చోద్యం చూస్తున్న పోలీసులు
సహజంగా ఎక్కడ గొడవలు జరిగినా, ఎటువంటి ప్రజా శాంతికి విఘాతం కలిగించే కార్యక్రమాలు జరుగుతున్నా వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవలకు పాల్పడే వారిని బెదిరించో, మాట్లాడో సమస్యను పరిష్కరించేందుకు చూస్తారు. గోరంట్లలో జరిగిన దాడి, విద్యానగర్లో మాజీ మంత్రి అంబటి ఇంటి వద్ద జరిగిన దాడిలో పోలీసులు అక్కడే ఉన్నా కనీసం విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయకపోవటం శోచనీయం. అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీ వారికి ఒక న్యాయమా? అని విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలను అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోవటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, అధికారులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారరని ప్రజలు మండిపడుతున్నారు.


