breaking news
Guntur District Latest News
-
గుంటూరు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
అథ్లెటిక్స్లో ప్రతిభ చాటిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు
నగరంపాలెం: గతనెల 30 నుంచి ఈనెల రెండు వరకు రాజస్థాన్ అజ్మీర్లోని పటేల్ సింథటిక్ స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. పలు పోటీల్లో పతకాలు సాధించిన ఏఆర్ హెచ్సీ ఎండీ షాహిదుల్లా (బంగారు పతకం), కానిస్టేబుల్ ఎం.లక్ష్మయ్య (వెండి పతకం), విశేష ప్రతిభ చాటిన ఏఎస్ఐ ఎం.సాంబశివరావును సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పతకాలు సాధించి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు, ప్రతిష్టలు తేవాలన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
వెట్టి చాకిరి నిర్మూలనలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమష్టి కృషితోనే వెట్టి చాకిరీ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ ఒక సామాజిక దురాచారమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనంకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెట్టి చాకిరి వ్య వస్థ నిర్మూలన చట్టం ద్వారా ఈ వ్యవస్థను పూర్తి గా నిషేధించిందన్నారు. చట్టంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం, బాధితులను గుర్తించడం, పునరావాసం కల్పించడంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా బలవంతపు కార్మిక వ్యవస్థ, అప్పుల బానిసత్వం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచా రం ఇవ్వాలన్నారు. బాధితులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. సామాజిక సంస్థలు, స్వచ్ఛందసంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ గౌర వప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో సమాజం ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. డీఆర్వో షేఖ్ఖాజావలి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రి దేవి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, డీపీఓ బీవీ నాగ సాయి కుమార్, కార్మిక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’
గుంటూరు ఎడ్యుకేషన్: రెండు రోజులపాటు జేకేసీ కళాశాల రోడ్డులోని జేసీ లా కళాశాలలో నిర్వహించిన 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీల్లో తమిళనాడుకు చెందిన సత్యభామ స్కూల్ ఆఫ్ లా, ఈరోడ్ న్యాయ కళాశాల విద్యార్థి బృందాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి వరకు జరిగిన పోటీల్లో విజేతలకు వరుసగా రూ.37,500, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్బాబు సోమవారం తెలిపారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ వేమన కుప్పుస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా..?
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేయటంతో పాటు, ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం సిద్ధార్థర్లోని అంబటి నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ముందుగా దాడి జరిగిన కార్యాలయం, ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత -
రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ● ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి -
అంతర్జాతీయస్థాయికి తెలుగు నాటకం
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం నాలుగో రోజుకి చేరింది. సోమవారం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యురాలు ముత్తవరపు భార్గవిచౌదరి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించేలా భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతుందని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ నాటకోత్సవాలను ఏపీకి తేవడం అభినందనీయమన్నారు. సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, బుద్దాల వెంకట్రావు, వి.పురుషోత్తమం, దేవేంద్రలను సత్కరించారు. అనంతరం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ అనే రష్యన్ నాటకం ప్రదర్శించారు. రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకి అద్భుత సృజన దృశ్యరూపంగా మలిచారు. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను నాటకం ఆవిష్కరించింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది. మానవీయ విలువలు చాటిన రష్యన్ నాటకం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ -
శేష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరిటౌన్ : మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడవరోజు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు దాతలు ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గోలి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గోలి చిన్నారావు, గోలి నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, గోలి శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థాన ఈ.ఓ. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు
గుంటూరు వెస్ట్: ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఈ డ్రోన్ సేవలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఉబర్ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రాష్ట్రంలో సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఒకే యాప్లో అనేక సేవలు లభిస్తాయని చెప్పారు. డ్రోన్ వినియోగం వల్ల సమయం, కూలి ఆదా అవుతుందని అన్నారు. సమీప ప్రాంతంలోనే అద్దెకు డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్లే స్టోర్లో ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్న్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లేదా సంబంధిత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. యువత జీవితాలను కాపాడుదాం మాదక ద్రవ్యాలను నివారించి, యువత జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. ● ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 118 మందిపై కేసులు నమోదు చేశామని, గుంటూరు పట్టణంలో 28 హాట్స్పాట్లు, 92 ఉపయోగంలో లేని భవనాలు గుర్తించామని చెప్పారు. -
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యంకు అధిక ధరలు ఆశ చూపి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కొందరు చీకటి వ్యాపారాన్ని చేస్తున్నారు. పగలు సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో దర్జాగా వాహనాల్లో తరలిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చామంటూ నిర్భీతితో బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. కళ్లముందే అన్ని జరుగుతున్నా వారిపై చర్యలు శూన్యం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థతోపాటు దుగ్గిరాల మండలంలో రేషన్ షాపు లు నిర్వహిస్తున్న నిర్వాహకులు తమ జేబులు నింపుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ బయో మెట్రి క్ వేయించుకుని రేషన్ ఇవ్వకుండా అరకొర నగదు ఇచ్చి లబ్దిదారులను మభ్యపెడుతు నెలకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వెనుకవేసుకుంటున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో 136 రేషన్ షాపులు ఉండగా, సుమారు 70వేలకు పైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. వీరికి నెలకు సుమారు 10వేల టన్నులకు పీడీఎస్ బియ్యం రేషన్ బియ్యంగా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ముందుగానే బయోమెట్రిక్... 60ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానపడ్డ వారికి ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నిబంధన కొంతమంది డీలర్లకు బాగా కలసి వచ్చింది. నేరుగా ఈ–పాస్ మిషన్ను లబ్ధిదా రుని ఇంటికి తీసుకువెళ్లి వేలిముద్ర తీసుకుని ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పి వచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ షాపు యజమానులు సివిల్ సప్లయీస్ నుంచి బియ్యం రాగానే ఎవరైతే బియ్యం తీసుకోరో వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్లి వేలిముద్రలు వేయించుకుని ఒక కేజీ బియ్యానికి రూ 5 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. బియ్యంతోపాటు పంచదార అమ్ముకుంటున్నారు. మిల్లర్లకు కేజీ రూ.25 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు. రేషన్ డీలర్లు సేకరించిన బియ్యాన్ని హోటల్స్ కు పంపగా.. మిగిలిన బియ్యాన్ని మండలంలో ఓ వ్యక్తి సేకరించి నియోజకవర్గంలోని దుగ్గిరాల, మంగళగిరి రూరల్ పరిధిలోని పలు మిల్లులకు అర్ధరాత్రి ఆటోల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడా కూడా పోలీసులు కానీ, సివిల్ సప్లయ్ అధికారులు గానీ తనిఖీలు నిర్వహించకపోవడంతో రేషన్ మాఫియాకు హద్దు లేకుండా పోయింది. ఒక లారీ ట్రిప్ గమ్యస్థానానికి చేరితే రాత్రికిరాత్రే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. దీంతో కేసులు పెట్టినా పట్టించుకోకుండా ఈ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పంచదార నిల్వలను పెద్ద పెద్ద దుకాణాలకు పంపించి, లావుగా ఉన్న పంచదారలో ఈ పంచదారను కలిపి కల్తీ చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
పోటీల్లో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశాతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ
నగరంపాలెం: ఏఆర్ బలగాల శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా శిక్షణ (మొబిలైజేషన్) నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం పోలీస్ కవాతు మైదానంలో జిల్లా ఏఆర్ బలగాలకు డి–శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏఆర్ బలగాలకు శిక్షణ, డి–శిక్షణ నిర్వహించడం తప్పనిసరని అన్నారు. వీవీఐపీ, వీఐపీ కార్యక్రమాలు, విస్తృత బందోబస్త్ విధులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ను జిల్లా భద్రత విభాగ ఆర్ఐ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. జిల్లా భద్రత విభాగపు పోలీస్ జాగిలం (సింబా) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం ప్రతిభను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సంకురయ్య (ఏఆర్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు నాగుల్మీరా, బిలాలుద్దీన్, ఆర్ఐలు శివరామకృష్ణ, శ్రీహరిరెడ్డి, సురేష్, శ్రీనివాసరావు, ఆర్ఎస్లు, ఏఆర్ బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవాపురస్కారం
తెనాలి: తెనాలి కెమెరా క్లబ్కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్ఏఎఫ్యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్ఓడీ కమల్రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. -
ఇంటర్కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోనే అధికం ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు -
లారీలో షార్ట్ సర్క్యూట్
నిమిషాల్లో దగ్ధమైన క్యాబిన్ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బిహార్కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఖాజావలి సూచించారు. నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు. -
కొనసాగుతున్న వైద్య ప్రదర్శన
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనాటమీ, జనరల్ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు. ఒక్కరోజే 4,184 మంది సందర్శన... ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్ తెలిపారు. ముందస్తుగా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు. -
అంబటి ఇంటి వద్ద పోలీసుల అత్యుత్సాహం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఆదివారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల కాలంలో అంబటి నివాసంపై, కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చాయి. పలువురు నేతలు కూడా ఇందులో భాగంగా వచ్చి, వెళ్తున్నారు. ఆదివారం ఇదే క్రమంలో అంబటి నివాసానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరికొంతమంది వచ్చిన నేపథ్యంలో పట్టాభిపురం ఎస్ఐ నాగేంద్ర ఓవర్ యాక్షన్ చేశారు. అంబటి ఇంటి వద్ద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోయినా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అంటూ హడావుడి చేశారు. అక్కడ పెట్టిన కార్లన్నీ తీయాలని చెప్పడంతో పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జోక్యం చేసుకొని అంబటి నివాసం వద్ద నాలుగు నివాసాల వారివే ఉన్నాయని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము క్రమశిక్షణగానే వాహనాలను పార్కింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఎస్ఐ నాగేంద్ర అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించటం సరికాదంటూ అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. -
భూమిని కాజేసేందుకు చంద్రబాబు కుట్ర
రూ.2వేల కోట్ల విలువైన మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న 72 ఎకరాల అంజుమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన వ్యవసాయ భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా విమర్శించారు. గుంటూరు మంగళదాస్నగర్లోని షేక్ నూరి ఫాతిమా నివాసం నుంచి మంగళగిరికి భారీగా ర్యాలీతో తరలివచ్చారు. చినకాకానిలో ఉన్న వక్ఫ్ భూములను ఆదివారం వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమాలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీవోలతో వక్ఫ్ భూములను కాజేయడానికి యత్నిస్తోందని, ఆ భూములను బడా వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసేందుకే ఈ కుట్ర అని అన్నారు. ఇప్పటికే రాజధానిలో అభివృద్ధి పేరుతో వేల ఎకరాలను ప్రభుత్వం తీసుకుందని రెండు సంవత్సరాలు గడిచినా అభివృద్ధి శూన్యమని అన్నారు. ముస్లిం సంస్థలకు చెందిన స్ధిరాస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చలో కలెక్టరేట్కు తరలిరండి ఈనెల 9న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని షేక్ నూరి ఫాతిమా కోరారు. ఈ భూములపై ఆధారపడిన పాఠశాల, మసీదు, రైతులు, షాదీఖానాలకు సంబంధించిన అందరి వద్ద నుండి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కలెక్టర్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం, గ్రీవెన్స్లో అభ్యంతర పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి పట్టణ, మండల అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, అమరా నాగయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతి, వైఎస్సార్ సీపీ జిల్లా, మండల, పట్టణ మైనార్టీ నాయకులు సుభాని, చాంద్బాషా, మాలిక్బాబు, యస్కె షఫీ, హుస్సేన్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు మౌలా బేగ్, హాజీ మహమ్మద్, షేక్ హుస్సేన్, షేక్ సమీవుల్లా, గుంటూరు వైఎస్సార్సీపీ నాయకులు పటాన్ సైదాఖాన్, ఖాసిం బేగ్, లియాఖత్ అలీ, సలీమ్, కరీమ్, కార్పొరేటర్ బాబు, రాజేష్, జానీ బాషా, సుభాని, రబ్బాని, శ్రీకాంత్రెడ్డి, అమీనా షరీఫుద్దీన్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘ఆ ఊరు – ఈ ఊరు’
కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’ నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి. -
నత్తనడకన ‘ఈ–క్రాప్’
చంద్రబాబు సర్కార్ తీరుతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ–క్రాప్ నమోదు నత్తనడకను తలపిస్తోంది. పంటల విస్తీర్ణంలో ఇప్పటికి సగం మాత్రమే నమోదు చేశారు. వ్యవసాయ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందికి సర్వేల పేరుతో పనిభారం పెంచడంతో ఈ–క్రాప్ నమోదు నీరసంగా సాగుతోంది. గడువులోగా పూర్తి స్థాయిలో నమోదుకు అవకాశం కనిపించటం లేదు. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదముంది. చంద్రబాబు సర్కారు దగా సబ్ డివిజనులో రబీలో సాగవుతున్న పంటలకు ఈ–క్రాప్ నమోదు చేస్తున్నాం. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ముందుకొచ్చి పంటల నమోదుకు తోడ్పడాలని కోరుతున్నాం. – ఆర్.విజయబాబు, ఏడీఏతెనాలి: గుంటూరు జిల్లాలో తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో గల వ్యవసాయ సబ్ డివిజనులో 51,170 ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో మొక్కజొన్న 26 వేలు, జొన్న 22 వేలు, మినుములు, పెసలు 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సబ్ డివిజనులో 43 రైతు సేవ కేంద్రాలు ఉండగా, 35 మంది వీఏఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. పంటల ఈ–క్రాప్ నమోదును డిసెంబరులో ఆరంభించారు. దుగ్గిరాలలో 19,918 ఎకరాలకు 10,965, తెనాలిలో 17,020 ఎకరాలకు 9,007, కొల్లిపరలో 14,232 ఎకరాలకు 6,553 ఎకరాలకు మాత్రమే ఈ–క్రాప్ నమోదు చేయగలిగారు. ప్రస్తుతానికి 26,526 ఎకరాలకే ప్రక్రియ పూర్తి అయింది. ముంచుకొస్తున్న గడువు ఈ–క్రాప్ నమోదుకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనుంది. ఆలోగా పూర్తి చేస్తారన్న భరోసా రైతులకు చిక్కటం లేదు. ఇందుకు ప్రధాన కారణం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషను వంటి పనులను అప్పగించడమే. రోజూ మధ్యాహ్నం నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సచివాలయం పరిధిలోని వీఏఏలు ఉదయం తమ పనులతోపాటు మధ్యాహ్నం నుంచి సర్వే, రిజిస్ట్రేషను పనులకు వెళ్లాల్సి వస్తోంది. పనిభారంతో అవస్థలు పడుతున్నారు. తరచూ సర్వర్లు మొరాయిస్తుండటం మరో సమస్య. దీంతో ఈ–క్రాప్ నమోదు పనుల్లో జాప్యం జరుగుతోంది. గతంలో సచివాలయం నుంచే నమోదుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం తప్పనిసరిగా పొలాలకు వెళ్లి, పంట వివరం, పంట రకం వంటి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఉపయోగాలు ఈ–క్రాప్ నమోదు రైతులకు ఎంతో కీలకం. మార్కెట్లో ధాన్యానికి ధరలు లేనపుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదుతోనే అవకాశం ఉంటుంది. పంట రుణాలు తీసుకోవాలన్నా, పంటల బీమా చేసుకుని ఏదైనా ప్రకృతి విపత్తుతో పంట దెబ్బతింటే నష్టపరిహారం పొందటానికీ సదరు ఈ–క్రాప్ నమోదయితేనే వర్తిస్తుంది. అయినప్పటికీ మూడు మండలాల్లో సగం విస్తీర్ణంలో ఇంకా నమోదు చేయకపోవటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఖరీఫ్ సీజనులో మోంథా, దిత్వా తుపాన్లకు పంట నష్టపోయిన రైతులు ఎవరికీ పరిహారం అందనేలేదు. వరి పొలంలో 33 శాతం పైబడి పంట నష్టపోతేనే ఎకరాకు రూ.10 వేలు, హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని నిర్ణయించారు. సబ్ డివిజను పరిధిలో తెనాలి మండలం కంచర్లపాలెంలో కొద్దిపాటి విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు నివేదిక పంపారు. సంబంధిత రైతులకూ పైసా పరిహారం అందలేదని చెబుతున్నారు. అలాగే 2024–25లో కొద్దిమంది రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, ఆయిలింజన్లు, డ్రోన్లు, రోటావేటర్లు వంటి వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సంవత్సరానికి వీటి పంపిణీ నిమిత్తం బడ్జెట్ కేటాయింపే జరగలేదని అంటున్నారు. బాబు పాలనలో అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు
పట్నంబజారు: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకే మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. లడ్డూలో కొవ్వు కలిసి ఉంటే తాము సుప్రీంకోర్టు తలుపుతట్టే వాళ్లమే కాదని స్పష్టం చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని టీడీపీ చెప్పటం దారుణమన్నారు. పవన్కళ్యాణ్ ఒక్క మాటపై నిలబడే పరిస్థితి లేదని విమర్శించారు. సీబీఐ నివేదిక ఇచ్చిన తరువాత కూడా, తాజాగా ఫినాయిల్ వంటి రసాయనాలు కలిశాయని కొత్త పాట మొదలు పెట్టడం దారుణం అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరుకు వస్తే నగరం జనసంద్రం అయిందన్నారు. చంద్రబాబు దేవుడిని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు కూలడం ఖాయం పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్కారీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోందని మండిపడ్డారు. దానిలో భాగంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రుల నివాసాలను తగులబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే తగులబెట్టేస్తారని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్రెడ్డి లపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చి చెప్పిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. వైఎస్ జగన్కు హిందువుల ఓట్లు దూరం చేయాలనే కుట్ర జరిగిందన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో వైఎస్సార్ సీపీ పాప ప్రక్షాళన దీక్ష చేపట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో చంద్రబాబు ప్రభుత్వం కాలి బూడిద కావడం తథ్యమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటం తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఆధారాలతోనే సీఎం స్థానంలో ఉన్న వారు మాట్లాడాలన్నారు. కూటమిలో ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని, తనకు ఒక పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోయారన్నారు. సుప్రీంకోర్టులో చార్జిషీటు దాఖలు అయిన తరువాత కూడా టీడీపీ నేతలు ఇలా విషం చిమ్మటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు అంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారన్నారు. కూటమికి ఆ దేవుడే ముగింపు పలుకుతాడని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులకు మోకాలడ్డు
● నోటిఫికేషన్లు ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వడం లేదు ● కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లలో పక్షపాతం ● ఏళ్ల తరబడి కొన్ని పోస్టులు భర్తీ చేయటం లేదు ● పరిపాలన అధికారుల తీరుతో నష్టపోతున్న చిరు ఉద్యోగులు ● జీజీహెచ్ ఏడీ, వైద్య కళాశాల ఏడీ పనితీరుపై విమర్శలు గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్ (పెద్దాసుపత్రి)లో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని అధికారులు రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే సీటులో పనిచేస్తూ ఆర్థికంగా నష్టపోతూ మానసికంగా కుంగిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజేంద్రప్రసాద్లు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులకు మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ● గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆస్పత్రి అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని పలువురు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయారు. ఆరేళ్లుగా రికార్డు అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా, అర్హులైన అభ్యర్థులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా, ఆసుపత్రి అధికారులు వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టులు ఎగిరిపోయాయి ● గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సుమారు ఏడేళ్లుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయకుండా ఆస్పత్రి అధికారులు మిన్నకుండి పోయారు. సదరు పోస్టులను అర్హత ఉండి తమకు ఇవ్వడం లేదని కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో ఖాళీ పోస్టు ఉన్నప్పుడు ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. తీరా నేడు ఖాళీగా ఉన్న మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కనుమరుగైపోయాయని పోస్టులు ఖాళీ వస్తే భర్తీ చేస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్న సమాధానాలతో కింది స్థాయి ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అడ్మినిస్ట్రేటర్లు ఉండి కూడా .. ● గుంటూరు జీజీహెచ్లో పరిపాలనా పరమైన విషయాల్లో సలహాలు అందించి పరిపాలన సజావుగా సాగేందుకు పలువురు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కోర్సులు చదివి ఆసుపత్రిలో పనిచేస్తున్నా, కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతుల ఫైల్ ఎందుకు ముందుకు కదలడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎ.తమీమ్ అన్సారియా ఈ విషయంపై దృష్టి సారించి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్లు గతంలో గుంటూరు జిల్లాలో ఆఫీస్ సూపరింటెండెంట్లుగా, పరిపాలనా అధికారులుగా (ఏఓ)లుగా పనిచేశారు. వీరివురు అసిస్టెంట్ డైరెక్టర్ల పదోన్నతుల కోసం పోటీ పడ్డారు. ఇరువురు కూడా పదోన్నతులు పొంది ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగి గుంటూరు జీజీహెచ్కు, గుంటూరు వైద్య కళాశాలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చారు. వీరివురు ఏఓలుగా పనిచేస్తున్నప్పటి నుంచి రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ల నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఏవో క్యాడర్లో ఉండి, ఏడీ క్యాడర్లో ఉండి కూడా కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లకు ఏమాత్రం చొరవ చూపించడం లేదనే విమర్శలు వీరిపై ఉన్నాయి. -
అడ్డగోలుకు అడ్డుకట్ట
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సమావేశపు అజెండాను తిరస్కరిస్తూ చైర్పర్సన్ హెనీ క్రిస్టినాకు లేఖ అందజేస్తున్న ఒకటో స్థాయీ సంఘ సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని మరోసారి బహిష్కరించిన వైఎస్సార్ సీపీ సభ్యులు రూ.కోట్లాది పనులను ఏకపక్షంగా ఆమోదించడంపై నిరసన ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీ నిధులు తెచ్చుకోలేని దుస్థితి జెడ్పీ చైర్పర్సన్తో విభేదించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు బడ్జెట్ ప్రతిపాదనలు మినహా ప్రణాళిక–ఆర్థికాంశాల అజెండాలకు తిరస్కరణ -
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూల తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు. తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్ హోంలో ఉన్న ఓ మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్కుమార్, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్కుమార్, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్ అలియాజ్ బుడ్డ గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ ఏకానాథ్ సిబ్బంది నరసింహ, అశోక్, ప్రసాద్, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
విద్యతో పాటు నైతికత ముఖ్యం
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నా రు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు -
వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెందిన జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. మంగళగిరికి చెందిన అంబటి వెంకట సుబ్బారావు కుమారుడు విశ్వేశ్వరరావు, జక్కా వెంకటరత్నం కుమారుడు నాగ వెంకట గోపాలరావు స్వామివారి గ్రామోత్సవ కై ంకర్యపరులుగా వ్యవహరించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. -
నకిలీ పురుగు మందులు గుర్తించడం కీలకం
కొరిటెపాడు(గుంటూరు): నకిలీ పురుగు మందులు గుర్తించడంలో లాబోరేటరీలు కీలకంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్ జిలాని సుమూన్ కోరారు. గుంటూరులోని పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. పురుగుమందుల శాంపిల్స్ పరీక్షా విధానం, విశ్లేషణ ఫలితాలు ఇన్సైట్ యాప్లో నమోదు చేయడంపై ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి, యనలిస్ట్లను అడిగి తెలుసుకున్నారు. మనజీర్ జిలాని సుమూన్ మాట్లాడుతూ పురుగుమందుల శాంపిల్స్ను తప్పిదాలు లేకుండా పరీక్ష చేసి, నకిలీ పురుగుమందులను అరికట్టాలని సూచించారు. గుంటూరు పురుగుమందుల ల్యాబ్కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) వచ్చేలాగా కృషి చేయాలని ఆయన సూచించారు. -
సంకల్పం ఉంటే.. సక్సెస్ మీ వెంటే
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ ‘ క్రీడల్లో ఓటమి అనేది బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశమని, ప్రతి అపజయం ఒక విజయంలాంటిదే.. అది మనల్ని రేపటి గెలుపునకు సిద్ధం చేస్తుంది’ అన్నారు. చదువులో రాణించే తెలివైన విద్యార్థులు ఒక్కోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని, కానీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారని తెలిపారు. కుంగుబాటుకు లోనైనప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లేదా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తిరిగి ఉత్తేజాన్ని పొందవచ్చన్నారు. చేబ్రోలు: ‘జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే రాణించవచ్చు, చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలి’ అని 2025 ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా పిలుపునిచ్చారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం వైభవంగా ముగిసింది. ఆఖరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా విచ్చేశారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
సందడిగా విజ్ఞాన్ మహోత్సవ్
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (చాంపియన్ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు -
వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యన్నారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం
లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్ భూమ్ అని రాసి బాక్స్లో వేయడంతో బాంబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్ బ్యాక్ బోర్డు వారిలో ప్రదీప్ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్ చానల్కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కోసం స్లిప్ రాసిన విద్యార్థి -
భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. -
జనమే..అభిమానమై
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనను ముందుగా కనకదుర్గ వారధి నుంచి బస్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి ఉంది. పోలీసులు, ప్రభుత్వం రాత్రికి రాత్రి రూటు మార్చి వెస్ట్ బైపాస్లో వెళ్లాలని సూచించారు.శుక్రవారం ఉదయం 11.35 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాగా అప్పటికే ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన కాన్వాయ్ను అనుసరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 11.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రాతూరు అండర్పాస్కు వచ్చేటప్పటికి 12.06 గంటలు అయ్యింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై అభిమానుల మధ్య వైఎస్ జగన్ కాన్వాయ్ మంగళగిరి, తెనాలి ఫ్లై ఓవర్కు 12.15గంటలకు చేరుకుంది. కాజా టోల్గేటు 12.25కి, మంగళగిరి వెస్ట్ బైపాస్కు 12.40, వెంకటపాలెం టోల్గేటుకు 1.30 గంటలకు చేరింది. మహిళలతో కరచాలనం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెస్ట్ బైపాస్లో కృష్ణానది బ్రిడ్జిని 2.05 గంటలకు దాటి గొల్లపూడి గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ మధ్యలో తాడేపల్లి ఓల్డ్ టోల్గేట్ అండర్ పాస్ వద్ద పాతూరు, తాడేపల్లి సర్వీస్ రోడ్లో ఒక చోట, పాతూరు క్రాస్రోడ్లో తన వాహనం నుంచి బయటకు వచ్చి నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. కాజా వద్దకు భారీగా మహిళలు తరలిరాగా వారితో కరచాలనం చేశారు. కాజా టోల్గేటు వద్ద గుంటూరు నుంచి విజయవాడ వచ్చే రూట్లో మూడు నిమిషాలు ఆగి రోడ్డు వెంబడి ఉన్న కార్మికులకు, అభిమానులకు అభివాదం చేశారు. వెస్ట్ బైపాస్కు చేరుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు భారీగా వచ్చి స్వాగతం పలకడంతో అక్కడ ఐదు నిమిషాలు ఆగారు. నందిగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం వెంకటపాలెం టోల్గేటు వద్దకు వచ్చే సరికి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులు నందిగం సురేష్ ఆధ్వర్యంలో రాజధాని ప్రజలు భారీగా తరలి వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలికి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. మహిళలు, యువకులు పూలవర్షం కురిపించారు. కాన్వాయ్లో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కొమ్మూరు కనకారావు తదితరులు ఉన్నారు. అడుగడుగునా అడ్డంకులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. తాడేపల్లి నివాసం నుంచి జగన్ కాన్వాయ్ బయలుదేరింది. భరతమాత సెంటర్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనిచ్చి వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తాడేపల్లి ఓల్డ్ టోల్గేటు వద్ద, వెస్ట్ బైపాస్ ఎంట్రన్స్లో వెంకటపాలెం వద్ద జగన్ కాన్వాయ్ను ముందుకు పంపి మిగిలిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట సేపు ప్రతి ఒక్కచోట అరగంట సేపు వాహనాలను నిలిపివేసి ఆటంకాలు కల్పించారు. ఫ్లెక్సీలతో యువత కేరింతలు వైఎస్ జగన్ ఇంటి నుంచి బయటకు రాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోయింది అధికారం అని, అభిమానం కాదు అంటూ ఫ్లెక్సీలతో యువకులు నృత్యాలు చేశారు. వైఎస్ జగన్ అభిమాని ఒకరు వేంకటేశ్వరస్వామి చిత్రపటంతోపాటు సత్యమేవ జయతే అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. బాణాసంచా కాలుస్తూ ముందుకు సాగారు. -
మీ కోసం టోల్ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వం మీకోసం టోల్ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేసేందుకు ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ ఫిర్యాదును ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తుందన్నారు. వాటి పరిష్కారంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబరు 1100కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రజా కూడళ్లల్లో ప్రదర్శించాలన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయం, ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయం, ప్రాథమిక ఆరో గ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో టోల్ఫ్రీ నెంబరు అందరికి కనిపించే విధంగాడిస్ప్లే చేయాలన్నారు. పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వార్షికోత్సవం తెనాలి టౌన్: కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు రెండురోజులపాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వగాయత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి నిర్వహణలో ఈ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి యర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్బాబు, సభ్యులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి గుంటూరు లీగల్: గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి రమేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ యడ్లపాడు: కొండవీడుకోట ఫెస్ట్ –2026 ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండవీడుకోటను సందర్శించారు. కొండకింద, వేదిక, ఫుడ్కోర్టులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పోలీస్శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్సీ హనుమంతరావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 180 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఘనంగా శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షి కోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమంలో భా గంగా ఉదయం స్వా మి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఉందా..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్):రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, లేక నియంతృత్వ పాలన సాగుతోందా అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలు, అసమర్థతను ప్రశ్నిస్తే దాడులు..వారి వేధింపులకు గురి చేయటం సిగ్గుచేటని ఆగ్రహంవ్యక్తంచేశారు. పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ చంద్రబాబు ఇదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని.. ఇదే వారికి భస్మాసుర హస్తం అని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసంలో అంబటి కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
మంగళగిరి టౌన్: 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ (ఏపీ జీఈఎస్ఏ) రాష్ట్రప్రధాన కార్యదర్శి చాంద్ బాషా శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా గత పీఆర్సీ ముగిసి 30 నెలలు అయినా నేటికీ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జరిగిన బడ్జెట్ సమావేశంలో 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటన చేస్తారని ఎదురుచూశారన్నారు. అలా జరగకపోవడంతో నిరాశకు లోనయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు డిసిప్లనరీ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉండడం వల్ల వారికి పదోన్నతులు, పెన్షన్ బెనిఫిట్లు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసేవిధంగా ఒన్టైమ్ సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ విధానంపై ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ జీఈఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్బాషా -
అంతర్రాష్ట్ర లాప్ట్యాప్ల దొంగ అరెస్ట్
● యూనివర్సిటీ హాస్టళ్లే టార్గెట్ ● 11 రాష్ట్రాల్లో 61 కేసులు నమోదు ● నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన 15 లాప్ట్యాప్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ మంగళగిరిటౌన్: దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ హాస్టళ్లను టార్గెట్ చేసుకుని విద్యార్థుల లాప్ట్యాప్లను అపహరించే నిందితుడిని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 15 లాప్ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ గురువారం విలేకరుల సమావేశం నిందితుడి వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా పులివలం గ్రామానికి చెందిన తమిళ్ సెల్వన్ న్యాయవిద్యను అభ్యసించి లాప్ట్యాప్ల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టళ్లలో డిసెంబర్ 31వ తేదీ 5 లాప్ట్యాప్లను అపహరించుకుపోయాడు. ఆయా యూనివర్సిటీల అధికారుల ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడు తమిళ్ సెల్వన్ను గురువారం మండల పరిధిలోని డాన్బాస్కో ఉన్నత పాఠశాల సమీపంలో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి కొన్ని లాప్ట్యాప్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా మరికొన్ని లాప్ట్యాప్లు విజయవాడ సమీపంలో ఉంచినట్లు సెల్వన్ తెలపడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు లాప్ట్యాప్లను విజయవాడలో విక్రయించేందుకు ఈనెల 2వ తేదీ సెల్వన్ విజయవాడ వచ్చాడని, మంగళగిరి పరిసర ప్రాంతంలోని పలు యూనివర్సిటీల్లో కూడా దొంగతనాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. విట్ కాలేజీలో దొంగతనం చేయడానికి వెళుతున్న సెల్వన్ను మంగళగిరి రూరల్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీల్లో దొంగతనాలు చేసిన లాప్ట్యాప్లను ముంబయి, ఢిల్లీ, చైన్నె వంటి ప్రాంతాల్లో అమ్మేవాడని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఓలా, ఓబర్ వంటి యాప్ల ద్వారా వాహనాలను బుక్చేసుకుని ఆయా యూనివర్సిటీలకు చేరుకునేవాడని, హాస్టల్లో స్టూడెంట్గా జాయిన్ అయ్యేందుకు వచ్చినట్లు చెప్పి విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో లాప్ట్యాప్లను అపహరించుకు వెళ్లేవాడని తెలిపారు. పగ నుంచి మొదలై... వృత్తిగా ఎంచుకునే వరకు... మంగళగిరి రూరల్ పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళ్ సెల్వన్కు మెడికల్కాలేజీలో చదువుకునే విద్యార్థిని ఫ్రెండ్గా ఉండేదని, తనను తోటి వైద్య విద్యార్థులు మానసికంగా వేధించి ఇబ్బందులకు గురిచేశారని, వారిపై పగ తీర్చుకునేందుకే లాప్టాప్ దొంగతనాలు మొదలు పెట్టినట్లు చెప్పాడు. మొదట అదే కళాశాలలో మొదలు పెట్టిన దొంగతనాలు నేడు వృత్తిగా ఎంచుకుని పలు యూనివర్సిటీ హాస్టళ్లలో దొంగిలించాడు. 11 రాష్ట్రాల్లో సెల్వన్పై కేసులు నమోదైనట్లు తెలిపారు. సుమారు 61 లాప్ట్యాప్లు దొంగిలించిన కేసుల్లో నిందితునిగా ఉన్నాడని వెల్లడించారు. సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐలు చిరుమామిళ్ల వెంకట్, రవితేజ, ఎస్ఎస్ఐ రత్నరాజు, సిబ్బంది సాగర్, నాగుల్ మీరా పాల్గొన్నారు. -
అధికార పార్టీలో ఆందోళన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనపై కేసులు పెట్టేందుకు రంగం ప్రభుత్వం సిద్ధం అయ్యింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఆరేడు గంటలపాటు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా చోద్యం చూసిన పోలీసులు ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నట్లు షెడ్యూల్ విడుదల కాగానే ఆఘమేఘాలపై సెక్షన్ 30అమలులో ఉందని, ఎటువంటి ర్యాలీలు, సభలు పెట్టడానికి అనుమతి లేదంటూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఒకరిద్దరికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారు తీసుకోలేదు. గుంటూరు లీగల్: వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ బెయిల్ పిటిషన్పై వెలువడే ఉత్తర్వులపై ఆసక్తికరమైన చర్చ న్యాయ వర్గాల్లో కొనసాగుతుంది. సామాన్యు ప్రజానీకంలో కూడా చర్చనీయాంశంగా మారింది. -
‘ఓపెన్’ చేసేశారు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) దూర విద్యాకేంద్రం నిర్వహిస్తున్న పలు పరీక్షలు గాడితప్పాయి. కేంద్రాల నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి విచ్చలవిడిగా చూచిరాతలకు ద్వారాలు తెరిచేశారు. మరి కొన్ని కేంద్రాల్లో అభ్యర్థులే మారిపోయారంటే ఎంతలా ఓపెన్ చేశారో స్పష్టమవుతోంది. ఏఎన్యూ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దూరవిద్యాకేంద్రం డిగ్రీ, పీజీ తదితర కోర్సుల పరీక్షలను స్క్వాడ్ తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదీ విషయం దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్న పలు సెంటర్ల నిర్వాహకులు కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ విద్యార్థుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారం చేస్తున్న వారు కావడంతో కోర్సు పూర్తికావాలనే ఆలోచనతో సెంటర్ల నిర్వాహకులు అడిగినంత ముట్టచెబుతున్నారు. సెల్ఫోన్లు.. పుస్తకాలు పెట్టి మరీ గుంటూరు సమీపంలోని గోరంట్ల దూరవిద్య పరీక్షా కేంద్రంలో సెల్ఫోన్లు ఎదురు పెట్టుకుని పరీక్షలు రాయడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లిన అబ్జర్వర్లను మీరు వచ్చింది రెగ్యులర్ పరీక్షలకు కాదు.. డిస్టెన్స్ పరీక్షలకు అని నిర్వాహకులు బెదిరింపులకు దిగడం విస్తుగొలుపుతోంది. తనిఖీలతో వెలుగులోకి చూచిరాత పర్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో గత నెల 31 నుంచి దూర విద్యాకేంద్రం రెండో విడత పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు దూరవిద్య పరీక్షల సమన్వయకర్తకు సంబంధం లేకుండా స్క్వాడ్ బృందాన్ని నియమించారు. ఈ బృందం గత నెల 31న కడప జిల్లా మైదుకూరులోని ఓ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చూచిరాతకు పాల్పడుతున్న సుమారు పదిమందిని పట్టుకున్నారు. వీరితో పాటు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న మరి కొంతమందిని పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. అనంతపురంలో 60 మందిపై .. ఈనెల 1వ తేదీన అనంతపురంలోని ఓ పరీక్షా కేంద్రాన్ని స్క్వాడ్ తనిఖీ చేసి చూసి రాతకు పాల్పడుతున్న సుమారు 60 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. అదే రోజు అనంతపురం పట్టణంలోని మరో కేంద్రాన్ని తనిఖీకి వెళ్లగా పక్క కేంద్రంలో స్క్వాడ్ తనిఖీల సమాచారాన్ని తెలుసుకున్న నిర్వాహకులు విద్యార్థులను ముందుగానే పరీక్ష కేంద్రం నుంచి పంపించి వేసినట్లు తెలిసింది. స్క్వాడ్కు పరీక్ష గదుల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ముందుగానే విద్యార్థులను ఎలా పంపిస్తారని స్క్వాడ్ సభ్యులు పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించగా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగినట్లు సమాచారం. 2న గుంటూరులో.. స్క్వాడ్ ఈనెల రెండో తేదీన గుంటూరు నగరాన్ని ఆనుకుని ఉన్న గోరంట్లలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి చూచిరాతకు పాల్పడుతున్న కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ కేంద్రంలో నియమించిన అబ్జర్వర్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని గుర్తించారు. కడియం పరీక్ష కేంద్రం అబ్జర్వర్గా అర్హత లేని వ్యక్తి స్క్వాడ్ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం సమీపంలోని ఓ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి చూసి రాతకు పాల్పడుతున్న కొంతమంది విద్యార్థులను పట్టుకున్నారు. ఆ కేంద్రంలో నియమించిన అబ్జర్వర్ విశ్వవిద్యాలయంలోని ఓ కేంద్రంలో ప్రోగ్రామర్ (నాన్ టీచింగ్ ఉద్యోగి)గా పని చేస్తున్నారు. ఇతను అనర్హుడైనప్పటికీ విశ్వవిద్యాలయంలో అధికార పార్టీ కార్యక్రమాలు చేయడంతో అతిపెద్ద పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్గా నియమించారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి సమీపంలోని గోకవరం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా అబ్జర్వర్ విధుల్లో లేకపోవడంతో స్క్వాడ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో చూచిరాతలు ఆకస్మిక తనిఖీలతో వెలుగులోకి బాగోతం విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు స్క్వాడ్కు సెంటర్ల నిర్వాహకుల బెదిరింపులు దూరవిద్య పరీక్షల తనిఖీకి స్క్వాడ్ నియామకానికి ఫైలు పంపించాను. ఉన్నతాధికారులు ఎవరిని నియమించారో నాకు సమాచారం లేదు. స్వ్కాడ్ బృందం ఎక్కడకి వెళ్లారు.. మాస్ కాపీయింగ్కు పాల్పడిన వారి వివరాలు నాకు చెప్పాలి. కానీ ఆ వివరాలు నాకు ఇవ్వలేదు. నాకు సమాచారం ఇస్తే ఆ కేంద్ర గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉండేది. స్వ్కాడ్ తనిఖీల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచామని వర్సిటీ ఉన్నతాధికారులు నాతో చెప్పారు. – రామచంద్రన్, ఏఎన్యూ దూరవిద్య కేంద్రం కోఆర్డినేటర్ -
కేఎల్యూకు పురస్కారాలు
తాడేపల్లి రూరల్ : వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ గోల్డ్ అవార్డులు వచ్చాయని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ గురువారం పేర్కొన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డెలాయిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ అవార్డులు ప్రదానం చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు వీటిని స్వీకరించారని తెలిపారు. -
అసిస్టెంట్ మలేరియా అధికారులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిఽధిలో ఎంపీహెచ్ఈఓలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్ మలేరియా అధికారులుగా (ఏఎంఓ) పదోన్నతి లభించింది. గురువారం గుంటూరులోని ఆర్డీ కార్యాలయంలోఉత్తర్యులు అందజేశారు. ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి... ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్నర్సులుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. వీరిలో గుంటూరు జీజీహెచ్కు నలుగురిని, నెల్లూరుకు ఇరువురిని ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరక్టర్ బెజ్జం పాల్ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, గాబ్రియేల్ పాల్గొన్నారు. -
తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!
జీఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న నర్సింగ్ విద్యార్థినులు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలలో గురువారం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) వార్షిక థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు నర్సింగ్ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించే తరగతి గదులు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలలో లేకపోవడంతో నర్సింగ్ విద్యార్థినులకు చూసి రాతకు అవకాశం కల్పించినట్లయింది. -
అంబటి కుటుంబానికి పరామర్శ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా కన్వీనర్ జయప్రకాష్ (జేపీ), ఉంగుటూరు కన్వీనర్ పప్పుల శ్రీనివాసరావు, నూజివీడు కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావులు గురువారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా విధ్వంసం సృష్టిస్తే పార్టీ శ్రేణులు భయపడతాయని అనుకోవడం టీటీపీ అవివేకం అన్నారు. అంబటి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. రాంబాబు ఇంటిని కాపు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు కూడా పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో గత ఏడాది నవంబరులో జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 6,991 మంది హాజరు అయ్యారని తెలిపారు. వారిలో 6,721 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. రీవాల్యూయేషన్కు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, యూజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సబ్జెక్ట్కు ఫీజు రూ.1,640 కాగా, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కూడా అంతేనని వివరించారు. వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అస్సాంకు చెందిన కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని వాజ్పేయి విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అతడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జేబులో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉంది. రాజధాని భవన నిర్మాణ కూలీగా లేదా డ్రైవర్గా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ జీతాల ప్యాకేజీ కింద రూ. 1.11 కోట్ల బీమా క్లయిమ్ చెక్కును బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గురువారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ అధికారి సతీష్కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ. 1.11 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించబడుతుందన్నారు. ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కీర్తి వెంకటరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య నన్నూరమ్మకు ఈ క్లయిమ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా చెక్కును అధికారికంగా అందజేశామని పేర్కొన్నారు. బ్యాంకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఏజీఎం, రీజనల్ హెడ్ కిరణ్రెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డీజీఎం, రీజనల్ హెడ్ అనుపమ్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ బ్రిగేడియర్ సంజయ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేమూరు: వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన చుండూరు మండలంలోని మూల్పూరు గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం మేరకు.. కొల్లూరు గ్రామానికి చెందిన ఆళ్లమూడి వివేక్(20) ఆటో నడుపుతుంటాడు. ఈ నెల 4వ తేదీ ఉదయం ఇంటి నుంచి ఆటో వేసుకొని బయటకు వెళ్లాడు. కొల్లూరు గ్రామానికి చెందిన జంపని రామయ్యకు రాత్రి 9 గంటలకు ఆటో ఇచ్చి రామయ్యకు చెందిన బైక్ వేసుకొని వెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు వివేక్ ఇంటికి రాక పోవడం.. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ అవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా.. మూల్పూరు గ్రామ శివారులో మృతిచెంది ఉండడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చుండూరు సీఐ ఆనందరావు వివేక్ బైక్ చెట్టును వేగంగా ఢీకొట్టడంతోనే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి ఆళ్లమూడి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు. -
వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో కొలువైన వారాహి దేవస్థానంలో ఈనెల 11–15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనలో ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలస్వామీజీ ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య, వీ–ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామమోహనరావు, తుంగల శ్రీనివాస్, వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, సంగీత టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలరాణి, గోపు ప్రభారాణి, కోట లక్ష్మీకుమారి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, లక్ష్మి, సువర్ధ తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేట్ గోడౌన్ పై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె సీఎస్డీటీ ఓంకార్ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ చేసిన నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: జేకేసీ కళాశాల రోడ్డు లోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో (జేసీ లా) ఈ నెల 7, 8వ తేదీల్లో 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి తెలిపారు. గురువారం జేసీ లా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్ బాబుతో కలిసి పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మూట్ కోర్టు పోటీలకు దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుంచి 32 కళాశాలల విద్యార్థులు టీంలుగా పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్ పోటీలను ప్రారంభించనుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పోటీలకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. తాడికొండ: ఈనెల 7వ తేదీన క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గురువారం ఉద్దండరాయునిపాలెం వద్ద జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆహ్వానితులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలకిక చేరుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పలు అంశాలపై సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
ప్రజాబలం
ఇది కదా.. వైఎస్ జగన్ పర్యటన విజయవంతంపై వైఎస్సార్సీపీ నేతలుపట్నంబజారు(గుంటూరుఈస్ట్): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోకి ప్రవేశించిన తరువాత 5 కిలోమీటర్లు..7 గంటలపాటు కొనసాగిందంటే ఆయనపై ఎంతటి ప్రజాభిమానం ఉన్నదో తెలుస్తుందని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై జరిపిన దమనకాండను మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. మహిళలు, చిన్నారులు ఉన్నారని అని కూడా చూడకుండా, ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా భయానక వాతావరణం సృష్టించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంబటి నివాసం వద్ద అంతటి ఘోరం జరుగుతుంటే.. ఎస్పీ, ఐజీ, డీజీపీలు ఫోన్లు కూడా ఎత్తకపోవటం దారుణమన్నారు. వైఎస్ జగన్ గుంటూరుకు వస్తుంటే ఆపేందుకు పోలీసులను ఉపయోగిచారని, అదే అంబటి నివాసం వద్ద ఆ పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రతి దారుణాన్ని డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్, నేతలు షేక్ గులాంరసూల్, పానుగంటి చైతన్య, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి ●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 30 సంవత్సరాల తరువాత ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి శరీర అవయవాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఏర్పడడంతోపాటు, అనారోగ్యం బారిన పడకుండా ఎలా ఉండాలో కూడా తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి పిల్లలు వచ్చేందుకు ఎగ్జిబిషన్ ప్రేరణ ఇస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా వీక్షించాలన్నారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ వైద్య విభాగంలో స్పెసిమెన్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్ను వీక్షించడం ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఇతర బోధనా సిబ్బందిని మంత్రి అభినందించారు. జింకానా దేశానికే ఆదర్శం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృ సంస్థ అభివృద్ధికి సేవలు చేస్తున్నారని, జింకానా దేశానికే ఆదర్శమని మంత్రి సత్యకుమార్ చెప్పారు. పూర్వ విద్యార్థులు అంకిత భావంతో కళాశాలకు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని, అలాంటి గుంటూరు వైద్య కళాశాల ఏపీకే గర్వకారణమన్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలి ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రతి రోజూ మరణిస్తున్నారని, క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేలా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు చేస్తున్న సేవల గురించి మీడియాకు వివరించారు. గుంటూరు జీజీహెచ్లో నాట్కో ట్రస్టు సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత మంత్రి ఎగ్జిబిషన్ను గంటకుపైగా తిలకించారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వి. సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
అక్షర ఆంధ్ర కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్రా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అక్షర ఆంధ్రా క్రింద శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతీ ఒక్కరూ చక్కని చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్రా కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్రా పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని. డ్వాక్రా, ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె శిల్ప పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజలు, అధికారుల సహకారంతో హింసను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. సాల్మన్ హత్య బాధాకరం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. -
నేటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్–2కే26
●జాతీయ స్థాయిలో 80 అంశాల్లో పోటీలు ●విజేతలకు రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న యూత్ ఫెస్టివల్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26కు సన్నాహాలు పూర్తయ్యాయని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం జరిగే ప్రారంభ వేడుకలకు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కొమండూరి రామాచారి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 7వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు 2025 ఏసియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రకటించారు. మహోత్సవ్లో రెండో రోజున ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, మూడో రోజున ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి సందడి చేస్తారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. పోటీల విజేతలకు మొత్తం రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో మొత్తం 80కు పైగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. విజ్ఞాన్ మహోత్సవ్ కేవలం పోటీలకే పరిమితం కాకుండా, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే మహా వేదికగా నిలుస్తుందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. రిజిస్ట్రార్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. -
అభిమాన సంద్రం
ఉప్పొంగిన●అంబటి ఇంటి దగ్గర జన కోలాహలం ●మాజీ సీఎం వైఎస్ జగన్ కోసం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ●ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూపులు ●పోలీసుల బారికేడ్లను దాటుకుని వచ్చిన అభిమానం టెలిఫోన్ స్తంభం ఎక్కిన ఓ అభిమాని బారికేడ్లను అడ్డంగా పెట్టి నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో అభిమాన జనసందోహం ఉరకలెత్తింది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యలయం నుంచి బయల్దేరినప్పటి నుంచి గుంటూరు సిదార్థ నగర్లోని అంబటి నివాసం వద్ద రోడ్లన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. టీడీపీ రౌడీమూకల దాడితో ధ్వంసమైన అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించి, ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలిచి, తానున్నానని భరోసా ఇచ్చేందుకు వస్తున్న తమ అభిమాన నేత వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు వేలాదిగా చేరుకున్నారు. ఆంక్షల చట్రాలు దాటుకుని.. ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థ నగర్కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేసి, బారికేడ్లను అడ్డంగా పెట్టిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. వైఎస్ జగన్ రాక కోసం వేయికళ్లతో ఎదురు చూసిన అభిమానులు ఆయన వచ్చీ రావడంతోనే పోలీసుల బారికేడ్లను దాటుకుని వచ్చారు. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల వాళ్ల ఇంటి గోడలపైకి ఎక్కి తమ అభిమాన నేతను కనులారా చూశారు. అంబటి ఇంటిపైకి ఎక్కిన అభిమానులను చూసిన వైఎస్ జగన్ అభివాదం చేయడంతో పులకించిపోయారు. అంబటి రాంబాబు ఇంటికి సమీపంలోని ఇళ్లలోని ప్రజలు తమ డాబాలపైకి ఎక్కి వైఎస్ జగన్ను చూశారు. అంబటి ఇంటి వద్ద చెట్లు, గోడలు, మిద్దెలు ఎక్కిన అభిమానులు సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. -
పీఏసీఎస్ ఉద్యోగుల ‘వంట–వార్పు’
కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏడోరోజు వినూత్న నిరసన తెల్పిన ఉద్యోగులు -
గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా
గుంటూరు రూరల్: శనివారం రాత్రి విద్యానగర్లోని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. అశోక్ వివరాలు తీసుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అండగా ఉంటానని జగనన్న భరోసా ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగరంలోకి రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళుతున్న అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారి ఇచ్చారు. -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: అడుగడుగునా అంతులేని అభిమానం... ఎక్కడికక్కడ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా ఆగని జనసందోహం... ఇవీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కనిపించిన దృశ్యాలు. అధికార పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం పరిశీలించి, కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లోని రాంబాబు ఇంటికి ఆయన చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. తరలివచ్చిన అభిమానులు కుంచనపల్లి క్రాస్రోడ్స్, కాజ టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. అంబటి ఇంటికి చేరే సరికి సాయంత్రం 4.35 గంటలు అయ్యింది. మరోవైపు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటివరకూ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జనసందోహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకుల మధ్య కూడా జగన్ పర్యటన విజయవంతం అయ్యింది. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద పెట్టి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలివచ్చారు. గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పల్నాడు జిల్లా నుంచి ఎవ్వరూ రాకుండా దిగ్బంధించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డంకులు సృష్టించారు. బందోబస్తు హడావుడి ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం బొంతపాడు వై జంక్షన్ వద్ద డీఎస్పీలు భానూదయ, అరవింద్తోపాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, రోప్ పార్టీలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. డ్రోన్ కెమెరాలతో పర్యటనపై డేగ కన్ను వేశారు. శనివారం రాత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబటి ఇంటికి వెళుతున్న దారిలో ఏటుకూరు బైపాస్లోగల ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ కార్యాలయం వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్, పూర్తిగా ధ్వంసమైన కారును జగనన్న తన వాహనం నుంచి అభిమానుల మధ్యనే పరిశీలించారు. ఎట్టకేలకు... ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థనగర్కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. ముఖ్య నేతలు హాజరు కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడదల రజిని, పేరి నాని, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, సింఽహాద్రి రమేష్, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురేష్, సమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు (డైమండ్బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్, ఈవూరు గణేష్, డాక్టర్ సుధీర్రెడ్డి, అవినాష్, నాయకులు పోతుల మహేష్, షేక్ గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న జగనన్నఅంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో పాల్గొనేందుకు సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన 37 మంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరారు. సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుంటూరు సమీపంలోకి చేరుకోగానే హైవేపై జన సంద్రం పోటెత్తింది. జననేతను చూసేందుకు అభిమానులు మండే ఎండను సైతం లెక్కచేయక బారులు తీరారు. అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో హైవేతోపాటు ఏటుకూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో మెయిన్ హైవేపై నుండి సర్వీసు రోడ్డులోనికి జగన్ కాన్వాయ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. కాన్వాయ్ కనిపించగానే జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైవేపైకి పరుగులు పెట్టారు. చేతులు ఊపుతూ, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో జగన్ కారుపై నుండే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని’’ హెచ్చరించారు. -
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో మహాదత్తహవనం చేసి పూర్ణాహుతి నిర్వహించి భక్తుల గోత్రాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను శ్రీదత్తపీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 2025 మార్చి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 3వ తేదీ వరకు లెక్కింపు చేశారు. 11 నెలలకుగాను రూ.4,70,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవదాయ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తెనాలి దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఫెస్ట్ ద్వారా కొండవీడు వైభవాన్ని తిలకించేందుకు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియా ద్వారా తన సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగుజాతి ఘనచరిత్ర, వీరత్వానికి ప్రతీక కొండవీడు కోట అన్నారు. చరిత్ర, వైభవాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హలీరైడ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, లేజర్షో, క్రాకర్స్షో, హార్స్ రైడింగ్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గాయకులు గీతామాధురి, సమీరా భరద్వాజ్, జబర్దస్ట్ కళాకారులు అలరించనున్నారని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. పలు పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూసి ఆనందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్జేసీ చంద్రశేఖర ఆజాద్ బుధవారం ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా పాయింట్లను పరిశీలించారు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వీఐపీలు స్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో తగు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్కు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆర్జేసీ సూచించారు. -
ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు
గుంటూరు వెస్ట్: ప్రజాస్వామ్య దేశంలో దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జనసేన అధికార ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కన్నా రజిని పేర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి మాజీ మంత్రి అంబటిపైన, ఆయన నివాసం ధ్వంసంపైన ఆమె స్పందించారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే జరుగుతోందన్నారు. ఇందులో జనసేనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వ ధర్మానికి కట్టుబడి తాను జనసేన పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. పోలీసులు ఉండగానే టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని అంబటిపై దాడికి దిగడం సరికాదన్నారు. ఒక మాటలో చెప్పాలంటే పోలీసు వ్యవస్థను సైతం అధికార పార్టీ శాసిస్తోందన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త గళ్లా రామచంద్రరావు స్వయంగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి కార్యకర్తలను ప్రొత్సహించడం సరికాదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని, వారు వ్యవహరించిన తీరు న్యాయమూర్తులను సైతం విస్తుపోయేటట్లు చేసిందని తెలిపారు. రాజకీయాలన్న తరువాత కొన్ని చోట్ల కార్యకర్తలు దురుసుగా వ్యవహరించడం జరుగుతుంటుందన్నారు. వాటిని ఖండించాల్సిన బాధ్యత సంబంధిత నాయకులదేనని పేర్కొన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు దూకుడును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించిన సందర్భాలను రజిని గుర్తు చేశారు. అంబటిపైగానీ, ఆయన నివాసంపైగానీ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలలో ఎవరూ ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పిన కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల్లో అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూలులో సాయంత్రం ఏర్పాటైన సభకు కార్యక్రమ నోడల్ అధికారి సునీల్ నాయక్ అధ్యక్షత వహించారు. నియోజకవర్గంలోని 325 మంది పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్లను అందజేశారు. ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అంధత్వ నివారణ కార్యక్రమంలో రాష్ట్రంలోని విద్యార్థులకు కంటిపరీక్షలు, కళ్లజోళ్లు పంపిణీనే కాకుండా అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. శస్త్రచికిత్సలూ చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు రూపొందించి, అన్ని వివరాలను పొందుపరుస్తున్నట్టు చెప్పారు. రక్తహీనత కలిగిన 9 లక్షలమందికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నామని, 18 లక్షల బాలికలకు శానిటరీ నాప్కిన్స్ను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. క్యాన్సర్కు సంబంధించి గొంతు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను చేస్తున్నట్టు చెబుతూ ఎవరినైనా నిర్ధారణ జరిగితే రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని తెనాలిలో ఆరంభించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సౌరబ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రావణబాబు, ఆర్డీ డాక్టర్ శోభారాణి, బీజేపీ, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, గాదె వెంకటేశ్వరరావు, జనసేన కౌన్సిలర్లు జి.మానసారెడ్డి, వసంతరావు, జయపాల్ స్థానిక అధికారులు బి.జనార్ధనరావు, కేవీ గోపాలరావు, జె.రామఅప్పలనాయుడు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో నెయ్యే లేదు తెనాలి: తిరుమల లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పామాయిల్తోనే లడ్డూలు చేశారనీ, ఆవిధంగా పవిత్రతను తగ్గించడమే కాకుండా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తెనాలిలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, తన ప్రసంగం ఆరంభంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్లోని నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్ను అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించాం. రోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ వైద్య సేవలు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నాట్కో ట్రస్టు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సుమారు రూ. 45 కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 125 పడకలతో ఈ సెంటర్ నిర్మించాం. మరో రూ.18 కోట్లతో 125 పడకల క్యాన్సర్ సెంటర్ను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆపరేషన్లు, మందులూ ఉచితం. –నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
బ్యాంక్ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్
నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్ చేశామని గుంటూరు సీసీఎస్ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్ 28న డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్ పటేల్నగర్ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమీపాన అరెస్ట్ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. -
అందుబాటులో ఆధునిక వైద్యం
క్యాన్సర్ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జెనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా వ్యాధిని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తెలుస్తుంది. ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్సీఏ–1, 2 పరీక్షల ద్వారా కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతరులకు వస్తుందా రాదా అని నిర్ధారించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నగరంపాలెం: జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అనుమతుల్లేని సభలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లా పరిధిలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థాలను పకడ్బందీగా నిర్వహించేలా మున్సిపల్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి నిర్వహించిన డిస్ట్రిక్ట్ ఎన్జీటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను ఇంటి నుంచే సేకరించటంతోపాటు, పర్యావరణానికి హాని లేకుండా నూరుశాతం సక్రమంగా నిర్వహించాలన్నారు. మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలన్నారు. తడి వ్యర్థాలతో ఎరువుల తయారీని నివాస ప్రాంతాల్లోని తయారుచేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రీసైకిలింగ్ వ్యర్థాలతో సంపద సృష్టించే ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలన్నారు. పట్టణాల్లో సీవరేజ్ నీటిని శుద్ధి చేయడానికి అనుగుణంగా ఎస్టీపీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ (ఈ వేస్ట్)ను సైతం ప్రభుత్వతో ఎంఓయూ చేసుకున్న ఏజెన్సీకి అందించాలన్నారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల నిర్వహణ, ఇంటింటికి చెత్త సేకరణ, పబ్లిక్ మరుగు దొడ్లు, శానిటేషన్, డ్రెయిన్ల శుభ్రత అంశాలపై పబ్లిక్ పెర్సెప్షన్లో ప్రజల ఫీడ్ బ్యాక్ మరింతగా మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేర్వేరుగా చెత్త సేకరణ.. జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ... నగర పరిధిలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించటం జరుగుతుందన్నారు. తడి వ్యర్థాలతో వివిధ ప్రాంతాల్లో 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఎరువుల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి రోజు 300 టన్నుల వరకు వ్యర్థాలను జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు పంపిస్తున్నామని తెలిపారు. మెటీరియల్ రీసెక్లింగ్కు 10 టన్నుల వరకు తరలిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎంటీఎంసీ మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, తెనాలి మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, పీసీబీ ఈఈ నజీమా బేగం, సీఎంహెచ్ఓ శాంతి కళా, ఈఈ సుందర రామిరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు
గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, లివర్ క్యాన్సర్ సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదేళ్ల బాలిక నుంచి 20 ఏళ్ల యువతులు ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకదు. మమ్మోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించి, నివారించవచ్చు. అతి తక్కువ సమయంలో వ్యాధిని గుర్తించే ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగానే గుర్తించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు -
గుంటూరు
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కాసరగడ్డ వీరేంద్ర, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళ వారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.4,800, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. 7 -
వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి గాంచిన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో వున్న భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం బాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వార్షికోత్సవానికి హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులకు, పెద్దలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, హ్యాండ్ల్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహనరావు, ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కోమటి జయరాం, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, గంగాధర్ నాదెళ్ళ, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంతల సురేష్, ఎన్ఆర్ఐలు యలమంచిలి జగదీష్బాబు, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ధన్యవాదాలు తెలిపారు. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
ప్రథమస్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా గిత్తలు రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176 వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా హూజూరునగర్కు చెందిన ఏఎస్పీ సుంకు సురేందర్ రెడ్డి ఎడ్లు 2,656.8 అడుగులు దూరంలాగి ప్రథమ బహుమతి రూ.2.70 లక్షల విలువైన రాయల్ ఇన్ఫీల్డ్(బుల్లెట్)ను కై వశం చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,637.10 అడుగుల దూరంలాగి 2వ బహుమతి రూ. 1.40 లక్షల విలువైన యూనికార్న్ బైక్ను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ ఎడ్లు 2,519 అడుగులు దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరంకు చెందిన కాసనేని రాజాచౌదరి, వల్లభనేని మోహన్రావు ఎడ్లు 2,511.2 అడుగుల దూరంలాగి లాగి 4వ బహుమతి, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 2,502.4 అడుగులు దూరంలాగి 5 వ బహుమతి, నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి కంబైన్డ్ డెడ్లు 2,342 అడుగుల దూరంలాగి 6 వ బహుమతి, వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,141.4 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి, నంద్యాల జిల్లా పెద్దకోట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లు 2,110.4 అడుగులతో 8 వ బహుమతి, నంద్యాల జిల్లా టి.హుసేనాపురం గ్రామానికి చెందిన ఎం. రామచంద్రారెడ్డి ఎడ్లు 2,042 అడుగులు దూరంలాగి 9 వ బహుమతి, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామా నికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎడ్లు 1,815 అడుగులు లాగి 10వ బహుమతి రూ. 14 వేలను గెలుచుకున్నాయి. ● అదేవిధంగా 11, 12, 13, 14, 15 జతలకు పోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విభాగంలో 15 జతలు పాల్గొనగా నిర్వహించిన బలప్రదర్శనలో మొత్తం 8 విభాగాలలో 123 జతల ఎడ్లు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బి. రామకృష్ణ, ఎం. రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, జె. రాజేష్రెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, దుర్గి శ్రీనివాసరావు వ్యవహరించారు. -
వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయండి
నగరంపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, జిల్లా, నగర, రాష్ట్ర కమిటీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఇటీవల హత్యాయత్నానికి గురైన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించనున్నారు. సిద్ధార్థనగర్లోని ఆయన నివాసానికి వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, సీఈసీ సభ్యుడు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాంరసూల్, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని శ్రీ దత్తపీఠంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అనఘాదేవి, శ్రీ దత్తాత్రేయ స్వామిని విశేషంగా అలంకరించి అష్టోత్తర, సహస్ర నామ పూజలు చేశారు. యాగశాలలో రుత్వికులచే మహా సుదర్శన హోమం నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను శ్రీదత్త పీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. తెనాలి టౌన్: శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పుష్పాలతో విశేష అర్చనలను వైభవంగా జరిపించారు. స్థానిక షరాఫ్ బజారులోని సువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కనులపండువగా నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్.వి.కిరణ్కుమార్లు పర్యవేక్షించారు. నగరంపాలెం: తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో భారత్ రంగ మహోత్సవ్ –అంతర్జాతీయ నాటక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు వేదిక (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు తెలిపారు. మంగళవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బ్రోచర్ విడుదల చేశారు. తెలుగు నాటక కళా పరిషత్ల సమ్మేళనం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) సహకారంతో ఈ ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 6, 7, 8, 9, 10 తేదీల్లో మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటక ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం మంగళవారం 542.30 అడుగులకు చేరింది. ఇది 193.1535 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 27,866, ఎస్ ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 46,241 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 46,241 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బాబు ఫ్లెక్సీ కుట్రలు..
ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి ప్రజలను నమ్మించేందుకు అధికార పార్టీ చేపట్టిన అసత్య ప్రచారం సామాన్యులకు ఇబ్బందికరంగా మారిందని గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకుంటున్నారు. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్న ఫ్లెక్సీలను తొలగించాల్సిన పోలీసులు వాటికి పహారా కాస్తూ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఉన్నారా? లేక అధికార పార్టీ చెప్పినట్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గుంటూరు రూరల్: శాంతిభద్రతలకు భంగం కలిగించేలా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దంటూ నిమిషాల్లో తొలగించే మున్సిపల్ అధికారులు ఇప్పుడు మిన్నకుండి పోయారేంటని ప్రజలు నిలదీస్తున్నారు. రక్షణ కల్పించి మరీ... రాష్ట్రంలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తూ ఎందరో సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఫ్లెక్సీలకు ఒక పక్క పోలీసులు పహారా కాస్తుంటే. మరో పక్క టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో రక్షణగా ఉంటున్నారు. ఇదేంటని, రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా? డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? అని మేధావులు సైతం చర్చించుకుంటున్నారు. నేడు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఈ దుస్థితి కల్పించారని పేర్కొంటున్నారు. చిన్నపాటి బర్త్డేలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే తెల్లారేసరికే వచ్చి మున్సిపల్ అధికారులు తొలగిస్తారు. కానీ అసత్య ప్రచార ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్నా... రాష్ట్రం ఆ ఫ్లెక్సీల వల్లే రావణ కాష్టంలా కాలుతున్నా కనీసం ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫిర్యాదు చేసినా దిక్కేది? రాష్ట్రంలో విధ్వంసాలకు కారణమైన, సామాన్య ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అటువంటి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప్రముఖ మహిళా న్యాయవాది రజని నల్లపాడు పోలీస్ స్టేషన్లో సీఐకి ఆదివారం ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దాడులకు పాల్పడి, ప్రజా శాంతికి విఘాతం కలిగిచే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజులుగా ఈ ఫిఽర్యాదుపై కనీస చర్యలు చేపట్టలేదని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటం చూస్తే దాడులకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులే అండగా నిలుస్తున్నారా? అని లాయర్ సైతం పలు డిబేట్లలో మాట్లాడినట్లు సమాచారం. -
ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు నగరంపాలెం: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరచి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలుచేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం పరామర్శించారు. ఉదయం గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి ఇంటికి వారు చేరుకున్నారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గాల ఇన్చార్జులు బాల వజ్రబాబు (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి) తదితరులు అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. టీడీపీ గూండాలు జరిపిన విధ్వంసకాండ గురించి అంబటి కుమార్తెలు మౌనిక, మనోజ్ఞ, అంబటి భార్య విజయలక్ష్మిలు వివరించారు. కార్యాలయంలో అంబటి రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంట్లో కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు ఉన్నారని.. బయట నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కేకలు వేసినా ఏమాత్రం ఆలకించకుండా కోడిగుడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నడూలేని విధంగా భయానకరమైన బీభత్సాన్ని స్పష్టించారని తెలియజేశారు. అనంతరం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ అంబటిని పోలీస్ కస్టడీకి తీసుకుని శారీరకంగా, మానసికంగా మళ్లీ వేదనకు గురి చేసేందుకు పోలీసులు చూస్తున్నారని రాంబాబు కుమార్తె చెబుతున్నారని అన్నారు. మహిళలు ఉంటున్న ఇంట్లోకి ఒక మహిళ ఎమ్మెల్యే వచ్చి దాడులు చేయించడమనేది చాలా దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన గురించి రాష్ట్రపతికి నివేదించాలని అన్నారు. గవర్నర్ పాలనను రాష్ట్రంలో విధిస్తే గానీ రెడ్బుక్ పాలనకు అంతం ఉండదన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని 79 కేంద్రాలలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాలలో జిల్లావ్యాప్తంగా మంగళవారం 4,790 మంది విద్యార్థులకు గాను 4,591 మంది హాజరు కాగా మరో 199 మంది గైర్హాజరయ్యారు. గురజాలలోని మూడు పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్భందీగా ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్క్వాడ్ బృందాలు పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. మార్కెట్ కమిటీ పూర్తి స్థాయి నియామకం కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్బాయి, బత్తుల జాన్సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. -
ముందే గుర్తిస్తే.. మెరుగైన వైద్యం
గుంటూరు మెడికల్ పూర్వం రాచపుండుగా పిలిచే క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం తప్పదనే వారు. క్యాన్సర్ సోకగానే వ్యాధికి మందు లేదనే భయాందోళనలతో అనేక మంది చనిపోయేవారు. నేడు ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించే అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కట్టడి చేసే వ్యాక్సిన్లు సైతం మార్కెట్లోకి వచ్చాయి. యువ క్రికెటర్ యువరాజ్సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదిగే గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు ఉత్పత్తుల కారణంగా 40 నుండి 45 శాతం, కాలుష్యం వల్ల 8 నుంచి 10 శాతం, మద్యం వల్ల మూడు శాతం క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్ద రోజూ దాదాపు 10 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సంవత్సరం ఓపీ రోగులు ఆపరేషన్లు 2021 11,719 168 2022 13,105 417 2023 14,648 753 2024 16,359 823 2025 19,598 1,131 -
రేషన్ దుకాణాల్లో జేసీ విస్తృత తనిఖీలు
గుంటూరు వెస్ట్: జిల్లాలో రేషన్ దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, వారి సిబ్బందితో కలసి విస్తృతంగా తనిఖిలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో రేషన్ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల సిబ్బంది ఆకస్మికగా తనఖిలను నిర్వహించి వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరిగిందని వివరించారు. గుంటూరు నగరంలో రేషన్ షాప్ నెంబర్ 0781095, 0781106, 0781141లలో తనిఖీలను నిర్వహించగా ఆ దుకాణాల్లో బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల నెంబర్లు 0781003, 0781018, 0781015 లో తనిఖీలను నిర్వహించగా వాటిలో బియ్యం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. తాడేపల్లి మండల పరిధిలో రేషన్ షాప్ నెంబర్ 0793014 లో తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించి డీలర్లపై కేసులను నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరిపితే నేరమని తెలిపారు. అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. -
చోద్యం చూస్తున్న పోలీసులు
సహజంగా ఎక్కడ గొడవలు జరిగినా, ఎటువంటి ప్రజా శాంతికి విఘాతం కలిగించే కార్యక్రమాలు జరుగుతున్నా వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవలకు పాల్పడే వారిని బెదిరించో, మాట్లాడో సమస్యను పరిష్కరించేందుకు చూస్తారు. గోరంట్లలో జరిగిన దాడి, విద్యానగర్లో మాజీ మంత్రి అంబటి ఇంటి వద్ద జరిగిన దాడిలో పోలీసులు అక్కడే ఉన్నా కనీసం విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవటం శోచనీయం. అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీ వారికి ఒక న్యాయమా? అని విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలను అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోవటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, అధికారులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారరని ప్రజలు మండిపడుతున్నారు. -
రేపటి నుంచి మెడ్ఫ్యూజన్
గుంటూరు మెడికల్: మీ పిల్లలు డాక్టర్లు కావాలని కోరుకుంటున్నారా.. గుంటూరు వైద్య కళాశాలకు రండి. ఆస్పత్రుల్లో ఉండే మర్మమైన, ఎన్నో గమ్మతైన విషయాలు, ఎప్పుడు కళ్లతో నేరుగా చూడలేని చికిత్సలు చూసే అత్యంత అద్భుతమైన అవకాశం వచ్చింది. అది గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి ఒక్కరు వైద్య రంగంలోని ఆసక్తికర విషయాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం నుంచి మెడ్ఫ్యూజన్ పేరుతో మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మూడు వారాలపాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్ ప్రత్యేకతలు... గుంటూరు వైద్య కళాశాలలో 30 ఏళ్ల క్రితం మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి ఆధ్వర్యంలో బుధవారం ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. 40 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం గుంటూరు వైద్య కళాశాల కాలేజీ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్ను రూ.కోటిన్నర మేర ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ వీక్షించేందుకు 2,500 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు లక్షన్నర మంది వీక్షిస్తారని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. శరీరభాగాలు నేరుగా చూడొచ్చు.... ప్రతి అవయవవాన్ని నేరుగా చూడొచ్చు. అస్థిపంజరం చూడొచ్చు. వ్యాధులు శరీరానికి ఏ విధంగా సోకుతాయి. అవయవాలు ఏ విధంగా పాడవుతాయి. వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారు. వ్యాధులకు చికిత్సలు, ఆపరేషన్లు ఎలా చేస్తారు ఇలా నేరుగా చూసి కూలంకుషంగా తెలుసుకుని సందేహాలు పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. గుంటూరు వైద్య కళాశాలలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరు సందర్శించి వైద్య రంగం గురించి తెలుసుకోండి. సుమారు 30 ఏళ్ల తరువాత ఏర్పాటు చేస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి వైద్య రంగంపై అవగాహన కల్పించటమే. గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ల ద్వారా ఎంతో మంది ప్రేరణ పొంది వైద్య రంగంలోకి వచ్చి ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. స్కూల్, కాలేజ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా మెడికల్ ఎగ్జిబిషన్ను సందర్శిస్తే మంచి అనుభూతి పొందుతారు. – డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ప్రిన్సిపాల్, గుంటూరు వైద్యకళాశాల, -
ఏఐ మోడల్తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది
చేబ్రోలు: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఓపెన్ సోర్స్, లో రిసోర్స్ ఏఐ మోడళ్లు భవిష్యత్తులో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా మారతాయని స్విస్నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ కాన్క్లేవ్ ఆన్ రెస్పాన్సిబుల్ అండ్ సెస్టెయినబుల్ ఏఐ’ అనే అంశంపై సోమవారం సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ‘బిల్డింగ్ బెటర్ విత్ ఏఐ : సస్టేనబిలిటీ యాస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియా’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్విస్నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా మాట్లాడుతూ.. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతో రూపొందించే ఏఐ మోడళ్ల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఆధునిక సాంకేతిక సేవలను అందించవచ్చని వివరించారు. -
పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం
చీరాల: పంట కాలువలో మహిళ మృతదేహం సోమవారం చీరాలలో కలకలం రేగింది. పంట కాలువలో మహిళ మృతదేహం లభించడంతో స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో తోటవారిపాలెం 216 హైవే పక్కన కాలువలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వయస్సు 25–30 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మరణించి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని, మృతురాలికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదన్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ ఎండీ మొయిన్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ముగిసిన విజ్ఞాన్ బాల మహోత్సవ్
చేబ్రోలు: చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని, క్రమశిక్షణతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్ఎంఎస్) అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్ ‘విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26’ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. బాల మహోత్సవ్ గెజిట్ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. బాల మహోత్సవ్ 2కే26 విజేతలు వీరే... రాష్ట్రస్థాయి విజ్ఞాన్ బాల మహోత్సవ్లో భాగంగా మొత్తం 50 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. -
నిర్మల స్కూల్ ఆగడాలను అరికట్టండి
ఆత్మకూరులోని నిర్మల స్కూల్లో మా పిల్లలు 2024–25 సీబీఎస్ఈ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ బోర్డు గత ఏడాది జూన్లో ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికెట్లు పంపారు. స్కూల్ యాజమాన్యం వాటిని పోగొట్టింది. 10వ తరగతి ఒరిజినల్ మార్కుల మెమోలను అడుగుతుంటే పొంతనలేని సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయండి. – బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, ఆత్మకూరు. నేను వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాది నుంచి అర్జీలు పెడుతూనే ఉన్నాను. చూద్దాం, చేద్దాం అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాను. పింఛన్ వస్తే ఈ వయస్సులో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మొర ఆలకించి ఇబ్బంది పెట్టకుండా పింఛన్ మంజూరు చేస్తారని కోరుకుంటున్నాను. – తమడ రాజారావు, గుంటూరు -
ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ (ఏపీయూఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం గుంటూరు పట్టాభిపురం హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్ పమిడి పద్మ మాట్లాడుతూ 1982లో ఆవిర్భవించిన ఏపీయూఎస్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మన్నవ సురేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, బాలచంద్రారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి వైఆర్కే ప్రసాద్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షడు వీరబాబు పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానులు లెక్కించారు. రూ.18, 83,646 ఆదాయం వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టరు సి.హెచ్. వెంకట శ్రీనివాసులు, దేవాలయ ధర్మకర్త డి.రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ళ అత్యంత వైభవంగా సాగింది. లక్ష మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఈ మేరకు సోమవారం దేవదాయశాఖ, ధర్మకర్త, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ ద్వారా వచ్చిన విరాళాలు, కొబ్బరికాయ వేలం ద్వారా వచ్చిన రాబడిని లెక్కించారు. హుండీ ద్వారా 5 లక్షల 64 వేల రూపాయలు, కొబ్బరి చిప్పలు తలనీలాల వేలంపాట ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మంజూష, ఈవో శివనాగిరెడ్డి, సుధాకర్రెడ్డి, నెమలిరెడ్డి, లక్ష్మయ్య, సుబ్బారెడ్డి, ఎ.వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్తంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 542.80 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ఎస్ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 18,375 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఉపేక్షిస్తే ఎలా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని ఉపేక్షించడం సరికాదని, కర్రలు చేత్తో పట్టుకుని తిరుగుతూ దాడులు చేసిన వారిపై చర్యలు లేకపోతే ఎలా అని జనసేన అధికార ప్రతినిధి, న్యాయవాది కన్నా రజనీ ప్రశ్నించారు. గోరంట్లలో ఫ్లెక్సీ వద్ద జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె సోమవారం నల్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకు దారితీస్తుందని చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. సిట్, సీబీఐ కేసు విచారణ చేస్తుండగా ఇతనే నేరగాడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. రెచ్చగొట్టే ధోరణితోనే, కొట్టుకోవాలనే ధోరణితోనే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. అది ఒక చోట కాకుండా, రాష్ట్రమంతా వేశారన్నారు. అది హేయమైన చర్య అంటూ వాళ్లు చింపేస్తారని మీకు తెలిసే, అప్పుడు తిరగబడాలని అనుకున్నారేమో తనకు తెలియదన్నారు. ఏది ఏమైనా కర్రలు పట్టుకునే సంప్రదాయం సాధారణ పౌరులకు లేదని, కర్రలు పట్టుకునే హక్కు కేవలం పోలీసులకే ఉందని అది కూడా చట్టాన్ని పరిరక్షించడానికే అని రజని పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కర్రలు పట్టుకుని నిల్చోవడం, పక్కనే పోలీసులు ఉండటం చాలా ఆశ్చర్యమనిపించిందన్నారు. వెంటనే పోలీసులు వారి చేతుల్లో కర్రలు తీసుకుని ఉండాల్సింది. కానీ తీసుకోలేదు. ఈ రోజు కూడా సీఐని ఇదే అడిగానన్నారు. కర్రలు పట్టుకుని వారు నిల్చుంటే మీరు ఎందుకు ఉపేక్షించారంటే, అంబటి రాంబాబు కారులో కర్రలు ఉన్నాయంట అని సీఐ చెబుతున్నారు. అందుకనే వీరు కూడా కర్రలు పట్టుకుని నిల్చున్నారని సమర్థిస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ వాళ్ల చేతుల్లోకి తీసుకోవడానికి ఏం అధికారం ఉంది. వాళ్లు కర్రలు పట్టుకుని ఉంటే, మీరు పక్కన చోద్యం చూస్తున్నారా? చట్ట వ్యతిరేకం కదా అంటూ నిలదీశారు. ఇలాంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపవద్దు. ఒకరికొకరు కొట్టుకుని చంపుకునే సంప్రదాయం వద్దు. కూటమి సర్కార్ను కష్టపడి అందరం కలిసి ఏర్పాటు చేశాం. అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారని, ఫ్లెక్సీలకు కాపలా కాస్తారని కాదని రజని విమర్శించారు. ప్లెక్సీ మీద చెయ్యి వెయ్యి, చెయ్యి విరగదీస్తా. నువ్వు రారా చూసుకుందాం. నువ్వు మోగోడివైతే రారా.. అని ఒక గ్రంథాలయ చైర్మన్ అంటే ఆమైపె చర్యలు తీసుకోవాలని కదా అని ప్రశ్నించారు. కర్రలు పట్టుకుని వచ్చిన వారిని అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీసుస్టేషన్కు తీసుకు వచ్చి ఉండవచ్చు కానీ మీరు ఉరంతా తిప్పారని ఆరోపించారు. కర్రలు పట్టుకునే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తి నష్టం కలుగచేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీలు తీయించేది మున్సిపల్ అధికారుల బాధ్యత అంటున్నారని, వారిని కూడా నిలదీస్తానని అన్నారు. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఆయన ఆలకించారు. సంబంధిత సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మొబైల్ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్ అధికారి పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కరించాక బాధితులకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదిదారుల అనుమతుల్లేకుండా ఏ ఫిర్యాదు ఆన్లైన్లో మూసివేయద్దని సూచించారు. 170 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాస్రెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు ఫిర్యాదులు స్వీకరించారు. -
రూ.కోటి అంచనా వ్యయంతో కొండవీడు ఉత్సవాలు
సమీక్ష చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ నరసరావుపేట: కోటి రూపాయల అంచనాతో కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలపై అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.75 లక్షలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన చిలకలూరిపేట పట్టణంలో 2కె రన్ ద్వారా ఉత్సవాలకు సంబంధించిన తొలి అంకానికి అడుగు వేయనున్నామన్నారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 7, 8 తేదీల్లో కొండపై వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. హెలీరైడ్, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. హెలీరైడ్కి ఒక వ్యక్తికి రూ.3,500 ధర నిర్ణయించారు. ఉత్సవాల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ మూకల విధ్వంసం
వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి ఇంటిపై, కార్యాలయంపైకి శనివారం వేలాదిగా వచ్చిన టీడీపీ మూకలు పక్కా వ్యూహంతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, మహిళలపైనా దాడి చేశారు. దీంతో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. – లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)అంబటి ఇంటిపై , కార్యాలయంపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నా. టీడీపీ గూండాలు మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడి చేయడంతో కింద పడిపోయాం. అక్కడే ఉన్న తోటి పార్టీ శ్రేణుల సహాయంతో వారి బారి నుంచి బయట పడ్డాం. ఇంతటి రాక్షసంగా వ్యవహరిస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించడం చాలా బాధగా ఉంది. – భాగ్యలక్ష్మి, త్రివేణి అంబటి ఇంటి వద్దకు పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాను. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో, ఇనుప రాడ్లతో టీడీపీ గూండాలు అంబటి కార్యాలయంలోకి చొరబడ్డారు. అడ్డుగా ఉన్న నాపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకుని రాత్రి 11.45 గంటల వరకు అంబటి రాంబాబు కార్యాలయంలో తలదాచుకున్నాను. నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చి గుంటూరు పట్టాభిపురంలో నివాసం ఉంటున్నాను. – గుంజి శివ, పల్నాడు జిల్లా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని నాతోపాటు మా నాన్న, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, మరికొంత మందితో వెళ్లాం. అక్కడ ఉన్న టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నాపై చేతులతో, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు జీజీహెచ్కు తరలించారు. – పూనూరి చంద్ర ప్రకాష్ -
మార్కెట్ కమిటీలు డీలా
కొరిటెపాడు(గుంటూరు): వివిధ రకాల ఫీజు వసూలులో మార్కెట్ కమిటీలు డీలా పడ్డాయి. తెనాలి, దుగ్గిరాల, పొన్నూరు, మంగళగిరి, ప్రత్తిపాడు మార్కెట్ యార్డుల పరిస్థితి కొంత మేరకు మెరుగ్గానే ఉన్నా.. మిగిలిన తాడికొండ, ఫిరంగిపురం, గుంటూరు మార్కెట్ కమిటీల్లో వసూళ్లు బాగా తగ్గాయి. గుంటూరు జిల్లాలో ఉన్న 8 మార్కెట్ కమిటీలు, వాటి పరిధిలో ఉన్న 15 చెక్ పోస్టుల ద్వారా ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల ఫీజులు, అద్దెలు, సంతల ద్వారా రూ.146.31 కోట్లు వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు. లక్ష్య సాధనలో 47.68 శాతంతో సరి కారణమని వినిపిస్తున్న విమర్శలు -
ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పడాలి
కొరిటెపాడు(గుంటూరు): దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించాలని తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం గుంటూరు నగరం ఆర్.అగ్రహారంలోని రామనామ క్షేత్రం ప్రాంగణంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం తులసి రామచంద్ర ప్రభు, ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా జరిగింది. 270 మంది విద్యార్థులకు రూ.12,12,500 చెక్కుల రూపంలో ఉపకార వేతనాలను అందజేశారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ 1995–96లో ఇద్దరు విద్యార్థులతో మొదలుపెట్టి నేటికి సుమారు 40 వేల మంది విద్యార్థులకు రూ.23 కోట్లు ఉపకార వేతనాలుగా ట్రస్టు ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి మేజర్ కాంట్రిబ్యూషన్ తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దీంతో పాటు నగరంలోని కొంతమంది సమాజ హితం కోరే పెద్దలు ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టులో సభ్యులుగా చేరి సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు తులసి రామచంద్ర ప్రభును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, ట్రస్ట్ సభ్యులు నారదాసు శ్రీహరిరావు, తిమ్మిశెట్టి నారాయణరావు, పసుపులేటి రమణయ్య, అంకిరెడ్డి సాంబశివరావు, నారదాసు కోటేశ్వరరావు, పుచ్చకాయల ఆనంద్, కనదం నరేంద్రనాథ్, దళవాయి సుబ్రమణ్యం, మిరియాల శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు 270 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ -
నృసింహుని తెప్పోత్సవం
కనుల పండువగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకీలాద్రి వేదపండితులుడేపల్లి రూరల్ : ప్రసిద్ధి గాంచిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున లక్ష్మీ నరసింహస్వామి వారిని సీతానగరంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి యున్న కనకదుర్గ ఆలయం నుంచి నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నృసింహస్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన పంటు వాహనంలో స్వామివారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక భద్రతా చర్యల మధ్య ఇ.వో. సునీల్కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
గ్రామస్థాయి నుంచి రైతులు ఉద్యమించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం తొలగిపోవాలంటే రైతులు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలభారత కిసాన్ సభ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం రాత్రి ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు అధ్యక్షతన ‘కార్పొరేట్ వ్యవసాయం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏ పంట వెయ్యాలో రైతులకు కార్పొరేట్లే దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట పండించడం వల్ల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇందుకు గుంటూరులో గత రెండేళ్ల కాలంలో మిర్చి ధరల హెచ్చుతగ్గులే నిదర్శనం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు రావాలన్నారు. ‘కేంద్ర బహుళ సహకార చట్టం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకుడు వై. కేశవరావు, ‘వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి –సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకత’ అనే అంశంపై ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్ తదితరులు ప్రసంగించారు. ఏఐకేఎస్ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ -
5న ఏఐ–జాక్టో ఆధ్వర్యంలో ‘మార్చ్ టు పార్లమెంట్’
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో ఆవిర్భవించిన ఏఐ – జాక్టో ఆధ్వర్యంలో ఈనెల 5న చేపడుతున్న మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,04,125 ఉండగా, మన రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. బోధన కోసమే నియమించబడిన ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాల భారం పెంచటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమాను జోజప్ప, ఎం.శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యాంబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ
గుంటూరు మెడికల్: వెన్నుముక పరిశోధనల్లో జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడు ప్రతిభ చూపించి రెండు జాతీయ అవార్డులు ఒకేసారి సొంతం చేసుకుని అరుదైన రికార్డు సృస్టించారు. గుంటూరుకు చెందిన సీనియర్ స్పయిన్ సర్జన్, మల్లిక సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్బాబు వెన్నుపై చేసిన పరిశోధనలకు రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు .. అసోసియేషన్ ఆఫ్ స్పయిన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా గత వారం పూణేలో నిర్వహించిన స్పయిన్ సర్జన్స్ 2026 జాతీయ సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది. ఎంఆర్ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్అనే ఆర్టిఫి షల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలను సూచించవచ్చు అని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు 2026ను నరేష్ బాబు అందుకున్నారు. బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు తో పాటు క్లినికల్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు కూడా మల్లిక స్పయిన్ సెంటర్ గెలుచుకోవడం విశేషం. ఒకే సమయంలో ఈ రెండింటినీ సొంతం చేసుకున్న తొలి స్పయిన్ సెంటర్గా గుంటూరు మల్లిక స్పయిన్ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించింది. సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ నుంచి మొత్తం 11 పోడియం ప్రెజెంటేషన్లు జరగడం విశేషం. ఈ సందర్భంగా మల్లిక స్పయిన్ సెంటర్ చీఫ్ ఆఫ్ స్పయిన్ సర్వీసెస్ డాక్టర్ జె.నరేష్ బాబు మాట్లాడుతూ ఈ విజయాలు మొత్తం వైద్య బృందం, సహాయక సిబ్బంది అందరి కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న తమ విద్యార్థి డాక్టర్ పృథ్వీకుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అరుదైన రికార్డు సృష్టించిన స్పయిన్ సర్జన్ డాక్టర్ నరేష్బాబు ఒకేసారి రెండు జాతీయ అవార్డులు సొంతం -
ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్ సృజన
తెనాలి: కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు...అదే కత్తితో పీకలు కోయొచ్చు...అంటారు! సోషల్మీడియా కూడా అటువంటిదే. ఎందరో దుర్వినియోగం చేసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో సాధించవచ్చు...ఎందరి ప్రశంసలనో అందుకోవచ్చు...జీవితానికో బాట వేసుకోవచ్చు...అనేందుకు ఎన్నో ఉదాహరణలు. తెనాలి నాజరుపేటకు చెందిన అచ్యుతుని సాయిశ్రీకర్ ఇందుకో నిదర్శనం. బీకాం చదివి, షార్ట్హ్యాండ్ ఉత్తీర్ణుడైన సాయిశ్రీకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. షార్ట్హ్యాండ్, కంప్యూటర్ పరిజ్ఞానం మెండుగా ఉన్న ఈ యువకుడి దృష్టి, ఇటీవల అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై పడింది. స్వయంగా అధ్యయనం చేశాడు. తెలుగు భాషా పరిజ్ఞానం, పదాలతో పట్టు కలిగిన సాయి శ్రీకర్ తెలుగులో కవితాగానం చేయగలడు. కమ్మని పాటలను రచించగలడు. తన భాషా ప్రావీణ్యానికి ఏఐని ఆలంబన చేసుకున్నాడు. చక్కని పాట రాయడం, ఏఐతో ఆ పాటకు గానం, సంగీతం సమకూర్చటం, వీడియో ఎడిటింగ్ ప్రవేశం కూడా ఉండటంతో ఆ పాటకు సందర్భోచితమైన వీడియోలను తానే జత చేస్తున్నాడు. సినిమా పాటలను పోలిన గీతాలతో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఎవరి సాయం లేకుండా స్వయంసాధనతో చేసిన కృషికి అద్భుతమైన ప్రశంసలను అందుకుంటున్నాడు. తన తండ్రి జర్నలిస్టు కావటంతో తెలుగు పదాలతో చక్కని పాటలను రూపకల్పన చేయగలుగుతున్నానని తెలిపారు. నటన, సినిమారంగంపై అభిలాష కలిగిన తాను, గీత రచయితగానూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావనతో ఉన్నట్టు చెప్పాడు. ...మనమూ బెస్టాఫ్ లక్ చెబుదాం... -
పోలీసుల పచ్చపాతం!
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీ గూండాలకు అండగా నిలిచారు. అంతులేని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అదే పోలీసులు... ఆదివారం ఉదయం నుంచి అంబటి ఇంటి వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వైసీసీ శ్రేణులతోపాటు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చే వారిని కూడా అడ్డుకుంటూ అనధికారిక ఆంక్షలు విధించారు. అంబటిపై, ఆయన కార్యాలయంపై, ఇంటిపై, కుటుంబ సభ్యులపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్, నాయకులు గుజ్జుల నాగార్జునరెడ్డి, పోతుల మహేష్, నాగార్జున యాదవ్, కారుమూరు వెంకటరెడ్డి, గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అంబటి ఇంటికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు నిలదీశారు. శనివారం రాత్రి అంబటి ఇంటి వద్ద సుమారు 7 గంటలకుపైగా టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పోలీసు శాఖ వారికి అండగా నిలబడి మరీ దాడులు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. కనీసం అడ్డుకునే యత్నం చేయకుండా వారికి పూర్తి మద్దతుగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బారికేడ్లు అప్పుడు ఏమయ్యాయని నిలదీశారు. పోలీసులు ఇలా శనివారం కూడా వ్యవహరించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే ఇంతటి విధ్వంసం సృష్టించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువైపుల బారికేడ్ల వద్ద లేళ్ళ అప్పిరెడ్డి, నాగార్జున రెడ్డి, బలసాని కిరణ్, గులాం రసూల్లను అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు వెంటనే నిలదీయడంతో కార్యకర్తలను ఆపి, నేతలను మాత్రమే లోపలికి పంపించారు. ఇంటి ముందు ఏడున్నర గంటల హైడ్రామా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి తెలుగు దేశం పార్టీ గూండాలు అర్ధరాత్రి 11.45 గంటల వరకు గంటలకుపైగా విధ్వంసం సృష్టించారు. టీడీపీ మూకలు, పార్టీ సామాజిక వర్గ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇష్టానుసారంగా అంబటి కార్యాలయం ముందు అసభ్య పదాలతో విరుచుకుపడ్డారు. స్వయంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు మైక్ సెట్తో, హిజ్రాలను తీసుకు వచ్చి పశ్చిమ ఎమ్మెల్యే... అంబటి ఇంటి ముందు తిష్ట వేశారు. మైక్లో అంబటిని, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో సంభోదించారు. మరో వైపు టీడీపీ మూకలు గుణపాలు, రాళ్లు, కర్రలతో అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం చోద్యం చూశారు. అంబటితోపాటు ఉన్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణలతోపాటు మరో 50 మంది లోపల బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. పోలీసులు లోపలికి వచ్చి లైట్లు ఆపాలని, బయటకు కనిపించకుండా ఉండాలని చెప్పారేగానీ టీడీపీ మూకలను నిలురించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. డ్రోన్లతో నిఘా అంబటి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతోపాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడంపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ కెమెరాలో విజువల్స్ ఎవరికి చూపించడానికి లైవ్ కనెక్షన్ పెట్టారంటూ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అంబటి ఇంటి ముందు నిలబడి ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్రోన్ను ఎగురవేస్తూ ఎంతో శ్రద్ధగా వైఎస్సార్ సీపీ నాయకుల వీడియోను, ఫొటోలను తీయడంపై శనివారం ఎందుకు ఇలా కనిపించలేదని మండిపడ్డారు. పోలీసులు చోద్యం చూస్తూ ఉండటంపై ప్రజాసంఘాలు ఆగ్రహించాయి. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని నిలదీశారు. రెడ్ బుక్ పాలనను పోలీసులు అనుసరిస్తున్నారా.. అంటూ ప్రజా సంఘాలు పోలీసు శాఖపై మండిపడుతున్నాయి. అంబటిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వజ్ర వాహనాన్ని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చారు. టీడీపీ గూండాలను తరిమి కొట్టకుండా రెండు గంటలపాటు అలాగే ఉన్నారు. అంబటిని వాహనంలోకి ఎక్కించలేకపోయారు. తర్వాత రాంబాబు చుట్టూ పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి తీసుకు వెళుతున్న సమయంలో టీడీపీ మూకలు రాళ్లు, సోడా బుడ్డులు విసురుతూ విధ్వంసం సృష్టించారు. వజ్ర వాహనంలోకి పోలీసులు అంబటిని ఎక్కించిన తరువాత కూడా వారు వాహనాన్ని వెంటాడారు. అప్పటికి కూడా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అరాచకం
సాక్షి టాస్క్ఫోర్స్ : రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న తెలుగుదేశం నేతలు గుంటూరు నగరంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసానికి తెగబడ్డారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించి ఆరున్నర గంటలకు పైగా విధ్వంసం సృష్టించారు. ఇంత జరుగుతున్నా డీజీపీ నుంచి ఐజీ, ఎస్పీల వరకు ఒక్కరు కూడా అందుబాటులోకి రాలేదు. రెండు సార్లు శాసన సభ్యులుగా, మాజీ మంత్రిగా పనిచేసి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న అంబటికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంబటి ఇంటితోపాటు, పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. ఒక దశలో అంబటిపై చేయి చేసుకున్నారు. పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఆ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. కోడిగుడ్లు, నాపరాళ్లు, బండరాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. టీడీపీ మూకలు ఫూటుగా మద్యం తాగి భయానక వాతావరణం సృష్టించాయి. ఒక దశలో పెద్ద దుంగలు తెచ్చి, అంబటి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టి వికృతానందం పొందారు. విద్యుత్ సరఫరా కట్ చేయించి మరీ దాడులు చేశారు. మూడు వ్యానులతో పాటు పదుల సంఖ్యలో జీపుల్లో వచ్చిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దిగ్బంధంలో ఉన్న అంబటి కార్యాలయంలో మళ్లీ రాత్రి పది గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద దుంగలు తెచ్చి కిటికీలు పగులగొట్టారు. నాపరాయి ముక్కలు, పెద్ద పెద్ద రాళ్లను పార్టీ కార్యాలయంపై విసిరారు. ఆరు గంటల విధ్వంసం అనంతరం పోలీసులు వజ్రా వాహనాన్ని తెచ్చి రాంబాబును అరెస్టు చేశారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
తిరుమల లడ్డూ విషయమై టీడీపీ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు తెరలేపాలని, అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి్డ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసుల దగ్గరుండి దాడులను ప్రోత్సహించినట్లు ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు. ప్రశాంతమైన గుంటూరులో అశాంతిని నెలకొల్పారన్నారు. ఈ దాడులను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసుల అండతో ఇలాంటి హింసలకు పాల్పడటం సరికాదన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోందని, అందుకు నిలువెత్తు నిదర్శనం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పై టీడీపీ గుండాలు దాడి చేయటమేనన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. -
మరో రకం డైవర్షన్ రాజకీయాలు
అంబటి రాంబాబు కారును అడ్డగించటం, ఇంటిపై దాడి చేయటం దారుణం. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. సీబీఐ కూడా లడ్డూలో కల్తీ లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినా పోలీసులు వాటిని తొలగించలేదు. ఇదే విషయమై ప్రశ్నించిన అంబటి రాంబాబు కారును అడ్డగించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఇంటిపై దాడికి వెళ్లారు. తాను పరుషంగా మాట్లాడానేగానీ, చంద్రబాబును దూషించలేదని అంబటి రాంబాబు చెబుతున్నాఅరెస్టు చేయాలనటం దుర్మార్గం. లడ్డూప్రసాదంపై ఆరోపణలు అసత్య ప్రచారమని తేలటంతో మరో డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను వివాదం చేయటం అందులో భాగం. – అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్ సీపీ తెనాలి సమన్వయకర్త -
టీడీపీ దుర్మార్గ పాలనకు నిదర్శనం
మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై దాడి టీడీపీ దుర్మార్గ పాలనకు నిదర్శనం. ఈ ఘటనతో రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టమవుతోంది. ప్రజా సమస్యలపై నిర్భయంగా గొంతెత్తుతున్న ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట. రాష్ట్రంలో రాజకీయంగా బలంగా ఉన్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడటం హేయమైన చర్య. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా దాడులు చేసి భయపెట్టాలని చూడటం సిగ్గుచేటు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త -
దిగజారిన శాంతిభద్రతలు
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గూండాలు హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు సైతం చూస్తూ ఊరుకునే పరిస్థితి నెలకొంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, అతని తొత్తులు చేసిన అసత్య ప్రచారం అంతా బూటకమని సీబీఐ తేల్చటంతో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టేందుకు మరో అసత్య ప్రచారం ఫ్లెక్సీలతో చేయాలని చూశారు. తానే స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో చెప్పటం చూస్తే రాష్ట్రం పరిస్థితి అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఏకంగా ఇంటిపై దాడికి పాల్పడటం చూస్తే టీడీపీ గూండాలు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది. మాజీ మంత్రికి రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో బాబు, లోకేష్ రెడ్బుక్ పాలన నడుస్తోంది. కేవలం గూండాలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీసులు సైతం దాడులను అడ్డుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి నెలకొంది. గవర్నర్ పట్టించుకని ప్రజా రక్షణకోసం గవర్నర్ పాలన తీసుకురావాలి. – బలసాని కిరణ్కుమార్, వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త -
రాష్ట్రంలో విధ్వంస పాలన
రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోంది. అందుకు నిలువెత్తు నిదర్శనం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పై టీడీపీ గూండాలు దాడి చేయటమే. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక అత్యంత దుర్మార్గంగా ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా... లేదా... అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గంటలపాటు దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. ఇంత దారుణమైన రీతిలో దాడులు చేసి వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. వీటికి ఏమాత్రం మేం భయపడం. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు -
3న సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవ మహోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో శుక్రవారం వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా ఏటా వేడుకలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలే భావితరాలకు ఇచ్చే వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 5.15 గంటలకు బాబాకు కాగడ హారతి, 6కు పాలాభిషేకం, 8కి అన్నాభిషేకం, 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ అన్నె శేషారావు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల ప్రసాదానికి బాబు చేసింది ఘోర అపచారం
గుంటూరు రూరల్: తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అబద్ధం చెబితే దానిని నిజం చేసేందుకు పవన్కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మం పేరుతో మరిన్ని అబద్దాలను పలికాడని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మండలంలోని గోరంట్ల గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై చంద్రబాబు, పవన్కల్యాణ్లు చేసిన అబద్దపు ప్రచారానికి పాప పరిహారంగా బాబుకు బుద్ధి రావాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైందన్నారు. సీబీఐ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని తేలిందన్నారు. లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి అబద్దపు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు నేడు సీబీఐ విచారణ తరువాత నోరు మెదపటంలేదన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తులు హిందువుల మనోభావాలను దెబ్బతీశామని గుర్తించి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ, మరలా అబద్దపు ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా వేంకటేశ్వరస్వామి పవన్కల్యాణ్కు, చంద్రబాబుకు బుద్ది ప్రసాదించాలని కోరారు. దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబి, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు పరీక్షలు చేసి చంద్రబాబు ఆరోపించిన ఎటువంటి కొవ్వు గానీ, గొడ్డు కొవ్వుకానీ, పంది కొవ్వుకానీ తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని నివేదికను ఇచ్చాయన్నారు. దీంతో తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు మరో డ్రామా అబద్దాల డ్రామా మొదలుపెట్టాడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా విజ్ఞాన్ బాలోత్సవం ప్రారంభం
గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రెండో ఎడిషన్ రాష్ట్రస్థాయి బాల మహోత్సవ్ కార్యక్రమాన్ని శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథి వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ భవ్య వట్టికూటి (ఐఆర్ఎంఎస్), విజ్ఞాన్ సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘన, విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు బెలూన్లు ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. – చేబ్రోలు -
రైతులే స్వయంగా సాగు వివరాలు నమోదు చేయాలి
పెదకాకాని: రైతులు వారి మొబైల్ ఫోన్ ద్వారా సాగు వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ అన్నారు. పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఏపీ ఎయిమ్స్ (ఏపిఎఐఎంఎస్) అనే యాప్ని రైతులు వారి మొబైల్ ఫోన్లో స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. యాప్లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు పండించిన పంటను తనంతట తానే నమోదు చేసుకునే విధానాన్ని బోయపాటి రమేష్ ద్వారా చేయించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి కలుపు మందుల పిచికారి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుగుమందుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కలుపును తీయిస్తే అయ్యే ఖర్చు, పురుగుమందుల ద్వారా కలుపు నివారణకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నారు. సబ్సిడీపై ఆయిల్ ఇంజన్లు, పైపులు ఇప్పించాలని రైతులు కోరారు. అనంతరం వెనిగండ్ల గ్రామాన్ని సందర్శించి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా మట్టి నమూనాలను సేకరించటం, ఆన్లైన్ అప్లోడ్ చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామ రైతు పులగం రామిరెడ్డితోపాటు పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, పైపులు, నల్ల పట్టాలు, సిర్పాలిన్ పట్టాలు సబ్సిడీపై అందించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఐ.నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ మోహన్రావు, ఏఓ కె రమణకుమార్ పాల్గొన్నారు. -
ఆర్వీఆర్జేసీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
గుంటూరు రూరల్: కళాశాల విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ జాతీయ స్థాయి వైజ్ఞానిక పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించి, సమాజానికి ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలకు ఆర్వీఆర్ జేసీ కళాశాల కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుండటం గర్వకారణమని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్, డాక్టర్ జగదీష్లు పేర్కొన్నారు. శనివారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో శారీరక వికలాంగులు, వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా కేవలం మనిషి గొంతు ఆదేశాలతో పనిచేసే స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ (ప్రొటోటైప్) విద్యార్థులు ఆవిష్కరించారని తెలిపారు. ఈ ఆవిష్కరణకు ప్రథమ స్థానం దక్కడంతో పాటు రూ.25,000 నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. సమాజానికి మేలు చేసే సాంకేతిక పరిష్కారాలతో ముందుకు సాగడం గర్వకారణమని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం.భార్గవ్నాగతేజ, కె.సాయిచైతన్య, తృతీయ సంవత్సరం చదువుతున్న పి. శేఖర్, ఐ.ఓ.టి విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.అఖిల్శివచౌదరి కలసి రూపొందించిన వీల్ చైర్ ఎటువంటి వై–ఫై లేదా మొబైల్ డేటా అవసరం లేకుండా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ ఏ ముద్దు విద్యార్థులను అభినందించారు. స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్కు జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి -
198 కిలోల గంజాయి స్వాధీనం
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లాలోని బొల్లాపల్లి టోల్ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం రూ.25 లక్షల విలువైన 198 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాల నుంచి తమిళనాడు రాష్ట్రానికి తరలివెళ్తున్న గంజాయిను మార్టూరు సమీపంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రం చామరాజ నగర్ జిల్లా కొల్లగల మండలం చంగవాడి గ్రామానికి చెందిన మంజునాథ ఈరప్ప హాల్డింగ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ హానుర్ రాజప్ప తాపీ పనిచేస్తుంటాడు. ఇద్దరు బంధువులు పైగా స్నేహితులు. వీరికి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఫోన్లో పరిచయం అయ్యారు. అతని నిర్ణయం మేరకు ఈ ఇద్దరు ఈనెల 29న తుని పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తికి మధ్యవర్తిత్త్వం చేసుకొని అతనికి వాహనం, నగదు అందజేశారు. ఆ వ్యక్తి వీరు ఇచ్చిన వాహనంలో ఒక్కో ప్యాకెట్ రెండు కిలోల చొప్పున 198 కిలోల గంజాయిను 99 ప్యాకెట్లుగా తయారుచేసి వెంట తీసుకెళ్ళిన లోడ్చేసి వాహనాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అప్పగించారు. జిల్లా ఎస్పీకి అందిన సమాచారం మేరకు మార్టూరు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది బొల్లాపల్లి టోల్ప్లాజా వద్ద గంజాయి ఉన్న వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు కర్ణాటకకు చెందిన ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. -
టీటీడీపై టీడీపీది అసత్యప్రచారం
గుంటూరు రూరల్: గతంలో అధికారం కోసం, నేడు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తూ నగరంలోని అమరావతిరోడ్డు చిల్లిస్ సెంటర్లో ‘ఇది నెయ్యే కాదంటూ’ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. అంబటి మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతోనే తెలుగుదేశం నాయకులు ఇలా బరితెగించి విష ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు ఇలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలని, లేకపోతే మేమే ఆ ఫ్లెక్సీలు తొలగిస్తామని హెచ్చరించారు. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారం చేసి ఆంధ్ర రాష్ట్ర పరువు తీయటంతోపాటు భక్తుల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు అండ్కో వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మా పార్టీ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఏమార్చి.. ఎడాపెడా దోచి..
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జిల్లాలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 36 సీట్ల సీటింగ్ అనుమతులతో బస్సులు నమోదు చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్లుగా మార్చి నడుపుతున్నా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు కనీస చర్యలకు కూడా ఉపక్రమించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వలన ప్రయాణికుల భద్రత, ప్రభుత్వ ఆదాయం రెండూ ప్రమాదంలో పడుతున్నాయి. రవాణా శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 350 నుంచి 400 వరకు ప్రైవేట్ బస్సులు, వివిధ అంతర్జిల్లాల రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో 100కు పైగా స్లీపర్ బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. సీటింగ్ పర్మిట్లతోనే బస్సులు నడుపుతూ లోపల స్లీపర్ సేవలు అందిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి ఒకటి... వాహనం మరొకటి సీటింగ్ బస్సుగా నమోదు చేసిన వాహనంలో సీట్లు తొలగించడం, ఇనుప ఫ్రేమ్లతో స్లీపర్ బెర్త్లు అమర్చడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్లను మూసివేయడం, అదనపు ప్రయాణికులను ఎక్కించడం అన్నీ ఆర్టీఏ అనుమతి లేకుండా జరుగుతున్న మార్పులేనని తెలుస్తోంది. ఆర్టీఏ చట్టం ప్రకారం కంపెనీ నుంచి వచ్చిన ఏ బస్సుకు కనీసం హెవీ లైట్లు కూడా మార్చే అవకాశం లేదు. అయినా ప్రైవేట్ బస్సుల యజమానులు ఇవేమీ పట్టించుకోకపోవడం వెనుక అర్థం తెలియంది కాదు. చట్టం స్పష్టం .. అమలు శూన్యం మోటార్ వెహికల్ యాక్ట్ – 1988 సెక్షన్ 52 ప్రకారం అనుమతి లేకుండా వాహన నిర్మాణంలో మార్పులు నేరం. ఉల్లంఘనకు పర్మిట్ రద్దు లేక సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది. సెక్షన్ 56 ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ రద్దు చేసే అధికారం, సెక్షన్ 190(2) అక్రమ మార్పులకు జరిమానా, వాహన స్వాధీనం వంటివి ఉన్నప్పటీకీ ఆ చట్టాలన్నీ కేవలం వినడానికి పరిమితమైపోతున్నాయి. ప్రయాణికుల భద్రతకు ముప్పు సీటింగ్ బస్సుల చాసిస్పై స్లీపర్ నిర్మాణాలు చేయడం వల్ల వాహన బరువు సమతుల్యం ఉండదు. బ్రేక్, టైర్లపై అధిక ఒత్తిడి, ప్రమాద సమయంలో బెర్త్ల్లో ఇరుక్కునే పరిస్థితి, అగ్ని ప్రమాదమైతే బయటపడే మార్గాలు లేకపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని రవాణా నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పందించని అధికారులు... ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా ఆర్టీఏ అధికారిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా, ఏదైనా ఆరోపణలపై వివరణ కోరితే ‘నన్ను అడగద్దు ప్లీజ్’ అంటూ కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. -
జింకానా సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
గుంటూరు మెడికల్: అమెరికాలో న్యాయబద్ధంగా పన్ను చెల్లించి మాతృభూమిని మరువకుండా గుంటూరు జీజీహెచ్లో కానూరి–జింకానా ఎంసీహెచ్ భవన నిర్మాణం కోసం రూ.100 కోట్లు విరాళంగా అందజేసిన జింకానా సోదరులు చరిత్రలో నిలిచిపోతారని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఎంసీహెచ్ భవన ప్రారంభం అనంతరం మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జీజీహెచ్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం సాయం అందిస్తున్న జింకానా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీహెచ్ సెంటర్ను ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించారని కితాబునిచ్చారు. గత ప్రభుత్వంలో ఎంసీహెచ్ నిర్మాణం కోసం కేవలం రూ.6 కోట్లు ఇచ్చారన్నారు. పారిశ్రామికవేత్త, తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జీజీహెచ్లో ఆగిపోయిన భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. డెక్కన్ టుబాకో కంపెనీ వారు ట్రామా సెంటర్ కోసం రూ.10 కోట్లు అందించారని వెల్లడించారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రూ.80 లక్షలు ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణం కోసం అందించారన్నారు. తాను కూడా సీఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి గుంటూరు హాస్పిటల్ను అభివృద్ధి చేస్తున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. జింకానా ఆదర్శంగా ఉంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం జింకానా సభ్యులు చేస్తున్న సాయం, దాతృత్వం చాలా గొప్పదని కొనియాడారు. మాతృ సంస్థ పట్ల, సమాజం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల జింకానా సభ్యులకు ఉన్న చిత్తశుద్ధికి చేతులెత్తి నమస్కరించారు. అమెరికాలో ఉన్నప్పటికీ భారతదేశానికి గర్వకారణంగా జింకానా సభ్యులు ఉన్నారని, భావితరాలకు రోల్ మోడల్గా జింకానా వైద్యులు ఉన్నారని కొనియాడారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా 20 నెలల్లో అనేక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో ఓపీలు, ఐపీలు, సర్జరీలు, ప్రసవాలు పెరిగాయన్నారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ స్థానంలో యూనివర్సల్ హెల్త్ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ స్థానంలో యూనివర్సల్ హెల్త్ కార్యక్రమం తీసుకొస్తున్నా మని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల మందికి హెల్త్ ఇన్స్యూరెన్సు ఉంటుందన్నారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై వైఎస్సార్ సీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, పీపీపీకి, ప్రైవేటుకు వారికి తేడా తెలియడం లేదని అన్నారు. నీతి ఆయోగ్ పీపీపీని తెచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జింకానా ప్రతినిధులు సన్మానించా రు. జింకానా సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, చదలవాడ అరవింద్బాబు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, హెల్త్ సెక్రటరీ సౌరబ్ గౌర్, జింకానా ప్రెసిడెంట్ డాక్టర్ కోయ రామకోటేశ్వరరావు, ఎంసీహెచ్ బిల్డింగ్ కో ఆర్డినేటర్ డాక్టర్ బాబురెడ్డి సాగిరెడ్డి, జింకానా స్థానిక కో ఆర్డినేటర్లు డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, డాక్టర్ పి.వి.హనుమంతరావు, డాక్టర్ సూరత్ అమర్నాథ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రామన్ తదితరులు పాల్గొన్నారు. -
నేను బతికే ఉన్నానండీ..
తాడికొండ: నేను బతికే ఉన్నానని...చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆన్లైన్లో భూమి వివరాలు తొలగించిన వ్యక్తులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ వంగర హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి కోరారు. ఆయన శుక్రవారం తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21న సాక్షిలో ‘బతికుండగానే చంపేశారు’ పేరిట ప్రచురితమైన కథనానికి రాజధాని సాక్షిగా జరిగిన రెవెన్యూ మాయాజాలం వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న 80 సంవత్సరాల వృద్ధుడు హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాను మెయిల్స్ ద్వారా సీఎస్తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ, సీఐ ఇతర అధికారులను కూడా కలిసినట్లు తెలిపారు. తనకు సర్వే నెంబర్ 1051లో 1.70 ఎకరాలు, సర్వే నెంబర్ 1150లో 8.32 ఎకరాలు కలిపి మొత్తం 10.02 ఎకరాల భూమి ఉందన్నారు. పత్రికలలో వచ్చిన కథనాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో చూస్తే కానీ తమకు విషయం బయటపడలేదని అన్నారు. తనకు వారసులు లేరని, తాను ఎవరికీ వీలునామా రాయడంకానీ, బదిలీ చేయడం కానీ జరగలేదన్నారు. తప్పుడు పత్రాలతో తాను మరణించినట్లు చూపించి భూమి బదలాయింపు వెనుక ఉన్న వ్యక్తులెవరో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యాంబాబు నరసరావుపేట టౌన్ : జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 13వ అదనపు జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి కె.శ్యామ్బాబు తెలిపారు. మార్చి 14న నిర్వహించే అదాలత్ను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక న్యాయాధికారులతో కోర్టు హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, ఫైనాన్స్ రికవరీ కేసులు, చెక్కు బౌన్న్స్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువ మంది కక్షిదారులకు లబ్ధి చేకూర్చేలా చొరవ చూపాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా కాకుండా ఉభయ పక్షాల అంగీకారంతో వివాదాలను సామరస్యంగా ముగించుకోవడానికి ఈ లోక్ అదాలత్ ఒక చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు కె. మధుస్వామి, ఆశీర్వాదం పాల్, ఏ.సలోమి తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తెనాలిటౌన్: పట్టణ షరాఫ్బజార్లోని శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్కుమార్లు మాట్లాడుతూ ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి సువర్చలా హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ, తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవం దాచేపల్లి: లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక చాపలగడ్డ బజారులో జరిగిన అమ్మవారి కల్యాణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అభిషేకాలు చేసి అమ్మవారి గీతాలను మాలధారులు అలపించారు. అమ్మవారి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులు, మాలధారులకు అందించారు. కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సైదులు, గురుస్వామి బ్రహ్మయ్య, మౌలాలీ, గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు స్వామివారి తెప్పోత్సవం మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థనంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు స్వామివారి దేవస్థానం నుంచి బయలు దేరి సీతానగరం ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకుని, శ్రీ స్వామి వారి అమ్మవార్ల తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 36.8230 టీఎంసీలు. అమ్మవారికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):పొన్నెకల్లుకు చెందిన ఎనకొల్లు శివాజీ కుటుంబం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి నిత్యాన్నదానాని కి రూ.1,11,111 విరాళాన్ని అందజేశారునిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3200, గరిష్ట ధర రూ.3800, మోడల్ ధర రూ.3400 వరకు పలికింది. 7 -
మట్టి మాఫియాలో ఆధిపత్య పోరు
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో రాత్రి వేళ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సక్రమ తవ్వకాల మధ్య అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకొంటోంది. ఈ క్రమంలో మట్టి మాఫియా, లారీ యజమానుల మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఇళ్లలో ఉన్న మహిళలను కూడా బెదిరించేంత వరకు వెళ్లిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మల్కాపురానికి చెందిన ఓ యువకుడు ఈ మట్టి మాఫియాకు గతంలో డాన్గా వ్యవహరిస్తూ అక్రమ తవ్వకాలు నిర్వహించే సమయంలో ఒక లారీ నల్లమట్టి లోడ్ చేసేందుకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వసూలు చేశాడు. ముగ్గురు కలిసి... తాడేపల్లి మండల పరిధిలోని మహానాడుకు చెందిన ఓ రౌడీషీటర్ కొంతకాలం డబ్బులు ఇచ్చి అతని నుంచి మట్టి పోయించుకున్నాడు. తరువాత అతనికి డబ్బులు ఇవ్వడం ఏంటంటూ ఉండవల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు మిగిలిన లారీ యజమానులతో జతకట్టి అక్రమ రవాణాకు తెరలేపాడు. దీనికి వత్తాసుగా మహానాడుకు చెందిన టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్, చిర్రావూరుకు చెందిన జనసేన నాయకుడు ముందుకు వచ్చారు. వీరు మల్కాపురానికి చెందిన వ్యక్తితో పలుమార్లు గొడవపడ్డారు. గురువారం రాత్రి ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో మల్కాపురానికి చెందిన వ్యక్తి మంగళగిరి రూరల్ కృష్ణాయపాలెం నుంచి తుళ్లూరు వెళ్తుండగా మార్గం మధ్యలో కాపుకాసి దాడికి పాల్పడ్డారు. భయంతో ఆ యువకుడు వాహనంలో పరారయ్యాడు. అయినా వారు మల్కాపురంలో నివాసం ఉండే సదరు వ్యక్తి ఇంటికి రెండు కార్లలో వెళ్లారు. ఇంట్లో ఉన్న అతడి భార్యను బెదిరించి ఆ ప్రాంతంలో భయభ్రాంతులు సృష్టించారు. గతంలోనూ అరాచకం... మహానాడుకు చెందిన రౌడీషీటర్ గతంలో కూడా యర్రబాలెంకు చెందిన ఒక యువకుడ్ని గుండిమెడ, రామచంద్రాపురం మధ్య చితకబాది వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఈ సంఘటనపై కేసు కూడా నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ రౌడీషీటర్కు అధికార పార్టీలో కొంతమంది ఆశీస్సులు ఉండడంతో మరింత రెచ్చిపోతున్నాడు. జరిగిన దాడి సంఘటనపై మల్కాపురానికి చెందిన బాధితుడు పొన్నం సురేష్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో శ్రీ ఎలైట్ అనే కంపెనీలో తన లారీ తిప్పుతున్నానని చెప్పారు. రాత్రి 8 గంటల సమయంలో రాయపూడి కిరణ్, ఎలిశెట్టి రామకృష్ణ, రౌడీ షీటర్ పల్లెపు హరికృష్ణ తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను అక్రమ మట్టి తోలడం లేదని, కొంతమంది విలేకరులకు వీడియో ద్వారా సమాచారం ఇచ్చానని తెలిపారు. సురేష్ కూడా మట్టి మాఫియాకు నాయకత్వం వహిస్తున్నట్లు రాజధాని రైతులు తెలియజేశారు. కృష్ణాయపాలెంలో లారీ యజమానుల మధ్య రచ్చ పారిపోయిన ఓ యువకుడు మల్కాపురం వెళ్లి లారీ యజమాని భార్యకు బెదిరింపులు తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువకుడు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.3900, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 545.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 511 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరుతోంది.రాజకీయ సిఫార్సులతో.... పాఠశాలల వైపు కన్నెత్తి చూడని ఉపాధ్యాయులు సీనియార్టీకి పాతర 7 -
ముగిసిన అంతర కళాశాలల చదరంగం పోటీలు
విజేతలకు బహుమతులు పంపిణీ తాడికొండ: మోతడక చలపతి ఫార్మశీ కళాశాలలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఏఎన్యు అంతర కళాశాలల చదరంగం పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎన్యు యోగా కో–ఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు చదరంగం దోహదం చేస్తుందన్నారు. అనంతరం చలపతి విద్యా సంస్థల కార్యదర్శి వై సుజిత్తో కలిసి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు ధనలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్. వెంకటరావు, చలపతి ఫార్మశీ ప్రిన్సిపల్ డాక్టర్ నల్లాని వెంకట రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మధులత హెచ్చరించారు. ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్నిమాపక శాఖ నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు. మాట్లాడుతున్న ఆర్డీవో మధులత -
రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల విజేత వేటపాలెం
పిడుగురాళ్ల: మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి 70వ తిరునాళ్లను పురస్కరించుకొని గురువారం రెండు పళ్ల విభాగం ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఎడ్ల బలప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరిషాచౌదరి, శివకృష్ణ చౌదరికి చెందిన ఎడ్లు 3800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. మోర్జంపాడుకు చెందిన తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మొదటి బహుమతి అందించారు. మాచవరం మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గంటా రమ్యానాయుడుకు చెందిన ఎడ్లు 3593 అడుగులు లాగగా.. చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుట్ల గ్రామానికి చెందిన మౌలా త్రివేణి నాయుడుకి చెందిన ఎడ్లు 3305 అడుగులు దూరం లాగాయి. ఈ రెండీటికి కలిపి ద్వితీయ బహుమతిని కేటాయించారు. వీరికి రూ. 20 వేల నగదును నీలం శ్రీనివాసరావు, బడిగుంచ్చల వెంకట నర్సయ్య, కొరముట్ల వెంకట నర్సయ్య, కొలిశెట్టి శ్రీనివాసరావులు అందించారు. అలాగే చిలకలూరిపేట మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గుత్తా వెంకాయమ్మలకు చెందిన ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి మూడవ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. -
భీష్మ ఏకాదశి లక్ష తులసి దళార్చన
సత్తెనపల్లి: స్థానిక వడ్డవల్లి రామాలయం, వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 21వ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా మాతృమూర్తులు, లక్ష్మీనారాయణ సమాజం వారిచే విష్ణు సహస్రనామ పారాయణంతోపాటు లక్ష తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. శుక్రవారం విశేష నవ కలశ స్నపన (అభిషేకం) జరుగుతుందని, భక్తులు అభిషేక ద్రవ్యాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ల ఏర్పాట్లను రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన రవ్వవరం గ్రామ సమీపంలో కొండ గురునాథస్వామి తిరునాళ్ల జరగనుంది. దీనికి పల్నాడు జిల్లాతోపాటు ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. గత ఏడాది మూడు ప్రభలు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఎనిమిదికి పైగా ప్రభలు నిర్మిస్తున్నారు. వేముల, కమ్మవారిపాలెం, గాంధీనగర్, శేషవారిపాలెం తదితర గ్రామాల నుంచి ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. తిరునాళ్ల ముందు రోజు మెట్ల పూజలో మహిళలు పొంగళ్లు పొంగించుకుంటారు. సోమవారం ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభల నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అందుకూరి శేషా చలపతి, మేనక మీనాక్షి దంపతులు, వారి కుమార్తె ప్రీతి మానస, కుమారుడు భార్గవ రామశాస్త్రిలు రూ.3 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో గురువారం ఈవో నలబోతు మాధవీదేవిని కలిసి ఈ విరాళం అందించారు. రేపల్లె: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలోని 36 కేంద్రాలలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో టైపు రైటింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్ల ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు చెప్పారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల మంది వరకు హాజరవుతున్నట్లు చెప్పారు. రేపల్లె కేంద్రంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న పరీక్షలకు 45 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా షార్ట్ హ్యాండ్ పరీక్షలు ఈ నెల 30, 31 తేదీలలో ఏడు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. -
దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : కలియుగ దేవుడు వేంకటేశ్వరస్వామి లడ్డూ విషయంలో చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్ చేసిన రాజకీయాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవటం ధర్మం కాదన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యంత పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారని, ఆఖరికి సుప్రీం కోర్టు నియమించిన సిట్, లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదని తేల్చిచెప్పిందన్నారు. పవిత్రమైన ఆలయంలో.. చంద్రబాబు అపవిత్రమైన రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై ఆత్మ పరిశీలన చేసుకొని వేంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పలు అనుంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
డీఆర్ఓ షేఖ్ ఖాజావలి
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతుంది గుంటూరు వెస్ట్: జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశమందిరంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్వో మాట్లాడుతుతూ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్లో భాగంగా ఓటర్ల జాబితాలోని డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ను నెలరోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని వివరాలను అందించాలని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచించారు. ఓటరు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈఆర్వోలు, ఎఈఆర్వోలకు తెలిపారు. సమావేశంలో ఈఆర్వోలు డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు చల్లా ఓటులేసు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, ఏ ఈ ఆర్ వోలు పాల్గొన్నారు. -
సామాజిక స్పృహతో దంత వైద్యసేవలు అందించాలి
పెదకాకాని: క్రమశిక్షణ అధునాతన విద్యాబోధనలతో ఉత్తమ దంత వైద్యులను తీర్చి దిద్దుతున్న సిబార్ దంత విద్య, వైద్యం ప్రశంసనీయమని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దోబ్లే అన్నారు. గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులోని సిబార్ దంత వైద్య కళాశాలలో గురువారం సిల్వర్జూబ్లీ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ డెంటల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ అశోక్ దోబ్లే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సిబార్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ముక్కామల అప్పారావు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా భారత దంత వైద్య మండలి మెంబర్ డాక్టర్ పి.రేవతి, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ డాక్టర్ మురళీధర్ ముప్పరపు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ లింగమనేని సుబ్బారావు, డాక్టర్ సునీల్, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చివరిగా సిబార్ దంత వైద్య విద్యార్థులు ఫ్యాషన్ షోలు, సంగీతం, నృత్యాలతో అలరించారు. -
ఏఆర్ విధులే అత్యంత కీలకం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం నిర్వర్తించే విధులు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో జిల్లా ఏఆర్ వార్షిక మోబిలైజేషన్ (శిక్షణ) నిర్వహించారు. అనంతరం పోలీస్ కవాతు మైదానంలో పరేడ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీవీఐపీ, వీఐపీల నివాసాలు, ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ, వీఐపీల వద్ద వ్యక్తిగత భద్రత విధులు నిర్వర్తించే వారి ప్రవర్తన శైలి, విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. పర్యటనల వేళల్లో భద్రతా తనిఖీలపై అప్రమత్తత అవసరమని అన్నారు. క్రమశిక్షణతోపాటు శారీరక ధృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ రెండు వారాలపాటు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయిలో శాంతి, భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి, సురేష్, ఆర్ఎ్స్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ.రవికుమార్ అన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా గురువారం పోలీస్ కవాతు మైదానంలో బందోబస్త్ సిబ్బందికి జిల్లా ఏఎస్పీ బ్రీఫింగ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వీవీఐపీ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ మార్గాల్లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా చూడాలని చెప్పారు. పోలీస్ అధికార, సిబ్బంది అనుసరించాల్సిన బందోబస్త్పై వివరించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బీడీ బృందంతో తనిఖీలు చేయించాలని సూచించారు. తూర్పు డీఎస్పీ అజీజ్ మాట్లాడుతూ వీవీఐపీల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్య, ఎస్ఐ డి.రమేష్ పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యం సుకేష్
పెదకాకాని: తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం. తోడబుట్టిన వాడు పెయింటర్. ఉన్నత ఆశయం, పట్టుదల, నిరంతర కృషితో 43 రోజుల కిందట కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ట్రైనింగ్లో ఉండగానే ఈనెల 28న ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఉత్తీర్ణత డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం సాధించాడు. పెదకాకాని మండలం తంగెళ్లమూడికి చెందిన బద్దెపూడి సుకేష్. గ్రామంలోనే మొట్టమొదట గ్రూపు–2 ఉద్యోగం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. రెండు నెలల వ్యవధిలో రెండు ఉద్యోగాలు.. మండలంలోని తంగెళ్లమూడి గ్రామానికి చెందిన బద్దెపూడి మోషే, సునీత దంపతులకు ఇద్దరు సంతానం. మోషే వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా తల్లి సునీత స్థానిక నర్సరీలో కూలి పనులకు వెళుతుంది. వారిలో పెద్దవాడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. రెండవ సంతానం సుకేష్ బీఎస్సీ పూర్తి చేసి కాకినాడలో మూడేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. 2025 డిసెంబరు 16వ తేదీన కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ తీసుకుని 21వ తేదీన ట్రైనింగ్ నిమిత్తం తిరుపతి వెళ్లాడు. ఈనెల 28వ తేదీన విడుదలైన గ్రూపు–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వరించింది. తంగెళ్ళమూడి గ్రామంలోనే మొట్ట మొదటిసారిగా సుకేష్ గ్రూపు 2 ఉద్యోగం రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా సుకేష్ మాట్లాడుతూ ఈ విజయం తన తల్లిదండ్రులు, అన్నయ్య, మామయ్యలకు అంకితమన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్గా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. -
చేబ్రోలులో నకిలీ పోలీసు అరెస్ట్
విద్యార్థిని వద్ద బంగారు గొలుసు కాజేసిన నిందితుడు చేబ్రోలు: విద్యార్థినిని బెదిరించి బంగారు గొలుసును అపహరించుకుపోయిన నకిలీ పోలీసును చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసు స్టేషన్లో ఎస్ఐ పి. వీరనారాయణ గురువారం కేసు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్న కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన యువకుడు ఈ నెల 21వ తేదీన తన స్నేహితురాలితో కలిసి పొన్నూరులోని ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లారు. అనంతరం వడ్లమూడి గ్రామ సమీపంలోని చెరుకు రసం షాపు వద్ద ఆగి మాట్లాడుతున్న సమయంలో పోలీసునని చెప్పి ఓ వ్యక్తి బెదిరించాడు. సీఐ వద్దకు తీసుకువెళ్లాలని చెప్పటంతో వారు భయపడ్డారు. వడ్లమూడి అడ్డరోడ్డు నుంచి శలపాడు వెళ్లే దారిలోకి తీసుకువెళ్లి కేసును మాఫీ చేయాలంటే రూ.రెండు లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేవు అని చెప్పటంతో విద్యార్థిని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని మాయమయ్యాడు. నకిలీ పోలీసు అని గుర్తించి మరునాడు వారు చేబ్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా నిందితుడిని పెదనందిపాడు ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ బాషాగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు రూ.రెండు లక్షల విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. జులాయిగా తిరుగుతున్న రసూల్ బాషాపై ప్రకాశం జిల్లాలో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దు
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: బాల్య వివాహాలు ఆరోగ్యకరమైన సమాజానికి మంచివి కాదని, వాటిని ప్రోత్సహించవద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్రాఫ్ రూపొందించిన బాల్య వివాహాల విముక్తి రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా ప్రజలు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అధికారులకు సహకరించి, అవసరమైతే 1098, 112 టోల్ ఫ్రీ నంబర్లకు, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నెంబరు 100కు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. జీఎస్టీ వసూళ్లు సమర్థంగా నిర్వహించాలి జిల్లాలో జీఎస్టీ వసూలు సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం వాణిజ్య పన్నుల శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ సమర్థంగా వసూలు చేసేందుకు ప్రతినెలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖలలో పనుల టెండర్లలో జీఎస్టీలో నమోదైన సంస్థలు మాత్రమే పాల్గొనేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పనులు నిర్వహించిన సంస్థలకు బిల్లులు మంజూరు సమయంలో జీఎస్టీ చెల్లింపులను పరిశీలించాలన్నారు. ● అనంతరం వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు డివిజన్ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి జిల్లాలో జీఎస్టీకి సంబంధించి వివిధ శాఖలు అందించాల్సిన సమాచారం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘స్పర్శ’ లెప్రసీ పోస్టర్ ఆవిష్కరణ ‘స్పర్శ’ లెప్రసీ అవగాహన శిబిరం పోస్టర్ను గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ ‘వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం‘ అనే ఇతివృత్తంతో శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ‘ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు జిల్లాలో నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. -
రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువ కావాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరింతగా మెరుగుపరిచేలా తహసీల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్లో కలెక్టర్ మాట్లాడుతూ... దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఇటీవల అనేక ఆదేశాలు జారీ చేసిందన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న కొన్ని రకాల భూములు తొలగించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలోనే దరఖాస్తులు పరిష్కరించటానికి అవకాశం కల్పించారన్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు సక్రమంగా విచారణ ద్వారానే రెవెన్యూ సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. నూతనంగా రెవెన్యూ శాఖలో జారీ చేసిన ఆదేశాలపై అవగాహన కోసం రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయి నుంచి తహసీల్దార్లకు, మండల సర్వేయర్లకు, క్షేత్రస్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ అధికారులకు, గ్రామ సర్వేయర్లకు రెవెన్యూ వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సేవలు, దరఖాస్తులు సత్వరమే పరిష్కారం కోసం డివిజన్, మండల, గ్రామస్థాయి రెవెన్యూ సర్వే అధికారుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రతి నెల రెవెన్యూ వర్క్షాప్లలో శిక్షణ నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించే అంశాలను క్షేత్రస్థాయిలో విచారణను సత్వరమే పూర్తి చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరిష్కరించలేని అంశాలను పూర్తి వివరాలతో దరఖాస్తుదారులకు వివరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి మొదటిసారిగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విలేజ్ రెవెన్యూ అధికారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం లేదని, నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే చేపట్టాలన్నారు. సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులను మూడు నెలల్లో నూరు శాతం పరిష్కరించాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని రెవెన్యూ ఫైళ్లు ఈ–ఆఫీస్ ద్వారానే కచ్చితంగా పంపించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఏడీ సర్వేయర్ పవన్ కుమార్, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
లారీ ఢీకొని బాలుడు మృతి
దాచేపల్లి: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టటంతో గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రూవ్వ మహేష్(7) దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గోపి, నందిని దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు మహేష్ సంతానం. తెలంగాణలోని అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న గోపి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమార్తె, కుమారుడిని తల్లిదండ్రుల స్వగ్రామమైన దైదలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో నారాయణపురంలోని ఓ లాడ్జిలో పనిచేస్తూ నందిని దాచేపల్లిలో ఉంటోంది. మహేష్కి జ్వరం వస్తుండటంతో అమ్మమ్మ పురం భూలక్ష్మి దాచేపల్లిలో ఉంటున్న కుమార్తె వద్దకు తీసుకువచ్చింది. హస్పిటల్లో చికిత్స అనంతరం తల్లి, అమ్మమ్మలతో కలిసి లాడ్జి వద్దకు మహేష్ వచ్చాడు. ఈక్రమంలో తెలిసిన వ్యక్తి మహేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బస్టాండ్ సెంటర్ వద్దకు వచ్చాడు. మహేష్ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న నందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటివరకు తనతో ఉన్న కుమారుడు మృత్యువాతపడటంతో బోరున విలపించింది. మృతిచెందిన కుమారుడిని ఒడిలోకి తీసుకుని నందిని ఏడుస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. మహేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గురజాల వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
తుళ్లూరులో గ్రామసభ
తాడికొండ: మంగళవారం తుళ్లూరులో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర పట్టాణాభివృద్ధి, పురపాలక శాఖామంత్రి పి.నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన పెదపరిమి సమీపంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీ రాములు స్మృతివనంలో మొదటి శ్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి నిర్మాణంతో పాటు గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నామన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఇప్పటికే ల్యాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, రాజధానిలో రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న మరో 400 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి 16 నాటికి విగ్రహం ఏర్పాటు చేసేలా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందన్నారు. అమరావతిలో భూములు పొందిన ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా తమ పనులు వేగవంతం చేశాయని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు. పాల్గొన్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ -
కరుణామయురాలు తల్లి లూర్దుమాత
రెంటచింతల: కరుణామయురాలు తల్లి లూర్దుమాత అని దాచేపల్లి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా బుధవారం లూర్దుమాత మందిరంలో నిర్వహించిన నవదిన ప్రార్థనలలో సమష్టి దివ్యపూజాబలిని సమర్పించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. లూర్దు మాత దేవుని తల్లిగా కొనియాడబడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసిన వారు ఆ తల్లి ఆశీస్సులు తప్పకుండా పొందుతారన్నారు. కానుకమాత చర్చి సహాయక గురువులు రెవ. ఫాదర్ ప్రసన్నకుమార్, కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన వేడుకలు బుధవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులు రాజశ్యామల హోమం చేశారు. పూజాది కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: పట్టణానికి చెందిన విద్యార్థి జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపిక య్యాడు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ మహమ్మద్ నజీర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 30వ తేదీ నుంచి ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో పోటీలు జరుగనున్నాయి. పోటీలో పాల్గొనేందుకు నజీర్ బయలుదేరి వెళ్లాడు. గతంలో రెండుసార్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో నజీర్ పాల్గొన్నాడు. అండర్–14,అండర్–17 విభాగాలలో జాతీయ స్థాయిలో ఆడాడు. బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 పోటీలలో రాష్ట్ర జట్టుకు నజీర్ ప్రాతినిధ్యం వహించాడు. సౌర నమూనా గ్రామంగా అత్తలూరు అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్గా పల్నాడు కలెక్టర్ ఎంపిక చేసినందున బుధవారం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ఇంజినీర్ పి.రవి కిరణ్లు సోలార్ విద్యుత్ వల్ల ఉపయోగాలు, లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, సోలార్ విద్యుత్ ప్యానెల్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నేటి నుంచి బార్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో నోటిఫై చేసిన బార్ షాపుల్లో ఖాళీగా ఉన్న వాటి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం బుధవారం రీ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుంటూరు జిల్లాలో 42 బార్లకు, పల్నాడు జిల్లాలో 22 బార్లకు రీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 26, మున్సిపాలిటీల పరంగా మంగళగిరి 6, తెనాలి 9, పొన్నూరులో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడాదికి రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో రూ.55 లక్షల ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ, 5న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ పాఠశాలల్లో హిందీ పండిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో రెండు గ్రేడ్–2 హిందీ పండిట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్పేట 10వ లైనులోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీనివాసరావుపేటలోని శ్రీరవీంద్రనాద్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిపై మూడేళ్లు పని చేసేందుకు హిందీ పండిట్ శిక్షణతో పాటు టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లకు వ్యక్తిగతంగా, లేదా సీఎస్ఈ.ఏపీ.ఇన్/ఎయిడెడ్రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు జీవోఎంఎస్ 58 ప్రకారం ఏకీకృత జాబితాను డీఈఓ పోర్టల్లో ప్రచురించి, నియామక పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటల నుంచి అవబృధ స్నానం, చక్రతీర్థం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, ఋత్విక్ సమ్మానం, వేదాశీర్వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వాడరేవు తీరంలో మృతదేహం లభ్యం చీరాల: వాడరేవు సముద్రతీరంలో బుధవారం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడంతో వృద్ధుడి వివరాలు లభించాయి. మృతుడు గ్రంధి గణపతిరావు (70) రామకృష్ణాపురం పంచాయతీ కొత్తపాలెం వాసిగా గుర్తించారు. అయితే మృతుడు మంగళవారం సాయంత్రం 4గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిపారు. అనంతరం సముద్రతీరంలో శవమై కనిపించడంపై దర్యాప్తు చేపట్టారు. -
గుంటూరు
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 545.90 అడుగులకు చేరింది. ఇది 200.8378 టీఎంసీలకు సమానం.7జగ్గయ్యపేట: స్థానిక రంగుల మండపం నుంచి పెనుగంచిప్రోలుకు పయనమైన గోపయ్య సమేత తిరుపతమ్మ వారు, సహదేవతలు తిరుగు పయనమయ్యారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.0503 టీఎంసీలు. -
కిసాన్ సభ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయండి
లక్ష్మీపురం: అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి దేవి ప్రారంభిస్తారని తెలిపారు, అనంతరం వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ ఎంపీ మధు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రిటైర్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, ఆర్.వీర రాఘవయ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రజా కళాకారుడు వంగపండు దుష్యంత్ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే వేమన సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ -
లోకమంతా యోగావశిష్టమే..!
నగరంపాలెం: నేటి సమాజమంతా యోగావశిష్టంతో నిండిపోయిందని మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. పట్టాభిపురం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన యోగావశిష్టంపై బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం చేస్తూ.. రామునికి వశిష్ట మహర్షికి జరిగిన సంవాదమే యోగావశిష్టమని అన్నారు. రాముడికి కలిగిన నేను ఎవరనే సందేహనివృత్తికై వశిష్ట మహర్షి వద్దకు వెళ్లారని చెప్పారు. జీవి పుట్టగానే మాయతో నిండి ఉంటాడని, దాన్నుంచి బయటపడేదే యోగావశిష్టం అని పేర్కొన్నారు. మన మనోభావాలను బట్టే మన ఆలోచనా విధానం ఉంటుందన్నారు. జీవి ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ఎందుకు ప్రవేశించాలనీ రాముడు వశిష్టుని అడిగారని తెలిపారు. జన్మనెత్తడానికి దుఃఖానికి కారణం నేను అనేది వదలి పెట్టాలన్నారు. బంధాల వలన వినాశనం తప్పదన్నారు. దేశభక్తి లేనిదే దైవభక్తి లేదని తెలిపారు. ప్రతి హిందూ అన్నవాడు ఏదో రకమైన బొట్టు పెట్టుకోవాలని సూచించారు. ఒకనాడు విశ్వగురువుగా ఉన్న భారతదేశం కొన్ని కారణాల వల్ల విశ్వగురు స్థానాన్ని కోల్పోయిందని, దాన్ని మళ్లీ విశ్వ గురు స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు -
7 నుంచి కొండవీడు ఫెస్ట్
● తుది ప్రణాళిక ఖరారు ● కోటను సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే యడ్లపాడు: కొండవీడు కోట గొప్ప పర్యాటక కేంద్రంగా, అలాగే భావితరాలకు ఈ ప్రాంత చరిత్ర తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో కొండవీడు ఫెస్ట్ – 2026 నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి బుధవారం కొండవీడుకోటను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణపై శాఖలవారీగా చేపట్టాల్సిన విధులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు కొండపైనే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఆయా కార్యక్రమాలను వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సందర్శకులు తమ వాహనాలను కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపి, అక్కడి నుంచి ఘాట్రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన 10 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాలరీత్యా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కొండవీడు కోట పూర్వవైభవాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ‘కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రకటించారు. తొలిరోజు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొంటారన్నారు. ఉత్సవాల ముందు ఫిబ్రవరి 5న ప్రచార కార్యక్రమం, కొండవీడు చరిత్ర తెలిపే ప్రత్యేక గీతం ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు కొండపై పర్యాటకుల కోసం నైట్ క్యాంపెయిన్, భోజన వసతులు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. రూ.220 కోట్లతో చౌడవరం నుంచి కోటకు 5 కి.మీ. టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేలా చర్యలు, అలాగే కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు పురావస్తుశాఖ అనుమతులతో మరమ్మతులు చేపడతామని తెలిపారు. వీటితో పాటు జంతు ప్రదర్శనశాల, సఫారి రైడింగ్ ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వై.సీహెచ్.అశోకవాణి వాదనలు వినిపించారు. లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్లోని జంపని టవర్స్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: వివిధ మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్బాషాను డీఈఓ కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈఓ కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్డేట్ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్లు, బకాయిలు, మెడికల్ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.కేదార్నాధ్, కాలేషావలి ఉన్నారు. తాడికొండ: మోతడక చలపతిలో ఫిబ్రవరి 20–21 తేదీలలో ఉద్ఘోష్– 2026 పేరిట సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఈ మేరకు కళాశాలలో ఉద్ఘోష్ – 2026 బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ సంబరంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ అడ్మిషన్స్, ఆపరేషన్స్ డాక్టర్ కె.కిరణ్ కుమార్, డీన్లు డాక్టర్ పి.బాల మురళీకృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వీవీ సుబ్బారావు, కన్వీనర్లు డాక్టర్ పి.రత్నబాబు, జి.రామచంద్రరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.1406 టీఎంసీలు. ఎస్పీకి డైరీ అందజేత నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు మంగళవారం పోలీస్ అసోసియేషన్ డైరీ (2026)ని జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు.నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.3,800, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. 7 -
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
తెనాలిరూరల్: అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బస్టాండ్కు వెళ్లి పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రామలింగేశ్వరపేటలో నివాసం ఉంటున్న బండ్ల సాయి వంట పనులకు వెళుతుంటాడు. భార్య శిరీష(26) బ్యూటీ పార్లర్ నిర్వహించేది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో వీరు హైదరాబాదులో ఉన్నారు. భార్య ప్రవర్తన సరిలేదన్న కారణంగా తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కిందట తెనాలికి మకాం మార్చారు. సాయి స్థానికంగా ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. భార్య బ్యూటీ పార్లర్లో విధులకు వెళ్లేది. తెనాలి వచ్చినా ఆమె ప్రవర్తనలో మార్పు లేదన్న కారణంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో శిరీష గొంతు నులిమి చంపి బయటకు వెళ్లి పాత స్వరాజ్ టాకీస్ సెంటరులో తెలిసిన వ్యక్తిని ఫోన్ చేసుకోవాలని అడిగి తీసుకుని వెళ్లిపోయాడు. మార్గం మధ్యలో తన సోదరుడు కనబడగా బస్టాండ్ వద్ద దింపమని కోరాడు. శిరీష మృతి గురించి చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. పట్టణ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
భవతీ బిక్షాం దేహీ
అప్పుల్లో జెడ్పీ గుంటూరుఎడ్యుకేషన్:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ అప్పుల్లో కూరుకుపోతోంది. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పనులకు అనుమతులు ఇచ్చేస్తున్న కారణంగా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి అంగీకారం లే కుండా చైర్పర్సన్ ఏకపక్షంగా ఇస్తున్న అనుమతు లతో జెడ్పీ ఖజానా దివాళాకు చేరువైంది. జెడ్పీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాలు, సొంత అవసరాలకు వాడుకోవడంతో జెడ్పీ పరిస్థితి దారుణంగా మారుతోంది. బడ్జెట్ కేటాయింపులకు మించి మంజూరు చేస్తున్న కారణంగా బిల్లులు చెల్లించే సమయంలో నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం సొంతంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమవుతున్న జెడ్పీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. పాలకురాలి వ్యవహారశైలి కారణంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలను పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పాలకుల వైఖరి కారణంగా జెడ్పీని ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు పను లు చేయలేక, ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నా రు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండా ఆమోదానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ మండలాల్లో తమను సంప్రదించకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధ్యానం ఇస్తూ చైర్పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను అడ్డుకుంటున్నారు. నిధుల లభ్యత, పనుల కేటాయింపుల్లో పొంతన శూన్యం జెడ్పీలో నిధుల లభ్యత, కేటాయించిన పనులకు పొంతన ఉండటం లేదు. 15వ ఆర్థిక సంఘం సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి జెడ్పీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19.51 కోట్లు కేటాయించింది. అయితే సీపీడబ్ల్యూఎస్ టైడ్, అన్టైడ్ కింద రూ.34.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా వచ్చే నిధులకు, మంజూరు చేసిన పనులకు పొంతన లేకపోవడం జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8.84 కోట్లు కాగా, రూ.14.61 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో సంబంధిత పనులకు చెల్లింపులు జరపడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే జెడ్పీ సాధారణ నిధుల్లో సైతం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధుల లభ్యత కేవలం రూ.2.90 కోట్లుగా ఉండగా, రూ.11.27 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. జెడ్పీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మరింత ఆందోళనకరంగా ఉంది. జెడ్పీకి స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి న తరువాత కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతో పా టు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సై తం పనులు కేటాయించేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీటీసీలతో చర్చించకుండా చైర్పర్సన్ ముందస్తుగా అనుమతులు ఇచ్చేయడంతో జెడ్పీలో ఆర్థిక ప్రణాళిక దిగజారింది. -
హౌసింగ్ లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలోని హౌసింగ్ లేఅవుట్లలో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి హౌసింగ్ లేఅవుట్స్, పీఎంఎవై ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటుకు సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు అందించాలన్నారు. గతంలో వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి వినియోగించిన నిధుల వివరాలను అందించాలన్నారు. లే అవుట్స్ వారీగా లబ్ధిదారులకు కేటాయించినవి, కేటాయించిన వాటిలో నిర్మాణాలు ప్రారంభించినవి, పూర్తి అయినవి, కేటాయించకుండా ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలను మ్యాప్లతో సహా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆప్షన్–3లో నిర్మించిన ఇళ్లలో స్టేజ్, క్వాలిటీ డివియేషన్స్ను కాంట్రాక్టర్లతో వెంటనే సరిచేసేలా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో కె.శ్రీనివాసులు, తెనాలి కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు అధికారులు పాల్గొన్నారు. -
అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 30వ తేదీన తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షతన ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు భేటీ అయ్యారు. చినకాకానిలోని 71.57ఎకరాల అంజుమన్ భూములను కబ్జా చేసేందుకు చంద్రబాబు సర్కారు పావులు కదిపిన నేపథ్యంలో వాటిని రక్షించుకునే దిశగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మసీదుల వద్ద నిరసన కార్యక్రమాలు, సంతకాల సేకరణ జరుగుతున్న విషయం విదితమే. దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీన చేపట్టిన భారీ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సేకరించిన సంతకాలతో జిల్లా కలెక్టర్ను కలిసి, మైనార్టీల మనోభావాలను వెల్లడిస్తారు. ఈ సందర్భంగా జిల్లా నలమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ విభాగం నేతలు, ముస్లింలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, అనుబంధ విభాగాల నేతలు కీసరి సుబ్బలు, షరీఫుద్దీన్, లియాఖత్, సుభాని, షేక్ రబ్బాని పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవం
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా గ్రామ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యిందని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనందరావు మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులుగా పల్నాడు జిల్లా వీఆర్వోల సంఘ నాయకులు చారి, రామారావు వ్యవహరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, సెక్రటరీ వెంకట్రావు, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయప్రసాద్ (చంటి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ హాజరయ్యారన్నారు. జిల్లా నూతన కార్యవర్గం.. గుంటూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పిడుగు ఆనందరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా షేక్ అయూబ్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎం.కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, పి.మాల్యాద్రి, కె.నాగేశ్వరరావు, కె.గోపి, వి.లీల, జనరల్ సెక్రటరీలుగా టీసీహెచ్ రామారావు, టి.సుధాకర్ రావు, ఎస్.కోకిల రావు, పి.శ్రీనివాసరావు, కె.మల్లేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, నరేష్, బి.శిరీష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షేక్ మౌలాలి, కట్టా సత్యానందం, పులి భాస్కరరావు, బుస్సా వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, సీహెచ్ ప్రభాకర్, కె.శివజ్యోతి, ట్రెజరర్గా వి.రాజశేఖర్, స్పోర్డ్స్’ అండ్ కల్చరల్ సెక్రటరీగా టి.బోసుబాబు, ఈసీ మెంబర్లుగా ఎం.జగదీష్, సీహెచ్ బాబూరావు, పి.వీరయ్య, వి.సెబాస్టిన్, జె.తిరుపతి రాయుడు, జె.సంగీతరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కో–ఆర్డినేటర్గా బూసిరాజు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం జిల్లా కార్యవర్గం.. జిల్లా అధ్యక్షుడిగా మనోహర రాజన్, సహ అధ్యక్షుడిగా రవిబాబు, ఉపాధ్యక్షుడిగా మరియదాసు, సెక్రటరీగా నాగేశ్వరరావు, ట్రెజర్గా షేక్ కరిమున్నిసా, జాయింట్ సెక్రటరీగా యశోద ఎన్నికయ్యారని తెలిపారు. -
స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లాలోని బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధాన ఒప్పందం వెంటనే అమలు పరచాలని జీటీ రోడ్లోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ ఆఫీసు వద్ద మంగళవారం సమ్మె చేపట్టారు. పెద్ద ఎత్తున బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది హాజరై నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఐదు రోజుల పని డిమాండ్ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంకు యూనియన్ల నాయకులు మాట్లాడుతూ దాదాపు 2015 నుంచి అనేక రకాల పోరాటాల ఫలితంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఐదు రోజుల పని విధానం ఒప్పందం జరిగి రెండు సంవత్సరాలు అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి కావాలని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక సంస్థలు అయినటువంటి ఆర్బీఐ, నాబార్డు, ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ ఇప్పటికే ఐదు రోజుల పని విధానాన్ని పాటిస్తూ ఉన్నాయని తెలిపారు. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఒప్పందం అయినా కూడా అమలు జరగడం లేదన్నారు. బ్యాంకులలో సుమారు రెండు లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగి వారి వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన జీవితం మధ్య అసమతుల్యత ఏర్పడటంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బ్యాంకులు నాలుగు రోజులు మూతపడ్డాయని, అమలు చేయకపోతే భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. బ్యాంకులు సమ్మెబాట పట్టడంతో లావాదేవీలు పెద్ద ఎత్తున స్తంభించి పోయాయి. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు వై.నేతాజీ, మాల్యాద్రి, మేడా హనుమంతరావు, ఎల్ఐసీ నాయకుడు మస్తాన్ వలి, వివిధ బ్యాంక్ల ఉద్యోగ సంఘాల నాయకులు జయకుమార్, పి.కిషోర్కుమార్, సయ్యద్ భాషా, కోటిరెడ్డి, కళ్యాణ్, రామకృష్ణ, సాంబశివరావు, రవిచంద్రారెడ్డి, వీరారెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు. -
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
చిలకలూరిపేట: పట్టణంలోని పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి హనుమంత వాహన సేవ గ్రామోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అగ్నిధ్యానం, నిత్యహోమం, బలిహరణ, మహాశాంతి హోమం వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై 9వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హయగ్రీవ హోమం, హనుమద్వామన సేవ ఘనంగా జరిగాయని, స్వామి వారు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారని తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు అశ్వవాహన సేవ నిర్వహించామ ని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదా లు స్వీకరించారని వెంకటాచార్యులు తెలిపా రు. 2న బుద్ధునితో నా ప్రయాణం నాటిక ప్రదర్శన రేపల్లె:పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్న బుద్ధినితో నా ప్రయాణం, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ దృశ్య రూపకాన్ని ప్రతిఒక్కరూ తిలకించాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దారం సాంబశివరావు, ది ఆది ఆంధ్ర నవ బుద్ధిస్ట్ సొసైటీ కార్యదర్శి దోవా రమేష్ రాంజీలు కోరారు. వీటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. రేపల్లె ప్రాంతానికి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ సహకారంతో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ దృశ్య రూపకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడు ఆలూరి బిక్షాలు, నాయకులు బేతపూడి భాస్కరరావు, కూచిపూడి రవీంద్ర, కనపర్తి రవికిరణ్, బేతపూడి వెంకటేశ్వరరావు, రెబ్బా కోదండరాం, చెరుకూరి లక్ష్మణరావు, కర్రా బాబురావు, నలుకుర్తి శశి కుమార్, నీలా రాజ్ కుమార్, చందోలు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు తాడేపల్లి రూరల్: ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఓ కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు ప్రకటించడంతో తోటి కళాకారులు మంగళవారం అతడిని అభినందించారు. ఉండవల్లికి చెందిన దర్శకుడు గాదె నాగభూషణం రూపొందించిన జీవనధార లఘు చిత్రంలో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు లభించింది. ఈనెల 31వ తేదీన హైదరాబాద్లో ఈ అవార్డును అందుకోవాలని సూచిస్తూ లేఖ అందడంతో ఉండవల్లిలో కళాకారుల్లో నూతన ఉత్తేజం పెరిగింది. ఈ సందర్భంగా గాదె నాగభూషణం మాట్లాడుతూ త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జీవనధార అనే లఘు చిత్రాన్ని రూపొందించామని అందులో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని, రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలలో ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు. -
హామీల సాధన కోసం దశల వారీ పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) చేపట్టిన పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో పోరాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సీపీఎస్కు ప్రత్యామ్నాయంగా రోడ్మ్యాప్ ప్రకటించి, రూ.34 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. అందుకే దశల వారీ ఉద్యమానికి ఎస్టీయూ పిలుపు ఇచ్చిందన్నారు. ఈనెల 30న మండల స్థాయిలో తహసీల్దార్లకు మెమొరాండం సమర్పించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
దేవుని సహవాసమే శాంతి మార్గం
పెదకాకాని: దేవుని సహవాసమే శాంతి మార్గమని బైబిల్ మిషన్ అధ్యక్షుడు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యేల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాసుకు దేవుడు బయలపరిచిన 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జె. శామ్యేల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను ధార్మిక జీవన మార్గంలో ప్రోత్సహించాలన్నారు. మారు మనసే స్వస్థతకు మొదటి మెట్టు అని, ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత లభిస్తుందని బోధించారు. దేవుని చిత్తానుసారంగా ప్రయాణిస్తూ విధేయత, విశ్వాసం, సేవాభావంతో ముందుకు సాగితేనే క్రైస్తవ సమాజం బలంగా నిలబడుతుందని బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు అన్నారు. దైవ నిర్ణయం ప్రకారం ప్రతి విశ్వాసి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగితేనే జీవితం సార్థకం అవుతుందని రెవరెండ్ బి. ప్రసాద్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంగీత బృందం ప్రత్యేక గీతాలు ఆలపించింది. పెరిగిన భక్తుల తాకిడి బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని స్వస్తిశాలకు తరలి వెళ్లడంతో అక్కడ తాకిడి పెరిగింది. భక్తిశ్రద్ధలతో స్వస్తిశాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. మహోత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరు పెదకాకాని తోటకు వెళ్లడం, దేవునికి ప్రార్థించుట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. బైబిల్ మిషన్ మహోత్సవాలకు సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కర్ణాటక చెందిన ఐపీఎస్ అధికారిణి సంగీత, ఐఎఫ్ఎస్ అధికారిని రాధ, ఐఆర్ఎస్ అధికారి వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఆశీర్వాద వచనాలు అందజేశారు. మహోత్సవాలు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనున్నాయి. తెల్లవారుజామున ధ్యానం, ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు క్రైస్తవ కీర్తనల ఆలాపన, దైవ సందేశాలు, మహోత్సవాల కన్వీనర్ నివేదిక సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివసూర్యనారాయణ, జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ గూడూరి అశోక్కుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఐజీ మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో కార్యాలయపు మేనేజర్ హిమంత్రావు, సీఐ (ఎల్/ఓ) వినోద్కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి: తెనాలి రూరల్ మండలం నంది వెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల వెంకట నాగపవన్ కుమార్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అవార్డును అందుకున్నారు. నందివెలుగు గ్రామ అభివృద్ధికి చేసిన కృషికిగాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. పురస్కార స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న నాగపవన్కుమార్, సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలలో అవార్డు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతా నగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం హంసవాహన సేవ, పెరుమాళ్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం త్రిదండి చిన్నజీయర్స్వామి, అహోబిల రామానుజ జీయర్స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గరుడ వాహనంపై విజయ కీలాద్రి గిరి పరిక్రమణను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడుగురాళ్ల: మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహాస్వామి 70వ కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణను ఆలయ అధ్యక్షుడు హంసావత్తు రామునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామిని ఉగ్రనరసింహునిగా అలకరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందంచే పౌలు సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు ఈస్ట్, పశ్ఛిమ నియోజకవర్గాల పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మహనీయుల త్యాగ ఫలితం కారణంగానే స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, వంగల వలివీరారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, పఠాన్ సైదాఖాన్, పఠాన్ అబ్దుల్లాఖాన్, ఉడుముల పిచ్చిరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, ఓర్సు శ్రీనివాసరావు, యేటి కోటేశ్వరరావు యాదవ్, మురళి, షరీఫుద్దీన్, కీసరి సుబ్బలు, తోటకూర స్వర్ణలత, వేలూరి అనిల్రెడ్డి, సత్తెనపల్లి రమణి, వెంకాయమ్మ, వాసిమళ్ళ విజయ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, నగర, జిల్లా కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జెండా వందనం చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు


