– జాతీయ సదస్సులో రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు జాతీయ సదస్సులో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడం విశేషం. డాక్టర్ నమ్రితా ఓరల్ ప్రెజెంటేషన్లో ప్రథమ బహుమతి సాధించగా, డాక్టర్ వీణ ప్రియా పోస్టర్ ప్రెజెంటేషన్లో మొదటి స్థానం దక్కించుకుని కాలేజీకి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మంగళవారం విజేతలను అభినందించారు.
కార్యక్రమంలో అడ్మిన్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, ప్రొఫెసర్ – ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ పూర్ణమ్మ, ఇతర అధ్యాపకులు, సహాయ ఆచార్యులు, పీజీ వైద్యులు పాల్గొన్నారు


