తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా రు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం . దర్శన టిక్కె ట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


