నేపాల్‌లో వరద బీభత్సం.. 28 మంది మృతి | Flood disaster in Nepal 28 people dead | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో వరద బీభత్సం.. 28 మంది మృతి

Oct 5 2025 1:43 PM | Updated on Oct 5 2025 1:57 PM

Flood disaster in Nepal 28 people dead

ఖాట్మండు: నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖాట్మండులో భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బాగ్మతి నది ఒడ్డు సమీపాన ఉన్న ప్రజలు ముప్పు బారిన పడ్డారు. వారిని నేపాల్ ఆర్మీ  సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గడచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి . విపత్తు ప్రమాదాల్లో 28 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు.

 


భారతదేశానికి తూర్పున సరిహద్దులో ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 18  మంది మరణించారని పోలీసు ప్రతినిధి బినోద్ ఘిమిరే తెలిపారు. దక్షిణ నేపాల్‌లో పిడుగుపాటుకు ముగ్గురు మరణించగా, ఉదయపూర్ జిల్లాలో వరదలకు ఒకరు మృతిచెందారని ఆయన తెలిపారు. వరదల కారణంగా 11 మంది కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధి శాంతి మహత్ మీడియాకు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement