శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఫిబ్రవరి 20,21తేదీల్లో నిర్వహణ బ్రోచర్లు ఆవిష్కరించిన చైర్మన్ వైవీ ఆంజనేయులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు
గుండ్లపల్లి గ్రామంలో కార్డన్సెర్చ్ 41 బైక్లు, రెండు ఆటోలు, 10 కత్తులు, రెండు కొడవళ్లు, ఒక గొడ్డలి స్వాధీనం
గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వై.సీహెచ్.అశోకవాణి వాదనలు వినిపించారు.
లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్లోని జంపని టవర్స్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: వివిధ మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్బాషాను డీఈఓ కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈఓ కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్డేట్ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్లు, బకాయిలు, మెడికల్ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.కేదార్నాధ్, కాలేషావలి ఉన్నారు.
తాడికొండ: మోతడక చలపతిలో ఫిబ్రవరి 20–21 తేదీలలో ఉద్ఘోష్– 2026 పేరిట సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఈ మేరకు కళాశాలలో ఉద్ఘోష్ – 2026 బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ సంబరంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ అడ్మిషన్స్, ఆపరేషన్స్ డాక్టర్ కె.కిరణ్ కుమార్, డీన్లు డాక్టర్ పి.బాల మురళీకృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వీవీ సుబ్బారావు, కన్వీనర్లు డాక్టర్ పి.రత్నబాబు, జి.రామచంద్రరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు


