గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

Mar 11 2026 7:28 AM | Updated on Mar 11 2026 7:28 AM

మంగళగిరి టౌన్‌: ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరారు. 2005లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా, 2019లో సివిల్‌ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉంటూ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీలోని డాగ్‌ స్క్వాడ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్‌ వేశారు. 2011లో బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌ గ్రౌండ్‌లో పీపీటీ టెస్ట్‌లో వాకింగ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement