breaking news
Bihar
-
Bihar: 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం
-
బిహార్లో మళ్లీ ఆ కుర్చీ కోసం ఫైట్!
బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రిత్వ శాఖ పంపకాల గురించి ప్రధాన పార్టీలు.. మిత్రపక్షాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ కుర్చీ కోసం జేడీయూ, బీజేపీలు బెట్టు వీడడం లేదని అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్ పోస్టు కోసం బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో నితీశ్ కుమార్ నేరుగా చర్చలు జరపనున్నారు. ఇందులో మంత్రుల పోర్ట్పోలియోల కంటే ప్రధాన అజెండాగా స్పీకర్ అంశం ఉన్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ కుర్చీని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం.ఇంతకు ముందు కూడా బిహార్ స్పీకర్ పోస్టు కోసం ఇరు పార్టీలు పట్టుబట్టాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించడం.. జేడీయూకి సీఎం పోస్టు అప్పగించడం నేపథ్యంతో బీజేపీకే ఆ అవకాశం దక్కింది. గత ప్రభుత్వంలో బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ స్పీకర్గా, జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. దీంతో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని జేడీయూ కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలో అత్యధిక సీట్లు సాధించిన దరిమిలా బీజేపీ అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. బిహార్ బీజేపీ కీలక నేతలంతా పట్నాలోని కార్యాలయంలో అర్ధరాత్రి దాటాక కూడా మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పోస్టుతో పాటు కీలక శాఖలను వదులుకోకూడదని అధిష్టానానికి నివేదించాలని నిర్ణయించాయి. మరోవైపు.. జేడీయూ నేతలు సంజయ్ కుమార్ ఝా, లలన్ సింగ్లు ఇవాళ ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. నితీశ్తో కలిసి కమలం పెద్దలతో జరగబోయే మీటింగ్లో పాల్గొననున్నారు. తద్వారా బీజేపీ అధిష్టానంపై స్పీకర్ పోస్టు కోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గ కూర్పు బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించింది. ఈ నేపథ్యంతో ఆయన ఇవాళ పట్నాకు వెళ్లనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహలతో చర్చలు జరపబోతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ మూడు మిత్రపక్షాలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపు(నవంబర్ 19న) బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఎన్డీయే సమావేశంలో తమ శాసనసభా పక్ష నేతను అధికారికంగా ప్రకటిస్తాయి. ఎల్లుండి పట్నాలోని గాంధీ మైదాన్లో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారంతో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. -
నేనున్నా.. చూసుకుంటా: లాలూ ప్రసాద్ యాదవ్
పట్నా: తమ కుటుంబ సమస్యల్లో అతిగా జోక్యం చేసుకోవడం అనవసరపు చర్యగా అభివర్ణించారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్,. తమ కుటుంబ సమస్యలపై దృష్టి ఆపి ఎవరి పని వారి చేసుకుంటే మంచిదని హితవు పలికారు,. ప్రధానంగా పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ.. లాలూ ఫ్యామిలీ సమస్యలను పార్టీ వరకూ తీసుకెళ్లడం తగదన్నారు. అంతర్గత కలహాలపై కాకుండా, పార్టీ ఐక్యత , పార్టీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కోరారు.ఇక్కడ పార్టీ అనేది ప్రధానంగా కాబట్టి కార్యకర్తలు ఆ వ్యవహారాలపై దృష్టి నిలపాలన్నారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టడంపైనే కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ‘ ఇది మా కుటుంబ సమస్య. ఆ సమస్యలను నేను డీల్ చేసుకుంటా. నేను ఉన్నా.. అంతా చూసుకుంటా’ అని స్పష్టం చేశారు.పాట్నాలో జరిగిన పార్టీ శాసనసభ్యులసమావేశంలో తేజస్వి యాదవ్ను ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు.లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది.ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ శ్రేణులు కూడా లాలూ ప్రసాద్ కుటుంబం చీలికపై తీవ్ర దృష్టి నిలిపాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు లాలూ తనదైన శైలిలో దిశా నిర్దేశం చేస్తూ ..అంత సెట్ అవుతుందని, తమ కుటుంబ రచ్చ వ్యవహారంలోకి పోకుండా పార్టీని మెరుగుపరచడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
డర్టీ కిడ్నీ ఆరోపణలు : ఆర్జేడీ నేత రోహిణి ఆచార భర్త ఎవరో తెలుసా?
పట్నా:ఒకపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఇపుడు మరోసారి సంచలనంగా మారారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఇలా వెలువడ్డాయో లేదో, తన కుటుంబంతో సంబంధాలను తెంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు లాలూ కుటుంబంపై ఆర్జేడీ నేత రోహిణీ ఆచార్య పలు ఆరోపణలు చేశారు. మరోవైపు టికెట్ కోసం ‘డర్టీ కిడ్నీ’రాజకీయాలు అంటూ కుటుంబసభ్యులు ఆమెపై మండిపడ్డారు. అసలే ఓటమి భారంతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు రచ్చకెక్కడం ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది.దీనిపై స్పందించిన రోహిణి తన భర్త, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం కంటే కిడ్నీ దానం చేసి తండ్రిని కాపాడుకోవడం మీదనే దృష్టిపెట్టడం తన పాపమైపోయిందని సోషల్ మీడియా పోస్ట్లో వాపోయింది. ఎవరూ తన లాంటి తప్పు చేయకూడదని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు రోహిణి కుటుంబం ఏమిటి, భర్త ఎవరనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రోహిణి ఆచార్య భర్త ఎవరు?రోహిణి భర్త సమరేష్ సింగ్, కుమార్తె అనన్య ,ఇద్దరు కుమారులు ఆదిత్య , అరిహంత్లతో కలిసి సింగపూర్ నివసిస్తుంది. 2002లో సమరేష్ సింగ్తో రోహిణి వివాహం జరిగింది. ముంబైలో ఒకప్పుడు సీనియర్ ఆదాయపు పన్ను అధికారిగా పనిచేసిన దివంగత రణవిజయ్ సింగ్ కుమారుడే సమరేష్. పెళ్లి తరువాత రోహిణి, సమరేష్ జంట మొదట అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. సమరేష్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో బిఎ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ ,INSEAD (ఇన్స్టిట్యూట్ యూరోపీన్ డి'అడ్మినిస్ట్రేషన్ డెస్ అఫైర్స్)బిజినెస్ స్కూల్లో ఎంబీఏ (ఫైనాన్స్) చేశారు. ప్రస్తుతం, సమరేష్ సింగపూర్లోని ఎవర్కోర్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్,మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన గతంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు.(ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!)కాగా మరోవైపు రోహిణికి బీజేపీ అండగా నిలవడం విశేషం. కుమార్తె నుంచి కిడ్నీ స్వీకరించి బతికి బట్ట కట్టిన లాలూ, కొడుకు తేజస్వికి అనుకూలంగా వ్యవహరించారంటూ తన విమర్శలను ఆర్జేడీపై ఎక్కుపెట్టింది. పార్టీలోని అరాచకమే కుటుంబంలో కూడా కనిపిస్తోందని బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హా కూడా యాదవ్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తమ సొంత కుటుంబాన్నే ఐక్యంగా ఉంచుకోలేని వారు, ఇక రాష్ట్రాన్నేం పాలిస్తారంటూ ఎద్దేవా చేశారు. -
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
ఆర్జేడీ ఫ్యామిలీలో విస్తృత చీలిక..!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు. లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది. ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు బిహార్లో ప్రధాన రాజకీయ కేంద్రంగా వెలిగిన లాలూ ఇల్లు.. ఇప్పుడు బోసిపోయింది. ప్రస్తుతం లాలూ వెంట పెద్ద కూతురు మీసా భారతి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది,. లాలూ-రబ్రీదేవిల సంతానంలోమీసా భారతి పెద్ద కుమార్త కాగా, రోహిణి, చంద్ర, రాగిణి యాదవ్, హేమా యాదవ్, అనుష్కా రావు(ధన్ను), రాజ్యలక్ష్మీలు మిగతా కుమార్తెలు. కాగా, తేజ్ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్లు కుమారులు. వీరిద్దరూ బిహార్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఇందులో తేజస్వి యాదవ్ ఆర్జేడీలోనే కొనసాగుతుండగా, తేజ్ప్రతాప్ యాదవ్ మాత్రం జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి వేరి కుంపటి పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. -
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
పాట్నా: గోరుచుట్టుపై రోకటి పోటులా అన్న చందంగా తయారైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాభవంతో సతమతమవుతున్న లాలూకు ఇప్పుడు కుటుంబ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. అసభ్యకరంగా తిట్టారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడను. నన్ను అనాథను చేశారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తరువాత ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ (ఆర్జేడీ) ఇలా ఎందుకు ఓడిపోయింది? అని. ఈ పరాజయానికి కారణం ఎవరు? కానీ మీరు సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు తీస్తే చాలు.. వెంటనే ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. అవమానిస్తారు, దుర్భాషలాడతారు. నన్ను కూడా అలాగే చేశారు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు. నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ అడగండి. వాళ్లందరూ ఒక్కటై.. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు’ అని సింగపూర్ వెళుతూ పాట్నా ఎయిర్పోర్టులో మీడియా ఎదుట వాపోయారు. కుటంబంలో కిడ్నీ చిచ్చు 2022లో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రోహిణీ ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణీ వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే ఆరోపణలు,పుకార్లు లాలూ కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై రోహిణీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న నా వాళ్లే నాపై దూర్భషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతి ఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్ను తీసుకున్నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను,పిల్లల్ని,నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవడానికి కిడ్నీ ఇచ్చాను. అలలాంటి ఇప్పుడు వాళ్లకు నేను చెడ్డదాన్నయ్యాను’ అని ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. కాగా లాలూ కుటుంబంలో తాజాగా పరిణామాలు బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రోహిణి ఆచార్య ఆరోపణలు, ఆమె కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిపి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. রোহিনী আচার্যকে ত্যাজ্য করার অভিযোগ যাদব পরিবারের বিরুদ্ধে | Rohini Acharya#rjd #rjdnews #biharelection2025 #biharelectionresults #biharnews #laluprasadyadav #tejashwiyadav #eisamay #eisamayonline pic.twitter.com/fvSRBJsjU6— Ei Samay (@Ei_Samay) November 16, 2025 -
ఐపీఎస్ను వీడి ఎమ్మెల్యేగా.. బిహార్ లో సూపర్ విక్టరీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్, బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆనంద్ మిశ్రా నేపథ్యం1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు. -
ప్రజాధనం దుర్వినియోగం
పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్ 21వ తేదీ నుంచి పోలింగ్ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్సురాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. -
బిహార్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏ రోజంటే?
బిహార్ లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 19 లేదా 20 తేదీలలో కొలువుదీరే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి మోదీ షెడ్యూల్ అనుగుణంగా తేదీని నిర్ణయించనున్నారు. ఇటీవలే వచ్చిన బిహార్ 18వ అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ కు సమర్పించనుంది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మెుదలుకానుంది.బిహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పనులు శరవేగంగా సాగనున్నాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గవర్నర్ కు ఫలితాల నివేదికను అందించనుంది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరగనుంది. అనంతరంనితీష్ తన రాజీనామాను గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. తరువాత ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బిహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక కానుంది. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఆర్జేడీలో ట్విస్ట్.. రమీజ్ ఎవరంటే?
పాట్నా: బిహార్లో ఆర్జేడీ ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్బంగా ‘నేను రాజకీయాలను వదిలేస్తున్నా. నా కుటుంబానికి దూరంగా జరుగుతున్నా. ఈ పని చేయాలని నాకు సంజయ్ యాదవ్, రమీజ్ సూచించారు. నిందలన్నీ నేనే భరిస్తా’ అని శనివారం ఎక్స్లో ఆమె పేర్కొన్నారు.రమీజ్ ఎవరు? ఈ నేపథ్యంలో సంజయ్ యాదవ్, రమీజ్పై కొత్త చర్చ మొదలైంది. కాగా, రమీజ్ ఆలం ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కు చెందిన వ్యక్తి. జార్ఖండ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని గురించి రాజకీయ వర్గాలలో చాలా తక్కువగా తెలుసు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్కు రమీజ్ సన్నిహితుడు. అయితే, రమీజ్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్స్టర్ అనే మార్క్ అతడిపై ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. అతని మామ ఉత్తరప్రదేశ్లోని అగ్ర నేరస్థుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. రమీజ్ ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే వారిద్దరూ రోహిణికి ఏం సూచించారనేది స్పష్టంగా తెలియడం లేదు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.తేజ్ ప్రతాప్ ఎఫెక్ట్.. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. తన భర్త, పిల్లలతో సింగపూర్లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతి జోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. -
25 మంది మంత్రుల్లో ఓడింది ఆ ఒక్కరే..!
పట్నా: బిహార్లో ఎన్డీయే బంపర్ మెజారిటీ సాధించింది. సీఎం నితీశ్ కేబినెట్లో ఒకే ఒక్కరు తప్ప మొత్తం 25 మంది మంత్రులు విజయతీరాలకు చేరారు. డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా గెలిచారు. బీజేపికి చెందిన మొత్తం 15 మంది గెలిచారు. వీరిలో వ్యవసాయ మంత్రి ప్రేమ్ కుమార్ వరుసగా 8వ సారి గెలిచారు. మరి ఓడిందెవరు? సుమిత్ కుమార్ సింగ్. ఈయన 2020లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈసారి జేడీయూ టికెట్పై జముయి జిల్లా చకాయ్ స్థానంలో పోటీ చేసి, ఓడిపోయారు. సుమారు 13 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన సావిత్రీ దేవి చేతిలో పరాజయం చవిచూశారు. ఐదేళ్ల క్రితం సుమిత్ ఈమెనే ఓడించారు. దివంగత మాజీ మంత్రి, సీఎం నితీశ్ సన్నిహితుడైన నరేంద్ర సింగ్ కుమారుడే సుమిత్. మొన్నమొన్నటి వరకు సైన్స్, టెక్నాలజీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. -
అంకగణితం ప్లస్ అనైతికత!
ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. భారత జాతీయ బడా మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా! శరభ నాట్యాన్ని ప్రదర్శించాయి. అసోయ్ దూలాకు అసలు తగ్గలేదు. మొత్తం 243 స్థానాలున్న సభలో 202 స్థానాలను కైవసం చేసు కోవడమంటే మాటలు కాదు.ఈ అంక గణితంలో ఇంకో పార్శా్వన్ని కూడా గమనించాలి. ప్రతిపక్ష కూటమికి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్న ఆర్జేడీ పార్టీకి 23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకున్నది. ఈసారి పెద్దగా తగ్గిందేమీ లేదు. బీజేపీకి ఇప్పుడు 20 శాతం ఓట్లు పడ్డాయి. ఐదేళ్ల కింద కూడా అంతే! 19.8 శాతం ఓట్లను సాధించింది. గణనీయమైన పెరుగుదలేమీ కాదు. జేడీ (యు)కు అప్పుడు 16 శాతం, తాజాగా 19 శాతం ఓట్లు లభించాయి. మూడు శాతం పెరుగుదల! మహాగuЇబంధన్ (ఎంజీబీ) కూటమికి వైస్ క్యాప్టెన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ కూడా కూటమికి గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న తొమ్మిది శాతం ఓట్లను దాదాపుగా కాపాడుకోగలిగింది.ఒక కూటమిగా ఎంజీబీకి 2020లో 37.23 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో అదే కూటమి సాధించిన ఓట్లు 37.5 శాతం. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్య క్రమం తర్వాత గతంతో పోలిస్తే బిహార్ ఓటర్ల సంఖ్య నికరంగా 47 లక్షలు తగ్గింది. అయినా ఎంజీబీ ఓట్లు తగ్గలేదు. కానీ, సీట్ల లెక్కల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవలసివచ్చింది. ఈ రకమైన ఫలితాల లోగుట్టు పెరిగిన పోలింగ్ శాతంలో ఉన్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తొమ్మిది శాతం పైచిలుకు ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఈసారి ఎన్ని కల్లో తొమ్మిది శాతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పురుష ఓటర్ల కంటే తొమ్మిది శాతం అధికంగా మహిళలు ఈసారి ఓటేశారు. గత ఎన్నికల్లో 37.26 శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి తొమ్మిది శాతం అదనంగా 46.7 శాతం ఓట్లను సంపాదించింది. సాధారణంగా పురుషులు, స్త్రీల పోలింగ్ శాతాల్లో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ తేడాలుండవు. కానీ బిహార్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉండటం ఒక విశేషం. అంతేకాదు. ఎన్డీఏ కూటమి ఓట్ల పెరుగు దల కూడా ఇంతే స్థాయిలో ఉండటం మరో విశేషం. ఇక్కడొక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందట నితీశ్ కుమార్ ప్రభుత్వం ‘మహిళా రోజ్గార్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఏటా పదివేల రూపాయలుఅందజేస్తారు. కేవలం ప్రకటించడమే కాదు. దాదాపు కోటి యాభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ బదిలీ కార్యక్రమం షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగిందని ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది.ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను ఈ సంద ర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకాన్ని అప్పటికి నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడదల చేసిన 4 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతా లకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధులను విడుదల చేశారు. ఈ రెండు ఉదంతాలు ఎన్నికల సంఘం ‘నిష్పాక్షికత’కు నిలువెత్తు అద్దాల నుకోవాలి. మహిళల ఓట్లను ఇలా టోకున కొనుగోలు చేయడంతోపాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్ చేసుకున్నది. ఛట్ పూజ అనేది ఉత్తరాదిన మరీ ముఖ్యంగా బిహార్లో మహిళలు చేసుకునే పూజా కార్యక్రమం. తమ భర్తల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నదీ తీరాల్లో మహిళలు సూర్యదేవుడిని, ఆయన సోదరి ఛట్ దేవిని వేడుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పూజ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చిత్తం పూజ మీద, భక్తి ఓట్ల మీద!ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒక జాతీయ పార్టీగా తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించవలసిన బాధ్యత కూడా ఆ పార్టీదే! లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత చందంగా ఆ పార్టీ పరిస్థితి మారుతుంది. ఆర్జేడీ హుందాగా ప్రజా తీర్పును అంగీకరించింది. ఓటమిలో విచారాన్ని, గెలుపులో గర్వాన్ని చూడబోమని ప్రకటించింది. నిరంతరం జనజీవితంతో మమేక మవుతామని వెల్లడించింది. ఎమ్జీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవడం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఓకుంటి గుర్రంగా మారింది. అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆపైన మరికొన్ని సీట్లలో ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పోటీచేసి కూటమి ఓటమికి కార ణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) కాంగ్రెస్ కారణంగా అధికారాన్ని కోల్పో యారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు.కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల పలుకుబడి కేవలం ఓ పాతిక సీట్ల వరకే పరిమితం. వాటిలో ఈసారి సీపీఎమ్ఎల్ (లిబరేషన్) పార్టీ రెండు సీట్లలో, సీపీఎం ఒక్క సీటులో గెలిచాయి. ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ అనే మరో అల్పప్రాణి కూడా ఈ కూటమిలో ఉన్నది. దానికీ ఒక సీటు లభించింది. ఎమ్జీబీ అలయెన్స్ కూర్పు ఓ బలహీనత. ఇక తేజస్వీ యాదవ్ తన సాంప్రదాయిక ప్రాబల్యాన్ని దాటిమరింత విస్తరించలేకపోవడం మరో బలహీనతగా మారింది. ముస్లిం – యాదవ్ (ఎమ్వై) కాంబినేషన్ ముప్ఫయ్యేళ్ల క్రితం సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు. మిగిలిన బలహీన వర్గాలు కూడా జాగృతమైన ఈ పరిస్థితుల్లో తన పరిధిని విస్తరించు కోకుండా తేజస్వి తన ఆశయాన్ని నెరవేర్చుకోలేరు. లాలూ రాజకీయ చతురత ఇప్పటి కాలానికి సరిపోకపోవచ్చు. పైగా అనారోగ్యం, వయోభారం. ఆయనిక పొలిటికల్ గేమ్స్ ఆడ లేరు. ఆడవలసింది తేజస్వీ యాదవే! కొత్త తరానికి సరిపోయే ఆటను ఆయన నేర్చుకోకపోతే, ప్రత్యామ్నాయ శక్తులు రంగంలోకి రావచ్చు.ఎమ్జీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకొని అలయెన్స్కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంట రిగా 130 సీట్లలో పోటీచేసి, ఐదు శాతానికి పైగా ఓట్లు తెచ్చు కున్న చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. 29 స్థానాలు కేటాయిస్తే ఆయన పార్టీ అందులో 19 గెలిచింది. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులకు పాశ్వాన్ పార్టీ ఉపయోగపడింది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీ ‘హిందూస్థానీ అవావ్ు మోర్చా’ కూడా భాగస్వా మిగా ఐదు సీట్లు గెలిచి కూటమికి ఉపయోగపడింది. వెనుక బడిన తరగతుల్లో కుష్వాహ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్ఎల్ఎమ్ కూడా ఎన్డీఏకు ప్లస్ పాయింట్గా మారింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోరంగంలోకి దిగిన ఎమ్ఐఎమ్ ఐదు సీట్లలో గెలవడమే కాక పలుచోట్ల ఎమ్జీబీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది.సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసు కున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతోపాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు ‘మహిళా రోజ్గార్’ పథకమే ఉదాహరణ. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఏటా పదివేల పథకాన్ని ప్రకటించే నైతిక హక్కు ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాలి. ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బిహార్ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది. అంతే తప్ప అక్కడ ఒక మహా ప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటివేళ్లతో సహా పెకిలించిందేమీ లేదు. ఆ పార్టీ కొత్త శ్రేణు ల్లోకి విస్తరించలేకపోయింది. అంతే తప్ప తన పునాదిని పోగొట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జరిగిన శృంగభంగం కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ముక్కూచెవులను బిహారీలు ఏనాడో కోసిపారేశారు.భారతీయ జనతా పార్టీ పచ్చి మితవాద పార్టీ. తన మతవాద ముద్రను కూడా దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక, సామాజిక విషయాల్లో పచ్చి సోషలిస్టు వ్యతిరేకి. కానీ తన ప్రాబల్య విస్తరణ కోసం భావజాల సారూప్యత లేని పార్టీలతో సైతం చెలిమికి వెనకాడటం లేదు. నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూను, ఆయన సోషలిస్టు ఆర్థిక విధా నాలను రోజూ విమర్శించే బీజేపీ బిహార్లో అంటకాగుతున్నది ఎవరితో? భారతీయ సోషలిస్టు పార్టీ స్థాపకులైన రామ్మనో హర్ లోహియా విచారధార లోంచి ప్రవహించినవాడే నితీశ్ కుమార్. దిగ్గజ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ అడుగుజాడల్లోనే నితీశ్ కుమార్ రాజకీయ అడుగులు పడ్డాయి. నెహ్రూకూ, లోహియా వాదులకూ విభేదాలుండవచ్చు. అంతిమ లక్ష్యం సామ్యవాదమే కదా! అంతెందుకు బిహార్లోని ఆర్జేడీ, జేడీయూ... రెండూ ఒకే తాను ముక్కలు. నితీశ్ పార్టీకి ఆయన తర్వాత వారసత్వ నాయకత్వం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం. ఇప్పుడు పెద్ద పార్టీగా గెలిచిన బీజేపీ నితీశ్ను మరికొంతకాలం కొనసాగనిచ్చి తర్వాత తానే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ తదనంతరం ఆయన పార్టీని కూడా బీజేపీ తనలో లీనం చేసుకోవచ్చనే అభిప్రాయం ఉన్నది.హిందీ మాట్లాడే ‘కౌ బెల్ట్’ ప్రాంతంలో ఒక్క బిహార్ మాత్రమే పూర్తిస్థాయిలో బీజేపీకి చేజిక్కలేదు. అనతికాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావడం ఖాయ మన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇక మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ! త్రివేణుల్లో ఒకటైన సరస్వతీ నది ఒకనాడు అదృశ్యమైనదని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలీ వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్ మాత్రమే. నిన్నటి విజ యోత్సవ ర్యాలీలో నరేంద్ర మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయయాత్రను మమతా దీదీ నిలువరించగలరా... లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రాజకీయాలకు గుడ్బై!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య ప్రకటించారు. అంతేకాదు, తమ కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోహిణి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నా సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ ఆలం సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పంతా నాపైనే వేసుకుంటున్నా’అని ఆమె శనివారం ఎక్స్లో పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని సరన్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఈమె ఎక్స్లో తండ్రి లాలూ, సోదరుడు తేజస్వీ యాదవ్లను అన్ఫాలో చేశారు. మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో సొంతంగా పార్టీ ప్రకటించిన తేజ్ ప్రతాప్.. పార్టీ అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. కానీ, స్వయంగా ఓటమి పాలైన తేజ్ ప్రతాప్, ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయారు. ఈ పరిణామాల నడుమ శనివారం ఆమె ఈ మేరకు ఎక్స్లో పోస్టులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లుగా చెబుతున్నారు. తండ్రి లాలూకు రోహిణి 2022లో తన కిడ్నీని దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే పుకార్లు, ఆరోపణలే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు చెబుతున్నారు. -
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
పట్నా: బిహార్ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్ చేసింది.जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. ఇక.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది. -
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది. -
నితీష్ ఇంటికి చిరాగ్ పాశ్వాన్.. బీహార్ లో కొత్త సీఎం..
-
ఘోర ఓటమి అయినా టాప్ ప్లేస్.. బిహార్ ఎలక్షన్లో ఆర్జేడీ రికార్డ్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలకు సైతం అందకుండా 202 సీట్లు సాధించి భారీ విజయం సాధించింది. మహాగఠ్ బందన్ కేవలం 35 సీట్లకే పరిమితమయి ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది, బీజేపీ, జేడీయూలను పక్కకు నెట్టి ఆర్జేడీ ప్రథమ స్థానంలో నిలిచింది.బిహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏకు చెక్ పెట్టాలని ఇండియా కూటమి భావించించి. దాని కనుగునంగానే బిహార్ లో ప్రచారం హోరెత్తించింది. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సైతం ఈఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. అయితే ఫలితాలు మాత్రం ఇండియా కూటమిని కంగుతినేలా చేశాయి. ఎగ్జిట్ ఫోల్స్ అంచనాల కంటే తక్కువగా మహాగఠ్ బంధన్ని కేవలం 35 సీట్లకే పరిమితం చేసింది. ఐతే ఈ ఎన్నికల్లో ఓట్ల షేర్ పరంగా చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ అవతరించింది. 23 శాతం ఓట్లషేర్ సాధించి టాప్ ప్లేసులో నిలిచింది.ఐతే సీట్ల పరంగా చూస్తే కేవలం 25 స్థానాలకే పరిమితమయింది. 20.8 ఓట్లశాతం సాధించిన బీజేపీ 89 స్థానాలు గెలుచుకోగా,19.5 శాతం ఓట్లు సాధించిన జేడీయూ 85 సీట్లు గెలుచుకుంది 8.71 శాతం ఓట్ల షేర్ తో కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది. కేవలం 1.85ఓట్ల షేర్ సాధించిన ఎంఐఎం 5 స్థాన్లాలో గెలవడం విశేషం. గతసారి జరిగిన ఎన్నికల్లో 23.11 శాతం ఓట్ల షేర్ సాధించిన ఆర్జేడీ 73 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి మాత్రం 23 శాతం ఓట్ల షేర్ సాధించినప్పటికీ కేవలం 25 స్థానాలకే పరిమితమయ్యింది. -
విపక్ష కూటమికి బి‘హారర్’
అయిదేళ్ల క్రితం బిహార్లో అంతంతమాత్రంగా గెలిచి అధికారంలోకొచ్చిన ఎన్డీయే కూటమి ఈసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటున్న దాఖలా కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఈవీఎంలు తెరిచినప్పటినుంచి ఆ కూటమి అప్రతిహతంగా పురోగ మించటం తప్ప వెనుకంజ లేదు. దాని ధాటికి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విపక్షాల కంచుకోటలనుకున్నవి కుప్పకూలుతున్నాయి. అంగప్రదేశ్, భోజ్పూర్, మగద్, మిథిలాంచల్, సీమాంచల్, తిరుత్ తదితర ప్రాంతాలన్నిటా ఎన్డీయే కూటమి విపక్షాలకు అందనంత దూరంలో ఉందంటే... విపక్ష మహాగఠ్బంధన్ (ఎంజీబీ)కి సారథ్యం వహించిన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవే తన స్థానాన్ని నిలుపుకోవటానికి యాతన పడ్డారంటే ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? గత ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరువైంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్యలో కొన్నాళ్లు కూటమికి దూరమై... వెనక్కొచ్చినా ఎన్డీయేపై దాని ప్రభావం లేకపోవటం గమనించదగ్గది. 243 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 200 స్థానాలకు ఎగబాకే దిశగా అది దూసుకెళ్తుండగా కనీసం 40 అయినా వస్తాయా అనే సందిగ్ధంలో ఎంజీబీ పడింది. తన ప్రాభవం గతించి దశాబ్దాలవుతుండగా ఎన్నిక లొచ్చి నప్పుడల్లా ‘తగుదునమ్మా...’ అంటూ అధిక స్థానాల కోసం పట్టుబట్టే కాంగ్రెస్ షరా మామూలుగా 61 తీసుకుని బొక్కబోర్లా పడింది. కూటమికి తాను పెద్ద గుదిబండనని రుజువు చేసుకుంది. గతంలో 70 సీట్లు తీసుకుని కేవలం 19 గెల్చుకున్న కాంగ్రెస్... ఇప్పుడు కేవలం 6తో సరిపెట్టుకునేలా కనబడుతోంది. సీమాంచల్లో ఎంఐఎం గతంలో గెల్చుకున్న అయిదు స్థానాలూ నిలుపుకోవటమేకాక రీ కౌంటింగ్ సాగుతున్న ఆరో స్థానంలోనూ నువ్వానేనా అన్నట్టుంది. వామపక్షాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) ఆదరాబాదరాగా మొదలెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు ఎంత హడావుడి చేసినా, సుప్రీంకోర్టుకెక్కినా... కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఓట్ చోరీ ప్రచారం చేసినా ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఫలితాల సరళి చెబుతోంది. అంతేకాదు... కుటుంబాని కొక సర్కారీ ఉద్యోగమిస్తామని ఆర్జేడీ చేసిన వాగ్దానం ఎన్డీయే నగదు బదిలీ ముందు వెలవెలబోయింది. 75 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే మహిళా రోజ్గార్ యోజన ద్వారా యేటా రూ. 10,000 ఇస్తామని చెప్పటమే కాక సెప్టెంబర్ 26న తొలి వాయిదాను అందించటం జనానికి నచ్చింది. బాగా వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొన్నా 2020 నాటి తన 37.23 శాతం ఓట్లనూ పెంచుకోవటంలో ఎంజీబీ విఫలమైంది. అదే సమయంలో ఎన్డీయే గతం కన్నా పది శాతం మేర పెంచుకుంది. గతం కన్నా మహిళలు ఎన్డీయే వైపు మొగ్గటం,గతంలో అలిగి విడిగా పోటీచేసిన ఎల్జేపీ తిరిగి వెనక్కురావటం బాగా కలిసొచ్చింది. పెద్దమాటలు చెబుతూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి విపక్షాలను దెబ్బతీశారు.ఆధిపత్య కులాల్లో ఓటు బ్యాంకును నిలుపుకొంటూనే బాగా వెనకబడిన ఎంబీసీ కులాలు, మహాదళిత్ల ఆదరణ పొందటం ఎన్డీయేకు లాభించింది. ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకు తగినన్ని సీట్లివ్వటమే ఇందుకు కారణం. దీని ముందు ఆర్జేడీ ముస్లిం–యాదవ్ కలయిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 87 స్థానాల్లో దాదాపు 20 శాతం మించి ముస్లిం ఓట్లున్నా అందుకు దీటుగా సీట్లు కేటాయించటంలో ఆర్జేడీ విఫలమైంది. కొద్దోగొప్పో సీమాంచల్లో ఇచ్చినా ముస్లింలు ‘గెలిచే సత్తా’ ఉన్న అభ్య ర్థుల వైపే మొగ్గారు. ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి కొంతమేర లాభించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయిదేళ్లుగా ఉన్న పథకాలను సైతం ఎన్నికల ముందు నిలిపేసిన ఈసీ... పెద్ద మనసు చేసుకుని బిహార్లో సరికొత్త మహిళా రోజ్గార్ యోజన జోలికి పోలేదు. ఎన్డీయే నెగ్గితే మళ్లీ నితీశ్ సీఎం అవుతారా లేదా అన్న సంశయం మొదట్లో ఉన్నా, ఫలితాల సరళి చూస్తే ఆ విషయంలో బీజేపీ పట్టుబట్టక పోవచ్చు. ఏదేమైనా ఇది ప్రధాని నరేంద్ర మోదీ, ‘సుశాసన్ బాబు’ నితీశ్ కుమార్ కలిసి సాధించిన ఘన విజయం. -
అంధకారం నుంచి ‘చిరాగ్’ వెలుగులు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దాదాపు ఖాయం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూనే మరో యువనేత చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి హవా మామూలుగా లేదు, రాబోయే కాలమంతా చిరాగ్దే అన్నంతంగా చాటిచెప్పాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 29 సీట్లను పట్టుబట్టి తీసుకున్న ఆయన.. ఏకంగా 19 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్కు తగ్గ తనయుడిగా తనదైన ముద్రను వేశారు చిరాగ్ పాశ్వాన్. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పార్టీ ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పేశారు. ఫీనిక్స్లా పుంజుకుని..చిరాగ్ పాశ్వాన్ తిరిగి పుంజుకున తీరు ఫీనిక్స్ పక్షిని గుర్తు చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళమే. జేడీయూ అధినేత నితీష్ కుమార్తో విభేదాల వల్ల ఆ సమయంలో ఒంటరిగానే పోటీకి సిద్దమయ్యారు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్.. కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించారు. దాంతో ఆయన రాజకీయ అంధకారంగా కనిపించింది. అదే సమయంలో చిరాగ్ అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు. అందకారం నుంచి ఆకాశమంత వెలుగు..ఆపై 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి, రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్ అంతా అంధకారంగానే కనిపించింది. బిహార్ రాజకీయాల్లో ఓ శక్తిగా వెలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు చిరాగ్లో లేవనే విమర్శలు వినిపించాయి. తండ్రిలో ఉన్న చరిష్మా చిరాగ్లో లేదని విమర్శకులు అభిప్రాయాపడ్డారు. అయితే ఐదేళ్ల వ్యవధిలోనే ఎంతలా పుంజుకున్నారో తాజాగా ఆయన తన అభ్యర్థులను ముందువరుసలో నిలిపిన తీరే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వంద శాతం స్తైక్రేట్ సాధించిన చిరాగ్.. ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. #WATCH | पटना: केंद्रीय मंत्री और LJP(रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने NDA के बहुमत का आंकड़ा पार करने पर कहा, "बिहार की जनता ने जिस तरह से NDA को प्रचंड बहुमत दिया है और अगले पांच साल बिहार को विकास की ओर ले जाने का फैसला किया है, उसके लिए मैं विशेष रूप से उन्हें… pic.twitter.com/Lz5lWpDYuA— ANI_HindiNews (@AHindinews) November 14, 2025 చిరాగ్ అంటే కాగడా అని అర్థం.. ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కాగడా మాదిరి మారి మరింత వెలుగు నింపారు. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని అంధకారం నుంచి ఆకాశమంత వెలుగుల వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చిరాగ్. ఇక బిహార్లో అంతా చిరాగ్ శకమే అన్నంత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారాయన. -
బిహార్ సీఎం నితీశ్ కాదా! హింట్ ఇచ్చిన జేడీయూ ??
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి 200 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ 32 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో తదుపురి బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. నితీశ్ కుమారే 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందురూ అనుకున్నారు.ఈ క్రమంలో అనూహ్యం బిహార్ సీఎం నితీశ్ కాదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిదే విజయం అంటూ అంబరాన్నింటిన సంబరాల వేళ.. నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్ సిద్ధంగా ఉందంటూ జేడీయూ వరుస పోస్టులు పెట్టింది. ఈ విజయం అపూర్వమైనది. సాటిలేనిది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే సీఎంగా కొనసాగుతారు అని జేడీ(యు) శుక్రవారం ట్వీట్ చేసింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత ఆ పోస్ట్ను తొలగించింది. దీంతో బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అనూహ్య విజయం తర్వాత నితీశ్ కుమార్ భవిష్యత్పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు, నితీష్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసినప్పటికీ రికార్డు స్థాయిలో 10వ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న జేడీ(యు)అధినేత నితీషే సీఎం పదవిని అధిష్టిస్తారని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో బిహార్ సీఎం పోస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?మరోవైపు మహారాష్ట్ర తరహా పాలిటిక్స్ను బిహార్లో అప్లయి చేయాలని కమలం పెద్దలు చూస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్లగా.. కాషాయ పార్టీ ఆధిపత్య ప్రదర్శన తర్వాత ఆ పదవి చివరికి దేవేంద్ర ఫడ్నవీస్కు కట్టబెట్టింది. అదే విధంగా ఇక్కడ (బీహార్) ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జేడీయూ సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేసిన తర్వాత బిహార్ సీఎంగా సామ్రాట్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మరి ప్రచారంలో వాస్తవమెంత? బిహార్ సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? అనే అంశంపై బిహార్ ఎన్డీయే కూటమి పెద్దలు అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంది. విశ్వసనీయత కోల్పోయిన నితీశ్గెలుపు,ఆధిక్యం పక్కనబెడితే..నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. తరచూ మారుతున్న రాజకీయ కూటముల కారణంగా నితీశ్ ప్రజా విశ్వసనీయతను కోల్పోవడంతో పాటు ఇతరాత్ర కారణాలున్నా మాట సర్వత్రా వినిపిస్తోంది.‘అధికార దాహం’ ఉన్న నేతగాగత దశాబ్ద కాలంలో ఆయన పలుమార్లు బీజేపీతో, ఆ తర్వాత ఆర్జేడీతో జతకట్టి, తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ఆయనపై ప్రజల్లో ఒక రకమైన తేలికభావం ఏర్పడింది. ఒకప్పుడు ‘సుపరిపాలన బాబు’గా గుర్తింపు పొందిన నితీశ్ ఇప్పుడు కేవలం ‘అధికార దాహం’ ఉన్న నేతగా ముద్రపడ్డారు. పదే పదే పార్టీలు మారే నితీష్ వైఖరి ఆయన సొంత పార్టీ జేడీయూ (జేడీయూ)బలాన్ని సైతం గణనీయంగా తగ్గించింది, ఫలితంగా నితీష్ తన సొంత శక్తిపై మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం లేకుండా పోయింది.కేంద్ర రాజకీయాల్లోకి నితీశ్ప్రస్తుతం దేశంలోని రాజకీయ సమీకరణాలలో ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీ వ్యూహం అత్యంత కీలకమైనది. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు.. ప్రతిపక్షాల ఐక్యతా వేదిక ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు.. బీజేపీ సీఎం నితీశ్ను ఒక ఉపకరణంగా మాత్రమే వాడుకుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బిహార్లో తమకు నమ్మకమైన మెజారిటీని సాధించిన తర్వాత, నితీశ్ నాయకత్వాన్ని కొనసాగించడం కంటే,రాష్ట్రంలో బీజేపీ బలం కలిగిన నేతను తెరపైకి తేవాలని, లేదా నితీశ్కు గౌరవప్రదమైన పదవి ఇచ్చి, కేంద్ర రాజకీయాలకు పంపాలని బీజేపీ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.మరోవైపు బీహార్ రాజకీయాల్లో యువ నాయకత్వం దూసుకొస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) వంటి యువ నాయకులు తమ బలాన్ని పెంచుకుంటూ, ప్రజల్లో ఆశలను పెంచుతున్నారు. ముఖ్యంగా నితీశ్ కుమార్ పాలనలో సరైన ఉద్యోగ అవకాశాలు లభించలేదనే భావన యువతలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ స్థానంలో మార్పును కోరుకునే ఓటర్ల సంఖ్య పెరిగిందనేవారూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ యువ నాయకత్వ ఆకర్షణ నితీశ్ రాజకీయ జీవితానికి పెద్ద సవాలుగా మారనుంది.ముగింపు దశకు నితీశ్ కుమార్ శకంనితీశ్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలపడం అనేది ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలంపై మరింత అనిశ్చితిని పెంచింది. ప్రస్తుతం బీజేపీ మద్దతుపై ఆధారపడిన నితీశ్ , గత లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ షరతులకు లోబడి ఉండవలసి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, నితీశ్ను పక్కన పెట్టి, తమ సొంత ముఖ్యమంత్రిని ప్రకటించడానికి బీజేపీ ప్లాన్ చేసివుండవచ్చనేవారూ ఉన్నారు. అంతేకాకుండా, అనారోగ్య కారణాలు లేదా వయోభారం వంటి వ్యక్తిగత కారణాలను చూపుతూ బీజేపీ.. నితీష్ను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేలా ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఈ కారణాలన్నింటినీ కలిపి చూస్తే, బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ శకం ముగింపు దశకు చేరుకుందని, భవిష్యత్తులో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకపోవచ్చనే అంచనాలున్నాయి. -
రికార్డు సృష్టించనున్న నితీష్ కుమార్..10సారి ముఖ్యమంత్రిగా?
ఈ రోజుల్లో రాజకీయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కష్టపడడంతోపాటు అదృష్టం సైతం కలిసిరావాలి. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడానికే నేతలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. అలాంటిది ఒక ప్రభుత్వ అధినేతగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేయడమంటే ఎంత కష్టమైన వ్యవహారమో ఆలోచించండి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గెలిస్తే నితిష్ కుమార్ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది ఇదే జరిగితే ఏకంగా పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ రికార్డు సృష్టించనున్నారు. నితీష్ కుమార్ ఈ పేరు వింటే చాలు రాజకీయ ఎత్తుగడలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తన పదవి కాపాడుకోవడం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా నితీష్ సై అంటారు. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన నితీష్ కుమార్ కొద్దికాలానికే ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏతో జతకట్టారు. 2022లో ఎన్డీఏకు కటీఫ్ చెప్పిన నితిష్ తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొద్ది కాలం మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన ఆ కూటమిలో పొసగక తిరిగి కాషాయ దళంతో దోస్తీ చేశారు. తాజాగా ఎన్డీఏతో మరోసారి జతకట్టి బిహార్ లో మరోసారి అధికారం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.2000 సంవత్సరంలో తొలిసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి చేపట్టిన ఆయన 2014లో ఎన్డీఏ కూటమితో విభేదాల కారణంగా పదవి కోల్పోయారు. ఆకాలం మినహా 2005 నుంచి నేటి వరకూ ఆయనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక రాష్ట్ర మఖ్యమంత్రిగా పది సార్లు ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ కుమార్ రికార్డులెక్కుతారు. -
ఇది ముమ్మాటికీ ఆయన విక్టరీనే!
‘‘నితీశ్ కుమార్కు వయసు పైబడిపోయింది. ఆయన ఆరోగ్యమూ బాగోలేదు. ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనాల్లో తిరిగే ఓపిక ఆయనకు ఉండడం లేదు. ఇక ఆయనకు విశ్రాంతి అవసరం. పైగా ఆయనకు అధికారంపైనే తప్ప ప్రజలపై మమకారం లేదు. బిహార్కు ఇప్పుడు కొత్త తరహా ఆలోచనలు అవసరం.’’.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వినిపించిన విమర్శలు ఇవి. అయితే ఆ విమర్శలకు ఆయన గ్రాండ్ విక్టరీతోనే చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. నితీశ్ పాలనతో బిహారీలు విసిగిపోయారని.. అందుకే ఆయన్ని తప్పించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ వేరుగా ర్యాలీలు నిర్వహించమే అందుకు నిదర్శనమని.. రాజకీయ ప్రచారం విస్తృతంగా సాగింది ఎన్నికల ప్రచారం సమయంలో. అయితే ఇలాంటి ప్రచారాలను, తనపై వచ్చిన విమర్శలను నితీశ్ కుమార్ ఏనాడూ తిప్పి కొట్టింది లేదు. అయితే.. 74 ఏళ్ల వయసులో ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా హుందాగా ఆయన వాళ్ల నోళ్లు మూయించారు. టైగర్ అబీ జిందా హై(పులి పని ఇంకా అయిపోలేదు).. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు.. ప్రజలే నిజమైన తీర్పు ఇస్తారంటూ ఓ వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజేపీ వ్యవహారంలోనూ ఆయన ట్రిగ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణం లేకపోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన సీట్లు 43. బీజేపీ కంటే 31 సీట్లు తక్కువే. అయినప్పటికీ ప్రాంతీయత, అనుభవం పేరిట నితీశ్కుమార్కే సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పినా.. మళ్లీ కొంతకాలానికి జట్టు కట్టి సీఎం అయ్యారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీతో ఆయన స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చారు. బీజేపీ చివరిదాకా నితీశ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించపోయినా ఆయన నొచ్చుకోలేదు. ఈలోపు.. ఇటు బిహార్ ఓటర్లు మహాఘట్ బంధన్లో కీచులాటను సునిశితంగా గమనించారు. చివరకు సుదీర్ఘ నాయకత్వాన్ని గౌరవమిస్తూ ‘సుశాసన్ బాబు’కే ఓటు వేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 80 సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు డబుల్ ఫలితం. తద్వారా పదో సారి ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే.. JD(U) విజయానికి నితీశ్ కుమార్ తిప్పిన రాజకీయ చక్రం ప్రధాన శక్తిగా ఉన్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎన్డీయే భాగస్వాములు, సామాజిక సమీకరణలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా విజయానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. -
మోదీ మాస్టర్ ప్లాన్.. బీహార్ సీఎం నితీష్ కాదు ?
-
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ హావా.. నిజమైన అమిత్ షా జోస్యం?
బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి దుమ్మురేపుతోంది. 180కి పైగా సీట్లలో అధిక్యం సంపాదించి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాషాయ కూటమికి పట్టం కట్టినా ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎవరూ చెప్పలేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఎన్డీఏ కూటమి తప్పకుండా 160కి పైగా సీట్లు వస్తాయని, మూడింట రెండో వంతు మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్నాయి. ఫలితాలలో అధికార ఎన్డీఏ కూటమి హావా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 180పైగా సీట్లలో కాషాయకూటమి అధిక్యం కనబరుస్తోంది. మహాగఠ్ భందన్ 50 కిపైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు చూస్తుంటే బిహార్ లో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. అయితే బిహార్ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంతగానో శ్రమించింది. కాంగ్రెస్ అగ్రనేత బిహార్ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా తన భూజాలపైన వేసుకొని రాష్టమంతా కలియతిరిగారు. ఎన్నికల కమిషన్ ఓట్లు దొంగలిస్తుందని గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందంటూ ప్రచారం చేశారు. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బిహార్ ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. అయినప్పటికీ బిహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది.కాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా మెుదటినుంచి ఎన్డీఏ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయన్నారు. "బిహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు. ఇది పాండవుల యుద్ధం ఐదు పార్టీల సంకీర్ణం( జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ ఏ మ్, ఆర్ఎల్ఎమ్) కలిసికట్టుగా పోరాడుతున్నాం" అని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. -
మహా కూటమికి ఘోర పరాభవం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం 190 ఫ్లస్ లీడ్తో హిస్టారికల్ విక్టరీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రెండ్స్ ప్రకారం.. మహాఘట్ బంధన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. మరోవైపు.. అయితే ఘనవిజయం లేదంటే ఘోర పరాజయం అంచనా వేసిన ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం మాత్రం నిజం కాబోతోంది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్కు ఇది తొలి ఎన్నికలు. అయితే ఆశించిన విజయాన్ని అందుకోకున్నా.. ఈ పార్టీ ఎక్స్ఫ్యాక్టర్గా పని చేయొచ్చని విశ్లేషకులు భావించారు. ఎగ్జిట్పోల్స్ మాత్రం జేఎస్పీ ఘోరంగా విఫలమవుతుందని, ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశం అంతంత మాత్రంగా ఉందని అంచనా వేశాయి. కానీ, ఆ అంచనా కూడా తప్పేలా కనిపిస్తోంది.ఇవాళ్టి బిహార్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎం కౌంటింగ్లోనూ రెండు నుంచి 4 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సున్నాకే పరిమితమైంది. ఇప్పుడు ఒక్క స్థానం దక్కించుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. చివర్లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటోందో చూడాలి. ఎన్నికల వ్యూహకర్తగా నితీశ్ కుమార్ సహా పలువురి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే.. సొంత పార్టీతో మూడేళ్లుగా చేస్తున్న ప్రచారం మాత్రం వర్కవుట్ కాలేదనే స్పష్టం చేస్తోంది.ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నితీశ్ పని అయిపోయిందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితం పుల్స్టాప్ వేసిందని భావించొచ్చు. ఇక అధికార మిత్రపక్షం బీజేపీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేలోపు ఈ లెక్క కొంచెం మారే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్జేడీ(75), బీజేపీ(74), జేడీయూ(43), కాంగ్రెస్(19).. ఇలా ప్రధాన పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే హవా చూస్తుంటే ఆర్జేడీ+కాంగ్రెస్+ఇతర పార్టీల కూటమి సగానికి పైగా స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే.. 200 స్థానాల్లో పీకే జేఎస్పీ డిపాజిట్లు కొల్పోయింది. విపక్ష కాంగ్రెస్ కంటే.. పీకే జేఎస్పీ ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు(అంచనా మాత్రమే). మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చడం ద్వారా NDAకి లాభం చేకూర్చిందనే చర్చ మొదలైందక్కడ. -
Watch Live: బిహార్ ఎన్నికల ఫలితాలు
-
Bihar Election Results: ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది?.. మరికొన్ని గంటల్లో ఆ సస్పెన్స్కు తెర పడనుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. -
ఓ ‘మష్రూమ్ లేడీ’ విజయగాథ
సేద్యం చేయడానికి సెంటు భూమి లేదు. రోగమో రొష్టో వచ్చినప్పుడు కాస్త సేద దీరుదామంటే పెద్దలు అందించిన ఆస్తులు కానీ, కూడబెట్టుకున్న కాసులు కానీ లేవు. అయితేనేం... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. స్వయంకృషితో పేదరిక కష్టాలు దాటింది. ఎంతోమంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తోంది... ఆమె బిహార్కు చెందిన బీనాదేవి. ఆమె విజయ గాథను అవలోకిద్దాం.బిహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన బీనాదేవి(Binadevi) ఒకప్పుడు కడు పేదరికాన్ని అనుభవించింది. తన నలుగురు పిల్లలకు భోజనం పెట్టడానికి ఎన్నో కష్టాలు పడింది. సాధారణంగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీటి సముద్రం తప్ప ఏమీ కనిపించదు. కాని బీనాదేవి ఒక శక్తిమంతమైన మార్గాన్ని చూసింది. అది తన భవిష్యత్ను మార్చిన మార్గం. తనను ‘ది మష్రూమ్ లేడీ’గా మార్చిన మార్గం.ఆ మార్గం పేరు... పుట్టగొడుగుల పెంపకం.తన ఇంటి ఇరుకైన గదిలోనే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది బీనాదేవి. చాలా చిన్న స్థాయిలో మొదలైన పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ సాధికారత ఉద్యమంగా మారింది. వందకు పైగా గ్రామాలలో వేలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.ఒక కిలోవిత్తనాలతో తొలి ప్రయత్నం మొదలుపెట్టింది. మొదటి అడుగు అయితే వేసిందిగానీ పుట్టగొడుగుల పెంపకం అనుకున్నంత తేలిక కాదని అర్థమైంది. అందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరని గ్రహించింది.భాగల్పూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకుంది. తగిన పరిజ్ఞానంతో పుట్టగొడుగుల పెంపకంప్రారంభించిన బీనాదేవికి లాభాలను అందుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒక పూట తింటే మరో పూట పస్తు అన్నట్లుగా ఉండే బీనాదేవి సంవత్సరానికి లక్షలు అర్జించే స్థాయికి చేరుకుంది. స్థిరమైన ఆదాయం వల్ల పిల్లలను బాగా చదివించింది. ఇప్పుడామె పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. విజయం తనకే పరిమితం కావాలనుకోలేదు బీనాదేవి. ఆ విజయాన్ని ఇతరులకు కూడా పంచాలనుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో ఎంతోమంది మహిళలకు తానే స్వయంగా శిక్షణ ఇచ్చింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో వారి పట్ల గౌరవం పెరుగుతుంది. వారి కుటుంబజీవితం మెరుగు పడుతుంది’ అంటున్న బీనాదేవి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి అభినందనలు అందుకుంది. ‘కిసాన్ అభినవ’ పురస్కారాన్ని అందుకుంది.తిల్కారి గ్రామానికి చెందిన బీనాదేవికి పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నా అపారమైన సంకల్పబలం ఉంది. ఆ బలమే ఆమెను స్ఫూర్తినిచ్చే మహిళ స్థాయికి తీసుకువెళ్లింది.స్ఫూర్తిదాయకమైన బీనాదేవి గురించి ‘ఎక్స్’లో రాసింది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. ‘మష్రూమ్ మహిళ బీనాదేవి పుట్టగొడుగుల పెంపకంలో తాను విజయం సాధించడమే కాదు ఎంతోమంది గ్రామీణ మహిళలు విజయం సాధించేలా స్ఫూర్తిని ఇచ్చింది. సహకారాన్ని అందించింది’ అని రాసింది. బీనాదేవి పుట్టగొడుగుల పెంపకం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. గ్రామీణప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం, అక్షరాస్యతపై ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది. -
బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
-
20 ఏళ్లలో తొలిసారి.. బిహార్ లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
Bihar Polling: బిహార్లో రికార్డు పోలింగ్
పాట్నా: బిహార్లో మలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఐదుగంటల వరకు జరగ్గా.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బిహార్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు 68.55 శాతం పోలింగ్ నమోదైంది. కస్బా అసెంబ్లీలో అత్యధికంగా 80.89 శాతం పోలింగ్ నమోదు కాగా.. నవాడా అసెంబ్లీలో అత్యల్పంగా 54.83 శాతంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఓటింగ్ శాతం ఇలా ఉన్నా.. ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ఎంత నమోదైందనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. కాగా, ఇవాళ జరిగిన రెండో విడుత ఎన్నికల్లో 1302మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదటి విడుతలో 66.46శాతం ఓటింగ్ నమోదుదైంది. రెండు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. .(Bihar Assembly Elections Phase 2 Polling Updates) బిహార్లో అత్యధిక శాతం నమోదైన ప్రాంతాలివేపశ్చిమ చంపారన్ లో 69.02 శాతం తూర్పు చంపారన్లో 69.31 శాతం షియోహర్లో67.31 శాతం సీతామర్హిలో 65.29 శాతం మధుబనిలో 61.79 శాతం సుపాల్లో 70.69 శాతం అరారియాలో 67.79 శాతం కిషన్ గంజ్లో 76.26 శాతం పుర్నియాలో 73.79 శాతం కతిహార్లో 75.23 శాతం భాగల్ పూర్లో 66.03 శాతం బంకాలో 68.91 శాతం కైమూర్ (భాబువా)లో 67.22 శాతం రోహ్తాస్లో 60.69 శాతం అర్వాల్లో 63.06 శాతం జెహానాబాద్లో 64.36 శాతం ఔరంగాబాద్లో 64.48 శాతం గయలో 67.50 శాతం నవాడాలో 57.11 శాతం జమూయిలో 67.81 శాతం67.14 శాతం పోలింగ్ నమోదుసాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు...బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్గా రికార్డుబిహార్లోముస్లిం మెజారిటీ కిషన్ గంజ్ లో అత్యధికంగా 76.26 శాతం పోలింగ్నవాడాలో అత్యల్పంగా 53.17 శాతం పోలింగ్ నవాడాలోని మిషన్ స్కూల్ బూత్ నంబర్ 351లో 105 ఏళ్ల వృద్ధురాలు అమలా ఖాతూన్ ఓటు వేశారు. ఎన్నికల సిబ్బంది ఆమెకు గులాబీతో స్వాగతం పలికారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణజమూయిలో ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, ఇటుకలు, రాళ్లు విసిరారు. జమూయి అసెంబ్లీ నియోజకవర్గంలోని జుండన్ గ్రామంలో పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణ మరియు రాళ్లు రువ్వడానికి దారితీసింది. పోలింగ్ పార్టీ అధికారి పోలింగ్ స్టేషన్ల నంబర్ 381 మరియు 382 వద్ద డబ్బులు తీసుకున్నారని, ఆ తర్వాత గ్రామస్తులు అతన్ని బందీగా ఉంచడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అవతలి వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఘర్షణ మొదలైంది. రాళ్లు రువ్వడంలో విశాల్ కుమార్ అనే యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక సంఘం ఇంట్లోకి ప్రవేశించి దోచుకున్నారని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్డీవో సౌరభ్ కుమార్, ఎస్డీపీవో సతీష్ సుమన్, ఖైరా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, బీడీవో తదితరులు బృందంతో కలిసి శిబిరాలు నిర్వహిస్తున్నారు. వృద్ధ ఓటర్ల ఉత్సాహంబిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశలో, వృద్ధ ఓటర్ల ఉత్సాహంతో ప్రజాస్వామ్య వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. 111 ఏళ్ల నషిమా ఖాతున్ సుపాల్ జిల్లాలోని ఛత్తపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాధోపూర్ పంచాయతీలోని పోలింగ్ బూత్ నంబర్ 274కు వీల్ చైర్ పై చేరుకున్నారు. అదే సమయంలో రోహ్తాస్ జిల్లా కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గం బసుంధర గ్రామానికి చెందిన రామ్ చెలా యాదవ్ (95) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడం ప్రతి పౌరుడి కర్తవ్యం అనే సందేశాన్ని వారిద్దరూ తమ ఉత్సాహంతో అందించారు. అర్వాల్ లో ప్రిసైడింగ్ అధికారి కన్నుమూతప్రిసైడింగ్ అధికారి అరవింద్ కుమార్ అర్వాల్లో ఓటింగ్ సమయంలో గుండెపోటుతో మృతిబెట్టియా: డబ్బులు పంపిణీ చేసిన ఇద్దరు ఆర్జేడీ మద్దతుదారుల అరెస్ట్షియోహర్: పోలింగ్ బూత్ల్లో అవకతవకలు.. అదుపులో 13 మందిమోతిహారిలోని ఢాకాలో ముగ్గురు నకిలీ ఓటర్ల పట్టివేతమోతిహరి ఢాకా అసెంబ్లీ నియోజకవర్గంలోని కుండ్వాచైన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన హసీబుల్లా, సుల్తాన్ అహ్మద్, ఆసిఫ్ అన్వర్లను తమ అసలు గుర్తింపును దాచిపెట్టి మరొకరి పేరుతో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.అరారియాలో బీజేపీ-కాంగ్రెస్ మద్దతుదారుల ఘర్షణఎన్నికల రోజున కాంగ్రెస్ అభ్యర్థి కారుపై పార్టీ లోగో ఉన్న స్టిక్కర్ ఉండగా, బీజేపీ అభ్యర్థి వ్యతిరేకించారుదీనిపై కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ఇప్పటి వరకు 60. 40 శాతం పోలింగ్ నమోదు:పశ్చిమ చంపారన్- 61.99 శాతంతూర్పు చంపారన్- 61.92 శాతంషియోహర్ -61.85 శాతంసీతామర్హి-58.32 శాతంమధుబని-55.53 శాతంసుపాల్-62.06 శాతంఅరారియా-59.80 శాతంకిషన్ గంజ్-66.10 శాతంపుర్నియా-64.22 శాతంకతిహార్-63.80 శాతంభాగల్ పూర్-58.37 శాతంబంకా-63.03 శాతంకైమూర్ (భాబువా)-62.26 శాతంరోహ్తాస్-55.92 శాతంఅర్వాల్-58.26 శాతంజెహానాబాద్-58.72 శాతంఔరంగాబాద్-60.59 శాతంగయ-62.74 శాతంనవాడా-53.17 శాతంజమూయి-63.33 శాతం పోలింగ్సొంత ఊరిలో ఓటేసిన పీకేఓటు హక్కు వినియోగించుకున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్రోహ్తాస్ జిల్లా కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనార్ గ్రామంలోని ఓటేసిన పీకే బిహార్ లో మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపు ప్రతి ఓటు ముఖ్యమని, ప్రజలు ముందుకు వచ్చి తమ హక్కులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి పీకే వెంట కర్గహర్ అభ్యర్థి.. గాయకుడు రితేష్ పాండే జెహానాబాద్ పోలింగ్ సెంటర్ వద్ద ఘర్షణ జెహానాబాద్ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలోని హర్దాస్ పూర్ గ్రామంలోని ఓ పోలింగ్ వద్ద రాజకీయ ఘర్షణ తన్నుకున్న ఇరు పార్టీల వర్గీయులు నలుగురికి గాయాలు పోలీసులు ఎంట్రీతో అదుపులోకి పరిస్థితి 11 గం. దాకా ఓటింగ్ శాతం 31.38కర్గహార్లో ఓటింగ్ బహిష్కరణరోహతాస్ జిల్లా కర్గహార్లో ఓటింగ్ బహిష్కరణ అఖోడి పంచాయతీలోని లడ్డుయి బిషన్పురా గ్రామంలో ఓటేయని ప్రజలు175, 176 బూత్ వద్ద కనిపించని ఓటర్ రంగంలోకి దిగి ఓటర్లను బతిమాలుతున్న అధికారులు కీలకంగా ముస్లిం ఓట్లుమలివిడత పోలింగ్ కీలకంగా మారనున్న సీమాంచల్ నాలుగు జిల్లాలు అరరియా, కిషన్గంజ్, కటిహార్, పూర్నియా ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ఆసక్తికర పోటీ బిహార్కు అలాంటి మోడల్ అవసరం: ఖర్గేబిహార్ ఓటర్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపుబిహార్కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన మోడల్ అవసరమని వ్యాఖ్య నితీశ్ కుమార్ సర్కార్పై ఖర్గే ఫైర్మార్పునకు ఓటేయాలని ఓటర్లకు పిలుపునవాడాలో స్వల్ప ఉద్రిక్తతనవాడా జిల్లాలోని వారిసలిగంజ్ పోలింగ్ బూత్ వద్ద రాజకీయ పార్టీల ఘర్షణఅడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి అదుపులోకిబిహార్ పోలింగ్.. ప్రముఖ అభ్యర్థులు వీళ్లే..బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (JD-U) — సుపౌల్ నుంచి 8వ సారి పోటీ.ప్రీమ్ కుమార్ (BJP) — గయా టౌన్.తర్కీషోర్ ప్రసాద్ — కటిహార్.పార్టీ మారిన అభ్యర్థులు: సంగీతా కుమారి, విభా దేవి, మురారి గౌతమ్.బిహార్లో 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్లుబిహార్ ఓట్లకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపు మొదట ఓటు వేయండి, తర్వాత అల్పాహారం చేయండి అంటూ ట్వీట్ ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా: నితీశ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.. ఇతరులను కూడా ఓటేసేలా ప్రేరేపించాలి: నితీశ్ బిహార్ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపుకొనసాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బిహార్ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షనవంబర్ 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది.. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన ఓటింగ్ ఈ సందేశం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని ప్రధాని పిలుపుబిహార్ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఇలా.. 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్బరిలో ఉన్న 1302 మంది అభ్యర్థులుఓటు హక్కు వినియోగించుకోనున్న 3.7 కోట్ల మంది ఓటర్లు45 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘంచివరి విడత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో బిజెపి, 44 చోట్ల జెడియు, 15 చోట్ల ఎల్జెపి, హెచ్ ఎ ఎం 6, ఆర్ ఎల్ ఎం 4 సీట్లలో పోటీమహఘట్బందన్లో ఆర్జెడి 71, కాంగ్రెస్ 37, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ4, సిపిఎం 1 చోట పోటీకి పార్టీలుఆరు సీట్లలో స్నేహపూర్వకపోటీలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, సీపీఐ పార్టీలుసెకండ్ ఫేజ్లో..1,302 మంది అభ్యర్థులు బరిలో..పోటీలో.. 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు. ఒక ట్రాన్స్జెండర్ఓటర్లలో.. 1,95,44,041 మంది పురుషులు ఓటర్లలో.. 1,74,68,572 మంది మహిళలుపోలింగ్ ఏర్పాట్లు ఇలా.. ఎన్నికల సిబ్బంది 4 లక్షల మంది 45,399 పోలింగ్ బూత్ల ఏర్పాటు సున్నిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయం కుదింపుకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.నేపాల్ సరిహద్దులు ఈ నెల 11వ తేదీ వరకూ మూసివేత595 పోలింగ్ బూత్లలో అందరూ మహిళా అధికారులే బాధ్యతలు316 మోడల్ పోలింగ్ బూత్ల ఏర్పాటుఇంటి వద్ద ఓటేయనున్న 63,373 మంది రెండో విడతలో ఏ పార్టీ ఎన్నిచోట్ల..ఎన్డీయేబీజేపీ: 53జేడీయూ: 44ఎల్జేపీ: 15ఆర్ఎల్ఎం: 4హెచ్ఏఎం: 6మహాఘట్బంధన్ఆర్జేడీ: 71కాంగ్రెస్: 37వీఐపీ: 7సీపీఐ: 4సీపీఐ (ఎంఎల్): 6సీపీఐ (ఎం): 1 -
బిహార్ ఎన్నికల వేళ.. ఢిల్లీ పేలుడు కలకలం
పాట్నా: బిహార్లో మంగళవారం చివరి దశ ఎన్నికలు జరగనున్న వేళ న్యూఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ నెల 6న 121 నియోజకవర్గాలకు తొలిదశ ఎన్నికలు జరగ్గా.. మంగళవారం 122 నియోజకవర్గాలకు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటకు 500 మీటర్ల దూరంలో ఉన్న మెట్రోస్టేషన్ వద్ద బాంబు పేలుడు ఘటన యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.తొలి దశ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విజయంపై వేటికవే ధీమా వ్యక్తం చేయగా.. రెండో దశ గెలుపోటములను శాసించనుంది. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు పేలుడు ఘటన ఎన్నికలపై ప్రభావం చూపించే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్షా బిహార్లోనే ఉన్నారు. దేశ రాజధానిలో బాంబు పేలుడు వార్త తెలియగానే.. ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఢిల్లీలో బాంబు పేలుడు, బిహార్లో ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దుల్లో నిఘాను పెంచగా.. తాజా ఘటనతో యూపీలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. -
బిహార్కు ప్రత్యేక బలగాలు.. డేగ కళ్లతో పకడ్బందీ నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 11న జరిగే రెండో దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలి దశలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించినట్లు తెలిసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని(సీఏపీఎఫ్) రప్పించారు. పోలింగ్ రోజున బూత్ల వద్ద మూడు అంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన సీఏపీఎఫ్ సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు. డేగ కళ్లతో పకడ్బందీ నిఘా బిహార్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మొత్తం 1,650 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ నుంచి 1,332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. వీటిలో 208 కంపెనీలను 14 బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి బిహార్కు తరలించారు. ఇందులో 14,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ దళాలు సీఏపీఎఫ్ కమాండ్ కింద పోలింగ్ బూత్ల వద్ద భద్రతకు నాయకత్వం వహిస్తాయి. అలాగే.. పోలింగ్ బూత్లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగకళ్లతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ బూత్ల వద్ద పటిష్ట భద్రత బిహార్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. పోలింగ్ బూత్ల వద్ద రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సీఏపీఎఫ్ సిబ్బందిని రెండు విభాగాలుగా మోహరిస్తారు. పెద్ద బూత్లలో పూర్తిస్థాయి విభాగం అంటే.. ఎనిమిది మంది సాయుధ సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. ఇక తక్కువ మంది ఓటర్లు ఉన్న చిన్న బూత్లలో సగం విభాగం అంటే.. నలుగురు సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. అదనంగా బిహార్ హోంగార్డ్లు, దాదాపు 19వేల మంది ట్రైనీ పోలీసు సిబ్బంది, స్థానిక వాచ్మెన్లను కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించారు. వారిలో ఎవరినీ కూడా వారి సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించలేదు. సీఐఎస్ఎఫ్కు స్ట్రాంగ్ రూమ్ల బాధ్యత మొదటి దశ పోలింగ్ తర్వాత జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంను భద్రపరిచారు. రెండో దశ పోలింగ్ తర్వాత కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే సమయంలో కూడా సీఐఎస్ఎఫ్ బలగాలే భద్రతను పర్యవేక్షిస్తాయి. బిహార్ పోలీస్ హెడ్క్వార్టర్స్లోని డీజీపీ కంట్రోల్ రూమ్ ఎన్నికలకు ప్రధాన కమాండ్ సెంటర్గా పనిచేస్తోంది. ఇక్కడ పర్యవేక్షణ కోసం ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలను నియమించారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్ సమయంలో మొత్తం 121 స్థానాల్లో ఓటింగ్ను ఇక్కడి నుండే నిశితంగా పరిశీలించారు. నవంబర్ 11న జరిగే రెండో దశకు కూడా ఇదే విధానం కొనసాగుతుంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించగా, అత్యవసర వినియోగం కోసం ఐదు అదనపు కంపెనీలను రిజర్వ్లో ఉంచారు. -
బిహార్లో ముగిసిన రెండో విడుత ఎన్నికల ప్రచారం
పాట్నా: బిహార్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడుతలో ఎల్లుండి 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ చివరిరోజు అగ్రనేతలు రంగంలోకి దిగారు. కూటమి తరుఫున సభలు,రోడ్షోలు, సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతో కూడిన మహాగట్ బంధన్(మహా కూటమి)తరుఫున రాహుల్గాంధీ ఎన్నికలు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కిషన్గంజ్, అమోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చుట్టేశారు. 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
బిహార్ బరిలో ఫైనల్ రౌండ్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం తుది దశకు చేరుకుంది. రెండో దశలో ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు తుదిదశ పోలింగ్ జరగనుంది. ఇది సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ ఎత్తుగడలకు అసలు సిసలు పరీక్షగా మారింది. చంపారన్ కంచుకోటల నుంచి సీమాంచల్ సంక్లిష్ట సమీకరణాల వరకు అరడజనుకు పైగా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. తొలి దశ హోరాహోరీగా ముగియగా, ఈ ఫైనల్ రౌండ్లో గెలిచి గద్దెనెక్కేదెవరన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తోంది. అందరి దృష్టి వీరిపైనే... రెండో దశ పోలింగ్ నితీశ్ కుమార్ కేబినెట్ సహచరులకు, మహాగఠ్బంధన్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులకు చావోరేవోగా మారింది. వీరి గెలుపోటములు కూటముల భవిష్యత్తును శాసించనున్నాయి. అందరి దృష్టీ వీఐపీలపైనే ఉంది. వారెవరంటే..⇒ రేణు దేవి (బీజేపీ, బెట్టియా): రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె పశ్చిమ చంపారన్లో బీజేపీకి అత్యంత కీలకమైన, బలమైన నాయకురాలు. ఈమె గెలుపు కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం.⇒ లేషి సింగ్ (జేడీయూ, ధమ్దాహా): నితీశ్ కేబినెట్లో ప్రస్తుత ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి. సీమాంచల్ ప్రాంతంలో జేడీయూకి బలమైన మహిళా నాయకురాలు. 2020లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఈమె, ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.⇒ లలిత్ కుమార్ యాదవ్ (ఆర్జేడీ, దర్భంగా గ్రామీణ): గత మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రి. దర్భంగా ప్రాంతంలో ఆర్జేడీకి బలమైన యాదవ నేతగా ఈమెను భావిస్తున్నారు.⇒ మదన్ సహాని (జేడీయూ, బహదూర్పూర్): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) నుంచి వచ్చిన బలమైన నాయకుడు. ఈయన గెలుపు ఎన్డీయేకు ముఖ్యం.⇒ సమీర్ కుమార్ మహాసేఠ్ (ఆర్జేడీ, మధుబని): గత మహాగఠ్బంధన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. మిథిలాంచల్ ప్రాంతంలో, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో మంచి పట్టున్న నేత.⇒ ప్రమోద్ కుమార్ (బీజేపీ, మోతిహరి): మోతిహరి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయన గెలుపు బీజేపీకి నల్లేరుపై నడకేనని భావిస్తున్నా, ఆర్జేడీ మాత్రం గట్టి పోటీ ఇస్తోంది.⇒ అక్తరుల్ ఇమాన్ (ఎంఐఎం, అమౌర్): ఈయన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా ఈయన మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చంపారన్ కోటలో హోరాహోరీ.. ఈ నాలుగింటిపైనే ఫోకస్! 2020 ఎన్నికల్లో చంపారన్ ప్రాంతం (తూర్పు, పశ్చిమ) ఎన్డీయేకు కంచుకోటగా నిలిచింది. ఈసారి ఈ కోటను బద్దలుకొట్టాలని మహాగఠ్బంధన్, నిలబెట్టుకోవాలని ఎన్డీయే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్త ఆసక్తిని రేపుతున్నాయి.⇒ బెట్టియా (పశ్చిమ చంపారన్): ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి (బీజేపీ) బరిలో ఉన్నారు. 2020లో 18 వేల మెజారిటీతో గెలిచిన ఈమెకు.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వాషి అహ్మద్, జన్ సురాజ్ అభ్యర్థి అనిల్ కుమార్ సింగ్ల నుంచి త్రిముఖ పోటీ ఎదురవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలు, నిరుద్యోగం ఇక్కడ ప్రభావం చూపే అంశాలు.⇒ మోతిహరి (తూర్పు చంపారన్): బీజేపీకి ఇది అత్యంత పటిష్టమైన కోట. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రమోద్ కుమార్ (బీజేపీ) మరోసారి ఆర్జేడీ అభ్యర్థి ఓం ప్రకాష్ చౌదరితో తలపడుతున్నారు. 70% గ్రామీణ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ప్రమోద్ కుమార్ వ్యక్తిగత ఇమేజ్, బీజేపీ సంస్థాగత బలం ఎన్డీయేకు కొండంత అండగా నిలుస్తున్నాయి.⇒ నర్కటియాగంజ్ (పశ్చిమ చంపారన్): ఇక్కడ మహాగఠ్బంధన్ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో ఏకాభిప్రాయం కుదరక, ఆర్జేడీ (దీపక్ యాదవ్), కాంగ్రెస్ (శాశ్వత్ కేదార్) ఇద్దరూ బరిలో నిలిచారు. ఇది ’ఫ్రెండ్లీ ఫైట్’అని పైకి చెబుతున్నా, మహాగఠ్బంధన్ ఓటు బ్యాంకు స్పష్టంగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం నేరుగా బీజేపీ (సంజయ్ పాండే) విజయానికి బాటలు వేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.⇒ వాల్మికి నగర్ (పశ్చిమ చంపారన్): ఇది జేడీయూకి బలమైన స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (జేడీయూ)కు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2015లో ఇండిపెండెంట్గా గెలిచిన ఈయనే, 2020లో జేడీయూ తరపున గెలిచారు. ఈసారి కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రచారం చేసినా, ఇక్కడ జేడీయూ అభ్యరి్థదే పైచేయిగా కనిపిస్తోంది. -
చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు
సమస్తీపూర్: బిహార్లోని సమస్తీపూర్లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్(ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపింది. శనివారం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరలవుతోంది. పార్టీ గుర్తులు ముద్రించి ఉన్న ఆ స్లిప్పులను జనం ఏరుతున్నట్లుగా అందులో కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ సీరియస్గా స్పందించింది. అవి ఈవీఎంల నుంచి పడేసిన స్లిప్పులేనని పేర్కొంది. అయితే, అవి పోలింగ్ ముందు రోజైన బుధవారం నిర్వహించిన మాక్ పోల్కు సంబంధించిన స్లిప్పులు మాత్రమేనని, వాస్తవ ఓటింగ్నకు సంబంధించినవి కావని జిల్లా యంత్రాంగం తెలిపింది.మాక్ పోల్ తర్వాత స్లిప్పులను కత్తిరించి బయటపడేశామని, అందులో కట్ కాని కొన్ని స్లిప్పులు స్థానికులు ఏరుకున్నారని డీఎం రోషన్ కుష్వాహా వివరించారు. తాము స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి వాటిని పరిశీలించామన్నారు. వాటిపై ఉన్న ఈవీఎంల నంబర్ల ఆధారంగా బాధ్యులైన పోలింగ్ సిబ్బంది గుర్తించవచ్చని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. సంబంధిత నియోజకవర్గంలోని అభ్యర్థులకు ఈ విషయం తెలిపామన్నారు.ఇందుకు బాధ్యుడైన అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారి(ఏఆర్వో)పై కఠినచర్యలు తీసుకోవాలని ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించారు. సంబంధిత ఏఆర్వోను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, సవివర నివేదిక అందజేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును పరిశీలించే ఉద్దేశంతో మాక్ పోల్ ప్రక్రియను చేపడతారు. అనంతరం, అందులోని ట్రయల్స్కు సంబంధించిన డేటాను పూర్తిగా తొలగిస్తారు. -
‘బిహార్లో మళ్లీ వచ్చేది మేమే..’
పూర్నియా: బిహార్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఈ రోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) బిహార్లో పూర్నియా నగరంలో ఎన్డేటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. బిహార్లో తిరిగి అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బిహార్లో ఉన్న 243 సీట్లకు గాను 160 సీట్లను కచ్చితంగా గెలుస్తామన్నారు అమిత్ షా. ఇక్కడ చొరబాటు అనేది చాలా సీరియస్ అంశం. సీమాంచల్ ప్రాంతంలో అనేక సమస్యలున్నాయి. అందులో చొరబాటు అనేది అతి ప్రధానమైనది. ఇది బిహార్ రాష్ట్రంలో అత్యంత ప్రభావం చూపుతుంది. లా అండ్ ఆర్డర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము ఇక్కడ కచ్చితంగా ఒకటి నిర్ణయించుకున్నాం. వచ్చే ఐదేళ్లలో చొరబాటు దారుల్ని నియంత్రించడంపైనే మా దృష్టి ఉంది. ఇక్కడ అక్రమ వ్యాపారాలు చేసే వారికి చోటు లేదు. ప్రతీ ఒక్క అక్రమ వలస దారుడ్ని ఒకరి తరువాత ఒకర్ని వెనక్కి పంపేస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
బీహార్ లో గెలిచేశాం.. ఇక తుపాకులు ఉండవు
-
బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్
-
కొనసాగుతున్న బీహార్ పోలింగ్ 42 శాతం పోలింగ్ పూర్తి
-
బీహార్ తొలి విడత పోలింగ్ ప్రారంభం
-
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు సర్వం సిద్ధం
-
బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ అప్డేట్స్.. -
నేడే బిహార్ తొలి దశ పోలింగ్
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో హోరాహోరీగా ప్రచారం జరగ్గా నేడు పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలుకానుంది. అధికార ఎన్డీఏ, విపక్షాల మహాగఠ్బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. గురువారం మొత్తంగా 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో ఉండటం గమనార్హం. గురువారం ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియో జకవ ర్గాల్లోనూ గురువారం తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. రాఘోపూర్లో హ్యాట్రిక్ కోసం తేజస్వీ కన్నేయగా, 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్ కుమార్ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా డుతున్నా రు. రాఘోపూర్లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కంకణం కట్టుకున్నారు. పొరుగు నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకు న్నారు. జనసురాజ్ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ పోటీచేస్తున్న మొఖానాలోనూ గురువారమే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆర్జేడీ తరఫున వీణాదేవి పోటీచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ షురూ అయ్యింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ముఖ్యాంశాలుమొదటి దశ పోలింగ్ తేదీ: నవంబర్ 6, 2025ఓట్ల లెక్కింపు: నవంబర్ 14, 2025మొత్తం నియోజకవర్గాలు: 243మొదటి దశలో ఓటింగ్ జరిగే నియోజకవర్గాలు: 121జిల్లాల సంఖ్య: 18మొత్తం అభ్యర్థులు: 1,314ఓటు హక్కున్న ఓటర్లు : 7.4 కోట్ల మందిమొదటి సారి ఓటు వేయనున్న వారు: 14 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్రాజ్ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. ప్రభావిత అంశాలు ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యత్నించింది. ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి. -
కుల రాజకీయాలే.. పొలిటికల్ పార్టీలకు ఇంధనం..!
కుల వ్యవస్థ..! ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్కు మాత్రమే సొంతం..! ఇంకా చెప్పాలంటే.. భారత్లో ఓ వ్యక్తి పుట్టగానే.. అతనికి కులం అనే ట్యాగ్ని తగిలించేస్తారు..! కన్ను తెరిస్తే కులం.. కన్ను మూస్తే కులం.. జీవితమంతా కులం కులం కులం..! ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది. ముఖ్యంగా బిహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది. బిహార్ వెనకబాటుకు కారణం నిరుద్యోగితో.. పరిశ్రమల లేమి కారణం కాదు..! కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం..! ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం..! ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అని ఓ సినీ కవి అన్నాడు.. బిహార్లో మాత్రం ‘కులమేరా అన్నిటికీ మూలం’ అనే పరిస్థితులు ఉన్నాయి. కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్టతొలి రాష్ట్రం కూడా బిహారే..! ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు. రాజకీయనాయకులు కులం అనే అంశాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిహార్లో కులం అనేది ఒక పదం కాదు.. ప్రజల మధ్య ఒక గోడ. ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతే.. మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది. భారతదేశంలోనే కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం బిహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.2023లో బిహార్ కులగణన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు అయితే.. వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు(EBC) 36%, ఇతర వెనుకబడిన వర్గాలు(OBC) 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్పూత్లు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. బిహార్లో ప్రతీ 10 మంది ఓటర్లలో 8 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారే..! ఇప్పుడు ఊహించండి.. కులం ఓ బలమైన గోడగా ఉన్న బిహార్లో ఎన్నికలు ఎలా ఉంటాయో..? అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడు అయినా.. కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే.. విజయం కాదు కదా.. విజయపుటంచులను చేరడం కూడా అసాధ్యమే..! అందుకే.. బిహార్లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి, అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణల చుట్టే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!కలసికట్టుగా ఉన్నారా??బిహార్లో ఓబీసీలంతా కలసి కట్టుగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇదమిత్థంగా కూడా అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీల్లోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాస్వాన్, ముసహార్, చమార్లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మీ, కోయిరీ, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బిహార్లో కులాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు..! రాజకీయ ఆయుధం మాత్రమే!. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? ఎవరు గెలవాలి? ఎవరిని ఓడించాలి? అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక.. ప్రతి కూటమి.. ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ‘ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. బిహార్లో మాత్రం.. ‘ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందినది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నా.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువు అయినా.. బిహార్లో మాత్రం కులమే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీగా ఉంది.90వ దశకం నుంచి..బిహార్ కుల వ్యవస్థను.. కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. 90వ దశకానికి, అంటే.. మండల్ కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే..! అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డీఎన్ఏ మారిపోయినట్లయింది. వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే.. ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బిహార్ మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ అణగారిన వర్గాల స్వరంగా ఎదిగారు. ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ‘ఎం-వై సమీకరణం’.. అంటే ముస్లింలు, యాదవులతో నిర్మించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన కుర్మీలు, ఇతర అత్యంత వెనకబడిన వర్గాల తరఫున మాట్లాడారు. 2023లో కులగణన చేయించింది కూడా ఆయన సర్కారే. కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తే.. ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు. దాంతో.. బిహార్లో ‘కుల గుర్తింపుల యుద్ధం’ మరింత ముదిరింది.కులాల వారీగా పార్టీలుబిహార్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి. కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఎవరూ.. ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్తోంది. జనతాదళ్ (యూ) కుర్మీలు, ఈబీసీలపై ఆధారపడుతోంది. బీజేపీ అయితే.. అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది. అంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. బిహార్లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా.. కులాలను నమ్ముకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు. అంటే.. ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప.. పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది. అంటే.. గ్రామంలో పరిస్థితులు.. బడుల్లో టీచర్ల నియామకాలు, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా.. తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే.. తమ మాట వింటాడనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. బిహార్లో రాజకీయ నాయకులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది. ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు? అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ.. కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీశ్కుమార్ తరచూ కూటములను మార్చడం వెనక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన అయితే ఆర్జేడీ.. లేదే బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తుంటారు. అంటే.. బిహార్లో సిద్ధాంతాలను కాకుండా.. కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం..! అంటే.. అభ్యర్థి ప్రజాసేవకుడా? ప్రజలకు మంచి సేవ చేస్తూ.. పాలనను అందిస్తాడా? అనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం ఏది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.ఆ నియోజకవర్గాల్లో మార్పు..!కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్నా, గయా, ముజఫర్పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంథాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం, యువ ఓటర్లు బిహార్ వెలుపల చదువుకున్న వారు కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40% యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెల్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఢిల్లీలో, తమిళనాడులో రోజుకూలీలుగా.. ముంబైలో రిక్షావాలాలా.. సూరత్లోని కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత.. మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. బిహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల ఛట్రం నుంచి బయట ఉన్నా.. తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కులం అనేది బిహార్ వెలుపల అదృశ్యమైనా.. రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుందన్నట్లే..! అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ వర్గం.. ఇప్పుడు కులాలుగా విడిపోతుందా? సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.మార్పునకు నాంది పలుకుతున్న మహిళలు.. బిహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు, గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మద్య నిషేధాన్ని అమలు చేసింది. దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ 60 శాతాన్ని దాటింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా.. భద్రత, విద్య, సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బిహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని, ఓటుహక్కును వినియోగించుకుంటారా? అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? విద్యావంతులు, యువత, మహిళలు, వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా? ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన.. నొక్కేప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళ్తారా? కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బిహార్కు ఉన్న అపవాదును తొలగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే..! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. - హెచ్.కమలాపతిరావు -
రేపే బిహార్ తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ప్రచార ఘట్టానికి తెరపడింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలి దశ ఎన్నికలు జరిగే స్థానాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. చివరిరోజు ఇటు ఎన్డీయే, అటు మహాగఠ్బంధన్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ ముఖ్య నేతలు ఎన్డీయే తరఫున... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహా కూటమి తరఫున చివరి అ్రస్తాలను సంధించారు.తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్రాజ్ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పారీ్టల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. పోటాపోటీ ఇక్కడే తొలి దశలో నితీశ్ కేబినెట్లోని 8 మంది మంత్రులతో సహా పలువురు ఉద్ధండుల భవితవ్యం తేలనుంది. ⇒ ఇమామ్గంజ్: మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ (హిందూస్తానీ అవామ్ మోర్చా) భవితవ్యాన్ని తేల్చనున్న ప్రతిష్టాత్మక స్థానం. ⇒ జముయి: అంతర్జాతీయ షూటర్ శ్రేయసి సింగ్ (బీజేపీ) రాజకీయ అరంగేట్రం చేస్తున్న స్థానం.⇒ గయా టౌన్: బీజేపీ కంచుకోటలో మంత్రి ప్రేమ్ కుమార్ మరోసారి బరిలో ఉన్నారు.⇒ బాంకా: మంత్రి రామ్ నారాయణ్ మండల్ (బీజేపీ), మాజీ మంత్రి జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ (ఆర్జేడీ) మధ్య ముఖాముఖి పోరు.ప్రభావిత అంశాలు ⇒ ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. ⇒ 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యతి్నంచింది. ⇒ ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. ⇒ నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. ⇒ నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి. -
రికార్డు స్థాయి విజయం తథ్యం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఈసారి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గత 20 ఏళ్లలో ఏన్నడూ లేనట్టి అద్భుతమైన విజయం ఈ ఎన్నికల్లో సాధించబోతున్నామని చెప్పారు. జంగిల్రాజ్ మనుషులకు ఘోరమైన పరాభవం తప్పదని పునరుద్ఘాటించారు. ఇద్దరు యువరాజులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల మద్దతు పొందడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన యువరాజు ఛఠ్ పూజలను అవమానించాడని మండిపడ్డారు.ప్రధాని మోదీ మంగళవారం బిహార్ బీజేపీ మహిళా కార్యకర్తలతో నమో యాప్ ద్వారా వర్చువ ల్గా సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం మహిళా కార్యకర్తలు కష్టపడి పని చేసు న్నారని ప్రశంసించారు. బిహార్లో ఇటీవల పలు బహిరంగ సభల్లో పాల్గొన్నా నని, మహి ళలు అత్యధికంగా హాజరయ్యారని చెప్పారు. ఒక సభకు మించి మరో సభ జరిగిందన్నారు. ఎన్డీయేకు మహిళల ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.ఎవరూ ఊహించలేని భారీ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మహా దళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వారి జీవనం మరింత సులభతరంగా మారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన, చట్టబద్ధమైన పాలన అమల్లో ఉన్నప్పుడే మహిళలు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఎన్డీయే పాలనలో ఆడబిడ్డల ప్రగతికి పెద్దపీట వేశామన్నారు. బిహార్ మహిళలు నేడు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసల వర్షం కురిపించారు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
రంజీ ట్రోఫీ 2025-26లో టీమిండియా అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ దేశవాళీ టోర్నీలో బిహార్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యవంశీ.. పాట్నా వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 166 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడినప్పటికి, వైభవ్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్తో అందరిని అలరించాడు.14 ఏళ్ల వైభవ్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 67 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 138.81గా ఉంది. కేవలం 7 పరుగుల దూరంలో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని వైభవ్ కోల్పోయాడు. బిజోన్ డే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కాగా ఈ టోర్నీలో బిహార్ వైస్ కెప్టెన్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ గత కొంత కాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్లో 408 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెఘాలయ ఇన్నింగ్స్లో అజయ్ దుహాన్(129) శతక్కొట్టగా.. ఛెత్రి(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే వర్షం కారణంగా తొలి రెండు రోజుల పాటు ఆట పూర్తిగా రద్దు అయింది. కేవలం ఆఖరి రెండు రోజుల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బిహార్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం భారత్ ఏ జట్టు : ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేర, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబె, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్రీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాంశ్ శర్మస్టాండ్ బై: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర, తనుష్ కోటిన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ షాకింగ్ నిర్ణయం.. విధ్వంసకర వీరుడికి గుడ్ బై!? -
ఉచితంగా బైక్ ఇచ్చిన రాహుల్.. ట్విస్ట్ ఇచ్చిన యువకుడు
ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.‘ఓ కొత్త మోటార్ బైక్ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.-సత్య. -
నా ప్రాణాలకు ప్రమాదముంది: తేజ్ ప్రతాప్
పట్నా: బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న నేరాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఏర్పాట్లు సరిపోవంటూ ఆయన వ్యక్తిగత భద్రతను పెంచాలని ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్బంగా రాజకీయ శత్రువులు తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్ర యంత్రాంగం తన వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లను మరింత పెంచాలని, అప్పుడే నిర్భయంగా ప్రచారం చేయగలనన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల అధికారులను కలిశారు. సుపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సొంత పార్టీ అభ్యర్థిపైనే ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థి మహాగఠ్బంధన్ అభ్యర్థి మద్దతు కోరారని ఆరోపించారు.ఎన్నికల్లో హింసను సహించే ప్రసక్తే లేదు: సీఈసీ కాన్పూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో హింసాత్మక చర్యలను సహించే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయొచ్చని సూచించారు. ఎన్నికలు పూర్తి శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. జ్ఞానేశ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ముందు అందరూ సమానమేనని తేలి్చచెప్పారు. ఎలాంటి పక్షపాతం గానీ, వివక్ష గానీ ఉండవని అన్నారు. ప్రజాస్వామ్యం పండుగలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
బిహార్ రాజకీయాల్లో జార్ఖండ్ జోక్యం
బిహార్లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. జార్ఖండ్ రాష్టానికి చెందిన నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్, జార్ఖండ్ సరిహద్దుల వెంట రాజ్మహల్ కొండలు ఉన్నాయి. ఆ కొండల వెంట ఉండే కతియార్, భాగల్పూర్లోని కహాల్గావ్, బంకా, జముయ్ జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రజలు సంస్కృతి, భాష పరంగా జార్ఖండ్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజకీయంగా తూర్పు బిహార్పై జార్ఖండ్ నేతల ప్రభావం ఉంటుందని స్వయంగా స్థానిక ఓటర్లే చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లే నేతల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. జార్ఖండ్ కేంద్రంగా వ్యూహ రచన చకై, బంకాలోని బెల్హార్, కటారియా కతిహార్లోని మణిపురి, భాగల్పూర్లోని కహాల్గావ్ అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు ఎక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గతంలో చకయి స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రాంత వాసులు గత ఏడాది నవంబర్లో గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జముయి జిల్లా ఖైరా బ్లాక్లోని గిరిజన ఫ్రైడే వేడుకకు రెండు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నేతలు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైతం ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. జార్ఖండ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయతి్నస్తోంది. ఓట్లను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇరు కూటములు కుల సమీకరణలను బేరీజు వేసుకుంటున్నాయి. చకయి చేజిక్కాలంటే.. జముయి జిల్లాలోని చకయి అసెంబ్లీ నియోజకవర్గం జార్ఖండ్లోని దేవరి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ఓటర్లలో 20.8 శాతం మంది యాదవులు, 11.5 శాతం మంది ముస్లింలు, 8.4 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీళ్లే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. జేఎంఎం, జేడీయూ ఎన్నికల చిహ్నాలు దాదాపు ఒకే ఆకృతిలో ఉండటం జేడీయూ బాగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఓట్లు జేడీయూకు పడుతున్నాయనే ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. 2010లో జేఎంఎం టికెట్పై సుమిత్ సింగ్ 188 ఓట్ల తేడా గెలిచారు. 2020లో అతనే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యరి్థని 581 ఓట్లతో ఓడించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. బెల్హార్ బలాబలాలు కీలకమే జార్ఖండ్లోని దేవ్ఘర్ సమీపంలోని బెల్హార్ సైతం జార్ఖండ్ మూలాలున్న నేతలతో ఇరు కూటములకు సవాల్గా మారింది. 2015 ఎన్నికల్లో కటోరియాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్కిషోర్ ప్రసాద్ జేఎంఎం టికెట్పై పోటీ చేశారు. 2010 సురేంద్ర ప్రసాద్ గుప్తా జేఎంఎం నుంచి పోటీచేసి 11 వేల ఓట్లు సాధించారు. 2005 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి శైలేంద్ర కుమార్ 3 వేల ఓట్లు సాధించారు. మొదట్నుంచీ ఇక్కడ జార్ఖండ్ మూలాలున్న నేతలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఎన్డీఏ, విపక్షాల ‘ఇండియా’ కూటమి జేఎంఎం నేతల ప్రసన్నం కోసం అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2020లో ఇక్కడ జేడీయూకు చెందిన మనోజ్ యాదవ్ సమీప అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు రామ్దేవ్ యాదవ్పై కేవలం రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆర్జేడీ హవా కొనసాగితే అధికార కూటమికి ఇక్కడ పరాభవం తప్పదుకహల్గావ్ కహానీ జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతానికి అనుకుని ఉన్న కహల్గావ్ సీటు ఇక్కడ కీలకమైంది. ఈ స్థానం నుంచి తన కుమారుడిని అభ్యర్థిగా నిలపాలని జార్ఖండ్ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారు. గొడ్డా ఎమ్మెల్యే సంజయ్ జార్ఖండ్లో ఆర్జేడీ కోటా నుంచి మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండేసింగ్ సైతం తన సన్నిహితురాలు ప్రవీణ్ కుషా్వహాను ఈ స్థానం నుంచి పోటీకి నిలపాలని ప్రయతి్నంచారు. వీళ్లను ప్రసన్నం చేసుకుని తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గతంలోనే ప్రయతి్నంచారు. కహల్గావ్లోని గోరాదిహ్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు తలనొప్పిగానే మారింది. ఎన్డీఏ ఇక్కడ సమీకరణలపై ముమ్మర కసరత్తు చేస్తోంది. కటోరియాను ఆకట్టుకునేదెలా? కటోరియా స్థానంపై గత 35 సంవత్సరాలుగా జేఎంఎం పార్టీ కన్నేసింది. 2015, 2020లో జేఎంఎం బంకా జిల్లాలోని కటోరియా స్థానం నుంచి అంజలి హన్నాను నిలబెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రెండు సీట్లలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏ పార్టీ తరఫున పోటీచేసినా సరే ఆ అభ్యరి్థకి జార్ఖండ్ నేతల ఆశీస్సులు కీలకం. ముఖ్యంగా జేఎంఎం మద్దతు అత్యంత ముఖ్యం. అనుకూలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పార్టీలు విజయావకాశాలకు పావులు కదుపుతున్నాయి. ‘మణి’హారం ఎవరిదో? ఎస్టీలకు కేటాయించిన కతిహార్లోని మణిహరి సీటును కైవసం చేసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. గిరిజన ఓటు తమకు అనుకూలమని చెబుతోంది. గత ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో పార్టీల గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి ఈ ఇబ్బంది రాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు జార్ఖండ్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. చివరకు జేఎంఎం చించిన నేతలనే అన్ని పార్టీలూ బరిలోకి దించాయి. అయితే ఇక్కడ పడకేసిన అభివృద్ధి అనేదే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే వీలుంది. -
‘ఆపరేషన్ సిందూర్తో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి నిద్ర కరువైంది’
పాట్నా: పహల్గాంకు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు పీవోకే,పాకిస్తాన్లో ఉగ్రశిబిరాల్ని కూల్చేస్తుంటే కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి నిద్ర కరువైందని ఆరోపించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. సభలో మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలే మనం ‘ఆపరేషన్ సిందూర్' నిర్వహించాం. మనం హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన సైనికుల్ని ప్రతి భారతీయుడు గర్వించాలి. కానీ సైన్యం విజయం సాధించినా, కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి’అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్లో ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ నిద్రపోలేకపోయింది. ఇప్పటికీ పాకిస్తాన్, కాంగ్రెస్ నామ్దార్లు 'ఆపరేషన్ సిందూర్' నుంచి కోలుకోలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏ మేనిఫెస్టోను ‘బిహార్ సమగ్ర అభివృద్ధికి హామీ’గా అభివర్ణించారు. మీ ఉత్సాహాన్ని చూస్తే ‘వికసిత బిహార్’ లక్ష్యం పట్ల నా సంకల్పం మరింత బలపడుతోందని వ్యాఖ్యానించారు. భారత్ ఉగ్రవాదాన్ని సహించదుపాక్ ఉగ్రవాదులు పహల్గామ్ టూరిస్టులపై దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పాక్,పీవోకేలో ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేసింది. వందల్లో ఉగ్రవాదుల్ని ముట్టుబెట్టింది. ప్రధాని మోదీ పలహల్గాం ఉగ్రదాడి ‘ఉగ్రవాదంలో అత్యంత క్రూరమైన రూపం’గా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై భారత పోరాటంలో కొత్త అధ్యాయం. ఇకపై భారత్ ఉగ్రవాదాన్ని సహించదు’అని స్పష్టం చేశారు. -
‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!
బిహార్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. సీమాంచల్లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్లోని ఈబీసీల మద్దతు, మగద్లోని దళిత ఓటర్లు, భోజ్పుర్లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది. నితీశ్ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్ ఇంజిన్’నినాదం, మహాగఠ్బంధన్ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.సీమాంచల్: మహాగఠ్బంధన్ కోటలో ‘చీలిక’గండం సీమాంచల్లో కిషన్గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్ అనేది బిహార్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్గంజ్లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్బంధన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్బంధన్ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్బంధన్ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్బంధన్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్బంధన్ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది. మిథిలాంచల్: నితీశ్కు అసలు సిసలు అగ్నిపరీక్ష మిథిలాంచల్లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్పుత్లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్ కుమార్కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్ ఆఫ్ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్ సహానీకి నిషాద్ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్బంధన్ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది. ముస్లిం, యాదవ్లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్బంధన్ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.మగధ్: ‘లెఫ్ట్’జోరుకు కళ్లెం! మగధ్ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్బంధన్(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్డీఏలోని జితన్ రాం మాంఝీ (హెచ్ఏఎం పారీ్ట), చిరాగ్ పాశ్వాన్ (లోక్జనశక్తి– పాశ్వాన్) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్ నేత), చిరాగ్ పాశ్వాన్ (పాశ్వాన్ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్), సీపీఐ–ఎంఎల్ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.భోజ్పూర్: నగరాలపై ‘కమలం’ఆశ భోజ్పూర్ పరిధిలో పట్నా, భోజ్పుర్(ఆరా), రోహ్తాస్, బక్సర్, కైమూర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్పుత్ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్పుత్ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2020లో మగధ్ లాగే భోజ్పుర్ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్బంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్బంధన్ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు. -
నిర్మాణ రంగంపై ‘బిహారీ’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: బిహార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో నిర్మాణ రంగ పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు వలస ఓటర్ల తరలింపుపై దృష్టి సారించాయి. వారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు ప్రధాన పార్టీలు వలస ఓటర్లను రప్పించేందుకు రైలు, బస్ టికెట్లు, భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వలస ఓటర్లకు సెలవు ఇవ్వాలిందిగా ఆయా వలస కార్మికులు పనిచేసే కర్మాగారాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో సొంతూళ్ల పయనమైన వలసదారులతో రైళ్లు, ప్రత్యేక బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గత నెలాఖరులో దీపావళి, ఛట్ పూజ కోసం సొంతూళ్లకు వెళ్లిన కొందరు బిహారీలు ఇక ఎన్నికల తర్వాతే తిరిగి పనికి వస్తారని ఓ నిర్మాణదారుడు తెలిపారు. ఇప్పటికే కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణలో బిహార్ ఎన్నికల రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. 8–10 లక్షల మంది బిహారీలు.. బిహార్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 45.78 లక్షల మంది బీహారీలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 25–30 లక్షల మంది వలస కార్మికులు ఉండగా.. ఇందులో బిహార్ నుంచే సుమారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో 80 శాతం బ్లూ కాలర్ వర్కర్లు కాగా.. మిగిలిన వారు వైట్ కాలర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు ఉంటారు. బిహారీలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో వలస వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్లో ఎక్కువగా బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్పేట, సికింద్రాబాద్లో నివసిస్తున్నారు. గ్రేటర్ రియల్టీపై ప్రభావం.. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి వచ్చే ఐదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన రాష్ట్రంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడకు వచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా బిహారీలు హైదరాబాద్లో నిర్మాణ రంగంతో పాటు రైస్ మిల్లులు, చికెన్ షాపులు, పారిశ్రామిక వాడల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. తాజాగా బిహార్ ఎన్నికల నేపథ్యంలో వీరిలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారని, దీంతో నిర్మాణ పనులు నెమ్మదించే అవకాశాలున్నాయని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
బిహార్కు కోటి వరాలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్కు వారం రోజుల ముందు అధికార ఎన్డీయే రాష్ట్ర ప్రజలకు ‘కోటి’ వరాలు ప్రకటించింది. సంకల్ప పత్రం పేరిట తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. వలసలకు పేరుగాంచిన బిహార్లో యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచి్చంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఏడు ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని వెల్లడించింది. ఉచిత రేషన్, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామంటూ హామీలు గుప్పించింది. యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకొనేలా వరాల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజధాని పటా్నలో సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ జనశక్తి(రామ్విలాస్) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, జేడీ(యూ)తోపాటు కూటమి నేతలు పాల్గొన్నారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు → బిహార్ యువతకు కోటి ప్రభుత్వ ఉద్యో గాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు. → కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య → ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందేలా కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడం. → మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం. → ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈబీసీ) రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. → కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్(కేటీకేఎస్) నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9 వేల చొప్పున పెట్టుబడి సాయం. ఈ మొత్తం ఏటా మూడు విడతల్లో చెల్లింపు. → బిహార్లో 7ఎక్స్ప్రెస్ రహదారుల నిర్మాణం, 4 నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు. → ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కుల స్థాపన. → పేదలకు 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం → రూ.5,000 కోట్లతో పాఠశాలల అభివృద్ధి → 100 ఎంఎస్ఎంఈ పార్కులు, 50 వేలకుపైగా కాటేజీ పరిశ్రమలు → ప్రతి డివిజన్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు → ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున సాయం → అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు గ్యారంటీ -
ఛఠ్ పూజలను కించపర్చారు
చాప్రా/ముజఫర్పూర్: బిహార్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బిహార్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకొనే ఛఠ్ పూజలను ఆ కూటమి కించపర్చిందని మండిపడ్డారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించడం విపక్ష నేతలకు ఇష్టం లేదన్నారు. ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గురువారం ముజఫర్పూర్, చాప్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బిహార్లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఛఠ్ పూజకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచి్చందని ఆనందం వ్యక్తంచేశారు. పవిత్రమైన ఈ పండుగపై కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి విషం కక్కుతోందని, డ్రామా అంటూ నిందలేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదు మన విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు తీరిక చేసుకొని విదేశాలకు యాత్రలకు వెళ్తుంటారు తప్ప అయోధ్యలో రామమందిరాన్ని ఏనాడూ దర్శించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ఛాయ్ అమ్ముకొని బతికిన ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కావడం చూసి విపక్ష నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. తాను అలాంటి వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదన్నారు. -
రాహుల్ తన ఇటలీ మూలాలు బయటపెట్టారు: అమిత్ షా
నలంద/లఖీసరాయ్: బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు. ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది. నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు. -
బిహార్ టైమ్ వస్తుందా?
మొదట, మనం 20వ శతాబ్దపు చివరి దశాబ్దంలోకి వెళదాం. ఒకరోజు ఇద్దరు సహోద్యోగులతో కలిసి పట్నా నుంచి ధన్బాద్కు వెళ్తున్నాను. శీతకాలంలో సూర్య కాంతి కూడా మసకగానే ఉంది. అపుడు నా కంటపడిన దృశ్యాన్ని తలచుకుంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంటుంది. చీర చుట్టుకున్న ఓ మహిళ గజగజ వణికిస్తున్న చలిలో ఒక మురికి కుంటలోకి దిగబోతోంది. స్నానం చేసిన తర్వాత కట్టుకునేందుకు, బహుశా మరో చీర లేదనుకుంటా! రోడ్డు మీద వెళుతున్న వాహనాలలోని వ్యక్తులు ఆమె వంక చూపులు సంధిస్తున్నారు. ఆమె సంకోచాన్ని నేను అర్థం చేసుకున్నాను. అటువైపు చూడకుండా ఉండే ప్రయత్నంలో ఉన్నాను. కానీ, ఆ తర్వాత చూసిన దృశ్యం మా ఇబ్బందిని మరింత పెంచింది. ఆమె నెమ్మదిగా తుంటిపై కూర్చుని అదే కుంటలోని నీటితో నోటిని పుక్కిలించడం మొదలుపెట్టింది. కాలం తెచ్చిన మార్పుఆ తర్వాత కాలగతిలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. బిహార్ రెండు రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకృతమైంది. ధన్బాద్ ఇపుడు జార్ఖండ్లో భాగమైంది. బిహార్ మహిళల స్థితిగతులలో సమూలమైన మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, సమాజం రెండింటి ప్రమేయం... మహిళలు పెద్ద అంగ వేసేందుకు సాయ పడిందని ప్రభుత్వ డేటా సూచిస్తోంది. బిహార్లో మహిళా అక్షరాస్యత రేటు 2000 సంవత్సరంలో 33%గా ఉన్నది నేడు 73.91%కి చేరినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వనితలకు 35% రిజర్వేషన్ కల్పించడంతో, కార్యాలయాల్లో పురుషులు–మహిళల నిష్పత్తి మెరుగుపడింది. నేడు పోలీసు శాఖలో మహిళలు 37%గా ఉన్నారు. అలాగే, మహిళా ఉపాధ్యాయుల సంఖ్య 2,61,000గా ఉంది. బిహార్ స్త్రీలు నేడు కలం, పిస్తోలు రెండింటినీ ఝళిపి స్తున్నారు. ఇక క్రియాశీల స్వయం సహాయక బృందాలు బిహార్లో 10.6 లక్షల మేరకు ఉంటాయి. వీటి ద్వారా 1.45 కోట్ల మంది మహిళలు తమ వ్యక్తిగత ఆర్థిక విజయాలను సాధిస్తున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ మహిళలు బ్యాంకుల నుంచి మొత్తం రూ. 15,000 కోట్ల రుణాన్ని స్వీకరించారు. రుణాలను తీర్చడంలో కూడా వారి రికార్డు పురుషుల కన్నా మెరుగ్గా 99%గా ఉంది. మనకు 1980లు, 1990ల నాటి దురదృష్టకర దృశ్యాలు ఇపుడు కనిపించకపోవడానికి అదే కారణం. గడచిన 2015, 2020 ఎన్నికల్లో 60% మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు ఒక శక్తిమంతమైన ఓటు బ్యాంకుగా రూపుదిద్దుకున్నారని అది సూచి స్తోంది. ప్రతి రాజకీయ పార్టీ వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడానికి అదే కారణం. అయితే, ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే! ఒక్క పరిశ్రమా లేక...మహిళా సాధికారత ఉన్నప్పటికీ, వారి కుమారులు, భర్తలు, కుటుంబంలోని ఇతర సభ్యులు పొట్ట చేతపట్టుకుని వలసపోక తప్పని పరిస్థితులు నేటికీ ఉన్నాయి. ఈ నిస్సహాయ స్థితి నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని సంకేతాలూ వెలతెల పోతున్నాయి. రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమ ఒక్కటి కూడా పెద్దది లేక పోవడం ఉద్యోగాలు కొరవడటానికి ప్రధాన కారణం. రాష్ట్రంలో వ్యవసాయ కమతాల పరిమాణం కూడా కుంచించుకుపోతోంది. తరచూ అతివృష్టి, అనావృష్టితో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయా నికి దూరం జరుగుతున్నారు. ప్రస్తుతం సాగుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో తనకంటూ చెప్పుకోతగినవి రాష్ట్రానికి పెద్దగా ఏమీ లేవు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుప్పుకూలుతున్నాయి. వస్తూత్పత్తి, మౌలిక వసతుల కల్పన రంగాల నుంచే దేశంలో 80% ఉద్యోగావకాశాలు వస్తున్న సంగతిని మరచిపోకూడదు. వీటన్నింటి వల్ల దాదాపు 3 కోట్ల మంది అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు పాతిక శాతం ఉపాధి నిమిత్తం వలసపోక తప్పని స్థితిలో ఉన్నారు. ప్రస్తుత బిహార్ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగావకాశాలు ప్రధానాంశంగా మారాయంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. వలసలు ఆగేనా?ఛఠ్ పూజ కోసం గ్రామాలకు తిరిగి వచ్చిన వారితో మాట్లాడిన వాటిల్లో కేవలం రెండు ఉదంతాల గురించి ప్రస్తావిస్తాను. వారి బాధ మొత్తం బిహారీ యువత ఆవేదనకు అద్దం పడుతుంది. బెంగళూరులోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో మాధేపురాకు చెందిన గంగారామ్ పనిచేస్తున్నారు. బిహార్ వదిలి ఎందుకు బయటకు వెళ్ళి పోవాల్సి వచ్చిందని అడిగినప్పుడు – ‘‘బిహార్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఏ పనీ దొరకదు. పొట్ట నింపుకొని, కుటుంబాన్ని పోషించుకునేందుకు మేం బయటకు వెళ్ళక తప్పింది కాదు. బయటకు వెళ్ళాలనే ఉద్దేశం మాకేమీ లేదు. ఇక్కడే పని దొరికితే మేం ఇల్లు విడిచి ఎందుకు వెళతాం?’’ అని ఆయన అన్నారు. తదు పరి ప్రశ్న కోసం ఎదురు చూడకుండా గంగారామ్ ఇంకా ఇలా చెప్పారు: ‘‘సంపాదించాల్సిన వయసు రాగానే మేం రాష్ట్రం విడిచి పెట్టేస్తున్నాం. దాంతో కుటుంబంతో, సమాజంతో మా అనుబంధాలు బలహీనమవుతున్నాయి. రెండేళ్ళ కొకసారి మేం ఇంటి ముఖం చూస్తున్నాం. తిరిగి బయలుదేరుతున్నపుడు, ఎన్నాళ్ళు ఇలా అయినవాళ్ళకి దూరంగా ఉంటాం అనిపిస్తుంది. వేరే రాష్ట్రా లలో మాకు మంచి మర్యాద కూడా దక్కదు’’.కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కురుకుంటున్నారనే ప్రశ్నకు ముంబయిలో ఉద్యోగం చేస్తున్న సంజయ్ చంద్రవంశీ ఇలా చెప్పారు: ‘‘ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారు తమ శక్తియుక్తులన్నింటినీ, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడంపై పెట్టాలి. బిహార్లో ఫ్యాక్టరీలు నెలకొంటే, నాలాంటి లక్షల మంది ఢిల్లీ, ముంబయి, సూరత్ లేదా బెంగళూరు వంటి చోట్లకు వెళ్ళా ల్సిన అవసరం ఉండదు. మేం ఉన్నచోటే ఉద్యోగం దొరక్కపోవచ్చు కానీ, కనీసం రాష్ట్రంలో ఉంటాం కదా!’’ రోటీ ఔర్ రోజ్గార్ (తిండి, ఉద్యోగం) అని గొంతు చించుకుంటున్న నాయకులు, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, నిర్మాణాత్మక వైఖరిని చేపడతారా? శుష్క వాగ్దానాల బదులు, పరిష్కారాల కోసం బిహారీలు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం క్రితం, పట్నాలో ఓ యువతి నన్ను అడిగింది: ‘క్యా అబ్ బిహార్ కీ బారీ హై?’ (ఈసారైనా బిహార్ వంతు వస్తుందా?) వెలుగు కోసం బిహార్ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి.శశి శేఖర్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘మీ కోసం సీఎం, పీఎం పోస్టులు ఖాళీగా లేవు’
పట్నా: బిహార్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. ఎన్డీఏ కూటమి, మహా కూటమిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిహార్లో ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ.. డ్యాన్స్ చేస్తారంటూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయగా, దానికి బీజేపీ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. ఇవి సీఎం, పీఎం పోస్టులు అని, అవేమీ మీ కోసం ఖాళీగా లేవని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ రోజు(బుధవారం, అక్టోబర్ 29వ తేదీ) దార్భంగాలో ఎన్నికల ర్యాలీ చేపట్టిన అమిత్ షా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్లో కానీ ఆర్జేడీలో కానీ వెవరైనా యువ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. తమ ఎన్డీఏ కూటమి మాత్రం యువ నేతల్ని ప్రోత్సహించే క్రమంలో చాలా మందికి టికెట్లు ఇచ్చిందన్నారు. ‘ఒకరేమో( లాలూజీ) తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నారు.. మరొకరు(సోనియా జీ) తన తనయుడు రాహుల్ గాంధీని దేశానికి పీఎం చేయాలని అనుకుంటున్నారు. ఇవేమైనా ఖాళీగా ఉన్న పదవులా.. వచ్చి కూర్చోవడానికి. మీ కుమారుల కోసం అవేమీ ఖాళీగా లేవు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. బిహార్లో ఏర్పడ్డ మహాఘట్బంధన్( మహా కూటమి) కాదని, అదొక దొంగల కూటమి అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు. ‘జన్నాయక్ కర్పూరి ఠాకూర్కు మోదీ జీ భారతరత్న ప్రదానం చేశారు. ఇప్పుడు, వారు (ప్రతిపక్షాలు) కర్పూరి జీ నుండి ఆ బిరుదును తీసివేయాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. బాబు జగ్జీవన్ రామ్ను ప్రధానమంత్రి కాకుండా చేసిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు చూశారు’ అని తనదైన శైలిలో మహా కూటమిపై విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి::కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు -
‘ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం..’
పట్నా: బిహార్లో మ్యానిఫెస్టో వేడి షురూ అయ్యింది. బిహార్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం(అక్టోబర్ 28వ తేదీ) తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మ్యానిఫెస్టోలు చేర్చింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్ బంధన్(మహా కూటమి) సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు మ్యానిఫెస్టో విడుదల చేసిన ఆయన.. తమ కూటమి గెలిచిన పక్షంలో 20 రోజుల్లోపే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.అదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చామన్నారు. ఇక జీవిక పథకం కింద ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నాయకత్వం వహించే మహిళల కోసం జీవిక అనే పథకం అమలు చేస్తున్నారు. దీనికింద పని చేసేవారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఇస్తామన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి.VIDEO | Patna, Bihar: After releasing the INDIA bloc's manifesto 'Tejashwi Pran' for the 2025 Bihar polls, RJD leader and Mahagathbandhan CM candidate Tejashwi Yadav says, "...today is a special day for all of us, not just to form a government but to build Bihar. Our goal is not… pic.twitter.com/mf6L8nJhgh— Press Trust of India (@PTI_News) October 28, 2025 27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణరాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు.20 నెలల్లోనే.. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.ఎన్డీడీ కూటమి, మహా కూటమిపై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ -
12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తాం: జ్ఞానేశ్ కుమార్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్) ఫేజ్వన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. సోమవారం(సెప్టెంబర్ 27) కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ మాట్లాడారు. 1951నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారు. 21ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. బిహార్లో 7.5కోట్ల మంది ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యింది. బిహార్లో ఎస్ఐఆర్పై ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. త్వరలో రెండో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తాం. ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఓటర్ల జాబితా లాక్ చేస్తాం. ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్ఓ విజిట్ చేస్తారు. బీఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫాంలో వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. 2003లో ఎవరితో ఉన్నామని లింక్ వివరాలు నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫామ్లో మ్యాచింగ్ , లింకింగ్ ప్రధానం.ఎన్యుమరేషన్ ఫాం రిటర్న్ చేసిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంలు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చు. అన్ని ఎన్యుమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తాం’అని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. డిసెంబర్ 9 నుంచి 8 జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ ,వెరిఫికేషన్ ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు. #SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz— Election Commission of India (@ECISVEEP) October 27, 2025 🚨 BREAKING | DelhiChief Election Commissioner Gyanesh Kumar says:“There has been considerable discussion about the necessity of SIR. But the Election Commission reiterates that under electoral law, revision of electoral rolls is mandatory before every election and can be… pic.twitter.com/GVjRZJkPxY— Jan Ki Baat (@jankibaat1) October 27, 2025 -
Rangareddy: సెల్ టవర్ ఎక్కి.. కిందకు దూకి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటకు పైగా కలకలం సృష్టించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని కిందకు దింపే యత్నం చేసినప్పటికీ అతను కిందకు దూకేశాడు. అయితే టవర్పై నుంచి దూకే క్రమంలో టవర్కు ఉన్న కడ్డీలు తగిలి కింద బురదలో పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతను బిహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు.. 108 అంబులెన్స్ సర్వీస్ను, డాక్టర్లను అక్కడ అందుబాటులో ఉంచారు. అయితే పోలీసు సిబ్బందిలో ఒకరు మెల్లగా పైకి ఎక్కి ఆ వ్యక్తిని కిందకు దింపే యత్నం చేశారు. అతన్ని పట్టుకుని పైకి లాగుదామనుకునేలోపే చేయి విదిల్చుకుని కిందకు దూకేశాడు ఆ బిహార్ వ్యక్తి. అసలు టవర్ ఎక్కి ఎందుకు దూకాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
చొరబాటుదారులను వెళ్లగొట్టుడే..
నలంద: బిహార్లో జంగిల్రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను బిహార్లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం బిహార్లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్రాజ్తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్రాజ్ నుంచి బిహార్కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
‘రైళ్లలో అమానవీయం’: బీహార్పై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: బీహార్లో ఎన్నికల సందడి నెలకొన్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండుగల సమయంలో బీహార్లో సామర్థ్యానికి మించిన రీతిలో రైళ్లను నడపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో ప్రయాణికులను రైళ్లలో అమానవీయ రీతిలో తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ మోసపూరిత విధానాలు, ఉద్దేశాలకు ఈ పరిస్థితి సజీవ నిదర్శమని రాహుల్ అభివర్ణించారు.‘బీహార్లో రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. టిక్కెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం అమానవీయంగా తయారయ్యింది. చాలా రైళ్లు 200 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు రైలు తలుపుల దగ్గర వేలాడుతున్నారు’ అంటూ రాహుల్ ‘ఎక్స్’లో వీడియోను షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూలు పండుగ రద్దీని తగ్గించేందుకు 12 వేల ప్రత్యేక రైళ్లు నడుపుతన్నట్లు ప్రకటించాయని, అన్ని రైళ్లు ఎక్కడని రాహుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఎందుకు ప్రయాణించాల్సి వస్తున్నదని రాహుల్ నిలదీశారు. त्योहारों का महीना है - दिवाली, भाईदूज, छठ।बिहार में इन त्योहारों का मतलब सिर्फ़ आस्था नहीं, घर लौटने की लालसा है - मिट्टी की खुशबू, परिवार का स्नेह, गांव का अपनापन।लेकिन यह लालसा अब एक संघर्ष बन चुकी है। बिहार जाने वाली ट्रेनें ठसाठस भरी हैं, टिकट मिलना असंभव है, और सफ़र… pic.twitter.com/hjrYJJFJ0F— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2025రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉంటే వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేదని, వీరంతా నిస్సహాయ ప్రయాణికులు మాత్రమే కాదని, ఎన్డీఏ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యం అని రాహుల్ పేర్కొన్నారు. కాగా పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ ఒకటి, నవంబర్ 30 మధ్య 12,011 ప్రత్యేక రైలు ట్రిప్పుల షెడ్యూల్ను ప్రకటించింది. సగటున, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 196 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. -
రికార్డులు బద్దలు కొడతాం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని బెయిల్పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్ సొంత గ్రామాన్ని సందర్శించారు. సమస్తీపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్ అంటే కర్పూరీ ఠాకూర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్ ఠాకూర్కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. సుపరిపాలనను ఆదరించాలి ‘‘2005లో బిహార్ ప్రజలు జంగిల్రాజ్కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్ సే చలేగా బిహార్, జబ్ ఫిర్ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్ కొత్త వేగంతో ముందుకెళ్తుంది) వారిలో అహంకారం తగ్గలేదు విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్బంధన్ కాదు.. మహాలాఠ్బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్రాజ్ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు. ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్రాజ్ నుంచి బిహార్కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్లు ఉన్నాయి.నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్కు దోహదపడుతోంది. బిహార్లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ. పరివార్ వల్ల సీతారాం కేసరికి అవమానాలు పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్రూమ్లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్ పండుగతోపాటు ఆదా(బచత్) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. -
మహాఘట్బంధన్కు మోదీ కౌంటర్.. బిహార్పై కీలక ప్రకటన
సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.నితీశ్ కుమార్ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు. -
నేడు బిహార్కు మోదీ, అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బిహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రక టించిన తర్వాత తొలిసారి మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్ షాకు ఇది రెండో పర్యటన. ఎన్డీయే తరఫున శుక్రవారం ఈ ఇద్దరు నేతలు మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రత్న, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ సొంత జిల్లా సమస్తిపూర్ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం.. బెగుసరాయ్లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్ షా సివాన్, బక్సర్ల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముజఫర్పూర్, ఛప్రాలలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందని, ఎన్డీయే ప్రచారానికి మరింత ఊతం ఇస్తాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. 28న మహాగఠ్బంధన్ మేనిఫెస్టో విడుదలబిహార్ ఎన్నికల కోసం మహాగఠ్బంధన్ మేనిఫెస్టోను ఈ నెల 28న పట్నాలో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి దశ పోలింగ్కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ తర్వాత రెండో దశ ఎన్నికల కోసం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఛత్ పూజ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రి యాంకా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారని మహా కూటమి వర్గాలంటున్నాయి. -
జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్రాజ్ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్రాజ్ నుంచి బిహార్కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్తోపాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొలి్పందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగఠ్బంధన్ నేతలు బెయిల్పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి(లాఠ్బంధన్) అని మండిపడ్డారు. ప్రధాని మోదీ గురువారం ‘నమో యాప్’ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రచారం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. రఫ్తార్ పకడ్ చుకా బిహార్, ఫిర్ సే ఎన్డీఏ సర్కార్(బిహార్లో ప్రభంజనం ఊపందుకుంది, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది) అని మోదీ కొత్త నినాదం ఇచ్చారు. తమ కూటమి పాలనలో ఆల్రౌండ్ అభివృద్ధి జరిగిందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో, బిహార్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తేల్చిచెప్పారు. సర్దార్ వల్లభ్భాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న జరిగే ‘ఐక్యతా పరుగు’లో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. యువతదే కీలక పాత్ర మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్ యువత దశాబ్దాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు, ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని ప్రధానమంత్రి మండిపడ్డారు. కడుపు మండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్రాజ్ను ఓడించారని తెలిపారు. ఆనాటి అరాచక రాజ్యం మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ఓటు విలువ బిహార్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. జంగిల్రాజ్ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని పేర్కొన్నారు. బిహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత విషయంలో నవంబర్ 14న నూతన శకం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. -
బీహార్ ‘గేమ్ ప్లాన్’.. లుకలుకలకు పుల్స్టాప్!
బీహార్లో గ్రాండ్ అలయన్స్(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.మహాఘట్ బంధన్లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్, మాజీ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్కుమార్ తెలిపారు. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
బీహార్లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్గంజ్లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్పూర్లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
బిహార్ ఎన్నికల్లో ‘వెరైటీ’ ఫ్రెండ్లీ ఫైట్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్ను వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ రౌత్కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్కు 60 వేల ఓట్లు పోలయ్యాయి. -
బిహార్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్
-
చాయ్వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు
పక్కా సమాచారంతో ఓ మారుమూల పల్లెలోని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయతే ఆ రైడ్లో ఏకంగా కోటి రూపాయల నగదుతో పాటు బంగారం, కొంత వెండి, కుప్పలుగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్లు, ఆధార్ కార్డులు, చెక్బుక్లు, ల్యాప్ల్యాప్, సెల్ ఫోన్స్ చూసి షాకయ్యారు. ఈ క్రమంలో ఆ చాయ్వాలా సోదరుడ్ని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.బీహార్ గోపాల్గంజ్ అమైతీ ఖుర్ద్ గ్రామంలో అంతరాష్ట్ర సైబర్ మాఫియా బయటపడడం కలకలం సృష్టించింది. ఓ చిన్న టీ స్టాల్ నడిపించే అభిషేక్ కుమార్, అతని సోదరుడు ఆదిత్య ‘సైబర్ మాఫియా’ నడుపుతున్నారంటే పోలీసులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ.. ఆ వచ్చిన నగదును పక్కా ప్లాన్తో వైట్లోకి మార్చేసుకుంటున్నారు ఈ అన్నదమ్ములు. అలా వచ్చిన సొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.అన్నదమ్ముల ముఠా.. ?అభిషేక్ కుమార్ స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపించేవాడు. అయితే తర్వాత దుబాయ్కి వెళ్లి అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని సహకారంతో ఆదిత్య కుమార్ ఇక్కడ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైబర్ నేరాలతో కొల్లగొట్టిన సొమ్మును బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి నగదును డ్రా చేసి వాడుకుంటున్నారు.తనిఖీలలో పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సైబర్ డీఎస్పీ అవంతిక దిలీప్ కుమార్ వెల్లడించారు. బెంగళూరులో జారీ అయిన పాస్బుక్స్ ఆధారంగా ఈ నెట్వర్క్.. కేవలం బీహార్కే పరిమితమై ఉండకపోవచ్చని, జాతీయ స్థాయిలో విస్తరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఉగ్ర లింకుల నేపథ్యంలో.. ఇన్కమ్ టాక్స్, ఏటీఎస్(Anti-Terrorism Squad) బృందాలు రంగంలోకి దిగాయి. -
‘మరీ ఇంత వెన్నుపోటు రాజకీయమా?’ ఇండియా కూటమిపై జేఎంఎం సంచలన ఆరోపణలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి (బీహార్ మహా ఘట్బంధన్) భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)నేతలు కాంగ్రెస్, ఆర్జేడీలపై సంచలన ఆరోపణలు చేశారు. పొత్తులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. ఏమైందంటే..బీహార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించక ముందే కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంలు మహా ఘట్బంధన్ పేరుతో ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎంతకీ తెగలేదు. కాంగ్రెస్ పార్టీ తనకు 70కుపైగా సీట్లు కావాలని డిమాండ్ చేయడం, అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్జేడీ భీష్మించుకున్నాయి. తరువాతి కాలంలో ఇరుపక్షాలు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించడంతో తగిన సమయంలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ముక్తి మోర్చా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. తాము 12 సీట్లు కావాలని కోరామని, అయితే ఘట్ బంధన్ భాగస్వాములు సీట్ల పంపకంలో తమను అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. మూడు రోజుల క్రితమే ఈ పార్టీ తాము అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. సీట్ల పంపకంపై ఘట్ బంధన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు (జేఎంఎం) ప్రకటించింది. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఒత్తిడి తెచ్చేందుకే చేసిన ఈ ప్రకటన ఫలితమేమీ ఇవ్వలేదు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువైన ఆదివారం కూడా సీట్ల పంపిణీ పంచాయతీ తేలలేదు. జేఎంఎం అభ్యర్థులనూ ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేత, జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సైతం కాంగ్రెస్, ఆర్జేడీలపై విమర్శలు గుప్పించారు. సీట్ల పంపకంలో తమ పార్టీని పక్కన పెట్టారని.. వెన్నుపోటు రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా, చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతేకాదు.. ఆర్జేడీ-కాంగ్రెస్లు ‘కూటమి ఒప్పందాన్ని’ సైతం గౌరవించలేదని అన్నారు.తొలిసారి..ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బీహార్-జార్ఖండ్ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై, చకాయి, ధమదాహా, మనిహారి, పిర్పైంటి, కటోరియా.. తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పుకుండా పోటీ చేస్తుంటుంది. 2020 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీహార్ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది. కానీ JMM ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది. భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ.. ఈసారి ఏం చేసింది?. జార్ఖండ్ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ సిగ్గులేకుండా వ్యవహరించారని BJP ప్రతినిధి ప్రతుల్ షాహ్దేవ్ మండిపడ్డారు.ముదురుతున్న విబేధాలు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల (2025) నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు INDIA కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ.. సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. ఈ గందరగోళం మధ్య.. ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది. అలాగే.. కాంగ్రెస్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో వామపక్షాలకు, అలాగే.. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి 15 సీట్లు పోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన.. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్-ఆర్జేడీలు ఐదు నియోజకవర్గాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అలాగే.. కాంగ్రెస్ మరికొన్ని స్థానాలలో వామపక్షాల కూటమితోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికలు నవంబర్ 6, 11వ తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. నామినేషన్ల గడువు ముగియడంతో.. ప్రచార కార్యక్రమాలు ఇవాళ్టి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముజఫ్ఫర్పూర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.ఇదీ చదవండి: హోరాహోరీ పోరు! ఎలా ఉందంటే.. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్జేడీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్20)రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థులపై పోటీగా ఆర్జేడీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో 24 మంది మహిళలు,18 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహాగఠ్బంధన్ (విపక్షాల మహా కూటమి)లో సీట్ల పంపకాల ఫార్ములా ఆర్జేడీ (143), కాంగ్రెస్ (55), సీపీఐఎంఎల్(20), సీపీఐ(6),సీపీఎం(4),వీఐపీ (15) సీట్లు ఉన్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ఇప్పటికే 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. RJD releases its list of candidates for the Bihar Assembly Election 2025, fielding candidates in 143 seats. RJD leader Tejashwi Yadav will contest from the Raghopur assembly seat in Vaishali district. pic.twitter.com/wSsMEj8gdm— ANI (@ANI) October 20, 2025 -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్బ్రాండ్ పాలిటిక్స్తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్లోకి.. సీమా సింగ్ పలు భోజ్పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
బిహార్ ఎన్నికల్లో జేఎంఎం సొంతంగా పోటీ
రాంచీ: బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)బాంబు పేల్చింది. పక్క రాష్ట్రం బిహార్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేయనున్నట్లు జేఎంఎం శనివారం ప్రకటించింది. అదేవిధంగా, ప్రస్తుతం జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కొనసాగుతున్న పొత్తుపై బిహార్ ఎన్నికల అనంతరం సమీక్షిస్తామని కూడా స్పష్టం చేసింది. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. బిహార్లో తమకు 12 సీట్లు కేటాయించాలని ఇండియా కూటమిని జేఎంఎం కోరింది. స్పందన లేకపోవడంతో స్వయంగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు. -
కొత్త ముసుగులో ‘జంగిల్రాజ్’
పట్నా: బిహార్లో ‘జంగిల్రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు. బెంగాల్లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జమ్మూకశ్మీర్కు సరైన సమయలో రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు. -
బిర్యానీ కోసం కొట్టుకున్న జనం
-
బిహార్లో ప్రజాస్వామ్యం గెలిచేనా?
దేశంలో అన్ని ఎన్నికలనూ కురుక్షేత్ర సంగ్రామంగా మార్చడం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. అక్టోబర్ 6న ఎన్నికల నగారా మోగిన బిహార్లో మొదలైన ఎన్నికలసందడి అనేక ప్రత్యేకతలు కలిగిన దృష్ట్యా దేశ ప్రజల దృష్టి అటువైపు కేంద్రీకృతమైంది. 243 స్థానాలున్న బిహార్లోపోలింగ్ రెండు విడతలలో నవంబర్ 6, 11 తేదీలలో జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి. ‘యువ బిహార్’ సాధ్యమా?ఉత్తరాది రాష్ట్రాలలో, ప్రత్యేకించి బిహార్లో అభ్యర్థులు ఎన్ని కలకు ముందు ఆ యా పార్టీలు మారటమే కాకుండా... కూట ముల్లోని పార్టీలు అటు ఇటు పిల్లిమొగ్గలు వేస్తుంటాయి. ప్రధాన కూటములుగా ఎన్డీయే, ఇండియా బ్లాక్ (మహా ఘట్బంధన్)లు రెండే ఉన్నాయి. ఎన్డీయేలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యు), భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్జేపీ) ఉన్నాయి. కొత్తగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇక, ముస్లివ్ు ఓట్లను గంపగుత్తగా వేయించు కోగలననే ధీమాతో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. స్వర్గీయ రావ్ువిలాస్ పాశ్వాన్ తనయుడైన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ‘అబ్ కీ బార్ యువ బిహార్’ అనే నినాదంతో బిహార్ యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఎన్డీయే కూటమికి ఇబ్బందికరమే! అందుకే ఎన్డీయే నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకు పోకుండా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ను ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెట్టింది. ‘యువ బిహార్’ కావాలంటే యువకుడైన ముఖ్యమంత్రి ఉండాలన్న సెంటిమెంట్ను ప్రశాంత్ కిశోర్ తేవడంతో... ఈసారి ఎన్డీఏ గెలిచినా, 75 సంవ త్సరాల వయస్సులో ఉన్న నితీష్ కుమార్ను మరోమారు ముఖ్య మంత్రిగా ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవచ్చు.ఓట్ల తొలగింపు రగడనిజానికి బిహార్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్గాంధీల నడుమ సాగే పోరుగానే చూడాలి. గత ఏడాది రాహుల్ బిహార్లో చోటు చేసుకొన్న ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టారు. బిహార్లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడంతోకాంగ్రెస్ దానిపై పెద్దఎత్తున ఉద్యమించింది. స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఓట్లను తొలగించిందని ‘ఓట్ చోరీ’ అంటూ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది. చివరకు ఓటర్ల తొల గింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది.భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. రెండు విడతలుగా భారత్ జోడో యాత్రలు ఇందులో భాగంగానే చూడాలి. దేశంలో సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేయాలనీ కాంగ్రెస్ కోరుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడ స్వయంగా కులగణన చేసింది. దానిని తెలంగాణ మోడల్గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పట్ల ప్రతికూలంగా మారినా మోదీ ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శ చేస్తోంది. బీజేపీ వైపు నుంచి, మోదీ వైపు నుంచి ‘ఇండియా’ కూటమిపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు కూడా పదునైనవే! దేశం వెనుకబడి పోవడానికీ, అన్ని వ్యవస్థలూ సకల అవలక్షణాలతో కునారిల్లడానికీ కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పాలించడమేనని బీజేపీ విమర్శిస్తోంది. దాంతోపాటు మోదీ నేతృత్వంలో ఈ 12 ఏళ్లకాలంలో దేశం ఏ విధంగా ముందంజ వేసిందీ ఘనంగా చాటుకొంటున్నారు. తాజాగా తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను, ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అయితే, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... జీఎస్టీ సంస్కరణలు చేశారనీ, ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారనీ ప్రతిపక్షం ఆరోపి స్తోంది. 17 శాతం ముస్లివ్ు జనాభా గల బిహార్లో... మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో యథావిధిగా ఎవరితోనూ పొత్తు లేకుండా ఒవైసీ తన పార్టీ ‘మజ్లిస్’ను రంగంలోకి దించు తున్నారు. తమకు పడని ఓట్లు ఎదుటి పక్షానికి పడకుండా చీల్చడంలో ఇది బీజేపీకి లాభించేదే!కొత్త సంస్కరణలు ఇక్కడి నుంచే...తాజాగా పలు ఎన్నికల సంస్కరణలకు బిహార్ వేదిక కావడం విశేషంగా చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న 17 ఎన్నికల సంస్కరణల అమలు బిహార్ నుంచి మొదలు కాబోతోంది. ఈ సంస్కరణలలో ప్రధానంగా ఒక్కోపోలింగ్ బూత్ను 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు, పోస్టల్ బ్యాలెట్ను ముందుకు జరిపి తప్పనిసరి చేస్తున్నారు. ఓటరు గుర్తింపునకు ఆధార్ను వినియోగించుకోవచ్చు నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్ తొలుత నిరాకరించినా చివరకు దిగొచ్చింది. గతంలో తన మీద వచ్చిన ఆరో పణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా సీఈసీ తనను విమర్శించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన టీఎన్ శేషన్ అన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి గౌరవాన్నిపెంచారు, ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడది మృగ్యమైంది.ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ లేదా కూటమి గెలు పొందుతుంది. అయితే, ప్రజాస్వామ్యం గెలిచిందన్న భావన ప్రజలకు కలగాలి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి. గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడి పోతున్న నేపథ్యంలో... ప్రజాస్వామ్యం గెలవాలని కోరు కోవడం అత్యాశ అవుతుందా? కొత్తగా కొన్ని సంస్కరణలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. పైగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను నాశనం చేయాలనిజిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇటువంటి నిబంధనలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పొత్తులు కుదుర్చు కోవడంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్నే.. నువ్వు చైర్మన్వి కదా! -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ వైస్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూపులో భాగంగా పాట్నా వేదికగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అరుణాచాల్ కెప్టెన్ తొలుత బిహార్ను బ్యాటింగ్ అహ్హనించాడు.అయితే బ్యాటింగ్కు దిగిన బిహార్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సూర్యవంశీ.. ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. టీ20 తరహాలో తన బ్యాటింగ్ను ప్రారంభించిన వైభవ్ కేవలం 5 బంతుల్లో 280.00 స్ట్రైక్ రేటుతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. బిహార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన యాబ్ నియా బౌలింగ్లో తొలి నాలుగు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు."వైభవ్ ఫార్మాట్ తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతీ బంతికి షాట్ ఆడే అవసరం లేదు. ఇది రెడ్ బాల్ క్రికెట్. సహనం, టెక్నిక్ కూడా కావాలి" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. కాగా 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. తన టాలెంట్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే అతడికి బిహార్ క్రికెట్ అసోయేషిన్ వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చింది.అతడి బిహార్ జట్టును అత్యున్నత స్ధాయికి తీసుకు వెళ్తాడని బీసీఎ భావించింది. కానీ వైభవ్ మాత్రం తొలి మ్యాచ్లోనే విఫలమై నిరాశపరిచాడు. తర్వాతి మ్యాచ్లలోనైనా సూర్యవంశీ తన బ్యాట్కు పని చెబుతాడో లేదో చూడాలి.భారీ స్కోర్ దిశగా బిహార్..సూర్యవంశీ నిరాశపరిచినప్పటికి తొలి ఇన్నింగ్స్లో బిహార్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బిహార్ రెండు వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ఆయుష్ లోహరుక(155), సకిబుల్ గని(56) ఉన్నారు.చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బీహార్ ఎన్నికల్లో పోటీకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి
-
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025 రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు ఇదీ చదవండి: బిహార్లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే..! -
ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్లో పొలిటికల్ హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ -
కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్లో సీట్ల కేటాయింపు సస్పెన్స్కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing). మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..బీహార్లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు.. బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14. ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్ -
లాలు ఫ్యామిలీకి భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘టెండర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్ యాదవ్కు తెలిసే జరిగింది. టెండర్ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. ఏంటీ కుంభకోణం?2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్సీటీసీకి చెందిన రెండు బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్’అనే ప్రైవేట్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. 2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. #WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025మరోవైపు.. బీహార్లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీహార్లో పొలిటికల్ ట్విస్ట్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బీహార్లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్లో పాలక ఎన్డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
Bihar: కుదిరిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సీట్ల సర్దుబాటు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వె ల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।BJP – 101JDU – 101LJP (R) – 29RLM – 06HAM – 06एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।बिहार है तैयार,फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025 జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు కాగా, బీహార్లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇదీ చదవండి:బీహార్లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ! -
బిహార్లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్తోపాటు.. తేజస్వీ యాదవ్ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్లో తృతీయ ఫ్రంట్కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్లో పర్యటించారు. సీమాంచల్పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
డెబ్యూతోనే పెద్ద రిస్క్!! పీకే ఏమన్నారంటే..
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..గోపాల్గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్పూర్. ట్రాన్స్జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.గెలిచిన దాఖలాల్లేవ్!రాజకీయాల్లో ట్రాన్స్జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్లో శబ్నం మౌసీ సోహగ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్గఢ్ రాయ్ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)రిస్క్పై పీకే ఏమన్నారంటే.. జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా? -
బిహార్ బిలియనీర్లు.. బిజినెస్లో తోపులు!
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్వర్త్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అనిల్ అగర్వాల్నెట్వర్త్: రూ.16,000–17,000 కోట్లుబిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.రవీంద్ర కిషోర్ సిన్హానెట్వర్త్: రూ.5,000–10,000 కోట్లుబిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.మహేంద్ర ప్రసాద్నెట్వర్త్: రూ .4,000 కోట్లు పైనేబిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.సంప్రదా సింగ్నెట్వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనేబిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.సుబ్రతా రాయ్నెట్వర్త్: రూ .3,000 కోట్లు పైనేబిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.శుభమ్ సింగ్నెట్వర్త్: రూ.500+ కోట్లుబిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.సుభాష్ చంద్రనెట్వర్త్: రూ .5,000+ కోట్లుబిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియానేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్తో ముడిపడి ఉన్నాయి.సుమంత్ సిన్హానెట్వర్త్: రూ .3,000+ కోట్లుబిజినెస్: రెన్యూ పవర్నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్ -
ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఝలక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ మంత్రి మురారి ప్రసాద్ గౌతమ్ బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమ్ రాజీనామాతో రోహ్తాస్ జిల్లా చెనారి రిజర్వుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని బీహార్ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ సందర్భంగా ‘శాసన సభ్యత్వానికి రాజీనామా వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గౌతమ్ పీటీఐకి స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో గౌతమ్ మంత్రిగా పనిచేశారు. జేడీ(యూ) మళ్లీ ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత, ఆయన ట్రెజరీ బెంచ్ సభ్యులతో కలిసి కూర్చోవడం ప్రారంభించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ ముందు పెండింగ్లో ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుండటం తెలిసిందే. -
Bihar Elections: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ?
పట్నా: బీహార్లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
బీహార్ ఎలక్షన్స్: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. బీహార్లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు. ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు! -
తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పూర్తి వివరాలను తమకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఎస్ఐఆర్ తర్వాత సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు ఇవ్వాలని కోరింది.ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విచారణకు హాజరయ్యారు. తొలగించిన పేర్లలో చాలావరకు కొత్తగా ఓటు నమోదుచేసుకున్నవారేనని తెలిపారు. వారిలో ఎవరి నుంచీ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయినప్పటికీ తొలగించినవారి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలక్టోరల్ ముసాయిదాతోపాటు తుదిజాబితాను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గందరగోళాన్ని తొలగించేందుకే.. తమ ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల జాబితాపై గందరగోళాన్ని తొలగించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ‘ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉండేందుకు మీరు (ఈసీ) మా నిర్ణయంతో ఏకీభవించాలి. మీరు ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల పేర్లు తొలగించారు. చనిపోయినవారు, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించటం సబబే. కానీ, మీరు ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలంటే కచి్చతంగా రూల్ 21ను పాటించాలి. ప్రజలకు కూడా ఒక విన్నపం. ఎవరి పేర్లయితే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందో.. వారు తమ వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో అందజేయండి’అని సూచించారు. -
Bihar Election: ‘మెట్రో’ సెంటిమెంట్.. 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ప్రభావం..
పట్నా: బీహార్ ఎన్నికల్లో విజయానికి బీజేపీ ‘మెట్రో’ సెంటిమెంట్ను ప్రయోగిస్తోంది. గత 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు వివిధ పార్టీల ప్రభుత్వాలు ‘మెట్రో’ను ప్రారంభించాయి. ఈ మెట్రో సెంటిమెంట్ నాలుగు రాష్ట్రాల్లో విజయానికి దారి తీసింది. మొన్న అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు బీహార్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అయితే దీనికి ఐదు గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా మెట్రోకు పచ్చజెండా ఊపారు. ఎన్నికలకు ముందు మెట్రోలు..2013, రాజస్థాన్: ఎన్నికలకు మూడు నెలల ముందు జైపూర్ మెట్రో ట్రయల్ రన్. దీనిని నాటి కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఫలితం: 200 సీట్లు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 21 సీట్లకు పడిపోయింది. బీజేపీ 163 సీట్లతో మెజారిటీని సాధించింది. వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. మెట్రో ప్రారంభించిన జైపూర్ జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది.2017, ఉత్తరప్రదేశ్: 2016, అక్టోబర్ 4న నాటి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్పూర్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 1న లక్నో మెట్రోను ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ 47 మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 312 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాన్పూర్లోని 10 సీట్లలో ఎస్పీ రెండు, లక్నోలో ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.2022, ఉత్తరప్రదేశ్: కాన్పూర్ మెట్రో మొదటి దశ ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించారు. తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్లోని 403 సీట్లలో 255 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాన్పూర్లోని 10 స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు.2023, మధ్యప్రదేశ్: ఎన్నికలకు 45 రోజుల ముందు భోపాల్ మెట్రో ట్రయల్ రన్ను నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ 230 సీట్లలో 163 గెలుచుకుంది. భోపాల్ జిల్లాలో 7 సీట్లలో 6 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో డాక్టర్ మోహన్ యాదవ్ సీఎంగా నియమితులయ్యారు.2024, మహారాష్ట్ర: ఎన్నికలకు కొన్ని నెలల ముందు పూణే, ముంబై మెట్రో ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ముంబై మెట్రోను ప్రారంభించారు. 2024, సెప్టెంబర్ 29న పూణే మెట్రోను ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల మహాయుతి (మహాయుతి) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఫలితం: నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, మహాయుతి 288 సీట్లలో 230 గెలుచుకుంది. ముంబైలోని 36 సీట్లలో 22, పూణేలోని 21 సీట్లలో 18 వారి సొంతమయ్యాయి. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్నాథ్ షిండే స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.2025, ఢిల్లీ: ఎన్నికలకు ఒక నెల ముందు ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఫలితం: నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు.మెట్రో ప్రారంభం.. ఎన్నికలపై ప్రభావంఆరు రాష్ట్రాల ఎన్నికల విశ్లేషణలో మెట్రో ప్రారంభం ఎన్నికలపై ప్రభావం చూపిందని వెల్లడయ్యింది. ఆరు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో మెట్రోను ప్రారంభించిన పార్టీ ప్రయోజనం పొందింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 42 శాతం మంది పట్టణ ప్రజలు. వారు పట్టణీకరణను అభివృద్ధిగా భావిస్తారు. అందుకే పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం కోసం మెట్రో కార్డును ఉపయోగిస్తున్నాయి. -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్! -
బిహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు
-
బిహార్లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
ఈసీ ప్రెస్మీట్.. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Election) షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. బీహార్(Bihar Election) అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్(దేశంలో మరో నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు) విడుదలయ్యే అవకాశం ఉంది. Delhi | Election Commission of India to hold a press conference at 4 PM today to announce the schedule for the upcoming Bihar Assembly Elections pic.twitter.com/YFTiaVTkk0— ANI (@ANI) October 6, 2025కాగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బీహార్లో పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ముమ్మర సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. బీహార్ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. కాగా, ప్రస్తుతం బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహాగఠ్బంధన్లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
పారదర్శకత కోసం 17 మార్పులు
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషీతో కలిసి జ్ఞానేశ్కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజి్స్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)ను సంబంధిత ఓటర్కు అందజేయడానికి ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. మార్పుల్లో కీలకమైనవి..→ బిహార్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల జనం బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తక్కువ మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డుకెక్కనుంది. → ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల బిహార్లో అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొత్తం కేంద్రాల సంఖ్య 90,712కి చేరుకోనుంది. → ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) బ్యాలె ట్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి కలర్ ఫోటోలు ముద్రించబోతున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపెంచేలా పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం ఈవీఎంలపై నలుపు తెలుపు రంగు ఫొటోలే ఉంటున్నాయి. దీనివల్ల అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిహార్లో ఈ కష్టాలకు తెరపడినట్లే. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచి్చంది. దేశంలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు ముద్రించిన మొట్టమొదటి ఎన్నికలుగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కబోతున్నాయి. → ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్–లెవెల్ అధికారులకు అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. తద్వారా ఓటర్లు వారిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. → బిహార్ ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కవరేజీని తప్పనిసరి చేశారు. అనుమానాలకు తావులేకుండా ప్రతి అంశాన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు. → పోలింగ్ కేంద్రాల వల్ల మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు. → పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17సీని అందజేస్తారు. ఫామ్ 17సీలోని వివరాలకు, ఈవీఎం కౌంటింగ్ యూనిట్లలోని ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైతే దానికి సంబంధించిన వీవీప్యాట్లను రీకౌంటింగ్ చేస్తారు. → ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 22వ తేదీలోగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలు ఉండగా, వీటిలో 38 ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కోసం బూత్–లెవెల్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామన్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 243 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులను(ఈఆర్ఓ) నియమించామని తెలిపారు. ఎస్ఐఆర్ను జూన్ 24న ప్రారంభించామని, ఈఆర్ఓతోపాటు బూత్–లెవెల్ అధికారుల సాయంతో గడువులోగా విజయవంతంగా పూర్తిచేశామని వివరించారు. ఎస్ఐఆర్ విజయవంతం అయినందుకు ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో చురుగ్గా భాగస్వాములు కావాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఛత్ వేడుకలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల పండుగలో పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. బిహార్లో 90,217 మంది బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ నిర్వహించారని, అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేశ్ కుమార్ ప్రశంసించారు. ఓటర్ల జాబితా శుద్ధీ్ధకరణ విషయంలో మొత్తం దేశానికే వారు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. బిహార్లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు. -
‘ఇలాంటి వ్యక్తా ప్రభుత్వాన్ని నడిపేది’.. సీఎం నితిష్ కుమార్ వీడియో వైరల్
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సీఎం నితీశ్ కుమార్ తీరు మరోసారి చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభంలో ఓ కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. దీంతో నితీశ్ పరిపాలనపై ప్రశ్నలు తలెత్తాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో నితీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ అబ్బే ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరంటూ’ ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థిరంగా మాట్లాడలేకపోతే ఎలా?’అని ప్రశ్నించారు. అలాగే, ఆయన పాలనలో బిహార్ పూర్తిగా గందరగోళంగా మారిందని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. నితీశ్పై తేజస్వీ చేసిన విమర్శల్ని జేడీయూ నేతలు ఖండిస్తున్నారు. నితీశ్ కుమార్ అనుభవజ్ఞుడు. ఆయనపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బిహార్ రాజకీయాల్లో ఈ ఘటన మరో మలుపు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వానికి పారదర్శకత అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Nitish Kumar theek toh hai na ? Ye jo kar rahe hai ye bilkul achha nahi lagta hai dekhne mein !pic.twitter.com/Etev7K8tKG— Surbhi (@SurrbhiM) October 5, 2025 -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్ప్రెస్) రన్ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్లోని అనేక చోట్ల రైల్వే అండర్పాస్, ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
నేడు బిహార్ ఓటరు తుది జాబితా
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటరు జాబితా మంగళవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో, వచ్చే వారంలో ఈసీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగియడంతో ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్ను ఈసీ ఆన్లైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 7.24 కోట్ల ఓటర్లున్నారు. ఇలా ఉండగా, ఈసీ బృందం అక్టోబర్ 4, 5వ తేదీల్లో పట్నాకు వెళ్లి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముందని సమాచారం. మొదటి దశ పోలింగ్ ఛట్ పండుగ తర్వాత అక్టోబర్ ఆఖర్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుల నియామకం కసరత్తు అక్టోబర్ 3వ తేదీకల్లా ముగియనుందని చెబుతున్నారు. బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. -
వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంఆ పేరు రావడానికి కారణం..ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. విచిత్రమైన బలి ..ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది. దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం) -
అధికారం మాదే.. లేదంటే చివరి స్థానమే: పీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఫుల్ మెజార్టీ సాధిస్తుంది.. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు. బీహార్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీకే.. తన పార్టీ బీహార్లోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో తమ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుందన్నారు. ఎటూ కాకుండా మధ్యలో ఉండటం జరగదన్నారు. అలాగే, అధికార ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ)కు 25 సీట్లకు మించి రావని తేల్చిచెప్పారు. బీజేపీకి కూడా ఓటమి తప్పదన్నారు. విపక్ష మహాఘట్బంధన్ మూడో స్థానంలో నిలుస్తుందని, తన పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.ఇదిలా ఉండగా.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. జేడీ(యూ)నేత, బీహార్ మంత్రి అశోక్ చౌదరికి పరువు నష్టం నోటీసు పంపుతానని తెలిపారు. రూ.200 కోట్ల అవినీతికి ఆయన పాల్పడినట్లు ఆరోపించారు. కోట్ల విలువైన ఆ భూమిని తన పీఏ పేరుతో ఆయన ఎందుకు కొన్నారు? అని ప్రశ్నించారు. త్వరలోనే నలుగురు లేదా ఐదుగురు ప్రముఖ నేతల గుట్టు బయటపెడతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ బీహార్ రాజకీయాల్లో నెలకొంది. -
వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మహిళా సాధికారతకు కృషి
పట్నా: బిహార్లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ పథకం 75 లక్షల మంది పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు. రూ.7,500 కోట్లతో ఈ పథకానికి బిహార్లోని ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 75 లక్షల మంది లబి్ధదారులకు త్వరలో అదనంగా రూ.2 లక్షల చొప్పున అందజేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. వారు స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్ మహిళల ప్రగతి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్ధన్ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు. మహిళలకు ఇద్దరు సోదరులు బిహార్ మహిళలకు నితీశ్ కుమార్, నరేంద్ర మోదీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గరి్వస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్ సహకారి సంఘ్’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. -
ఆ మూడు రాష్ట్రాలపై బీజేపీ నజర్.. నూతన నియామకాలతో ఎన్నికల వ్యూహం
న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్చార్జ్లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.బీహార్లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్చార్జ్లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్చార్జ్లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు.పశ్చిమ బెంగాల్కు పోల్ ఇన్చార్జ్గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్చార్జ్గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం. -
అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
-
బీహార్లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?
సాక్షి, ఢిల్లీ: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తాజాగా నవంబర్ 5-15 మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్ను ఇంకా విడుదల చేయలేదు.వివరాల ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఛఠ్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: క్రెడిట్ కొట్టేయాలని మోదీ ఆరాటంఅయితే, బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. దీంతో, ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో చేపట్టారు. ఫలితాలను నవంబర్ 10వ తేదీన వెల్లడించారు. దీంతో, ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే మూడు దశల్లో ఎన్నికల జరిగే అవకాశం ఉంది. -
Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్ చేసిన ఉపముఖ్యమంత్రి
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన బీహార్ అధికార్ యాత్ర లో ప్రధాని మోదీ దివంగత తల్లిని మళ్లీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఈ సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాగా దీనిపై ఆర్జేడీ ఇంకా అధికారిక ప్రతిస్పందన వెల్లడించలేదు.తేజస్వి యాదవ్ పర్యటనలో ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషను ఉపయోగించారని బిజెపీ ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ అరోపణలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తేజస్వి యాదవ్ కార్యకర్తల వేధింపుల తీరును ప్రోత్సహిస్తున్నారని, ఈ తరహా ప్రవర్తన బీహార్ సంస్కృతిని నాశనం చేస్తున్నదని రాశారు. బీహార్లోని మహిళలు ఈ అవమానంపై ప్రజాస్వామ్య రీతిలో ప్రతిస్పందించాలని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. तेजस्वी यादव ने फिर दिलवाई- मोदी जी की मृत माताजी को गाली। इन्होंने बिहार की संस्कृति को एक बार फिर तार-तार कर दिया।रैली में आरजेडी के कार्यकर्ता जितना ही गाली दे रहे, तेजस्वी उतना ही हौसला बढ़ा रहे थे। इस गुंडई की मानसिकता और गाली का हिसाब बिहार की माताएँ-बहनें जरूर करेंगी। pic.twitter.com/p4TNr4J20V— Samrat Choudhary (@samrat4bjp) September 20, 2025ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి జరిగిన తీవ్ర అవమానంగా చౌదరి అభివర్ణించారు. మహిలలను అవమానించడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందా? అని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఇన్స్టాగ్రామ్లో తన ప్రతిస్పందన తెలియజేశారు. తేజస్వి యాదవ్ తన పర్యటనలో ప్రధాని మోదీ దివంగత తల్లిపై దుర్భాషలాడారని అన్నారు. ఈ రకమైన రాజకీయాలు ఆమోదయోగ్యం కాదని, దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఆర్జేడీ నుండి అధికారిక స్పందన రాలేదు. కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుండి తన బీహార్ అధికార్ యాత్రను ప్రారంభించారు. యాత్రలోని మొదటి దశ నలంద, బెగుసరాయ్ తదితర ప్రాంతాల గుండా సాగి, సెప్టెంబర్ 20న వైశాలిలో ముగిసింది. -
బీహార్లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్పుత్లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్గంజ్తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
బీహార్లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మహాఘఠ్బంధన్లో లుకలుకలు..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్బంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. అవినీతి.. కులాల లెక్కలు బిహార్లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది. కాంగ్రెస్ అంచనా వేరే.. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్కు బిహార్లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది. ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్లోడ్చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు. -
బిహార్ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
విమర్శల బదులు విస్తృత దర్యాప్తు చేయించాల్సింది
న్యూఢిల్లీ: బిహార్లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషి వ్యాఖ్యానించారు. ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు. అఫిడవిట్ అడగడం సబబుకాదు ‘‘ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా.. ‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి. రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేడు బిహార్లో ప్రధాని పర్యటన
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్ఫుడ్గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్లో సాగవుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. -
బీహార్లో ‘సీట్ల’ లొల్లి.. ‘ఆల్-243’పై తేజస్వి దృష్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాల కూటమి ‘మహాఘట్ బంధన్’లో సీట్ల లొల్లి మొదలయ్యింది. కూటమిలోని అన్ని పార్టీలు అధిక సీట్లు కోరుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లోనూ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో తేజస్వి ప్రసంగిస్తూ ‘ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. అది ముజఫర్పూర్ అయినా మరొకటైనా.. తేజస్వి పోరాడుతారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా పేరు మీద ఓటు వేయండి. బీహార్ను ముందుకు తీసుకెళ్లడానికి తేజస్వి కృషి చేస్తారు... మనమందరం కలిసి పనిచేసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’ అని అన్నారు.ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్.. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాఘట్ బంధన్లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. ఇటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది.2020 బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 75 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను బలపడినట్లు భావిస్తోంది. ఓటరు అధికార్ యాత్ర, ఓటు 'చోరీ'సందేశం బీహార్ ప్రజలతో ప్రతిధ్వనించిందని, రాహుల్కు, పార్టీకి మరింతగా ప్రజాదరణ పెరిగిదని అనుకుంటోంది.ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని, అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు. కాంగ్రెస్ కనీసం 70 నియోజకవర్గాలను కోరుకుంటున్నదని, ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం.గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాఘట్ భంధన్లో సీట్ల కేటాయింపును మరిత జఠిలం చేశాయి. ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘తేజస్వి యాదవ్.. మీరు కలలు కనడం ఆపండి. మీకు 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. మీరు ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్, మీ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూస్తే వారికి పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాల భూకుంభకోణం గుర్తొస్తాయి. ప్రజలు ఎన్డీఏకు, నితీష్ కుమార్, ప్రధాని మోదీ పేరు మీద ఓటు వేస్తారు’ అని అన్నారు. -
యూపీఎస్సీ టాపర్స్ చిరునామా.. ఆ రాష్ట్రం!
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాఅయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన అభ్యర్థులు సివిల్స్లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారే ఉన్నారు.యూపీఎస్సీ టాపర్లు2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)ఎలా సాధ్యమైంది?ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతవరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
243 సీట్లు.. 2,300 దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్లో సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీహార్పై వరాల జల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.బక్సర్ బగ్లాపూర్ కారిడార్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది. -
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించడంతోపాటు పూర్ణియా విమానాశ్రయాన్ని, పట్నా మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నా జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పట్నా మెట్రో బీహార్ అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది. ప్రధాని మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించనప్పటికీ, పలు సూచనల మేరకు బీహార్ అధికారులు ప్రధాని రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మరొకరి వీపుపై కూర్చుని.. వరద ప్రాంతాల్లో ఎంపీ పర్యటన
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాలను తిలకిస్తున్నట్లుగా ఉన్న ఎంపీ తారిఖ్ అన్వర్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాంగ్రెస్ నేత, బిహార్లోని కటిహార్ ఎంపీ అయిన తారిఖ్ అన్వర్ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అయితే, ఓ వ్యక్తి మోస్తుండగా ఆయన పర్యటన కొనసాగించారు. ఎంపీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ వ్యక్తి వీపుపై మోసుకెళ్తూండగా వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఎంపీ తారిఖ్ అన్వర్ తీరును బీజేపీ తప్పుబట్టింది. వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లినా కాంగ్రెస్ నేతలకు వీవీఐపీ ప్రొటోకాల్ కావాల్సి వచ్చిందా? అని ఆ పార్టీ నేత పూనావాలా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఎంపీ వీవీఐపీ మోడ్. రాహుల్ గాంధీ వెకేషన్ మోడ్. ఆమ్ఆద్మీ పార్టీ హైడింగ్ మోడ్. ప్రధాని మోదీ మాత్రమే వర్క్ మోడ్’అని వ్యాఖ్యానించారు. -
గుర్తింపు కార్డుగా ఆధార్
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశంలో ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులొచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డ్గా ఆధార్నూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ గుర్తింపు డాక్యుమెంట్గా ఆధార్ను పరిగణించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. ‘‘బిహార్ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్నూ అనుమతించండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపునకు రుజువుగా భావించాలని మేం చెప్పట్లేదు. ఎస్ఐఆర్లో ఇకపై ఆధార్ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు మీరు అవసరమైన ఆదేశాలను జారీచేయండి. మా ఆదేశాలను సెపె్టంబర్ 9వ తేదీలోపు అమలుచేయండి’’అని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ‘‘అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో కలపాలని ఎవరూ కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్ల ఆధార్ కార్డ్ను ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషీ ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సోమవారం ఆలకించింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ‘‘ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ సంబంధిత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించారు. ఇక 12వ ధృవీకరణ పత్రంగా ఆధార్ను అనుమతించాలంటూ పలువురు పిటిషన్లు ఇచ్చారు. అయితే ఇందులో ఆధార్ను ఒక రుజువుగా అంగీకరిస్తామని ఈసీ గతంలోనే పేర్కొంది. అయినాసరే ఆధార్ను కచ్చితంగా 12వ ధ్రువీకరణ పత్రంగా చేర్చాలని కోరడంలో అర్థంలేదు’’అని ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని 23(4) సెక్షన్, ఆధార్ చట్టం–2016లోని నియమ,నిబంధనల ప్రకారమే ఓటరు గుర్తింపు కోసం ఆధార్ను పరిగణించవచ్చని నిర్ధారించాం. అయితే ఆధార్ అనేది పౌరసత్వాన్ని రుజువుచేయబోదు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.ఎస్ఐఆర్పై తగ్గుతున్న నమ్మకం! ‘‘ఎస్ఐఆర్ క్రతువుపై పిటిషన్దారులు, విపక్షాల్లో నమ్మకం తగ్గుతున్నట్లుగా తోస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రంగంలోకి దిగాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లకు పారాలీగల్ వలంటీర్లు సాయపడాలి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై చేసే దరఖాస్తుల విషయంలో వలంటీర్లు సాయం అందించాలి’’అని కోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ముద్రించనున్నారు. ఈసీ సిగ్గుపడాలి: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆధార్ను ధృవీకరణ జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్న ఈసీ సిగ్గుపడాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ సోమవారం తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఓటర్ల నమోదుకోసం ఆధార్నూ గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోర్టు ఇప్పటికి మూడుసార్లు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఈసీ పెడచెవినపెట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈసీ ఈ విషయంలో సిగ్గుపడాలి. విపక్ష రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లనూ ఈసీ గుర్తించట్లేదు. ఇవన్నీ ఈసీ సారథి సొంత నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు’’అని ఆయన అన్నారు. -
Bihar Polls:‘మహాఘట్ బంధన్’లో లొల్లి.. జేఎంఎం, ఆర్ఎల్జేపీలతో సీట్ల చిచ్చు
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ పార్టీల ‘మహాఘట్ బంధన్’కు కొత్తచిక్కులు వచ్చిపడ్డాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశం ఉంది. దీంతో సీట్ల షేరింగ్ ‘మహాఘట్ బంధన్’కు పెద్ద సవాల్గా నిలవనుంది.బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో మరో రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగం కానున్నాయన్నారు. వీరి కోసం తమ సీట్ల వాటాను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. కూటమిలో ఆధిపత్య పార్టీ అయిన ఆర్జేడీ కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు భాగస్వాములకు కేవలం 93 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం 40 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాల పార్టీలకు కొత్తగా చేరే పార్టీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.2020 బీహార్ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) పోటీ చేసిన 19 సీట్లలో 12 గెలుచుకుంది. సీపీఎం పోటీ చేసిన 4 సీట్లలో 2 గెలుచుకుంది. సీపీఐ పోటీ చేసిన 6 సీట్లలో 2 గెలుచుకుంది. సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలతో ‘మహాఘట్ బంధన్’ ను వీడి ఎన్డీఏలో చేరిన వీఐపీ ఈసారి 60 సీట్లను అభ్యర్థించినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 2020 ఎన్నికల కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. -
మాకు 40 సీట్లివ్వాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పక్షం, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్ పాశ్వాన్)తో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. బిహార్ భవిష్యత్ ముఖచిత్రంలో తన మార్కును చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ తన పారీ్టకి ఎక్కువ సీట్లు సాధించుకునేందుకు బీజేపీ, ఆర్జేడీలతో బేరసారాలు సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా 40 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో సీట్ల పంపిణీ పెండింగ్లో పడిందని సమాచారం. పాశ్వాన్ అడుగులు పెద్ద పదవి వైపే... 2020 బిహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసినా ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎల్జేపీ ఎన్డీయే కూటమి పొత్తుతో 6 శాతం ఓట్లతో 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. హాజీపూర్ స్థానం నుంచి చిరాగ్ ఆర్జేడీ అభ్యరి్థపై ఏకంగా 1.70 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. బిహార్ ఎన్నికల్లో సైతం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ, జేడీయూలకు చెరో 100 సీట్ల చొప్పున 200 సీట్లు పోగా మిగిలిన 20–25 స్థానాలను ఎల్జేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కనీసంగా 40 సీట్లు అడుగుతున్నారనే వాదనలు వినిపించాయి. ఇదే సమయంలో చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించవచ్చనే వార్తలూ వస్తు న్నాయి. ఈ సమయంలోనే ఆయన ‘బిహార్ ఫస్ట్..బిహారీ ఫస్ట్’నినాదాన్ని ఎత్తుకొని తనకు బిహార్ రాష్ట్రంలోనే రాజకీయాలు ఎక్కువ మక్కువని చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పేరును చెప్పకుండానే, తనను రాష్ట్రానికి రాకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవ్వరికీ భయపడబోనని పేర్కొన్నారు. పటా్నలో ఇటీవల జరిగిన వ్యాపారవేత్త గోపాల ఖేమ్కా హత్యను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సుపరిపాలను పేరుగాంచిన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నితీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాశ్వాన్ ప్రకటనల వెనక ప్రధానంగా రాష్ట్రంలో బలహీన వర్గాల్లో తమ పార్టీకి ఉన్న పట్టు కోల్పోరాదని, ఢిల్లీ పేరు చెప్పి..క్షేత్రస్థాయిలో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోరాదనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టున్న తమ వర్గాలను జేడీయూ పూర్తిగా తనవైపు తిప్పుకుంటుండటం, మరికొందరు కీలక నేతలు ఎన్డీయే కూటమిలో ఇమడలేక ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతుండటాన్ని ఇష్టపడని పాశ్వాన్ రాష్ట్రంలో పట్టును నిలుపుకునేందుకే 40 సీట్లపై పట్టు వదలడం లేదని అంటున్నారు. అయితే, సీట్ల పంపకాలపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
Bihar: నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్లో తేదీల వెల్లడి?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చూచాయిగా వెల్లడయ్యింది. అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉండగా, నవంబర్లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద నవీకరించిన ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాత, అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. నవంబర్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15- 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో, ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ)-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77లో మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-ఇద్దరు, సీపీఐ-ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. -
పరువుతీస్తున్న ‘ప్రక్షాళన’!
అనుకున్నదొకటైతే అయింది మరోటి. బిహార్లో ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా ఎన్నికల సంఘం (ఈసీ) తలపెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత దెబ్బ తీసింది. ఓటర్లలో దొంగలున్నారన్న నిర్ణయానికొచ్చి, వారందరినీ ఏరిపారేయాలను కోవటం దీనంతటికీ కారణం. పోనీ అందుకు ప్రాతిపదికేమిటో ఎవరికీ తెలియదు. ఏడెనిమిది నెలల క్రితం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తానే రూపొందించిన జాబితాలో అవకతవకలున్నాయని అంగీకరించటమంటే తన పనితీరు సరిగా లేదని ఒప్పు కోవటమేనని ఆ సంస్థకు తోచలేదు. 2.74 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది తమ అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించారని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పగా ముసాయిదా జాబితా అవకతవకలు ఒక్కోటే బయటపడి దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి. అర్హులైన ఓటర్లు ఈసీ అడిగిన 11 పత్రాల్లో ఏదో ఒకటైనా దాఖలు చేయటానికి తిప్పలు పడుతుంటే అనర్హులైనవారు, అనుమానాస్పద వ్యక్తులు దర్జాగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీడియా సంస్థ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ నిశితంగా పరిశీలిస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయి. ఒకే పేరు,తండ్రి/భర్త పేర్లు ఉండి కనీసం రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాకెక్కిన 1,87,643 కేసుల్ని ఆ సంస్థ బయటపెట్టింది. కొందరైతే ఒక నియోజకవర్గంలోనే నదురూ బెదురూ లేకుండా ఆ పని చేశారు. మరికొందరు చిరునామాలు మార్చే శ్రమ కూడా తీసుకోలేదు.‘స్వచ్ఛమైన జాబితా’ రూపకల్పనే ధ్యేయమంటున్న ఈసీ ఈ దొంగ ఓటర్ల విజృంభణకు ఏం సంజాయిషీ ఇస్తుంది? కనీసం అలాంటి విపరీతాలకు కారణమైనవారిపై చర్య తీసుకుంటామని చెప్పటం లేదు. పైగా బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన అంశాలను ఖండించారు. ఈ క్రమంలో వారు ఎక్కడెక్కడ పొరబడ్డారో చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. తనకున్న పరిమిత వనరులతో కేవలం 39 చోట్ల ముసాయిదాలో ఒక సంస్థ ఇన్ని లోపాల్ని పసిగట్టగలిగితే, ఓటర్లు అందజేసిన అర్హతా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గుదేల్చే పనిలో తలమునకలైవున్న వేలాదిమంది ఎన్నికల సిబ్బంది ఏం పనిచేస్తున్నట్టు? వారిపై అధికార పక్షాల ఒత్తిళ్లు న్నాయా? ముసాయిదాలో తొలగించిన 65 లక్షల మందీ ఈసీ దృష్టిలో నకిలీ ఓటర్లు.అందుకోసమే వారి వినతుల్ని పరిశీలించటానికి మొదట్లో ఆ సంస్థ సిద్ధపడలేదు. అందు కోసం సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన సోమ వారం నాటికి కేవలం 33,000 మంది మాత్రమే పత్రాలు సమర్పించారని ఈసీ చెబుతోంది. పొట్ట చేతబట్టుకుని నలు మూలలకూ పోయే సాధారణ కూలీలు, కార్మికులు తమ చిరునామాల్లో ఉండటం, ఈసీ అడిగిన పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించటం అంత తేలికా? చిరునామాల్లో లేకపోతే మరణించినట్టు లేదా శాశ్వతంగా ఆ చిరునామా నుంచి నిష్క్రమించినట్టు ఎన్నికల సిబ్బంది రాసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ‘ఓట్ చోరీ’ నినాదంతో ఉద్యమిస్తున్న విపక్షాలు సైతం ఆ సమస్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు రాజకీయ పక్షాలు చురుగ్గా కదలాలి. తమ కార్యకర్తల సాయంతో అర్హులైనవారు ఓటర్ల జాబితాలకెక్కేలా సాయపడాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ప్రశ్న అర్థరహితం. ఎన్నికల నిర్వహణ క్రతువులో తలమునకలై ఉండాల్సిన ఈసీ జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలి. నిలదీస్తున్నదెవరన్న విచికిత్సకు పోకుండా నిజాన్ని నిగ్గుతేల్చి తేల్చాలి.ఎందుకంటే రాగల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘సర్’ అమలు ప్రారంభ మవుతుందని ఆ సంస్థే చెబుతోంది. ప్రతిచోటా ఇదే మాదిరి తప్పుల తడకలతో ఆ ప్రక్రియను సాగిస్తే ఈసీ దేశ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ముందు కూడా పలచనవుతుంది. ఓటర్ల జాబితాలో చేరటానికి విధించిన గడువును పొడిగించుకుంటూ పోతే మొత్తం ప్రక్రియ గందరగోళంగా తయారై, తుది జాబితా ఖరారు సమస్యా త్మకమవుతుందంటున్న ఈసీ వాదనల్లో నిజం లేకపోలేదు. కానీ అందుకు బాధ్యత వహించాల్సింది తాను కాదా? అసలు ఎవరూ కోరకుండానే చివరి నిమిషంలో ఈ పెనుభారాన్ని నెత్తిన వేసుకున్నదెవరు? ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్లో రాహుల్గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
99.5% ఓటర్లు సరైన ధ్రువీకరణలను సమర్పించారు
న్యూఢిల్లీ: బిహార్లోని 7.24 కోట్ల మంది ఓటర్లకుగాను ఇప్పటి వరకు 99.5 శాతం మంది వెరిఫికేషన్ కోసం ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు ఎన్నికల కమిషన్(ఈసీ) సోమవారం వెల్లడించింది. ముసాయిదా ఓటరు జాబితాలో అనర్హుల పేర్ల తొలగింపులో ఆర్జేడీ, సీపీఐఎంఎల్లు మాత్రమే తమకు సాయం చేశాయని ఈసీ వివరించింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన సీపీఐ ఎంఎల్ 103 మంది పేర్లను తొలగించాలని కోరగా, ఆర్జేడీ, సీపీఐఎంఎల్లు కలిసి 25 పేర్లను కలపాలని దరఖాస్తులను అందించాయని పేర్కొంది. గుర్తింపు జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రమే ఓటరు ముసాయిదాకు సంబంధించిన 16 అభ్యంతరాలను అందజేసిందని వివరించింది. బిహార్ ఎస్ఐఆర్పై మార్పులు, చేర్పులకు ఆఖరు రోజైన సోమవారం భారీగా దరఖాస్తులు అందాయని వెల్లడించింది. జాబితా నుంచి తొలగించాలని ఏకంగా 2.17 లక్షల దరఖాస్తులు అందగా, తమ పేర్లను చేర్చాలని 36 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. ముసాయిదా జాబితాలో పారపాటున చేర్చిన తమ పేర్లను తొలగించాలంటూ 2.17 లక్షల మంది వ్యక్తులు ఇప్పటి వరకు దరఖాస్తులను అందజేశారని ఈసీ అధికారులు తెలిపారు. బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసాయిదాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత కూడా అవకాశమిస్తున్నట్లు ఈసీ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్లైన్ గడువు సెప్టెంబర్ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్లైన్ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్లైన్ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్లైన్ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది. ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్ను ఐడెంటిటీ ఫ్రూఫ్గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, బీహార్లో ‘సర్’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్ అధికార్ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా ‘సర్’ పట్టించుకోలేదు!
బీహార్లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీహిర్లో మళ్లీ సర్ను నిర్వహించాలని పట్టుబబుతోంది. ఈసీ ఏర్పాటు చేసిన సర్కు కాంగ్రెస్ 89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని బీహార్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో లక్షల్లో ఫిర్యాదులు ఇస్తే దానిని సర్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు కాబట్టే వాటిని వారు తీసుకోలేదన్నారాయన. దాంతో సర్ను కచ్చితంగా బీహార్లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఇప్పటికే 60లక్షలకు పైగా ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై ఈసీపై సైతం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. కేంద్రంతో కలిసి ఈసీ చేస్తున్న ఓట్ చోరీ అంటూ ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా ఆగస్టు 17వ తేదీన బీహార్లోని రోహ్తాస్ జిల్లా ససారామ్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ యాత్రకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ యాత్ర తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ(సోమవారం) నుంచి పాట్నాలో ప్రారంభం కానుంది. -
ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ..
రాజ్గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మరో మ్యాచ్లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్తో భారత్, కజకిస్తాన్తో చైనా తలపడనున్నాయి.


