దళితులపై మారణకాండ ఆపాలి | - | Sakshi
Sakshi News home page

దళితులపై మారణకాండ ఆపాలి

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

దళితులపై మారణకాండ ఆపాలి

దళితులపై మారణకాండ ఆపాలి

గుంటూరు వెస్ట్‌: ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్‌ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్‌ ఏటుకూరి విజయ్‌ కుమార్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్‌ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్‌ ఖాజావలికి విజయ్‌ కుమార్‌, కారుమూరు బెర్నార్డ్‌ మాదిగ, ఎస్‌ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement