మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం | Ys Jagan Expresses Condolences Over The Death Of Former Dgp Hj Dora | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

Mar 13 2026 5:46 PM | Updated on Mar 13 2026 7:05 PM

Ys Jagan Expresses Condolences Over The Death Of Former Dgp Hj Dora

సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్‌జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.

పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement