9న కలెక్టరేట్‌ వద్ద ధర్నా | - | Sakshi
Sakshi News home page

9న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Mar 4 2026 7:45 AM | Updated on Mar 4 2026 7:45 AM

● ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అలాగే భూమి మీద ఆధారపడిన కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు , వృత్తిదారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ● కేంద్ర ప్రభుత్వం అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం ఇచ్చిజన గెజిట్‌ నోటిఫికేషన్‌ గందరగోళ పరుస్తూ అర్థం కాకుండా ఉందని తెలిపారు. ● భూమి తీసుకునే ప్రతి గ్రామంలోనూ గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ● రైతులకు ప్రైవేట్‌ మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌) : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్‌ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌ కుమార్‌, రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి, వి.భారతి,బి. శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామరృష్ణ, జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి ,సిఐటియు జిల్లా నాయకులు వై. నేతాజీ, కె. నళినీకాంత్‌, ఎన్‌.భావనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement