ప్రజాధనం దుర్వినియోగం | Prashant Kishor party claim World Bank funds used in Bihar polls | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దుర్వినియోగం

Nov 16 2025 12:12 PM | Updated on Nov 17 2025 4:35 AM

Prashant Kishor party claim World Bank funds used in Bihar polls

ప్రపంచ బ్యాంకు నిధులను దారి మళ్లించారు 

రూ.14 వేల కోట్లను ఎన్నికల కోసం ఖర్చుపెట్టారు 

బిహార్‌లో నితీశ్‌ ప్రభుత్వంపై ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన ఆరోపణలు

పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్‌ సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. 

ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్‌ కిశోర్‌ డిమాండ్‌ చేశారు. బిహార్‌ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 

‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్‌ 21వ తేదీ నుంచి పోలింగ్‌ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. 

ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్‌సురాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌ సింగ్‌ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement