Afghanistan: 6.3 తీవ్రతతో భూకంపం.. ఏడుగురు మృతి | 6.3 Magnitude Earthquake Hits Afghanistan | Sakshi
Sakshi News home page

Afghanistan: 6.3 తీవ్రతతో భూకంపం.. ఏడుగురు మృతి

Nov 3 2025 8:31 AM | Updated on Nov 3 2025 8:33 AM

6.3 Magnitude Earthquake Hits Afghanistan

కాబూల్‌: ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్ ఎ షరీఫ్ సమీపంలో (నేడు) సోమవారం తెల్లవారుజామున  6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు మృతిచెందారని, 150 మంది గాయపడ్డారని, బాధితులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సమీమ్ జోయాండా ‘రాయిటర్స్‌’కు తెలిపారు.
 

మీడియాకు అందిన వివరాల ప్రకారం దాదాపు ఐదు లక్షల, 23 వేల జనాభా కలిగిన మజార్ ఎ షరీఫ్ సమీపంలో 28 కి.మీ (17.4 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ‍సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ‘రాయిటర్స్’ ఈ వీడియోలు, ఫొటోలను వెంటనే ధృవీకరించలేదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా జనం మరణించారని మానవతా సంస్థ ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement