
30 మంది మృతి, లక్ష మందికి పైగా తరలింపు
బీజింగ్: ఉత్తర చైనాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది మరణించారు. 130 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. భారీ వర్షాలు కురి సే అవకాశం ఉండటంతో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. దేశ రాజధాని వరదలతో అతలాకుతలమైంది.
రాజధానిలోనే 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మందిని ఖాళీ చేయవలసి రావడంతో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. బీజింగ్ సమీపంలోని షాంగ్జీ, హెబీ ప్రావిన్సులు కూడా కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. హెబీలోని బావోడింగ్ నగరంలో దాదాపు 20,000 మందిని వారి ఇళ్ల నుంచి తరలించారు. హువైరౌ జిల్లాలో వరదలతో ఒక వంతెనను కూపోయింది.
మియున్ జిల్లాలోని ప్రాంతాన్ని భా రీ వర్షం ముంచెత్తిన తరువాత, ఉబ్బిన కింగ్షుయ్ నది రహదారులు దెబ్బతిన్నాయి. బీజింగ్ అంతటా డజన్ల కొద్దీ రోడ్లు మూసివేయబడ్డాయి లేదా దెబ్బతిన్నాయి. మియున్ జిల్లాలో నది ఉప్పొంగుతోంది. షాంగ్జీ ప్రావిన్స్లోని లిన్ఫెన్ సిటీలోని జిక్సియన్ కౌంటీలో ఎల్లో రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకూ వరద కొనసాగింది.
కొండలన్నీ జలపాతాలు అయ్యాయి. కార్లు సెయిలింగ్ బోట్లను తలపి ంచాయి. దక్షిణ చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. హాంకాంగ్ ఈ సంవత్సరం మొదటిసారిగా అత్యధిక వర్షపు తుఫాను హెచ్చరికను జారీ చేసింది. బీజింగ్కు దక్షిణంగా, కో–మే తుఫాను సమీపిస్తుండటంతో జెజియాంగ్, జియాంగ్సు, అన్హుయ్ ప్రావిన్సుల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి.
పూర్తి స్థాయిలో సహాయక చర్యలు : జిన్పింగ్
వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. తప్పిపోయిన వారని వెదకడానికి, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల చైనాకు 54.11 బిలియన్ యువాన్లు (ఆరున్నర లక్షల కోట్లు ) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 90శాతానికి పైగా వరదల వల్లే కలిగాయని వెల్లడించింది.
🇨🇳中国の国営メディアによると、北京と近隣地域で大雨と洪水により30人以上が死亡し、数万人以上が首都から避難した。https://t.co/E1o1IachDH pic.twitter.com/GJxbcB8W5I
— カントリーママ (@0327tnumata) July 29, 2025
వరుస వరదలు..
బీజింగ్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొత్తేమీ కాదు. ఈ వేసవిలో చైనాలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నెల ప్రారంభంలో దేశంలోని తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీచగా, దేశంలోని నైరుతి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం, బీజింగ్ సమీపంలోని చెంగ్డే నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
ఈ నెల ప్రారంభంలో, టైఫూన్ విఫా తూర్పు చైనాను తాకినప్పుడు, షాన్డాంగ్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించారు. 10 మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో నైరుతి చైనాలోని యాన్ నగరంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. 2023లో భారీ వర్షాలు, వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. 18 మంది గల్లంతయ్యారు. జూలై 2012లో వరదలు 79 మందిని బలిగొన్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రమైన విపత్తు.