ప్రజాబలం | - | Sakshi
Sakshi News home page

ప్రజాబలం

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

ప్రజాబలం

ప్రజాబలం

వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతంపై వైఎస్సార్‌సీపీ నేతలు ● తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు తరువాత అంబటి నివాసంపై దాడి జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో తనపై దాడి జరిగితే చేతులు నరుకుతానని వ్యాఖ్యానించిన పెమ్మసాని, మరీ దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ● వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ టీడీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ● పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబుపై జరిగిన దాడి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతపై జరిగిందనే అంశాన్ని గుర్తించి, దానిని డైవర్ట్‌ చేసేందుకే మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంపై దాడి చేశారన్నారు. విడదల రజనిపై దాడి, అంబటి నివాసం ధ్వంసం, జోగి రమేష్‌ నివాసంలో పెట్రోల్‌ బాంబులు వేయటం చూస్తుంటే.. కచ్చితంగా చంద్రబాబు సర్కార్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అని ఆరోపించారు. సామాన్యుడి భధ్రతకు భరోసానిచ్చే రీతిలో వైఎస్‌ జగన్‌ పర్యటన సాగిందన్నారు. క్రమశిక్షణతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఎంతో హుందాగా నడుచుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌కు ఒక పక్క ఘన స్వాగతం పలుకుతూనే.. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు మండిపడ్డారన్నారు. అందుకే స్వచ్ఛందంగా కార్యకర్తలు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ జగన్‌ పర్యటనను దిగ్విజయం చేశారన్నారు. అంబటి కుటుంబానికి అండగా ఉంటామని స్వయంగా వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారని, రానున్న రోజుల్లో ఇంతకు ఇంత దీనికి బాధ్యులు న్యాయ, చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ఇది కదా..
వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతంపై వైఎస్సార్‌సీపీ నేతలు

పట్నంబజారు(గుంటూరుఈస్ట్‌): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం నగరంలోకి ప్రవేశించిన తరువాత 5 కిలోమీటర్లు..7 గంటలపాటు కొనసాగిందంటే ఆయనపై ఎంతటి ప్రజాభిమానం ఉన్నదో తెలుస్తుందని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై జరిపిన దమనకాండను మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. మహిళలు, చిన్నారులు ఉన్నారని అని కూడా చూడకుండా, ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా భయానక వాతావరణం సృష్టించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంబటి నివాసం వద్ద అంతటి ఘోరం జరుగుతుంటే.. ఎస్పీ, ఐజీ, డీజీపీలు ఫోన్‌లు కూడా ఎత్తకపోవటం దారుణమన్నారు. వైఎస్‌ జగన్‌ గుంటూరుకు వస్తుంటే ఆపేందుకు పోలీసులను ఉపయోగిచారని, అదే అంబటి నివాసం వద్ద ఆ పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రతి దారుణాన్ని డిజిటల్‌ బుక్‌లో నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు.

సమావేశంలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్‌, నేతలు షేక్‌ గులాంరసూల్‌, పానుగంటి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement