బిహార్లో మలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో.. 3,70,13,556 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరారు.(Bihar Assembly Elections Phase 2 Polling Updates)
ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్లు
- బీహార్ ఓట్లకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపు
- మొదట ఓటు వేయండి, తర్వాత అల్పాహారం చేయండి అంటూ ట్వీట్
- ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా: నితీశ్
- ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.. ఇతరులను కూడా ఓటేసేలా ప్రేరేపించాలి: నితీశ్
బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
- కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- బీహార్ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
- ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలి అని ప్రధాని మోదీ ఆకాంక్ష
- నవంబర్ 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది.. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన ఓటింగ్
- ఈ సందేశం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు
బీహార్ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఇలా..
- 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
- ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్
- బరిలో ఉన్న 1302 మంది అభ్యర్థులు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.7 కోట్ల మంది ఓటర్లు
- 45 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- చివరి విడత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో బిజెపి, 44 చోట్ల జెడియు, 15 చోట్ల ఎల్జెపి, హెచ్ ఎ ఎం 6, ఆర్ ఎల్ ఎం 4 సీట్లలో పోటీ
- మహఘట్బందన్లో ఆర్జెడి 71, కాంగ్రెస్ 37, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ4, సిపిఎం 1 చోట పోటీకి పార్టీలు
- ఆరు సీట్లలో స్నేహపూర్వకపోటీలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, సీపీఐ పార్టీలు
సెకండ్ ఫేజ్లో..
- 1,302 మంది అభ్యర్థులు బరిలో..
- పోటీలో.. 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు. ఒక ట్రాన్స్జెండర్
- ఓటర్లలో.. 1,95,44,041 మంది పురుషులు
- ఓటర్లలో.. 1,74,68,572 మంది మహిళలు
పోలింగ్ ఏర్పాట్లు ఇలా..
- ఎన్నికల సిబ్బంది 4 లక్షల మంది
- 45,399 పోలింగ్ బూత్ల ఏర్పాటు
- సున్నిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయం కుదింపు
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- నేపాల్ సరిహద్దులు ఈ నెల 11వ తేదీ వరకూ మూసివేత
- 595 పోలింగ్ బూత్లలో అందరూ మహిళా అధికారులే బాధ్యతలు
- 316 మోడల్ పోలింగ్ బూత్ల ఏర్పాటు
- ఇంటి వద్ద ఓటేయనున్న 63,373 మంది
రెండో విడతలో ఏ పార్టీ ఎన్నిచోట్ల..
ఎన్డీయే
బీజేపీ: 53
జేడీయూ: 44
ఎల్జేపీ: 15
ఆర్ఎల్ఎం: 4
హెచ్ఏఎం: 6
మహాఘట్బంధన్
ఆర్జేడీ: 71
కాంగ్రెస్: 37
వీఐపీ: 7
సీపీఐ: 4
సీపీఐ (ఎంఎల్): 6
సీపీఐ (ఎం): 1


