శశిథరూర్‌ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా | Colombia Withdraws Statement On Pakistan Deaths After Shashi Tharoor Disapproval, More Details Inside | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా

May 31 2025 8:44 AM | Updated on May 31 2025 1:17 PM

Colombia Withdraws Statement on PAK Deaths

న్యూఢిల్లీ: భారత్‌ మే 7న ‘ఆపరేషన్ సిందూర్‌’ను చేపట్టిన సమయంలో పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న మరణాలపై దక్షిణ అమెరికాలోని కొలంబియా సంతాపం ప్రకటించింది. అయితే దీనిపై ఎంపీ శశిథరూర్‌(MP Shashi Tharoor) కొలంబియాకు అవగాహన కల్పించడంతో, తాను గతంలో చేసిన ప్రకటనను ఆ దేశం ఉపసంహరించుకుంది. అలాగే ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న భారత్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కొలంబియా పర్యటనలో ఉన్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కొలంబియా(Colombia) ఇటీవల పాక్‌ మరణాలపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నదని, త్వరలోనే భారత్‌ వైఖరికి మద్దతు పలుకుతూ, మరో ప్రకటన చేయనున్నదని  తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్‌లోని మాజీ భారత రాయబారి, బీజేపీ నేత తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ తమ ప్రతినిధి బృందం  భారత్‌-పాక్‌ యుద్ధంపై సరైన వివరణ ఇవ్వడంతో,  అది కొలంబియా వైఖరిలో మార్పు వచ్చేందుకు సహాయపడిందని అన్నారు.

దీనిపై కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా యోలాండా విల్లావిసెన్సియో మాట్లాడుతూ తమకు భారత్‌- పాక్‌ల మధ్యనున్న వాస్తవ పరిస్థితులు తెలిశాయని, కశ్మీర్‌లో ఏమి జరిగిందనే దానిపై అవగాహన ఏర్పడిందన్నారు.  ఇకపై తాము స్పష్టమైన ప్రకటన చేయగలమన్నారు. కాగా ‘ఆపరేషన్‌ సింధూర్‌’ సమయంలో పాక్‌లో చోటుచేసుకున్న మరణాలపై కొలంబియా సంతాపం ప్రకటించడాన్ని ఎంపీ శశిథరూర్‌ ఖండించారు. 
 


ఇది కూడా చదవండి: అణు విపత్తును ఆపేశా: ట్రంప్‌ నోట అదే పాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement