నర్సింగ్హోమ్పై చర్యలు తీసుకోండి
తిరుపతి అర్బన్: నగరంలోని బాలాజీ నర్సింగ్హోమ్పై చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ, ఆర్పీఐ, ప్రజా సంఘాలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. ఇటీవల నర్సింగ్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటమపై సమగ్రవిచారణ చేపట్టాలని కోరారు. ఓ వైపు ఫీజుల దోపిడీ, మరోవైపు విద్యార్థు లపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోలేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న ప్రవీణ్కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతలు చిన్నం పెంచలయ్య, నదియా, మంజూల,నమతా తదితరులు పేర్కొన్నారు.


