వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి | Child dies due to medical negligence in Bandlaguda | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి

Feb 21 2026 5:48 PM | Updated on Feb 21 2026 6:49 PM

Child dies due to medical negligence in Bandlaguda

సాక్షి హైదరాబాద్: బండ్లగూడలో  విషాదం జరిగింది.  వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. దీంతో పాప తరపు బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో  ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో డాక్టర్ ఇంజెక్షన్ వేశారు. అయితే అది వికటించి ఆ పాప మృతి చెందింది.

దీంతో డాక్టర్ల నిర్లక్షంతోనే పాప మృతి చెందిందని తీవ్ర ఆగ్రహానికి గురైన పాప తరపు బంధువులు అక్కడి వైద్యులపై దాడి చేశారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement