వైఎస్ జగన్ను కలిసిన హైదరాబాద్ జర్నలిస్ట్ కేవీఆర్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ(బుధవారం, మార్చి18) హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్) కలిశారు. తనను కర్నూలు పోలీసులు వేధించిన తీరును ఆయన వివరించారు. హైకోర్ట్లో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో విడుదల చేసినట్టు కేవీఆర్ తెలిపారు.

తప్పుడు కేసులపై ఆందోళన చెందవద్దన్న వైఎస్ జగన్.. న్యాయపోరాటం చేద్దామనీ, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.


