సాక్షి, పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 98 రోజుల పాటు పిన్నెల్లి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ అక్రమ కేసు బనాయించింది.



