జల విపత్తు మృతుల్లో రాష్ట్రమే టాప్‌! | AP State tops in water disaster deaths: 343 people died from April to July | Sakshi
Sakshi News home page

జల విపత్తు మృతుల్లో రాష్ట్రమే టాప్‌!

Aug 15 2025 5:53 AM | Updated on Aug 15 2025 5:53 AM

AP State tops in water disaster deaths: 343 people died from April to July

ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ 343 మంది మృతి

విపత్తు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్లే

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల వెల్లడి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌  దేశవ్యాప్తంగా జల వాతావరణ విపత్తుల్లో అత్యధిక మృతులు నమోదైన రాష్ట్రంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ కేవలం నాలుగు నెలల్లో రాష్ట్రంలో 343 మంది జల విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తేల్చిన ఈ నిజం– రాష్ట్ర విపత్తు నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.  కొన్ని ముఖ్యాంశాలు..

 ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం జల వాతావరణ విపత్తుల కారణంగా  1,626 మంది మృతి చెందారు. 
⇒  జలాశయాల దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది జలాశయాల్లో దిగి మృతి చెందుతున్నారు. 
⇒ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే  అప్రమత్తం చేయకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి.

⇒ మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (243), హిమాచల్‌ ప్రదేశ్‌ (195) నిలిచాయి.  
⇒ జల  విపత్తులు సంభవించిన రాష్ట్రాల్లో నష్టాలను అంచనా వేసిన తరువాత జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని గణాంకాల నివేదిక పేర్కొంది. 
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 15వ తేదీ నాటికి జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్ర వాటాగా 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement