-
'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు. అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది. ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..? -
వరద మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్ వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. -
నదిలో చిక్కుకున్న బస్సు.. 40 మంది అందులోనే.. వీడియో వైరల్..
లక్నో: కొద్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది. #उत्तरप्रदेशः #बिजनौर के मंडावली में #कोटावाली नदी का जलस्तर बढ़ा, एक बस तेज बहाव में फंसी, बस में करीब 40 यात्री सवार, जेसीबी से सभी का रेस्क्यू किया गया#UttarPradesh #bus #river #Bijnor #NewsUpdate pic.twitter.com/ZVUghS0wYm — News of Rajasthan (@NewsRajasthani) July 22, 2023 జేసీబీ మిషన్లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #बिजनौर में कोटा वाली नदी के बीच तेज बहाव में फंसी नजीबाबाद से हरिद्वार जा रही बस नदी में बस फंसने के बाद बस में मौजूद सवारियों को जेसीबी के सहारे सकुशल बाहर निकाला गया.#Bijnor #bijnorviralvideo #bijnorbus #bus #kotariver #haridwar #bijnaur #viralvideo #ManipurVideo pic.twitter.com/lEetwrOuGQ — Shailendra Singh (@Shailendra97S) July 22, 2023 ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్పై కారు నడిపి.. -
భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది. Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU — Richa Pinto (@richapintoi) July 19, 2023 ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు -
పోస్టుమార్టం రోజునే ప్రభుత్వ సాయం
పి.గన్నవరం: గోదావరి వరదల్లో ప్రమాదవశాత్తు గల్లంతై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పోస్టుమార్టం పూర్తయిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ నెల 16న కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి పల్లిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు (48) ఏటిగట్టు నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నదిలో ఈదుకుంటూ వస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. 18వ తేదీన అదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ (68) శివాయలంకకు పడవపై గ్రామస్తులను తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయాడు. ఇతడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం అప్పనపల్లిలో వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలకు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. బాధితుల ఇళ్లకు మోకాలి లోతు వరద నీటిలో నడిచి వెళ్లి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రభుత్వం స్పందించిన తీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలినడకన 4 కిలోమీటర్లు నాతవరం (అనకాపల్లి జిల్లా): రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామానికి అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్శెట్టి బుధవారం కాలినడకన వెళ్లారు. కొండలు, గుట్టలు ఎక్కి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి నాతవరం మండలంలోని అసనగిరి గ్రామంలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని వీధులూ కలియతిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాటాకు గుడిసెల్లోకి కూడా వెళ్లి వారితో మాట్లాడారు. ఆ ఆదివాసీ గ్రామానికి వచ్చిన తొలి కలెక్టర్ కావడంతో గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సుందరకోట పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, సరుగుడు సచివాలయంలో వలంటీర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. ఇదీ చదవండి: సహాయం.. శరవేగం -
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం
డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్– పగల్నాలా, రిషికేష్– కేదార్నాథ్ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో పోటెత్తిన చాఫ్లాగద్ నది ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు, భవనాలు, షాపులు కుప్పకూలి నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్లోని రిసాయి జిల్లాలో ఓ పెద్ద బండరాయి విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ ల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పై నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 199కి చేరగా, కేవలం కేరళలోనే 83 మంది చనిపోయారు. అయితే, మలప్పురంలో ఇంకా 50 మంది వరకు జాడ తెలియని నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో 2.87 లక్షల మంది ఇంకా సహాయ కేంద్రాల్లోనే ఉన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 125 మందిని భారత వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో వరదల కారణంగా గత 6 రోజులుగా మూసివేసి ఉన్న ముంబై– బెంగళూరు హైవేపై సోమవారం వాహనాలకు పాక్షికంగా అనుమతి ఇచ్చారు. వర్షాలకు భారీగా ధ్వంసమైన తన నియోజకవర్గం వాయినాడ్(కేరళ)లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులను కోరారు. -
ఆగని వరదలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది. మరోవైపు సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలతో పాటు వాయుసేనను(ఐఏఎఫ్) హెలికాప్టర్లను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్డుమార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు అందజేస్తున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన హంపీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమిత్ షా ఏరియల్ సర్వే.. కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగాఆదివారం నాటికి కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప, ఇతర ముఖ్యనేతలతో కలిసి బెళగావి, బాగల్కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం షా స్పందిస్తూ..‘ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. వర్షాలు కొంచెం తెరిపినిచ్చినప్పటికీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు. తన నియోజకవర్గమైన వయనాడ్కు చేరుకున్న రాహుల్ గాంధీ ఓ పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ ప్రతినిధి జైవీర్ షేర్గిల్ మాట్లాడుతూ..‘వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్కు రూ.200 కోట్లు కేటాయించి, వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో కేరళకు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే రూ.3 వేల కోట్లు్లమాత్రమే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. సూపర్ పోలీస్.. సాక్షి, అమరావతి : గుజరాత్లో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు ఓ పోలీస్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మోర్బీ జిల్లా కల్యాణ్ పూర్ గ్రామంలోని పాఠశాలలో 43 మంది చిన్నారులు చదువుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉపాధ్యాయులు, పిల్లలు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ వరద ఉధృతికి బోట్లు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ పృథ్వీరాజ్ జడేజా ఇద్దరు బాలికల్ని భూజాలపై కూర్చోబెట్టుకుని నడుములోతులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
వరద విలయం
చెన్నై/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: వారం రోజులుగా కురుస్తున్న వానలతో దక్షిణాదిన కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఐదు రాష్ట్రాల్లో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కేరళలో అత్యధికంగా 57 మంది, కర్ణాటకలో 26 మంది చనిపోయారు. గుజరాత్లో భారీ వర్షాల కారణంగా 19 మంది, మహారాష్ట్రలో 12 మంది మృతి చెందారు. 11న కేరళలోని వయనాడ్లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. రెండు జిల్లాలపై తీవ్ర ప్రభావం భారీ వర్షాలతో కేరళలోని 8 జిల్లాలు ముఖ్యంగా వయనాడ్, కోజికోడ్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వర్షం సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు 57 మంది మృతి చెందారని యంత్రాంగం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సహాయక శిబిరాలకు తరలించిన 1.25 లక్షల మందిలో వయనాడ్, కోజికోడ్ జిల్లాల వారే 50 వేల మంది వరకు ఉన్నారు. మలప్పురం జిల్లా కవలప్పర వయనాడ్ జిల్లా పుత్తుమల కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం ఉధృతి కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్ జిల్లాలోని బనసురసాగర్ డ్యాం నిండటంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దేశంలో మొదటిది, ఆసియాలోనే రెండో పెద్దది ఎర్త్డ్యామ్ బనసురసాగర్. కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 23 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. వరదలో చిక్కుకున్న మాజీ ఎంపీ కుటుంబం కర్ణాటకలోనూ వానలు, వరద తీవ్రత కొనసాగుతోంది. వివిధ ఘటనల్లో రాష్ట్రంలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 2.35 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కేంద్ర మాజీ మంత్రి జనార్థన్ పుజారి నివాసం వరదల్లో చిక్కుకుంది. దీంతో అధికారులు ఆయనతోపాటు కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని అవలాంచిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన కుంభవృష్టితో కొండ, అటవీప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఇద్దరు శిశువులు సహా 11 మందిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.గుజరాత్లో వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి విజయ్ రుపానీ తెలిపారు. -
కేరళ వరదలు : 87కు చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం : కేరళలో వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. వరద బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్పోర్ట్ను శనివారం వరకూ మూసివేశారు. భారీ వర్షాలతో విమానాశ్రయం రన్వే, పార్కింగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. కేరళ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. ఈరోజు ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మరోసారి ఫోన్ చేశాను. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఆరా తీశాను. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు మరింత పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి తెలియజేశారు. వరద తాకిడి తీవ్రమవడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఇండియన్ ఆర్మీ, నేవీ 21 సహాయ, డైవింగ్ బృందాలను కేరళకు తరలించింది. వయనాడ్ జిల్లాలోనే జెమిని బోట్స్తో పలు ప్రాంతాల్లో ఐదు నౌకాదళ బృందాలు రంగంలోకి దిగాయి. వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సహాయ, పునరావాస శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. -
కేరళ వరదలు : 79కి చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. వరద బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్పోర్ట్ను శనివారం వరకూ మూసివేశారు. భారీ వర్షాలతో విమానాశ్రయం రన్వే, పార్కింగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహాన్ని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుండగా, లోతట్టు ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వివిధ జలాశయాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నాశనివారం వరకూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ముళ్లపెరియార్ డ్యామ్లో నీటి సామర్ధ్యం 140 అడుగులు దాటడంతో గేట్లను ఎత్తివేసిన క్రమంలో ఇడుక్కి జిల్లాపై అధికారులు దృష్టిసారించారు. పెరియార్ నదీ తీరంలో నివసించే వందలాది మందిని గేట్లు తెరిచే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం.. వరద తాకిడి తీవ్రమవడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు నేవీ 21 సహాయ, డైవింగ్ బృందాలను కేరళకు తరలించింది. వయనాడ్ జిల్లాలోనే జెమిని బోట్స్తో పలు ప్రాంతాల్లో ఐదు నౌకాదళ బృందాలు రంగంలోకి దిగాయి. వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సహాయ, పునరావాస శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎర్నాకుళం జిల్లాలో ఏడు టీంలు వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. పెరంబదూర్లో నీటి ప్రవాహంలో చిక్కుకున్న 45 మందిని రెస్య్యూ టీం కాపాడింది. పెరియార్ నది పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు సాయం చేసేందుకు పలు బృందాలను ఆ ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. కొచ్చి మెట్రో సేవలు రద్దు వరద తీవ్రతతో మధ్య కేరళలో ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలింది. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే, కొచ్చి మెట్రో గురువారం తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. అంగమలై, అలువా మధ్య నెంబర్ 176 బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరగడంతో ఈ బ్రిడ్జిపై రైలు సేవలను నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి వెల్లడించారు. ఇక కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్) సైతం అలువా సమీపంలోని మటం వద్ద తమ యార్డు నీట మునగడంతో మెట్రో సర్వీసులు రద్దు చేశామని అధికారులు తెలిపారు. కేంద్ర సాయంపై ప్రధాని హామీ పోటెత్తిన వరదతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. వరద పరిస్థితిపై గురువారం కేరళ సీఎం పినరయి విజయన్తో మోదీ చర్చించారు. రాష్ట్రంలో వరదలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజల వెన్నంటి ఉంటామని, రాష్ట్రానికి అవసరమైన ఎలాంటి సాయం అందించేందుకైనా కేంద్రం సిద్దంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్ భారీ వర్షాలతో ఎర్నాకుళం జిల్లాలో అన్ని విద్యాసంస్థలను నేడు, రేపు ( 16, 17 తేదీల్లో) మూసివేశారు. ఇతర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థల తలుపులు తెరుచుకునే పరిస్థితి లేదని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు నీట మునిగాయని చెప్పారు. -
ఏడు రాష్ట్రాల్లో వరదలకు 774 మంది మృతి
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించి దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 774 మంది చనిపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా కేరళలో అత్యధికంగా 187 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్లో 171 మంది, పశ్చిమబెంగాల్లో 170 మంది, మహారాష్ట్రలో 139 మంది దుర్మరణం చెందారని వెల్లడించింది. అలాగే గుజరాత్లో 52 మంది, అస్సాంలో 45 మంది, నాగాలాండ్లో 8 మంది చనిపోయారంది. హోంశాఖకు చెందిన నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఎన్ఈఆర్సీ) గణాంకాల ప్రకారం వరదల కారణంగా కేరళలో 22 మంది, పశ్చిమబెంగాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. -
కేరళలో భారీ వర్షాలు
-
కేరళలో భారీ వర్షాలు..
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని 24 డ్యాముల గేట్లను అధికారులు ఎత్తివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తతను ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇడుక్కి జిల్లాలో 11 మంది, మలప్పురంలో ఆరుగురు, వాయనాడ్లో ముగ్గురు, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్లో ఇద్దరు చొప్పున ప్రజలు చనిపోయారు. ఇడుక్కి జిల్లాలో కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు, పోలీసులు రక్షించగలిగారు. పలు ప్రాంతాల్లో వరద దెబ్బకు రోడ్లు దెబ్బతినడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆర్చ్(వంపుగా ఉన్న) డ్యాముగా పేరుగాంచిన చెరుతోని డ్యామ్లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. దీని సామర్థ్యం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి నీటిమట్టం ఏకంగా 2,399.58 అడుగులకు చేరుకుంది. వర్షాలు, వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం జిల్లాల్లో సహాయక చర్యల కోసం అప్పటికే ఆర్మీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించారు. వరదలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ, కేరళ చరిత్రలో తొలిసారి 24 డ్యాముల గేట్లను ఒకేసారి ఎత్తాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 10,000 మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సెక్రటేరియట్లో 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వే పైకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో.. విమానాల ల్యాండింగ్ను అధికారులు రెండు గంటలపాటు నిలిపివేశారు. -
యూపీలో వర్షాలకు 58 మంది బలి
లక్నో: భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లో శనివారం ఒక్కరోజే 31 మంది మృతిచెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 58 మందికి పెరిగింది. సహరాన్పూర్లో 11 మంది, మీరట్లో 10 మంది మరణించారు. మీరట్లో 23 సెం.మీల వర్షపాతం నమోదైంది. శారద, గాగ్రా నదులు ప్రమాదకర స్థాయిల్లో ప్రవహిస్తున్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్ తెలిపింది. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, అందులో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఇద్దరు యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయారు. వందల్లో వరద మృతులు.. ప్రస్తుత రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఆరు రాష్ట్రాల్లో 537 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ అత్యవసర ప్రతిస్పందనా కేంద్రం(ఎన్ఈఆర్సీ) తెలిపింది. మహారాష్ట్రలో గరిష్టంగా 139 మంది మృతిచెందగా, కేరళలో 126 మంది, పశ్చిమ బెంగాల్లో 116 మంది, ఉత్తరప్రదేశ్లో 70 మంది, గుజరాత్లో 52 మంది, అసోంలో 34 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 26 జిల్లాలు, పశ్చిమబెంగాల్లో 22 జిల్లాలు, అసోంలో 21 జిల్లాలు, కేరళలో 14 జిల్లాలు, గుజరాత్లో 10 జిల్లాలు వరదలకు గురయ్యాయి. అసోంలో సుమారు 2.17 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. యమున వరదలపై అత్యవసర భేటీ యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించారు. హాత్ని కుంద్ బ్రిడ్జ్ నుంచి హరియాణా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఆదివారం ఆ నీరు ఢిల్లీకి చేరుకునే అవకాశాలున్నాయి. -
కన్నీటి ధారల మధ్య ఖననం
కంగ్టి: తడ్కల్ తల్లడిల్లింది. వరద మృతులకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం పిల్లివాగులో తల్లితో సహా ఐదుగురు చిన్నారులు జల సమాధి అయిన విషయం విదితమే. శనివారం రాత్రి మృతులకు బాన్సువాడలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి ఆదివారం ఉదయం శవాలను స్వగ్రామమైన తడ్కల్కు తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన జంగం రాజు కుటుంబాన్ని విద్యుత్ శాఖ డిప్యూటీ ఈ ఈ శ్రీనివాస్రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఖన నం నిమిత్తం రూ. 5వేలు అందజేశారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్ఐ నానునాయక్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. పిల్లల శవాలను చేతులపైనే మోసి.. ఐదుగురు పిల్లలు ఏడేళ్లలోపు వయస్సు వారే కావడంతో బంధువులు ఖననం నిర్వహించే స్థలానికి చేతులపైనే అంతిమయాత్ర నిర్వహించారు. వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఒకే గోతిలో ఆరుగురి ఖననం పిల్లలు ప్రియా(7), జ్యోతి(6), జ్ఞాన హంసిక(3), జ్ఞాన సమిత(3)(కవలలు), దీంపాంక్ష(13 నెలలు)తో పాటు తల్లి జంగం రాజమణిని ఒకే గోతిలో ఉంచి ఖననం చేశారు. కాగా, రాజమణితో పాటు ఐదుగురు చిన్నారుల మృ తదేహాలను ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఆయన వచ్చి చూశారు. ఇంత కష్టం ఎవరికీ రావద్దని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement