రూ.2–3 కోట్ల ప్రాపర్టీ.. 15 రోజుల్లోనే.. | Homebuyers Closing Rs 2 3 Crore Deals in Record 15 Days Real Estate | Sakshi
Sakshi News home page

రూ.2–3 కోట్ల ప్రాపర్టీ.. 15 రోజుల్లోనే..

Feb 21 2026 3:49 PM | Updated on Feb 21 2026 4:47 PM

Homebuyers Closing Rs 2 3 Crore Deals in Record 15 Days Real Estate

ఇల్లు కొనుగోలు చేయాలంటే సవాలక్ష ఎంక్వైరీలు.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా చాలా మందికి ప్రత్యక్షంగా ఇల్లు చూపించి, ధర గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడం సహజం. కానీ, విలాసవంతమైన ఇంటిని కొందరు కస్టమర్లు చిటికేసినంత సులువుగా కొనుగోలు చేస్తున్నారు. రూ.2–3 కోట్ల ధర ఉన్న ఇళ్లు కొనేందుకు కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్, ఏఐ విశ్లేషణ వేదిక అస్త్ర రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 28 రోజుల సమయం తీసుకునే వారని తెలిపింది.             – సాక్షి, సిటీబ్యూరో  


ప్రాపర్టీ కొనేందుకు అన్వేషించే వారు వాస్తవ కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయం.. మొత్తం మార్కెట్‌ డిమాండ్, సెంటిమెంట్‌ను అంచనా వేసేందుకు కీలకమైన కొలమానం. బడ్జెట్‌ను అనుసరించి కస్టమర్లు నిర్ణయం తీసుకునే ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. ‘లీడ్‌ టు బై కన్వర్షన్‌’ డేస్‌లో తగ్గుదలకు ప్రధాన కారణం మెట్రో నగరాలలో పెద్ద టికెట్‌ సైజు ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటమే. 2025లో అమ్ముడైన అన్ని బడ్జెట్‌ గృహాల్లో రూ.2–3 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు లీడ్‌ టు బై కన్వర్షన్‌ సమయం అత్యల్పంగా ఉంది. 2024లో ఈ ఇళ్ల కొనుగోలు నిర్ణయానికి 28 రోజులు పట్టగా.. గతేడాది కేవలం 15 రోజుల్లోనే ముగించేశారు.

యువ కస్టమర్లకు నచ్చితే చాలు.. 
నేటి యువతరం ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్తున్నారు. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. మన దేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. అలాగే కొన్ని ఏళ్లుగా మార్కెట్‌లో బ్రాండెడ్‌ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ.1–2 కోట్ల ధర ఉన్న ప్రాపరీ్టలను కొనేందుకు 30 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న యూనిట్లకు 29 రోజులు పడుతుంది.

విక్రయానికి ఎన్ని రోజులంటే.. 
రూ.1–2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించేందుకు బ్రోకరేజ్‌ సంస్థలకు 2024లో 47 రోజులు పట్టింది. ఇవి 56 శాతం వేగంగా అమ్ముడయ్యాయి. ఇక, రూ.3 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే యూనిట్ల అమ్మకానికి 2024లో 17 రోజులు పట్టగా.. గత ఏడాదికి 27 రోజులకు పెరిగింది. అలాగే రూ.50 లక్షలలోపు ధర ఉన్న సరసమైన గృహాలకు గత ఏడాది 19 రోజులు పట్టగా.. అంతకుముందు ఏడాది ఏకంగా 28 రోజులు వేచి చూడాల్సి వచ్చింది.

ఇది చదివారా? సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement