రాజు పి.పుత్రన్ సరస్వతి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ
వ్యక్తిగత ఎదుగుదలే పరమావధిగా భావించే ప్రస్తుత పోటీ ప్రపంచంలో తోటివారి కష్టాన్ని చూసి చలించి, వారి జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో రాజు పి.పుత్రన్ ఒకరు. తన జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుని ‘సరస్వతి ఫౌండేషన్’ ద్వారా వేలాది మందికి ఆశాదీపంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
కష్టాల నుంచి కమ్యూనిటీ లీడర్షిప్
ఉడిపి జిల్లాలోని మంచల్ సమీపంలో షిర్వా గ్రామంలో జన్మించిన రాజు పి.పుత్రన్, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నలుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నవాడైన రాజు తన ప్రాథమిక విద్యను షిర్వాలోనే పూర్తి చేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముంబైకి వలస వెళ్లి అక్కడ మదర్ మేరీ నైట్ హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు విరామం ఇచ్చి అతిథ్య రంగంలో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణలో ఆయన పడిన కష్టం, నేర్చుకున్న పాఠాలే నేడు తనను ఒక సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.
సేవే లక్ష్యంగా..
తాను అనుభవించిన పేదరికం, కష్టం మరొకరు పడకూడదనే సంకల్పంతో 2012లో సరస్వతి ఫౌండేషన్ను స్థాపించారు. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ సంస్థ నేడు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తోంది. ‘సేవ అనేది కేవలం సహాయం కాదు, ఒక వ్యక్తిని గౌరవప్రదంగా బ్రతికేలా చేసే సాధనం’ అని రాజు పుత్రన్ చెబుతుంటారు.
ప్రభావశీల కార్యక్రమాలు
సరస్వతి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలోని వివిధ వర్గాలకు అండగా నిలుస్తున్నాయి.
విద్య - సాధికారత: ఓరియంట్ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యం కుదుర్చుకుని అర్హులైన విద్యార్థులకు ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూనే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యం, వెల్నెస్: కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాకుండా యోగా, ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య పునరావాస కేంద్రాలకు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఫౌండేషన్ అండగా ఉంటోంది.
ఆర్థిక స్వాలంబన: కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు.
సామాజిక బాధ్యత: వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల నిర్వహణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించడంలో ఈ సంస్థ ముందుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో కూడిన సామాజిక ఐక్యత కోసం కొన్ని ఆలయాల పునరుద్ధరణ వంటి పనుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
గమనిక: ఈ కథనం సరస్వతి ఫౌండేషన్ తరఫున సాక్షి.కామ్లో అందిస్తున్నాం.


