స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు
తాడేపల్లి రూరల్: కృష్ణానది కనకదుర్గ వారధిపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళగిరి వెళుతున్న మంగళగిరి డిపో బస్సు 38 మంది ప్రయాణికులతో వస్తోంది. ఈక్రమంలో కనకదుర్గ వారధి మధ్యలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక అద్దం పగలడంతో పాటు వెనుక సీట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అద్దాల ముక్కలు లోపల పడడంతో లారీ ఢీకొన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై ఆర్టీసీ డ్రైవర్ తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.


