
మండి: హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
#WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi.
(Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi— ANI (@ANI) June 17, 2025
తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది?