తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..! | - | Sakshi
Sakshi News home page

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

తలుపు

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!

● పరీక్షలు ఇరుకు గదుల్లో నిర్వహించడం, ఒకే గదిలో మూడు వరుసల్లో విద్యార్థులను కుర్చీలు వేసి కూర్చోబెట్టడంతో మాస్‌ కాపీకి అవకాశం ఏర్పడింది. ● విద్యార్థినులు ప్రశ్న పత్రాలు పూరించేందుకు బల్లలు లేకపోవడం, కేవలం టెంట్‌ హౌస్‌లో అద్దెకు తెచ్చిన ప్లాస్టిక్‌ కుర్చిల్లో కూర్చుని పరీక్షలు రాసేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ● పరీక్షలు ఏర్పాట్ల కోసం, విద్యార్థినులు చూసి రాతలు రాసినా పట్టించుకోకుండా వదిలేసేందుకు, ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేసేలా ప్రైవేటు పాఠశాలల నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● విద్యార్థినులు చీటీలు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నా వాటిని లాగి బయట పడేస్తున్నారు తప్ప, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. చూసిరాత చీటీలు ఎత్తివేసేందుకు కింది స్థాయి ఉద్యోగులను సైతం నియమించారు. ● పరీక్షల ఇన్విజిలేటర్లు సైతం కాంట్రాక్టు ఉద్యోగులను, నర్సింగ్‌ వృత్తితో సంబంధం లేని వారిని సైతం నియమించడం అనుమానాలకు తావిస్తుంది. పరీక్షల ఇన్విజిలేటర్లు సైతం చూసిరాత కాపీలను తీసివేయడం మినహా ఏమీ చేయకుండా మిన్నకుండి పోతున్నారు.

పరీక్ష గది తలుపులు మూసి ... తాళాలు వేసి

మాస్‌ కాపీకి ఊతమిచ్చేలా నర్సింగ్‌ పరీక్షల నిర్వాహాకులు నర్సింగ్‌ పాఠశాలలోకి ఎవరూ ప్రవేశించకుండా తలుపులకు తాళాలు వేసి నర్సింగ్‌ విద్యార్థినులతో పరీక్షలు రాయించడం పలు అనుమానాలకు తావునిచ్చింది. స్క్వాడ్‌ వస్తే తలుపులు తీయకుండా ముందస్తుగా సమాచారం చేరవేసి అనంతరం వారిని లోపలకు అనుమతించేలా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

నర్సింగ్‌ విద్యార్థినులు చూసిరాతకు పాల్పడుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి మీడియా తీసుకెళ్లడంతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ నర్సింగ్‌ పాఠశాలలో తనిఖీలు చేశారు.

విద్యార్థినులు మంచిగా పరీక్షలు రాసి ఉన్నత స్థితికి చేరుకోవాలని మాస్‌ కాపీకి పాల్పడి భవిష్యత్‌ను బలి చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.

జీఎన్‌ఎం పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న నర్సింగ్‌ విద్యార్థినులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లోని ప్రభుత్వ నర్సింగ్‌ పాఠశాలలో గురువారం జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు నర్సింగ్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించే తరగతి గదులు ప్రభుత్వ నర్సింగ్‌ పాఠశాలలో లేకపోవడంతో నర్సింగ్‌ విద్యార్థినులకు చూసి రాతకు అవకాశం కల్పించినట్లయింది.

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..! 1
1/2

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..! 2
2/2

తలుపులు మూసి...స్లిప్పులు తెరిచి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement