breaking news
death
-
మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. -
Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం
కెర్జర్స్: స్విట్జర్లాండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ స్విట్జర్లాండ్లోని కెర్జర్స్ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక ప్రయాణీకుల బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలని చేసిన దుశ్చర్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్విస్ రాజధాని బెర్న్కు 20 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ ప్రధాన వీధిలో మంగళవారం సాయంత్రం 6:25 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న 'పోస్ట్బస్' (PostBus) ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేస్తూ, బయటకు రావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు, హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది.ఈ ఘటనపై ఫ్రిబోర్గ్ కాంటోనల్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి దీనిని బహుశా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నాం’ అని అన్నారు. బస్సు లోపలే ఏదో జరిగి మంటలు చెలరేగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్రిమినల్ విచారణను ప్రారంభించారు. స్విట్జర్లాండ్లో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పెద్ద అగ్నిప్రమాదం. ఈ ఏడాది జనవరి 1వ తేదీన క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఒక బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు బస్సులో ఆరుగురు చనిపోవడం స్విస్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్విట్జర్లాండ్లో మరోసారి ఇంతటి భయంకర అగ్నిప్రమాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ❗️⚠️🇨🇭 - BREAKING: Tragic Incident in Kerzers, SwitzerlandA public PostBus caught fire Tuesday evening in the center of Kerzers, in Switzerland’s Fribourg canton, killing several people and injuring multiple others. The vehicle was completely destroyed in the blaze.Witnesses… pic.twitter.com/bURWbOgqcC— 🔥🗞The Informant (@theinformant_x) March 10, 2026 -
ఖమేనీ కుమారులు క్షేమం?.. తాజా ఫొటోలు వైరల్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ -
మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
కోజికోడ్: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ (89) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1980, 90వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్సభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఉన్నికృష్ణన్.. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచారని చెబుతుంటారు.జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.నాడు గల్ఫ్ యుద్ధ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.ఉన్నికృష్ణన్ ఆదర్శాలకు కట్టుబడి నడుచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వి.కె. కృష్ణమీనన్కు అత్యంత సన్నిహితుడిగా, ఒకానొక సమయంలో ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.1936 సెప్టెంబర్ 20న జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యాభ్యాసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. చెన్నైలోనే న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు. 1960వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి, 1962 నాటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుడిగా ఎదిగారు. ఒక జర్నలిస్టుగా, న్యాయవాదిగా, పార్లమెంటేరియన్గా పేరుగాంచిన ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా -
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
-
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మిం కుల దుర్మరణం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్ను పక్కకు జరిపేందుకు యత్నించారు.ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ శకం ముగిసింది
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు మూడున్నర దశాబ్దాలకుపైగా ఖమేనీ మాటే శాసనం. పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దాలుగా ఇరాన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహరి్నశలు శ్రమిస్తున్న అమెరికాను ఎన్నోసార్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా సాగిన ప్రస్థానం ఖమేనీది... పహ్లావీ శకం ముగిశాక... ఖమేనీ నగరం నుంచి వచ్చి మష్హాద్ సిటీలో స్థిరపడిన అజర్బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జని్మంచారు. ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. నాలుగో షియా ఇమామ్ అలీ అల్ సజ్జాద్కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యకాలంలోనే ఆయన ఖురాన్ను లోతుగా చదివారు. యుక్తవయసులోనే పర్షియన్లో కవితలు రాసేవారు. కచి్చతమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేననే పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకు పరుగెత్తారట! మొహమ్మద్ రెజా పహ్లావీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. ఆరుసార్లు అరెస్టయ్యారు. మూడేళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారంప్రార్థనల ఇమామ్గా ఎంపికయ్యారు. 1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిదీన్–ఇ–ఖల్ప్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బ తిని కుడిచేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లోఘనవిజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లాæ ఖొమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ ‘గ్రాండ్ అయతొల్లా’ హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్గా అవతరించారు. ఇరాక్తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టుసాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి, అది సూచించేవారే పార్లమెంట్ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోన్ని అన్ని వ్యవస్థలపైనా పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకునే అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవçస్థగా ఎదిగింది. పరోక్ష దళాల సృష్టికర్త పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్లో హెజ్»ొల్లా ఉగ్రసంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్లో హూతీ రెబల్స్కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.తిరుగుబాట్లతో తలనొప్పులు దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనకు పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచి మానహక్కులను కాలరాశారన్న అపవాదును ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతటా చర్చనీయంగా మారాయి. అణ్వ్రస్తాలను సామూహిక మానవహననాలుగా ఛీత్కరించే ఖమేనీ, లోలోపల మాత్రం అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాలా సాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్లో ఇజ్రాయెల్ ‘12 రోజుల యుద్ధం’ సందర్భంగా ఇరాన్ అణు స్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునియలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయెల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖేమేనీతో పాటు పలువురు సైనిక, పౌర అగ్ర నేతలను అంతం చేశాయి.ఖమేనీ మూలాలు భారత్లో! ఖమేనీ మూలాలు భారత్లోనే ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్తుడు సయ్యద్ అహ్మద్ మూసావీ 18వ శతాబ్ధాంలో ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ షియా మత బోధకుడిగా పేరుపొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ అహ్మద్ మూసావీ హిందీ అనే పేర్కొంటారు. 1830లో ఆయన ఇరాన్లోని నజబ్ నగరానికి వెళ్లిపోయారు. తరవాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాతముత్తాతల బంధువుల ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్లో ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లినట్టు చెబుతారు. నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికీ వందలాదిగా ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు
-
ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్
-
ఖమేనీ మృతితో కరాచీలో హై టెన్షన్.. US కాన్సులేట్ పై దాడి
-
ఖమేనీ మృతికి సంతాపం.. నల్లజెండా ఎగరవేసిన ఇరాన్
-
ఖమేనీ మరణంపై ఇరాన్ కేబినెట్ కీలక ప్రకటన
-
విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..1939లో మషద్లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.ఉక్కుపాదంతో అంతర్గత అణచివేతబాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటంఅమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యంఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ? -
ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ?
బెర్లిన్: ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖమేనీ మరణించారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో యుద్ధ భయంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశాన్ని వీడి వెళ్లారనే సమాచారం అందుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల అనంతరం ఖమేనీ మృతిచెందినట్లు ఆధారాలు ఉన్నాయని ప్రధాని నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఖమేనీ మరణించినట్లు ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ను వీడి విదేశాలకు వెళ్లారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెతన్యాహు అధికారిక విమానం ‘వింగ్ ఆఫ్ జియాన్’ (4X-ISR) ఇజ్రాయెల్ తీరంలో సుమారు నాలుగు గంటల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టిన అనంతరం గ్రీస్ మీదుగా జర్మనీకి వెళ్లినట్లు ఫ్లైట్ రాడార్ డేటా ద్వారా వెల్లడైంది. శనివారం నెవాటిమ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన ఈ బోయింగ్ 767-338ER విమానం, రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జర్మనీ రాజధాని బెర్లిన్లో ల్యాండ్ అయినట్లు సమాచారం. అయితే బెర్లిన్లో ప్రధాని నెతన్యాహుకు సంబంధించి ఎటువంటి అధికారిక పర్యటన ఖరారు కాకపోవడంతో ఆయన నిజంగానే ఆ విమానంలో ఉన్నారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది.అయితే నెతన్యాహు ఇజ్రాయెల్ నుండి పారిపోయి గ్రీస్ వెళ్లారని వస్తున్న ప్రచారాన్ని ‘గ్రోక్’ వంటి ఏఐ ప్లాట్ఫారమ్లు కొట్టిపారేశాయి. ఇరాన్పై జరిగిన దాడుల గురించి వివరిస్తూ, నెతన్యాహు ఇజ్రాయెల్ నుండే వీడియో సందేశాన్ని విడుదల చేశారని, ఆయన ఇక్కడే ఉన్నారని రాయిటర్స్, ఏపీ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాని ప్రస్తుతం ఇజ్రాయెల్లోనే ఉన్నారా లేక భద్రతా కారణాల దృష్ట్యా జర్మనీకి తరలివెళ్లారా అనే అంశంపై ప్రభుత్వం నుండి అధికారిక వివరణ రావాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్ -
గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి
గోటన్: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. తలన్పూర్కు చెందిన రాజేంద్ర బాపేడియా కుమార్తె దివ్య స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉదయం 7:48 గంటల సమయంలో పాఠశాల ప్రార్థన సమయానికి ఇంకా వ్యవధి ఉండటంతో, దివ్య మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది.ఈ క్రమంలోనే ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దివ్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దివ్య కుటుంబంలో ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గత సెప్టెంబర్ 9వ తేదీన దివ్య అన్నయ్య అభిషేక్ కూడా సరిగ్గా ఇదే రీతిలో మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అభిషేక్ ఇంట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. తమ ఇద్దరు బిడ్డలను ఒకే తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. -
మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
కోల్కతా: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో కోల్కతాలోని సాల్ట్ లేక్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు శుభ్రాంషు రాయ్ మీడియాకు తెలిపారు.గడచిన రెండు, మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముకుల్ రాయ్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్, యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో కేంద్ర షిప్పింగ్, రైల్వే శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ వెన్నంటి ఉండి టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 నుండి 2021 వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఆయన, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అనంతరం తిరిగి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీ గూటికి చేరారు. ఈ ఫిరాయింపు అంశంపై ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేశాయి. ముకుల్ రాయ్ మృతిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ఆయన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని, బీజేపీలో ఉన్న సమయంలో ఆయనకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. -
Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
ఖాట్మండు: నేపాల్లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. Nepal | At least 18 people lost their lives after a passenger bus plunged into a river in Dhading, Nepal. Recue operations are underway: Police— ANI (@ANI) February 23, 2026ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనతో ధాడింగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 18 Killed After Passenger Bus Plunges Into River in Nepal’s Dhading. pic.twitter.com/ykhZ2bRFNF— Sandeep Panwar (@tweet_sandeep) February 23, 2026 -
వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి
సాక్షి హైదరాబాద్: బండ్లగూడలో విషాదం జరిగింది. వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. దీంతో పాప తరపు బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో డాక్టర్ ఇంజెక్షన్ వేశారు. అయితే అది వికటించి ఆ పాప మృతి చెందింది.దీంతో డాక్టర్ల నిర్లక్షంతోనే పాప మృతి చెందిందని తీవ్ర ఆగ్రహానికి గురైన పాప తరపు బంధువులు అక్కడి వైద్యులపై దాడి చేశారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం!
భివాడీ: రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఖుష్ఖేరా, భివాడీ రీకో ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
కారు మీద కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా, అంటు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. సుమారు 1000 కిలోల బరువున్న హై మాస్ట్ లైటింగ్ స్తంభం ఒకటి కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ దుర్ఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంప్ వద్ద కార్మికులు హై మాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Disturbing video.Lal Bahadur Yadav was driving his car when a pole installed at a petrol pump suddenly collapsed onto his vehicle. He died on the spot.Just yesterday in , a portion of a metro pillar fell onto a busy road, crushing one person to death.How are such fatal… pic.twitter.com/tfv16OD7Ng— Satyendra Kumar Behera (@imskbehera) February 15, 2026ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ (47) తన కారులో నగరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషాద వార్త తెలియగానే పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లైటింగ్ స్తంభం ఏర్పాటు చేస్తున్న సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్గఢ్ ఎస్పీ దీపక్ భూకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇది కూడా చదవండి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ -
ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎనస్థీషియా పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి డాక్టర్ దీపిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆ రోజు రాత్రి వి«ధుల్లో ఉండకుండా ఇంటికెళ్లిన ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మకు విభాగాధిపతి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల నాలుగో తేదీ రాత్రి డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందడానికి ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్లో ఉంది. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మ ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలోనే ఇంటికెళ్లిపోయినట్లు విచారణలో నిర్ధారించారు.దీంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆమె ఇచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు డాక్టర్ సుష్మ ఇంటికెళ్లకుండా ఉండి ఉంటే, పీజీలు ఇద్దరూ ఒకే రూమ్లో ఉండేవారు. డాక్టర్ సుష్మ ఇంటికి వెళ్లడంతో సీనియర్ పీజీ అయిన డాక్టర్ దీపిక ఒక రూమ్లో ఉండగా, మొదటి సంవత్సరం పీజీ ఇంకో రూమ్లో ఉన్నారు. అర్ధరాత్రి 12.45 గంటలకు తనకు వాంతులు వచ్చేలా ఉన్నాయని దీపిక పక్క రూమ్లో ఉన్న జూనియర్ పీజీకి ఫోన్ చేయగా, ఆమె వచ్చి క్యాన్లా పెట్టి ఇంజక్షన్ చేసి.. కేసు తీసుకొచ్చేందుకు క్యాజువాలిటీకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీపిక ఆపరేషన్ టేబుల్పై పడి ఉంది. అంతర్గత కమిటీ విచారణలో ఏం తేలింది? డాక్టర్ దీపిక మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి కోదండరామిరెడ్డి రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా స్థాయి అధికారులను సైతం కలిశారు. ఆస్పత్రిలో ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ విచారణ జరిపింది. వీరు ఏం తేల్చారో ఇంకా వెల్లడవ్వలేదు. తాజాగా పోలీసులు పీజీ విద్యార్థులను పిలిచి అసలు ఆ రోజు ఏమి జరిగిందనే విషయంపై కూపీ లాగుతున్నారు.ఆ రోజు రాత్రి థియేటర్కు ఎవరైనా వచ్చారా..? వస్తే ఎందుకు వచ్చారు..? దీపికను ఎవరైనా వేధించారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే, అందుకు కారణాలేమిటనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్ను సమగ్రంగా పరిశీలిస్తే (స్నాప్ షాట్, ఇన్స్టా కాల్స్ సహా) క్లూ దొరికే అవకాశం ఉంటుందని కొందరు వైద్యులు, విద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజు ఆమెతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది స్టాఫ్ నర్సు, థియేటర్ అసిస్టెంట్లను కూడా విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందితే కొంత వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్లో మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు -
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రేమికుల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో యువతీ యువకుల జంట విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపల నుండి లాక్ చేసి ఉన్న కారులో బుల్లెట్ గాయాలతో ఉన్న ఇద్దరిని గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరించారు.ఈ ఘటనలో మృతిచెందిన వారిని నోయిడా సెక్టార్ 58కి చెందిన రేఖ (26), ఢిల్లీ త్రిలోక్పురికి చెందిన సుమిత్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వీరి సంబంధం గురించి ఇరు కుటుంబాలకు ముందే తెలుసని సమాచారం. అయితే, ఈ ఘటనకు ముందు రోజు నుండే వీరు ఎవరికీ కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ చేతిలో ఒక పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సుమిత్ తన ప్రియురాలు రేఖను కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా సుమిత్ పంపిన ఒక వాట్సాప్ సందేశం లభించింది. ‘నేను, సుమిత్.. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి రేఖే కారణం. ఆమె 15 ఏళ్లుగా నాతో ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతోంది. ఆమె నన్ను మోసం చేసినందునే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, సుమిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం తమను అవమానించిందని, తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వారు పోలీసులకు తెలిపారు. కారు దొరికిన ప్రాంతం రేఖ ఉండే గ్రామానికి అతి సమీపంలో ఉండటంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్ష కారణంగానే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్
భారత మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ ఖాసీం గుజ్జర్/ సల్మాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బైక్పై వెళుతున్న గుజ్జర్ను వెనుకనుంచి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశారు. అయితే మరణించిన వ్యక్తి ఆయన కాదా అని స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.2024లో భారత ఉగ్రవాద నియంత్రణ చట్టం (UAPA) కింద మహ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈయనకు నిషేదిత ఉగ్రసంస్థ LETతో సంబంధాలున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పీవోకేలో ఆయన టెర్రరస్టు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.భారత్ ప్రస్తుతం టెర్రరిస్టులను ఊక్కుపాదంతో అణిచివేస్తోంది. పాక్తో సరిహాద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ఆధునాతన కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పహల్గామ్ అటాక్ అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.BREAKING: India-wanted terrorist Mohammad Qasim Gujjar alias Salman/Suleman has reportedly been shot dead by unknown gunman in Peshawar, Pakistan. The Reasi (J&K) native was linked to LeT and based in PoK. After Op Sindoor ,he was tasked to set up a terror camp in KPK. (Sources) pic.twitter.com/IcfwhlXS25— Baba Banaras™ (@RealBababanaras) February 14, 2026 -
కెనడా పాఠశాలలో కాల్పుల మోత
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వినబడగానే వణికిపోయాం.. ‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్రూమ్ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్స్పీకర్లలో అనౌన్స్మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు. ‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు. పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది. -
ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ గేమ్ ఆడుతూ హైబీపీకి లోనై మృతిచెందాడు. ఖైర్నగర్ గూలర్ వాలి ప్రాంతానికి చెందిన కైఫ్ తన చెవులకు ఇయర్ఫోన్స్ పెట్టుకుని గేమ్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా గేమ్ ఆడుతున్న ఆ సమయంలో ఖైఫ్ రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా 300 దాటిపోవడంతో పరిస్థితి విషమించింది.వైద్య పరిభాషలో దీనిని ‘మైండ్ అటాక్’ లేదా తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ అని వైద్యులు చెబుతుంటారు. గేమ్ ఆడుతున్నప్పుడు కలిగిన తీవ్ర ఉద్వేగం లేదా ఒత్తిడి కారణంగా కైఫ్కు రక్తపోటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో మెదడులోని ఒక రక్తనాళం చిట్లిపోవడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్ చివరకు ప్రాణాలు విడిచాడు.మృతుడు కైఫ్ రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్ గేమ్లు ఆడేవాడని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. అతిగా గేమింగ్ ఆడటం వల్ల కలిగే మానసిక, శారీరక ఒత్తిడి ఖైఫ్ మరణానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై మీరట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మరణానికి దారితీసిన పరిస్థితులు, అతను ఆడుతున్న గేమ్, ఇతర సాంకేతిక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ గేమ్ల విషయంలో యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే.. -
ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు బాలికల తండ్రి చేతన్ కుమార్కు చెందిన పాత నేర చరిత్ర తెలియవచ్చింది. 2015లో చేతన్ కుమార్తో సహజీవనం చేసిన ఒక మహిళ, భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అది ఆత్మహత్యగా తేలడంతో ఆ కేసును మూసివేశారు.ప్రస్తుత ఘటన నేపథ్యంలో పాత కేసు వివరాలను పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్కు సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉండగా, వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లే కావడం గమనార్హం. మరణించిన బాలికలలో నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖీ (12) హీనా కుమార్తెలు. ఈ అసాధారణ కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితులు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.బాలికలు రాసిన ఆత్మహత్య లేఖలో కేవలం తండ్రి ప్రస్తావన మాత్రమే ఉందని, తల్లుల గురించి ఏమీ రాయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. బాలికల ఆత్మహత్యకు తండ్రి వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తొమ్మిది పేజీల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్, ఫోరెన్సిక్ బృందాలు.. ఆ చిన్నారులు వినియోగించిన ఫోన్లోని డిజిటల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధిత కుటుంబాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైందని పేర్కొంటూ, జిల్లా యంత్రాంగం, పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరారు. ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి
నీముచ్: మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా రణ్పూర్ గ్రామంలో ఒక అంగన్వాడీ వంట మనిషి చూపిన సాహసం చర్చనీయాంశంగా మారింది. మడవద పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సుమారు 20 మంది చిన్నారులు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా తేనెటీగల దండు వారిపై దాడి చేసింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ వెంటనే అప్రమత్తమై, తన ప్రాణాలను లెక్క చేయకుండా చిన్నారులను కాపాడేందుకు సాహసించింది. అక్కడున్న టార్పాలిన్ షీట్లు, చాపలను తీసుకుని, ప్రతి చిన్నారిపై కప్పి, వారిని గదిలోనికి తరలించింది.ఇంతలో కంచన్ బాయిపై వందలాది తేనెటీగలు దాడి చేశాయి. ఒళ్లంతా తేనెటీగలు కుడుతున్నా, పిల్లలందరినీ సురక్షితంగా గదిలోనికి తరలించే వరకూ ఆమె అక్కడి నుంచి కదలలేదు. తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన ఆమెను గ్రామస్తులు, పోలీసులు వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంపై ఉన్న లెక్కలేనన్ని తేనెటీగల కాట్లు ఆమె ప్రాణత్యాగానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.కంచన్ బాయి తన కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉండేవారు. ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జై మాతాదీ స్వయం సహాయక సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటూ, సామాజిక సేవలలోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అంగన్వాడీ కేంద్రం సమీపంలోని చెట్టుపై భారీ తేనెతుట్టె వేలాడుతున్నదని, వెంటనే దానిని తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి, చిన్నారులను కాపాడిన కంచన్ బాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.ఇది కూడా చదవండి: ఈ నయాగరాకు ఏమైంది? -
దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి
బెతుల్: మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్ష్.. ‘కోల్డ్రిఫ్’ (Coldrif) దగ్గు మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ సిరప్ తాగిన తర్వాత హర్ష్ కోమాలోకి వెళ్లగా, అప్పటి నుండి నాగ్పూర్ ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు వైద్యలు తెలిపారు. సోమవారం నాగ్పూర్లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు బెతుల్ జిల్లా వైద్యాధికారి మనోజ్ హుర్మాడే వెల్లడించారు.చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ కోల్డ్రిఫ్ సిరప్పై జరిగిన విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ప్రభుత్వ ఔషధ పరీక్షల ప్రయోగశాలలో నిర్వహించిన విశ్లేషణలో ఈ మందులో ‘డైథైలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, కాంచీపురానికి చెందిన ‘స్రేసన్ ఫార్మాస్యూటికల్స్’ తయారు చేసిన ఈ సిరప్లో ఏకంగా 48.8 శాతం మేర ఈ కల్తీ రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన పదార్థం.మధ్యప్రదేశ్లోని చింద్వారా, బెతుల్ జిల్లాల్లో ఈ కల్తీ దగ్గు మందు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సిరప్ తాగిన చిన్నారుల్లో వాంతులు, జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. హర్ష్ మరణంతో కలిపి ఈ తరహా ఘటనల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 24కు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు చిన్నారులు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సమగ్ర విచారణ చేపట్టింది. ఈ ప్రాణాంతక సిరప్ను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ వైద్యునితో పాటు, తయారీ సంస్థ యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ సంస్థలపై ప్రభుత్వం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు -
లాయర్ కుటుంబం: ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి!
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా, అందులో యువ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని మిహిర్గా పోలీసులు గుర్తించారు. కోల్కతాలో సీఏ పూర్తి చేసిన మిహిర్, ఇటీవలే రాంచీలోని తమ ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసుల కథనం ప్రకారం మిహిర్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొరుగువారితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు మృతి చెందాడు. మిహిర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే, అతని తల్లి స్నేహ అఖౌరీ, 14 ఏళ్ల చెల్లెలు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. స్నేహ అఖౌరీ జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారిద్దరినీ రాంచీలోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే ఇంట్లో కుమారుడు ఉరివేసుకోవడం, వెనువెంటనే తల్లి, కుమార్తె విషం సేవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు మిహిర్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని సమాచారం. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. వీరి కుటుంబంపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లు బయటకు కనిపించకపోవడంతో, ఈ ఆత్మహత్యాయత్నాల వెనుక ఉన్న కారణాలు అంతుచిక్కడం లేదు. పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించాయి. ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె స్పృహలోకి వస్తేనే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం -
8 రోజులు మృత్యువుతో పోరాడి..
లక్డీకాపూల్ (హైదరాబాద్)/నిజామాబాద్ అర్బన్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్ను మూశారు. నిజామాబాద్లో గంజాయి స్మగ్లింగ్ ముఠాను అడ్డుకునే క్రమంలో దుండగులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23)ను జనవరి 25న నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 9.41 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కాలేయం దెబ్బతినడం, మెదడులో వాపు కారణంగా ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితంలేకపోయింది. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకునే ప్రయత్నంలో.. జనవరి 23న గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఠా సభ్యులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. బాసటగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి ఆమెకు చికిత్స చేయించారు. ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెను పరామర్శించారు. సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన సౌమ్యది సామాన్య కుటుంబం. 2024 సంవత్సరంలో సౌమ్య ఉద్యోగంలో చేరింది. అంతలోనే ఆమె మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. -
సాధ్వి ప్రేమ్ బైసా మృతి వెనుక మిస్టరీ ఏంటి?
జైపూర్: పశ్చిమ రాజస్థాన్కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మరణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆర్ఎల్పీ (RLP) నేత హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. బుధవారం(జనవరి 28) సాయంత్రం జోధ్పూర్లోని బోరనాడ ఆశ్రమం నుంచి సాధ్వి ప్రేమ్ బైసాను ఆమె తండ్రి వీరమ్ నాథ్, మరొక సహాయకుడు కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.వైద్యుడు ప్రవీణ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్విని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమె శరీరంలో ఎటువంటి చలనం లేదని.. సాధ్వికి జ్వరం రావడంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్ను పిలిపించామని, ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె తండ్రి తనకు చెప్పినట్లు డాక్టర్ వెల్లడించారు. అయితే, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తాను అంబులెన్స్ ఇస్తానన్నా, నాథ్ నిరాకరించి తన సొంత కారులోనే ఆమెను తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు.ఆమె చాలా కాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతోందని వీరమ్ నాథ్ మీడియాతో చెప్పారు. అందుకే కాంపౌండర్ను పిలిపించాం. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆమె స్పృహ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కాంపౌండర్ను అదుపులోకి తీసుకుని, అతని వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంచలన రేపుతోంది. సాధ్వి మరణించిన నాలుగు గంటల తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి ఒక పోస్ట్ రావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ‘‘నేను ప్రతి క్షణం సనాతన ధర్మ ప్రచారం కోసం జీవించాను. నా జీవితాంతం జగద్గురు శంకరాచార్యులు, యోగా గురువులు, సాధు సంతుల ఆశీస్సులు అందుకున్నాను. అగ్ని పరీక్ష కోరుతూ నేను వారికి లేఖలు కూడా రాశాను. కానీ ప్రకృతి ఏం తలపెట్టిందో? నేను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్తున్నాను. నా జీవిత కాలంలో కాకపోయినా, నా మరణం తర్వాతైనా నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ అంటూ తన అనుచరులను ఉద్దేశించి అందులో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sadhvi prem baisa (@sadhvi_prembaisa)ఈ పోస్ట్ ఆమె మొబైల్ నుండే షేర్ అయినట్లు ఆమె తండ్రి ధృవీకరించారు. ఒక తోటి గురువు ఆ సందేశాన్ని పంపారని ఆయన చెబుతూ, తన కుమార్తె మరణంపై దర్యాప్తు జరగాలని కోరారు. గత ఏడాది ప్రేమ్ బైసా, ఆమె తండ్రి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక గదిలో ఆమె తన తండ్రిని హత్తుకుని ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఒక మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. అయితే, అది తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనురాగానికి నిదర్శనమని, ఆ బంధాన్ని కించపరచడానికే ఎవరో ఆ వీడియోను వైరల్ చేశారని సాధ్వి అప్పట్లో మండిపడ్డారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు కూడా.. -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్పై డంబెల్తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు! శరద్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.చివరి ట్వీట్ చెబుతోందిగా..అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది. आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026 -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లారీ ఫింక్తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.సమాజానికి ముప్పుఅయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మదావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
అరుదైన హృద్రోగంతో చిన్నారి మృతి.. ‘కవాసాకి’ లక్షణాలివే..
బ్రిస్టల్: బ్రిటన్లోని బ్రిస్టల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హడ్సన్ మార్టిన్ అనే రెండేళ్ల బాలుడు ‘కవాసాకి’ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో ఇటీవల మృతి చెందాడు. సాధారణ ఫ్లూ తరహా లక్షణాలతో ప్రారంభమయ్యే ఈ వ్యాధి చిన్నారుల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.పుట్టినరోజుకు ముందే..హడ్సన్కు ఏడు నెలల వయసులోనే ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బాధిత చిన్నారి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్పిరిన్ లాంటి మందులు వాడుతున్నప్పటికీ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న, మధ్య తరహా రక్త నాళాల గోడలలో ఆటంకం ఏర్పడి, గుండెకు రక్త సరఫరాలో లోపం ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. హడ్సన్ తన మూడవ పుట్టినరోజు జరుపుకునేందుకు కొద్ది రోజుల ముందే మృతి చెందాడు.సీపీఆర్ చేసినా..హడ్సన్ చాలా చురుకైన పిల్లవాడని, సంగీతం, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేవాడని అతడి తండ్రి డేమియన్ మార్టిన్ తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, పారామెడిక్స్ బృందం దాదాపు గంటసేపు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ నా బిడ్డ గుండె మళ్లీ కొట్టుకోలేదు’ అని తండ్రి రోదిస్తూ తెలిపారు.కవాసాకి వ్యాధి.. లక్షణాలు కవాసాకి వ్యాధి (ముకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్) ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను దెబ్బతీసి, ఎన్యురిజం (రక్తనాళాల ఉబ్బడం) వంటి సమస్యలకు దారితీస్తుంది. సుమారు 102.2 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఐదు రోజుల పాటు ఉండటం, శరీరంలో దద్దుర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, చేతులు, కాళ్ల వాపు, పెదవులు ఎర్రగా మారడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.నివారణ ఎలా?స్కార్లెట్ ఫీవర్ లేదా మీజిల్స్ వంటి ఇతర వ్యాధుల లక్షణాలు కూడా ఇలాగే ఉండటంతో, వైద్య పరీక్షల ద్వారానే దీనిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇదిఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదు. కవాసాకి వ్యాధికి పూర్తి స్థాయిలో నివారణ మందు లేనప్పటికీ, ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐబీఐజీ), ఆస్పిరిన్ మిశ్రమంతో చికిత్స అందించి, దీనిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారినపడిన చిన్నారులకు జీవితాంతం కార్డియాలజిస్ట్ పర్యవేక్షణ అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: హైకోర్టు తీర్పు.. ఉదయనిధికి భారీ షాక్ -
గ్యాంగ్స్టర్ అబూ సలేంకు షాక్.. రెండు రోజులే పెరోల్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వరుస పేలుళ్ల కేసు(1993)లో దోషిగా తేలిన గ్యాంగ్స్టర్ అబూ సలేంను అంతర్జాతీయ నేరస్థునిగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. తన సోదరుడి మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అబూ సలేం 14 రోజుల పెరోల్ కోరగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అతను అత్యంత ప్రమాదకర వ్యక్తి అని, కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే మంజూరు చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. అది కూడా పోలీసు బందోబస్తు మధ్యే సాధ్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువర్ దేశ్ముఖ్ బాంబే హైకోర్టుకు తెలిపారు.జైలు నిబంధనల ప్రకారం సలేంకు పోలీసు ఎస్కార్ట్తో కూడిన రెండు రోజుల పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు సుముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చును అబూ సలేం స్వయంగా భరించాలని షరతు విధించింది. దీనిపై సలేం తరపు న్యాయవాది ఫర్హానా షా స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు వెళ్లి రావడానికి రెండు రోజులు సరిపోవని వాదించారు. అతను గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అతను భారతీయ పౌరుడేనని పేర్కొంటూ, పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఫర్హానా షా కోర్టును కోరారు.ఈ వివాదంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అబూ సలేంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు, భద్రతాపరమైన ఆందోళనలను వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గతంలో తల్లి మరణించిన సమయంలో కూడా సలేంకు కొద్దిరోజుల పెరోల్ లభించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.అబూ సలేం సోదరుడు అబూ హకీం అన్సారీ 2025, నవంబర్లో మరణించారు. నాడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సలేం 14 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 20న జైలు అధికారులు దానిని తిరస్కరించారు. కోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో తన పిటిషన్ ఆలస్యమైందని సలేం డిసెంబర్ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. 2005లో అరెస్ట్ అయినప్పటి నుండి జైలులోనే ఉన్న తనకు, తన కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు హాజరయ్యే హక్కు ఉందని సలేం తన పిటిషన్లో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే.. -
అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూఎస్ఏలోని మిసిసిప్పిలోని ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురి మృత్యువాత పడ్డారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఒక చోట కాకుండా వేరు వేరు చోట్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అమెరికా వార్తా సంస్థలు డబ్యూటీవీఏ, ఎన్బీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #BreakingNews: Indiscriminate shooting in the US once again: 6 people, including a child, killed in Mississippi; suspect arrested.#USAShooting #Mississippi #GunViolence #MassShooting pic.twitter.com/0BxUhFqICn— UPDATE ADDA (@UpdateAdda24x7) January 11, 2026 కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్రంగా పెరిగాయి. 2026 ప్రారంభం నుంచే మిసిసిప్పి, టెక్సాస్, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి, పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.జనవరి 1, 2026 మిసిసిప్పి నైట్క్లబ్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు.జనవరి 1, 2026 – డల్లాస్, టెక్సాస్ల్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు.జనవరి 1, 2026 – హ్యూస్టన్, టెక్సాస్ల్లో కొత్త సంవత్సరం మొదటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో గన్ వైలెన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. దాంతో అమెరికాలో గన్ నియంత్రణపై చట్టసభల్లో మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. 2025లో అమెరికాలో హత్యలు, పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు కొంత తగ్గినా, గన్ వైలెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2026 మొదటి 10 రోజుల్లోనే 4 ప్రధాన కాల్పుల ఘటనలు నమోదు కావడం గమనార్హం. -
Indonesia: వరద బీభత్సం.. 14 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో గల సియావు ద్వీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదలు భీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, ఒక్కసారిగా తాకిన వరద ఉధృతికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానిక సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షం సియావు ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తులో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరద తాకిడికి రోడ్లు, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల నిర్వహణ ప్రతినిధి నూరియాదిన్ గుమెలెంగ్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 16 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. కాగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన బురద, శిథిలాల కారణంగా రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఎక్స్కవేటర్లను ఉపయోగించి, ఈ అడ్డంకులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. Flash floods kill 9 in Sitaro Islands, North Sulawesi, Indonesia https://t.co/9Si0okkL5y— The Watchers (@TheWatchers_) January 5, 2026విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ అందించిన సమాచారం ప్రకారం ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 444 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే కొన్ని నెలల పాటు ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలగనుంది. అలాగే మరిన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అక్కడి ప్రజలకు అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ ఉత్త బడుద్దాయి’.. నిగ్గు తేల్చిన గణిత శాస్త్రవేత్త -
గుండె ధైర్యం ఉంటేనే ఈ రోడ్డెక్కండి!
నిన్న గుండెలు జారిపోయే జర్నీ గురించి చూశాం కదా? ఇది అంతకుమించింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆ గుండె చాలా గట్టిదై ఉండాలి. ఎందుకంటే దీనిపై వెళ్తుంటే మండు వేసవిలోనూ వణుకు పుట్టడం ఖాయం. ఫొటోలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది కదూ? ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో చాలామంది మృత్యువాతపడ్డారు. అందుకే దీనిని డెత్ రోడ్డు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్ నుంచి నార్త్ యుంగాస్ వరకు 64 కిలోమీటర్ల మేర ఉంటుంది. 1930లలో చాకో యుద్ధ సమయంలో పరాగ్వే యుద్ధ ఖైదీలు దీనిని నిర్మించారు. రోడ్డులో చాలా భాగం కొండ అంచునే సాగుతుంది. పచ్చని చెట్లు.. దగ్గరగా పలకరించే మేఘాలు.. అందమైన జలపాతాలతో జర్నీ ఎంత బాగుంటుందో.. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు అంతే ఆందోళనకరంగా అనిపిస్తాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా.. కొన్నిచోట్ల 3 మీటర్ల వెడల్పు లోపే ఉంటుంది. ఓ పక్కన ఏకంగా 600 మీటర్ల లోతైన లోయలు శీతాకాలంలో కూడా అరికాళ్లలో చెమటలు పట్టిస్తాయి. లోయలోకి పడిపోకుండా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. 1990వ దశకం మధ్యకాలం వరకు ఈ రోడ్డులో ఏటా వంద మంది వరకు మరణించేవారు. అనంతరం ఆ సంఖ్య 200 నుంచి 300కి పెరిగింది. 1983 జూలైలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత దాదాపు 30 మంది సైక్లిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధన సవరించారు. బొలీవియాలో వాహనాలు రోడ్డుకు కుడివైపున నడుస్తాయి. కానీ ఈ రోడ్డులో వెళ్లేటప్పుడు డ్రైవర్లు లోయ అంచును స్పష్టంగా చూడటం కోసం ఎడమ వైపున ప్రయాణించాలని నిబంధన విధించారు. 2006లో సేఫ్టీ గ్రిల్స్, డ్రైనేజ్ సిస్టమ్తో కూడిన రెండు లైన్ల కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మృత్యురహదారి సాహస పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా మౌంటెన్ బైకింగ్కు ప్రసిద్ధ గమ్యస్థానమైంది. -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
2 వారాల్లో 3వ హత్య
ఢాకా: మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో హిందువు హత్యోదంతం తాజాగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు. అయితే ఉద్దేశపూర్వకంగా అతడిని హత్యచేయలేదని మియా చెప్పారు.‘‘పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ సరదాగా గన్ను బిశ్వాస్ వైపు గురిపెట్టా. వేలు పొరపాటున ట్రిగ్గర్కు తగిలి గన్ పేలింది. దీంతో బుల్లెట్ గాయంతో అతడు కూలబడితే వెంటనే భలూకా ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్పించాం’’అని మియా వివరించారు. అయితే విషయం తెల్సి పోలీసులు వెంటనే మియాను అరెస్ట్చేశారు. ఉద్దేశపూర్వకంగానే హత్యచేశాడని విపక్ష పార్టీలు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశాన్ని వీడాక బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు ఎక్కువయ్యాయి. దైవదూషణ ఆరోపణలపై డిసెంబర్ 18న ఫ్యాక్టరీ కార్మికుడైన హిందువు దీపూ చంద్రదాస్ను స్థానికులు కొట్టిచంపారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అమృత్ మొండల్ అనే మరో హిందువునూ చంపేశారు. -
కాటేసిన కలుషిత నీరు
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని భగీరథ్పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు. -
మహిళ హత్య.. నిందితునికి మరణశిక్ష
సాక్షి హైదరాబాద్: ఇటీవల భరత్నగర్ ప్రాంతంలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III స్పెషల్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు కరణ్ సింగ్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దానితో పాటు రూ. పదివేలు జరిమానా చెల్లించాలని తెలిపారు. ఈ నెల 18 వతేదీ భరత్గర్లోని ఫ్లై ఓవర్ సమీపంలోని ఏసీసీ గోదాం పక్కన ఉన్న పొదల్లో ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు వివరాలు అందించగా వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీదర్కు చెందిన కరణ్ సింగ్ను నిందితునిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు కరణ్ సింగ్ను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది. -
అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి
-
Mexico: ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో అనుసంధానించే ‘ఇంటర్ ఓషియానిక్’ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 98 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.నౌకాదళం అందించిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో రైలులో 9 మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు.. మొత్తం 250 మంది ఉన్నారు. ఓక్సాకా, వెరాక్రజ్ రాష్ట్రాల సరిహద్దులోని నిజాండా పట్టణం మీదుగా రైలు వెళుతున్నప్పుడు.. ఒక మలుపు వద్ద రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘ఇంటర్ ఓషియానిక్ రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. గాయపడిన 98 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’ అని ఆమె వెల్లడించారు.బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు నౌకాదళ కార్యదర్శిని, మానవ హక్కుల అధికారులను ఘటనా స్థలానికి పంపినట్లు క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఈ ఘటనపై ఓక్సాకా గవర్నర్ సలోమన్ జారా మాట్లాడుతూ.. పలు ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించరని తెలిపారు. కాగా గాయపడిన వారికి మటియాస్ రోమెరో, సలినా క్రజ్, జుచిటాన్, ఇక్స్టెపెక్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడోయ్ రామోస్ విచారణకు ఆదేశించారు. 2023లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ ఈ ఇంటర్ ఓషియానిక్ రైలును ప్రారంభించారు. ఇది పసిఫిక్ తీరంలోని సలినా క్రజ్ నుండి గల్ఫ్ తీరంలోని కోట్జాకోయాల్కోస్ వరకు సుమారు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’ -
నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి
-
అన్యాయం తట్టుకోలేక ఆగిన రైతు గుండె
-
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్సింగ్లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు. మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. -
ఉస్మాన్ హాదీ హత్య అందుకే..?
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్ని హత్య చేయించిందని ఆరోపించారు.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్పై పగ పెంచుకున్నాయి. ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్లోని షాబాద్లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
భార్య కోసం.. కన్నవారిని రంపంతో నరికి..
జౌన్పూర్: ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మతాంతర వివాహం చేసుకోగా, ఆ కోపంతో తల్లిదండ్రులు అతనిని, అతని భార్యను ఇంటిలోనికి రానివ్వలేదు. దీంతో ఆ కుమారుడు తల్లిదండ్రుల ప్రాణాలను తీయడమే కాకుండా, వారి మృతదేహాలను రంపంతో ముక్కలుగా నరికి నదిలో పారవేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగి శ్యామ్ బహదూర్ (62), అతని భార్య బబితా (60)లుగా పోలీసులు గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం నిందితుడు అంబేష్ ఐదేళ్ల క్రితం ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలో ఆ యువ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భార్యకు భరణం కింద రూ. 5 లక్షలు చెల్లించేందుకు అంబేష్ తన తండ్రిని డబ్బు అడగగా, అందుకు ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అంబేష్ బరువైన రుబ్బు రాయితో తల్లి తలపై కొట్టి చంపాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా అదే రీతిలో కొట్టి హతమార్చాడు.హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు అంబేష్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహాలను తరలించేందుకు పెద్ద సంచులు దొరక్కపోవడంతో, గ్యారేజీలో ఉన్న రంపంతో తల్లిదండ్రుల శరీరాలను ఆరు ముక్కలుగా నరికాడు. ఆపై వాటిని చిన్న సంచుల్లో నింపి, తన కారు డిక్కీలో వేసుకుని, సమీపంలోని నదిలో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, తన తల్లిదండ్రులు గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారని, వారిని వెతకడానికి తాను వెళ్తున్నానని సోదరికి ఫోన్ చేసి చెప్పి, తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.అయితే వారం రోజులుగా అంబేష్ ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంబేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన ఘోరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు నదిలో గాలింపు చేపట్టిన పోలీసులకు తండ్రి శరీరంలోని ఒక భాగం లభ్యమైంది. హత్యకు వాడిన రంపం, రుబ్బురాయిని స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన శరీర భాగాల కోసం గజ ఈతగాళ్ల చేత గాలిస్తున్నామని అదనపు ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: పాక్ మరో దుశ్చర్య.. 40 ఏళ్ల ఆఫ్ఘన్ శిబిరాల మూసివేత -
తీవ్ర విషాదం.. సర్పంచ్ అభ్యర్థి మృతి
సాక్షి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతను బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడని నిర్దారించడంతో, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు కు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,917 వార్డులకు బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. -
‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..
న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు -
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. సక్షమ్పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్ను చంపేసెయ్ అని హిమేశ్ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్ను చంపేశాక పోలీస్స్టేషన్కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
బతికే ఉన్నాడా? చెప్పండి! ఇమ్రాన్ఖాన్ కుమారుడి బిగ్ వార్నింగ్
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణం గురించి పుకార్లు, ఊహాగానాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. పాకిస్తాన్ జైల్లో హత్యకు గురయ్యారనే వార్త సంచలనం రేపుతోంది. అసలు ఇమ్రాన్ ఎందుకు హత్యకు గురయ్యాడు? అధికారిక ప్రకటన ఎందుకు రావడం లేదు? బతికే ఉన్నాడా? లేదా? అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి.పాకిస్తాన్ జైలు అధికారులు ఈ పుకార్లను తోసిపుచ్చినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిమ్ ఖాన్, తన తండ్రిని 'డెత్ సెల్'లో ఉంచారంటూ మండిపడ్డారు. ఈ 'అమానవీయ ఒంటరితనం' దారుణం అంటూ, తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అసలు బతికి ఉన్నాడా అనేది స్పష్టం చేయాలంటూ ఆయన కోరుతున్నారు. తన తండ్రి విడుదలను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి జైలు పాలై 845 రోజులు అయిందని, గత ఒకటిన్నర నెలలుగా, అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా అతన్ని డెత్ సెల్లో ఉంచారని కాసిం ఖాన్ ఆరోపించారు.గత ఆరు వారాలుగా, అతన్ని పూర్తిగా ఒంటరిగా ఉన్న డెత్ సెల్లో ఒంటరిగా ఉంచారు. స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అతని సోదరీమణులు ప్రతి సమావేశానికి హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. ఫోన్ కాల్స్ లేవు. ములాఖత్లు లేవు, అతని క్షేమం గురించి తెలియదు, తాను, తన సోదరుడు తండ్రిని ఏ విధంగానూ సంప్రదించలేకపోయామని కాసిం ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా సమాచారం నిషేధించడం ప్రోటోకాల్లోభాగం కాదని ఆరోపించారు. కావాలనే తన తండ్రి పరిస్థితిని దాచిపెట్టి, కుటుంబానికి ఆయన ఆచూకీ చెప్పకుండా వేధిస్తున్నారన్నారు.తండ్రి భద్రత సమాచారాన్ని దాచిపెట్టడం, అమానవీయ ఒంటరితనం పర్యవనాలను పాకిస్తాన్ ప్రభుత్వం, దాని మద్దతు దారులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పూర్తిగా చట్టపరమైన, నైతిక, అంతర్జాతీయ బాధ్యత వహించక తప్పదన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి చేశారు. తండ్రి బతికే ఉన్నారని ధృవీకరించాలని,రాజకీయ కారణాలతోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖానుమ్ కూడా తమ కుటుంబంతో సమావేశాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై జైలు ఎదుట పోరాటాన్ని కూడా చేపట్టారు.పాక్లో చీకటి రోజులొచ్చాయి: ఇమ్రాన్ సోదరిఅడియాలా జైలులో తన సోదరుడు చికిత్స పొందుతున్న తీరుపై ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏమైందీ, ఏమీ చెప్పడం లేదు, ఎవరినీ కలవనివ్వడం లేదని ఆరోపించారు. ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, తనను సంప్రదించడానికి వీలు లేకుండా చేశారన్నారు. పాకిస్తాన్లోగడ్డు రోజులొచ్చాయి. నిరంకుశుల గురించి చదువుకున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా పరిస్థితుల్లో జీవిస్తున్నాం అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను నోరీన్ నియాజీ "నియంత" అని విమర్శించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దేశ చరిత్రలోనే అత్యం ప్రజాకంటక పాలనగా అభివర్ణించారు. పాకిస్తాన్ తన చీకటి కాలంలో ఉంది. ప్రజలను అపహరించి చంపేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎరువుల కోసం రెండు రోజులు ఎదురుచూసి..
గుణ: గిరిజన మహిళా రైతు ఒకరు పంట పొలానికి అవసరమైన ఎరువుల కోసం దుకాణం వద్ద ఏకంగా రెండు రోజులపాటు క్యూలో ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలో క్యూలో ఉండగానే ఆమె ప్రాణాలు విడిచారు. ఈ దారుణం మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుషెపూర్ గ్రామానికి చెందిన భురియా బాయి (58) మంగళవారం ఉదయం నుంచి ఏకబిగిన లైన్లో ఉన్నారు. రాత్రంతా ఆమె అక్కడే ఉండిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, మధుమేహంతో బాధపడుతున్న భురియా బాయి బుధవారం రాత్రి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందజేస్తామని గుణ ఎంపీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా చెప్పారు. మహిళా రైతు మరణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. -
పెళ్లి మండపానికి సమీపంలో.. ట్రక్కు ఢీకొని వరుడు మృతి
బాగ్పత్: ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. కొద్దిసేపటిలో జరిగే వివాహానికి సిద్ధమవుతున్న వరుడు సుబోధ్ కుమార్ (25) అకాల మృత్యువు బారిన పడ్డాడు. అప్పటివరకూ ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లి వేదికపై విషాదం తాండవించింది. పిచోక్రా గ్రామానికి చెందిన సుబోధ్ కుమార్ బంధువులతో సహా ఆదివారం రాత్రి సరూర్పూర్ కలాన్ గ్రామానికి వాహనంలో బయలుదేరాడు.కొద్దిసేపటికి సుబోధ్కు అస్వస్థతగా అనిపించి, వాంతి చేసుకునేందుకు వాహనం నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబోధ్ రోడ్డు పక్కన వాంతులు చేసుకుంటున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అతన్ని ఢీకొని కొన్ని మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సుబోధ్ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సుబోధ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వరుడిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బినౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవర్ను గుర్తించేందుకు అధికారులు హైవేతో పాటు సమీప ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు -
సాయుధపోరుతో మొదలై.. ‘హిడ్మా’ జీవితం సాగిందిలా..
మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో హిడ్మా హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మడావి హిడ్మా పేరు వినిపించేది. ఆయనను పట్టుకోవడం చాలా కష్టమని, హిడ్మా ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాలు మారుస్తుంటారని చెబుతుంటారు. ఇంతకీ మడావి హిడ్మా మావోయిస్టుల ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు నడిపారు? ఇందుకోసం ఎటువంటి విధానాలను ఆశ్రయించారనే వివరాల్లోకి వెళితే..మూడంచెల భద్రతావ్యవస్థహిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉండేదని చెబుతారు. దగ్గరగా ఉండే టీమ్-Aలో 10 మంది సభ్యులు, మధ్యలో ఉండే టీమ్-Bలో 20 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటారు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడట. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందని చెబుతారు.ఏ భారీ దాడి జరిగినా..ఇటు సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలుఅటు హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఒంట బట్టించుకున్నారు. పదోతరగతి వరకే చదివినా.. ఇంగ్లిష్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలడు. ఇక మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. గెరిల్లా పోరులో హిడ్మాకు మెళకువలు నేర్పింది కూడా చలపతే. ఇలా ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లను ముందుండి నడిపారు. ఇప్పుడు హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమానికే పెద్ద దెబ్బపడినట్లయ్యింది.ఇది కూడా చదవండి: హిడ్మా స్కెచ్ వేస్తే.. మావోయిస్టుల మాస్టర్ మైండ్ హ(ఖ)తం -
మరో స్లీపర్ బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాన్పూర్: దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని అరౌలి ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఢిల్లీ నుండి బిహార్లోని సివాన్కు వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు అతివేగంగా సెంట్రల్ డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. పగిలిన గాజు ముక్కలు, చెల్లాచెదురుగా పడిన సామాను, గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమేననే ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. కాగా ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పారిపోయారు. ఈ విషయాన్ని అరౌలి పోలీసు ఇన్స్పెక్టర్ జనార్ధన్ సింగ్ యాదవ్ ధృవీకరించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు అంబులెన్స్లలో గాయపడిన వారిని బిల్హౌర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్లోని ఆసుపత్రులకు తరలించారు. డాక్టర్ సంజీవ్ దీక్షిత్, ఏసీపీ మంజయ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రులోని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య -
వంద గుంజీలు.. చిన్నారి మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ పరిధిలో గల వాసాయిలో జరిగిన ఒక ఘటన పలువురిలో ఆందోళనను నింపింది. పాఠశాలకు కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందనే నెపంతో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాజల్ గోండ్కు ఉపాధ్యాయుడు కఠినమైన శిక్ష విధించారు. భుజాలపై స్కూల్ బ్యాగు ఉంచుకుని, ఏకబిగిన వంద గుంజీలు తీయాలంటూ ఆదేశించాడు.పాఠశాల తరగతులు ముగిసి, ఇంటికి చేరుకున్న కాజల్ తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనమేరకు ఆ చిన్నారిని ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్ తల్లి షీలా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉపాధ్యాయులు విధించిన శిక్ష కారణంగా కాజల్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనలాగే మరికొందరు పిల్లలు కూడా 50 నుండి 100 గుంజీలు తీసినట్లు కాజల్ తెలిపింది. రెండుమూడు నిమిషాల ఆలస్యం అయిన కారణంగా టీచర్ తమ కూతురికి కఠిన శిక్ష విధించారని, అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు పెరిగాయని ఆ తల్లి కన్నీటితో మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.ఈ సంఘటనపై ముంబైలోని సర్ జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లో తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా (Accidental Death) కేసు నమోదైంది. తరువాత ఈ కేసు వాలివ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది. పాఠశాలలో విధించిన అమానుష శిక్ష కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జేజే ఆస్పత్రి వైద్యులు కాజల్ కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాజల్కు ఆస్తమా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అదనపు బరువున్న బ్యాగును మోస్తూ, అధిక సంఖ్యలో గుంజీలు తీసిన కారణంగా ఆమె అంతర్గత రక్తస్రావానికి గురైంది. అది ఆ చిన్నారి మరణానికి దారితీసింది. పాఠశాలల్లో పిల్లలపై కఠిన శిక్షలు విధించడానికి ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.ఇది కూడా చదవండి: పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి -
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి. -
ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం
లక్నో/ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నివాసి మొహ్సిన్ ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను ఢిల్లీలో ఈ-రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా మొహ్సిన్ ఢిల్లీలో భార్య సుల్తానా, ఇద్దరు పిల్లలతో పాటు ఉంటున్నాడు. కాగా మొహ్సిన్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి అధికారులు తరలించారు. అయితే అతని ఖననంపై కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.మోహ్సిన్ మృతదేహం మీరట్లోని అతని ఇంటికి చేరుకున్నదని తెలియగానే స్థానికులు అక్కడకు తరలివచ్చారు. ఒక్కసారిగా అక్కడ విషాద వాతావరణం ఏర్పడింది. మృతుని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో అతని భార్య సుల్తానా.. తన భర్త మృతదేహాన్ని మీరట్లో కాకుండా ఢిల్లీలో ఖననం చేయాలని అందరి ముందూ పట్టుబట్టింది. దీంతో మోహ్సిన్ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సుల్తానాను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా భర్త మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఢిల్లీకి తరలించింది.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘సయీద్ ఇంతకు తెగించారా?’.. షాక్లో తోటి ప్రొఫెసర్లు -
Delhi 10/11 Blast: యూపీ నుంచి వస్తువుల కొనుగోలుకు వచ్చి..
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాకు చెందిన 22 ఏళ్ల నౌమాన్ కూడా ఉన్నాడు. షామ్లీలోని జింఝానకు చెందిన నౌమాన్ తాను నిర్వహిస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం కోసం సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో అతనిని మృత్యువు కబళించింది.నౌమాన్ కుటుంబ సభ్యులకు ఈ వార్త తెలియగానే వారంతా కుంగిపోయారు. మంగళవారం ఉదయం వారు లోక్ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో నౌమాన్తో పాటు ఉన్న అతని బంధువు 21 ఏళ్ల అమన్ కూడా పేలుడులో గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం గౌరీ శంకర్ ఆలయం నుండి బైక్పై తిరిగి వస్తున్న 28 ఏళ్ల అంకుష్ శర్మ , 20 ఏళ్ల రాహుల్ కౌశిక్ సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అంకుష్ ముఖం, శరీరం 80 శాతం మేరకు తీవ్రంగా కాలిపోయింది.ఈ పేలుడులో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతటి బాధలోనూ అతను అంకుష్ను ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డాడు. ఆస్పత్రి వెలుపల బాధితుల కుటుంబాలు గుమిగూడి, తమవారి కోసం వెదుకుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన హ్యుందాయ్ కారు ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద పేలిపోయింది. దీంతో సమీపంలోని పలు వాహనాలు తునాతునకలయ్యాయి. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో.. -
స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
చింతకొమ్మదిన్నె: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది.అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యార్థిని మృతదేహాన్ని తరలించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచ్చినా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు.పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అందెశ్రీ మృతిపై లైవ్ లో భావోద్వేగానికి లోనైన సింగర్స్..
-
అందెశ్రీ మరణంపై వైద్యుల కామెంట్స్
-
‘వేధించారు.. బెదిరించారు’.. ‘జైపూర్’ తల్లిదండ్రులు
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో తొమ్మిదేళ్ల విద్యార్థిని పాఠశాల భవనంలోని నాల్గవ అంతస్తు నుండి దూకి, ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో కుమార్తె పోగొట్టుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం జైపూర్ చిన్నారి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూలులోని తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ చిన్నారి గతంలో తాను పాఠశాలకు వెళ్లనంటూ ఏడుస్తున్న ఆడియో రికార్డును ఆమె తల్లి మీడియాకు షేర్ చేశారు. ‘నేను స్కూలుకు వెళ్లాలనుకోవడం లేదు. నన్ను పంపించకండి ప్లీజ్’ అంటూ ఆ బాలిక వేడుకోవడం దానిలో వినిపిస్తోంది.బాలిక తల్లి శివాని మీనా మీడియాతో మాట్లాడుతూ ఆరోజు తాను ఆ ఆడియోను క్లాస్ టీచర్కు పంపించి, తమ కుమార్తెను ఇబ్బందిపెడుతున్న విషయం ఏమిటో తెలుసుకుంటారని అనుకున్నానని తెలిపారు. ఈ విషయమై క్లాస్ టీచర్తో పాటు కో ఆర్డినేటర్తో కూడా పలుమార్లు మాట్లాడానని, కానీ వారు తన మాటలను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలులో తమ కుమార్తె.. ఆట పట్టించడం, బెదిరించడం, లైంగిక వేధింపులు తదితర ఇబ్బందులను కొన్ని నెలలుగా ఎదుర్కొన్నదని శివాని మీనా ఆరోపించారు.కాగా గతంలో స్కూలులో జరిగిన పేరెంట్స్ మీటింగ్కు హాజరైన బాలిక తండ్రి నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. తన కుమార్తెతో పాటు మరో బాలుడిని పలువురు విద్యార్థులు ఆట పట్టించారని అన్నారు. దీనిని టీచర్లకు చెప్పినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే ‘ఇది కోయెడ్ స్కూల్.. మీ అమ్మాయి అబ్బాయిలతో సహా అందరితో మాట్లాడటం నేర్చుకోవాలి’అనిని టీచర్ తనతో వాదించారని తండ్రి వాపోయారు. కాగా ఆ బాలిక పాఠశాలలోని రెయిలింగ్ ఎక్కి దూకడానికి ముందు.. రెండుసార్లు తన టీచర్ వద్దకు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. అయితే ఆ చిన్నారి టీచర్తో ఏమి మాట్లాడిందో వెల్లడికాలేదు. కాగా పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు . ఈ కేసు గురించి డీసీపీ రాజర్షి రాజ్వర్మ మీడియాతో మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్లు తీసుకున్నామని, వారి ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్: ‘ఇకపై 10కి ఆఫీసు’ -
Afghanistan: 6.3 తీవ్రతతో భూకంపం.. ఏడుగురు మృతి
కాబూల్: ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్ ఎ షరీఫ్ సమీపంలో (నేడు) సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు మృతిచెందారని, 150 మంది గాయపడ్డారని, బాధితులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సమీమ్ జోయాండా ‘రాయిటర్స్’కు తెలిపారు. CCTV footage shows the moment a strong M6.3 earthquake struck Mazar-e-Sharif, Afghanistan, a short while ago. pic.twitter.com/NX0o04Ggi5— Weather Monitor (@WeatherMonitors) November 2, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం దాదాపు ఐదు లక్షల, 23 వేల జనాభా కలిగిన మజార్ ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ (17.4 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ‘రాయిటర్స్’ ఈ వీడియోలు, ఫొటోలను వెంటనే ధృవీకరించలేదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా జనం మరణించారని మానవతా సంస్థ ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్ -
Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి
మెక్సికో: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్లో జరిగిన పేలుడులో 23 మంది మృతిచెందగా, మరో 11 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. హెర్మోసిల్లోలోని వాల్డోస్ స్టోర్లో పేలుడు సంభవించింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డ్యూరాజో ఒక వీడియో సందేశంలో తాము చూసిన బాధితుల్లో చాలా మంది మైనర్లని తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు, బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర, భద్రత, ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో స్పందించి, పరిస్థితిని నియంత్రించి, ప్రాణాలను కాపాడారని తెలిపారు. కాగా మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మృతులకు సంతాపం తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను సోనోరా గవర్నర్ అల్ఫోన్సో డురాజోతో సంప్రదింపులు జరిపానని, సహాయక బృందాలను అప్రమత్తం చేయాలని కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్ను ఆదేశించానని తెలిపారు. Mis sentidas condolencias a las familias y seres queridos de las personas fallecidas en el incendio ocurrido en una tienda en el centro de Hermosillo.He estado en contacto con el gobernador de Sonora, Alfonso Durazo, para apoyar en lo que se necesite. Instruí a la secretaria de…— Claudia Sheinbaum Pardo (@Claudiashein) November 2, 2025సూపర్ మార్కెట్లో పేలుడు జరిగిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని అగ్నిమాపక విభాగం చీఫ్ తెలిపారు. రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ మాట్లాడుతూ విషపూరిత వాయువులను పీల్చడం వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని మీడియా నివేదికల్లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొన్నారు. పేలుడుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణం కాగవచ్చని మెక్సికన్ అధికారులు భావిస్తున్నారు. కాగా సోనోరాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగివుండవచ్చని పేర్కొంది. -
వాహనాల బీభత్సం.. 63 మంది దుర్మరణం
నైరోబి: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. తరువాత అవి మరో నాలుగు వాహనాలను బలంగా తాకాయి. ఈ దుర్ఘటనలో 63 మంది మరణించారు. ప్రమాదంలో లెక్కలేనంతమంది గాయపడ్డారు.కిర్యాండోంగో జిల్లాలోని కంపాలా-గులు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా రెండు బస్సులు ఓవర్టేకింగ్ చేస్తూ, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో ఆ బస్సుల డ్రైవర్లు ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో అవి ఒక ట్రక్, ల్యాండ్ క్రూయిజర్తో పాటు నాలుగు వాహనాలను నియంత్రణ కోల్పోయేలా చేయడంతో, అవి బోల్తా పడ్డాయని పోలీసులు తెలిపారు. తొలుత మృతుల సంఖ్యను 63గా ప్రకటించిన పోలీసులు ఆ సంఖ్యను 46గా సవరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని కిర్యాండోంగో ఆస్పత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి గాయాల తీవ్రత తదితర వివరాలను వారు అందించలేదు. బాధిత కుటుంబాలకు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసేవేని సంతాపాన్ని ప్రకటించారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.గత ఏప్రిల్లో పశ్చిమ ఉగాండాలో ఒక బస్సు అదుపు తప్పి, హైవేపై బోల్తా పడటంతో 10 మంది మరణించారు. అదేవిధంగా గత ఆగస్టులో ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 20 మంది మరణించారు. గత ఏడాది కంపాలా-గులు హైవేపై ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 26 మంది మృతిచెందారు. రెండేళ్ల క్రితం జనవరిలో కెన్యా-ఉగాండా సరిహద్దులో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, 49 మంది గాయపడ్డారు. -
Maharashtra: లోయలో పడిన పికప్ వ్యాన్.. ఎనిమిదిమంది దుర్మరణం
నందూర్బార్: మహారాష్ట్రలోని నందూర్బార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. Maharashtra: 8 dead after vehicle falls into a valley at Chandshaili GhatRead @ANI Story | https://t.co/QJOc5iOuif#Maharashtra #death #vehicle #valley #ChandshailiGhat pic.twitter.com/aWT4EHMtjB— ANI Digital (@ani_digital) October 18, 2025ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
Bihar Elections: ఆ ఐదుగురు ఓటరు లిస్టులో చనిపోయి.. బతికే ఉన్నామంటూ..
పట్నా: బీహార్లో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఇంతలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఒక గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్ల పేర్లు ‘జాబితా’లో చనిపోయినట్లు ప్రకటించారు. అయితే వారంతా బ్లాక్ డెవలప్మెంట్ అధికారి(బీడీవో)ని కలుసుకుని ‘సర్, మేము బతికే ఉన్నాం’ అని పేర్కొంటూ ఒక మెమోరాండం సమర్పించారు.బీహార్ ఎన్నికల మొదటి దశకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో, బంకా జిల్లాలోని ధోరైయా బ్లాక్లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమను చనిపోయినట్లు చూపడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే వీరంతా బీడీవో అరవింద్ కుమార్ను సంప్రదించి, తాము బతికే ఉన్నామంటూ ఒక మెమోరాండం సమర్పించారు. ముసాయిదా ఓటరు జాబితాలో మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్,నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర ప్రసాద్ల పేర్లు ఉన్నాయి.సామాజిక కార్యకర్త ఇంద్రదేవ్ మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదుగురు ఓటర్లు.. జాబితాలోని లోపం కారణంగా ఓటు హక్కును కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీడీఓ కుమార్ వీరి ఫిర్యాదుపై స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన పేర్కొన్నారు. దీనికిముందు చంపారన్లోని బాగహి పంచాయతీలోని డుమ్రి గ్రామంలో 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చనిపోయినట్లు చూపించారు. తరువాత దానిని సరిచేశారు. బీహార్లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ ఆరు, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. -
జయలలిత కేసు సీబీఐకి అప్పగించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై: జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా దివంగత సీఎం జే జయలలిత మృతి కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్లకు శుక్రవారం మెమొరాండం సమర్పించారు. ఇందులో 2016లో జయలలిత ఆస్పత్రిలో చేర్చడం, ఆమె మరణం గురించి ప్రస్తావిస్తూ, జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు.అరుముగస్వామి కమిషన్ విచారణ2016లో తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి జస్టిస్ ఎ. అరుముగస్వామి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ అనంతరం 2022 ఆగస్టు 27న నివేదిక సమర్పించింది. అనంతరం 2022,అక్టోబర్ 17న ప్రభుత్వం ఒక జీవోను జారీ చేస్తూ, కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.‘వీరందరినీ విచారించాలి’మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆస్పత్రిలో చికిత్స అందించడంలో తీవ్ర లోపాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. ఈ మేరకు వీకే శశికళ, డాక్టర్ కె.ఎస్. శివకుమార్, డాక్టర్ జె. రాధాకృష్ణన్ (అప్పటి ఆరోగ్య కార్యదర్శి), డాక్టర్ సి. విజయభాస్కర్ (అప్పటి ఆరోగ్య మంత్రి)లను విచారించాలని సూచించింది. అలాగే డాక్టర్ వై.వి.సి.రెడ్డి, డాక్టర్ బాబు అబ్రహాం, డాక్టర్ రామమోహనరావు (అప్పటి ముఖ్య కార్యదర్శి)ల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని సిఫారసు చేసింది. దీనికితోడు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డిని విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉందని కమిషన్ పేర్కొంది.‘క్రిమినల్ చర్యలు ప్రారంభం కాలేదు’రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి చట్టపరమైన లేదా క్రిమినల్ చర్యలు ప్రారంభం కాలేదని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ అరుముగస్వామి కమిషన్ సిఫారసుల ప్రకారం సీబీఐ వెంటనే దర్యాప్తు చేపట్టాలని, తమిళనాడు ప్రభుత్వం అవసరమైన పత్రాలను సీబీఐకి అందజేయాలని కోరారు. జయలలిత చనిపోయిన తరువాత 75 రోజుల పాటు హాస్పిటల్ లో జరిగిన అన్ని ఘటనల ఆధారంగా వివిధ అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ తరువాతనే అరుముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారని, జయలలిత మరణంపై ఉన్న అనుమానాలు ఇప్పటివరకు నివృత్తి కాలేదని, తగిన న్యాయం జరగలేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి, చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
దగ్గు సిరప్ వివాదం.. కాంచీపురం యూనిట్ మూసివేత
చెన్నై/కాంచీపురం: మధ్యప్రదేశ్లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో సిరప్ కోల్డ్రిఫ్ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్లో ఉన్న స్టాక్ను తొలగించాలని స్పష్టం చేసింది. సిరప్లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్ సిరప్ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. కోల్డ్రిఫ్లో ప్రమాదకర డై ఇథిలీన్ గ్లైకాల్ 48.6 శాతం కనిపించడంపై వివరణ ఇవ్వాలని కంపెనీకి రెండో సారి నోటీసు ఇచ్చామని మంత్రి మా సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటికే ఇదే విషయంలో ఈ నెల 3న మొదటి నోటీసు పంపించామన్నారు. కంపెనీ వివరణ ఎలా ఉన్నా చట్టపరమైన క్రిమినల్ చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని ఆ కంపెనీ పూర్తిస్థాయి మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.చెన్నైలో మధ్యప్రదేశ్ సిట్కోల్డ్రిఫ్ మరణాలపై దర్యాప్తునకు ఏర్పాటైన మధ్యప్రదేశ్ సిట్ బృందం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఫార్మా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించింది. అదేవిధంగా, కాంచీపురంలోని సీల్ వేసిన కంపెనీ యూనిట్ను పరిశీలించింది. అవసరమైన వివరాలను తెల్సుకుంది. -
జుబీన్ గార్గ్పై విషప్రయోగం
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామకాను మహంత.. గార్గ్కు విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పీటీఐకి అందిన అత్యంత కీలక పత్రం ప్రకారం.. గార్గ్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ జరిగిందని కూడా గోస్వామి పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. మహంత, అతని సంస్థ నిర్వహించిన 4వ ఈశాన్య భారతదేశ ఉత్సవంలో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ ఆగ్నేయాసియా దేశానికి వెళ్లారు. ‘గార్గ్ మునిగిపోతూ.. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న విపత్కర సమయంలో ’జబో దే, జబో దే’ (వదిలెయ్, వదిలెయ్) అని శర్మ అరిచాడని, గార్గ్ నిపుణుడైన ఈతగాడని, అతనే తనకీ, నిందితుడికీ ఈత నేర్పించాడు కాబట్టి మునిగిపోయే అవకాశం లేదని.. సాక్షి గోస్వామి స్పష్టం చేసినట్లు రిమాండ్ నోట్ పేర్కొంది. ‘శర్మ, మహంత.. జుబీన్కు విషం ఇచ్చారని, తమ కుట్రను దాచడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ వేదికను ఎంచుకున్నారని గోస్వామి ఆరోపించారు. -
మాజీ మంత్రి దామోదర్రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు.మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిగారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/5fqvyDE7Oa— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. -
పాక్ దళాల కాల్పుల్లో ఎనిమిది మంది నిరసనకారులు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్కోట్లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మృతిచెందారని ఎన్డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్లో షిప్పింగ్ కంటైనర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు. -
దుర్గా పూజలో విషాదం : మహిళ మృతి.. పోలీసుల నిర్లక్ష్యం?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అంతటా ప్రస్తుతం అత్యంత వేడుకగా దుర్గా పూజలు జరుగుతున్నాయి. అయితే కోల్కతాలోని ఒక దుర్గా పూజా మండపంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి పూజలు జరుగుతున్న ఒక మండపానికి వచ్చిన మహిళ అనారోగ్యానికి గురై, మృతిచెందింది. అయితే మృతురాలి కుటుంబీకులు ఈ ఘటనకు పోలీసుల నిరక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.‘ఏబీపీ ఆనంద’లోని వివరాల ప్రకారం కోల్కతాలోని ‘బెహలా నూతన్ దాల్’ దుర్గామాత పూజా మండపానికి వచ్చిన సంగీత రాణా అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాధితురాలికి వెంటనే సీపీఆర్ అందించారు. అయినా ఆమె పరిస్థితి విషమించడంతో విద్యాసాగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. అనంతరం అమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా సంగీత దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.మృతురాలి బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలికి ఆక్సిజన్ అందించాలని తాము పదేపదే అభ్యర్థించినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. అలాగే బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. అయితే ఈ వాదనను పోలీసులు ఖండించారు. ఇదిలావుండగా బీజేపీ నేత సజల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జనాన్ని అదుపుచేయడంలో, వారికి సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా డయల్ 100కు దుర్గా మండపాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు వస్తున్నాయని డీసీ సెంట్రల్ ఇందిరా ముఖర్జీ తెలిపారు. విపరీతమైన శబ్ధాల కారణంగా పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. -
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడం సముచితమని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసే ముందు, ఈ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ ఒక నివేదికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాలేనికి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతోపాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి గర్నెపూడి జయలక్ష్మి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనే అనుమానంతో జయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అసలు ఈ కేసును దర్యాప్తు చేయకుండా పక్కన పడేశారు. దీంతో చేసేదేమీ లేక జయలక్ష్మి 2017 జూలై 6వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మృతిపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణ సందర్భంగా శుక్రవారం నల్లపాడు పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కొన్ని వివరాలను లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రావణ సంధ్య 4వ ఫ్లోర్ నుంచి కింద పడే సమయంలో అక్కడ ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఇదే పోలీసులు మృతురాలి హాస్టల్లో ఉంటున్న సహచరులను విచారించగా, వారు శ్రావణ సంధ్య 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధమైన పోలీసు స్టేట్మెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్... పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని తేల్చారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసు శాఖ దారుణ దర్యాప్తునకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రావణ సంధ్య మృతి కేసులో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న జయలక్ష్మి తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలతో ఏకీభవించడం మినహా కోర్టుకు మరో అవకాశం లేకుండాపోయిందన్నారు. -
మరో ‘థార్’ ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ‘థార్’ కారు ప్రమాదాలు అందరికీ దడపుట్టిస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్లోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపు తప్పి, డివైడర్ను ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలంగా డివైడర్ను ఢీకొని..పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ‘థార్’లో ఏదో పని నిమిత్తమై ఉత్తరప్రదేశ్ నుండి గురుగ్రామ్కు వెళుతున్నారు. వేగంగా వెళుతున్న కారును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో అది బలంగా డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.బైక్ను ఢీకొన్న ‘థార్’మహీంద్రా థార్ కారుకు సంబంధించిన మరో ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత నెలలో ఢిల్లీలోని మోతీ నగర్లో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక బైకర్ మృతిచెందాడు. కారు- ట్రక్కు మధ్యలో బైక్ పూర్తిగా నలిగిపోయినట్లు దృశ్యాలు నాడు వైరల్ అయ్యాయి. ‘థార్’ విండ్షీల్డ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. థార్ డ్రైవర్ అమరీందర్ సింగ్ సోధి ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయాడు. పోలీసులు వాహనంలో రెండు మద్యం సీసాలను కనుగొన్నారు.రాష్ట్రపతి భవన్ సమీపంలో మరో ప్రమాదంమరో సంఘటనలో న్యూఢిల్లీలోని చాణక్యపురిలో వేగంగా వస్తున్న థార్ కారు ఢీకొనడంతో ఒక పాదచారి మృతి చెందాడు. ఈ ప్రమాదం రాష్ట్రపతి భవన్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దరిమిలా పాదచారి మృతదేహం నాలుగు గంటల పాటు రోడ్డుపైనే పడి ఉంది. నిందితుడు నిద్రమత్తులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, ఒక మహిళ మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసిన వెంటనే దానిని నడిపేందుకు చేసే ప్రయత్నంలో అది అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. -
మండవ వెంకట్రామయ్య మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మండవ వెంకటరామయ్య మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నూజివీడు సీడ్స్ను ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూ.. భారతదేశంలోని అతి పెద్ద హైబ్రీడ్ సీడ్ కంపెనీలలో ఒకటిగా రూపొందించేందుకు వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మండవ వెంకటరామయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వెంకటరామయ్య కుమారుడు ప్రభాకర్రావుతో ఫోన్లో మాట్లాడారు. హైబ్రీడ్ సీడ్స్ విషయంలో వెంకటరామయ్య చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరన్నారు. వెంకటరామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.నూజివీడు మండలంలోని తుక్కులూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ వెంకట్రామయ్య (94) సోమవారం ఉదయం 7.30 సమయంలో తన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మండవ ప్రభాకర్రావు నూజివీడు సీడ్స్ ఎండీగా ఉన్నారు. ప్రముఖులు తుక్కులూరు వచ్చి వెంకట్రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
Kerala: భార్యను హతమార్చి.. ఫేస్బుక్ లైవ్లో..
కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్బుక్ లైవ్లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన పునలూర్ సమీపంలోని కూతనాడిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్బుక్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.తరువాత ఐజాక్ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
pakistan: జనావాసాలపై వైమానిక దాడులు.. 24 మంది మృతి
ఖైబర్ పఖ్తుంఖ్వా: పాకిస్తాన్లో చోటుచేసుకున్న వైమానిక దాడులు అలజడులను సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన విధ్వంసకర వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వర్గాలు ధృవీకరించాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.ఖైబర్ జిల్లాలోని తిరాను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు నివాస ప్రాంతంలో బాంబులు వేసి, నిద్రపోతున్న వారిని పొట్టనపెట్టుకున్నాయి. దాడులలో గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు అధికసంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఈ బాంబు దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
Indore: జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్లో మద్యం మత్తులో ట్రక్కును నడిపిన డ్రైవర్ వాహనాన్ని జనాలపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు త్రీవంగా గాయపడ్డారు.ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాల్లలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం, రక్తమోడుతున్న స్థితిలో కొందరు కాపాడాలని అరుస్తుండటం స్థానికుల హృదయాలను కలచివేసింది. ప్రమాదంలో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయ రోడ్డులో శిక్షక్ నగర్లోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన ట్రక్కు జనసమూహాన్ని దూసుకుంటూ వెళ్లడంతో పాటు10 వాహనాలను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు.#WATCH | Indore, Madhya Pradesh: DCP Zone-1 Krishna Lalchandani says, "The driver was highly inebriated and lost control of the vehicle, which led to this accident. A bike also came under its grip and was dragged along. So far, two people have died. Nine people are injured,… https://t.co/rPBcsaVQUi pic.twitter.com/BqwlwNtBW3— ANI (@ANI) September 15, 2025‘డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతను మొదట రామచంద్ర నగర్ కూడలి వద్ద ఇద్దరు బైకర్లను ఢీకొని, వారి వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లి, ఆపై బడా గణపతి ప్రాంతం వైపు నిర్లక్ష్యంగా ట్రక్కును పోనిచ్చాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణ లాల్చందాని తెలిపారు. ఆ ట్రక్కు డ్రైవర్ను పట్టుకుని, మల్హర్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు. కాగా ప్రమాదం స్థలంలో పలు మృతదేహాలు పడివున్నయని, ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. స్థానికులు ప్రమాదబాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. ఆగ్రహంతో స్థానికులు వాహనాన్ని తగలబెట్టారనే వాదన వినిపిస్తోంది. అయితే ట్రక్కు ముందుగా ఒక మోటార్ సైకిల్ను ఢీకొన్నప్పుడు.. బైక్ ఇంధన ట్యాంక్ పేలి, మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, పారామెడిక్స్తో పాటు అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఘటన దరిమిలా రెండు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.‘ఇండోర్లో జరిగిన ట్రక్కు ప్రమాదం చాలా విషాదకరం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నాక, అదనపు ప్రధాన కార్యదర్శి (హోం)ని ఇండోర్కు వెళ్లాలని ఆదేశించాను. రాత్రి 11 గంటలకన్నా ముందుగానే నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.आज इंदौर में हुई ट्रक दुर्घटना दुखद है। इस घटना की विस्तृत जानकारी प्राप्त कर मैंने निरीक्षण हेतु अपर मुख्य सचिव गृह को इंदौर जाने के निर्देश दिए हैं। साथ ही, रात 11 बजे से पहले शहर में भारी वाहनों के प्रवेश के कारणों की प्रारंभिक तथ्यपरक जाँच कराने के भी निर्देश दिए हैं।…— Dr Mohan Yadav (@DrMohanYadav51) September 15, 2025 -
‘బీఎండబ్ల్యూ’తో రోడ్డుపై మహిళ హల్చల్.. ఆర్థిక శాఖ సీనియర్ అధికారి దుర్మరణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా నడిపిన ఓ మహిళ.. ప్రభుత్వ సీనియర్ అధికారి దుర్మరణానికి కారకురాలయ్యారు. ఈ దుర్ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ మృత్యువాత పడ్డారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న ఒక మహిళ.. బైక్ వస్తున్న నవ్తోజ్ సింగ్ దంపతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో సీనియర్ అధికారి నవ్తోజ్ సింగ్ మరణించగా, అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్ ఆదివారం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి తన బైక్పై భార్య సందీప్ కౌర్తో పాటు ఇంటికి తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నవ్తోజ్ సింగ్ వయసు 52 సంవత్సరాలు. ప్రమాదం అనంతరం వీరి కుమారుడు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన తల్లిదండ్రులను ఘటన జరిగిన ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని నులైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే తన తండ్రి చనిపోయారని తెలిపాడు. Finance Ministry Deputy Secretary dies after BMW hits his bike in Delhi.A Deputy Secretary in Finance Ministry died and his wife is seriously injured after a BMW hit his motorcycle on Delhi's Ring Road, police said.He was returning home from Bangla Sahib Gurudwara when he met… pic.twitter.com/Ml4gizQnr9— Nitesh Sharma (@nitesh1572) September 14, 2025తన తల్లిదండ్రుల బైక్ను ఢీకొన్న బీఎమ్డబ్ల్యూ కారు నడిపిన మహిళ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని, అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమె గురించిన సమాచారం వెల్లడించలేదని నవ్తోజ్ సింగ్ కుమారుడు తెలిపాడు. ప్రమాదానికి కారకురాలైన మహిళ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె కోసం నకిలీ మెడికో-లీగల్ సర్టిఫికేట్ను సిద్ధం చేసేందుకు ఆస్పత్రి యాజమాన్య సహాయం చేస్తోందని ఆయన ఆరోపించాడు.కాగా కారు నడిపి మహిళను గగన్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త పరీక్షిత్ పాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును, నవ్తోజ్ సింగ్ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద స్థలాన్ని క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సంఘటనా స్థలంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
విషాదం.. స్కూల్లో ఆడుతూ కుప్పకూలిన టెన్త్ విద్యార్థి
సాక్షి, హనుమకొండ జిల్లా: హనుమకొండ నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కిందపడి టెన్త్ విద్యార్థి జయంత్వర్ధన్(15) మృతి చెందాడు. రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం స్పోర్ట్స్ ఆడుతుండగా అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.కొట్టి చంపేశారని అనుమానం ఉందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో దారుణం..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న కారణంగా యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం ఉక్రెయిన్ మహిళ ఇరినా జరుత్స్కాను (23) అమెరికాకు శరణార్థిగా వచ్చారు. అయితే, ఆగస్టు 22న నార్త్ కరోలినాలోని షార్లెట్లో ఆమె రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.Look at this tragedy, Iryna Zarutska, a 23-year-old Ukrainian war refugee, brutally stabbed to death on a train in Charlotte, North Carolina. And by whom? Decarlos Brown Jr., a career criminal who’s spent his life bouncing in and out of jail like it’s a revolving door!Why on… pic.twitter.com/9CvcgzFKGb— Grim (@MadWokeNews) September 6, 2025ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్ బ్రౌన్ జూనియర్.. ఇరినాను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. అతడికి నేరచరిత్ర ఉన్నట్లు వివరించారు. -
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మరణమృదంగం
-
స్కూల్ బస్సు కింద నలిగి.. నల్లగొండ టౌన్లో విషాదం
సాక్షి, నల్గొండ: పట్టణంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సును రివర్స్ చేస్తుండగా.. డ్రైవర్ చిన్నారిని గమనించుకోలేదని తేలింది. మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. -
కమలమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కమలమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025 -
Pakistan: ర్యాలీలో బాంబు పేలుడు.. 14 మంది మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. బలూచిస్తాన్లోని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ పేలుడులో 14 మంది మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం బలూచ్ నేత సర్దార్ అత్తౌల్లా మెంగల్ నాల్గవ వర్ధంతి కార్యక్రమం ముగిసిన కొద్ది క్షణాలకే షావానీ స్టేడియం సమీపంలో పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ ఈ ఘటనను ధృవీకరించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీఎన్పీ చీఫ్ అక్తర్ మెంగల్, అతని కాన్వాయ్ లక్ష్యంగా దాడి జరిగింది. అయితే మెంగల్ దాడి నుంచి తప్పించుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడులో 13 మంది పార్టీ సభ్యులు మరణించారని బీఎన్పీ ప్రతినిధి సాజిద్ తరీన్ తెలిపారు. అక్తర్ మెంగల్ వాహనం అక్కడి నుంచి దాటిన క్షణంలో భారీ పేలుడు సంభవించిందని తరీన్ తెలిపారు. Thank you for your prayers and messages. Alhumdulillah I am safe, but deeply heartbroken at the loss of our workers. Around 15 have been martyred and many injured. They stood by me and gave their lives for our cause. Their sacrifice will never be forgotten. May Allah grant them…— Akhtar Mengal (@sakhtarmengal) September 2, 2025పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)వల్ల జరిగిందా లేదా ఆత్మాహుతి దాడా? అనేది ఇంకా నిర్ధారణకాలేదు. అక్తర్ మెంగల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. పార్టీ కార్యకర్తల మృతిపై విచారం వ్యక్తం చేశారు. అల్లా దయవల్ల తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫ్రాజ్ బుగ్టి ఈ దాడిని ఖండించారు. ఇది శాంతి శత్రువుల పిరికి చర్య అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. -
Sudan: కొండచరియలకు గ్రామం నేలమట్టం .. వెయ్యి మంది మృతి.. ఒక్కరే సజీవం
సూడాన్: ఆఫ్రికాలోని సూడాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆగస్టు 31న మర్రా పర్వతాలలోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడి వెయ్యిమంది మరణించగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైందని, వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఆర్మీ తెలిపింది. మృతదేహాల వెలికితీతలో సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవతా సంస్థలకు సూడాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న పౌర సంఘర్షణ నుండి తప్పించుకుని పలువురు మర్రా పర్వత గ్రామంలో ఆశ్రయం పొందారు. ఇప్పుడు ప్రకృతి పవిపత్తు వారినందరినీ బలితీసుకుంది. Sudan 🇸🇩 💔At least 1,000 were killed in a landslide that destroyed a village in the Marra Mountains area of western Sudan, leaving only one survivor.pic.twitter.com/vQ9yTfOAZL #PrayForSudan #Sudan #Landslide The landslide struck on August 31 after days of heavy rainfall, the…— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 2, 2025 -
Reasi Cloudburst: కొండచరియలు పడి ఇల్లు ధ్వంసం.. ఏడుగురు మృతి
రియాసి: జమ్ముకశ్మీర్లోని రియాసి పరిధిలోని మహోర్ ప్రాంతంలోగల బద్దర్ గ్రామంలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. క్లౌడ్ బరస్ట్ అనంతరం వారి మట్టి ఇల్లు కొండ చరియల కింద శిధిలమయ్యింది.ఈ ఘటన గురించి మహోర్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఖుర్షీద్ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆ కుటుంబంలోని వారంతా నిద్రలో ఉన్నారని, ఇల్లు కూలడంతో వారు శిథిలాల కింద సమాధి అయ్యారని తెలిపారు. స్థానికులు అప్రమత్తమై, సహాయక చర్యలు చేపట్టి ఏడు మృతదేహాలను వెలికితీశారు. #KNSUPDATE || Anguished by the cloudburst & rain-triggered landslides in Reasi & Ramban. Condolences to the bereaved families. Spoke to Senior Officials and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the… pic.twitter.com/jZJr9nCTj9— KNS (@KNSKashmir) August 30, 2025మృతులను నజీర్ అహ్మద్, వజీరా బేగం, బిలాల్ అహ్మద్, మహ్మద్ ముస్తఫా, మహ్మద్ ఆదిల్, మహ్మద్ ముబారక్, మహ్మద్ వసీమ్గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు రంబన్ జిల్లాలోని రాజ్గడ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులలో ముగ్గురు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
United States: స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది.మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్లోని ఒక క్యాథలిక్ స్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. Those kids should have had guns to protect himself!!!: At least 2 children killed and 17 people injured in shooting at Minneapolis Catholic school Mass - CNN https://t.co/bDEvTe8Wdo via @GoogleNews— Dror Peled (@dror_peled42643) August 28, 2025ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు ప్రకటించారు. మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా వెల్లడించిన వివరాల ప్రకారం విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు కిటికీల గుండా పిల్లలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తరువాత అనంతరం ఆ నిందితుడు కూడా మృతిచెందాడని, అతని వయసు 20 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఈ సంఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. -
Vaishno Devi Landslide: 30కి చేరిన మృతులు.. జమ్ముకశ్మీర్ అతలాకుతలం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కాట్రాలోని వైష్ణో దేవి ఆలయ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. Heart Breaking 💔Visuals from #VaishnoDevi in #Jammu.Sudden #Landslide and over 30 devotees lost life so farPrayers for the victims 🙏😥#VaishnoDeviLandslide #FloodRelief #Flood #GaneshChaturthi #TrumpTariffs #HeavyRains pic.twitter.com/mz7hDl7RxD— Sunaina Bhola (@sunaina_bhola) August 27, 2025ఆకస్మిక వరదలతో అతలాకుతలంఆగస్టు 14న కిష్త్వార్ జిల్లాలోని చిసోటిలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 65 మంది మృతిచెందారు. వీరిలో యాత్రికుల సంఖ్యే అధికంగా ఉంది. మంగళవారం దోడా జిల్లాలో భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారు. కాట్రాలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపధ్యంలో వైష్ణో దేవి యాత్ర నిలిపివేశారు. ఆగస్టు 27 వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. माता वैष्णो देवी मंदिर के पास कल हुए लैंडस्लाइड में मरने वाले श्रद्धालुओं की संख्या 30 पहुंची। ये आंकड़ा और भी बढ़ सकता है। खराब मौसम की वजह से यात्रा रोकी गई। #VaishnoDeviLandslide #VaishnoDevi #Landslide pic.twitter.com/hHLto3oWKm— Dr Anupama Soni (@DrAnupamaSoni) August 27, 2025టెలికాం వ్యవస్థ బ్లాక్అవుట్తుఫాను తీవ్రతకు రాష్ట్రంలో కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలలో టెలికాం వ్యవస్థ పూర్తిగా బ్లాక్అవుట్ అయ్యింది. రవాణా నిలిచిపోయింది. జమ్ముశ్రీనగర్, కిష్త్వార్-దోడ జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.🌊🇮🇳🇵🇰 Flood situation in South Asia; Chenab river is flowing at a very dangerous level at Pul Doda in Jammu & Kashmir. Gates of Baghliar Power Project and Salal Projects likely to be opened to avoid any damges to the dams. https://t.co/y9abuQwSRn— OSINT Expert (@OsintExperts) August 26, 2025రైలు సర్వీసులు రద్దుభారీ వర్షాల కారణంగా జమ్మూకు బయలుదేరే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. తావి, చీనాబ్, ఉజ్, తరానా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రావి నదిపై ఉన్న మోధోపూర్ బ్యారేజీ నుండి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన దరిమిలా కథువా జిల్లాలో వరదలు సంభవించాయి. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు. అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు మందులు, నిత్యావసరాలను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేత ఆగస్టు 27 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు.బోర్డు పరీక్షలు నిలిపివేశారు. -
‘ట్రంప్.. మరో ఆరు నెలలే..’ వైరల్ వీడియోలో నిజమెంత?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక టిక్టాక్ వీడియోలో అధ్యక్షుడు ట్రంప్ మరో ఆరు నుండి ఎనిమిది నెలల మాత్రమే బతుకుతారనే వాదన వినిపిస్తోంది. ఎపిస్టెమిక్ క్రైసిస్ అనే ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోలో, తనను డాక్టరేట్ పొందిన హోమ్ హెల్త్ ఫిజికల్ థెరపిస్ట్ అని చెప్పుకుంటున్న వ్యక్తి.. అధ్యక్షుడు ట్రంప్.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించాడు.‘ఆయనకు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందని నాకు తెలుసు. ఆయన పాదాలు, చీలమండలలో వాపు దీనికి సంకేతం. వాపు మరింత తీవ్రమవుతోందని మాకు తెలుసు. అందుకే ఆయన బహిరంగ సభల సమయంలో డెస్క్ వెనుక కూర్చుంటున్నారు. ఈ సంకేతాలను చూస్తుంటే, ట్రంప్ ఇంకో ఆరు నుండి ఎనిమిది నెలలు మాత్రమే బతకవచ్చని’ అన్నారు. I’ve watched this 4 times so far. 😌Credit: epistemiccrisis on TikTok pic.twitter.com/M4FUoANHHg— Annalea 🪷🐝🥑🍁🌻🍌 (@citizengatsby) August 23, 2025దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో ఇటీవల జరిగిన సమావేశంలో, కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ చేతులపై నున్న గాయాల ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై పలువురిలో ఆందోళన చోటుచేసుకుంది. పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఈ గాయాలను మేకప్తో దాచడంతో, ఇవి మీడియా దృష్టి నుంచి ఆకర్షించలేదనే మాట వినిపిస్తోంది.తాజా ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, కొందరు అధ్యక్షుడు ట్రంప్ చాలాకాలంగా ఎదురుగా కెమెరాలున్నప్పుడు డెస్క్ వెనుకగా కూర్చుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. చీలమండ వాపు అనేది హృద్రోగ లేదా మూత్రపిండాల వ్యాధులకు సంబంధించినదని వారు అంటున్నారు. ఈ ఊహాగానాల నేపధ్యంలో వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వాదనలను ఖండించింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి. అతను చరిత్రలో నిలిచిపోతాడు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో ప్రజలను కలుస్తూ, వారితో కరచాలనం చేస్తున్నారు. అతని నిబద్ధత అచంచలమైనది. ప్రతిరోజూ దానిని రుజువు చేస్తున్నారంటూ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. -
Dowry horror: కుమార్తెకు నిప్పంటించి, తానూ మృత్యు ఒడికి..
జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒక మహిళతో పాటు ఆమె మూడేళ్ల ఏళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తమ కుమార్తె కొన్నాళ్లుగా అత్తవారింటిలో వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపధ్యంలో ఆమె కుమార్తెతో పాటు ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.యూపీలోని గ్రేటర్ నోయిడాలో వరకట్న వేధింపులతో మహిళ హత్య జరిగిన కొన్ని రోజులకే ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాజా ఘటనలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సంజు బిష్ణోయ్ శనివారం మహాత్మా గాంధీ ఆస్పత్రిలో కాలిన గాయాలతో మరణించగా, ఆమె మూడేళ్ల కుమార్తె యశస్వి జోధ్పూర్లోని సర్నాడ గ్రామంలోని వారి ఇంట్లో సజీవ దహనమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంజు శుక్రవారం పాఠశాల నుండి తిరిగి వచ్చాక, ఇంటిలోని డైనింగ్ టేబుల్ కుర్చీపై పెట్రోల్ పోసి, తనతో పాటు తన కుమార్తెకు కూడా నిప్పంట్టించింది. ఇద్దరూ మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. అక్కడిక్కడే యశస్వి సజీవ దహనమైపోయింది. సంజు కాలిన గాయాలతో ఆస్పత్రిలో మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలం నుండి పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.సంజుకు దిలీప్ బిష్ణోయ్ తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తమ కుమార్తెను అత్తామామలు పదే పదే కట్నం కోసం వేధించారని, వాటిని తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తల్లిదండ్రులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. సంజుకు ఆమె అత్తమామలకు మధ్య నాలుగైదు నెలల నుంచి వివాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ సంజు బిష్ణోయ్ని ఆమె భర్త , అత్తమామలు కట్నం కోసం వేధించారని. ఇదే ఆమె ఆత్మత్యకు కారణంగా నిలిచిందంటూ ఫిర్యాదు అందిందన్నారు. ఈ నేపధ్యంలో భర్త దిలీప్, మామ గణపత్, అత్త లీలలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మియాపూర్లో మిస్టరీ డెత్స్.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త,మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతులను కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
అఫ్గనిస్తాన్లో బస్సు దగ్ధం 17 మంది పిల్లలు సహా 73 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 73 మంది మరణించారు. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్ వలసదారులతో నిండిన బస్సు మంగళవారం కాబూల్కు బయలుదేరింది. సరిహద్దు దాటిన తరువాత హెరాత్ ప్రావిన్స్లో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. ఇతర వాహనాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. బస్సు డ్రైవర్ మితిమీరిన వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని హెరాత్ పోలీçÜులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దశాబ్దాల సంఘర్షణ కారణంగా రోడ్లు దెబ్బతిన్న అఫ్గానిస్తాన్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ఇక 1970ల నుంచి లక్షలాది మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్తాన్లకు పారిపోయారు. 1979లో సోవియట్ దండయాత్ర సమయంలో, 2021లో తాలిబన్లు దేశాన్ని తమ వశం చేసకున్న తరువాత ఈ వలసలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఇరాన్లో క్రమక్రమంగా అఫ్గాన్ వ్యతిరేక భావన పెరిగింది. శరణార్థులు చాలాకాలంగా వ్యవస్థాగత వివక్షను ఎదుర్కొంటున్నారు. పత్రాలు లేని అఫ్గాన్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ మార్చిలోనే హెచ్చరించిన ఇరాన్ జూలై వరకు ఇచ్చిన గడువు కూడా పూర్తయ్యింది. జనవరి నుంచి 15 లక్షల మందికి పైగా అఫ్గాన్లు ఇరాన్ను వదిలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.వీరిలో చాలా మంది తరతరాలుగా ఇరాన్లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం. జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన స్వల్పకాలిక యుద్ధం తర్వాత జాతీయ భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది అఫ్గాన్లను ఇరాన్ అధికారులు బలవంతంగా తిప్పి పంపించారు. భద్రతా వైఫల్యాలతో జరిగిన ఇజ్రాయెల్ దాడులకు అఫ్గాన్లను బలిపశువులు చేస్తున్నారనేది విమర్శకుల వాదన. ఎలాంటి పత్రాలు లేని అఫ్గాన్లను పాకిస్తాన్ కూడా వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి తిరిగి అఫ్గానిస్తాన్కు వచి్చన శరణార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. -
kerala: బాలికను బలిగొన్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా.. మరో మూడు కేసులు నమోదు
కోజికోడ్: కేరళలోని కోజికోడ్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా(అమీబిక్ ఎన్సెఫాలిటిస్) కలకలం సృష్టిస్తోంది. ఈ అరుదైన వ్యాధికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. నేగ్లేరియా ఫౌలేరి జిల్లాలో ఇదే తరహాలో మరో మూడు కేసులను ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపధ్యంలో ప్రజారోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.కలుషిత నీటిలో కనిపించే ఈ అరుదైన అమీబా మానవ మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని నిపుణులు తెలిపారు. అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం వారం రోజుల క్రితం ఒక బాలికకు తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ ఏడాది జిల్లాలో ఈ తరహా కేసులలో ఇది నాల్గవది.అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే..వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు సోకే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE). ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్కు ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపుకు దారితీస్తుంది. చాలా సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా కనిపించినప్పటికీ, కౌమార దశలోనివారికి సోకుతుండటాన్ని నిపుణులు గమనించారు. కలుషితమైన నీటిలో మునిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, చెరువులు, కాలువలలో ఈతకు దిగేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలిపారు.లక్షణాలు- నివారణవైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వ్యాధి తీవ్రమైన తరుణంలో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా తదితర సమస్యలు సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ 18 రోజుల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి నివారణకువైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్లలో నీటిని క్లోరినేట్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. కలుషిత నీటికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన పాక్ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్ప్రెస్ రైలు లాహోర్కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. One killed, several injured as passenger train derails in Pakistan's Punjab#trainaccident #Pakistan #awamexpresshttps://t.co/UiKhnREKAy— IndiaTV English (@indiatv) August 17, 2025ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్లను పక్కకు తొలగిస్తున్నారు. ట్రాక్ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్లోని పంజాబ్లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
‘శారద’లో మరో విద్యార్థి బలవన్మరణం.. ‘లేఖ’లో విద్యా విధానంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన దరిమిలా విశ్వవిద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి.బీహార్లోని మధుబనికి చెందిన శివమ్.. వర్శిటీలోని హెచ్ఎంఆర్ హాస్టల్లో ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ బృందం శివమ్ గదిని పరిశీలించింది. అక్కడ శివమ్ రాసిన లేఖ పోలీసులకు దొరికింది. దానిలో శివమ్ ‘మీరు దీనిని చదివే సమయానికి నేను చనిపోయివుంటాను. నా మరణం నా సొంత నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. నేను ఒక ఏడాదిగా ఇందుకోసం ప్లాన్ చేస్తున్నాను. రెండేళ్లుగా తరగతులకు హాజరు కావడం లేదు. నా ఫీజులను నా కుటుంబానికి తిరిగి చెల్లించండి. భారతదేశ విద్యా వ్యవస్థ నిరాశాజనకంగా ఉంది. దీనిని పరిష్కరించకపోతే, దేశం పురోగతి సాధించలేదు. నా అవయవాలను అవసరమైనవారికి దానం చేయండి’ అని శివమ్ ఆ లేఖలో రాశాడు.కుమారుని ఆత్మహత్య గురించి తెలుసుకున్న శివమ్ కుటుంబసభ్యులు.. తమ కుమారుడు రెండేళ్లుగా తరగతులకు హాజరు కాకుంటే, ఆ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శారదా యూనివర్సిటీలో గత నెలలో రెండవ ఏడాది దంత విద్యార్థిని హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాకల్టీ వేధింపులపై ఆరోపణలు చేస్తూ ఆమె ఒక లేఖ రాసింది. ఈ ఘటన క్యాంపస్లో నిరసనలకు దారితీసింది. ఈ కేసు నేపధ్యంలో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. శివమ్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. -
ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు(శనివారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. Mumbai is experiencing heavy rainfall with an Orange Alert in effect. Water-logging and reduced visibility have been reported in several areas.Mumbaikars are advised to avoid non-essential travel and to exercise caution while venturing out.Police have been instructed to be on…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) August 15, 2025భారీ వర్షాల కారణంగా విఖ్రోలి వెస్ట్ సమీపంలోని కొండచరియలు విరిగిపడగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీచేసినందున ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Gandhi Market. pic.twitter.com/2mAbfXySWv— ANI (@ANI) August 16, 2025‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందనే రిపోర్టులు వస్తున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముంబై పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని ముంబై పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్లలో భారీ వర్షాలు కురియనున్నాయని హెచ్చిరించింది. పాల్ఘర్లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా భారీ వర్షాల కారణంగా నగరంలోని వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా, చెంబూర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025రైల్వే ట్రాక్లు నీటితో నిండిపోయాయి. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది.కాగా గురువారం ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ కొలాబా అబ్జర్వేటరీ వద్ద 53 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. #WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025 -
జల విపత్తు మృతుల్లో రాష్ట్రమే టాప్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా జల వాతావరణ విపత్తుల్లో అత్యధిక మృతులు నమోదైన రాష్ట్రంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ కేవలం నాలుగు నెలల్లో రాష్ట్రంలో 343 మంది జల విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తేల్చిన ఈ నిజం– రాష్ట్ర విపత్తు నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..⇒ ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం జల వాతావరణ విపత్తుల కారణంగా 1,626 మంది మృతి చెందారు. ⇒ జలాశయాల దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది జలాశయాల్లో దిగి మృతి చెందుతున్నారు. ⇒ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి.⇒ మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (243), హిమాచల్ ప్రదేశ్ (195) నిలిచాయి. ⇒ జల విపత్తులు సంభవించిన రాష్ట్రాల్లో నష్టాలను అంచనా వేసిన తరువాత జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని గణాంకాల నివేదిక పేర్కొంది. ⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 15వ తేదీ నాటికి జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్ర వాటాగా 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్.. 33 మంది మృతి.. 220మంది గల్లంతు
జమ్మూ: జమ్మూకశ్మీర్లో స్వల్ప వ్యవధిలో కిష్ట్వార్, పహల్గాంలో రెండో చోట్ల జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా గురువారం సాయంత్రం (ఐదుగంటల) సమయానికి 33 మంది మరణించారు. 220మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్ బరస్ట్ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం కిష్ట్వార్ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్ట్వార్లో మెరుపు వరదలతో 220మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.క్లౌడ్ బరస్ట్తో అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, స్థానికుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్ట్వార్లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విచారంజమ్మూ కశ్మీర్లోని కిష్ట్వార్ క్లౌడ్ బరస్ట్పై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.వరదల కారణంగా గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in need.— Narendra Modi (@narendramodi) August 14, 2025ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్ట్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్ ఉదంపూర్ ఎంపీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు. Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025 సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్ట్వార్లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు,సైన్యం,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘కిష్ట్వార్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు,సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు రక్షణ, సహాయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. -
ఏ ధర్మం ఎలా చెప్పినా..అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్లమే!
పుడమిపై శ్వాస పీలుస్తున్న ప్రతి ప్రాణీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని ముగించాల్సిందే. పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు. ఇది నగ్నసత్యం. తిరస్కరించలేని నిజం. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. ‘కుల్లునఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ ’ అని పవిత్ర ఖురాన్ చెప్పింది. ‘జాతస్య మరణం ధ్రువం’ అని వేదం చెప్పింది. ఏ ధర్మం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా అర్థం అదే. కాని మనం దీన్ని పట్టించుకోం. మన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మరణిస్తూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, వారిని సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికూడా వేస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకువెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నారు.కనీసం పార్థివ శరీరంపై ఉన్న బట్టలు, ఆభరణాలు కూడా ఇక్కడే వదిలేసి, ఆత్మీయులతో బంధాలను సైతం తెంచుకొని ఈలోకాన్ని వీడివెళ్ళి΄ోతున్నారు. తమవెంట భూములు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఏవీ తీసుకొని వెళ్ళడంలేదు. ప్రాణప్రదంగా ప్రేమించే భార్యాబిడ్డలు కూడా వెంట వెళ్ళడంలేదు. అంటే ఇవేవీ ఆ రోజు పనికి రావన్నమాట.ముహమ్మద్ ప్రవక్త ఒక మాట చెప్పారు. ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తమూ మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం ఆలోచించకుండా, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళి΄ోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, వంచించి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయ విలువలకే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవ ప్రదంగా సాగి΄ోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Jammu and Kashmir: ఆర్మీ పోస్ట్పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి
బారాముల్లా : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు మృతిచెందాడు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. The Indian Army launched a large-scale cordon and search operation in the Uri sector of Baramulla district, foiling a major infiltration attempt. | Ashraf WaniRead more: https://t.co/fqZp5RcT8I#JammuandKashmir #Baramulla #Uri pic.twitter.com/gn7SIrk8wl— IndiaToday (@IndiaToday) August 13, 2025పాక్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్కు భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
శిబూ సోరెన్కు నివాళులు.. లోక్ సభ మ.2 గంటలకి వాయిదా
ఢిల్లీ: ప్రతిపక్షాల గందరగోళం మధ్య లోక్సభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై చర్చ జరపాలని విపక్షాల పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనికి సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు నిబంధనలను గుర్తు చేస్తూ ఈ అంశంపై చర్చించలేమని అన్నారు.దీనికి ముందు ఇండియా బ్లాక్ నేతలు బీహార్ ప్రత్యేక ఓటరు సవరణ నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పెద్దగా పురోగతి సాధించిందే లేదు. ఇండియా బ్లాక్ నిరసనలతో అంతరాయం కలుగుతోంది.లోక్సభలో వర్షాకాల సమావేశాలు సోమవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ గందరగోళం కారణంగా సభా కార్యకలాపాలు ముందుకు కొనసాగలేదు. స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను వారి స్థానాలకు వెళ్లి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గందరగోళం కారణంగా సభ ప్రారంభమైన 10 నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. #WATCH | Rajya Sabha members pay tribute to member of Parliament, former Jharkhand CM and founding patron of JMM, Shibu Soren, who passed away at Sir Ganga Ram Hospital in Delhi today after prolonged illness. Video source: Sansad TV/YouTube pic.twitter.com/qpje78kVrj— ANI (@ANI) August 4, 2025ఇక నేటి రాజ్యసభ కార్యకలాపాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ శిబు సోరెన్ మృతిపై సభలో సభ్యులంతా సంతాపం వ్యక్తం చేశారు. తరువాత ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. తమ కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా, ఆగస్టు 8 ఉదయం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రతిపక్షాలు మార్చ్ నిర్వహించనున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో పార్లమెంటు సభ్యుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. -
ఎన్ఆర్సీ ఎఫెక్ట్: బంగ్లాకు పంపుతారని వృద్ధుని బలవన్మరణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.కోల్కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్గంజ్ నుండి కోల్కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్ చేసింది.అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ అమలు తర్వాత బంగ్లాదేశ్కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
కాలువలో పడిన కారు.. 11 మంది మృతి
గోండా: ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు. గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పోయిరా పోయిరా మామా.. అరే రాజాలాగా దర్జాగా పోయిరా మామా
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’... ఈ తెలుగు పాట స్నేహానికున్న గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పదనేవారు కూడా ఉన్నారు. ‘స్నేహమంటే ఊపిరి కదరా’ అంటూ చెట్టపట్టాల్ వేసుకుని తిరిగేవారు కూడా మనకు కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి ప్రాణస్నేహితుడు కనుమరుగైతే.. ఏకాకిగా మిగిలిన ఆ స్నేహితుని పరిస్థితి ఏమిటి?.. అతని హృదయం ఎలా ద్రవిస్తుంది?.. తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లాల్సిందే..ఇండోర్కు చెందిన ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుని మృతి అనంతరం అతని అంత్యక్రియల ఊరేగింపులో కన్నీళ్లతో నృత్యం చేస్తున్న భావోద్వేగ దృశ్యం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మందసౌర్ జిల్లాలోని జవాసియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంబాలా ప్రజాపత్ తన ప్రాణ స్నేహితుడు సోహన్లాల్ జైన్కు ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని అతని అంత్యక్రియల సమయంలో నిలబెట్టుకున్నాడు.2023 నుండి క్యాన్సర్తో పోరాడుతున్న జైన్, తన మరణానికి ముందు అంబాలాకు రాసిన ఒక లేఖలో.. తన మరణ సమయాన నిశ్శబ్దంగా కూర్చోవద్దని, దుఃఖంతో విచారించవద్దని, తన అంత్యక్రియల సమయంలో పండుగ జరుపుకోవాలని కోరాడు. జైన్ రాసిన ఆ లేఖలో ‘నేను ఈ ప్రపంచం నుంచి కనుమరుగైనప్పుడు కన్నీళ్లు వద్దు, నిశ్శబ్దం అంతకన్నా వద్దు, వేడుక చేసుకోవాలి. నా అంత్యక్రియల ఊరేగింపులో డప్పు శబ్ధాలకు అనగుణంగా నృత్యం చేస్తూ, నాకు వీడ్కోలు పలకాలి. విచారంతో, ఏడుపుతో నన్ను పంపించవద్దు. సంతోషంగా నాకు వీడ్కోలు చెప్పండి’ అని కోరాడు.స్నేహితుని అభిలాషను గౌరవిస్తూ అంబాలా తన స్నేహితుని అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేశాడు. జలపాతంలా ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ, నృత్యం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో అందరి దృష్టిని కట్టిపడేస్తోంది. ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం సోహన్లాల్ జైన్ ఏడాది కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నాడు. జైన్ కుమారుడు ముఖేష్ మాట్లాడుతూ, తన తండ్రి చివరి కోరికను నెరవేర్చగలిగినందుకు అందరం సంతోషంగా ఉన్నామన్నారు. View this post on Instagram A post shared by Comedyculture.in ™ (@comedyculture.in) -
Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
దేవఘర్: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేవఘర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవఘర్లో కన్వర్ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నదని, బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. BJP MP Nishikant Dubey (@nishikant_dubey) posts, " लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें" pic.twitter.com/o6axGqRi85— Press Trust of India (@PTI_News) July 29, 2025ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన దరిమిలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. -
చైనాలో భారీ వరదలు
బీజింగ్: ఉత్తర చైనాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది మరణించారు. 130 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. భారీ వర్షాలు కురి సే అవకాశం ఉండటంతో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. దేశ రాజధాని వరదలతో అతలాకుతలమైంది. రాజధానిలోనే 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మందిని ఖాళీ చేయవలసి రావడంతో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. బీజింగ్ సమీపంలోని షాంగ్జీ, హెబీ ప్రావిన్సులు కూడా కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. హెబీలోని బావోడింగ్ నగరంలో దాదాపు 20,000 మందిని వారి ఇళ్ల నుంచి తరలించారు. హువైరౌ జిల్లాలో వరదలతో ఒక వంతెనను కూపోయింది. మియున్ జిల్లాలోని ప్రాంతాన్ని భా రీ వర్షం ముంచెత్తిన తరువాత, ఉబ్బిన కింగ్షుయ్ నది రహదారులు దెబ్బతిన్నాయి. బీజింగ్ అంతటా డజన్ల కొద్దీ రోడ్లు మూసివేయబడ్డాయి లేదా దెబ్బతిన్నాయి. మియున్ జిల్లాలో నది ఉప్పొంగుతోంది. షాంగ్జీ ప్రావిన్స్లోని లిన్ఫెన్ సిటీలోని జిక్సియన్ కౌంటీలో ఎల్లో రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకూ వరద కొనసాగింది. కొండలన్నీ జలపాతాలు అయ్యాయి. కార్లు సెయిలింగ్ బోట్లను తలపి ంచాయి. దక్షిణ చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. హాంకాంగ్ ఈ సంవత్సరం మొదటిసారిగా అత్యధిక వర్షపు తుఫాను హెచ్చరికను జారీ చేసింది. బీజింగ్కు దక్షిణంగా, కో–మే తుఫాను సమీపిస్తుండటంతో జెజియాంగ్, జియాంగ్సు, అన్హుయ్ ప్రావిన్సుల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు : జిన్పింగ్ వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. తప్పిపోయిన వారని వెదకడానికి, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల చైనాకు 54.11 బిలియన్ యువాన్లు (ఆరున్నర లక్షల కోట్లు ) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 90శాతానికి పైగా వరదల వల్లే కలిగాయని వెల్లడించింది. 🇨🇳中国の国営メディアによると、北京と近隣地域で大雨と洪水により30人以上が死亡し、数万人以上が首都から避難した。https://t.co/E1o1IachDH pic.twitter.com/GJxbcB8W5I— カントリーママ (@0327tnumata) July 29, 2025వరుస వరదలు.. బీజింగ్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొత్తేమీ కాదు. ఈ వేసవిలో చైనాలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నెల ప్రారంభంలో దేశంలోని తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీచగా, దేశంలోని నైరుతి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం, బీజింగ్ సమీపంలోని చెంగ్డే నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో, టైఫూన్ విఫా తూర్పు చైనాను తాకినప్పుడు, షాన్డాంగ్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించారు. 10 మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో నైరుతి చైనాలోని యాన్ నగరంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. 2023లో భారీ వర్షాలు, వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. 18 మంది గల్లంతయ్యారు. జూలై 2012లో వరదలు 79 మందిని బలిగొన్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రమైన విపత్తు. -
Himachal: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి
మండీ: హిమాచల్లోని మండీలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడి, ఐదుగురు మృతిచెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం సర్కాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది.ఈ దుర్ఘటన హిమాచల్లోని మండీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కాఘాట్ సబ్-డివిజన్లోని మాసెరాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. హెచ్ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడం హృదయ విదారకమైనదని ఆయన పేర్కొన్నారు.బాధితులకు వెంటనే వైద్యసాయం అందించాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు. ‘ఈ దుఃఖ సమయంలో, మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని సుఖ్విందర్ సింగ్ సుఖు‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం రిలీఫ్ ఆపరేషన్లలో చురుకుగా పాల్గొంది. -
పాక్ ఆస్పత్రిలో.. 26/11 ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి
ఇస్లామాబాద్: భారత పార్లమెంట్పై దాడి(2001), 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మే 6న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సమయంలో క్షిపణి దాడి కారణంగా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అత్యంత సన్నిహితుడని సమాచారం.అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు నిధులను అందించే అగ్రశ్రేణి నిర్వాహకుడు. సోషల్ మీడియాలో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు పత్యక్షమయ్యాయి. వీటిలో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, అబ్దుర్ రవూఫ్ తదితర సీనియర్ లష్కర్ నేతలు ఆయన మరణానికి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తోంది. అజీజ్ గతంలో గల్ఫ్ దేశాలతో పాటు యూకే, యూఎస్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు, పాకిస్తాన్ కమ్యూనిటీల నుండి నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, నియామకాలను అజీజ్ చేపట్టాడని తెలుస్తోంది.అతని మృతి లష్కర్ ఎ తోయిబాకు తీరని లోటుగా ఉగ్రవాదనేతలు భావిస్తున్నారు. అబ్దుల్ అజీజ్ భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉంది. 2001 పార్లమెంట్ దాడికి పాకిస్తాన్ నుండి డబ్బు, పరికరాలను తరలించడంలో సహాయం చేశాడని నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. 2006 ముంబై లోకల్ రైలు పేలుళ్లకు కూడా ఇతను ఆర్థిక సహాయం అందించాడని భావిస్తున్నారు. 2008 ముంబై దాడుల సమయంలో, అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్లను అందజేసినట్లు తెలుస్తోంది. -
‘నువ్వు చిన్న పిల్లవి కాదు.. నన్ను అర్థం చేసుకో’.. బీఈడీ విద్యార్థినితో లెక్చరర్
భువనేశ్వర్: లెక్చరర్ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్ మోహన్ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్ సమీర్ రంజన్ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్ సాహూకు సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు. ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.దుర్ఘటనకు ముందు లెక్చరర్ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు. జులై 12న ఒడిశాలోని బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. -
Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్లైన్ పోస్ట్లో తెలిపారు. -
Kerala: మళ్లీ ‘నిఫా’ కలకలం.. అంతటా అప్రమత్తం
పాలక్కాడ్: కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ‘నిఫా’ అనుమానిత మరణం నమోదైంది. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ప్రభావం కలిగినవిగా భావిస్తున్న ఆరు జిల్లాల్లోని వైద్యాధికారులు మరింత అప్రమత్తయయ్యారు. నిఫా రెండవ మరణం విషయంలో పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తుది నిర్ధారణ చేయనుంది.జూలై 12న పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి నిపా వైరస్ కారణంగా మరణించాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ వైరస్తో కేరళలో మరణించినవారి సంఖ్య రెండుకు చేరింది. బాధితుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. మంజేరి మెడికల్ కాలేజీలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నిపా పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీల్డ్ సర్వైలెన్స్ను ముమ్మరం చేసింది.మృతునితో సంబంధం కలిగిన 46 మంది జాబితాను సిద్ధం చేశారు. మృతుడు గతంలో తిరిగిన ప్రాంతాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డేటా సాయం తీసుకున్నారు. ప్రాంతీయ వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, పరిస్థితులను పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని డేటాలను సేకరిస్తున్నామని వీణా జార్జ్ తెలిపారు. కాగా పాలక్కాడ్, మలప్పురం జిల్లాల ప్రజలు అనవసరమైన సందర్శనలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఆస్పత్రులలోని వైద్య సిబ్బంది, రోగులు, సందర్శకులు మాస్క్లు ధరించాలని సూచించారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్ తదితర ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా అప్రమత్తతపై అధికారుల నుంచి హెచ్చరికలు అందాయి. -
Bihar: ‘లేపేస్తామంటూ..’ చిరాగ్ పాశ్వాన్కు హెచ్చరిక?
పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్నేమ్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్లోని హాజీపూర్కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. -
సార్థక జీవితం -మరణంతోనే వెలుగు
అల్ప పదాలలో అనంతార్ధాన్ని చూపే ప్రసంగ కళా శాస్త్ర పండితుడిగా, ధర్మశాస్త్ర నిపుణుడిగా పేరొందిన అపోస్తలు డైనపాలు క్రీస్తు మరణాన్ని చూసే విధానం అద్భుతమనే చెప్పాలి.‘నా సువార్త ప్రకారంగా’ అంటూ పౌలు మహాశయుడు దేవుని సంకల్ప ప్రకారమైన క్రీస్తు సత్యసువార్తను కుదించి కేవలం మూడే మూడు పదాలతో సువార్తను నిర్వచించాడు. క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అంటూ సువార్తను వివరించాడు. ఇదే క్రీస్తు సువార్తను మరల మరింతగా క్లుప్తంగా చేసేస్తూ విషయ సారం ఇదే అనేంత తేటగా అసలును తేల్చేస్తూ అది హుందాగా మన ముందు పెడతాడు. క్రీస్తు మరణమే సువార్త’అంటూ ఒకే ఒక్క మాటతో ఇలా సులభం చేసేశాడు. అయితే క్రీస్తు సువార్త ఎప్పుడూ దేవుని సంకల్పంతో ముడిపడి ఉంటుంది. సువార్తను దేవుని సంకల్పంతో ఎన్నడూ వేరుచేసి చూడలేము. పౌలు క్రీస్తు మరణాన్నే సువార్తగా అదే తన జీవిత పరమావధిగా, గమ్యంగా చేసుకొని జీవితాంతం ఈ ఒక్క అతిశయంతోనే సువార్తను అంతటా ప్రకటించాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటాడు ఒకసారి. క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయండి అంటూ సంఘానికి పిలుపునిస్తూ అజ్ఞాపిస్తాడు ఇంకొకసారి. ఔను, నిజానికి క్రీస్తు మరణమే సువార్త.అయితే సమాధి, పునరుత్థానాలు అను రెండు అంశాలు కూడా సువార్తను బలపరచేవే. ఎలాగంటే, మరణించిన క్రీస్తును సమాధి చేశారు. అలాకాకుండా ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏ వైద్యశాలకో ఆయన్ను తరలించేవారు. అలా జరుగలేదు. రోమా ప్రభుత్వం ఆయన మరణించాడు అన్నది నిర్ధారణ చేసుకొనే ఆయన పార్థివ దేహాన్ని సంబంధిత వ్యక్తులు, శిష్యులకు అప్పగించింది. ఇక పునరుజ్జీవం విషయానికి వస్తే, క్రీస్తు మరణం నుండి తిరిగి లేవక΄ోతే క్రైస్త్తవులకు మనుగడే అనగా నిరీక్షణే లేదని పౌలే బలంగా నొక్కి వక్కాణిస్తుంటాడు. అయినా సరే, పౌలు దృష్టి కోణంలో క్రీస్తు మరణమే సువార్త. సువార్త అంటే క్రీస్తు మరణం... క్రీస్తు మరణమే సువార్త అన్నంతగా ΄పౌలు జీవితంతో క్రీస్తు సువార్త ముడిపడి పెనవేసుకొంది.మరో విధంగా చూస్తే, ఒక వ్యక్తి సమాధి చేయబడ్డాడు అంటే మరణించాడు అనేకదా అర్థం. మరణించిన వారే సమాధి చేయబడతారు. అదేవిధంగా మరణించాడు అనంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒకచోట పుట్టాడు అనే కదా దీనర్థం. కాబట్టి ఈ కోణంలోనూ మరణమే సువార్త అయ్యింది. మరణంతోనే వెలుగు చేతల పరమైన సత్క్రియలు, వీరోచిత కార్యాలు, ధైర్య సాహసాలు మాట్లాడినంత గట్టిగా ఏవీ మాట్లాడలేవు. ఒక సైనికుడు తన వీర మరణంతోనే వెలుగులోకి వస్తాడు. కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఇక అప్పటి నుండే అతని పుట్టుక, పేరు, ఊరు, తల్లిదండ్రులు, అతడు చదివిన ΄ాఠశాల, సంబంధిత ఇతర విద్యా సంస్థలు, అతనికి చదువు చెప్పిన గురువులు, అతని సన్నిహిత స్నేహితులు, బంధు మిత్రులు అంతా మీడియా కెక్కుతారు. దేశానికి అతని త్యాగపూరిత మరణం చేసిన గొప్ప మేలునే ఎప్పుడూ మరువక దేశ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటిదే, ఇంతకు మించినదే క్రీస్తు మరణం. – జేతమ్ -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్క్లబ్లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.జైపూర్లోని ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్పూర్లోని తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు -
Shefali Death: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నాక..
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మోడల్ షెఫాలీ జరివాలా ఆకస్మిక మృతిపై జరుగుతున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందగా, అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముంబైలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.సాక్షుల వాంగ్మూలాలు, షెఫాలీ జరివాలా గదిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలు, ప్రాథమిక ఫోరెన్సిక్ ఇన్పుట్ల సాయంతో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెఫాలీ గత ఏడెనిమిది ఏళ్లుగా క్రమం తప్పకుండా యాంటీ ఏజింగ్ మందులు తీసుకుంటున్నది. జూన్ 27న ఆమె ఇంటిలో పూజ జరిగింది. ఆరోజు షెఫాలీ ఉపవాసం ఉంది. అయినప్పటికీ ఆమె ఆ రోజు మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకుంది. ఒక వైద్యుని సలహా మేరకు షెఫాలీ ఈ మందులను వాడుతోంది. పోలీసుల దర్యాప్తులో ఈ మందులే ఆమె గుండెపోటుకు ప్రధాన కారణం కావచ్చని వెల్లడయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27న రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య షెఫాలీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరంలో వణుకు మొదలైంది. తరువాత ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో షెఫాలీ భర్త పరాగ్, తల్లి, మరికొందరు ఆమెకు సాయం అందించారు. షెఫాలీ మృతి కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం ఆమె నివాసం నుండి యాంటీ ఏజింగ్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది.ఇప్పటివరకు, ఈ కేసులో కుటుంబ సభ్యులు, ఇంటి పనిమనుషులు, బెల్లేవ్ ఆసుపత్రి వైద్యుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక షెఫాలీ మృతికి గల కారణం స్పష్టం కానున్నదని పోలీసులు తెలిపారు. ఆమె శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యింది. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు షెఫాలీ మృతి చెందినట్లు ధృవీకరించారు.ఇది కూడా చదవండి: కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి -
కుమార్తె ‘నీట్’ స్కోర్ తగ్గిందని.. విచక్షణ మరచి..
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.కుమార్తె నీట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
ఫరీదాబాద్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అత్తామామల వేధింపులకు ఒక మహిళ బలయ్యింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్లోని ఒక వీధిలో 10 అడుగుల లోతైన గుంత నుంచి పోలీసులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్లోని షికోహాబాద్ నివాసి తనూ(24)గా గుర్తించారు. ఫరీదాబాద్లోని రోషన్ నగర్కు చెందిన అరుణ్తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతంలో తను భర్త, మామ, అత్త, మరొక దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటిపక్కన మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో తనూను ఆమె భర్త, అత్తామామాలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.తనూకు 2023లో వివాహం జరిగిందని, అనంతరం ఆమె అత్తవారింటిలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైందని ఆమె సోదరి ప్రీతి ఆరోపించింది. వివాహం జరిగిన వెంటనే తనూ భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు డిమాండ్ చేశారని పేర్కొంది. తాము వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఏదో కావాలని తనూను వేధించారని ఆమె తెలిపింది. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తనూ పుట్టింటిలోనే నెల్లాళ్ల పాటు ఉందని, తరువాత ఆమెను తాము అత్తారింటికి పంపామని అప్పటినుంచి తమ సోదరికి మరింతగా వేధింపులు పెరిగాయని ప్రీతి పేర్కొంది.ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె అత్తమామలు తమకు చెప్పారని, దీంతో ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, కాల్ కలవలేదని ప్రీతి తెలిపారు. దీంతో తమకు మరింతగా అనుమానం పెరిగి, పోలీసులను ఆశ్రయించామన్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతలో తనూ ఇంటికి సమీపంలో ఆమె మామ గొయ్యిని తవ్వారు. దానికి మురుగునీటి పారుదలకు అని ఆయన చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఆ తరువాత నుంచి తనూ కనిపించలేదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మీడియాతో మాట్లాడుతూ వారం రోజల క్రితం ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. గుంతలో నుండి తనూ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు -
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ల కథనం మరువకముందే జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్గఢ్కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు -
Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025బులంద్షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
మండి: హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. #WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi. (Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi— ANI (@ANI) June 17, 2025తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది? -
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
రామ్ చరణ్ మూవీ ఎవడు చిత్రంలో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్ను మెప్పించారు. సౌత్లో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు, నటుడైన ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ముకుల్ మరణంపై పలు రూమర్స్ వినిపించాయి. డిప్రెషన్ వల్లే అతను మృతి చెందాడని కథనాలొచ్చాయి.అయితే తాజాగా ఈ రూమర్లపై రాహుల్ దేవ్ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం క్షీణించడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణం కాదని తెలిపారు. అతని ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్ దేవ్ వెల్లడించారు. చివరి నాలుగైదు రోజు తినడం పూర్తిగా మానేశాడని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతనికి జీవితంపై ఆసక్తి కోల్పోయాడని.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తిరస్కరించేవాడని రాహుల్ దేవ్ వివరించారు.2019లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని రాహుల్ పంచుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి మరణం.. 2023లో తల్లిని కోల్పోవడం అతని ఒంటరితనం మరింత ఎక్కువైందని వెల్లడించారు. ఒంటరిగా జీవించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని అతను పేర్కొన్నాడు. ముకుల్ తన కుమార్తెను మిస్ అవుతున్నాడని.. తనను జాగ్రత్తగా చూసుకోవడం లేదని కూడా బాధపడేవాడని రాహుల్ అన్నారు. ముకుల్ మరణం తరువాత సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అతను నిజంగా సూపర్ పవర్ అని.. అలాగే సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ముకుల్ 1996లో సుష్మితా సేన్ సరసన దస్తక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జై హో, హిమ్మత్ వాలా, మేరే దో అన్మోల్ రతన్, యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, భాగ్ జానీ వంటి లాంటి చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా ముమ్కిన్, ఘర్వాలీ ఉపర్వాలి, కషీష్, ఫిర్ కోయి హై, కుంకుమ్ ఏక్ ప్యారా సా బంధన్ లాంటి టీవీ సీరియల్స్లో నటించారు -
మోకాలితో గొంతు నొక్కిన ఉదంతంలో భారతీయుని విషాదాంతం
మెల్బోర్న్: భార్యాభర్తల నడుమ చిన్న వాగ్వాదంపై ఆ్రస్టేలియా పోలీసుల అతి స్పందన, మితిమీరిన జులుం, ఆటవికులను తలపించిన కర్కశత్వం చివరికి ఓ భారతీయుని ప్రాణాలు బలిగొన్నాయి. తలను నేలకేసి కొట్టడమే గాక మెడపై మోకాలితో తొక్కిపెట్టడంతో 42 ఏళ్ల గౌరవ్ కుందీ మెదడుకు తీవ్ర గాయమైంది. దాంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. ఐదేళ్ల క్రితం అమెరికాతో పాటు ప్రపంచమంతటినీ కుదిపేసిన ‘ఫ్లాయిడ్’ ఉదంతాన్ని తలపించిన ఈ క్రూరత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు అసలేమైంది? గౌరవ్, అమృత్పాల్ కౌర్ దపంతులు అడిలైడ్లో నివసిస్తున్నారు. వారికిద్దరు పిల్లలు. జూన్ మొదటి వారంలో జరిగిన దారుణాన్ని భార్య మీడియాతో పంచుకున్నారు. ‘‘మేమిద్దరం మా ఇంటి సమీపంలో నడుస్తున్నాం. నా భర్త కాస్త తాగి ఉన్నారు. మా మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన నన్ను దూరంగా నెట్టేయడాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూశారు. వెంటనే ఒక పోలీసు మా దగ్గరికొచ్చాడు. వస్తూనే నా భర్తను పోలీస్ కారుకేసి విసురుగా కొట్టాడు. తర్వాత కిందపడేసి తలను నేలకు గట్టిగా అదిమిపెట్టాడు.నా భార్యను హింసించడం లేదు అంటూ ఆయన మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. మేం కేవలం గట్టిగా మాట్లాడుకున్నామని, వదిలేయండని నేనూ అరిచినా పట్టించుకోలేదు. మెడపై చాలాసేపు మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక గౌరవ్ చివరకు స్పృహ తప్పారు. అయినా అరెస్ట్ చేయబోగా బతిమాలి ఆస్పత్రిలో చేరి్పంచా.మెడ, మెదడు నరాలు బాగా దెబ్బతిని కోమాలోకి వెళ్లాడు, స్పృహలోకి రావడం కష్టమని వైద్యులు చెప్పారు’’ అంటూ వాపోయారు. 2020 మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల నల్ల జాతీయున్ని శ్వేతజాతి పోలీసు ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు నేలకేసి అదిమిపట్టి ఊపిరాడకుండా చేయడం తెలిసిందే. దాంతో ఆయన నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఫ్లాయిడ్ చేసిన ఆర్తనాదాలు అమెరికావ్యాప్తంగా నల్లతీయుల సమరనాదంగా మారాయి.పోలీసుల భిన్న వాదన పోలీసులు మాత్రం తాము క్రూరంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. అయినా ఈ ఉదంతాన్ని పోలీస్ కస్టడీ మరణంగా భావిస్తామని శుక్రవారం ప్రకటించారు. అయితే, అప్పట్లో ఘటన తర్వాత సౌత్ ఆ్రస్టేలియన్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ మోకాలితో మెడపై అదిమిపెట్టడంనిజమేనని అంగీకరించడం విశేషం. -
Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం జరిగిన జూన్ 12న గుజరాత్కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్ వెంటనే తన విమాన టికెట్ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.యమన్ వ్యాస్ కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్లో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం -
విద్యుత్ కార్మికులకు కరెంట్ షాక్..
డోర్నకల్ /కేసముద్రం/నల్లబెల్లి/ముస్తాబాద్ (సిరిసిల్ల) /మల్లాపూర్: ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో నలుగురు విద్యుత్ కార్మికులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, సిరిసిల్ల జిల్లాలో కిందపడిన విద్యుత్ తీగను సరిచేస్తూ షాక్కు గురై ఓ కూలీ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన బి.క్రాంతికుమార్ (32) ఐదేళ్లుగా డోర్నకల్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మున్నేరువాగు వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ ప్రత్యేక యాప్ ద్వారా అనుమతి కోరగా.. సరఫరా నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ట్రాన్స్ఫార్మర్పైకి వెళ్లి మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. అతడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోల్పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణంవిద్యుత్ స్తంభంపైకెక్కి తీగలు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన దుంపేట రాజేశం (40) కొత్తదాంరాజుపల్లి సబ్స్టేషన్ పరిధిలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాల్గొండలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్కు గురై స్తంభంపై నుంచి కిందపడి మృతిచెందాడు. కరెంట్షాక్తో కూలీ దుర్మరణంరాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి రాజయ్య(48) ఇంట్లో శనివారం విద్యుత్ సర్వీస్ తీగ తెగిపడింది. దానిని పక్కకు తీస్తూ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాజయ్య భార్య గతంలోనే చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.మరో రెండు ఘటనల్లో ఇద్దరికి గాయాలు..వరంగల్ జిల్లా పంతులుపల్లికి చెందిన నీలం శ్రీనివాస్ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గోవిందాపూర్ ఫీడర్లో ఎల్సీ తీసుకుని శివారు లైన్తండాలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేపడుతున్నాడు. అయితే ఏఎల్ఎం బాసు.. మద్యం మత్తులో ఉండి ఎల్సీ తీసుకున్న విషయం మరిచిపోయి ఫీడర్ను ఆన్ చేశాడు. దీంతో శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. ఏఎల్ఎం బాసు మద్యం తాగినట్లు గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ బూర్గుల అంబేడ్కర్ రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి సమీప వ్యవసాయక్షేత్రంలో ట్రాన్స్ఫార్మర్ను బిగించే క్రమంలో షాక్కు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి పంపించారు. -
‘స్కార్పియో’ బీభత్సం.. మహిళా కానిస్టేబుల్ మృతి.. ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు
పట్నా: బీహార్లోని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ పురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై బుధవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం గస్తీలో ఉన్న పోలీసులను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోని ఒక మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.శ్రీకృష్ణ పురి పోలీస్ స్టేషన్ సిబ్బంది అటల్ పాత్ వెంట వెళుతున్న సాధారణ వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఫలితంగా ముగ్గురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.పట్నా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ తెలిపిన ప్రకారం గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్ మృతిచెందగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి.. -
‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్లు మేఘాలయలో అదృశ్యమైన తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఈ ఘటనలో రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం సోనమ్ తన ప్రేమికునితోపాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించిందని తెలియవచ్చింది. పోలీసుల విచారణలో ఈ నిందితులు సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా స్నేహితులని వెల్లడయ్యింది.ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రేమికుడు కుష్వాహా అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను ఆనంద్ కుమ్రీ, ఆకాష్ రాజ్పుత్ విక్కీ ఠాకూర్గా పోలీసులు గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్కు చెందినవారని అధికారులు తెలిపారు.ఉత్తరప్రదేశ్లోని బినా జిల్లాలో ఆనంద్ కుమ్రీ (23ని అరెస్టు చేయగా, లలిత్పూర్ జిల్లాలో ఆకాష్ రాజ్పుత్ (19)ను అరెస్టు చేశారు. విక్కీ ఠాకూర్ (22)ను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టు చేశారు. రాజా , సోనమ్లకు మే 11న ఇండోర్లో వివాహం జరిగిన తర్వాత వారు మే 20న మేఘాలయకు బయలుదేరారు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళుతుండగా అదృశ్యమయ్యారు.మే 16న రాజ్ కుష్వాహా.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తన చిన్ననాటి స్నేహితులను ఇండోర్లోని ఒక కేఫ్లో కలిశాడని పోలీసు అధికారులు తెలిపారు. మే 20న సోనమ్, ఆమె భర్త హనీమూన్కు వెళ్లగా, రాజ్ తన ముగ్గురు స్నేహితులను మేఘాలయకు పంపాడు. హత్య జరిగిన రోజున సోనమ్ తన భర్తను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ ముగ్గురు నిందితులు రాజా రఘువంశీపై దాడి చేశారు. పది రోజుల తర్వాత, పోలీసులకు ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమయ్యింది. ఆ సమయంలో ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో అతనిపై రెండుసార్లు దాడి జరిగిందని తేలింది. అదే సమయంలో సోనమ్ కనిపించకుండా తప్పించుకుంది. దీంతో ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి ఘాజీపూర్లోని ఒక ధాబాలో సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసుల విచారణలో ఈ కేసులోని పూర్వాపరాలన్నీ బయటపడ్డాయి. ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్ -
ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: రాజ్తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం -
గిరిజన విద్యార్థిని దారుణహత్య
అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాలనలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతోపాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురేనని గుర్తించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.హత్యగా ధ్రువీకరించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.నిందితులను కఠినంగా శిక్షించాలిగిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
తెలుగు నేతలే టార్గెట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఆదిలాబాద్ /చర్ల: వరుస ఘటనలు చూస్తుంటే... తెలుగు నేతలే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో గురు, శుక్రవారాల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం, శుక్రవారం తెలంగాణ కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. కాగా, ఆయన తెలంగాణ కమిటీతోపాటు స్పెషల్ జోనల్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. భాస్కర్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, తెలంగాణ నుంచి రూ.20 లక్షల రివార్డు ఉండగా, ఆయన మృతదేహం వద్ద ఏకే 47 తుపాకీ లభించింది. మూడో అంచెపై వలమావోయిస్టులను దెబ్బ తీసేందుకు పోలీసులు, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలుచేస్తున్నా యి. అగ్ర నేతలకు మూడంచెల భద్రత ఉంటుంది. ఇందులో తొలి అంచెలో అగ్రనేతతోపాటు అతని సపోర్టింగ్ స్టాఫ్, రెండు, మూడో అంచెలో ఇతర మావోలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది బస్తర్ వాసులే ఉంటున్నారు. అగ్రనేతలే టార్గె ట్గా దాడులు జరిగినప్పుడు ఎక్కువగా చనిపోయే వారిలో వీరే ఉంటున్నారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ‘తెలుగు నేతలను కాపాడేందుకు మీరు ఎందుకు చనిపోవాలి’అంటూ ప్రచార కార్యక్రమాన్ని వ్యూహత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నా రు.ఇది సత్ఫలితాలను ఇస్తోందని పోలీసులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు ఆయన రక్షణ టీమ్లో ముగ్గురు మావోలు లొంగిపోవడం తీవ్రనష్టానికి దారి తీసింది. అంతకు ముందు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను విష యంలో ప్రస్తుతం సుధా కర్, మైలారపు ఆడెళ్లు విష యంలోనూ ‘కోవర్ట్’ తర హా ఆపరేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరంపరలో నేటి తరం అగ్రనేత, బస్తర్ మూలవాసి, మోస్ట్వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మడావి హిడ్మా లేటెస్ట్ ఫొటోను సైతం భద్రతా దళాలు సంపాదించాయి. హిట్లిస్ట్లో తెలుగు నేతలుతెలంగాణ నుంచి మల్లోజుల వేణుగోపాల్ తి ప్పర్తి తిరుపతి. పాక హనుమంతు , కడారి సత్యనారాయణరెడ్డి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాశ్, రామన్న, పాపారావు, కంకణాల రాజిరెడ్డిలు మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్తో పాటు కొయ్యాడ సాంబయ్య, వెంకటేశ్ కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీరి కదలికపై కన్నేసిన భద్రతా దళాలు అనుకూల సమయం చూసి దాడి చేస్తున్నట్టు తెలు స్తోంది. ఇంద్రావతి నదీతీరంలో రెండో రోజైన శుక్రవారం కూడా మావోలు – పోలీసుల బలగాల నడుమ కాల్పులు కొనసాగాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు.మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి..మైలారపు ఆడెళ్లుది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర స్వస్థలం. బోథ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆడెళ్లు...1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరాడు. ఆ సమయంలో భూపోరాటాలు ఉధృతంగా సాగేవి. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.ఆ తర్వాత ఉద్యమం వైపు మళ్లి 1995లో నక్సల్స్లో చేరాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఇంద్రవెల్లి దళ డిప్యూటీ కమాండర్గా పనిచేసి, దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు.ఉద్యమంలో ఉన్న సమయంలోనే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామానికి చెందిన దళ సభ్యురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నారు. 2022 డిసెంబర్లో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు దండకారణ్యంలోనే ఉంటున్నారు. ఆయన సోదరులు మాత్రమే స్వగ్రామంలో ఉంటున్నారు. ఆడెళ్లు మరణ వార్తతో పొచ్చరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతని పెద్ద సోదరుడు పేరు కూడాఆడెళ్లు. మావోయిస్టు ఆడెళ్లు మృతిచెందిన వార్త తెలిసిన తర్వాత ఆయన తన ఇంటివైపు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆడెళ్లు మృతదేహాన్ని పొచ్చరకు తీసుకొస్తారా.. అందుకు సోదరులు సమ్మతిస్తారా అనేది చూడాల్సిందే. -
అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా
రఫా: గాజాలోని పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్తున్న వారే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది మూడు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఖాన్యూనిస్లోని నాస్సెర్ ఆస్పత్రికి తరలించారు.బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రులకు తరలిస్తుండగా చూశామని, కొందరు ఉత్త చేతులతోనే వెనుదిరిగి వస్తుండగా, నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ ఆహార పంపిణీ కేంద్రం వద్ద దారుణ పరిస్థితిని వివరించారు. కాగా, పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్కచేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. గాజాలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన మిలటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటుండగా..ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది, సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు విడిచారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ, చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్ మిలటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటుచేసుకున్నాయి. ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఈ ఆహారమే ఆధారం. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలపాటు కొనసాగించిన దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటాయి. -
బీహార్లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల
పట్నా: లైంగిక దుశ్చర్యలకు పాల్పడే నరరూప రాక్షసులపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్లో తొమ్మిదేళ్ల దళిత బాలిక(Dalit girl)పై అత్యాచారం జరిగింది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి బాధితురాలి గొంతు కోసి పారిపోయాడు. బాధిత బాలిక అర్థనగ్నంగా, రక్తసిక్తమైన స్థితిలో ఉండగా, ఆమె తల్లి గుర్తించింది. వెంటనే బాధితురాలని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తరువాత మెగురైన చికిత్స కోసం పట్నాకు తరలించారు.అయితే ఇక్కడ ఇంతకన్నా దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు చికిత్స కోసం పట్నా మెడికల్ కాలేజ్ వెలుపల ఆరు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలిక చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందడడం అందరిలోనూ తీవ్ర ఆవేదనను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రోహిత్ సాహ్ని బాధిత బాలికకు చిరుతిండి ఆశ చూపి ఆకర్షించాడు. తర్వాత నిందితుడు ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, గొంతు కోసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాధిత బాలిక తల్లి నిద్రపోతోంది. మెలకువ వచ్చాక ఆమె తన కుమార్తె కోసం వెదికింది. పొరుగింటి వారు సాహ్ని ఆమెను తీసుకువెళ్లాడని చెప్పారు.కొద్దిసేపటికి ఆమెకు కుమార్తె తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. వెంటనే బాధితురాలిని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ(Sri Krishna Medical College) ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం పట్నాలోని పీఎంసీహెచ్కు పంపారు. అయితే అక్కడ బెడ్ అందుబాటులో లేకపోవడంతో బాధితురాలు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని, చికిత్సలో జాప్యం కారణంగానే తమ అమ్మాయి చనిపోయిందని వారు చెబుతున్నారు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ వాదనను ఖండించారు.పిఎంసిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ అభిజిత్ సింగ్ మాట్లాడుతూ బాధిత బాలికకు సరైన వైద్య సహాయం అందించామని చెప్పారు. చికిత్సలో జాప్యం జరిగిందని చేస్తున్న వాదన నిరాధారమైనదన్నారు. బాధితురాలికి ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందించామని తెలిపారు. ఈ విషాద ఘటనపై బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులరాలికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బాధిత బాలిక ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే.. -
గుంతలో పడిన కారు.. ఐదుగురు మృతి
హర్దోయ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు నుండి తిరిగి వస్తున్న కారు లోతైన గుంతలో పడటంతో ఐదుగురు మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. మజ్హిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూప్ప పూర్వా మలుపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ఊరేగింపు నుండి తిరిగి వస్తున్న ఒక కారు అదుపు తప్పి, గుంతలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రమాదం దరిమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి.వెంటనే స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి, బాధితులను బయటకు తీసుకువచ్చారు. వారిని హుటాహుటిన షహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి వైద్యులు రోడ్డు ప్రమాద బాధితుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. Hardoi, Uttar Pradesh: EMO CHC Dr Zeeshan Khan says, "Thirteen people were brought to the hospital by ambulance. Among them, 5 are deceased and 8 are seriously injured..." pic.twitter.com/gWK2o3RsQn— IANS (@ians_india) May 31, 2025పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలిలోని పాటియానిం గ్రామానికి కొందరు వివాహ ఊరేగింపు(Wedding procession)లో పాల్గొనేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు భూప్ప పూర్వా మలుపు వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పి, లోతైన గుంతలో పడిపోయింది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం కారు అధిక వేగంతో ప్రయాణిస్తోంది. రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: శశి థరూర్ ఖండన.. పాక్ మరణాలపై కొలంబియా ప్రకటన ఉపసంహరణ -
ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. గాంధీ వంతెనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అత్యంత అనూహ్య రీతిలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై ఒక ఎస్యూవీ వాహనం డివైడర్ను ఢీకొంది. దీంతో అప్రమత్తమైన ఎస్యూవీలోని ఆరుగురు ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బీడ్ పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ కన్వత్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిలోని గాంధీ వంతెనపై ఒక ఎస్యూవీ డివైడర్ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డివైడర్ నుండి తమ వాహనాన్ని పక్కకు తప్పించేందుకు వారు ప్రయత్నిస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కన్వత్ తెలిపారు.ఇది కూడా చదవండి: Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక.. -
Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక..
1964.. మే 27.. భారతదేశం తన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru)ను కోల్పోయింది. నాడు ఆయన ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకున్న ప్రజాదరణ ఎంతటిదంటే.. ఆయన మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా పలు వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. నాడు భారత ప్రధాని నెహ్రూ మరణ వార్తను న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో రెండవ ప్రధాన వార్తగా ముద్రించింది.భారత తొలి ప్రధాని జవహర్లాల్ మరణించిన సమయానికి దేశానికి స్వాతంత్యం సిద్ధించి, కొన్నేళ్లే అయ్యింది. దీనికి తోడు 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓటమి పాలయ్యింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ ఈ లోకాన్ని వీడటం యావత్ దేశాన్ని ఆవేదనలోకి నెట్టివేసింది. చైనా(China) చేతిలో భారత్ ఓటమి దరిమిలా ప్రధాని నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు. ఈ యుద్ధంలో భారతదేశం ఓటమిని నెహ్రూ తట్టుకోలేకపోయారని అంటారు.1962, నవంబర్ 20న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చైనా నుంచి తమ సైనిక ఓటమిని అంగీకరించారు. వాలాంగ్, సిల్లా, బోమ్డిలా ప్రాంతాలలో భారత సైన్యం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా ఆయన పార్లమెంటులోనూ చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అప్పటి భారత రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్(President S. Radhakrishnan) కూడా సొంత ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం చైనాను తేలికగా నమ్ముతోందని, వాస్తవాలను విస్మరిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ ప్రశ్నలు ప్రధాని నెహ్రూను అమితంగా బాధించాయని చెబుతారు.ఈ విమర్శల దరిమిలా నాటి ప్రధాని నెహ్రూ అప్పటి యుద్ధంలో భారత ఓటమికి చైనా చేసిన ద్రోహమే కారణమని భావించారు. ఆ తరువాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో ఆయన ఒక ఏడాదిపాటు కశ్మీర్లో గడిపారు. 1964 మే నెలలో నెహ్రూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. మే 27న ఉదయం బాత్రూమ్ నుండి తన గదిలోనికి వస్తూ, స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే అక్కడి సిబ్బంది వైద్యులను పిలిపించారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు.ప్రముఖ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. నెహ్రూ శకాన్ని చూసిన కొద్దిమంది నేతలలో ఆయన ఒకరు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘పండిట్ నెహ్రూకు ఎటువంటి వ్యాధి లేదు. 1962లో చైనా.. భారతదేశంపై దాడి చేసింది. ఆయుధాల కొరత ఉన్నప్పటికీ మన సైన్యం ధైర్యాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ భారత్.. చైనా ముందు నిలువలేకపోయింది. దీంతో నెహ్రూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఆవేదనతోనే నెహ్రూ మృతి చెందారు’ అని అన్నారు.జవహర్లాల్ నెహ్రూ భద్రతా అధికారిగా పనిచేసిన కె.ఎం. రుస్తమ్జీ ‘ఐ వజ్ నెహ్రూ షాడో’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో తాను నెహ్రూ భద్రతా బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన వయస్సు 63 ఏళ్లని రాశారు. అయినా ఆయన 33 ఏళ్ల వ్యక్తిలా కనిపించేవారని పేర్కొన్నారు. నెహ్రూ ఎప్పుడూ లిఫ్ట్ ఉపయోగించలేదని, ఉత్సాహంగా మెట్లు ఎక్కేవారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి? -
‘అంతిమ’ రాగం.. భావోద్వేగం!
‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. ఆఖరి మజిలీలో చనిపోయిన వ్యక్తితో కుటుంబానికి, బంధుగణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు పాడడం ఇప్పుడు ఓరుగల్లులో ఆనవాయితీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళాకారుల రాగం.. భావోద్వేగాన్ని పలికిస్తోంది. అదే ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం! – సాక్షి, వరంగల్ఇన్ని రోజులు కలిసి ఉండి.. ఒక్కసారిగా కుటుంబంలో ఒకరు దూరమైతే కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. వారి జ్ఞాపకాలు వెంటాడతాయి. వారితో ఉన్న అనుబంధాలు మదిలో మెదులుతాయి. ఇన్నాళ్లూ అంతిమయాత్రలో డప్పుచప్పుళ్లు, అందుకు అనుగుణంగా స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు డప్పుకళాకారుల నోటి నుంచి వస్తున్న బంధాలను పెనవేసే పాటలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు బలగం సినిమాలో పాడిన పాట, డప్పు కళాకారుల ప్రదర్శన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఏళ్ల కిందటి సంప్రదాయం. ఇప్పుడు మరింత ట్రెండీగా మారింది. బలగం సినిమాకు ముందే...15 ఏళ్ల క్రితమే చెన్నారావుపేట మండలం పాపాయ్యపేట యాకన్న బృందం అంత్యక్రియల్లో పాటలు పాడడం ప్రారంభించింది. ఆతర్వాత నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన యాకాంబరం బృందం కూడా బంధుత్వ విలువలు తెలిసేలా పాటలు పాడడం మొదలు పెట్టింది. అయితే బలగం సినిమా విడుదలైన తర్వాత ఈ డప్పు కళా బృందాలకు ముఖ్యంగా పాటలు పాడే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరు మరణించినా.. అప్పటికప్పుడు వారి గుణగణాలు తెలుసుకుని పాటలు అల్లుతూ పాడుతూ కళాకారులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు.డప్పుచప్పుళ్లు.. పాటలు‘నేనెళ్లి పోతున్నా దూరం.. మన ఇల్లు, నీ పిల్లలు పదిలం.. మన బంధు బలగం పదిలం.. అని పైనుంచి తన ఆత్మ ద్వారా సుశీలవ్వ మనకు చెబుతున్నది’ అంటూ నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డప్పు కళా బృందం వరంగల్జిల్లా అనంతారంలో పాడిన పాట ఆఖరి మజిలీకి వచ్చినవారందరినీ కంటతడి పెట్టించింది. ఇలా డప్పు కళాకారులు, జానపదులు పాడుతున్న పాటలు బంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి.నా భర్త చనిపోయినప్పుడు ఇదే పాట పాడిన..దుగ్గొండి: నా భర్త పస్తం మొగి లి చనిపోయినప్పుడు సైతం పుట్టెడు దుఃఖంలో ఉన్న నేను పాటతో ఆయనకు కన్నీటి నివా ళి అర్పించాను. ఆయన నేర్పిన కళను ఆయన చివరి మజిలీకి చేరే వరకు వినిపించా.. నాతోటి కళాకారులు సైతం పాట పాడుతూ వచ్చారు. నేడు చావు సందర్భాల్లో పాటలు పాడే క్రమంలో చనిపోయిన వ్యక్తికి ఉన్న పేరు ప్రతిష్టలు, సేవా గుణం, బంధువులతో బంధుత్వం తెలుసుకుని కళాకారులు పాటతో కన్నీరు పెట్టిస్తున్నారు. – పస్తం కొంరమ్మ, బలగం ఫేమ్, దుగ్గొండిచాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మ నిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యావిులీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపుయాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండఆదరణ పెరిగింది..మాది చెన్నారావుపేట మండలం పాపయ్యపేట డప్పు కళా బృందం. 22మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని 14 ఏళ్ల క్రిత మే ఏర్పాటు చేసుకున్నాం. ఓవై పు డప్పుచప్పుళ్లతో పాటు ఇంకోవైపు పాటలు పా డుతున్నాం. అయినా అప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు.ఇటీవల చాలామంది మా పాటలను సో షల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో మాకు గిరా కీ పెరిగింది.ఇందుకు అనుగుణంగానే సరికొత్త చరణాలతో అప్పటికప్పుడు పాటలురాస్తూ.. పాడు తూ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం. – అబ్బదాసి యాకన్న,డప్పు కళాకారుడు -
హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్ హతం?
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన ప్రకటన చేశారు. హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్ను తమ సైన్యం చంపివుండవచ్చని పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు .. గాజాలో 20 మంది బందీలు బతికే ఉన్నారని, 38 మంది వరకూ మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు హామీ ఇచ్చారు.గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతున్నదని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తాము పదివేల మంది ఉగ్రవాదులను తదముట్టించామని, హమాస్ నేతలు డీఫ్, హనియే, యాహ్యా సిన్వార్, మొహమ్మద్ సిన్వార్ నాయకులను అంతమొందించామని నెతన్యాహు చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని యూకే, ఫ్రాన్స్, కెనడాలు తప్పుపట్టాయి. కాగా హమాస్పై సంపూర్ణ విజయం సాధించడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇది అనాగరికతపై నాగరికతా యుద్ధమని, దీనిలో పూర్తి విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ న్యాయపరమైన మార్గాల ద్వారా తనను తాను రక్షించుకుంటూనే ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి, 1,200 మంది అమాయకులను హత్య చేసి, 250 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించిన నేపధ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ -
ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి
అరిజోనా: అమెరికాకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ మూడేళ్ల కుమారుడు ట్రిగ్ కైసర్ తమ ఇంటి వెనుకవున్న స్విమ్మింగ్ పూల్లో స్పృహలేని స్థితిలో కనిపించాడు. ఈ ఘటన అరిజోనాలోని చాండ్లర్లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మే 12న సాయంత్రం ఏడు గంటల సమయంలో, చాండ్లర్ పోలీస్ విభాగానికి అష్లే డ్రైవ్లోని ఒక ఇంటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ కుమారుడు ట్రిగ్గా గుర్తించారు. వారు వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేశారు. అనంతరం బాలుడిని తొలుత చాండ్లర్ రీజినల్ హాస్పిటల్కు, ఆ తర్వాత ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత, మే 18 ట్రిగ్ మృతి చెందాడు. అనంతరం చాండ్లర్ పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు పూల్లో మునిగి ఎలా మృతిచెందాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 26 ఏళ్ల ఎమిలీ కైసర్ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. ఆమెకు 3.4 మిలియన్ టిక్టాక్ ఫాలోవర్స్, వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్త బ్రాడీ కైసర్. వీరి కుటుంబం అరిజోనాలోని చాండ్లర్లో 2024 నవంబర్ నుంచి ఉంటోంది.ఎమిలీ తన రోజువారీ జీవితం, భార్యగా, తల్లిగా తన అనుభవాలను, శుభ్రత, జీవనశైలి, బ్యూటీ టిప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఘటన తర్వాత, ఎమిలీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మానేయడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు ఆమెకు సానుభూతి సందేశాలు పంపుతున్నారు. కాగా అమెరికాలో పలువురు చిన్నారుల మరణానికి ఈత కొలనులు కారణంగా నిలుస్తున్నాయనిసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(డీసీసీ) తెలిపింది.ఇది కూడా చదవండి: హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి -
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా.. -
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ అధికారులు ప్రకటించారు.వాటికన్ సిటీ అధికారుల ప్రకటనతో దేశాదినేతలు పోప్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోప్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.‘పోప్ ఫ్రాన్సిస్ మరణం నాకు తీవ్ర బాధను కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసేందుకు కృషి చేశారు. పేదలు,అణగారిన వర్గాలకు సేవ చేశారు’అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో కొనియాడారు. Deeply pained by the passing of His Holiness Pope Francis. In this hour of grief and remembrance, my heartfelt condolences to the global Catholic community. Pope Francis will always be remembered as a beacon of compassion, humility and spiritual courage by millions across the… pic.twitter.com/QKod5yTXrB— Narendra Modi (@narendramodi) April 21, 2025 పోప్ ఆత్మకు శాంతి చేకూర్చుగాక : జేడీ వాన్స్భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా పోప్ ఫ్రాన్సిస్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త నాకు ఇప్పుడే తెలిసింది. కోవిడ్ తొలినాళ్లలో ఆయన ఇచ్చిన ప్రసంగం మరిచిపోలేనిది. నేను ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చుగాక అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. I just learned of the passing of Pope Francis. My heart goes out to the millions of Christians all over the world who loved him. I was happy to see him yesterday, though he was obviously very ill. But I’ll always remember him for the below homily he gave in the very early days…— JD Vance (@JDVance) April 21, 2025 వైట్ హౌస్ ట్వీట్ పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తపై అమెరికా శ్వేతసౌథం వర్గాలు అధికారికంగా స్పందించాయి. ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నాయి. Rest in Peace, Pope Francis. ✝️ pic.twitter.com/8CGwKaNnTh— The White House (@WhiteHouse) April 21, 2025 -
Ranga Reddy: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్
రంగారెడ్డి జిల్లా: మేనమామ పెళ్లి వేడుకలకోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాతపడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబు వివాహం ఈనెల 30న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా రాంబాబు అక్కాచెల్లెళ్లైన సీతారాంపూర్కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు. ఇంటికి రంగులు వేసే పనులు కొనసాగుతుండటంతో పిల్లలంతా కలసి బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ(5) ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు డోర్లు వేసుకోవడంతో అవి లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పిల్లలందరూ ఒకే చోట ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారివారి పనుల్లో మునిగిపోయారు. సుమారు రెండు గంటలు గడిచిన తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో అంతా వారికోసం వెతుకుతుండగా కారు డోర్లు తీసి చూశారు. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు పిల్లలు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి ఘటన దామరగిద్దతోపాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలచి వేశాయి.


