
హర్దోయ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు నుండి తిరిగి వస్తున్న కారు లోతైన గుంతలో పడటంతో ఐదుగురు మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. మజ్హిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూప్ప పూర్వా మలుపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ఊరేగింపు నుండి తిరిగి వస్తున్న ఒక కారు అదుపు తప్పి, గుంతలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రమాదం దరిమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి.
వెంటనే స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి, బాధితులను బయటకు తీసుకువచ్చారు. వారిని హుటాహుటిన షహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి వైద్యులు రోడ్డు ప్రమాద బాధితుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.
Hardoi, Uttar Pradesh: EMO CHC Dr Zeeshan Khan says, "Thirteen people were brought to the hospital by ambulance. Among them, 5 are deceased and 8 are seriously injured..." pic.twitter.com/gWK2o3RsQn
— IANS (@ians_india) May 31, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలిలోని పాటియానిం గ్రామానికి కొందరు వివాహ ఊరేగింపు(Wedding procession)లో పాల్గొనేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు భూప్ప పూర్వా మలుపు వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పి, లోతైన గుంతలో పడిపోయింది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం కారు అధిక వేగంతో ప్రయాణిస్తోంది. రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: శశి థరూర్ ఖండన.. పాక్ మరణాలపై కొలంబియా ప్రకటన ఉపసంహరణ