పట్టాలు తప్పిన పాక్‌ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు | One Killed And Many Injured In Pakistan Passenger Train Derails, More Details Inside | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన పాక్‌ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Aug 17 2025 12:36 PM | Updated on Aug 17 2025 4:14 PM

Pakistan Passenger Train Derails

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు లాహోర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్‌లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ  ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు.
 

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్‌లను పక్కకు తొలగిస్తున్నారు.  ట్రాక్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్‌లోని పంజాబ్‌లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్‌ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్‌లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస  రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement