
పట్నా: లైంగిక దుశ్చర్యలకు పాల్పడే నరరూప రాక్షసులపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్లో తొమ్మిదేళ్ల దళిత బాలిక(Dalit girl)పై అత్యాచారం జరిగింది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి బాధితురాలి గొంతు కోసి పారిపోయాడు. బాధిత బాలిక అర్థనగ్నంగా, రక్తసిక్తమైన స్థితిలో ఉండగా, ఆమె తల్లి గుర్తించింది. వెంటనే బాధితురాలని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తరువాత మెగురైన చికిత్స కోసం పట్నాకు తరలించారు.
అయితే ఇక్కడ ఇంతకన్నా దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు చికిత్స కోసం పట్నా మెడికల్ కాలేజ్ వెలుపల ఆరు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలిక చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందడడం అందరిలోనూ తీవ్ర ఆవేదనను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రోహిత్ సాహ్ని బాధిత బాలికకు చిరుతిండి ఆశ చూపి ఆకర్షించాడు. తర్వాత నిందితుడు ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, గొంతు కోసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాధిత బాలిక తల్లి నిద్రపోతోంది. మెలకువ వచ్చాక ఆమె తన కుమార్తె కోసం వెదికింది. పొరుగింటి వారు సాహ్ని ఆమెను తీసుకువెళ్లాడని చెప్పారు.
కొద్దిసేపటికి ఆమెకు కుమార్తె తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. వెంటనే బాధితురాలిని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ(Sri Krishna Medical College) ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం పట్నాలోని పీఎంసీహెచ్కు పంపారు. అయితే అక్కడ బెడ్ అందుబాటులో లేకపోవడంతో బాధితురాలు ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని, చికిత్సలో జాప్యం కారణంగానే తమ అమ్మాయి చనిపోయిందని వారు చెబుతున్నారు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ వాదనను ఖండించారు.
పిఎంసిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ అభిజిత్ సింగ్ మాట్లాడుతూ బాధిత బాలికకు సరైన వైద్య సహాయం అందించామని చెప్పారు. చికిత్సలో జాప్యం జరిగిందని చేస్తున్న వాదన నిరాధారమైనదన్నారు. బాధితురాలికి ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందించామని తెలిపారు. ఈ విషాద ఘటనపై బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులరాలికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బాధిత బాలిక ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..