కారణం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం తుళ్లూరు మండలం పెదపరిమి– నీరుకొండ గ్రామాల మధ్య కొండవీటి వాగు ముంపునకు గురైన పంట పొలాలను నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)తో కలిసి అంబటి పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో చర్చించారు. మీడియాతో అంబటి మాట్లాడుతూ భారీ వర్షాలు తగ్గి ఐదు రోజులైనా పంట పొలాల్లోని నీరు బయటకు పోకపోవడం దురదృష్టకరమన్నారు. వాగు ముంపు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారని, ముంపు నివారణకు ప్రభుత్వం ఎత్తిపోతల పథకం చేపట్టకముందే తమ పరిస్థితి బాగుందని పేర్కొంటున్నట్లు గుర్తుచేశారు. వాగును ఎగువ నుంచి ఆధునికీకరణ చేయకుండా, రాజధాని పేరుతో దిగువ ప్రాంతంలో రోడ్లు, భవనాలు కట్టడం వలన వాగు స్వరూపం పూర్తిగా కోల్పోయి ఈ దుస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నట్లు తెలిపారు. ముంపు నివారణకు రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం కింద 24 గంటలూ పనిచేసినా పంట పొలాల్లో నీరు తగ్గని పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వం తెలివి తక్కువ పనులే అన్నారు. ఎత్తిపోతల పథకం పెట్టి బిల్లు చేసుకున్నారని రైతులే చెబుతున్నారని, ఆ కారణంగా రాజధాని ప్రాంతంలో పొలాలు గతంలో ఎన్నడూ లేనంతగా ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు. సమీకరణ చేసిన 53 వేల ఎకరాలు చాలక.. మరో 43 వేల ఎకరాలు తీసుకోవాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. తీసుకున్న వాటికే గతి లేకపోతే మళ్లీ తీసుకోవడం రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టమని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. 7పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతం ఏర్పడక ముందు రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో జరిగిన నిర్మాణాల కారణంగా వాగు ప్రవాహం కిందికి వెళ్లే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు గాలికొదిలి రాజధాని పేరుతో చేసుకుంటున్న ప్రచారాలను ప్రభుత్వం ఇకనైనా పక్కన పెట్టాలన్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ తాడికొండ, తుళ్లూరు మండలాల అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, నాగమల్లేశ్వరరావు, తాడికొండ, పెదపరిమి గ్రామాల అధ్యక్షులు వంగా పోలారెడ్డి, ఉమామహేశ్వరరావు, వివిధ విభాగాల నాయకులు చుండు వెంకటరెడ్డి, కొప్పుల శేషగిరిరావు, నాయుడు నాగేశ్వరరావు, నంబూరు రఘునాథరావు, నంబూరు బాబు, పుట్టి సుబ్బారావు, షేక్ అజీజ్, దమ్మాటి మోహనరావు, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, పులి రమేష్, ఇసుకపల్లి రమేష్ అక్కల లక్ష్మీనారాయణరెడ్డి, మున్నంగి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, చిరు జల్లులు కురుస్తుండటంతో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సేద తీరారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనతో పాటు చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ, వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. నరసరావుపేట: స్థానిక కోటబజార్లో గల మహాలక్ష్మమ్మచెట్టు వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు జలబిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అన్నదానం జరిగింది.శావల్యపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామంలో పోలేరమ్మకు ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళా భక్తులు బోనాలను ఊరేగింపుగా తెచ్చారు.తాడేపల్లి రూరల్: మంగళగిరి మండలం ఆత్మకూరులో గంగానమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. -
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు నాగార్జునకొండను సందర్శించటంతో లాంచీస్టేషన్కు రూ.1,88,150 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అచ్చంపేట: ఎగువ నాగార్జునసాగర్, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం ఏడు గంటల వరకు పులిచింతల ప్రాజెక్టుకు 2,08,330 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 1,93,855 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 38.4077 టీఎంసీలు ఉంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం నిండిపోయింది. శ్రావణమాసం ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతోపాటు సుదూర స్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రొంపిచర్ల: రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. సుబ్బయ్యపాలెం క్రాస్రోడ్లో భారీ లారీలో డీజిల్ అయిపోయి మరమ్మతులకు గురైంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీస్స్టేషన్కు కూడా వాహన చోదకులు సమాచారం అందించారు. ఎవరూ స్పందించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
క్షణంలో జీవ‘కళ’ ఉట్టిపడేలా..!
చిన్ననాటి నుంచే ఆసక్తి వినియోగదారులు మెచ్చేలా... సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత... రెండూ అవసరమైన కళ ఫొటోగ్రఫీ. భావోద్వేగాలను క్షణంలో కెమెరా కన్నుతో ఒడిసిపట్టడం అంత సులువేం కాదు. అంతటి క్లిష్టమైన కళలో అసాధారణ ప్రతిభ చాటుతున్నారు ఫణి గోగిరెడ్డి. తాజాగా జాతీయ స్థాయిలో మరో అవార్డును కై వసం చేసుకున్నారు. మోదుకూరు వాసికి మరో జాతీయ స్థాయి అవార్డు ‘24 ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ’తో దక్షిణాదిలో ఇప్పటికే గుర్తింపు 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ప్రత్యేక కథనం -
సర్కారు తీరుతో ముంపు సమస్య
● కొండవీటి వాగు ఆధునికీకరణ వదిలేసి ‘ఎత్తిపోతల’ అమలు తగదు ● వర్షాలు ఆగిన 5 రోజులకు కూడా ముంపులోనే పంట పొలాలు ● రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి -
యూటీఎఫ్ కార్యాలయంలో సమైక్యత సదస్సు
లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడారని ప్రముఖ చరిత్రకారులు, కళా రత్న అవార్డు గ్రహీత నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో ఆదివారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమం నాటి త్యాగాలు.. నేటి కర్తవ్యాలు అనే అంశంపై సమైక్యతా సదస్సు జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సుభాని అధ్యక్షతన జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో సమైక్య పోరాటాల గురించి మతసామరస్యం గురించి నసీర్ అహ్మద్ అనేక ఉదాహరణలను తెలియజేశారు. యూటీఎఫ్ నాయకురాలు ఎండీ షకిలా బేగం మా ట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటి పరిస్థితుల గురించి వివరించారు. మిడిల్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వీవీకే సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా లౌకిక తత్వాన్ని కాపాడుకోవడంకోసం సమైక్యంగా ఉద్యమించడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిష్టి, సలీం, ప్రొఫెసర్ వేణుగోపాల్, విరసం నాయకులు రవిచంద్ర, నజీర్ మహెక్, సైదా, ఐద్వా నాయకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’
సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం ఉద్యోగుల ప్రయోజనాలకు గండి జీజీహెచ్కు జనవరిలో వచ్చిన ఫైల్.. జూలై నెలలో ప్రత్యక్షం క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్ తొక్కిపెట్టిన వైనం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర విమర్శలు ఒకరికి బదులు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు యత్నం -
టీడీపీలో ‘చైర్మన్’ చిచ్చు
● సొసైటీ చైర్మన్ పదవిని విక్రయించిన షాడో ఎమ్మెల్యేపై తమ్ముళ్ల వీరంగం ● గుంటూరు ఎంపీ కార్యాలయంలో అసంతృప్త నేతలతో రాజీ చర్చలు ● ప్రమాణ స్వీకారం చేయిస్తే తామేంటో చూపిస్తామంటూ తమ్ముళ్ల సవాల్ ● గ్రామాల్లో గ్రూపులను ఎగదోస్తూ పోస్టులను ‘షాడో ఎమ్మెల్యే’ విక్రయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం ● నేటి ప్రమాణ స్వీకారంపై నెలకొన్న సందిగ్ధత తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండల బండారుపల్లి కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో అంతా తానే అయి నడుపుతున్న షాడో నేత ఒకరు ఇలాంటి నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణం. బండారుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి పానయ్యని సొసైటీ చైర్మన్గా నియమించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామంలో ఉన్న టీడీపీలోని మూడు గ్రూపులు ఏకమయ్యాయి. సోమవారం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా... అదే జరిగితే తామేంటో చూపిస్తామంటూ వారందరూ వీరంగం సృష్టించారు. ఈ వ్యవహారంపై ఆదివారం గుంటూరు ఎంపీ పెమ్మసాని కార్యాలయంలో పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ పంచాయితీలో గ్రామానికి చెందిన వంద మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ పదవి కేటాయింపుపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విభజించి మరీ పదవుల విక్రయం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేత గ్రామాల్లో గ్రూపులుగా విభజించి పార్టీని నాశనం చేస్తున్నాడని, ఇప్పటికే గ్రామంలో మూడు గ్రూపులు ఉన్నాయని స్థానిక నేతలు వాపోయారు. 2023 వరకు అసలు పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తికి ఎలా సొసైటీ పదవి అప్పగిస్తారంటూ నిప్పులు చెరిగారు. ఎంపీ సోదరుడి సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో కనీసం 3 నెలలైనా అతనికి పదవి ఇచ్చి తదనంతరం రాజీనామా చేయిద్దామంటూ ప్రతిపాదించినా.. 3 నిమిషాలు కూడా సీటులో కూర్చుంటే ఒప్పుకోబోమని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటి వరకు 3 గ్రూపులుగా ఉన్న టీడీపీ వర్గం అంతా ఏకమై ఎదురుతిరగడంతో ఏం చేయాలో పాలుపోక ఎమ్మెల్యే కార్యాలయం, షాడో ఎమ్మెల్యే తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తమవైపు నుంచి నలుగురు వ్యక్తులను రాజీ చర్చలకు పంపించినా వారు కూడా సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. తమ్ముళ్ల ఆగ్రహానికి వారు కూడా ఏం చేయాలో పాలుపోక సైలెంట్గా వెళ్లిపోవాల్సి వచ్చింది. షాడో ఎమ్మెల్యే లీలలపై పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తుండటం విశేషం. తమ మాటను ధిక్కరిస్తే ఇప్పటి వరకు ఆయన చేసిన అడ్డగోలు దోపిడీని బయటపెట్టి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నోరు విప్పుతామని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కార్యాలయాలు, అక్రమ మైనింగ్, బదిలీలు, పదవుల అమ్మకం వంటి పలు వ్యహారాలపై ఇప్పటికే అతగాడు చేసిన చిట్టాను సిద్ధం చేసిన సదరు నేతలు.. ఆయన లీలలపై త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి దందాపై అసలు వ్యక్తి నోరుమెదపక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో తమకీ అంతుబట్టడం లేదంటూ పలువురు పేర్కొనడం చూస్తే రాజధాని నియోజకవర్గంలో షాడో దందాపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ప్రతిజ్ఞను జయప్రదం చేయండి
లక్ష్మీపురం: ఈనెల 28వ తేదీన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. గుంటూరులోని పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో ముగ్గురు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి వంటి యువకిశోరాలు ప్రాణ త్యాగంతో 20 సంవత్సరాలు పాటు విద్యుత్ చార్జీలు పెంచడానికి పాలకులు భయపడ్డారన్నారు. నేడు సర్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టమని పిలుపు ఇచ్చారని, నేడు అదానీతో ఒప్పందం మూలానా దగ్గరుండి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆగస్టు 28వ తేదీన జరిగే విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినంగా పాటించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి ఎం.సాంబశివరావు, జిల్లా కార్యదర్శిలు వై.నేతాజీ, జి.రమణ, బి.ముత్యాలరావు, నన్నపనేని శివాజీ, సిహెచ్ నాగ బ్రహ్మచారి, ఎస్ఎస్ చెంగయ్య, ఎం.భాగ్యరాజు, లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, ఎస్కే హుస్సేన్ వలి, కె.బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి -
స్కూల్ గేమ్స్ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి నియామకం కోసం ఆసక్తి, అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేసిన విధి, విధానాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్) పూర్తి వివరాలతోపాటు నమూనా దరఖాస్తును డీఈవో గుంటూరు బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో అందజేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి తెనాలిరూరల్: తెనాలి సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అంగలకుదురులో కిరాణా షాపు నిర్వహించే పువ్వాడ సుబ్బారావు(72) రోడ్డుపై నడుచుకుంటూ తెనాలి నుంచి అంగలకుదురు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుబ్బారావు తీవ్రంగా గాయపడగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరాఠా సంఘం రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు మెడికల్: మరాఠా రాష్ట్ర సంఘం –ఆంధ్ర ప్రదేశ్ రిజిస్టర్డ్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం గుంటూరు అరండల్పేటలో జరిగింది. సమావేశంలో సంఘం లక్ష్యాలు, గత ఏడాది కాలంలో చేసిన పనులు గురించి చర్చించారు. మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ శాఖ అధికారిక చిహ్నం(లోగో)ను సంఘం గౌరవ అధ్యక్షుడు గంగాధరరావు తెన్నేటి ఆవిష్కరించారు. మరాఠాల వివాహ సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను సంఘం గమనించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరాఠా కల్యాణం.కామ్ వెబ్సైట్ను సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు సింధే రవిచంద్రరావు, ఉపాధ్యక్షుడు కదం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అన్ని భాషలలో రూపొందించిన ఈ వెబ్సైట్ సేవలు దేశంలోని మరాఠాలు అందరూ ఉచితంగా పొందవచ్చునని మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మరాఠా వెంకట్ సోమాజీ తెలిపారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెంకటేశ్వరరావు డుమ్నే, ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు మోతే, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లోజి జాదవ్, సెక్రెటరీ హరినాథ్రావు జాదవ్, జాయింట్ సెక్రటరీ శంకరరావు మోరే, ఉప కోశాధికారి కదం రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు
తాడేపల్లిరూరల్: ఉండవల్లి అమరావతి కరకట్టపై గల ఆక్వా డెవిల్స్ అసోసియేషన్లో సిమ్మింగ్ కాంపిటేషన్ను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆడ్వా డెవిల్స్ ప్రాంగణంలో వున్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని పలు సముద్రాలను ఈదుతున్న క్వీన్ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్లు 1.5 కి.మీ. కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటేషన్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏడు సముద్రపు చానల్స్లో భాగంగా రెండవది అయిన అమెరికాలోని మెయిన్ ల్యాండ్ నుంచి సౌత్ కాలిఫోర్నియా బీచ్ వరకు 33.5 కి.మీ స్విమ్మింగ్ చేయడానికి సెప్టెంబర్ నెలలో వెళ్తున్న సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు సూచన మేరకు వారికి రూ. 25,116/– చెక్కును అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి వై.వి. రమేష్ కుమార్మాట్లాడుతూ క్వీన్ విక్టోరియా తన పిల్లలను ఈత శిక్షణ శిబిరంలో చేర్పించి, తాను కూడా పిల్లలతో పాటు ఈత నేర్చుకుని మాస్టర్ స్విమ్మింగ్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని సముద్రాలను ఈదుతున్న మొట్టమొదటి తెలుగు మహిళ మరియు ఆమె కుమారుడు ఆక్వా డెవిల్స్ గౌరవ సభ్యులు కావడం గర్వకారణమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఎ.రామిరెడ్డి, కోశాధికారి కె.వి.రామయ్య, కార్యవర్గ సభ్యులు కె.సాంబశివరాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, కర్రిసాంబయ్య, పి.శ్రీనివాసులు, కె.ఆశీర్వాదం, అబ్దుల్ గఫూర్ తదితరులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లను అభినందించారు.ఈత పోటీల్లో ప్రతిభ చూపుతున్న తల్లీకుమారులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లకు ఘనసన్మానం -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట 4వ లైను కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ జీఓ నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.2వేలు, మెస్ బిల్లులు పెంచాలని, హాస్టళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సొంత భవనాలను నిర్మించాలన్నారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీఓ నంబరు 42, 35లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, అలాగే మండలానికి ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు షేక్ సమీర్, జిల్లా సహాయక కార్యదర్శులు పవన్ రూపస్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సౌమ్య యశ్వంత్, నగర ఉపాధ్యక్షులు హర్షిత గంగాధర్, సహాయ కార్యదర్శులు సంతోష్, సుభాని, శశాంక్, సుర్జిత్, నగర బాలికల కన్వీనర్ సింధు శ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా -
గుంటూరు వైద్య కళాశాలకు రూ.25 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో క్యాంటీన్ నిర్మాణం కోసం గుంటూరుకు చెందిన మల్లిక స్పైయిన్ సెంటర్ అధినేత జె.నరేష్బాబు కుటుంబం రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. పునర్నిర్మాణం చేసిన క్యాంటీన్ను కళాశాల మాజీ ప్రిన్సిపాల్, డాక్టర్ జె.నరేష్బాబు తల్లి డాక్టర్ ఓలేటి శివలీల ముఖ్య అతిథిగా శనివారం ప్రారంభించారు. నరేష్బాబు 1991లో ఎంబీబీఎస్, పీజీ చదివారు. ఆయన తండ్రి రంగస్వామి గుంటూరు జీజీహెచ్ క్యాన్సర్ విభాగంలో పనిచేశారు. ఆయన సోదరుడు డాక్టర్ మహేష్బాబు ఇదే కళాశాలలో 1990లో ఎంబీబీఎస్ చదివి కార్డియాల జిస్ట్గా సేవలందిస్తున్నారు. మహేష్బాబు భార్య డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ తర్వాత గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. జె.నరేష్బాబు భార్య నీలిమ పెథాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. మరో సోదరుడు డాక్టర్ రంగనాఽథ్ ఈ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. రంగనాథ్ భార్య రాధిక గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి పిలుపు మేరకు వీరి కుటుంబం రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఎన్.వి.సుందరాచారి దాతలను సత్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డు
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్న్పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు. పేద విద్యార్థులకు సాయం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్గా నిలిచారు. -
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. క్లీనరు మృతి -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి ● దొడ్లేరు గ్రామంలో పర్యటన దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమరాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనానన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నేత సీహెచ్ గంగయ్య -
మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నరసరావుపేట: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. దంపతులకు తీవ్ర గాయాలు యడ్లపాడు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్పై భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక స్కూటీ వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడంతోపాటు దంపతులిద్దరూ బైక్పై నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఇద్దరికి తీవ్రంగా..నలుగురికి స్వల్పంగా గాయాలు పిడుగురాళ్ల: ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామం నుంచి ఐదుగురు నరసరావుపేటలోని ఇస్కాన్ ఆలయానికి ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో ఈశ్వరమ్మ, సారంగమ్మలు అయ్యప్పనగర్ వద్ద ఆటో ఎక్కారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఈశ్వరమ్మ, సారంగమ్మలను 108 వాహనం ద్వారా, నామ్స్ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన ఈశ్వరమ్మ, సారంగమ్మ -
ధైర్యానికి దిశ.. ‘శక్తి’తో నిరాశ
ఆడబిడ్డకు అండగా నిలవాలనే ధ్యేయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ‘దిశ’.. ఆపన్నుల గుండెల్లో ధైర్యం నింపింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యాప్తో ఎందరో రక్షణ పొందారు. కానీ నేడు కూటమి పాలకులు తెచ్చిన ‘శక్తి’ యాప్తో భరోసా కాదు కదా.. కనీసం యాప్ ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించి, యాప్ అందుబాటులోకి తెచ్చారు. మహిళలు, యువతులు, బాలికలు తమ సమస్యలు చెబితే తక్షణ సాయం అందేది. సేవ్ అవర్ సోల్స్ (ఎస్వోఎస్)కు కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు రక్షించారు. కాకాని రోడ్డులో ఒక దుర్మార్గుడి చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య కేసులో అప్పటి స్టేషన్ ఎస్హెచ్వో కె. వాసు కేవలం 20 రోజులలోపు చార్జిషీటు దాఖలు చేశారు. ఏడు నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రత్యేక కోర్టుల ద్వారా ఈ శిక్ష పడేలా చేశారు. మైనర్లపై అత్యాచారాలకు ఒడిగట్టిన వారికి శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. దిశ యాప్ ప్రారంభంమైన నాటి నుంచి 2024 ఎన్నికల వరకు 1.30 కోట్ల మందికిపైగానే సేవలను వినియోగించుకున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో 11.13 లక్షల మంది సేవలు పొందారు. దిశ ఎస్ఓఎస్ ఫోన్కాల్స్ అందుకున్న వెంటనే 2,300 మందిని ఆపద నుంచి రక్షించారు. 403 మందిని ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్నకు సంబంధించి నమోదు అయిన కేసుల్లో 96 శాతం చార్జీషీట్లు నిర్ణీత వ్యవధిలో కోర్టుకు సమర్పించారు. సగటున బాధితుల నుంచి 60 నుంచి 70 ఫోన్ కాల్స్ వచ్చేవని అధికారులు చెప్పారు. జిల్లా ‘దిశ’ ఎస్ఓఎస్ కాల్స్ ఎఫ్ఐఆర్ నమోదు/ చర్యలు తీసుకున్నవిగుంటూరు 78,724 1,781 బాపట్ల 14,600 883 పల్నాడు 15,171 1,105 రక్షణ చర్యలు తీసుకుంటాం నిత్యం కళాశాలల వద్ద రక్షక్ వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఆకతాయిలపై దృష్టి సారించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సిబ్బందిని ఉమెన్స్ కళాశాల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించాం. అవసరమైతే స్వయంగా పరిశీలనకు వెళ్తా. యువతులు, మహిళలు, బాలికల రక్షణకు చర్యలు తీసుకుంటాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ -
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లడంతో లాంచీస్టేషన్కు రూ.1,78,450 ఆదాయం సమకూరినట్లు యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, రామకృష్ణ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు. మాచర్ల: మాజీ ఎంపీపీ బూడిద వెంకమ్మ కుమారుడు శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వివరాలు చెప్పకుండా తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ బంధువులు అందరూ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి బూడిద శ్రీనివాస్ను విజయపురి సౌత్ పోలీసు స్టేషన్కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించారు. శ్రీనివాస్కు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నదీ తీరం.. అక్రమార్కుల పరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ నిబంధనలు గాలికి వదిలేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. భవానీపురం పున్నమి హోటల్కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమి ఘాట్కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
డెల్టా రైతు బతుకు ఉల్టా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో వెద జల్లితే 72 వేల ఎకరాలకుపైగా దెబ్బతిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మొత్తం 71,612 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని చెబుతున్నారు. ఇందులో వరి 62,275, పత్తి 8,550, మినుము 787.5 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎక్కువ భాగం మళ్లీ పంట వేయాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. కొంతమంది ముందస్తుగా ఎరువులు పొలాలకు తీసుకురావడంతో వానలకు అవి కొట్టుకుపోయాయని చెబుతున్నారు. ముందస్తు కౌలు చెల్లించి పొలాలు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత ఏడాది కూడా వీరు బాగా నష్టపోయారు. కొద్దో గొప్పో పడిన నష్టపరిహారం కూడా కౌలు రైతులకు బదులు భూ యజమానుల ఖాతాకు ఆ మొత్తం పడింది. సర్కార్ నిర్లక్ష్యమే ముంచేసింది.. డ్రైనేజీ, సాగునీటి కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వేసవి కాలంలో తొలగించాల్సిన గుర్రపు డెక్క పనులను వర్షాలు పడ్డాక హడావుడిగా చేసి మమ అనిపించారు. దీన్ని పూర్తిగా తొలగించకపోవడంతో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అధిక వర్షాలకు తోడు డ్రెయిన్లలో పూడికలు తొలగించకపోవడంతో తెనాలి, పెదకాకాని, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. గుంటూరు నల్ల డ్రెయిను–2కు రెండు, మూడు చోట్ల గండ్లు పడ్డాయి. పంట పొలాలను అందులోని వరద నీరు ముంచెత్తింది. చేబ్రోలు మండలంలోని శలపాడు వద్దగల జాగిరి వంతెన సైతం మునిగిపోయింది. మునిపల్లె, వెల్లలూరు, కసుకర్రు, నిడుబ్రోలు, కొండమూది, నండూరు, కట్టెంపూడి, పచ్చల తాడిపర్రు, చిన ఇటికంపాడు తదితర గ్రామాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నంబూరు, గోళ్ళమూడి, పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, రామచంద్రపాలెం, వెంకటకృష్ణా పురం, దేవరాయబొట్లవారి పాలెం, తంగెళ్ళమూడి గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూటమి పాలకుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరద నీరు ఇంకాల్సిందే... రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా వాగులు పొంగడం వల్ల వచ్చిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. కొండవీటి వాగు విషయానికి వస్తే నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం, ప్రణాళిక లేని పనులు చేపట్టడంతో అమరావతి ముంపు బారినపడింది. కొత్త కాల్వలు నిర్మించకపోవడం, ఉన్న వాటిని మూసివేయడం, తూములు కూడా సరైన చోట వేయకపోవడం వల్ల నీరు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా పెదపరిమి, నీరుకొండ మధ్య వేలాది ఎకరాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కొండవీటివాగు, కొట్టేళ్లవాగు, పాలవాగు, సారవాగు ఒకేసారి పొంగి ప్రవహించడంతో ముంపు ముప్పు పెరిగింది. వాగుల నుంచి వచ్చే వరదను ఎలా బయటకు పంపాలన్న విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయలేదు. అందుకే ముంపు పెరిగిందన్న వాదన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. మూడు రిజర్వాయర్లు కడతామన్న అంశం ప్రకటనలకే పరిమితం కావడం కూడా ఇబ్బందికరంగా మారింది. కొండవీటి వాగుకు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆ నీరు తాడేపల్లి వద్ద ఉన్న ఎత్తిపోతల వద్దకు రాకపోవడంతో ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన నీరు ఇంకిపోవడం తప్ప బయటకు పోయే మార్గం కనపడటం లేదు. దీంతో ఈ ముంపు ప్రాంతంలో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెల్టా రైతాంగం కుదేలైంది. గత నెలలో వరి విత్తనాలు వెద జల్లినా వర్షాభావ పరిస్థితుల వల్ల మొలకెత్తలేదు. మళ్లీ ఈ నెలలో వెద జల్లారు. ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాలకు మళ్లీ పంట పూర్తిగా మునిగింది. -
జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులో 79వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ సూర్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు, కోర్టు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోతుకూరు శ్రీనివాసరావు, ఈసీ మెంబర్స్ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఎస్ఐలు సంపంగిరావు, ప్రసాద్, అధికారలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమైక్యతే భారత దేశం శక్తి జేసీ భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: భారత దేశం అనేక మతాలు, కులాలు, జాతులు, భాషల సమ్మిళతమై ఉన్నప్పటికీ అంతా కలిసిమెలసి జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు దేశం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను యువత అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఆటో బోల్తా : పలువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం మేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నబాబుకు అధికారులు సెల్యూట్
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు తమ హోదాలను మరిచి చిన్నబాబు సేవలో తరించారు. ఇతరులను అనుమతించకుండా తమ అనుకూల మీడియాకే అధికారం మొత్తం అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడి మంత్రి లోకేష్ ప్రసంగంలో రాజకీయాలకు, కులమతాలతకతీతంగా పాలన సాగిస్తామంటూనే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ బురద జల్లారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. స్వాతంత్య్ర వేడుకల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లా ఇన్చార్జి మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. కానీ లోకేష్ ప్రసంగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడిగా సాగింది. జిల్లా అభివృద్ధి గురించి పక్కన పెట్టారు. ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే ప్రారంభించారు. లక్షల ఉద్యోగాలు, అద్భుతమైన ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటూ త్రిశంకు స్వర్గాన్ని చూపించారు. లోకేష్ స్వోత్కర్షపై కొందరు అధికారులు ఇదేంటి అంటూ గుసగుసలాడారు. కార్యక్రమాన్ని కూడా అధికారులు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి. అయితే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్, జిల్లా అధికారులు కూడా హుందాగా వ్యవహరించలేదు. పలుమార్లు మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నించగా, వారిని గదమాయించే ప్రయత్నం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశ్రుతులు పోలీసు పరేడ్ మైదానం రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చిత్తడిగా మారింది. అధికారులు కూడా ఏర్పాట్టను అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఆహూతులు కూర్చునే వేదికల్లో కూడా నీరు చేరింది. శకటాలు ప్రదర్శన సందర్భంగా కొన్ని బురదలో కూరుకుపోయాయి. క్రేన్తో వాటిని బయటకు తీయించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. ప్రదర్శించిన కొందరు కూడా బురద కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. లోకేష్ రాగానే ఆయన కాన్వాయిని రోడ్డుకు అడ్డంగా నిలిపి మొత్తాన్ని బారికేడ్లతో మూయించారు. -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్థానాచార్యులు పొత్తూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదంగా పసుపుకుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మీ దేవి రూపు, కంకణం అందజేశారు. భ్రమరాంబ అమ్మవారు లక్ష గాజుల ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. -
మది నిండుగా.. తిరంగా పండుగ
నగరంపాలెం: నగరంలోని పోలీసు కవాతు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం సందడిగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశభక్తి గీతాలకు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తొలుత ప్రదర్శించిన జయహో.. జయ భారతీ జననీ వంటి దేశభక్తి గీతాలకు నృత్యాలు ఆహూతులను అలరించాయి. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్కు ప్రథమ బహుమతి, ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ పాఠశాలకు (బ్రాడీపేట) రెండో బహుమతి , శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలకు (లక్ష్మీపురం)తృతీయ బహుమతులు లభించాయి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్తేజ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు బహుమతులను అందించారు. అనంతరం నిర్వహించిన ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యాశాఖకు ప్రథమ బహుమతి, డీఆర్డీఏ, మెప్మాకు ద్వితీయ బహుమతి, జీఎంసీకి తృతీయ బహుమతులు లభించాయి. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయా శాఖల ఉత్పత్తులు, సామర్థ్యం వివరాలను అధికారులు, సిబ్బంది ఆయనకు వివరించారు. -
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు
రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి టౌన్: సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రినాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సీ్త్ర శక్తి పథకాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. సెప్టెంబర్లో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెనాలి డిపో నుంచి రోజుకు 17వేల మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు తెలియజేశారు. మహిళలు ఏదైనా ఐడీ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ కొడతారని వెల్లడించారు. ప్రభుత్వం నిద్దేశించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. తెనాలి నుంచి నందివెలుగు వరకు మహిళలతో విజయవాడ బస్సులో మంత్రి మనోహర్ ప్రయాణించారు. నందివెలుగు స్టాప్ వద్ద పల్లెవెలుగు బస్సులను ఆయన పరిశీలించారు. జీరో టికెట్ కొట్టారో లేదో బస్సులోని మహిళా ప్రయాణికులను ఆయన అడిగారు. తెనాలి బస్టాండ్ నుంచి విజయవాడకు తాము తీసుకున్న టికెట్కు డబ్బు చెల్లించామని మహిళలు చెప్పారు. దీంతో మంత్రి కండెక్టర్ను ప్రశ్నించగా, తమకు ఉన్నతాధికారులు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదని బదులిచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎ.రాజశేఖర్, తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వి.ఎం.లక్ష్మీపతిరావు, హెల్త్ ఆఫీసర్ మువ్వా ఏసుబాబు, పలువురు ఆర్టీసీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
త్యాగధనుల పోరాటంతోనే స్వాతంత్య్రం
పట్నంబజారు: త్యాగధనుల పోరాటాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు చెప్పారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజలు కోరుకున్న వారే పరిపాలకులుగా ఉండాలన్నది రాజ్యాంగం సు స్పష్టం చేసిందన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో ఎన్నికలు కుట్రలు, కుతంత్రాలతో జరిగాయని మండిపడ్డారు. పోలీసులు, పాలకులు, ఎన్నికల అధికారులు కుమ్మకై ్క ఓటింగ్ ప్రక్రియ జరపడం సిగ్గుచేటన్నారు. స్థానికంగా లేని వ్యక్తులను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందన్నారు. ప్రజలకు పూర్తి విషయాలు తెలియాలంటే వెబ్ కెమెరాల విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి సర్కార్ సూపర్ సిక్స్– సూపర్ హిట్ అని చెప్పటం విడ్డూరంగా ఉందని, సూపర్ సిక్స్ –సూపర్ ఛీట్ అని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో నేటి ప్రజాస్వామ్యం ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం అంటే దేశానికి పండుగ రోజని, మువ్వన్నెల జెండాను దేశ ప్రజలంతా ఎగురవేసి అమరవీరులను స్మరించుకోవాలన్నారు. నేడు రాష్ట్రంలో ఓటు వేసే స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందన్నారు. రిగ్గింగులు, బూత్ క్యాప్చర్ చేసి టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే స్వాతంత్య్ర దినోత్సవం అలంకార ప్రాయంగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉందని, కూటమి తప్పులను ఖండించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ వేడుక చేసుకునే గొప్ప పండుగ స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగమే మన స్వాతంత్య్రమన్నారు. నేటి యువత ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజానారాయణ, షేక్ గులాం రసూల్, వంగల వలివీరారెడ్డి, మండేపూడి పురుషోత్తం, కొత్తా చిన్నపరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, నందేటి రాజేష్, బూరెల నాంచారమ్మ, సురసాని వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలది ఓ దారి... ఎమ్మెల్సీది మరోదారి !
ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో టీడీపీ నేతల మధ్య మనస్పర్ధలు పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఎడ మొహం.. పెడ మొహంగా ఉన్నారు. బస్సుల ప్రారంభోత్సవానికి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎండీ.నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయవాడ సెక్టార్ వైపు బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవిలు డిపో–2 పరిధిలో బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న మేయర్ రవీంద్ర కూడా ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. కనీసం ఆర్టీసీ బస్టాండ్లో గంటకు పైగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పలకరించుకోకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండ్ వేదికగా వారి మధ్య మనస్పర్ధలు బయట పడ్డాయనే వాదనలు వినవస్తున్నాయి. -
దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
రైతులకు కడగండ్లు
కూటమి ప్రభుత్వ నిర్లిప్తతతో వాగులు, పంట కాల్వల నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం ● భారీ వర్షానికి గుంటూరు చానల్కు గండి ● నీట మునిగిన 10 వేల ఎకరాల పంట పొలాలు ● గత ఏడాది కూడా మూడు చోట్ల గండి ● కూటమి ప్రభుత్వ వైఫల్యం.. రైతులకు శాపం ● డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే.. ● భారీ వర్షం వస్తే టోల్గేట్ వద్ద జాతీయ రహదారి మునక ● ఏడాదిలో రెండుసార్లు మునిగినా పట్టించుకోని అధికార యంత్రాంగం కాలువ కట్టల బలోపేతంపై నిర్లక్ష్యం మొక్కుబడిగా తూటికాడ తొలగింపు తటాకాలను తలపిస్తున్న చెరువులు -
పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్లు ఇవి..
● రైలు నంబర్ (12603) చైన్నె–హైదరాబాద్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (12733) తిరుపతి–లింగంపల్లి రైలు పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ వయా గుంటూరు మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి నడుస్తుంది. ● (17015) భువనేశ్వర్–సికింద్రాబాద్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17232) నాగర్సోల్–నరసాపూర్ రైలు వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 18వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, స్టేషన్ల మీదుగా నడుస్తుంది. ● (17643) చంగల్పట్టు–కాకినాడ పోర్ట్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి మంగళగిరి, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17216) ధర్మవరం జంక్షన్–విజయవాడ రైలు గిద్దలూరు, మార్కాపూర్ రోడ్ స్టేషన్ల మీదుగా ఈ నెల 15వ తేదీ నుంచి నడుస్తుంది. ● (17255) నరసాపూర్–లింగంపల్లి రైలు నల్గొండ స్టేషన్ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి ప్రయాణిస్తుంది. ● (17256) లింగంపల్లి–నరసాపూర్ రైలు నెల 15వ తేదీ నుంచి మంగళగిరి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17625) కాచిగూడ–రేపల్లె రైలు విజయవాడ స్టేషన్ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి, (17212) యశ్వంత్పూర్ జంక్షన్–మచిలీపట్నం వయా గుంటూరు నుంచి కంభం స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది.సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితుడు రంజిత్ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్ అంగీకరించాడు. జగదీష్ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు జగదీష్ కారును అడ్డగించారు. పోలీస్ దుస్తులలో ఉన్న వారు విజిలెన్స్ అధికారులం అంటూ, జగదీష్ కారులో ఉన్న రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్ స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్ కోసం గాలిస్తున్నారు. -
ప్రతిష్టాత్మకంగా స్వాతంత్య్ర దినోత్సవం
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం కలెక్టర్తో పాటు, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో పాల్గొనడం అదృష్టంగా భావించాలని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకావిష్కరణ చేపట్టనున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్య అతిథులతో పాటు ఆహూతులు కూర్చునేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని తెలిపారు. వర్షాలు పడినప్పటికీ ప్రోగ్రాంలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకట్టుకునేలా శకటాలను రూపొందించాలని ఆదేశించారు. వేడుకలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12.15 గంటల వరకు జరుగుతాయని, అంతరాయం లేకుండా కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ట్రాఫిక్తో పాటు, పార్కింగ్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. మైదానం ప్రధాన గేటు ద్వారా కేవలం వీఐపీలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం మైదానం నలుమూలల కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ స్పెషల్ కలెక్టర్ గంగరాజు, సీపీఓ శేషశ్రీ , ఐసీడీఎస్ పీడీ జ్ఞాన ప్రసూన, అడిషనల్ ఎస్పీ హనుమంతు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
తుమ్మలపాలెం భేష్ !
● అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఓడీఎఫ్ ప్లస్ గ్రామం ● హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ పొందిన గ్రామంగా గుర్తింపు ● ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని సర్పంచ్కు ఆహ్వానం 178 ఇళ్లకు కుళాయిలు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి మోడల్ గ్రామంగా ఎంపిక -
వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
మంగళగిరి టౌన్ : తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అమృతధార బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ను పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ రాజ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే తల్లులు తమ చిన్నారులకు పాలు ఇవ్వడానికి సుమారు రూ. 1,50,000 విలువతో అమృతధార బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ను ఏర్పాటు చేశామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. తల్లులు ఈ క్యాబిన్లో సౌకర్యవంతంగా కూర్చొని బిడ్డలకు పాలిచ్చేందుకు రెండు సోఫాలు ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ క్యాబిన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, రోటరీ సేవలను కొనియాడారు. అనంతరం రోటరీ ప్రతినిధులు బాలింతలు, గర్భిణులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్రరావు, రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, కార్యదర్శి శ్రావణి, కోశాధికారి నగేష్, పాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి, క్లబ్ సభ్యులు శ్రీరామిరెడ్డి, కళ్ళం రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారి దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సహాయ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రేఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవా తపన కలిగిన భక్తులు, సేవాభావంతో ఉన్న దాతలు ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. తమ దరఖాస్తులను ఫారం–1 నమూనాలో పూర్తి చేసి ఈ నెల 5వ తేదీ నుంచి 20 రోజులలోపు స్వామివారి దేవస్థానం సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి వారి కారాలయములో సమర్పించాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల, సేవా కార్యక్రమాల విస్తరణ నిర్వహిస్తుందన్నారు. విజయపురిసౌత్: గత మూడు నెలలుగా నిలిచిపోయిన ఎంఎల్ అగస్త్య లాంచీ మరమ్మతులు పూర్తికావడంతో గురువారం నాగార్జున కొండకు ట్రయల్ రన్ నిర్వహించారు. గత ఆదివారం పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్లో అగస్త్య లాంచీ మరమ్మతు పనులను చేపట్టారు. అగస్త్య అందుబాటులోకి రావడంతో శ్రీశైలంతో పాటు నాగార్జున కొండకు పర్యాటకులను చేరవేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ కార్యక్రమంలో లాంచీ యూ నిట్ మేనేజర్ వినయతుల్లా,పులుసు వీరారెడ్డి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై మెరిసిన జెస్సీ
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందనలు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జూలై 24 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025లో సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, జెస్సీరాజ్ తన పతకాల జాబితాలో మరో మైలురాయిని చేర్చుకోవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీని జెస్సీ రాజ్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ముందుగా జెస్పీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ క్రీడా ప్రయాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోచ్ సింహాద్రిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, జెస్సీ విజయయాత్రలో నిరంతర ప్రోత్సాహం, నిబద్ధత కనబరుస్తున్న ఆమె తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. -
మూడు గ్రామాలకు రాకపోకలు బంద్
ఫిరంగిపురం: రెండురోజులగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని మూడు ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల కింద నీరు నిలిచి పోవడంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి నుదురుపాడు గ్రామం నుంచి కండ్రిక దారిలో ఉన్న రైల్వే అండర్బ్రిడ్జి గుంటూరు – నరసరావుపేట రహదారి నుంచి వేమవరం దారిలో ఉన్న రైల్వే అండర్బ్రిడ్జి. ఫిరంగిపురంలోని ఆరోగ్యనగర్, జగనన్న కాలనీల దారిలో ఉన్న బ్రిడ్జిల వద్ద వర్షపునీరు చేరింది. దీంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అండర్బ్రిడ్జి కింద నిలిచిన నీరు -
గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): భారీ వర్షాలకు గుంటూరు నగరం అతాలకుతలమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక పక్క శంకర్విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతుండటంతో అటుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులంతా కంకరగుంట ఫ్లై ఓవర్ మూడు వంతెనల మీదుగా రావాల్సి ఉంది. వాహనదాల రద్దీ అధికం కావటం, దీనికి తోడు మూడు వంతెనల కింద జలమయం కావటం, కంకరగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ సముద్రాన్ని తలపించేలా ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దీనితో కంకరగుంట బ్రిడ్జి పూర్తిస్థాయిలో వాహనాలతో నిండిపోయింది. హిందూ కళాశాల కూడలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్కు తీవ్ర అంతాయం కలగటంతో ట్రాఫిక్ పోలీసుల సైతం ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి సరేసరి. బస్సులు బయటకు వచ్చే క్రమంలో, ఆటోలు అక్కడే నిలిచిపోవటం, సిటి బస్సులు అక్కడే నిలబడిపోవటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కొత్తపేట శివాలయం వద్ద భగత్సింగ్ బొమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించింది. ఏటుకూరు రోడ్డు, పట్నంబజారు, ఏలూరు బజారు, పూలమార్కెట్ సెంటర్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరంలో సుమారు రెండు గంటలపైనే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసుల మరమ్మతులు... ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిన నేపథ్యం, కంకరగుంట ఫ్లై ఓవర్పై గుంటలు ఏర్పడిన క్రమంలో వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య చొరవ తీసుకున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు, ట్రాఫిక్ నెమ్మదిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే, సిబ్బందితో కలిసి బ్రిడ్జిపై ఉన్న గుంటల్లో ఇసుక, కంకరపోసి వాటిని పూడ్చారు. నగర పాలక సంస్థ అధికారులు బ్రిడ్జిపై గుంతలు పడుతున్నా.. పట్టించుకోకపోవటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వలన ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సీఐ సింగయ్య చొరవను అభినందించారు. ఒక పక్క శంకర్విలాస్ బ్రిడ్జి పనులు వర్షం నేపథ్యంలో నీట మునిగిన కంకరగుంట, మూడు వంతెనల అండర్పాస్లు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ -
రైతు బాధలు పట్టని ఎమ్మెల్యే నరేంద్ర
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): భారీ వర్షాలకు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నీట మునిగిన పంటలను బుధవారం పరిశీలించిన ఆయన గుంటూరు బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకాని – గోళ్లమూడి మధ్యనున్న గుంటూరు ఛానల్ నీట మునిగిందని, గతేడాదీ అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వందలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కలికంగా గండి పూడ్చే పనులు చేపట్టడంతో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు పొలాలు కొట్టుకుపోయినట్లు తెలిపారు. బుధవారం పంట పొలాలను పరిశీలిస్తే పొలాలు వలె లేవని, సముద్రం మాదిరి మారిపోయినట్లు చెప్పారు. గతేడాది నుంచి కూటమి ప్రభుత్వానికి ఈ కాల్వకు గండిపడుతుందని తెలిసి కూడా నల్లమట్టితో తూతూ మంత్రంగా పనులు ముగించారని ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు విత్తు పెట్టగా, గతంలో, ప్రస్తుతం వర్షాల ధాటికి కొట్టుకుపోయానని అన్నారు. కాకానిలోని తాగునీటి చెరువును స్థానిక టీడీపీ నేతలు చేపలు కోసం తాగునీటిని బయటకు పంపించారని, ప్రస్తుత వర్షాలకు మురుగునీరు చేరిందని చెప్పారు. ఈ చెరువును శుద్ధి చేయాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందేనని అన్నారు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతోనే నోటి వద్ద మంచినీటిని తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు నీట మునిగినా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఇవేమీ పట్టవని మండిపడ్డారు. పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో పంట పొలాలు కోసం తీసుకున్న అప్పులు తీర్చకముందే మరోసారి కురిసిన భారీ వర్షాలకు అప్పులు చేయకతప్పని పరిస్థితి నెలకొందన్నారు. ఆఖరికి జిల్లా స్థాయిలో ఒక్క అధికారి కూడా నీట మునిగిన పంట పొలాలు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. విత్తన ఖర్చు కింద రూ.10 వేలు, ఉచితంగా ఎరువులను పంపిణీ చేయాలని అన్నారు. పంట పొలాల్లో పర్యటించి, నీట మునిగిన పొలాల ఫొటోలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబొయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు భాను పాల్గొన్నారు. నీట మునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ -
పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
తెనాలిటౌన్: భారీ వర్షానికి చెరువుల్లా మారిన మాగాణి భూములను జిల్లా వ్యవసాయ అధికారి ఐ.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. గుంటూరు–తెనాలి వయా నందివెలుగు రోడ్డుమార్గంలోని రూరల్ మండల గ్రామాలైన హాఫ్పేట, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నీటి మునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటపొలాల్లో చేరిన వర్షపునీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపుకునేలా చూడాలని రైతులకు సూచించారు. రాబోయే రెండు రోజుల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని గుర్తుచేశారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. -
నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి
పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్నగర్లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్కు చెందిన నేలపాటి సురేష్బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. -
నేడు పాఠశాలలకు సెలవు
గుంటూరు ఎడ్యుకేషన్: భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి.రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు విధిగా సెలవు దినంగా పాటించాలని ఆదేశించారు. వరద ఉధృతిని పరిశీలించిన సబ్ కలెక్టర్ తాడేపల్లిరూరల్ : ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు బుధవారం ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య ఇరిగేషన్ శాఖ అధికారులతో కలసి కృష్ణానది పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని ఆమె ఆదేశించారు. వరద నీటిలోకి ఎవరూ దిగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల పాటు మార్కెట్ షాపుల బహిరంగ వేలం నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల బహిరంగ వేలం ఈ నెల 18, 19, 20 తేదీలలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల వల్ల వాయిదా పడిన షాపుల వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగినవారు పాల్గొనాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తరలింపు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): కృష్ణా నది పరీవాహక గ్రామాల్లోని ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి వంగలపూడి అనిత భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో కలక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రి వంగలపూడి అనిత తో మాట్లాడుతూ గుంటూరు చానల్ ఓవర్ ఫ్లో కారణంగా నంబూరులోని లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరినందున 150 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. తాడికొండ మండలం గరికపాడు, బేతాజ్పురంలలో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తున్నందున 75 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మందులు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో వర్షపాతం అధికంగా నమోదైందన్నారు. కొల్లిపర మండలంలో పంట నష్టం అధికంగా ఉందన్నారు. తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో బోటు తీసుకు రావడానికి వెళ్ళిన ముగ్గురు మత్య్సకారులలో ఇద్దరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని, ఎస్డిఆర్ఎఫ్ బృందం ద్వారా వారిని రక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గుంటూరు ఆర్డీగా డాక్టర్ శోభారాణి గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు. -
భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరుణుడు రైతుల ఆశలను నిలువునా ముంచేశాడు. కొద్దిగంటల సమయంలోనే విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి పది గంటల నుంచి ప్రారంభమైన వాన తెల్లవారుజాముకు తెరిపిచ్చి, అనంతరం బుధవారం సాయంత్రం మొదలుకొని గురువారం తెల్లవారు జాము వరకు కురుస్తూనే ఉంది. బుధవారం ఉదయం నాటికే జిల్లాలో సగటున 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చేబ్రోలు మండలంలో అత్యధికంగా 23.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, తెనాలి, పొన్నూరు పట్టణాలు అస్తవ్యస్తంగా మారాయి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ పలుమార్లు స్థంభించింది. పొంగిన వాగులు కాజా టోల్గేటు వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. టోల్ప్లాజా వద్ద మూడు అడుగుల వరకు నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్రవాహనాలు వెళ్లే లైన్తో పాటు మరో రెండు లైన్లను నిలిపివేశారు. దీంతో వాహనాలు నెమ్మదిగా పంపించే క్రమంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్గేటు వద్ద వున్న ఫుడ్ప్లాజా రెస్టారెంట్లోకి వర్షపు నీరు చేరింది. రాజధాని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది. నీరు పోయే మార్గం లేకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. లాం వద్ద కొండవీడువాగు పొంగడంతో ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఆడుకుంటూ వరదనీరు ప్రవహిస్తున్న డ్రైన్లో పడి నేలపాటి యోహన్(14) అనే బాలుడు మృతి చెందాడు. నీళ్లలో అండర్ బ్రిడ్జిలు.. ట్రాఫిక్ కష్టాలు గుంటూరు నగరంలో పలుప్రాంతాలు నీటమునిగాయి. మూడొంతెనలు, కంకరగుట్ట అండర్బ్రిడ్జిల వద్ద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కార్పొరేషన్ కార్యాలయంలోకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో మోటార్ల సాయంతో వాటిని బెయిల్ అవుట్ చేయాల్సి వచ్చింది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొద్ది గంటల్లోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం ఉప్పొంగిన వాగులు, వంకలు భారీగా నీట మునిగిన పంటలు జిల్లాలో 72,612 ఎకరాల్లో దెబ్బతిన్న వైనం పుట్టెటు కష్టంలో అన్నదాతలు జలమయంగా కాజా టోల్గేట్ గుంటూరు నగర రోడ్లపై భారీగా వర్షం నీరు.. ట్రాఫిక్ అంతరాయం మరో రెండురోజులు భారీ వర్షసూచన నంబూరులో వరదనీటిలో పడి బాలుడు మృతి జిల్లావ్యాప్తంగా జోరు వాన పొన్నూరులో వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. డీవీసీ కాలనీ, ఏడో వార్డు, పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. పెదకాకాని మండలంలో నంబూరు, గోళ్ళమూడి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వెనిగండ్ల చెంచుకాలనీ గుడిసెలను వర్షపునీరు చుట్టుముట్టింది. గుంటూరు ఛానల్(కొత్తకాలువ) పంట కాలువకు గండి పడటంతో నీరు పొలాల్లోకి చేరుతోంది. మంగళగిరి నగరంలో భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. నగర పరిధిలోని ఇందిరానగర్, కొత్తపేట, రత్నాలచెరువు, లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, బాపనయ్యనగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో నివాసితులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్ఆర్ఐ వైద్యశాల వద్ద రహదారి కోతకు గురికావడంతో రోడ్డుపైకి రెండు అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది. టిడ్కో గృహ సముదాయంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల పరిధిలో వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో అకాల వర్షానికి వరి, పత్తి, అపరాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రవాణా వ్యవస్థ స్థంభించింది. గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. చెరువులు, కుంటలు వరద నీటితో నింగిపోయా. పలు రోడ్లకు వర్షపు నీటితో రోడ్లు కొట్టుకు పోయాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో వేమవరం, కండ్రిక, ఆరోగ్యనగర్, జగనన్న కాలనీలకు వెళ్లే రైల్వే అండర్పాస్ల వద్ద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి పట్టణంలో మారీసుపేట, నందుపేట, ఐతానగర్, చినరావూరు. యడ్లలింగయ్య కాలనీ, బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, చెంచుపేట, ఇందిరానగర్ కాలనీ, ఉడా కాలనీ, పూలే కాలనీ తదితర ప్రాంతాలలోని పలు రోడ్లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. తెనాలిలో వరి పంట పెద్ద మొత్తంలో నీట మునిగింది. నియోజకవర్గంలో అన్నిచోట్లా వరిపైరు 30–40 రోజుల దశలో ఉంది. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షంతో దాదాపు 12 వేల ఎకరాల్లో వర్షపునీరు నిలిచింది. కొలకలూరు, హాఫ్పేట, ఖాజీపేట, నందివెలుగు, కఠెవరం, కంచర్లపాలెం, అంగలకుదురు, సంగం జాగర్లమూడితోపాటు కొల్లిపర మండలంలో పలుగ్రామాల్లో పంటలు నీట మునిగాయి. 71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునక కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు 71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో 11 మండలాల్లోని 88 గ్రామాల్లోని 28,437 మంది రైతులకు చెందిన వరి 62,275 ఎకరాలు, నాలుగు మండలాల్లో 16 గ్రామాలకు చెందిన 3,475 మంది రైతులకు చెందిన పత్తి 8,550 ఎకరాలు, రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 315 మంది రైతులకు చెందిన మినుము 787.5 ఎకరాల్లో నీట మునిగినట్లు గుర్తించారు. వర్షాలు తగ్గి నీరు బయటకు వెళ్లిన తర్వాత ఎన్యుమరేషన్ చేసి నివేదికను జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
నేను టీడీపీ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ని..!
సాక్షి, గుంటూరు: టీడీపీ జెండా పట్టుకుంటే చాలు.. ఎంతటి మోసం, అన్యాయం, అక్రమమైనా చేయొచ్చనే భావనతో పొన్నూరులో పచ్చ పార్టీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు కుడి భుజం(రైట్ హ్యాండ్) అని చెబుతూ తిరిగే తన భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు సార్లు, స్థానిక పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... పొన్నూరు మండలం అలూరు గ్రామానికి చెందిన తనకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం పౌల్రాజుతో ప్రేమ వివాహమైందని చెప్పారు. భర్త పంచాయితీ పనులకెళ్తూ, ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు కుడి భుజమని చెబుతున్నాడని పేర్కొన్నారు. కట్నకానుకల కింద పాండ్రపాడులోని రెండెకరాల పొలం, పది తులాల బంగారం తమవారు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం కొంత పొలాన్ని రూ.19 లక్షలకు విక్రయించి రాజకీయాల్లో తిరిగి ఖర్చు చేశాడని తెలిపారు. మరో ఎకరం విక్రయించేందుకు అంగీకరించకుంటే కాపురానికి రానివ్వ బోనని, తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎవరికై నా దీనిపై ఫిర్యాదు చేసినా చంపేస్తానని, తర్వాత స్టేషన్లో లొంగిపోతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పి తీవ్రంగా బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. గత నెల 11వ తేదీన మరణాయుధంతో దాడికి పాల్పడగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. భర్త వద్దనే తమ కుమార్తె కూడా ఉందని పేర్కొన్నారు. తనకు కుమార్తెను అప్పగించాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి తనను, తన వారిని కాపాడి న్యాయం చేయాలని కోరారు.ఆస్తుల కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు భర్త పలుమార్లు చెప్పాడని బాధితురాలు వివరించారు. తక్కువ కులం దానినంటూ నోటికొచ్చినట్లు ధూషించేవాడని వాపోయారు. చిత్రహింసలకు గురిచేయడంతోపాటు, తన కుటుంబ సభ్యులను ఇంటికి రానిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించేవాడు కాదని వాపోయారు. స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగొచ్చి, వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వేధించేవాడని తెలిపారు. -
‘క్విట్ ఇండియా’ అమరవీరులకు ఘన నివాళి
తెనాలి: క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలిలో 1942 ఆగస్టు 12న జరిగిన నిరసనలో పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన ఏడుగురు అమరవీరులకు మంగళవారం ఘన నివాళి అర్పించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన వీర సంస్మరణ దినోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహ, మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు రణరంగచౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు. ముందుగా అన్నాబత్తుని పురవేదిక నుంచి ర్యాలీగా బయలుదేరి రణరంగ్ చౌక్కు చేరుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసులు కవాతుగా తరలి వచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తదుపరి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విశేష సేవలందించిన ప్రముఖులకు, స్వాతంత్య్రోద్యమంలో అసువులుబాసిన వారి కుటుంబ సభ్యులకు సత్కరించారు. సత్కారం అందుకున్నవారిలో సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్ కోడలు షేక్ నూర్జహాన్, మరో సమర యోధుడి కుమారుడు షేక్ కరిముల్లా, డీ3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి.శారద, మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ, హెల్పింగ్ సోల్జర్స్ ఇనయతుల్లా, ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, మాజీ సైనికోద్యోగి అనంతగిరి ఏడుకొండలరావులు ఉన్నారు. నృత్యగురువులు ఎ.వెంకటలక్ష్మి, ఆరాధ్యుల తేజస్విప్రఖ్యల శిష్యబృందం వివిధ నృత్యాంశాలను, ‘మా తెలుగు తల్లి’ నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. స్తూపాల వద్ద నివాళులర్పించిన మంత్రి మనోహర్ బహిరంగ సభలో పలు రంగాల ప్రముఖులకు సత్కారం -
భౌతికంగా దూరమై.. ఔదార్యంతో సజీవమై..
గుంటూరు మెడికల్: బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం గ్రామానికి చెందిన ముద్దన వెంకటరావు (62) ఈ నెల 9వ తేదీన పర్చూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం జీవన్దాన్ సంస్థ ప్రతినిధులకు తెలిపింది. వారు రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. వెంకటరావు అవయవాలు మరో ఐదుగురి ప్రాణాలను కాపాడగలవని తెలిపారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి అవయవాలు సేకరించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి వాటిని అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. కాలేయం, ఒక మూత్రపిండాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. మరో కిడ్నీని విజయవాడ విజయా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న రోగికి అమర్చారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు కళ్లను తరలించారు. అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అభినందించారు. అవయవాల సేకరణ, గ్రీన్ చానెల్ ద్వారా వాటిని సంబంధిత ఆసుపత్రులకు చేరవేయడాన్ని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మమత రాయపాటి, బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్ చౌదరి మాట్లాడుతూ, ఆగస్టు నెలలో బ్రెయిన్డెడ్ అయిన ముగ్గురి నుంచి అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు విజయవంతంగా మార్పిడి చేసి ప్రాణాలు కాపాడామన్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవయవ దానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు అవసరమైన ఐదుగురికి అమర్చడంతో వారికి పునర్జన్మ -
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. మంగళవారం స్థానిక డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఈ వేడుకలు స్థానిక పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అతిథులకు సీటింగ్తోపాటు, ఆహుతులు కూర్చునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకునేవిధంగా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిభింబించే విధంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్లో ప్రజలు కొనుగోలు చేసేవిధంగా ఉత్పత్తులను సరిపడా ఉంచాలన్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం గడ్డిపాడు రైల్వే గేటు నుంచి తొమ్మిది అడుగులు వెడల్పు, పది కిలో మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో ర్యాలీ చేపడతామన్నారు. రాలీలో అందరూ పాల్గొనే విధంగా చూడాలన్నారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
‘ప్లాస్టిక్’ అనర్థాలపై చైతన్యం పెరగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై అందరూ చైతన్యం పెంచుకోవాలని, పర్యావరణ ఏపీ అందరి లక్ష్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టులో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ క్లైమెట్ యాక్షన్ ప్లాన్–అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్’ను మంగళవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యా, రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల్లో చైతన్యవంతమైన గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలకడం గొప్ప విషయమన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకులను అందించిన, ఆచార్య నాగార్జునుని బోధనలతో చైతన్యవంతమైన నేల ఇదని అన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. అందరూ ఇళ్లలో ప్లాస్టిక్ వినియోగం నిలిపివేస్తేనే భావి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించగలమన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రపంచ తలసరి ప్లాస్టిక్ వినియోగం సగటున 28 కిలోలు ఉండగా, దేశంలో 11 కిలోలుగా ఉందని చెప్పారు. దేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై 2021లో చేసిన చట్టం ద్వారా గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం వలన వాటిలోని హానికారకమైన రంగులు, రసాయనాలతో భూమితోపాటు నీటి నాణ్యత క్షీణిస్తోందని తెలిపారు. విద్యార్థులతో ప్రారంభించిన ఈ ప్రచారం ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సేవకులు, పౌర సమాజం ఉమ్మడి లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భాగస్వాములైన అందరి కృషిని అభినందించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు శ్రీకారం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు అవగాహన కల్పించనున్న విద్యార్థులు మొదటి దశలో రాష్ట్రంలోని 52 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు 50 వేల గృహాలను దత్తత తీసుకుంటారని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం పది గృహాలను సందర్శించి వాయు, నీటి కాలుష్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగించకుండా చూడటం, ఘన వ్యర్థాలను వేరు చేయడంతోపాటు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తారని అన్నారు. రాష్ట్రంలోని 172 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి లక్ష మంది యూత్ రెడ్క్రాస్ వలంటీర్ల భాగస్వామ్యంతో 10 లక్షల గృహాలను దత్తత తీసుకోవడం లక్ష్యమన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. కార్యాచరణ ప్రణాళికతో ప్రాజెక్టు రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీదా, కోశాధికారి పి. రామచంద్రరాజు ఈ ప్రాజెక్టు రూపకల్పన, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనికి విశేష కృషి చేసిన పి.రామచంద్రరాజును గవర్నర్ అభినందించారు. గుంటూరులోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో రూపొందించిన వీడియో గీతం ఆహూతులను ఆకట్టుకుంది. విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్లాల్, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్, ఎమ్మెల్యేలు ఎండీ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బి.రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ వడ్లమాని రవి, వలంటీర్లు, విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గంజాయి కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
నగరంపాలెం: గంజాయి కేసుల్లో చిక్కిన నిందితులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని పదిహేడు పోలీస్స్టేషన్లల్లో 2016–24 వరకు నమోదైన 113 కేసుల్లో సీజ్ చేసిన 1,868 కిలోల గంజాయి (ఆకు), 2,233 లీటర్ల లిక్విడ్ గంజాయి, 0.023 గ్రాముల ఎండీఎం, ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాలను దహనం చేశామని తెలిపారు. నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో మంగళవారం ఈగల్ సెల్ ఎస్పీ నగేష్కుమార్, జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ రవికుమార్తో కలిసి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటిదాకా 44 కేసులు నమోదవ్వగా, 143.96 కిలోల పొడి గంజాయి, 1.172 లీటర్ల ద్రవ గంజాయి, 500 గ్రాముల హైడ్రో గంజాయి, ఇతరత్రా మాదక ద్రవ్యాలను తక్కువ పరిమాణంలో స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసుల్లో 219 మంది నిందితులకు 173 మందిని అరెస్టు చేశామన్నారు. వీరంతా 14– 40 ఏళ్లులోపు వయసు వారు అని చెప్పారు. 107 మంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనని అన్నారు. గంజాయి సంబంధిత నేరాలకు పాల్పడే వారికి శిక్షలు విధించేందుకు పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం ఉందన్నారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై ఈ చట్టం కింద ఒక ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ఈగల్ సమన్వయంతో సోదాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రెండుకుపైగా కేసుల్లో నిందితులుగా ఉన్న 82 మందిని గుర్తించగా.. పది మందికి జియో టాగింగ్ పెట్టామని చెప్పారు. తద్వారా వారెవరితో కలుస్తున్నారు, ఎక్కడకెళ్తున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నామని అన్నారు. ఒడిశా, మల్కాన్గిరి నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 36 మాదకద్రవ్య దుర్వినియోగ హాట్స్పాట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాలపై నిఘా ఉందన్నారు. నగర, శివార్లల్లో నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన భవనాలు, నిర్మాణాలను కూల్చివేయాలని జీఎంసీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యుత్ లేని ప్రదేశాల్లో దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపామని అన్నారు. ఈగల్ సెల్ విభాగం ఎస్పీ నగేష్బాబు మాట్లాడుతూ ఇప్పటిదాకా 68 వేల కిలోల గంజాయి సీజ్ చేశామన్నారు. వాటిని ధ్వంసం చేసేందుకు జిల్లాల్లో బృందాలను నెలకొల్పామని అన్నారు. ఈగల్ ఏర్పాటయ్యాక గంజాయి నిర్మూలనకై ఎన్ఫోర్స్మెంట్తోపాటు డ్రగ్స్ వద్దు బ్రో, సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ ఎన్నారై స్టడ్స్ వంటి నూతన అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇటీవల తెనాలిలో కొన్ని హాట్స్పాట్ను పరిశీలించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంటుందని అన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు రాజశేఖర్రెడ్డి (డీటీసీ), విక్టర్ (ఈగల్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో ఓబులునాయుడుపాలెం సమీపంలోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లో గంజాయి తదితరాలను దహనం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరిక ఈగల్ సెల్ సమన్వయంతో విస్తృత సోదాలు చేస్తున్నట్లు వెల్లడి రెండుకుపైగా కేసుల్లో నిందితులైన వారిపై ‘జియో ట్యాగింగ్’ నిఘా గతంలో పట్టుబడిన గంజాయిని దహనం చేసిన పోలీసులు -
‘హర్ ఘర్ తిరంగా’
డీఆర్ఎం కార్యాలయంలో లక్ష్మీపురం: ప్రతి పౌరుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుదేష్టసేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతి పౌరుడు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారి త్యాగాలను మరువకూడదన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరూ హర్ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు. అనంతరం పట్టాభిపురం డీఆర్ఎం కార్యాలయం నుంచి గుంటూరు రైల్వేస్టేషన్ వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్ కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హానూర్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్, డీసీఎం కమలాకర్ బాబు, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పీఎఫ్ సైలేషన్ కుమార్, డివిజన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభించిన డీఆర్ఎం సుదేష్ట సేన్ -
చంద్రబాబు జేబు సంస్థగా ఈసీ
వైఎస్సార్ సీపీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి ధ్వజం పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల సరళిలో టీఎన్ శేషన్ ఎంతటి శక్తివంతమైన చర్యలు తీసుకువచ్చారో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎస్ఈసీ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తున్నాయన్నారు. వైఎస్సార్ సీపీని మానసికంగా బలహీనపరిచేందుకు కూటమి ప్రయ త్నిస్తోందన్నారు. ఈవీఎంలతో చంద్రబాబు గెలిచాడనే భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. పులివెందులతో జడ్పీటీసీ ఎన్నికలకు గెలిచి సాధించేంది ఏముందీ.. అని ప్రశ్నించారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు పోటీ చేసే వారా అని ప్రశ్నించారు. పులివెందుల ఎన్నికల రభసలో రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎన్నికల కమిషన్దే తప్పని స్పష్టం చేశారు. తొత్తుల్లా పని చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా, ఇప్పటికే హెచ్చరించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసుతో ఓటు గెలుచుకోవాలి గానీ, భయపెట్టి కాదని హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కచ్ఛితంగా అధికారంలో వస్తుందని, ఇప్పుడు తొత్తులుగా పనిచేసిన వారందరికీ గుణపాఠం తప్పక చెప్తామన్నారు. -
చిన్నారులపై ఔదార్యం చూపండి
గుంటూరు వెస్ట్: సమాజంలో ఏ పాపం చేయకపోయినా అనాధలుగా జీవించే వారిపట్ల ఔదార్యం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారితో కలిసి కలిసొచ్చే కాలానికి – నడిచొచ్చే పిల్లలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. సమాజంలో ఎవరైనా చిన్నారులను పెంచుకోవాలి అనుకున్న వారికి హోమ్స్లో ఉన్న 6–18 సంవత్సరాల వయస్సున్ను వారిని తాత్కాలికంగా తొలి 6 నెలలు తమ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చన్నారు. ఇద్దరికీ నచ్చితే మరో ఆరు నెలలు ఇలా 2 సంవత్సరాల వరకు పెంచుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో దత్తత తీసుకునే వీలుంటుందని వెల్లడించారు. దీనికిగాను బిడ్డ ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4000 అందజేస్తుందన్నారు. దీనివలన అనాధలకు తల్లిదండ్రులు, గార్డియన్స్ లభిస్తారని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఐసీడీఎస్ పీడీ ప్రసూన మాట్లాడుతూ కలెక్టర్ అధ్యక్షతన ఏడుగురు కమిటీ సభ్యులు దత్తత కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
సమర దీప్తి... తెనాలి స్ఫూర్తి
దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో తెనాలివాసుల సాహసం, బ్రిటిష్ పోలీసులపై చూపిన తెగువ, బలిదానం జాతీయ స్థాయిని సైతం ఆకర్షించాయి. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితమైంది. తెనాలి: స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరలు దేశం విడిచివెళ్లాలనే నినాదమే ‘క్విట్ ఇండియా’. 1942 ఆగస్టు 8న ముంబయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సంఘం కార్యవర్గం ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపునకు యావత్ భారతం వెంటనే స్పందించింది. ఆగస్టు 9న దేశంలోని అనేక నగరాల్లో హర్తాళ్ జరిగింది. ముంబయి సమావేశంలో పాల్గొన్న తెనాలి ప్రముఖులు కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామిలు 11వ తేదీన తిరిగొచ్చారు. ఆ రోజే ఇక్కడి ఓల్ట్ టౌన్లోని వెర్రెయ్య గారి మేడలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 12న తెనాలి పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. నాయకులను అరెస్టు చేశారు. కాంగ్రెస్వాదులు, తెనాలి తాలూకా హైస్కూలు, భారత్ ట్యుటోరియల్ కాలేజీ విద్యార్థులు పట్టణ బంద్కు సిద్ధమయ్యారు. ఆగస్టు 12న తెల్లవారేసరికి తెనాలి జనసంద్రమైంది. కల్లూరి చంద్రమౌళి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్నపనేని వెంకట్రావు, కార్యదర్శి రావి అమ్మయ్య నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు బంద్లో పాల్గొన్నారు. రైల్వేస్టేషనులో విధ్వంసం రైల్వేస్టేషను సమీపంలోని బంద్ పాటించని హోటల్కు ప్రదర్శకులు వెళ్లి సామగ్రిని బయటపడేశారు. రైల్వేస్టేషనులో పండ్లదుకాణం, హోటల్నూ మూయించారు. అక్కడే స్పెన్సరు క్యాంటీనులో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నార్త్ క్యాబిన్ దగ్గర్లోని ఆయిల్ ట్యాంకరుకు నిప్పటించారు. ఉవ్వెత్తున ఎగసిన మంటలకు ఉద్వేగ భరితులైన ప్రదర్శకుల దృష్టి ప్లాట్ఫాం పక్కన ఆగివున్న గూడ్స్ వ్యాగన్లపై పడింది. రెండు వ్యాగన్లలోని షాహి డక్కన్ సిగరెట్ల బండిల్స్ను ప్లాట్ఫాంపై వేసి తగులబెట్టారు. మరో రెండు వ్యాగన్లలోని విదేశీ మద్యం సీసాలు గల కార్టన్లను, ఇంకో వ్యాగనులోని నూలు కండెల్ని తగులబెట్టారు. ఈలోగా మరో బృందం బుకింగ్ ఆఫీసులోకి ప్రవేశించింది. అక్కడి టికెట్లను, నగదును గుట్టగా పోసి దహనం చేశారు. నగదును ఎవరూ ముట్టుకోలేదు. అప్పటికి మద్రాసు నుంచి పూరి ప్యాసింజరు రైలు వచ్చి ప్లాట్ఫాంపై ఆగింది. ప్రయాణికులు దిగాక నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి ఉద్యమకారులు నిప్పంటించారు. -
ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఢీల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ హన్స్రాజ్ గంగరామ్ అహీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 63 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యా, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల పరిరక్షణకు తగిన చొరవ చూపాలన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో నీట్ సీట్ల భర్తీ విషయంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. దేశంలో 52శాతానికి పైగా జనాభా కలిగిన ఓబీసీల సాధికారిత కోసం ఓబీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఓబీసీల్లోని అన్ని కులాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేసేలా చూడాలని కోరారు. ఆయనవెంట ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్ సింగ్, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, సంఘ నాయకులు ఉరిటి అశోక్కుమార్, ముంగమూరి హైమారావు, ఖాసీం పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి
పట్నంబజారు: నగరంలో శంకర్విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కంకరగుంట అండర్పాస్, బ్రాడీపేట 4వ లైను, శంకర్విలాస్ సెంటర్, డొంకరోడ్డు, మూడు వంతెనలు, రంగాబొమ్మ సెంటర్, కొత్తపేట శివాలయం సెంటర్, భగత్సింగ్ సెంటర్, డీమార్ట్, నాజ్ సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డు, ఎంటీబీ సెంటర్లలో బైక్పై ఆయన పర్యటించారు. వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏ అశోక్కుమార్లకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిలవకుండా సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వాహనదారులకు సమన్వయంతో ట్రాఫిక్ డైవర్షన్ల గురించి వివరించాలని, వారు తప్పక పాటించేలా చూడాలని ఆదేశించారు. సహనంతో విధులు నిర్వర్తించాలి ట్రాఫిక్ నెమ్మదించినా.. కొద్దిపాటి ఇబ్బందులు కలిగినా.. సహనం పాటించాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. వ్యాపార సముదాయాల వారు తమ కస్టమర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వాహనదారులు రోడ్డుపై కాకుండా నిర్ణీత పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపేలా చూసుకోవాలన్నారు. మళ్లింపులకు సంబంధించి సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సీఐలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అవసరమైన చోట సిబ్బందిని అధికంగా కేటాయించటం, ముఖ్యమైన కూడళ్లపై దృష్టి సారించాలన్నారు. వెంట అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్ ఎస్సై సాంబశివరావునాయక్ తదితరులు ఉన్నారు. -
గురువుపై మూల్యాంకన బరువు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు విద్యాశాఖ విషయంలో కూటమి సర్కారు తీరు ఉంది. అర్థంపర్థం లేని నిర్ణయాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులపై పెనుభారం మోపింది. అసెస్మెంట్ పుస్తకాలు అంటూ కొత్త పరీక్షల విధానం తీసుకొచ్చి సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు మరింత దిగజారుస్తోంది. దీనిపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్స్ గందరగోళానికి తెర తీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యాసంవత్సరం పొడవునా నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల ప్రశ్నలకు జవాబులు రాసేందుకు విద్యార్థులకు ఇస్తున్న ఆన్సర్ షీట్ విధానంలో మార్పులు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా అసెస్మెంట్ బుక్ను ప్రవేశపెట్టింది. గుంటూరు జిల్లాలోని 965 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు 90 వేల మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పుస్తకాలకు మూల్యాంకనం నిర్వహించడం ఉపాధ్యాయులపై పెనుభారంగా మారనుంది. సింగిల్ టీచర్ ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో గురువులకు ఇబ్బంది తప్పదు. అలాగే ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులు ఉంటే మూల్యాంకనానికే రోజుల తరబడి సమయం పడుతుంది. 450 మంది విద్యార్థులు ఉన్న హైస్కూళ్లలో హిందీ సబ్జెక్టు బోధనకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటంతో పేపర్ కరెక్షన్కు 10 రోజుల సమయం పట్టనుంది. అధిక బరువు కారణంగా మూల్యాంకనం పాఠశాలలోనే చేయాల్సి ఉంది. ఫలితంగా సిలబస్ బోధించేందుకు ఇబ్బందులు తప్పవు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికి అధిక సమయం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బోధనపై దృష్టి సారించేందుకు సమయం సరిపోని పరిస్థితి ఉంటుంది. మరోవైపు హోలిస్టిక్ కార్డులను కూడా పూరించాలి. అసెస్మెంట్ బుక్స్ విధానం గందరగోళంగా ఉంది. విద్యార్థుల్లో స్వయం ఆలోచన, సృజనాత్మతను దూరం చేసేలా పరీక్షల నిర్వహణ ఉంది. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. పుస్తకాలను రద్దు చేసి, పూర్వ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలి. ఎఫ్ఏ పరీక్షలకు రాసిన సమాధానాలు అదే పుస్తకంలో చూసి ఎస్ఏ పరీక్షలకు కూడా రాసే పరిస్థితి ఉంది. – కె. బసవ లింగారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎఫ్ఏ –1, ఎఫ్ఏ –2 పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. ఎఫ్ఏ పరీక్షలకు రాసిన జవాబులు పుస్తకంలోనే ఉండటంతో తిరిగి వాటినే చూసి రాసేందుకు వీలుంటుంది. తద్వారా విద్యార్థులకు నష్టం కలగనుంది. ఈ పుస్తకాలను విద్యాసంవత్సరం పొడవునా పాఠశాలల్లో భద్రపర్చడం సమస్యగా మారనుంది. అవసరమైన సదుపాయాలు చాలాచోట్ల లేవు. ఏ ఒక్క పుస్తకం పోయినా విద్యార్థికి సమస్యగా మారనుంది. సంస్కరణల పేరుతో తీసుకున్న ఈ నిర్ణయంపై ముందుగా ఉపాధ్యాయులకు కనీసం అవగాహన కల్పించలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ తరహా నిర్ణయాలను విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దడం తగదన్నారు. దీనిపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
దళిత, గిరిజనులకు నేటికీ స్వాతంత్య్రం రాలేదు
మంగళగిరి టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ దళిత, గిరిజనులను స్వాతంత్య్రం రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, దళిత్ సోషల్ ముక్తిమంచ్ జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధి టిప్పర్ల బజారులోని కేవీపీఎస్ (కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం) గుంటూరు జిల్లా 6వ మహాసభ ఆదివారం రాత్రి నిర్వహించారు. సామాజిక న్యాయం అంశంపై జరిగిన సెమినార్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా దళిత ఉద్యమానికి కంచుకోట అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరు జిల్లాలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ దళిత, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లో పాలకులు లేరన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదానీకి భూములు అప్పగించడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీ–4 పథకం ఓ చెత్త పథకమన్నారు. అనంతరం 15 మందితో కూడిన కేవీపీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వై.కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ ప్రకాష్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, లూదర్ పాల్, సహాయ కార్యదర్శులుగా దుర్గారావు, రమేష్లను ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నేతాజీ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యాదర్శి ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్ : స్థానిక శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ‘ఏపీ క్లైమెట్ యాక్షన్ క్యాంపెయిన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ’ ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో వేంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని సందర్శించిన కలెక్టర్ సీటింగ్ ఏర్పాట్లపై అధికారులతో పాటు రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో జేసీ ఏ.భార్గవ్తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైబీ రామారావు, కోశాధికారి పి. రామచంద్రరాజు, తూర్పు మండల తహసీల్దార్ సుభానీ ఇతర అధికారులు పాల్గొన్నారు.మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ రాజీనామా ఆమోదంచీరాల: చీరాల మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ శిఖాకొల్లి రామసుబ్బులు గత నెల 14న తన పదవికి రాజీనామా చేస్తూ కమిషనర్కు లేఖను అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన రామసుబ్బులు వైస్ చైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామాపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు. త్వరలో వైస్ చైర్మన్–2ను భర్తీ చేస్తామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో పలు సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.సెలవు దినాల్లో గ్రీవెన్స్ ఉండదుతాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ప్రభుత్వ సెలవు దినాలలో జరగదని కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు, ఆ రోజు కార్యక్రమం ఉందన్నారు. రాజధాని రైతులు, భూ యజమానులు తమ వినతులు, ఫిర్యాదులు ఆన్లైనన్లో పరిష్కారం పోర్టల్ ద్వారా ఎప్పుడైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు.కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తీవ్రనష్టంయడ్లపాడు: కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దేశానికి తీవ్ర నష్టమని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు హెచ్చరించారు. రైతు ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత పోపూరి రామారావు 6వ వర్ధంతి, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సభ స్థానిక పీఆర్ విజ్ఞాన కేంద్రంలో నూతలపాటి కాళిదాసు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కేశవరావు మాట్లాడుతూ పోపూరి రామారావుతో సుదీర్ఘకాలం రైతు ఉద్యమంలో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సేవలను స్మరించుకున్నారు. ఆలోకం పెద్దబ్బాయి, ప్రొఫెసర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.బాలిక వివాహాన్ని నిలిపివేసిన అధికారులుఊటుకూరు(క్రోసూరు) : ఊటుకూరు గ్రామంలో సోమవారం మైనర్ వివాహం జరుగుతుందన్న సమాచారం మేరకు ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ ఎం.వెంకటలక్ష్మీ, ఎంపీడీవో రవికుమార్ వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 19 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలని తెలిపారు. బాల్యవివాహ నిరోధక చట్టం ప్రకారం పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరు శిక్షార్హులేనని అన్నారు. ఈ సందర్భంగా తల్లిని, మేనమామను బైండోవర్ చేశారు. -
నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు పరిష్కారం
నగరంపాలెం: కన్న కొడుకే ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఓ మాతృమూర్తి వాపోయింది. ఈ మేరకు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అలకించారు. ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. నిర్ణీత గడువు లోగా చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం చూపవద్దని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా డీఎస్పీ), శివాజీరాజు (సీసీఎస్) అర్జీలు స్వీకరించారు. భారత్పేట వద్ద ఓ అపార్ట్మెంట్లో రెండు ప్లాట్లు వేర్వేరుగా కొనుగోలు చేశాం. ఓ వ్యక్తి ఇనిస్టిట్యూట్ కంటూ రెండు ప్లాట్లు అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో నెల నెలా అద్దె చెల్లించేవాడు. అయితే ఇనిస్టిట్యూట్కు విద్యార్థులు రావడంలేదనే సాకుతో అద్దె చెల్లించడం మానేశాడు. అయితే ఆ రెండు ప్లాట్లను వేరే వారికి అతను అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. అదేమని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. ఖాళీ చేయడం లేదు.. న్యాయం చేయగలరు. – కాలేషావలి, కుమారి, ప్లాట్ల యజమానులు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ -
ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా బోధనపై శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా విల్ టు కెన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ ఆంగ్లభాషా బోధన శిక్షణ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులకు 40 రోజుల ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విల్ టు కెన్ డైరెక్టర్ రామేశ్వర్గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి తెలుగులో మాట్లాడినంత సులభంగా ఆంగ్లంలో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే విద్యాశాఖ సహాయంతో తొలుత విశాఖ, అన్నమయ్య జిల్లాలో శిక్షణను విజయవంతంగా ముగించామన్నారు. ఆన్లైన్ ద్వారా 9 జిల్లాల్లోని 18 వేల మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష బోధనపై శిక్షణ అందించామన్నారు. ఇంతకు ముందు తెలంగాణలోనూ సైతం 53 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఏపీలోనూ అదే స్ఫూర్తితో శిక్షణ కొనసాగిస్తున్నట్టు వివరించారు. గుంటూరులో మూడు జిల్లాలకు చెందిన సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇందుకు సహకరించిన డీఈవో, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై యుద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటిస్తూ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రరాజు ఆదివారం తెలిపారు. గుంటూరు అర్బన్ పరిధిలో అన్ని యాజమాన్యాల్లోని 540 పాఠశాలల్లో 3వ తరగతి నుంచి టెన్త్ వరకు చదువుతున్న 50 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ చేపట్టిన ‘‘వార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’ ప్రాజెక్టును ఈనెల 12న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభించనున్నారని వివరించారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులతో పర్యావరణానికి వాటిల్లుతున్న హాని, కాలుష్యాన్ని నివారించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారి ఉపయోగించుకుని రోడ్డు పక్కన పడవేసే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేకరించేందుకు ప్రాజెక్టు ద్వారా రూపకల్పన చేశామని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘‘వార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’ ప్రాజెక్టుకు రూపకల్పన ఈనెల 12న గుంటూరులో ప్రారంభించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ -
లైవ్స్టాక్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిగా అనిల్కుమార్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ లైవ్స్టాక్ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కోశాధికారిగా గుంటూరుకు చెందిన చప్పిడి అనిల్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న అనిల్కుమార్ను నాన్గెజిటెడ్ వెటర్నరీ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సేవానాయక్, జిల్లా చైర్మన్ రాజమోహన్, ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ సుందర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూర్షరీఫ్, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్, ఇతర సంఘ నేతలు అభినందనలు తెలిపారు.పశ్చిమ డెల్టాకు 6,908 క్యూసెక్కులు విడుదలదుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 6,908 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 290, బ్యాంక్ కెనాల్కు 1,820, తూర్పు కాలువకు 664, పశ్చిమకాలువకు 285, నిజాంపట్నం కాలువకు 460, కొమ్మూరు కాలువకు 3,060 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజి నుంచి సముద్రంలోకి 50,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.మొక్కజొన్న వ్యాపారిని మోసం చేసిన తండ్రీకొడుకులుతెనాలిరూరల్: మొక్కజొన్న, జొన్నల వ్యాపారం చేసే తండ్రీకొడుకులు నంద్యాలకు చెందిన వ్యాపారిని మోసం చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ చెంచుపేటకు చెందిన గోగినేని సత్యనారాయణ, అతని కొడుకు శ్రీకాంత్ మొక్కజొన్న, జొన్నల వ్యాపారాలు చేస్తుంటారు. నంద్యాలకు చెందిన వ్యాపారి శ్రీనివాస్ వద్ద రూ.20 లక్షలు తీసుకుని సరుకు ఇవ్వకుండా మోసం చేశారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా తెలిపారు.గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతిజె.పంగులూరు: మండలంలోని రేణింగవరం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పర్వతరెడ్డి వెంకటస్వామి (52) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వెంకటస్వామి రేణింగవరం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం చిన్నగంజాం మండలం సోపిరాల. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ప్రజాభీష్టం మేరకు బ్యాలెట్ విధానం మంచిదే
గుంటూరు ఎడ్యుకేషన్: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పరిణామమేనని, ఈ విషయంలో ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరులో నగరం బృందావన్గార్డెన్స్లో రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ నివాసానికి వచ్చిన జానారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్సీ కేతావతు శంకర్నాయక్లు అనారోగ్యానికి గురైన శివాజీని పరామర్శించారు. ఈసందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ మిత్రుడు శివాజీని కలుసుకోవడం ఆనందంగా ఉందని, రైతాంగ సమస్యలపై ఆయనతో కలిసి పని చేశానని గుర్తు చేశారు. యువతరం రాజకీయాల్లోకి రావాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలంటే అందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ఈవీఎంలను బ్యాలెట్ పేపర్తో మార్చడంలో తప్పులేదన్నారు. తెలంగాణ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గుంటూరులో రాజ్యసభ మాజీ సభ్యుడు శివాజీకి పరామర్శ -
పోరాటానికి, క్రమశిక్షణకు మారుపేరు యూటీఎఫ్
యూటీఎఫ్ సీనియర్ నాయకుడు జోజయ్య గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటానికి, క్రమశిక్షణకు యూటీఎఫ్ మారుపేరుగా నిలిచిందని యూటీఎఫ్ సీనియర్ నాయకుడు కె.జోజయ్య అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ 52వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించిన జోజయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ నిజాయతీకి, త్యాగానికి నిలయం అన్నారు. ఆవిర్భావం మొదలు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సంఘాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ●మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ సంస్కరణల రూపకల్పనలో అకడమిక్ అంశాలతో పాటు, ఉపాధ్యాయుల కృషి, సమాజ భాగస్వామ్యంలో రావలసిన మార్పులపై దృష్టి పెట్టాలని అన్నారు. ●మరో సీనియర్ నాయకుడు జి.ప్రభుదాస్ చెన్నుపాటి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ యూటీఎఫ్లో పని చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తల్లో ఆ స్ఫూర్తి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సీపీఎస్ కన్వీనర్ సీహెచ్ ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బి. ప్రసాదు ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్ రాష్ట్ర కౌన్సిలర్ బి.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘తొలితరం తెలుగు రచయిత్రులు’ పుస్తకావిష్కరణ
నగరంపాలెం: స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య సీహెచ్.సుశీలమ్మ రచించిన తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ నిర్వహించారు. కేంద్ర సాహితీ అకాడమి అనువాద పురస్కార గ్రహీత పి.సత్యవతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు అంకితం చేసి సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో గ్రంథాన్ని విశ్లేషిస్తూ కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగించారు. ఈ పుస్తకంలో వితంతు, సీ్త్రల బాధలను, వాటి వెనుకనున్న సామాజిక దుర్మార్గాన్ని, అస్పృశ్యత, అంటరానితనం, అగ్రవర్గ దురహంకారం వంటి అనేక విషయాలను ప్రస్తావించడం విశేషమని అన్నారు. ఈ పుస్తకంలో 1902 నుంచి 1955 వరకు రచించిన కథ, రచన చేసిన 25 మంది కథారచయిత్రుల రచనలను పరిచయం చేయడంతో పాటు రచయిత్రుల జీవన రేఖలను అందించడం మంచి విశేషమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకావిష్కరణ సత్యవతి, సుశీల, రచయిత్రి అతిథులను సత్కరించారు. -
అంగన్వాడీలకు యాప్సోపాలు
నెహ్రూనగర్: అంగన్వాడీ కార్యకర్తలు యాప్లతో ఆపసోపాలు పడుతున్నారు. పాత ఫోన్లలో ముఖ చిత్ర గుర్తింపునకు పడరానిపాట్లు పడుతున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా ముఖ చిత్ర గుర్తింపు చేయాల్సిందే. అలా చేయకుండా ఆహార పదార్థాలను అందించలేరు. యాప్లు సరిగ్గా పనిచేయకపోవడంతో సకాలంలో ముఖ చిత్ర గుర్తింపు ప్రక్రియ జరగకపోవడంతో ఇటు లబ్ధిదారులు, అటు అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు పడలేని అంగన్వాడీ కార్యకర్తలు ఇటీవలే గుంటూరు అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రాథమిక విద్యా బోధనకు ఆటంకం అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 12 రకాల రికార్డులు నిర్వహించాల్సి వస్తోంది. లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నమోదు చేసే రికార్డులు (ఎస్ఎన్ఎన్), ఫ్రీ స్కూల్ అడ్మిన్ విద్యార్థుల వివరాలు ప్రతి నిత్యం విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. వాటితోపాటు పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రిజిస్టర్, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్ గృహ సందర్శకుల రికార్డులు నిర్వహించాలి. వీటితోపాటు నెలవారీ ప్రాజెక్టు (ఎంటీఆర్), ఆయా అంగన్వాడీల పరిధిలోని గ్రోత్ రికార్డు, గ్రోత్ చార్టులతోపాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించి టేక్ హోమ్ రేషన్ పంపిణీ రికార్డు, స్టాప్ అడ్మిషన్ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. పని ఒత్తిడి వల్ల పిల్లలకు ప్రాథమిక విద్య బోధించేందుకు సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. పనిచేయని పాత ఫోన్లు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు పాతవి కావడంతో నెట్వర్క్ కష్టాలు అధికంగా ఉంటున్నాయి. మొబైల్స్ ర్యామ్ తక్కువగా ఉండటంతో తక్షణమే యాప్ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ నమోదులో ఆలస్యమైతే అధికారుల వేధింపు ఎక్కువయ్యాయని వాపోతున్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న బాలలకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల వద్ద పోషకాహారం ఇచ్చేవారు. ఎక్కువ మంది తమకు ఇంటి వద్దకే పోషకాహారం కావాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో టీహెచ్ఎర్ (టేక్ హోమ్ రేషన్)గా మార్చారు. పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు దఫాలుగా అందిస్తున్నారు. ఇవన్నీ పంపిణీ చేయాలంటే వారందరి పూర్తి వివరాలను పోషణ యాప్ ద్వారా రెండుసార్లు నమోదు చేయాల్సి ఉంది. టీహెచ్ఆర్ కోసం ఒకే లబ్ధిదారును రెండుసార్లు ముఖ యాప్ ద్వారా గుర్తించాల్సి రావడం కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. నెలలో ఎక్కువ సమయం ఈ పనికే వినియోగించడం వల్ల చిన్నారుల ప్రాథమిక విద్య బోధనకు ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. బాలింతలు, గర్భిణుల గుర్తింపునకు అవస్థలు లబ్ధిదారుల ముఖ గుర్తింపునకు ముప్పుతిప్పలు పాత ఫోన్లతో తలనొప్పులు నెట్ వర్క్ లేక బాలసంజీవని, పోషణ ట్రేకర్ అప్లోడ్ సమస్య 5జీ ట్యాబ్లు ఇవ్వాలి అంగన్వాడీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన ఫోన్లలో ప్రస్తుత యాప్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఒక పక్క లబ్ధిదారుల ఫేక్ క్యాప్చర్ జరిగితేనే పౌష్టికాహారం ఇవ్వాల్సి ఉంది. యాప్లు పనిచేయక పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలి. దీంతో అంగన్వాడీలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి 5జీ ట్యాబ్స్ ఇవ్వాలి. – దీప్తి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగని పోషకాహార పంపిణీ -
రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా రమేష్ బాబు
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఆదివారం గుంటూరులోని ఏపీ ఎన్జీఓ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి 13 ఉమ్మడి జిల్లాల నుంచి ప్రభుత్వ డ్రైవర్లు హాజరయ్యారు. కేంద్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్న సంసాని శ్రీనివాసరావు పై వచ్చిన అనేక ఆరోపణలు, అవినీతి కార్యకలాపాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న సభ్యుల సమస్యలు పరిష్కారం చేయనందున అవిశ్వాసం ప్రకటించి శ్రీనివాసరావును సంఘ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘ అధ్యక్షుడిగా పి. రమేష్ బాబును నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంసాని శ్రీనివాసరావుకి ప్రభుత్వం కల్పించిన ఓడీ సదుపాయాన్ని రద్దు చేయాలని కోరుతూ తీర్మానించారు. రమేష్ బాబును గుంటూరు జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు , స్టేట్. వైస్ ప్రెసిడెంట్. షేక్ నాగూర్ షరీఫ్, సిటీ అధ్యక్షుడు సూరి, ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్ కాన్ఫిడేషన్ జాతీయ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
హామీల అమలు ఎప్పుడో చెప్పాలి
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యాయనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన ఎస్టీయూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో డీఏలు ఇస్తామని, మెరుగైన వేతన సవరణ చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలును ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ●సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ బోధనేతర పనులు మితిమీరి, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీని ప్రభావం బోధనపై పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే సీపీఎస్ విధానం రద్దు చేయాలని, తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ●ఏఐఎస్టీఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు మాట్లాడుతూ 2003–డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదోతరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ●ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యమాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ●సంఘ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రకరకాల యాప్ల పేరుతో టీచర్లు బోధనేతర పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ●సంఘ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదరి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి పొదుపు చేసుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ ఖాతాల నుంచి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యస్. రామచంద్రయ్య, షేక్ మహబుబ్ సుభాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ప్రసాదరావు, పల్నాడు, బాపట్ల జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్వీ రామిరెడ్డి, యు.చంద్రజిత్ యాదవ్, బడుగు శ్రీనివాస్, జి.అమర్నాథ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వి.భిక్షమయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అలవలపాడు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. రేణింగవరం పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఇంకొల్లు మండలం హనుమోజీ పాలేనికి చెందిన అత్తులూరి ధనుంజయరావు (45) భార్య మహోన్నతితో కలిసి గ్రామం నుంచి మోటార్ సైకిల్పై కొరిశపాడు మండలం బొడ్డువాని పాలెం గ్రామంలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి జాతీయ రహదారి వెంబడి హనుమోజిపాలెం బయలు దేరారు. అలవలపాడు వద్ద క్రాస్ రోడ్డు దాటుతుండగా, గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న దంపతులు కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు గాయలు కాగా ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మృతుడు చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునికి పనిచేస్తున్నారు. సంఘటనపై ఎస్సై వినోద్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. -
టేక్..డైవర్షన్..
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): దశాబ్దాల చరిత్ర ఉన్న గుంటూరులోని శంకర్విలాస్ ఓవర్బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు. ఈ నెల 9వ తేదీన బ్రిడ్జి కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావటంతో కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలకు సెలవులు రావటంతో పెద్దగా ట్రాఫిక్ ప్రభావం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో సోమవారం నుంచి ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. కొద్ది నెలల కిందట మూడు వంతెనలు పనులు జరిగిన నేపథ్యంలోనే ట్రాఫిక్కు ఎంత అంతరాయం ఏర్పడిందో నగర ప్రజలకు తెలియంది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్కుమార్ ఆదేశాలు మేరకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డైవర్షన్లు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కిడికక్కడ బారికేడ్లతో రోడ్లును మూసి, డైవర్షన్ తెలిపేందుకు సిబ్బందిని కూడా కేటాయించారు. అలాగే డైవర్షన్ తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా స్టేషన్ల నుంచి డిప్యూటేషన్లపై సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణకు రంగంలోకి దించారు.శంకర్విలాస్ ఓవర్బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు -
రూ.కోటి విరాళం ఇచ్చి మరీ..
పుణ్యకార్యం నిరంతరం కొనసాగేందుకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రూ.కోటి అందించారు. ప్రేమగా, రుచిగా భోజనం పెట్టేందుకు సొంత ట్రస్ట్ ‘మధురాన్నం’ ద్వారా సేవలు అందిస్తున్నారు. రోజూ రెండు పూటలా ఇక్కడ వంట వండుతున్నారు. రోజూ 1,000 –1,500 మందికి భోజనం పెడుతున్నారు. ఒకేసారి 300 మంది కూర్చుని తినొచ్చు. మధ్యాహ్నం 12 – 2, రాత్రి 7– 8.30 గంటల వరకు భోజనం పెడతారు. రోగులకు, వారి సహాయకులకు, వార్డులో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత పాస్ ఇస్తారు. ఈ పాస్ చూపితే జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ ఎదురుగా ఉన్న మధురాన్నం సొసైటీ భోజనశాలలో ఉచితంగా భోజనం పెడతారు. ఈ తరహా సేవా కార్యక్రమంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ కొనసాగుతోంది. అన్నం, పప్పు, పచ్చడి, రసం, మజ్జిగ, సాంబారు, కూర వడ్డిస్తారు. పది మందికి పైగా సిబ్బంది ఇంటి భోజనాన్ని మరిపించేలా రుచికరమైన ఆహారాన్ని వండి పెడుతున్నారు. ప్రతినెలా సుమారు రూ. 10 లక్షల వరకు దీనికోసం మాజీ మంత్రి ఖర్చు పెడుతున్నారు. -
మధురాన్నం.. మా రాజు!
అన్నదానం.. ఎంతో పుణ్యకార్యం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెడితే రెండు చేతులెత్తి నమస్కరిస్తారు. ఇలా ఒకరికి కాదు... ఒక పూట కాదు... ఎంత మందికై నా, ఎన్ని రోజులైనా ఉచితంగా భోజనం పెట్టేందుకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చల్లని మనస్సుతో ముందుకొచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి గుంటూరు జీజీహెచ్ వేదికగా నిలిచింది. ఈ పుణ్యకార్యాన్ని ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆ సేవలు ఎందరికో కడుపు నింపాయి. గుంటూరు మెడికల్: కరోనా.... ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోయింది. మూడేళ్లపాటు లక్షలాదిమంది ప్రాణాలు బలి తీసుకున్న ఆ మహమ్మారి సమయంలో ఆకలి కేకలు పట్టించుకునే వారు కూడా లేరు. మరో పక్క రోగాలతో చికిత్స పొందుతున్న వారికి సహాయకులుగా వచ్చి పట్టెడు అన్నం దొరక్క ఎంతో మంది నిత్యం ఆకలితో అలమటించారు. ఆ సమయంలో పెద్దాయన మనస్సు చలించింది. తాను జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉండి వారి ఆకలి తీర్చలేకపోతే ఎలా అంటూ ముందుకొచ్చారు. కరోనాను లెక్కచేయకుండా రోగుల సహాయకులకు ఉచిత భోజనం దగ్గరుండి పెట్టించారు. మధురాన్నం సొసైటీ పేరుతో 2021 జులై 4న ప్రారంభించిన ఆ మహత్తర పుణ్యకార్యం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఐదో ఏడాదిలోనూ అమూల్య సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత భోజనశాల ఏర్పాటు గుంటూరు జీజీహెచ్కు రోజూ ఐదు జిల్లాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది ఓపీ వైద్య విభాగానికి చికిత్స కోసం వస్తున్నారు. ఒక్కో రోగికి తోడుగా ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగులకు ప్రభుత్వం ఉచితంగా భోజనం పెడుతుంది. సహాయకులు బయటే తినాలి. కరోనా సమయంలో జీజీహెచ్లో పరిస్థితిని పరిశీలించేందుకు నాటి జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వచ్చారు. నాడు ఆయన చూసిన దృశ్యాలే నేడు రోగుల సహాయకుల భోజనశాల ఏర్పాటుకు, ఉచిత భోజనం పెట్టేందుకు నాంది పలికాయి. అప్పుడు హోటళ్లు మూసివేయడం, ఇళ్ల నుంచి ఆస్పత్రులకు వచ్చేందుకు ఆంక్షలు ఉండటంతో రోగుల సహాయకులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్పత్రిలో రూ.25 లక్షలతో నిర్మించిన ఏపీఎన్జీఓ భవనం వినియోగంలోకి రాకుండా ఉండటం ఆయన దృష్టికెళ్లటంతో వారితో సంప్రదించారు. ఓ మంచి పనికి తమ భవనం ఉపయోగపడుతుందని అసోసియేషన్ నేతలు ఆనందంగా అంగీకారం తెలిపారు. మాజీ మంత్రి దగ్గరుండి రోగుల సహాయకుల భోజనశాల నిర్మాణ పనులు చేయించారు. వేడిగా ఆహార పదార్థాలు ఉండేలా కోయంబత్తూరు నుంచి వంటి సామగ్రిని రప్పించారు. అత్యాధునిక సౌకర్యాలతో భోజనశాల సిద్ధమైంది. నిత్యం ఇంటి భోజనాన్ని తలపించేలా వేడిగా భోజనం వడ్డిస్తున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు ఉచిత భోజనం గుంటూరు జీజీహెచ్లో నాలుగేళ్లుగా కార్యక్రమం మధురాన్నం సొసైటీ పేరుతో పంపిణీ ప్రతి రోజూ వెయ్యి మందికిపైగా లబ్ధి ఇంటి భోజనాన్ని తలపించేలా జాగ్రత్తలు ఐదో వసంతంలోకి మహోన్నత సేవలు -
ఆర్టీసీ డిపోలో వసతుల కల్పనకు కృషి
తెనాలిఅర్బన్: ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి ఆర్టీసీ డిపోను ఆదివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. విజయవాడకు 19, గుంటూరుకు 34 సర్వీసులను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్ ఎ.రాజశేఖర్ పాల్గొన్నారు.కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీతెనాలి: కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదివారం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పచ్చ కామెర్లకు చికిత్స తీసుకుంటున్న రోగితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30–40 మంది రోగులతో మాట్లాడానని, వారంతా ఆసుపత్రిలో వైద్యసేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. రోగనిర్ధారణకు వినియోగించే సీటీ స్కాన్ చెడిపోయి చాలా కాలమైనా కొత్త పరికరం ఏర్పాటు చేయకపోవటం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఘనంగా దివ్యబలిపూజవిజయపురి సౌత్: ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో జీవించాలని సాగర్మాత ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాల సాగర్ ఉద్బోధించారు. ఆదివారం సాగర్మాత దేవాలయంలో జరిగిన దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తోటివారిని ప్రేమించటం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఏసుప్రభువును ఈ ప్రపంచానికి అందించిన దివ్యమూర్తి మేరిమాత అని కొనియాడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో జరిగిన తేరు ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు.దుర్గమ్మ ఆలయానికి విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ ఆలయానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు ఇచ్చారు. గుంటూరు పట్టాభిపురానికి చెందిన విజయ్ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని అందజేశారు. డోనర్ సెల్కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన బాలా ప్రగడ ఎన్ఎస్ కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది.హోరాహోరీగాఅథ్లెటిక్స్ పోటీలుచీరాల: అంతర్ జిల్లాల 36వ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు స్థానిక వీఆర్ఎస్వైఆర్ఎన్ కళాశాలలో హోరాహోరీగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో 1500 మంది బాలబాలికలు పాల్గొన్నారు. చీరాలలో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడంతో తిలకించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. బాపట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వారి కష్టాలు చూసే ‘ఉచిత భోజనం’
గుంటూరు జీజీహెచ్కు ఐదు జిల్లాల రోగులు వైద్యం కోసం వస్తున్నారు. కరోనా సమయంలో రోగుల సహాయకులు భోజనం కోసం పడుతున్న అవస్థలు చూశాను. సహాయకులకు తృప్తిగా ఉచిత భోజనం పెట్టాలని ఆనాడే అనుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. – మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇంటి భోజనంలా ఉంది నేను వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మా బంధువు బుజ్జి వద్ద ఉంటున్నాను. ఆసుపత్రిలో ఉచిత భోజనం పెడుతున్న విషయం తెలుసుకుని ఇక్కడే తింటున్నాను. ఇంటి భోజనంలా ఉంది. మధురాన్నం నిర్వాహకులకు ధన్యవాదాలు. – పూనం వెంకట్రావు, భద్రాచలం ఎంతో రుచికరం నా కుమారుడు నరేంద్ర జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉంటున్న నాకు బయటకు వెళ్లి భోజనం కొనుక్కునే స్థోమత లేదు. ఆసుపత్రిలో ఉచిత భోజనం పెడుతున్నారని తెలుసుకుని, ఇక్కడ తింటున్నాను. భోజనం రుచికరంగా బాగుంది. – చుక్కా పోలమ్మ, 113 త్యాళ్లూరు ● -
బౌద్ధస్తూపం పరిరక్షణకు చర్యలేవీ?
భట్టిప్రోలు: భట్టిప్రోలులోని అతి ప్రాచీన బౌద్ధస్తూపం సరైన ఆలనాపాలన లేకుండా నిరాదరణకు గురవుతోంది. బుద్ధుని అస్థికలపై ఏర్పాటు చేసిన ఈ స్ధూపంపై చాలామంది కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఆటలాడుతున్నారు. దాదాపు 3 వేల సంవత్సరాల క్రితం భట్టిప్రోలు వాణిజ్య, విద్యా కేంద్రంగా విరాజిల్లింది. రాష్ట్రంలోని అన్ని బౌద్ధ స్తూపాల్లోకెల్లా ఇది అతి పురాతనమైనది. మౌలిక వసతులు కరువు బౌద్ధస్తూపం అభివృద్ధి పనులు ఎలా ఉన్నా.. దీనిని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. స్తూపం ముందు భాగంలో గార్డెనింగ్పై దృష్టి సారించిన పురావస్తు, ఆర్కియాలజీ శాఖాధికారులు వసతుల కల్పన విషయాన్ని విస్మరించడం శోచనీయం. ఇంత వరకు అండర్ పోర్షన్ మాత్రమే పూర్తయింది. శిలాఫలకానికే పరిమితం బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా భట్టిప్రోలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2016 మే 19న శ్రీకారం చుట్టింది. స్తూపం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జేతవనం ప్రాజెక్ట్) ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో 40 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం, బోటు షికారు, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకం అలానే ఉంది. పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పాముల సంచారంతో భయం బౌద్ధక్షేత్రం తిలకించేందుకు పర్యాటకులు వచ్చినప్పుడు పాములు కనిపించడంతో పరుగులు తీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్షేత్రం నిర్వాహణపై అధికారుల పట్టింపు కరువైంది. ఆవరణ అంతా పిచ్చి గడ్డి పెరిగింది. వర్షం కురిస్తే ఆవరణలో భారీగా నీరు నిల్వ ఉంటోంది. ఎంతో విశిష్టత కలిగిన భట్టిప్రోలు బౌద్ధ ఆరామం అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతం సందర్శకులకు కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు -
రైల్వే శాఖలో శ రవేగంగా అభివృద్ధి
తెనాలి టౌన్: దేశంలోని విమానాశ్రయాలకు దీటుగా రైల్వే శాఖను శ రవేగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తెనాలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.27 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ముందుగా ఒకటో ప్లాట్ఫాంపై పనులను పరిశీలించారు. ప్రయాణికులను అడిగి స్టేషన్లో సౌకర్యాలు ఆరా తీశారు. నూతనంగా వేసిన టైల్స్ నాసిరకంగా ఉండటాన్ని గుర్తించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రూ.12 కోట్ల నిధులతో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, 3 లిఫ్ట్లు, ఆరు ఎస్కలేటర్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 25వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. రైళ్లకు స్టాప్ కోసం ప్రయత్నాలు పల్నాడు ఎక్స్ప్రెస్కు గుంటూరు నుంచి తెనాలి వరకు ఎక్స్టెన్షన్ చేపట్టే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. సంగమిత్ర ఎక్స్ప్రెస్కు తెనాలి స్టాప్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందే భారత్ రైలుకు కూడా తెనాలిలో స్టాప్ అడుగుతున్నట్లు చెప్పారు. రైల్వే మంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టేషన్ ముందు తూర్పు భాగంలో మరిన్ని ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉందని వివరించారు. వెహికల్ పార్కింగ్కు అనువుగా పనులు చేపడతామని తెలిపారు. పనుల నాణ్యతలో రాజీపడేది లేదని అన్నారు. కొన్ని డిజైన్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ పరిసరాల్లో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్లు కొందరు మంత్రి దృష్టికి తీసుకురాగా.. చర్యలు తీసుకోవాలని ఆర్పీఎఫ్ సీఐను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, సెంట్రల్ సీనియర్ డివిజనల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అడిషనల్ జనరల్ మేనేజర్ ఎస్ఏకే బాషా, బాపట్ల ఏడీఈఎన్ కె.శ్రీనివాసరావు, సీపీడబ్ల్యూఐ – తెనాలి జి.కిరణ్బాబు, స్టేషన్ మేనేజర్ టి.వెంకటరమణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్టు
సత్తెనపల్లి: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇరువురుని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారన్నారు. పార్కు రోడ్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను కొట్టి గాయపరిచి ఆమె మెడలో రూ.3.42 లక్షలు విలువ చేసే 36.3 గ్రాముల బంగారు గొలుసు అపహరించి రెండు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడం జరిగిందన్నారు. పలు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా చైన్స్నాచింగ్ చేసే దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి పూర్తి బంగారం రికవరీ చేశామని, రెండు మొబైల్ ఫోన్లు, హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ స్వాధీన పరుచుకున్నామన్నారు. ఇరువురిని కోర్టుకు హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. మరొకడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసు ఛేదించిన పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్ఐ పవన్కుమార్, ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు లు అందించటం జరుగుతుందన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు, పట్టణ ఎస్ఐ పవన్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : జిల్లా పికిల్ బాల్ అసోసియేషన్, ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా చీఫ్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 19 బాల బాలికలతోపాటు ఓపెన్ విభాగంలో 35+, 50+, 60+ పురుషులు, మహిళల విభాగాల్లోనూ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను చిగురుపాటి రవీంద్ర బాబు, జీవీఎస్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు. -
4,61,955 మందికి పంపిణీ
జిల్లాలోని 148 కాలేజీలు, 1,480 అంగన్వాడీ కేంద్రాలు, 1,677 పాఠశాలల్లో 4,61,955 మంది 19 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వీరందరికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశాం. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్లో భాగంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 12న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నాడు మాత్రలను మింగని వారికి ఈ నెల 20న మాప్–అప్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలను మింగేలా చూస్తాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు. -
అంతిమ ప్రయాణం
రహదారి ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పుట్టెంట్రుకలు తీయడానికి ఆలయానికి వెళ్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చాగల్లు వద్ద ట్రాలీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇలా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు/మాచవరం: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతుల కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణకు పుట్టెంట్రుకలు తిరుమలలో తీయించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో కలిసి 11 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలో ముందు వెళుతున్న ట్రాలీ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. తర్వాత వారి వాహనం బోల్తాకొట్టింది. కుటుంబం కకావికలం... చిన వెంకటేశ్వర్లు, సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిడుగురాళ్లలో చిన వెంకటేశ్వర్లు వెల్ఫేర్ అసిస్టెంట్గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ సంతోష జీవితం గడపాల్సిన సమయంలో ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. చిన వెంకటేశ్వర్లు తన కుమారుడు, భార్య, తల్లిని పోగొట్టుకున్నారు. సుభాషిణి తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. చిన వెంకటేశ్వర్లు వదిన కూడా చనిపోయింది. రైలులో వెళ్లాలని భావించినా.. ముందు తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. రైలు అయితే ఇబ్బందులు ఉండవని చిన వెంకటేశ్వర్లుకు సోదరుడు చెప్పాడు. కానీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని, కారులో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.. అని పేర్కొనడంతో పిడుగు రాళ్లకు చెందిన గంగరాజు తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. 9 గంటలకు బయలుదేరారు. మధ్యలో టీ తాగేందుకు ఆగారు. మళ్లీ బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. రైలులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదని మిగతా కుటుంబసభ్యులు, బంధువులు వాపోతున్నారు. మృతదేహాలు అప్పగింత... ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలలో వెంకట నరసమ్మ, సుభాషిణి, తేజస్విని అభినయ్ కృష్ణ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతులందరూ ఒక్క కుటుంబానికి చెందిన వారే బాలుడి పుట్టెంట్రుకలు తీయడానికి వెళ్తుండగా దుర్ఘటన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి కూడా మృత్యువాత ఘోర ప్రమాదంతో కకావికలమైన కుటుంబం మృతుల వివరాలివీ... ప్రమాద స్థలిలోనే చిన వెంకటేశ్వర్లు తల్లి వెంకట నరసమ్మ (55), భార్య సుభాషిణి (30)లు మృతి చెందారు. చిన వెంకటేశ్వర్లు కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణ (3)ను కావలి ఏరియా వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఆయన వదిన రుక్మిణమ్మ (35) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మామ యర్రం శ్రీనివాసరావు (58) నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శ్రీనివాసరావు స్వస్థలం గణేశునిపాడు పక్కనే ఉన్న అగ్రహారం గ్రామం. -
ఆర్వోబీ నిర్మాణంలోహైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
గుంటూరు ఎడ్యుకేషన్: నగరంలోని శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే కూల్చివేత పనులు ప్రారంభించిన అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని బెటర్ శంకర్విలాస్ ఫ్లయ్ ఓవర్ సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) కన్వీనర్ ఎల్ఎస్ భారవి అన్నారు. శనివారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ.. పనుల్లో నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సేతు బంధన్ ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన కేంద్రం విధించిన నిబంధనలను పాటించకుండా, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా కూల్చివేత పనులు చేపట్టారని అన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ఇరువైపులా 12 అడుగులతో కూడిన రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన అధికారులు కోర్టును సైతం తప్పుదారి పట్టించారన్నారు. హైకోర్టు స్టే ఎత్తివేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరండల్పేట, బ్రాడీపేటలను కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ముందుగానే రైల్వేగేటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ చేసిన సూచనలు బుట్టదాఖలు చేశారన్నారు. జేఏఈ కో–కన్వీనర్ ఎన్వీ కమల్కాంత్ మాట్లాడుతూ ఈ నెల 20న న్యాయస్థానం విచారణ జరిపి, తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పనులు ప్రారంభించేశారని చెప్పారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధి వల్లూరి సదాశివరావు, అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు పాల్గొన్నారు. ఏకలవ్యుడు, సేవాలాల్ మహరాజ్, బి.ఆర్.అంబేడ్కర్, వెన్నలకంటి రాఘవయ్య, చెంచులక్ష్మి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. -
శంకర్విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు నగరంలోని శంకర్విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులను ఆర్ అండ్ బీ శాఖాధికారులు శనివారం ప్రారంభించారు. ఉదయం నుంచే జేసీబీలతో శంకర్విలాస్ వైపు నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. దాదాపు 70 ఏళ్లుగా నగరంలో ప్రజా రవాణాకు కీలకంగా మారి, సేవలందించిన ఈ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించడంతో స్థానికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితోపాటు బాటసారులు, ఆటో కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. బ్రిడ్జితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని, అక్కడకు వచ్చి సెల్ఫీలు తీసుకుని జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించిన అధికారులు సాయంత్రం వరకు నిరంతరాయంగా పనులు చేయించారు. నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.బాలచాముండేశ్వరి అమ్మవారికి గాజులతో అలంకారంఅమరావతి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని అమరేశ్వరాలయంలోని బాల చాముండేశ్వరి దేవిని శనివారం గాజులతో శ్రావణ లక్ష్మీగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రేఖ మాట్లాడుతూ బాల చాముండేశ్వరి దేవికి అలంకరించిన గాజులను రేపటి నుంచి ముత్తయిదువలకు పంపిణీ చేస్తామన్నారు.దుర్గమ్మకు కానుకగా బంగారు కాసుల పేరుఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.ఐదు లక్షల విలువైన బంగారు కాసుల పేరును కానుకగా అందచేశారు. గుంటూరు దేవపురానికి చెందిన జీఎన్ కామరాజ్ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈవో శీనానాయక్కు బంగారం, పగడాలు, కెంపులతో తయారు చేయించిన 48 గ్రాముల కాసుల పేరును అందచేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.నాగార్జున కొండకుపర్యాటకులు రాకవిజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీరి ద్వారా లాంచీస్టేషన్కు 45,000 రూపాయల ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.నేడు తెరుచుకోనున్న సాగర్ క్రస్ట్ గేట్లువిజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ఆదివారం మళ్లీ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు తెరవనున్నారు. ఉదయం 5 గంటలకు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ సీజన్లో గేట్లు రెండో సారి తెరవనున్నారు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకు సాగర్ నీటి మట్టం 589.80 అడుగులు ఉండగా, ఇది 311.4474 టీఎంసీలకు సమానం. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
సంతమాగులూరు (అద్దంకి): భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనలో ఆమెను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. ఈ దారుణం సంతమాగులూరు మండలం ఏల్చూరులో శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన సల్లూరి సుబ్బమ్మ, మేరిబాబుకు ముగ్గురు సంతానం. ఆమె తన భర్తతో గొడవల కారణంగా పదేళ్ల నుంచి విడిపోయి అదే గ్రామంలోని తన అన్న గేరా ఆంజనేయులు ఇంటి వద్ద తన ముగ్గురు పిల్లలతోపాటు నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమార్తె కృష్ణకుమారిని, వారం రోజుల కిందట చీమకుర్తి మండలంలోని మంచికలపాడుకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. తన ఇద్దరు అబ్బాయిల్లో సల్లూరి రవీంద్రబాబు తొమ్మిదో తరగతి, సల్లూరి నాగాంజనేయులు ఆరో తరగతి చదువుతున్నారు. వీరిరువురు అద్దంకిలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సల్లూరి సుబ్బమ్మ (35), చిన్న కుమారుడు నాగాంజనేయులు తమ ఇంటి బయట అన్నం తింటున్నారు. భర్త మేరీబాబు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని కత్తితో తల మీద నరికాడు. ఆమె కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చేసరికి అతను అక్కడ నుంచి పారిపోరయాడు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు నాగాంజనేయులు తన మామయ్య గేరా ఆంజనేయులుకు సమాచారం అందించాడు. క్షతగాత్రురాలిని 108 అంబులెన్స్లో నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలలో ఉంచారు. మేరీబాబు తన భార్యతో విడిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఆమె వద్దకు మందు తాగి వెళ్లి ఆమైపె అనుమానంతో ఘర్షణ పడుతుండేవాడని తెలుస్తోంది. వైద్యశాలకు తరలిస్తుండగా మృతి -
ప్రజలకు అందుబాటులో ఆలూరి బైరాగి సమగ్ర సాహిత్యం
తెనాలి: మహాకవి ఆలూరి బైరాగి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా మాజీ ఎంపీ, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. బైరాగి సాహిత్యాన్ని సమగ్ర సంకలనం తెస్తామని చెబుతూ, బైరాగి రచనలన్నింటినీ అంతర్జాలంలో చేర్చే బాధ్యతను తీసుకోవాలని తెనాలి రచయిత ముత్తేవి రవీంధ్రనాథ్ను కోరారు. హిందీ, తెలుగు సాహిత్య ధృవతార ఆలూరి బైరాగి శతజయంతి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో బైరాగి కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన తెనాలి అయితానగర్లో ఏర్పాటు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శనివారం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహదాత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తానీరోజున ఈ స్థాయిలో ఉండటానికి కారణం బైరాగి అన్నారు. ఆయన రాసే కవిత్వం కోసం జనం అప్పట్లో ఎదురు చూశారని సోదాహరణంగా చెప్పారు. తెలుగు స్వతంత్ర పత్రిక ప్రతి సంచిక మొదటి పేజీలో బైరాగి కవితతోనే వచ్చిందన్నారు. తెలుగులో ఎంతగొప్ప కవిత్వాన్ని సృజించారో, హిందీలోనూ అంతే గొప్పగా కవిత్వం రచించిన ఏకై క కవి బైరాగిగా చెప్పారు. బైరాగి శత జయంతి సందర్భంగా సదస్సులు నిర్వహించి ఆయన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తన ప్రసంగంలో బైరాగి తెనాలిలో జన్మించడం గర్వకారణమన్నారు. ‘అరసం’జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెనాలి ప్రాంతం వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు కేంద్రమని చెప్పారు. ప్రపంచంలో ఇంత చిన్న పట్టణంలో వేలాది రచయితలు, కవులు, కళాకారులు ఉండటం అరుదైన అంశమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండ్ల మాధవరావు తన ప్రసంగంలో బైరాగి స్మారకంగా ఆయన సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఇస్తున్న ఆలూరి బైరాగి అవార్డును ఇటీవల తనకు ప్రదానం చేయటం అదృష్టమన్నారు. మరో ప్రముఖ రచయిత వెన్నా వల్లభారావు మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బైరాగి కవిత్వం విని, మెచ్చుకున్నవారేనని చెప్పారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ప్రముఖ రచయిత మత్తేవి రవీంధ్రనాథ్, గోళ్ల నారాయణరావు, ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, డీఎల్ కాంతారావు, ఈదర శ్రీనివాసరావు, కనపర్తి బెన్హర్, రైతునేత ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆలూరి బైరాగి శత జయంతి కమిటీ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పర్యవేక్షించారు. అప్పుడే ఆ మహాకవికి నిజమైన నివాళి విగ్రహావిష్కరణలో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం
సంక్షుభిత వేళ తెనాలి: ప్రపంచంలో ప్రమాదకర పరిణామాలు జరుగుతున్న సందర్భంలో సాహితీవేత్తలపై గొప్ప కర్తవ్యాలు ఉన్నాయని ‘అరసం’ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. కశ్మీర్లో కొన్ని గ్రంథాలను నిషేధించారని చెబుతూ రచయితలు, సాహితీవేత్తలపై అప్రకటిత నిషేధం, అక్రమ అరెస్టులు దారుణమన్నారు. ‘అరసం’, తెనాలి శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటైన సభలో ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి ‘అల్లిక’ను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సభకు జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో నిషేధాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. చీకట్లోకి వెళుతున్న ఈ దేశాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో సొంతూరు పాపర్రు నుంచి ఇజ్రాయెల్ వరకు అంశాలతో స్వరూపరాణి రాసిన కవితల్లో ప్రాపంచిక, తాత్విక దృష్టి రెండూ కనిపించాయన్నారు. ● బహుజన రచయితల వేదిక డాక్టర్ నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ మన బతుకుల్ని మనల్నుంచి లాగేసుకుంటున్నపుడు మాట్లాడకపోవటం చారిత్రక ద్రోహం అవుతుందన్నారు. ఆచార్య వృత్తిలో ఉంటూనే సామాజిక దృష్టికోణంలో రచనలు చేస్తున్న స్వరూపరాణి తాజా సంపుటి ‘అల్లిక’ చదివితే ఎందుకు రాయాలి? రాయకపోవడం ఎలా నేరమవుతుంది? అనేది అర్థం కాగలదన్నారు. ● ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి తన ప్రసంగంలో దళిత జీవన మూలాల్లోని పదబంధాలతో స్వరూపరాణి గొప్ప ప్రయోగం చేశారని ప్రశంసించారు. సామాజిక పరివర్తన కేంద్రం ఉన్నవ వినయ్కుమార్ తన ప్రసంగంలో స్వరూపరాణి కవితల్లోని అంశాలను విశదీకరించారు. ● కవయిత్రి స్వరూపరాణి మాట్లాడుతూ తన అనుభవాలు, జ్ఞాపకాలతోపాటు అవమానాలు కూడా కలబోసుకున్నది తెనాలి ప్రాంతమని చెబుతూ ఎక్కడకు వెళ్లినా, ఎంత చదివినా ఇక్కడి నుంచే మాట్లాడతానని చెప్పారు. తనతోటి అణగారిన వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లు, చెమట కలిసినవే తన అక్షరాలుగా చెబుతూ, వివక్ష ఉన్నంతవరకూ రాస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ● దళిత సీ్త్రవాదంలో ప్రథమురాలు స్వరూపరాణి అని కవి, విశ్రాంత ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శనరాజు అన్నారు. సమావేశంలో డాక్టర్ మిరప మాధవి, బహుజన రచయితల వేదిక తంగిరాల సోనీ మాట్లాడారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికారు. ‘అల్లిక’ పుస్తకావిష్కరణ సభలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ -
దేశాన్ని అగ్ర స్థానంలో నిలపాలి
గుంటూరు రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలతో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల 37వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి కూడా పాల్గొన్నారు. అతిథులను కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, సిబ్బంది స్వాగతించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశంలోని 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. 2024లో ఐఐటీ గ్రాడ్యుయేట్లలో కేవలం 60 శాతం మంది మాత్రమే ప్లేస్మెంట్లు పొందడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు తమ ముందున్న సమస్యలను అవకాశాలుగా మార్చుకుని విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆర్. శైలజ, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, పాలక మండలి సభ్యుడు పి. గోపిచంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా ‘ఆర్వీఆర్జేసీ’ గ్రాడ్యుయేషన్ డే -
ఇలా నివారించవచ్చు...
పిల్లల్లో మూడు రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. అవి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు. వీటిని నిర్మూలించేందుకు అల్బెండజోల్ మాత్రను తీసుకోవాలి. మాత్రను భోజనం తరువాత తీసుకోవాలి. మాత్ర వేసుకున్న ఒక రోజు లేదా రెండు రోజుల్లో నులి పురుగులు ఉన్నట్లయితే మల విసర్జన ద్వారా బయటకు వెళ్తాయి. మాత్రలను దీర్ఘకాలిక రోగులు, ఇతర మందులు వాడుతున్న వారు కూడా తీసుకోవచ్చు. – డాక్టర్ తిమ్మాపురం చంద్రశేఖర్రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు, గుంటూరు. -
స్మార్ట్ కార్డుల ఊసే లేదు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులను స్మార్ట్గా దోచుకుంటున్నాయి. వాహన్ సారథి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆర్సీ, లైసెన్స్లు జారీ చేసేందుకు స్మార్ట్ కార్డుల పేరిట డబ్బులు ఏడాదిగా వసూలు చేస్తున్నా.. కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్ దారులకు స్మార్ట్ కార్డులు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికి 15 నెలలు గడుస్తున్నా స్మార్ట్ కార్డుల ఊసేలేదు. వాహనదారులు దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఆర్సీ, ఎల్ఆర్లకు సంబంధించి స్మార్ట్ కార్డు పేరిట ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లో రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. కార్డు ఫీజు రూ. 200, పోస్టు ద్వారా పంపడానికి రూ.32, ఇతరత్రా రూ.3 కలిపి వసూలు చేస్తున్నారు. స్మార్ట్ కార్డుల తయారీకి సంబంధించి కూటమి ప్రభుత్వం టెండర్లూ పిలవలేదు. 50 వేల కార్డులు అవసరం గుంటూరు నగరం స్వర్ణభాతినగర్లో రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఉంది. నిత్యం సుమారు 200 నుంచి 300 మంది వరకు లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఆర్), లైసెన్స్లు, ఆర్సీల కోసం వస్తుంటారు. కరోనా సమయంలో స్మార్ట్ కార్డుల జారీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న 60 వేలకు పైగా కార్డులను వాహన యజమానుల నివాసాలకు పోస్టు ద్వారా రవాణాశాఖ చేర్చింది. తర్వాత గుంటూరు జిల్లా పరిధిలో గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలకు సంబంధించి 50 వేలకుపైగా స్మార్ట్ కార్డుల అవసరం ఉంది. అధికారులు ఎలాంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. స్మార్ట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వాహన యజమానులకు ఓ కాగితం ఇచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. డిజిటల్ యుగంలో సైతం ఆర్సీ, ఎల్ఆర్లకు సంబంధించిన ఇప్పటికి కాగితాలపైనే రవాణా శాఖను నడిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది. స్మార్ట్కార్డులు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అసమర్థతను ఇది వెల్లడిస్తోంది. దీనిపై రవాణాశాఖ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాకే.. స్మార్ట్ కార్డులు మంజూరు అవుతాయని వారు చెబుతున్నారు. లైసెన్స్, ఆర్సీ బుక్లకు ఆన్లైన్లో డబ్బులు వసూలు స్మార్ట్ కార్డులకు రూ.235 వసూలు చేస్తున్న ఆర్టీఏ జిల్లాలో సుమారుగా 50 వేల కార్డుల పెండింగ్ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మరింత దారుణం దీనిపై ఇప్పటివరకు అసలు చర్చించని రవాణా శాఖ డబ్బులు కట్టినా కార్డులు అందించని అధికారులు -
ఇక సెలవు !
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్ విలాస్ ఆర్వోబీ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 70 ఏళ్ల పాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన బ్రిడ్జి శాశ్వతంగా కనుమరుగు కానుంది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్విలాస్ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం గత రెండు నెలలుగా భారీ వాహనాలను దారి మళ్ళింపు చేసింది. లారీలు, బస్సులను శంకర్విలాస్ ఆర్వోబీపైకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ విధంగా గత నెల రోజులకు పైబడి బ్రిడ్జిపై బైక్లు, కార్లు, ఆటోలు మినహా ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల రాకపోకలు సాగిస్తుండగా, నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం నుంచి అన్ని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. దీంతో ఇక శంకర్విలాస్ ఆర్వోబీ కనుమరుగు కానుంది. 70 ఏళ్ల పాటు సేవలందించిన మహా నిర్మాణం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్విలాస్ బ్రిడ్జి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గుంటూరు నగరంలో ముఖ్యమైన కూడలిగా మారడంతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారి కచ్చితంగా తలచుకునే అత్యంత కీలకమైన ప్రాంతంగా మారింది. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారుల నిత్య జీవితంలో అంతర్భాగమై సేవలు అందించిన శంకర్ విలాస్ నగర ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. కాల గర్భంలోకి శంకర్ విలాస్ ఆర్వోబీ నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం ఏడు దశాబ్దాలుగా వారధిగా నిలిచి.. గుంటూరు ప్రజలకు సేవలు శంకర్ విలాస్ ఆర్వోబీ చరిత్ర నగరానికి నడిబొడ్డున కోస్తా జిల్లాల ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు బ్రిటీషు పాలకులు 1848లో 11 ఎకరాల విస్తీర్ణంలో జీజీహెచ్ను నిర్మించారు. తరువాత కాలంలో దానికి అనుబంధంగా 1946లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. నిత్యం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే ప్రజలు, ఇప్పటి బ్రిడ్జి స్థానంలో ఉన్న రైల్వే గేటు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో దీనిని గమనించిన స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి మునిసిపల్ చైర్పర్సన్ నడింపల్లి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1958లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మించారు. తద్వారా ప్రజల ఇక్కట్లను తొలగించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. -
అస్సెస్మెంట్ బుక్స్ తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన అస్సెస్మెంట్ బుక్స్ వల్ల విద్యార్థులకు స్వయం ఆలోచన, సృజనాత్మకత లేకుండా చేసి, ఉపాధ్యాయులకు అసౌకర్యంతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయని, వాటిని తొలగించి పూర్వ పద్ధతిలోనే పరీక్షల విధానం ఉండాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖలీద్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సెస్మెంట్ బుక్స్తో జరిగే నష్టాలను తెలుపుతూ, పూర్వ విధానంలో పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం గుంటూరు డీఈఓ సీవీ రేణుకకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కె.బసవలింగారావు మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన అస్సెస్మెంట్ బుక్స్లో నాలుగు ఫార్మేటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించి వాటి సమాధానాలు అన్నీ ఒకే బుక్ లోనే రాయాలని, తద్వారా పునరావృతం అయిన ప్రశ్నకు జవాబు అదే బుక్లో ఉండటం వల్ల విద్యార్థులు చూసిరాత విధానానికి అలవాటు పడతారన్నారు. విద్యార్థులు చదవకుండా సొంత ఆలోచన, సృజనాత్మకత కోల్పోతారన్నారు. మొత్తంగా విద్యార్థులకు చూసి రాత విధానానికి దారితీస్తాయని తెలిపారు. పూర్వ పద్ధతిలో పేపర్ల పై జవాబులు రాస్తే, జవాబు పత్రాలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. అంతే కాకుండా పరీక్షల అనంతరం సెలవులు వచ్చినప్పుడు మొత్తం బండిల్స్ ఒకేసారి ఇంటివద్ద దిద్దుకుని మరునాడు విద్యార్థుల పరిశీలనకు అందజేసేవారమన్నారు. నూతన అస్సెస్మెంట్ బుక్స్తో ఇంటికి తీసుకెళ్లే సౌకర్యాన్ని కొల్పోయామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులకు ప్రతి స్పందనలను అస్సెస్మెంట్ బుక్ లోనే తెలపాలని చెప్పడం ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉపాధ్యాయులకు అదనపు పనితో ఏకాగ్రత దెబ్బతిని ఒత్తిడికి గురై బోధనపై ప్రభావం చూపుతుందన్నారు. డీఈఓని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు జి.దాస్, పి.నాగశివన్నారాయణ, ఎస్ఎస్ఎన్ మూర్తి, పి.శివరామకృష్ణ, జహంగీర్, టి.భాస్కర్, మాలకొండయ్య, కృష్ణారావు, తదితరులు ఉన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ -
బిహార్లో ఎస్ఐఆర్ను వ్యతిరేకించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : కేంద్ర ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా బిహార్లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ప్రజాస్వామికవాదులు అంతా వ్యతిరేకించాలని, ఇది కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే కుట్రలో భాగమని శాసన మండలి మాజీ సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. గుంటూరు అంబేద్కర్ సెంటర్ (లాడ్జి సెంటర్)లో కేంద్ర ఎన్నికల సంఘం బిహార్లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్కు వ్యతిరేకంగా సీపీఐ(యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవకపోవటంతో బిహార్ రాష్ట్రంలో ఎలాగైనా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని అక్రమ పద్ధతులకు ఒడికట్టిందని విమర్శించారు. ఓటర్లు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్కార్డు, ఓటరు కార్డులు గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని, కానీ బిహార్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు తాత, ముత్తాతల నాటి గుర్తింపు కావాలని ఎన్నికల సంఘం చెపుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకొని అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రధానంగా వలస కార్మికులు, మైనార్టీల సుమారు 70 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఇది కేవలం ఒక్క బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తారని, దీనిని ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర కార్యదర్శి కె. నళినీకాంత్, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు అవధానుల హరి, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, రేట్ పేయర్స్ అసోసి యేషన్ నాయకులు సదా శివరావు, సీపీఎం జిల్లా, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు గుంటూరులో నిరసన -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన
నగరంపాలెం: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా నగరంపాలెం పోలీస్ పరేడ్ గ్రౌండ్ను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం పరిశీలించారు. వేడుకల సందర్భంగా పోలీస్ బలగాలు నిర్వహించే కవాతు, ప్రముఖులు, ఔత్సాహికుల గ్యాలరీలు, ఆయా ప్రభుత్వ శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటయ్యే ప్రదేశాలను నిశితంగా పరిశీలించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు అరవింద్ (పశ్చిమ సబ్ డివిజన్), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
కనులు కాయలు కాచే..!
ఆర్డీ కోసం ఎదురు చూపులు ● వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీ ● ఆర్డీని ప్రభుత్వానికి సరెండర్ చేసిన అధికారులు ● కొత్త ఆర్డీని నియమించకపోవడంతో కష్టాలు ● ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైద్య ఉద్యోగుల ఇబ్బందులుగుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో మూడు జిల్లాల ఉద్యోగులకు కీలకమైన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో ఫోకల్ జోన్గా ఉన్న గుంటూరు కార్యాలయం చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, సెలవులు మంజూరు, ఇతర ఉద్యోగ కార్యకలాపాల బాధ్యతలన్నీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) పర్యవేక్షిస్తారు. ఆర్డీ సంతకం లేకుండా ఉమ్మడి మూడు జిల్లాల ఉద్యోగుల ఫైల్స్ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లవు. అలాంటి కీలక రీజనల్ డైరెక్టర్ను గతనెల ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆ స్థానంలో నూతనంగా ఎవరిని నియమించలేదు. కనీసం ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారనే విషయం తెలియక మూడు జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది ప్రమోషన్లు, మరికొంత మంది సెలవు మంజూరు జాప్యం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా సెలవులు... ఫైల్స్ పెండింగ్ గుంటూరు ఆర్డీగా డాక్టర్ కె.సుచిత్ర గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనారోగ్య కారణంతో తరచూ సెలవులు పెట్టేవారు. నెలల తరబడి సెలవులు పెట్టడం, ఒక్కోసారి కార్యాలయానికి వచ్చినప్పటికీ అనారోగ్య కారణంతో ఫైల్స్పై సంతకాలు పెట్టకుండా కూర్చుండిపోవడం వల్ల మూడు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఫైల్స్కు సంబంధించి కూడా సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, అందరూ మూకుమ్మడిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆర్డీని మార్చాలని లిఖిత పూర్వకంగా కోరారు. తరచూ తమపై దాడి చేసిందంటూ ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్డీ కూడా తనకు కార్యాలయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఉద్యోగులు తనపై దాడి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. గత నెలలో రెండు వారాల పాటు సెలవు పెట్టిన ఆర్డీని రాష్ట్ర ఉన్నతాధికారులు సరెండర్ చేశారు. దీంతో ఈ నెల 1 నుంచి ఆర్డీ కార్యాలయంలో ఫైల్స్పై సంతకాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆర్డీ కార్యాలయం పరిధిలో 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. స్టాఫ్ నర్సులు, హెడ్నర్సులు, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లు, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు, ఎంపీహెచ్ఈఓలు, సీహెచ్ఓలు, రేడియోగ్రాఫర్లు, ఫార్మాశిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఇలా పలు కేడర్లకు చెందిన పారా మెడికల్, మినిస్టీరియల్ ఉద్యోగులు ఆర్డీ కార్యాలయం పరిధిలో ఉన్నారు. వీరిలో 25 కేడర్లకు చెందిన ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. పలువురు ఉద్యోగులకు వ్యక్తిగత, మెడికల్ సెలవులు, ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులకు సంబంధించిన ఫైల్స్ వందకు పైగా పెండింగ్లో ఉన్నాయి. కోర్టు ఫైల్స్ది అదే పరిస్థితి. ఇన్చార్జి నియామకంపై జాప్యం గతంలో రెగ్యులర్ ఆర్డీ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా, పదవీ విరమణ చేసినా, బదిలీ అయినా, మరో రెగ్యులర్ ఆర్డీ విధుల్లో చేరే వరకు తాత్కాలికంగా వేరొకరిని నియమించేవారు,. తాత్కాలిక, ఆర్డీని ఎఫ్ఏసీ హోదాలో నియమించేందుకు ఏమైనా ఆటంకాలు ఏర్పడితే ఆర్డీ పోస్టు ఖాళీగా ఉండకుండా, కనీసం గుంటూరు డీఎంహెచ్ఓను ఇన్చార్జి ఆర్డీగా నియమించి, ఆర్డీ కార్యాలయం కార్యకలాపాలు సజావుగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేవారు. నేడు వీటిల్లో ఏ ఒక్కటి జరగకపోవడం, కనీసం ఆర్డీ కార్యాలయానికి అధికారిని కూడా నియమించకపోవడంతో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి ఇన్చార్జి ఆర్డీని నియమించి ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
మార్కెట్ షాపుల వేలం జరిగేనా?
సాక్షి ప్రతినిధి,గుంటూరు/నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లి శారద మార్కెట్ చుట్టూ కుళ్లు రాజకీయాలు అలుముకున్నాయి. అక్కడి షాపులకు ఈ నెల 12, 13, 14వ తేదీల్లో వేలం నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. మరోవైపు ఈ వేలం ఆపేందుకు ఎమ్మెల్యేతోపాటు పాలకులు కుట్రలు పన్నుతున్నారు. ఎలాగైనా వేలం నిలిపివేసి చేసి గతంలో ఉన్న లీజులదారులకే గంపగుత్తగా కట్టబెట్టేందుకు ఓ ప్రజాప్రతినిధి కుట్ర చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఫోన్.. ఆగిన వేలం? 1999లో కొల్లి శారద మార్కెట్లో 88 షాపులను నగరపాలక సంస్థ నిర్మించింది. 25 ఏళ్ల లీజు గడువుతో షాపులను కొంతమంది దక్కించుకున్నారు. వీటి గడువు గత ఏడాది మే 31తో ముగిసింది. అప్పటి నుంచి షాపులను స్వాధీనం చేసుకోనివ్వకుండా లీజుదారులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ స్టే రావడం, కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. చివరకు హైకోర్టు గత నెల షాపులకు వేలం నిర్వహించాలని, ప్రస్తుత లీజుదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఈ నెల 12, 13, 14వ తేదీల్లో 81 షాపులకు (మిగిలిన ఏడు షాపులు కొన్ని పాడైపోయాయి, మరికొన్ని లీజు గడువు పూర్తికానివి) వేలం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే వేలం నిర్వహించకుండా లీజు దారులు అన్ని మార్గాలు వెతుకుతున్నారు. వీరంతా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళ్లి మున్సిపల్ శాఖ మంత్రి ద్వారా కమిషనర్కు ఫోన్ చేయించినట్లు సమాచారం. దీంతో కమిషనర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయిస్తారు? 81 షాపులకు వేలం నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కచ్చితంగా కల్పించాలి. వీటిల్లో ఎస్సీలకు 12, ఎస్టీలకు 5, బీసీలకు 4, దివ్యాంగులకు 2 షాపులు చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ వేలం నిర్వహణకు నోటిఫికేషన్ ఈ నెల 2వ తేదీన విడుదల చేశారు. అయితే సదరు షాపుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా షాపులు కేటాయిస్తారంటూ లీజుదారులు, పాలకులు కమిషనర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఎలాగైనా వేలం నిలిపేందుకు లీజు దారులు కుట్రలు పన్నుతున్నారు. కొల్లి శారద మార్కెట్లోని షాపులు వరాలమ్మకు వందనం కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లలో గండి 81 షాపులకు వేలం నిర్వహిస్తే ఒక్కో షాపుకు బహిరంగ మార్కెట్లో నెలకు అద్దె రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు వెళ్లే అవకాశం ఉంది. గుడ్విల్ కింద కొంత మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇలా ఏడాదికి కార్పొరేషన్కు ఆదాయం రూ. కోట్లలో సమకూరనుంది. అయితే తక్కువ రేటుకే దక్కించుకునేందుకు లీజుదారులు పావులు కదుపుతున్నారు. తిరిగి పాత లీజుదారులకు కట్టబెట్టేందుకు ఒక్కో షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ముట్టచెప్పేందుకు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కొల్లి శారద మార్కెట్ చుట్టూ కుళ్లు రాజకీయాలు షాపులు దక్కించుకునేందుకు ప్రస్తుత లీజుదారుల కుట్ర వేలం ఆపేందుకు ప్రయత్నాలు మున్సిపల్ మంత్రి ద్వారా కమిషనర్కు ఫోన్ -
వైన్స్లోనూ ‘గేట్లు’ ఎత్తేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తోంది. మద్యమే ఆదాయ వనరుగా చూస్తూ ఎడాపెడా ప్రజలతో తాగించేందుకు కొత్తగా పర్మిట్ రూములు సిద్ధం చేస్తోంది. ఇందుకు గాను లైసెన్సీల వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు వసూలు చేసేందుకు నిర్ణయించింది. తాగినోళ్లకు తాగినంత.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్వహించిన మద్యం దుకాణాలను కూటమి సర్కారు వచ్చాక రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులు వైన్ షాపులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 140 వైన్ షాపులకు అనుమతులు మంజూరు చేసింది. వీటి వద్ద అనధికారికంగా పర్మిట్ రూములు నిర్వహిస్తున్నారు. వాటిలో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. వైన్ షాపు నిర్వాహకులు, నాయకులు, ఎకై ్సజ్ అధికారులు జేబులు నింపుకొంటున్నారు. ఈ నెలాఖారుకు ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన మద్యం పాలసీ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీలోగా నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందులో భాగంగా గీత కులాలకు పదిశాతం బార్ నిర్వహణలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 99 బార్ అండ్ రెస్టారెంట్లకు మరో పది అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీలోగా కొత్త మద్యం పాలసీకి సంబంధించిన బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి లాటరీ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో వైన్ షాపులకు సంబంధించి పర్మిట్ రూములు నిర్వహించుకునేందుకు అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. ఆదాయమే పరమావధిగా కూటమి ప్రభుత్వం వ్యహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఆదాయమే పరమావధిగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో బీర్లు 26.08 లక్షల బాక్సులు, లిక్కర్ 11.84 లక్షల బాక్సులు అమ్మకాలు జరిగాయి. దీని వలన ప్రభుత్వానికి ఆదాయంగా రూ.2,010 కోట్లు సమాకూరింది. ఇప్పటి వరకు అనధికారికంగా నిర్వహించిన పర్మిట్ రూముల స్థానంలో అధికారికంగా నిర్వహణకు అనుమతి ఇస్తే ఇక మద్యం ఏరులై పారడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఇక పర్మిట్ రూమ్లకు కూడా అనుమతి మద్యం షాపుల వద్ద తాగేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ జిల్లా వ్యాప్తంగా 140 వైన్ షాపుల్లో అమలయ్యే అవకాశం బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక అమలు -
తెనాలిలో విజిలెన్స్ అధికారుల దాడులు
తెనాలిటౌన్: అనుమతిలేని విత్తనాలను తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చి తెనాలి ప్రాంతంలో అమ్మకాలు జరుపుతున్న ఎరువులు, విత్తనాల షాపులపై గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడి చేసి భారీగా వరి విత్తనాలను సీజ్ చేశారు. స్థానిక నందులపేటలోని వినాయక ఎంటర్ ప్రైజెస్ దుకారణంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతిలేని వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. విత్తనాల నాణ్యతను పరీక్ష నిమిత్తం శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ టెస్టింగ్కు పంపిచారు. డెల్టా ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్న వరిలో మేలురకం విత్తనాలను రైతులకు అందివ్వాలన్న దృక్పథంతో వరుసగా తెనాలి పరిసర ప్రాంతంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రైతులను మోసగించాలని చూస్తే సహించేది లేదని దుకాణదారులను హెచ్చరించారు. అనుమతులు లేని విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడుల్లో విజిలెన్స్ అధికారి సీహెచ్.ఆదినారాయణ, ఇన్స్పెక్టర్లు కె.చంద్రశేఖర్, పి.శివాజీ, మండల వ్యవసాయాధికారి కె.సుధీర్బాబు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. అనుమతిలేని వరి విత్తనాలు గుర్తింపు రూ.5,85,300 విలువైన విత్తనాలు సీజ్ చేసిన అధికారులు -
అంగన్వాడీలపై అడ్డగోలు పెత్తనం
గుంటూరు అర్బన్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలపై సూపర్వైజర్లు, ఇతర అధికారుల అడ్డగోలు పెత్తనం ఎక్కువైంది. తమకు అనుకూలంగా ఉండే వారిని మిగతా కార్యకర్తల వద్దకు విజిట్ల పేరుతో పంపి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సాకుతో వారి పనులన్నీ తమతో చేయిస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంతో కొంత సమర్పించుకున్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితిదీ.. అంగన్వాడీ కేంద్రాల సంఖ్య 1,4806 నెలల నుంచి మూడేళ్లలోపు వారు 49,976 మంది బాలింతలు 7,009 మంది నెహ్రూనగర్: బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం) ద్వారా జరుగుతుంది. ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో సూపర్వైజర్లు చేయాల్సిన పనిని కూడా తమకు నచ్చని అంగన్వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారు. దీంతో ప్రీ స్కూల్ నిర్వహణ సక్రమంగా లేదు. మరోవైపు అంగన్వాడీలు చేయాల్సిన విధుల్లో ఆలస్యమైతే మెమోలు ఇస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పదవీ విరమణ పొందిన స్థానాల్లో అక్కడ పనిచేస్తున్న ఆయాకు అర్హతలను బట్టి కార్యకర్తగా పదోన్నతి కల్పిస్తారు. ఇలా ఎవరైనా పొందితే రూ.1.50 లక్షలు వరకు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేదంటే రోజూ విజిట్ల పేరుతో వేధిస్తున్నారు. అదనపు భారంతో బెంబేలు అంగన్వాడీ కేంద్రాల్లో నెలలో పది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వీటి నిర్వహణ కోసం కార్యకర్తపై రూ.1,500 నుంచి రూ. 2 వేల వరకు అదనపు భారం తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆర్టీఐ విజిట్ల పేరుతో వచ్చే వారిని మేనేజ్ చేసేందుకు ప్రతి కేంద్రం నుంచి రూ.200 సమర్పించాలని అధికారులు సూచించడంతో ఆ మొత్తం కూడా వీరే ఇస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సరుకులు ఎండీఎం వాహనాల ద్వారా రేషన్ షాపు నుంచి సరఫరా అయ్యేవి. ఇప్పుడు రేషన్ షాపు నుంచి ఆటోలో ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కార్యకర్తలు వాపోతున్నారు. తమకు ఇచ్చే రూ.11,500 జీతంలో ఇలా ఖర్చులు పోతే మిగిలేదేమీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. ప్రసూనను దీనిపై వివరణ కోరగా.. సరుకులను సూపర్వైజర్ తీసుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వివరాలు సమగ్రంగా పరిశీలించాక తప్పు ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. 3– 6 సంవత్సరాలలోపు చిన్నారులు 14,771 మంది గర్భిణులు 9,148 మంది తాము చేయాల్సిన పనులూ అప్పగిస్తున్న సూపర్వైజర్లు, పై అధికారులు అనుకూలంగా ఉండే సిబ్బందికి అనధికార సెలవులు మంజూరు విజిట్ల పేరుతో మిగతా వారిపై నిత్యం వేధింపులు గుంటూరు అర్బన్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు తప్పని కష్టాలు ప్రసన్నం చేసుకుంటే అంతా ఓకే.. సూపర్వైజర్లను, ఆపై అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు కార్యకర్తలకు అనధికార సెలవులు ఇస్తున్నారు. దీంతోపాటు ఆయా కేంద్రాలకు విజిట్కు వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ అంగన్వాడీ కార్యకర్త విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అధికారుల అండదండలు ఉండటంతో మేనేజ్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల అర్బన్ పరిధిలోని ఓ సూపర్వైజర్ బయట సరుకులు తేవాలని ఓ అంగన్వాడీ కార్యకర్త భర్తను బెదిరించారు. ఆయన ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తుండటంతో ఫోన్ చేసి కావాల్సిన వస్తువులను తెప్పించుకున్నట్లు సమాచారం. నెల నెలా ఇలా చేస్తుండటంతో విసిగిపోయిన ఆయన కొద్ది నెలల క్రితం అర్బన్ సీడీపీఓ కార్యాలయం వద్దకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రెడ్బుక్ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి రెడ్బుక్ పాలనకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసులకు ఒక చెంపపెట్టు లాంటిదని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు అరండల్పేటలోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు.. అనే దానికి తురకా కిషోర్ ఉదంతం ఒక ఉదాహరణ అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా, పౌరహక్కులు నిలబెట్టేలా కిషోర్ను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం గొప్ప పరిణామం అన్నారు. పోలీసు వ్యవస్థ పొలిటికల్ బాస్ల చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిందని ధ్వజమెత్తారు. వాస్తవానికి తురకా కిషోర్ను 2022లో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్ట్ చేశాక, అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి అనే దురుద్దేశంతో 210 రోజులకుపైగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. కిషోర్ను మానసికంగా, శారీరకంగా వేధించారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. సామాన్యుల హక్కులను కాలరాసే విధంగా అరాచక పాలన చేస్తున్న కూటమికి హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించేలా ఉందన్నారు. అక్రమ అరెస్టులపై వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం బాధితుల పక్షాల అన్ని విధాలుగా పోరాడుతోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్కు సంబంధించి న్యాయమూర్తులు రిమాండ్ విధించేటప్పుడు రికార్డులు సరిగ్గా పరిశీలించటం లేదనే విషయాన్ని హైకోర్టు ఎత్తి చూపటం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ పాటించాలి.. ఇప్పటికై నా ఆయా న్యాయమూర్తులు కేసు పూర్వాపరాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని, యాంత్రికంగా వ్యవహరించటం సరికాదన్నారు. సుప్రీం, హైకోర్టు గైడ్లైన్స్ పాటించాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్లపై ఉందన్న విషయాన్ని తెలియజేస్తామన్నారు. ఏదో పోలీసులు తెచ్చారు.. రిమాండ్ విధిద్దాం.. అనే ధోరణిలో కాకుండా వాస్తవాలను పరిశీలించాలని విన్నవించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా లీగల్ విభాగం ఉంటుందని, వారిని అన్ని విధాలుగా సహాయం అందజేస్తామన్నారు. తురకా కిషోర్పై ఇప్పటివరకు 18 అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
చేనేత రంగాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం
మంగళగిరి: మనదేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంపై ఆధారపడి జీవించే కుటుంబాలు అధికమని, అలాంటి చేనేత రంగాన్ని కూట మి ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు. గురు వారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రగడ కోటయ్య చిత్రపటానికి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో చేనేత షెడ్లు నిర్మించి 1500 కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాక చేనేత భవన్నం నిర్మించామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్నల బాధలు గమనించి ఏడాదికి రూ.24 వేలు అందజేశారన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్మరించిందని, ఫలితంగా కొన్ని కుటుంబాలు పూట గడవని పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, లీగల్ సెల్ నాయకులు కొసనం శ్రీనివాసరావు, పట్టణ గౌరవ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, చేనేత విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు పూజాల మనోహర్, జిల్లా కార్యదర్శి దామర్ల కుభేరస్వామి, చేనేత విభాగం నాయకులు ఆకు రాతి శివభాస్కరరావు, గుంటి నవీన్, జిల్లా యాక్టివిటీ సభ్యురాలు మల్లవరపు సుధారాణి, రూ రల్, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాతంగి బాబు, శుభకర్, నిర్మల, ఫిరోజ్ మాబు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వెఎస్సార్ సీపీ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం -
అధికారిక సమావేశం.. ఆయనకు ఏం పని?
తాడికొండ: తాడికొండ నియోజకవర్గంలో షాడో పెత్తనంపై అందరూ విస్మయం చెందుతున్నారు. పార్టీ కార్యాలయంలో చెలాయిస్తున్నాడు సరే ఇక్కడ కూడా ఇతని ఆదిపత్యం మాకు తప్పదా అంటూ పెదవి విరుస్తున్నారు తాడికొండ నియోజకవర్గ అధికారులు, పార్టీ నాయకులు. టీటీడీ సిఫార్సు లేఖలు, ట్రాన్స్ఫర్లు, అధికారులు చేయాల్సిన విధులు, బడ్జెట్ కేటాయింపులు అన్నింటా తానే అయి వ్యవహరిస్తున్న సదరు షాడో బత్తుల నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్షలకే హాజరై హుకుం జారీ చేసేవాడు. కానీ ఇప్పుడు అది కాస్తా ముదిరి ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్షలో కూడా ఆయన గారి ప్రసన్నం అధికారులకు తప్పలేదు. సదరు షాడో సమీక్షకు హాజరు కాకూడదని తెలిసినా నేరుగా వచ్చి ముందు వరుసలో హాజరై ఆశీనుడయ్యారు. వచ్చిన అధికారులు కూడా చేసేదేమీ లేక ఆయనకు వంగి వంగి నమస్కరించడం మనకి ఇక్కడ కూడా ఈ ఖర్మ తప్పదా ఇదేమి చోద్యం అంటూ చెవులు కొరుక్కోవడం తప్పలేదు. ఇతగాడి వ్యవహార శైలిపై అధికార పార్టీలోనే పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూపు ల్లో ఓ మెస్సేజ్ హల్చల్ చేసింది దాని పర్యావసానం ఏమిటంటే బ్యాంకులో గుమాస్తాగా ప్రస్థానం మొదలెట్టి సినిమా లెక్క ఇతను నియోజకవర్గం కాకున్నా నియోజకవర్గం మీద పడి రెచ్చిపోతున్నాడనే విమర్శలు లేకపోలేదు. . అతి తక్కువ కాలంలో వందల కోట్ల పోగేసిన ఈ రాజకీయ బ్రోకర్ చేసే ఆగడాలలో ఇది 0.01 శాతం మాత్రమే ఇతని చిట్టా మొత్తం ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు లోకేష్ గారి టీమ్ ద్వారా లోకేష్కి చేరుతూనే ఉంది. ఇతనికి తెలియకుండానే ఇతని దగ్గర లోకేష్ గారు మనుషు లును సైలెంట్గా ప్రవేశ పెట్టడం ఇతని కదలికలను ఎప్పటికప్పుడు రికార్డెడ్గా కేంద్ర కార్యాలయానికి చేరవేయడం నిరంతరంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇతని కదలికల మీద 24 గంటల నిఘా ఉంది. ఇతని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పచ్చగా ఉండే పల్లెల్లో పార్టీని అడ్డగోలుగా గ్రూపులుగా విడగొట్టి ఆ గ్రూపులకు పార్టీ పదవులు, గ్రామాల్లోని కాంట్రాక్టు పనులను అమ్ముకుంటున్నాడు అని పూర్తి సమాచార పలు వివాదాస్పద వ్యవవహారాలను ఉదహరిస్తూ ఓ మెస్సేజ్ భారీగా హల్చల్ చేసింది. ఇంతా జరుగుతున్నా ఇతగాడిని పక్కన పెట్టకపోగా పక్కనే కూర్చోబెట్టుకోవడం వెనుక అంతరం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనేది వాదన. కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో తాడికొండ షాడో బత్తుల హాజరుపై అధికారులు విస్మయం -
9 నుంచి గుంటూరులో ట్రాఫిక్ మళ్లింపులు
శంకర్విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత దృష్ట్యా నిర్ణయం నగరంపాలెం: గుంటూరు నగరంలోని శంకర్విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనుల దృష్ట్యా ఈ నెల 9 వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగర పరిధిలో రాకపోకలు సాగించేందుకు ముందస్తు ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పలు తాత్కాలిక మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అందరూ నిబంధనలను పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. వివిధ మార్గాల్లో మళ్లింపులు ఇలా.. ● అమరావతి రోడ్ నుంచి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా (ఎంటీబీ) సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలను చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో మళ్లిస్తారు. ● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇకనుంచి అరండల్పేట, పొట్టిశ్రీరాములునగర్, డొంకరోడ్డు, మూడు వంతెనలు లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గం మీదుగా వెళ్లాలి. ● ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు (పాఠశాల, కళాశాల బస్లు సహా) రమేష్ హాస్పిటల్ నుంచి కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా ప్రయాణించాలి. ● కోబాల్డ్పేట, కృష్ణనగర్, చంద్రమౌళినగర్, బృందావన్గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలన్నీ పట్టాభిపురం పోలీస్స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి, కలెక్టర్ కార్యాలయం రోడ్డు, నగరంపాలెం మీదగా వెళ్లాల్సి ఉంటుంది. ● పట్టాభిపురం నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్) వైపు వెళ్లే వారు కంకరగుంట రైల్వే ఓవర్బ్రిడ్జి, ఎంటీబీ సెంటర్, ప్రభుత్వ మహిళా కళాశాల (ఉమెన్స్ కాలేజ్) వైపు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు మీదగా వెళ్లాలి. ● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు చిల్లీస్, ఇన్నర్రింగ్ రోడ్, ఆటోనగర్, బస్టాండ్ లేదా కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాలను ఉపయోగించాలని తెలిపారు. -
నీరజ్ చోప్రాను ఆదర్శంగా తీసుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడ లు): ఒలింపిక్స్లో బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రాను అథ్లెట్స్ ఆదర్శంగా తీసుకోవాలని అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా చైర్మన్, సీనియర్ అథ్లెట్ జి.శేషయ్య తెలిపారు. గురువారం స్థానిక బీఆర్ స్టేడియంలో జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాల బాలికలతోపాటు యువతీ యువకుల జావెలిన్ త్రో పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. శేషయ్య మాట్లాడుతూ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించనందుకుగాను భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్ట్ 7న జాతీయ జావెలిన్ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన నీరజ్ చోప్రా విజయ రహస్యాలను అథ్లెట్స్ సాధన చేయాలన్నారు. అనంత రం శేషయ్య, జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కోచ్ రవి, కె.రాజు, సుబ్రమణ్యం, చిన్న, నాని పాల్గొన్నారు. అద్దె చెల్లించలేదని మహిళపై దాడి తాడేపల్లిరూరల్: స్థానిక ఇప్పటంలో అద్దె చెల్లించే విషయంలో ఆలస్యం కావడంతో జనసేన నాయకుడి తమ్ముడు ఓ మహిళపై దాడిచేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఖాజా వలి కథనం ప్రకారం.. కుంచనపల్లిలో నివాసముండే అమ్మిశెట్టి సురేష్ అనే యువకుడు తనకున్న నివాసాన్ని హాస్టల్ నిర్వహించుకునేందుకు అదే గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళకు అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ. 50 వేలు అద్దె చెల్లించాల్సి ఉండగా శ్రీలత రూ. 30 వేలు ఇచ్చిందని, రూ. 20 వేలు చెల్లించే విషయంలో సురేష్కు, శ్రీలతకు రెండు మూడుసార్లు చిన్నపాటి వాదనలు జరిగాయి. బుధవారం రాత్రి శ్రీలత ఇప్పటంలో ఉన్నానని, రూ. 20 వేలు ఇస్తానని చెప్పింది. ఇదే విషయమై సురేష్ మరో ఇద్దరితో కలసి ఇప్పటం వెళ్లి వాదనకు దిగాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శ్రీలతపై సురేష్ తో పాటు మరో ఇద్దరు దాడి చేశారు. ఈ విషయమై శ్రీలత పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఇదిలా ఉంటే అమ్మిశెట్టి సురేష్ అన్నయ్య జనసేన నాయకుడు కావడంతో శ్రీలతను కేసు విత్డ్రా చేసుకోమని ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా మంత్రి లోకేష్ను కలసి ఫిర్యాదు చేస్తామని వారి బంధువులు వెల్లడించారు. -
రాజధానిలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. గురువారం రాత్రి రాజధాని గ్రామం పెనుమాకలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాజధాని ప్రాంతంలో ఫూలింగ్కు పొలాలను ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, ప్లాట్లు కేటాయించని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పలురకాల వాణిజ్య పంటలు పండించుకుంటూ వారి పిల్లల భవిష్యత్తు గురించి కలలు కన్నారని, గతంలో అధికారంలో ఉన్న టీడీపీ రాజధాని పేరుతో పంటలు పండించే భూములను నాశనం చేసి, రైతులను బెదిరించి ల్యాండ్ ఫూలింగ్ కింద భూములు తీసుకున్నారని అన్నారు. ఆ భూ ములకు సంబంధించి ఎలాంటి ప్లాట్లు పూర్తి స్థాయిలో రైతులకు కేటాయించలేదన్నారు. మూడు సంవత్సరాల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత, మళ్లి అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అయినా ఒక్క ప్లాట్ను కూడా తట్టి మట్టి వేయలేదు. రైతులు వారి పొలాలకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇచ్చిన పంట పొలాలే అభివృద్ధికి నోచుకోలేదు. మరో 40 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రైతులు స్థలాలకు ధరలు లేక, ఇబ్బంది పడుతున్నారు. రాజధానిలో కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా భూములు ఇచ్చి, వారి వద్ద నుంచి భారీగా ముడుపులు తీసుకుని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో రైతు ఉద్యమం చేయబోతున్నామని, దానికి రైతులందరూ కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈప్రాంతాల్లో కొంత మంది రాజధాని పేరుతో రైతులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో ఆనవాయితీ లేదని, బెదిరించే వారికి వైఎస్సార్సీపీ తరుపున హెచ్చరిక జారీ చేస్తున్నామని, భవిష్యత్లో వారు ఎక్కడ ఉన్నా వారి సంగతి తేలుస్తామన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదన్నారు. గతంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి పూలింగ్కు పొలాలిచ్చిన రైతులకు వెంటనే ప్లాట్లు కేటాయించాలి రెతులను ఇబ్బంది పెట్టవద్దు వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి -
ఘనంగా భూ వరాహ స్వామి జయంతి వేడుకలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై భూ వరాహస్వామి జయంతి వేడుకలు రెండో రోజైన గురువారం వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో భూ వరాహస్వామి జయంతి మహోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. వివాహ యోగ్యత, దాంపత్యాభివృద్ధి, మంచి సంతానం పొందుటకు ఈ కల్యాణ మహోత్సవం దోహదపడుతుందని తెలిపారు. కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. పీజీ కోర్సుల ఫలితాలు విడుదల పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ జరిగిన పలు పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. సోషల్ వర్క్ 16కి 16మంది, ఎంఏ అప్లయిడ్ లింగ్వి ట్రానన్స్లేషన్ స్టడీస్లో 10కి 10మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోర్సులో 21కి 18 మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ హార్టీకల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్లో 16 మందికి 11మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులను 18లోగా ఒక్కొక్క పేవరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆయన సూచించారు. 9,10 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల జూడో చాంపియన్షిప్ 2025–26 పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు తెలిపారు. గురువారం స్థానిక జేకేసి కళాశాల రోడ్డులో పోటీలకు సంబంధించిన పోస్టర్ను తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్కుమార్, శ్రీహరి నాయుడు, గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి, పల్నాడు జూడో అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావులు ఆవిష్కరించారు. శ్రీహరి నాయుడు మాట్లాడుతూ పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహి స్తామన్నారు. వెలుగులోకి రేషను డీలర్ మోసం దూరం విషయంలో అబద్ధాలు చెప్పి బియ్యం పాయింట్కు అనుమతి తాడికొండ: గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అధికారమే అండగా డీలర్ల దందా’ కథనంతో అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు నింద తమపై వేసుకోకుండా హడావుడిగా ఆర్డీవో జారీ చేసిన సిఫార్సు లేఖను వెలుగులోకి తీసుకొచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. ఒకే డీలరుకు రెండో పాయింట్ కేటాయించేందుకు చెప్పిన కారణాలు చూసి సాటి డీలర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. అర కిలోమీటరు లేని దూరానికి ఒకటిన్నర కిలోమీటరుగా చూపిస్తూ రెండో పాయింట్ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. కాలనీకి కేవలం 200 మీటర్లలోపు దూరంలో ఉన్న డీలరును పాడుబడిన భవనంలోకి వెళితేనే సరుకు కేటాయిస్తామంటూ దబాయించి తరిమేయడం మరో అంశం. ఆ పాయింట్ ఏ ఇంటివద్ద నిర్వహించాలి అనే డోర్ నంబర్ లేదా ఇతర అడ్రస్సు ఏమీ పొందుపరచకపోవడం చూస్తుంటే సదరు డీలరుపై ఎంత ప్రేమో అర్థం అవుతోంది. ఎక్కడైనా బియ్యం తీసుకునే ఎనీ వేర్ విధానం అందుబాటులో ఉంది. ప్రజలు తమ ఇష్టం వచ్చిన దగ్గర సరుకులు తెచ్చుకుంటున్నారు. అయినా రెండో పాయింట్ అవసరం ఇప్పుడేమొచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు పాయింట్ రద్దు చేసి, డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కూటమి ప్రభుత్వ దగాతో సాగుకు అన్నదాతల వెనుకడుగు
కృష్ణమ్మ నీరు అందుబాటులో ఉన్నా రైతుల్లో నిర్లిప్తత నెలకొంది. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండినా.. సాగుపై ఆసక్తి చూపడం లేదు. అన్నదాతలు అయోమయంలో కూరుకుపోయారు. పెట్టుబడులు భారీగా పెరగడంతోపాటు దాదాపు ఏ పంట వేసినా కూటమి ప్రభుత్వం వచ్చాక గిట్టుబాటు ధరలేక భారీ నష్టాలు తప్పకపోవడమే ఈ దుస్థితి కారణం.సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో గత ఏడాది కంటే ప్రస్తుతం 5,390 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 93,924 హెక్టార్లుగా ఉంది. ఇప్పుడు 88,534 హెక్టార్లకే పరిమితం కానుంది. గత ఏడాది ఈ సమయానికి 82,292 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇప్పుడు కేవలం 37,204 హెక్టార్లలోనే పంటలు వేశారు. ఒక్క కొల్లిపర మండలం తప్ప ఏ మండలంలోనూ సాగు ఆశాజనకంగా లేదు. ఉద్యాన పంటల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇదీ పంటల పరిస్థితి... ● వరి విషయానికి వస్తే గత ఏడాది 63,733 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. ఆగస్టు మొదటి వారానికి 56,789 హెక్టార్లలో పంట వేశారు. అదే ఈ ఏడాది చూస్తే 61,257 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా... ఇప్పటి వరకు 29 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. అంటే 47 శాతం మాత్రమే పంట వేశారు. ● జిల్లాలో 3,061 హెక్టార్లలో కందులు, మినుములు, పెసర, శనగలు వేస్తారని అంచనా వేశారు. కేవలం 324 హెక్టార్లలోనే సాగు చేశారు. అది కూడా 319 హెక్టార్లలో మినుములు వేశారు. ● పత్తి విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 21,842 హెక్టార్లలో సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 7,715 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఏ పంట వేసినా కన్నీరే గత ఏడాది వరితోపాటు మిర్చి, పొగాకు, పత్తి, పసుపు, కందులు... ఇలా ఏ పంట వేసినా కూటమి సర్కార్ తీరుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతులు దాదాపు ఎకరానికి రూ.లక్షకుపైగా నష్టపోతే, మిగిలిన పంటలు వేసిన వారికీ భారీగా నష్టం తప్పలేదు. వరి కొతకు వచ్చే సమయానికి భారీ వర్షాలకు పంటలు తడిచిపోగా, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. వ్యాపారులు ధరలు తగ్గించేసి రైతులను దోచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పంటలు వేయడానికి రైతులు సాహసించని పరిస్థితులు నెలకొన్నాయి. ‘రియల్ వ్యాపారి’గా ప్రభుత్వం మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం సమీకరించిన భూమి వేల ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, పెదకాకాని మండలాల్లో చాలా మంది రైతులు వ్యవసాయం నుంచి దూరంగా వెళ్లిపోయారు. తమ పొలాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు సాధారణ విస్తీర్ణం వివరాలు జిల్లాలో భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం 5,390 హెక్టార్ల వరకు తగ్గొచ్చని వ్యవసాయ శాఖ అంచనా అందుబాటులో నీరున్నా పంట వేయడానికి ఆసక్తి చూపని రైతన్నలు గత ఏడాది ఇప్పటికే 89 శాతం పంటలు ప్రస్తుతం 47 శాతమే సాగు చేసిన వైనం ఏ పంట వేసినా తప్పని భారీ నష్టాలతో కర్షకులకు గడ్డుకాలం కూటమి సర్కార్ మోసపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం పంట రకం సాధారణ విస్తీర్ణం (హెక్టార్లలో) వరి 63,000 పత్తి 24,000 పసుపు 4,000 పండ్ల తోటలు 3,590 మినుము 3,122 కూరగాయలు 1,947 పూల తోటలు 437 నువ్వులు 28 జూట్ 20 చెరకు 10 మొత్తం 1.15 లక్షలు -
అవయవదానంతో ఐదుగురికి నూతన జీవితం
గుంటూరు మెడికల్: తాను మరణిస్తూ అవయవదానంతో మరో ఐదుగురికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. ఇంటి పెద్ద చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబ సభ్యులు పెద్ద మనస్సు చేసుకుని అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవయవదానం చేసి న కుటుంబ సభ్యులను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామానికి చెందిన కనగాల బాల రామకృష్ణ (59) ఐదేళ్లుగా గుంటూరు కృష్ణనగర్లో నివసిస్తున్నారు. ఆగస్టు 3న గుంటూరు గుజ్జనగుండ్ల నుంచి పట్టాభిపురం వైపు సైకిల్పై వెళుతున్నాడు. కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించారు. అత్యవసర చికిత్స పొందుతూ ఈనెల 7న బ్రెయిన్ డెడ్ గా నిర్దారించి, చికిత్స అందిస్తున్న న్యూరాలజీ చీఫ్ డాక్టర్ కుమారవేల్ విషయాన్ని కుటుంబసభ్యులకు విషయం తెలిపారు. బాలరామకృష్ణ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వారు జీవన్ధాన్ గురించి తెలియజేయడంతో, అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి బాలరామకృష్ణ శరీర అవయవాలను ఇతరులకు అమర్చి నూతన జీవితాలను ప్రసాదించారు. గుంటూరు రమేష్ హాస్పటల్లో లివర్, కిడ్నీ సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురు రోగులకు బాలరామకృష్ణ శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా అమర్చి ఇరువురికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీ, రెండు నేత్రాలను విజయవాడ విజయ్ హాస్పటల్, తాడిగడప ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు.సూపరింటెండెంట్ అభినందనజీవన్దాన్ ట్రస్ట్ తరుపున గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ గురువారం బాలరామకృష్ణ కుటుంబ సభ్యలను పరామర్శించి అభినందించారు. త్వరలో ప్రభుత్వం అవయవదానం చేసిన వారిని గుర్తించి తగినవిధంగా సహకరిస్తుందని వెల్లడించారు. జీవన్ధాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 10 వేలు కుటుంసభ్యులకు అందించారు. ఆష్టర్ రమేష్ హాస్పటల్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడుతూ విషాద సమయంలో కూడా ఆ కుటుంబం తీసుకున్న అవయవదాన నిర్ణయం, నిజంగా విలక్షణమైన మానవీయ చింతనకు ప్రతిబింబమన్నారు.అంతర్జాతీయ సదస్సులో గుర్తింపు అభినందనీయంపెదకాకాని(ఏఎన్యూ): అంతర్జాతీయ సదస్సులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ హిందీ విభాగ సహాయ సమన్వయకర్త డాక్టర్ కె.శ్రీకృష్ణ పురస్కారం పొందడం అభినందనీయమని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. పంజాబీ సభ మాస్కో(రష్యా), నేపాల్ సంస్కృత విద్యాలయ వాల్మీకీ విద్యాపీఠం(నేపాల్ రాజధాని ఖాట్మండ్) సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కె.శ్రీకృష్ణకు విద్యాశ్రీ సమ్మాన్ 2025 పురస్కారం లభించింది. గురువారం వీసీ ఆచార్య కె.గంగాధరరావు తన ఛాంబర్లో డాక్టర్ శ్రీకృష్ణను అభినందించారు. వీసీ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులో శ్రీకృష్ణ సమర్పించిన పరిశోధన పత్రానికి మంచి గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. -
కోర్టు తీర్పుపై ఉపాధ్యాయ నేతల హర్షం
తాడేపల్లిరూరల్ : స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో 2019లో ఉపాధ్యాయులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై నమోదైన కేసు తీర్పు గురువారం ఉపాధ్యాయులకు అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం చేశారు. జనవరి 31, 2019 సంవత్సరంలో ఏపీసీపీ ఎస్ఇఏ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చారు. అప్పట్లో తాడేపల్లి పోలీసులు 17 మంది ఉపాధ్యాయులపై కేసు నమో దు చేశారు. ఆ కేసులో కర్నూలుకు చెందిన ఏడుగురు, విజయనగరానికి చెందిన ఆరుగురు, అనంతపురానికి చెందిన ముగ్గురుపై కేసు నమోదైంది. మంగళగిరి న్యాయస్థానం ఉపాధ్యాయులపై అప్ప టి ప్రభుత్వం మోపిన కేసు కొట్టివేయడంతోఅధ్యక్ష కార్యదర్శులు బాజీ పఠాన్, కరీమ్ రాజేశ్వరరావు కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం గెలిచిందని అన్నారు. తమ న్యాయమైన కోర్కెల కోసం శాంతియుతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే తాడేపల్లి పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి 17 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో సీబీ వెంకట రమణారెడ్డి (కర్నూలు), ప్రేమనాధ రెడ్డి (అనంతపురం), జె. రమేష్ (కర్నూలు) కులాయప్ప (అనంతపురం), అజయ్ (విజయనగరం) తవిడి నాయుడు (విజయనగరం), సత్యనారాయణ (గుంటూరు) ఉన్నారు. -
నా బిడ్డను అన్యాయంగా తీసుకెళ్లారయ్యా
పట్నంబజారు: అర్ధరాత్రి .. రెండు గంటల సమయం.. పోలీసులు ఇంటి గోడలు దూకి దబదబా తలుపులు కొట్టారు.. దూకుడుగా ఇంట్లోకి ప్రవేశించి బీటెక్ చదువుతున్న విద్యార్థిని కాలర్ పట్టుకుని లాక్కుని బయటకు వెళ్లారు.... ఆపైన చోరీ చేసినట్లుగా ఇళ్లంతా వెతికారు.. ఇదంతా బయటి వ్యక్తులు చేసిన పని కాదు.. సాక్షాత్తు పోలీసులు వ్యవహరించిన తీరిది. దీనిపై విద్యార్థి తండ్రి దేవరకొండ మల్లి వివరాలు ‘సాక్షి’కి వివరించారు. ఓబులనాయుడుపాలెంలో నివాసం ఉండే దేవరకొండ మల్లి తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు రాజమనోహర్ బీటెక్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులమంటూ రెండు జీవుల్లో వచ్చిన పోలీసులు బలవంతంగా విద్యార్థి రాజ మనోహర్ను లాక్కొని వెళ్లారు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని పక్కకు నెట్టి విద్యార్థిని తీసుకెళ్లారు. లాలాపేట పోలీసు స్టేషన్ అని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు లాలాపేట పోలీసు స్టేషన్కు వెళ్లగా, తాము ఎవరిని తీసుకు రాలేదని తెలిపారు. కొత్తపేట పోలీసు తీసుకెళ్లినట్లు ధృవీకరించారు. పలుమార్లు పోలీసులు కొత్తపేట, లాలాపేట అంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులను తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 10 గంటల వరకు తిప్పినట్లు బాధితులు వాపోయారు. తన కుమారుడిని ఏ కేసులో తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారనే అంశంపై ఎలాంటి వివరణ తమకు చెప్పలేదన్నారు. తమ కుమారుడు హ్యాకింగ్ చేశాడని చెబుతున్నారని, తన కుమారుడు అలాంటి వాడు కాదని చెప్పారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక ప్రజాప్రతినిధి గురించి పెద్దఎత్తున హల్చల్ అయిన విషయం విదితమే. ఈక్రమంలో ఆ కేసులో విద్యార్థి పోస్టింగ్ పెట్టాడనే నెపంతో తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. సదరు విద్యార్థి పోస్టింగ్ పెట్టాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.వీరయ్య చౌదరిని వివరణ కోరగా, కేసు విచారణలో ఉందని, మీడియాకు వివరాలు వెల్లడించలేమని తెలిపారు. పోలీసుల తీరుపై ఘొల్లుమన్న తండ్రి -
● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
అక్రమ కేసుతో ఎంపీపీని వేధించడం దారుణం యాదవ యువజన రాష్ట్ర అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ పొన్నూరు: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటం దారుణమని ఆంధ్రప్రదేశ్ యాదవ యువత రాష్ట్ర అధ్యక్షులు పొన్నూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ ఆరోపించారు. పెదకాకాని మండల పరిషత్ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయ కులు తుల్లిమిల్లి శ్రీనివాసరావుపై అక్రమ కేసుతో ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఎంపీపీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జలకళ ద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా శ్రీనివాసరావుని మాత్రమే బాధ్యుడిని చేయడం దారుణమన్నారు. రాజకీయంగా అణచివేసే పన్నాగంలో భాగంగా బలహీన వర్గా లను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే యాదవ కులానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని యాదవులంతా ఒక్కటై కూటమిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని అన్నారు. నిరాధారమైన ఆరోపణలతో ఎంపీపీపై పెట్టిన అక్రమ కేసును తీసివేసే వరకూ ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జ్వరంతో ‘నారాయణ’ విద్యార్థి మృతి లక్ష్మీపురం: నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థి జ్వరంతో బుధవారం మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, బోనపల్లె గ్రామానికి చెందిన ఏలూరి వెంకట సుబ్బయ్య, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ(15), రెండో కుమారుడు దీక్షిత్లు గుంటూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్నారు. వెంకట నారాయణ పలకలూరు క్యాంపస్లో పదో తరగతి, దీక్షిత్ పట్టాభిపురం ఐఐటీ క్యాంపస్లో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్లోనే ఉంటున్నారు. వెంకట నారాయణ వారం రోజుల నుంచి జ్వరంతో ఉండటంతో ఈ నెల 2వ తేదీన తల్లిదండ్రులు వచ్చి స్వగ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సోమవారం పలకలూరులోని క్యాంపస్లో దిగబెట్టి వెళ్లారు. జ్వరం మళ్లీ రావడంతో మంగళవారం రాత్రి గుంటూరు గుజ్జనగుండ్లలో ఉండే మేనమామ మహేష్కు ఫోన్ చేయడంతో బుధవారం ఉదయం సుమారు 6.30 గంటలకు క్యాంపస్కు వచ్చి బాలుడిని గుజ్జనగుండ్లలోని తన సోదరి అనసూయ ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత స్థంభాలగరువులోని ఎంజీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో వెంకట నారాయణ మృతి చెందాడు. మధ్యాహ్నం సుమారు 2.20 గంటల సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వచ్చి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీస్స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని అంబులెన్స్లో జోరువానలోనూ స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచారు. 14 మంది బాల కార్మికులు గుర్తింపు నెహ్రూనగర్: బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎం.బాలు నాయక్తో కలిసి బుధవారం చిలకలూరిపేట రోడ్డులో మిర్చి గ్రేడింగ్ చేసే పాయింట్లో తనిఖీలు నిర్వహించారు. పని చేస్తున్న 14 మంది బాల కార్మికులను గుర్తించారు. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు కోర్టులో ప్రవేశపెట్టారు. బాలలతో ఎక్కడైనా పని చేయిస్తున్నట్లు గుర్తిస్తే 94925 55144 ఫోను నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరంమంగళగిరి టౌన్: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళగిరి నగర పరిధిలోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఎంహెచ్వో విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు హాజరయ్యారు. ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు దృశ్య రూపకం ప్రదర్శించారు. తల్లులకు ప్రోటీన్ పౌడర్, పండ్లు, రాగి జావలను పంపిణీ చేశారు. యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కె.సరిత, ఎయిమ్స్ సీఎఫ్ఎం హెచ్ఓడీ డాక్టర్ రాజీవ్, ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్తు వెంకటాచలం, డాక్టర్ సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అధికారమే అండగా డీలర్ల దందా!
● తాడికొండ మండలంలో పెట్రేగిపోతున్న రేషన్ మాఫియా ● నగదు ఇచ్చి నల్లబజారుకు యథేచ్ఛగా బియ్యం తరలింపు ● జేబులు నింపుకొంటున్న టీడీపీకి చెందిన ఇద్దరు డీలర్లు తాడికొండ: వాస్తవంగా పౌర సరఫరాల శాఖ గోదాము నుంచి సరుకును రేషన్ డీలర్లకు తరలించాలంటే వేర్ హౌస్ గోదాముల నుంచి వచ్చిన బస్తాలను తూకం వేయాలి. అనంతరం డీలర్లకు తూకం వేసి, రేషన్ షాపుల వద్ద అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన సరుకును నేరుగా వాహనంలోకి ఎక్కించి తూకం వేయకుండానే డీలర్లను కాటాలో నిలబెట్టి తరలిస్తున్నారు. బస్తాకు 2 కేజీలకుపైగా బియ్యాన్ని మాయం చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు ఇచ్చినా... ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ‘రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్’ పేరిట ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు విచారణ చేశారు. సరుకులో కోత విధిస్తున్నారని పలువురు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. మరుసటి నెల నుంచి గోదాము ఇన్చార్జి నేతృత్వంలో అదే తంతు కొనసాగుతోంది. ఓ వైపు డీలరుగా, మరోవైపు హమాలీగా విధులు నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తి నేతృత్వంలో గోదాములో జోరుగా రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతోంది. తాడికొండలోని ఓ సీనియర్ నాయకుడికి అనుచరుడిని అని చెప్పుకొంటున్న మరో రేషన్ డీలరు ఏకంగా తానే రేషన్ డీలర్లకు అధ్యక్షుడినని పెత్తనం చెలాయిస్తుండటం గమనార్హం. 5 సంవత్సరాల నుంచి బియ్యం పంపిణీ చేస్తున్న పాయింట్ వద్ద సరుకు డెలివరీ ఇవ్వాలని, గతంలో పాడుబడిన భవనంలో ఉన్న పాయింట్ వద్ద పెడితే సరుకు ఇస్తామని అధికారులతో చెప్పించాడు. సరుకు డెలివరీ నిలిపి వేయించాడు. గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడి జోక్యం చేసుకున్నా గొడవలు ఎందుకంటూనే తన అనుచరుడికి మద్దతు ఇచ్చాడు. దీంతో బాధితుడు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన భవనంలోకే సరుకు దించుకోవాల్సి వచ్చింది. వర్షం పడితే నీరు కారుతుందని మరో గదిలోకి మార్చడంతో తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని డీలరు వాపోతున్నారు. అనుకూలమైన వారికే స్టాకు అధికార పార్టీ డీలరు ఏకంగా రెండో పాయింట్ ఏర్పాటు చేశాడు. లబ్ధిదారులకు నగదు ఇచ్చి ఇద్దరు డీలర్లు సరుకును నల్లబజారుకు తరలిస్తున్నారు. సీనియర్ నాయకుడి అండదండలు ఉన్నాయి. తూకంలో తేడాలు, అనుకూలమైన వారికి స్టాకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాడికొండలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు డీలర్ల హవా నడుస్తోంది. పౌర సరఫరాల శాఖ గోదాము మొదలు పంపిణీ వరకు వారి కనుసన్నల్లో అక్రమాలకు జోరుగా సాగుతున్నాయి. పేదల బియ్యంతో వారి జేబులు నింపుకొంటున్నారు. ఆర్డరు కాపీ పరిశీలిస్తా దీనిపై పౌర సరఫరాల శాఖ డీటీ దేవరాజును వివరణ కోరగా... సదరు డీలరు రెండో పాయింట్ పెట్టుకునేందుకు ఆర్డీవో నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు తనకు తెలిపాడన్నారు. అందుకు సంబంధించిన ఆర్డరు కాపీ తన వద్ద లేదన్నారు. తెప్పించుకొని పరిశీలిస్తానని పేర్కొన్నారు. -
జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మంగళగిరి టౌన్: విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నగర పరిధిలోని ఆత్మకూరు బైపాస్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేగాయి. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసేందుకు ఉపయోగించే లారీగా దీనిని గుర్తించారు. రహదారి పక్కనే ఆపిన లారీలో నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న నాలుగు సిలిండర్లు పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. పేలుడు శబ్దం ధాటికి సమీపంలో ఉన్న ప్రజలు, వాహన దారులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగే సమయంలో భారీగా ట్రాఫిక్ ఆగిపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసులు వచ్చి క్రమబద్ధీకరించారు. -
చేనేత వస్త్రాలు అంటే జాతీయ స్థాయిలో మంగళగిరికి పేరుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మంగళగిరి నేతన్నలది. ఒకప్పుడు వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు జిల్లాలో 80 వేలకుపైగా ఉన్న మగ్గాలు నేడు 35 వేలకు తగ్గి
మంగళగిరి: నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి అంటే చేనేత గుర్తుకు వచ్చేలా ముఖద్వారంలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. చేనేత సెంటర్గా పేరుపెట్టారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వారికి మంగళగిరి అంటే చేనేత అని గుర్తుకు వచ్చేలా ప్రకాశం బ్యారేజి వద్ద నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి కార్మికుడుకి నెలకు రూ.రెండు వేలు చొప్పున ఏటా రూ.24,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లా వ్వాప్తంగా 3,500 కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నాడు రాజీవ్ గృహ కల్ప కాలనీ వద్ద చేనేత షెడ్లు నిర్మించారు. 146 మగ్గాలు ఉచితంగా అందజేసి సుమారు 1,500 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. పాత బస్టాడ్ ప్రగడ కోటయ్య, వైఎస్సార్ల పేరిట ఆవరణలో చేనేత భవనాన్ని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించింది. తెనాలి రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయే వారికి చేనేత భవన్లో దుకాణాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందింది. నేడు అంతటా నిర్లక్ష్యమే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేనేత పరిశ్రమను పూర్తిగా విస్మరించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత భవన్ కట్టిందనే కక్షతో నేటికీ ప్రారంభించలేదు. దీంతో నేత దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో గెలిచి మంత్రి అయిన నారా లోకేష్ ఇప్పటికీ చేనేత పరిశ్రమను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నా ప్రభుత్వం విస్మరించింది. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుడు గుంట మగ్గంలో నేయడానికి కూలీకి వెళ్తే రోజుకు రూ.250 మించి రావడం లేదు. వేసవికాలంలో రూ.150 కే ఈ మొత్తం పరిమితం. సుదీర్ఘకాలం పనిచేస్తే అనారోగ్యం పాలవుతున్నారు. నాడు కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కూటమి సర్కార్ వచ్చాక తప్పని అష్టకష్టాలు నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు అన్నివిధాలా విఫలం నేడు జాతీయ చేనేత దినోత్సవం పూట గడవని దుస్థితిలో నేతన్నలు చంద్రబాబు చేనేత పరిశ్రమకు, కార్మికులు మేలు చేస్తారని ఓటేశాం. మంత్రి లోకేష్ కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ పాలనలో నెలకు రూ.రెండు వేలు చొప్పున వచ్చేవి. బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అయ్యేవి. కార్మికులు సంతోషంగా జీవించేవారు. నేడు ఏ రోజుకా రోజు పని చేస్తేనే పూట గడిచే దుస్థితిలోఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి. – వెంకటేశ్వరరావు, చేనేత కార్మికుడు -
కామన్ ఫెసిలిటీ సెంటర్కు స్థల పరిశీలన
మోతడక (తాడికొండ): నేషనల్ లైవ్లీ హుడ్ మిషన్ నేతృత్వంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం సభ్యులు తాడికొండ మండలం మోతడక గ్రామంలో బుధవారం పర్యటించారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు తదితర యూనిట్లను పరిశీలించారు. అనంతరం బండారుపల్లి, నిడుముక్కల గ్రామాలలో పర్యటించారు. ఎంఎస్ఎంఈ కింద ఎన్ఆర్ఎల్ఎం నిధులతో పికిల్ హబ్ ఏర్పాటుకు గ్రామంలో 4 ఎకరాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీతోపాటు కామన్ ఫెసిలిటీ హబ్ను రూ.20 కోట్లతో ఏర్పాటు చేసే దిశగా స్థల పరిశీలన చేసినట్లు ఏపీఎం సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ బృందం సభ్యులు అరవింద్ పటేద్, జనార్దన్, హైదరాబాద్కు చెందిన నేషనల్ లైవ్లీ హుడ్ సభ్యులు గోపాలకృష్ణ, డైరెక్టర్లు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి, ఏపీడీలు కిరణ్ కుమార్, డీపీఎం అశోక్ కుమార్, తహసీల్దార్ మెహర్ కుమార్, ఏపీఎం సాంబశివరావు, సీసీలు సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైస్తవులపై అక్రమ కేసుల ఎత్తివేతకు డిమాండ్
నెహ్రూనగర్: చత్తీస్గడ్లో ఇద్దరు నన్లను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిపై అక్రమ కేసులను ఎత్తివేయాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతి డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యమ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రైస్తవ, దళిత, బహుజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్న పునీత ఆగ్నేసమ్మ దేవాలయం నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతమార్పిడుల పేరుతో సిస్టర్లను అన్యాయంగా అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులపై ఐక్యంగా ఉంటూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బలవంతపు మత మార్పిడి ఎవరూ చేయరని, సమాజంలో అట్టడుగువర్గాల అభివృద్ధికి క్రైస్తవ మతం కృషి చేస్తుందన్నారు. వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జె విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వారు కూడా భారతీయులేనని గ్రహించలేని స్థితిలో మతోన్మాదులు ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆనంతరం డీర్ఆర్ఓ ఖాజావలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గాబ్రియేల్, సహదేవ్, నెహెమ్యా, మార్కు, బాబురావు, సతీష్కుమార్, కిరణ్, రాజు, రేపూడి రాయప్ప, అబ్రహం, విజయ్పాల్, వివిధ సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, మద్దు ప్రేమజ్యోతిబాబు, డాక్టర్ కర్రా హనోక్ బెంజిమెన్, రత్నశ్రీ, జీఆర్ భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో క్రైస్తవ సంఘాల భారీ శాంతి ర్యాలీ -
కూటమికి బీసీలు అంటే అంత అలుసా?
పెదకాకాని: కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్యాదవ్ అన్నారు. పెదకాకానిలోని రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి నివాసంలో బుధవారం మండల ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలే పార్టీకి వెన్నుముక అని ప్రచారం చేసే కూటమి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. మూడు సంవత్సరాల కిందట జరిగిన జలకళ పథకంలో అక్రమాలు జరిగాయని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుకు గిట్టని వారితో ఫిర్యాదు చేయించి అరెస్టు చేయించడం ముమ్మాటికీ రాజకీయకక్షే అన్నారు. ఈనెల 3వ తేదీన ఓ దినపత్రికలో సీనియర్ ఎమ్మెల్యేపై ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అని ప్రచురణ కావడంతో సీనియర్ ఎమ్మెల్యే ఎవరబ్బా అని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు సందిగ్ధంలో ఉన్నారన్నారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యే ఎవరో ఆ పార్టీ నాయకులే విలేకరుల సమావేశం పెట్టడం, అదే పత్రికతో పాటు పలు పేపర్లలో ఈనెల 5వ తేదిన తక్కెళ్ళపాడు కల్యాణ మండపం వ్యవహారంలో ఎమ్మెల్యే నరేంద్ర తప్పేంలేదని ప్రచురించడం చూస్తే ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరో సమాజానికి స్పష్టంగా తెలియజేశారన్నారు. ఈ వ్యవహారంపై ప్రజల ఆలోచన, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చను ప్రక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం ఎంపీపీని ఒక పథకం ప్రకారం అరెస్టు చేయించిందన్నారు. గతంలో అనుమర్లపూడిలో జరిగిన సంఘటన రోజు నుంచి ఎంపీపీపై ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. కేవలం రాజకీయకక్షతోనే ఎంపీపీని అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. ఇటీవల కాలంలో పొన్నూరు రూరల్ మండలం, మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావును కూడా రాజకీయ కక్షతో హత మార్చేందుకు ఎమ్మెల్యే అండదండలతో హత్యాయత్నం చేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లయదుల వెంకటేశ్వర్లు, పొన్నూరు నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు కూరాకుల మత్యేశ్వరరావు, మండల రైతు విభాగం అధ్యక్షుడు ఆర్ధల బ్రహ్మం, బిసి సంఘం నాయకులు వేల్పుల నాగరాజు, ఆలా శ్రీనివాసరావు(సఫారీబాబు), గుమ్మా సాయి, దానబోయిన నాగేశ్వరరావు, రామయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి వైఎస్సార్సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ యాదవ్ -
పొగాకు రైతులను బలి చేయొద్దు
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు రైతులను బలి చేయొద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. సంఘాల ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్లోని వ్యవసాయ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీతో పొగాకు కొనుగోలు ఆపేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన విరమించుకోవాలని పేర్కొన్నారు. 20 శాతం మాత్రమే కొన్నారని తెలిపారు. మిగతాదీ కొనకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ధర కూడా తగినంత ఇవ్వడం లేదని చెప్పారు. నాణ్యత లేదని పొగాకు వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మకై ్క బయ్యర్లు ధర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ కొనుగోలు చేసిన పొగాకుకు సంబంధిత రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు అందుబాటులో లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నల్లమడ సంఘం నాయకులు కొల్లా రాజమోహన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్కుమార్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. రాధాకృష్ణమూర్తి, నంద్యాల జిల్లా రైతు నాయకులు వెంకటేశ్వర గౌడ్, రైతు సంఘాల నాయకులు కొల్లి రంగారెడ్డి, పాడిబండ్ల కోటేశ్వరరావు, బండి శంకరయ్య, బిక్కి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత
ప్రత్తిపాడు: ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత సాధ్యపడుతుందని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు అన్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలోని సుప్రీం ఎల్టీసీలో బుధవారం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు గుంటూరు జిల్లాలోని 17 మండలాల ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు హాజరయ్యారు. వారు ఆరు బృందాలుగా క్లాప్ మిత్రలతో కలిసి ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ విధానాలపై ఆరా తీశారు. మహిళలతో మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ లక్ష్యాలను అనంతరం రచ్చబండ సెంటరులో ప్రజలకు వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ చేయించారు. తదనంతరం గ్రామంలోని సుప్రీం ఎల్టీసీని సందర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మాట్లాడుతూ గ్రామాల స్వచ్ఛతపై యంత్రాంగం పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్ మాట్లాడుతూ తుమ్మలపాలెం పంచాయతీలో జరుగుతున్న అన్ని రకాల స్వచ్ఛతా కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగేలా ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు చూడాలన్నారు. గుంటూరు డీఎల్పీవో శ్రీనివాసరావు గ్రామంలో విజయవంతంగా స్వచ్ఛతను అమలు చేస్తున్నారన్నారు. గ్రామ సర్పంచ్ చల్లా నాగమల్లేశ్వరి, కార్యదర్శి షేక్ ఖాజా, క్లాప్ మిత్రులను సత్కరించారు. ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు, డీపీఆర్సి ప్రతినిధులు నిరంజన్, కరీముద్దిన్, అనురాధ, ఐటీసీ ఫినిష్ సొసైటీ కోఆర్డినేటర్ యశ్వంత్ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు -
9న మున్సిపల్ కార్యాలయాల ఎదుట టూల్డౌన్
మంగళగిరి టౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబరు 36పై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వైఎస్సార్ట్రేడ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాయాల వద్ద టూల్డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36పై స్పష్టత ఇవ్వకపోవడం, అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట దుర్గారావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు రత్నాకరం శ్రీనివాసరాజు, పట్టణ వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు నక్క నాగరాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి గుంటూరు మెడికల్: మున్సిపాలిటీ తరహా పారామెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని పారా మెడికల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రమేష్ బాబు అన్నారు. ఆయన బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ వెద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక సేవలు అందిస్తున్నారన్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తేనే సమస్యలను పట్టించుకుంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీతాలు పెంచాలని పేర్కొన్నారు. సీనియారిటీ ప్రకారం కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రుల కమిటీలోని తుది నిర్ణయాలు న్యాయం చేసేలా చూడాలని, లేదంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. ‘విద్యా శక్తి’పై నిర్బంధం తగదు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను కలిసిన నాయకులు తమ ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పలుచోట్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అలసిపోయిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. హెచ్ఎంలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డీఈవో మాట్లాడుతూ కార్యక్రమం నిర్బంధ కాదని, ఐచ్ఛికమేనని తెలిపారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, డీకే సుబ్బారెడ్డి, ఎండీ ఖలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుమలేష్, ఎం.కళాధర్, డి.పెదబాబు, బాలాజీ, వై.శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా భూ వరాహస్వామి జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై భూ వరాహస్వామి జయంతి ఉత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనములతో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ భూవరాహ హోమం, అష్టోత్తర శతనామార్చన, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం నిర్వహించామని పేర్కొన్నారు. స్వామి నారాయణ సంస్థ నుంచి స్వామిజీ మహారాజ్ సేవకులు శ్రీ నారాయణ చరణ్ స్వామి బృందంతో విచ్చేశారన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
వృద్ధురాలు హత్య
లక్ష్మీపురం: వృద్ధురాలిని కొట్టడంతో కింద పడి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం గుజ్జనగుండ్లలో చోటు చేసుకుంది. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జనగుండ్ల ప్రాంతానికి చెందిన ఆకుల అంజమ్మ (70)కు కుమార్తె ఉప్పాల త్రివేణి ఉంది. త్రివేణికి తారకరామనగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి స్నేహితురాలు. ఇద్దరు కలిసి బంగారం తాకట్టు పెట్టిన వ్యవహారంలో మనస్పర్థలు వచ్చాయి. లక్ష్మీతో త్రివేణి భర్త దురుసుగా ప్రవర్తించాడు. ఆమెకు సర్దిచెప్పడానికి త్రివేణి గుజ్జనగుండ్లకు వెళ్లింది. ఆ సమయంలో లక్ష్మి బయటకు వెళ్లగా.. ఆమె తల్లి అంజమ్మ ఉంది. త్రివేణిని చూడగానే ఆమెను దుర్భాషలాడింది. కోపంలో త్రివేణి ఆమెను చెంపపై గట్టిగా కొట్టడంతో కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న లక్ష్మీ వెంటనే పట్టాభిపురం పోలీసులకు సమాచారం తెలిపింది. వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై త్రివేణిలు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జీజీహెచ్కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. -
అక్రిడిటేషన్లు జర్నలిస్టుల ప్రాథమిక హక్కు
గుంటూరు వెస్ట్: సమాజానికి ఫోర్త్ ఎస్టేట్గా సేవలందిస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందడం ప్రాథమిక హక్కని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎన్ మీరా, కె.రాంబాబు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింన్నారు. ఏడాదిన్నర దాటుతున్నా నూతన అక్రిడిటేషన్లుగాని, బదిలీ ప్రక్రియగానీ చేపట్టలేదన్నారు. మూడు నెలలకొకసారి పొడిగించుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జర్నలిస్టులు కనీసం బస్పాస్ అవకాశం కూడా సరిగ్గా పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి బదిలీ అవుతున్న సీనియర్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు కూడా బదిలీ చేయడం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని గుర్తుచేవారు. దీనిని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రద్దు చేసిన యాక్సిడెంటల్ పాలసీలను కూడా పునరుద్ధరించాలన్నారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాల తరహాలో సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు మూడు నెలలకొకసారి మీటింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియర్ నాయకులు భక్త వత్సల రావు, కందా ఫణీంద్ర, కిరణ్, సువర్ణ కుమార్, శ్రీనివాస్, గిరి, కరీం బాషా, తిరుపతి రెడ్డి, ఆసిఫ్ ఖాన్, సుభాని, కార్తీక్ పాల్గొన్నారు. -
ఇన్స్పైర్ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు రేకెత్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మానక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలని గుంటూరు జిల్లా ఉపవిద్యాశాఖాధికారి జి.ఏసురత్నం పేర్కొన్నారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో ఇన్స్సైర్ మానక్పై డివిజన్ పరిధిలోని సైన్సు ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసురత్నం మాట్లాడుతూ భావి శాస్త్రవేత్తల రూపకల్పనకు నాందిగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి మూడు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, హైస్కూల్ ప్లస్ నుంచి ఏడు చొప్పున నామినేషన్లు పంపాలని స్పష్టం చేశారు. పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్మీరా, రీసోర్సు పర్సన్లు డి. శివ శంకరరావు, డీవీ రమణ, పి. మల్లికార్జునరావు, ఎం.అప్పారావు, గంగాధర్ పాల్గొన్నారు. -
ఘర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి
గుంటూరు మెడికల్: బీజేపీ గుంటూరు జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం నగరంలోని శ్రీకన్వెన్షన్లో జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ అమృత మహోత్సవ్ పేరుతో జాతీయ జెండా పట్టుకొని 13, 14, 15వ తేదీలలో ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాష్ నారాయణలు మాట్లాడుతూ జిల్లా పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తలు నేటికీ పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. పి.వి.ఎన్.మాధవ్ గుంటూరు పర్యటన సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో చిల్లీస్ దాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి స్వాగతించారు. తీన్మార్ డప్పులు, గిరిజన సంప్రదాయ నత్యాలు, పార్టీ జెండాలతో సందడి చేశారు. ద్విచక్ర వాహనాల ర్యాలీ ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధికి సహకారం మంగళవారం గుంటూరు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలోనే గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రూ.100 కోట్ల యూజీడీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అమరావతి ఆయువుపట్టు అయిన ఓఆర్ఆర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.