breaking news
Tirupati District Latest News
-
భూమి.. అధికార పార్టీ పరం!
రేణిగుంట: పట్టణంలోని అధికార పార్టీలోని ఒక వర్గం వివేకానంద కాలనీ పక్కన గత ప్రభుత్వంలో నిర్మించుకున్న 22 ఇళ్లపై కన్నేసింది. ఆ ఇళ్లను ఎలాగైనా తొలగించి తాము సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తి తెస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో 22 ఇళ్లను వాగు పోరంబోకులో నిర్మించుకున్నాని, గత వారంలో నోటీసులు అంటించారు. ఆదివారం తెల్లవారుజామున జేసీబీలు తీసుకొని వచ్చి అన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. రెవెన్యూ వారు చెబుతున్నట్లు 769 సర్వేనెంబర్ లో వివేకానంద కాలనీ ఏర్పాటు దాదాపు 30 సంవత్సరాలైంది. కాలనీకి ఉత్తరాన కాలువ ఉండగా కాలనీకి దక్షిణాన ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వంలో పట్టణానికి చెందిన వారు అప్పటి రెవెన్యూ అధికారుల అనుమతితో రేకుల ఇళ్లను నిర్మించుకున్నారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్నారనే కక్షతో పాటు ఆ భూమిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో పట్టణానికి చెందిన అధికార పార్టీలోని ఒక వర్గం నాయకులు పన్నాగం పన్ని అడుగులు వేస్తున్నారు. వాగు పొరంబోకుని అధికార పార్టీలోని ఒక వర్గం నాయకుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సైదాపురం: చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా చంద్రబాబు, పవన్ కల్యాణ్లతోపాటు ఇప్పుడు పయ్యావుల కేశవులు కూడా తమ తీరును అస్సలు మార్చుకోవడం లేదన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిరాధారమైన ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎవరూ తప్పు చేయలేదని, జంతువుల కొవ్వు కలపలేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చారన్నారు. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి నేతలు బరి తెగించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగిందనే భ్రమలో ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో చిట్టేటి హరికృష్ణ,ఽ బాలయ్య, ధనియాల రాధ, శ్రీనివాసులురెడ్డి, ఆరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహా శివరాత్రికి సర్వం సిద్ధం
శ్రీకాళహస్తి: మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తిలో సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నుంచి 14రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆదివారం నాటికి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ధూర్జటి కళాప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభంశ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు 10న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది. 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కల్యాణం, 19నన గిరిప్రదక్షిణ, 21న పల్లకీసేవ, 22న ఏకాంతసేవ, 23న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
పరశురామేశ్వరునికి మహత్కార్యం
●ఏర్పేడు: గుడిమల్లం పరశురామేశ్వరాలయం.. దేశంలోనే తొలి శైవక్షేత్రం. క్రీ.పూ.2వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం శోభాయమానం. ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం గతంలో ఎప్పుడు నిర్వహించారో తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అలాంటి మహత్తర ఘట్టానికి శివాజ్ఞ లభించింది. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పరశురామేశ్వరుని మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఇదీ చరిత్ర పరశురామేశ్వర స్వామివారి విగ్రహం స్వయంభువుగా వెలసి 5 అడుగుల పురుషలింగాకృతిలో కనిపిస్తుంది. విగ్రహంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసావతారంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవ పురుషలింగాకృతిలో ఈశ్వరుడితో విగ్రహం ఉంది. నవపాషాణ శివలింగం(9 రకాల విష పదార్థాలతో కూడిన లింగం) దేశంలో మరెక్కడా లేదు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆలయ నిర్వహణ ఎన్నో ఏళ్లుగా కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. చివరిసారిగా ఇక్కడ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం ఎప్పుడు జరిగందనే ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలేమీ లేవు. అయితే మహాకుంబాభిషేక మహత్కార్యం నిర్వహించేందుకు శివాజ్ఞ లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23వ తేదీన 60 మంది పూజారులతో ఆలయ మహాకుంభాభిషేకం చేయనున్నారు.ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వరాలయం (ఇన్సెట్) గర్భాలయంలోని పరశురామేశ్వరుని విగ్రహంశివయ్య అనుగ్రహం గతంలో ఎప్పుడు చేశారో కూడా తెలియని గొప్ప దైవకార్యం గుడిమల్లం ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవానికి శివయ్య అనుగ్రహంతో నభూతో.. నభవిష్యతి అన్న రీతిలో జరగనుంది. గుడిమల్లం క్షేత్రంలో పూర్వపు ఆలయ కళాసౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – వంశీకృష్ణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు జన్మ చరితార్థం గుడిమల్లం పరశురామేశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవం జరిపించే అవకాశం పరమశివుడు నాకు కల్పించడం పూర్వ జన్మసుకృతం. చారిత్రక ఘట్టానికి సంబంధించి ఆలయంలో పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకను నిర్వహించడంతో నా జన్మ చరితార్థమవుతుంది. – రామచంద్రారెడ్డి, ఈఓ, గుడిమల్లం ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా మహా కుంబాభిషేకం గుడిమల్లం పరశురామేశ్వరాలయ కుంబాభిషేక మ హోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదాయశాఖ, పురావస్తు శాఖ సమన్వయంతో ఈ వేడుకలో పాల్గొనే సువర్ణావకాశం దక్కడం ఎన్నో జన్మల పుణ్యఫలం. – బత్తల గిరిబాబు, గుడిమల్లం ఆలయ చైర్మన్ -
వీఆర్ఏపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్: ఈ నెల 4వ తేదీన విధులు నిర్వహిస్తున్న ఓబనపల్లి వీఆర్ఏ మణెయ్యపై ఇద్దరు కారంపొడి చల్లి కత్తితో పొడిచి పారిపోయారు. ఈ కేసులో నిందితులను ఆదివారం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యలో అనంతరాజుపేట వద్ద అరెస్ట్ చేశారు. వారి నుండి ఆయుధాలు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన నిందితులు అనరాతి శ్రీనివాసులు, కులశేఖర్ పాత కక్షలు మనసులో పెట్టుకొని మణెయ్యపై దాడి చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న మణెయ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
కల్తీని కడిగేద్దాం!
కూటమి పాపాలపై ఆ దేవదేవుడే శిక్షిస్తాడు తిరుపతి మంగళం: శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ జరగలేదని, చంద్రబాబు, పవన్కళ్యాణ్ మనసులే కల్తీ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్, ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ధ్వజమెత్తారు. తిరుపతిలో లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద నుంచి అలిపిరి వరకు కూటమి నాయకులు అపవిత్రం చేస్తూ నడిచిన రోడ్లను ఆదివారం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, మహిళలు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంతో నీచ రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తూ, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్ మాట్లాడుతూ తిరుపతి పుణ్య క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు కూటమి నాయకులు పసుపు దుస్తులు ధరించి దొంగ దీక్షలతో తిరుపతిలో పాదయాత్ర చేపట్టి నెయ్యిలో కల్తీ చేశారంటూ నమ్మబలికించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లడ్డూ భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుల్లయ్య, తలారి రాజేంద్ర, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, దినేష్రాయల్, పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, నాయకులు రాజేష్, కడపగుంట అమరఽనాఽథ్రెడ్డి, చంద్రయ్య, వెంకటేష్రాయల్, కోటి, స్వరూప్, ఆటో ప్రసాద్, బాలాజీ, ధనశేఖర్, విజయలక్ష్మి, పద్మజ, శాంతారెడ్డి, పునీత, పుష్పాలత, యశోద, పావని తదితరులు పాల్గొన్నారు. -
కాసులు ఇస్తేనే.. అటెండెన్స్ మ్యాపింగ్!
తిరుపతి తుడా: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. చేయితడిపితే చాలు ఏ పని కావాలన్నా క్షణాల్లో పని అయిపోతుంది. డిప్యూటేషన్పై పనిచేస్తున్న సీసీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారు. సరెండర్ లీవ్ బిల్లు అనుమతి కావాలంటే ఒక్కొక్క ఉద్యోగి రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిందే. వైద్యులైనా, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులైనా సరే లంచం చెల్లిస్తేనే ఫైలు కదులుతుంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ, సూపరింటెండెంట్, యూడీసీలకు వేర్వేరు ఽమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏదో ఒక సాకుతో పెండింగ్లో పెట్టి కాళ్లు అరిగేలా తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. దీంతో ఉద్యోగులు ఎందుకు ఆ తలనొప్పిని వారు చెప్పిన డబ్బులు ముట్టజెప్పి పనులు చేసుకుని వెళ్తున్నారు. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సి ఉన్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం(8వ తేదీ) ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, డివిజన్ స్థాయి అధికారులు, తహశీల్దార్లుతో సమీక్ష ఉందని తెలిపారు. ఈ క్రమంలో పీజీఆర్ఎస్ను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని వివరించారు. ధ్వనులపై పరిశోధకుల అధ్యయనం ఏర్పేడు: మండలంలోని జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో వారం రోజులపాటు అడ్వాన్స్డ్ బయో అకౌస్టిక్స్ వర్క్షాపు ముగిసింది. న్యూయార్క్కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కెలిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయోఅకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనుల అధ్యయనాలపై పరిశోదకులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వర్క్షాప్లో భాగంగా ఆదివారం రేణిగుంట మండలం మామండూరు అటవీ క్షేత్రాన్ని పర్యటించి, అక్కడ వృక్షాలపై ఉన్న జంతుజాలాల ధ్వనులపై అధ్యయనం చేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఘనంగా స్పోర్ట్స్ డే తిరుపతి తుడా: స్విమ్స్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూనిఫెస్ట్–2026 పేరుతో స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్విమ్స్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్తోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మట్లాడుతూ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా నెల రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందుతో భాగంగా స్పోర్ట్స్ డేని నిర్వహించామన్నారు. క్రీడాపోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అలోక్ సచిన్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, ప్రిన్సిపల్ డాక్టర్ ఉషాకలవత్, స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్, వైద్యాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
చెరువును పంచేసుకుంటున్నారు
తిరుపతి నగరంలో అతి విలువైనది కొంకచెన్నాయిగుంట చెరువు. ఈ ప్రాంతంలో నివాసస్థలాలకు మంచి డిమాండ్ ఉండడంతో టీడీపీ, జనసేనకు చెందినవారు ఆక్రమించుకున్నారు. గతంలో మాజీ సైనికోద్యోగులకు పట్టాలు ఇచ్చినా... వారినీ ఆ స్థలంలోకి అడుగుపెట్టనివ్వలేదు. అంతటితో ఆగని పచ్చ బ్యాచ్ ఏకంగా మాజీ సైనికోద్యోగులు తమకు అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు. ప్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. చెరువు ఆక్రమణకు గురైందని పలుమార్లు మీడియా, పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతీసారి రెవెన్యూ అధికారులు వచ్చి తాత్కాలిక షెడ్లు తొలగించి చేతులు దులిపేసుకుని వెళ్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్కి కూతవేటు దూరంలో కొంకచెన్నాయిగుంట చెరువు పోరంబోకు ఉంది. వైఎస్ఆర్ సీపీ హయాంలో మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడంతో నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఈ చెరువు పోరంబోకు ఇప్పుడు అత్యంత విలువైనదిగా మారింది. కోట్ల రూపాయలు విలువజేసే ఈ చెరువును ఆక్రమించుకుని అమ్మి సొమ్ము చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పక్కా పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 1992లో 35 మంది స్వాతంత్య్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం ఆ చెరువు పోరంబోకు భూమిని నివాస స్థలాల కోసం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన వారు పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంతకు ముందే మరో 13 మంది ఆ చెరువు పోరంబోకు భూమిని 1983లో తమకు విక్రయించారని మరో వర్గం వారు అడ్డుకున్నారు. మళ్లీ ఆక్రమణలు అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కొందరు ఆ చెరువు పోరంబోకు భూమిపై కన్నుపడింది. కొంకచెన్నాయిగుంట చెరువు వివరాలన్నీ తెలిసిన కూటమి నాయకులు సీపీఐ, సీపీఎంకి చెందిన కొందరి సహకారంతో రంగంలోకి దిగారు. తమకు ఇచ్చిన నివాస స్థలాలను స్వాతంత్య్ర సమరయోధులే వచ్చి 35 మందికి విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చెరువు పోరంబోకు భూమిని ప్లాట్లుగా విక్రయించడం ప్రారంభించారు. అంకణం రూ.25 వేల నుంచి రూ.50 వేలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రూ.లక్ష చొప్పున విక్రయిస్తున్నారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఈ చెరువు ఆక్రమణకు గురైనప్పుడు స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తాము ఎవ్వరికీ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని తీర్పు కూడా ఇచ్చారు. మేం చూసుకుంటాం.. కానిచ్చేయండి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతలు మరోసారి కొంకచెన్నాయిగుంట చెరువుపై దృష్టి పెట్టారు. నకిలీ పత్రాలతో నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. పత్రికలు, మీడియాలో వచ్చేలోపు నిర్మాణాలు పూర్తి చేసి విద్యుత్ మీటర్, ఇంటి పన్ను తీసుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. అక్రమార్కులు హడావిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధుల పీఏలు రంగంలోకి దిగడం గమనార్హం. -
రీసర్వేలో న్యాయం జరగలేదు
ఈ రైతు పేరు ఫాల్గుణరెడ్డి. తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేట గ్రామానికి చెందిన రైతుకు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. దీనికి కారణం ఆ భూమి ఇనాం భూములుగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. రీసర్వే పూర్తి చేసిన తరువాత పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆ రైతు ఎంతో ఆశపడ్డాడు. రీసర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. పట్టాదారు పాసుపుస్తకం రాకపోవడానికి ప్రధాన కారణం రీసర్వే ప్రక్రియ ద్వారా ఆన్లైన్ కరెక్షన్ చేయడానికి వెబ్ ల్యాండ్లో అవకాశం లేకపోవడమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ రైతు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం కోసం ఎదురు చూస్తూనే ఉ న్నాడు. సమస్యలకు లేదు పరిష్కారం వరదయ్యపాళెం: ఇతని పేరు అత్తిపట్టు రాంబాబు. వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. తొలివిడతలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తండ్రి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమి పూర్తిస్థాయిలో ఇతని పేరిట ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఆయన తల్లి పేరిట ఒకటిన్నర ఎకరానికి గత ఏడాది ఈ–పాస్బుక్ వచ్చింది. అయితే ప్రస్తుత నూతన పాసుపుస్తకాల్లో ఆమె పేరు లేదు. కేవలం అతని పేరిట 55 సెంట్లకు మాత్రమే పాసుపుస్తకం వచ్చింది. ప్రస్తుతం రీసర్వే కార్యక్రమంలో తన పేరిట మార్చుకునేందుకు ఆన్లైన్లో ఆప్షన్ విడుదల చేయలేదు. తప్పుల తడకగా రీ సర్వే ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు చంద్రశేఖర్. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట సమీపంలోని వడ్డిపల్లి. ఇతనికి భాకరాపేట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 180/బిలో 2.18సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఆ విస్తీర్ణం 2.05 ఎకరాలకు కుదించారు. తన భూమి ఎందుకు తగ్గిందని ఆ రైతు అడిగితే అదంతేనని చెప్పి సర్వేయర్లు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం రీసర్వే ప్రక్రియలో యంత్రాలు పెట్టి డ్రోన్ల సాయంతో కొలతలు వేయడం, సరిహద్దులు సరిగా గుర్తించక పోవడంతోనే విస్తీర్ణం తగ్గిపోయిందని ఆ రైతు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్కు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఆయనకు జవాబు చెప్పే వారు లేరు. -
తిరుపతిలో తిరువళ్లూరు ముద్దాయిలు మకాం
తిరుపతి అర్బన్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురు నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దాయిలు ఇటీవల తిరుపతిలో మాకాం వేసినట్లు సమాచారం ఉందని తిరువళ్లూరు కలెక్టర్ ఎం. ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువళ్లూరు కలెక్టర్తోపాటు ప లువురు ఆ జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పలు అంశాలపై సమీక్షించారు. తిరువళ్లూరు కలెక్టర్ మాట్లాడుతూ తమ జిల్లాలో పలు కేసులు ఉన్న పలువురు వ్యక్తులు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో వారికి అడ్డుకట్టవేయాల్సి ఉందని, మరోవైపు వారి సమాచారం లభించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూత వేయాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తప్పకుండా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. నకిలీ ఓటర్లను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం దుకాణాలు తప్పకుండా మూత వేస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ సుబ్బరాయుడు మాట్లాడు తూ నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దా యిలు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటే వారిని తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి, డీఆర్వో నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి జిల్లా నుంచి పాల్గొన్నారు. -
సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష
తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతి, దేశ వికాసానికి సంస్కృత భాష ప్రతీకని టీటీడీ అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో నాలుగు రోజులుగా జరిగిన నేషనల్ టాలెంట్ ఫెస్ట్–2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. శనివారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధ్యాత్మికత మానవుని సన్మార్గంలో నడిపించే ఒక శక్తి అని చెప్పారు. అనంతరం పలు శాస్త్ర విభాగా ల్లో జరిగిన ప్రతిభా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా టోఫ్రీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, పూరిలోని జగన్నాథ సంస్కృత వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కిషోర్ చంద్ర పాడి, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ దక్షణమూర్తి శర్మ, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతం తిరుపతి రూరల్: పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో ‘‘నేషన్ వైడ్ రూల్ అవుట్ ఆఫ్ ఎన్పీఎస్టీ అండ్ ఎన్ఎంఎం’’ అన్న అంశంపై శనివారం రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అడ్వైజర్ డీకే చతుర్వేది మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ వి.ఉమ మాట్లాడుతూ సమాజంలోని ఉన్నతస్థాయి వ్యక్తులందరూ తమ గురువుల చేతిలో రూపుదిద్దుకున్నవారే అన్నారు. ఎన్సీటీఈ ఎన్ఎంఎం ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుని ముఖ్యవిధి అన్నారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో సామర్థ్యాలు పెంపొందించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నారు. వర్క్ షాప్లో ఎన్సీటీఈ సభ్యులు డాక్టర్ చంచల్ మల్హోత్రా, ప్రొఫెసర్ టి.జి అముదవల్లిలతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్ ఎదుట కామిరెడ్డి బైఠాయింపు పెళ్లకూరు: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి న్యాయం కోసం బైఠాయించారు. చిల్లకూరులోని మన్నేమత్తేరి చెరువుకట్టపై చాలా కాలంగా వేపచెట్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేష్, మరి కొందరు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికివేశారు. స్థానిక సర్పంచ్ పగడాల హరిబాబురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులు, వారు ఉపయోగించిన ఆటో, పనిముట్లను అప్పగించి, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేలోపు పోలీసులు నిందితులను వదిలేశారు. దీంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పోలీస్స్టేషన్కు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, ఇచ్చిన ఫిర్యాదుపై రసీదు ఇచ్చే వరకు పోలీస్స్టేషన్ నుంచి కదిలేదిలేదని బైఠాయించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు వచ్చి ‘పోలీస్స్టేషన్ వద్ద ఎందుకు కూర్చున్నావు? రసీదు ఇవ్వడానికి నువ్వు ఫిర్యాదు ఇచ్చావా?.. ముందు స్టేషన్ దాటి అవతలకు వెళ్లు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకట్టపై ఉన్న వేప చెట్లు నరికిన నిందులను పోలీసులకు పట్టించినప్పటికి కేసు నమోదు చేయకుండా వదిలేసిన పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సత్యనారాయణరెడ్డి కోరారు. ఈవిషయమై సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. -
సెమీ కండక్టర్ల హబ్గా భారత్
నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. -
22 కిలోల గంజాయి స్వాధీనం
– ముగ్గురి అరెస్టు వెంకటగిరి రూరల్: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టణంలోని వెంకటగిరి పోలీసుస్టేషన్లో శనివారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి పెనుబర్తి గణేష్తోపాటు మరో ఐదుగురు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు రహస్య సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు తనిఖీ చేశారు. వారి వద్ద 22 కిలోల గంజాయిని ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఇద్దరు యువకులు పరారయ్యారు. ఇద్ద రు మైనర్ బాలురతోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశా రు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, 22 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్టు తిరుపతి రూరల్: మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథ నం మేరకు.. ఉప్పరపల్లి వాటర్ ట్యాంకు వద్ద శనివారం రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తమ సిబ్బందితో అక్కడ కు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చే శారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయితో పా టు ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కె. దుర్యోధన్రెడ్డిగా గుర్తించిన పోలీసులు తిరుపతిలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
పింఛనే శ్వాస..
జాడ లేని ఎన్టీఆర్ భరోసా ●చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడ మంజూరు చేయకపోగా కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేసుకుంది. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్ అనే ధోరణిలో బాబు సర్కారు వ్యవహరిస్తోంది. రెండేళ్లు ఒక కొత్త పింఛన్ కూడ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను రాజకీయ రంగును పులిమి తొలగించింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో మూడు రెవెన్యూ డివిజన్లు 36 మండలాల పరిధిలో 22,99,699 మంది జనాభా ఉన్నారు. పింఛన్ల పంపిణీ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని డప్పులు కొట్టుకుని ప్రచారం చేస్తున్న చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరుపై అలసత్వం వహిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఒక్క కొత్త పింఛన్ సైతం మంజూరు చేయలేయని దుస్థితి. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే వంద లాది మంది అర్హులు పింఛన్లు మంజూరు చేయండి సారూ అంటూ మొరపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పింఛన్ అర్జీదారులకు న్యాయం చేయలేక ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రతి వారం పీజీఆర్ఎస్లో అర్జీలే కొత్త పింఛన్లు మంజూరు కోసం అర్హులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ ఇవ్వాలంటూ అధికారుల ఎదుట తమ గోడును విన్నవించుకుంటున్నారు. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల మంజూరుకు పీజీఆర్ఎస్లో 20,452 అర్జీలు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అర్జీల్లో ఒక్కరికి కూడా న్యాయం చేయలేని నిస్సహయతలో అధికారులు మిన్నకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లే చంద్రబాబు సర్కారు ఎమ్మెల్యేలకు సైతం చేదు అనుభవం ఎదురవుతోంది. ఒక్క పింఛన్ ఇప్పించలేని ఎమ్మెల్యేతో లాభమేమి అంటూ అర్హులు విమర్శలు గుప్పిస్తున్నారు.కుప్పానికి ప్రత్యేక రూల్ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అందజేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుని నియోజకవర్గం అయినప్పటికీ గత సర్కారులో 35,637 మందికి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుత సర్కారులో ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ మిగిలిన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారు. నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కుప్పానికి మాత్రం ప్రత్యేక రూల్ అనే ధోరణిలో 3,895 కొత్త పింఛన్లను మంజూరు చేశారు. మిగిలిన నియోజకవర్గాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా మోసం చేస్తున్నారు. పింఛన్ల కోతకే ప్రాధాన్యం చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరు కంటే ఉన్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,183 మందికి పింఛన్లు అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జిల్లాలో 2,64,902 పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 19,500 మంది పింఛన్లను తొలగించి అర్హుల పొట్ట కొట్టారు. వేల సంఖ్యలో పింఛన్లను తొలగించడంతో బాధితులు చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.పింఛన్ కోసం ఎదురు చూపులు మాది తవణంపల్లి మండలం చింతమాకులపల్లి గ్రామం. నా కుమార్తె నివేదిత దీర్ఘకాల వ్యాధితో చాలా రోజులుగా ఇబ్బంది పడుతోంది. దినచర్యలో సొంతంగా ఏ పనిచేసుకోలేక కండరాల బలహీనతతో అవస్థలు పడుతోంది. ఇప్పటికే వైద్యం కోసం స్థోమత ఉన్నంత వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందించే రూ.15 వేల పింఛన్ కోసం అధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తే మాకు న్యాయం చేసినట్టవుతారు. – కుమార్తె నివేదితతోఈశ్వర్ మంచం పట్టినా మంజూరు కాలేదు మాది తవణంపల్లి మండలం ఏ గొల్లపల్లి పంచాయతీ వడ్డిఇళ్లు గ్రామం. మేసీ్త్ర పనిచేస్తేనే మా కుటుంబం ముందుకుసాగుతుంది. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నా భర్త మేసీ్త్ర పని చేస్తుండగా కిందపడి కాళ్లు, చేయి, తలకు పెద్ద గాయాలు అయ్యాయి. పనికి వెళ్లలేని దుస్థితి. మంచానికే పరిమితమయ్యాడు. వికలాంగ పింఛన్ కోసం చాలా సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. నెలలు గడుస్తున్నా మాకు కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు కొత్త పింఛన్ల ఇస్తారో అర్థమే కావడం లేదు. – బాధితుడు సుబ్రహ్మణ్యం, పిల్లలతో భార్య లోకేశ్వరి -
అర్హత ఉన్నా ఫలితం శూన్యం
మాది పెనుమూరు మండలం చెరువ ముందర ఊరు. నా భర్త పేరు జ్యోతిశ్వర్నాయు డు. మాకు పార్థీవ్ చౌదరి అనే కుమారుడు ఉన్నాడు. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి శరీరం మొత్తం సహకరించడం లేదు. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు. పింఛన్ పొందేందుకు 90 శాతం అర్హత ఉన్నట్లు సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. అయినా కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. మండలం, జిల్లా అధికారుల చుట్టూ బిడ్డను ఎత్తుకుని ఎన్ని సార్లూ తిరిగినా న్యాయం జరగడం లేదు. కనీసం కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవరూ చెప్పడం లేదు. – కుమారుడు పార్థీవ్ చౌదరితో తల్లి ఎన్నిసార్లు తిరిగినా లాభం లేదు మాది తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామం. పింఛన్ కోసం ఇప్పటికి వంద సార్లు అధికారులు అర్జీలు అందజేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ పొందలేని పరిస్థితిలో ఉన్నాను. కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. – దశరథ, కొత్త పింఛన్ బాధితుడు -
10న వెటర్నరీ వర్సిటీలో కిసాన్ మేళా
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన ఐసీఏఆర్, ఎన్ఎంఆర్ఐ సౌజన్యంతో కిసాన్ మేళాను నిర్వహించనున్నట్లు పశు వైద్యకళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్ మేళాలో పశుసంవర్థక, వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల వారీగా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కిసాన్ మేళాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రుణ సదుపాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు తిరుపతి అర్బన్: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని డీఆర్వో నరసింహులు, న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన అబ్జర్వర్ అజయ్జోషి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని రెండు సెంటర్లలో రెండు సెషన్స్ల్లో ఆదివారం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఉదయం పేపర్–1 పరీక్ష 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–ఏ), శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–బీ) సెంటర్లలో 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లును లైజన్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డుతో వస్తేనే అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే విద్యుత్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి!
టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతూ.. చిత్తూరు అర్బన్ : ‘‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. అదే సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పడిన సీబీఐ–సిట్ కమిటీ తొమ్మిది నెలలు విచారించి శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వు లేవని కోర్టుకు రాతపూర్వక నివేదిక ఇచ్చింది. ఇంకేం చెప్పాలి చంద్రబాబు నాయుడు..? మరేం రాయాలి..? మీ ప్రతి ఒక్క మా ట లో అసహనం, అభద్రత కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని హైందవ వ్యతిరేకిగా చూపిస్తూ, లడ్డూ అనే బాంబును ఆయుధంగా చేసుకుని వైఎస్సార్ సీపీపై బురద చల్లడానికి పవన్ కళ్యాణ్, పచ్చ పత్రికలతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీకు గుణపాఠం తప్పక చెబుతారు’’ అంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సిట్–సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో 32 మందిని కల్తీ నెయ్యిలో బాధ్యులుగా చూపిందని, ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. పైగా జంతుకొవ్వు లేదనే విషయాన్ని కూడా ప్రస్తావించిందన్నారు. ఈ నివేదికను జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు తన కుట్రలతో వైఎస్.జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త ఈ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019–24 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై విచారించిన సిట్.. 2014–19 మధ్యలో సరఫరా చేసిన నెయ్యిపై సైతం దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడుతాయన్నారు. టీటీడీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డి, అటుపై వైఎస్ జగన్కే సాధ్యమయ్యిందన్నారు. చిత్తూరులో అమలు కావడం సంతోషం జిల్లా అనుబంధ కమిటీల టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవాలని వైఎస్.జగన్ చెబుతున్న 2.0 కార్యక్రమం.. చిత్తూరులో అమలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యం వైఎస్.జగన్ హయంలోనే జరిగిందన్నారు. పార్లమెంటు పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న తప్పుల్లో సింహభాగం బాధ్యత పవన్ కళ్యాన్దేన్నారు. ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నారన్నారు. తన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రాయలసీమ ప్రాజెక్టులకు తాకట్టుపెట్టిన వ్యక్తిగా బాబు చరిత్రకెక్కారన్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ లడ్డూల విషయంలో బాబుకు తగిన శిక్ష శ్రీవారే విధిస్తారన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారని, వైఎస్సార్సీపీలో ఇక నుంచి కార్యకర్తలదే భవిష్యత్తన్నారు. గ్రామ కమిటీలు చెప్పిందే వైఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తారని, వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కెపి.శ్రీధర్, రూరల్ అధ్యక్షుడు జయపాల్, గుడిపాల అధ్యక్షులు ప్రకాష్, నాయకులు చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, విజయసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు హాజరైన పార్టీ శ్రేణులవిజయానందరెడ్డితో కలసి ప్రసంగిస్తున్న భూమన కరుణాకర రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతోందన్నారు. అమిత్ షా శిష్యుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి సభ్యుడు సౌరబ్ బోరా నాడు రూ.30 లక్షలు వెచ్చించి అయోధ్యకు లక్ష శ్రీవారి ల డ్డూలు తీసుకెళ్లాడని, అతను లడ్డూల తయా రీకి కల్తీ నెయ్యిను ఉపయోగించాడనే వి షయం పవన్ కళ్యాణ్కు సైతం తెలుసన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని, వైఎస్.జగన్కు ఇందులో సంబంధంలేని మాట్లాడిన పవన్కళ్యాణ్.. రెండు రోజుల్లో మళ్లీ కొవ్వు కలిపారని, జగన్కు సంబంధం ఉందని చెప్పడం అబద్దాలతో రాజకీయం చేయడమేనని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. -
మహిళా వర్సిటీలో ‘వికాస్–2026’ జోనల్ సదస్సు
తిరుపతి రూరల్: పద్మావతి మహిళావర్సిటీలో ‘‘వికాస్–2026 పరిశ్రమజ్ఞానం, అప్రెంటీస్షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై సౌత్జోన్ సదస్సును యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్జోషీ ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం, వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు యువతను నడిపించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నత విద్యాసంస్థలు పనిచేయాలన్నారు. అందులో భాగంగానే యూజీసీ 2025లో తీసుకువచ్చిన ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రాంను తప్పక అమలు చేయాల్సి ఉందన్నారు. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సుల గైడ్లైన్స్ను తప్పక అమలు చేసిన విద్యాసంస్థల విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కొత్త ప్రణాళికలు, ఎంటర్ప్రెన్యూర్స్లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోందని వెల్లడించారు. మహిళా వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ వికాస్ 2026 సౌత్ జోన్ సదస్సులో ఇండస్ట్రీ అకాడమీ అనుసంధానం, స్వయంప్లస్ మాడ్యూల్స్ రూపకల్పన, కోక్రియేషన్ ఆఫ్ కరికులం తదితర ముఖ్య అంశాలపై అర్థవంతమైన చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆర్ ఉష, యూజీసీ సంయుక్త కార్యదర్శి అవిచల్ కపూర్, సదస్సు కో ఆర్డినేటర్లు విద్యావతి, శోభారాణి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే గారూ..అసెంబ్లీలో మాట్లాడండి
తిరుపతి అర్బన్: ‘ఎమ్మెల్యే గారూ.. అసెంబ్లీ సమావేశాల్లో...ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడండి సార్..ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అయ్యోర్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.’ అంటూ శనివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు యూటీఎఫ్ జిల్లా కమిటీకి చెందిన ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల పెన్షన్ బకాయిలు చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎల్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్కార్డుల మెడికల్ బిల్లుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి, గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా కార్యదర్శులు పద్మజ, సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మోహన్, డివిజనల్ కోఆర్డినేటర్ మురళి, కృష్ణంరాజు, నేతలు ఖాదర్ బాషా, హేమాద్రి బాబు, ప్రభుకుమార్, వరలక్ష్మి, మురళి, గోపాల్ పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.35 లక్షల విలువైన 763 కిలోల ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అధికారుల కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల్లో భాకరాపేట అటవీశాఖాధికారులు శుక్ర వారం ఉదయం కూంబింగ్ చేశారు. ఆ సమయంలో అనుమానాస్పద వాహనం వస్తుండగా ఆపారు. అయితే డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా సిబ్బంది వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా సుమారు 763 కిలోల ఎరచ్రందనం దుంగలు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్తోపాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. భక్తుల సేవే మహద్భాగ్యం తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆయన శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈఓకు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ తిరుపతి అర్బన్: నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వర్చువల్ పద్ధతిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులతో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ నెల 17న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వెల్లడించారు. డీఎంఅండ్ హెచ్వో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత తగ్గడమే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,97,311 మందికి అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం, కరకంబాడి బీట్ ప్రాంతం 2016లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తనిఖీలు చేసింది. తమిళనాడు, తిరువణ్నామలై జిల్లాకు చెందిన శివమూర్తి సేతు, తిరుపతి శివమణి అటవీ ప్రాంతంలో అక్రమంగా సంచరించడాన్ని గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆర్టీసీ అధికారుల పరిశీలన నాయుడుపేటటౌన్: మండలంలోని విన్నమాల సమీపంలో ఆర్టీసీ బస్సులో వెనుక నుంచి మంటలు చేలరేగిన సంఘటనకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 29 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి వినుకొండకు వెళుతుండగా విన్నమాల వద్దకు వచ్చే సరికే బస్సు వెనుక వైపు ఒక్కసారిగా మంటలు చేలరేగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జగదీష్తోపాటు సూళ్లూరుపేట డిపో మేనేజర్ కళ తదతరులు, మెకానిక్ బృందంతో బస్సును పరిశీలించారు. రక్షణ విజ్ఞాన సదస్సులో ఎస్వీయూ వీసీకి గౌరవ ఫెలోషిప్ తిరుపతి సిటీ: విజయవాడ వేదికగా జరిగిన రక్షణ విజ్ఞాన సదుస్సులో ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావుకు అరుదైన గౌరవం లభించింది. అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్టీసీ) ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో ఆయనకు ఏఎస్టీసీ గౌరవ ఫెలోషిప్ను ప్రకటించింది. -
ముగిసిన జాతీయ గోల్ఘాట్ బాల్ పోటీలు
తిరుపతి అర్బన్: నగరంలో నాలుగురోజులుగా జరుగుతున్న 3వ సబ్ జూనియర్ బాల, బాలికల జాతీయ గోల్ఘాట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీలు గేమ్స్ వ్యవస్థాపకుడు నోట్ల రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో జీవకోనలోని విశ్వం స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్లు, రిఫరీలు, వలంటీర్లు, విశ్వం పాఠశాల యాజమాన్యంతోపాటు పలువురు పిల్లల తల్లిదండ్రుల సహకారం అమూల్యమైనదని కొనియాడారు. 23 రాష్ట్రాల నుంచి 500 మందికి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, పుద్దిచ్చేరి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, అసోం, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ నుంచి క్రీడాకారులు విచ్చేశారని వెల్లడించారు. అనంతరం విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్ విశ్వచందన్రెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు, మెడళ్లు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోల్ షూట్ బాల్ ఇండియన్ కోశాధికారి రామ్ ప్రవేశ్ కుమార్ వీరూ, సౌత్ ఇండియా ఇన్చార్జి కరుణాకరన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రియా, సంయుక్త కార్యదర్శి ప్రసన్న కుమార్, కోశాధికారి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీకాళహస్తి : ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉచిత దర్శనానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ బలోపేతం, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి శివరాత్రిని కొత్త శివరాత్రిలా భావించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాచుర్యం ఉందని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బాల్యవివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి స్వామి, అమ్మవార్ల పసుపు,కుంకుమ పాకెట్ క్యాలెండర్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడతామని ఆలయ ఈఓ బాపిరెడ్డి చెప్పారు. -
పీఎస్హెచ్ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక
పుత్తూరు : మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ (పీఎస్హెచ్ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్హెచ్ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా నియమించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.మధుసూదన్రాజు (తిరుపతి రూరల్), కోశాధికారిగా కె.నరేష్ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్), అసోసియేట్ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. తిరుపతిలో రోడ్డు ప్రమాదం ఇంటర్ విద్యార్థి మృతి తిరుపతి క్రైం: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మూల వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య కుమారుడు బాబు (17) ఉద్యోగం కోసం తిరుపతికి వచ్చి పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో స్నేహితుడు హరికృష్ణతో కలిసి స్కూటీపై ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ పక్కన ఉన్న సందు దారి నుంచి ప్రధాన రోడ్డులోకి వస్తుండగా, టీవీఎస్ సర్కిల్ వైపు నుంచి అన్నమయ్య సర్కిల్ దిశగా అతివేగంగా వచ్చిన బైక్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.12 గంటలకు మృతి చెందాడు. మృతుడి అన్న పల్లపు రమణ కుమారుడు పల్లపు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి వెంకటగిరి రూరల్: కరెంట్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాంపాళేనికి చెందిన ఈగ రమణయ్య (52) గురువారం గొడ్డేరువాగు సమీపంలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు రమణయ్యకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణయ్య మృతి చెందడంతో కాంపాళెం ప్రాంతంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. -
పట్టపగలే నగల చోరీ
పాకాల: పట్టపగలే రోడ్డు పక్కన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నేండ్రగుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన రవి ఇంటికి తాళం వేసుకుని మధ్యాహ్నం సుమారు 12.30 నుంచి 1.30 గంటల ప్రాంతంలో తన కుమారుడి షాపు వద్దకు వెళ్లాడు. అలాగే ఆ ఇంటిపైన అద్దెకు ఉన్న వాసు ఇంటికి తాళం వేసుకుని దైవదర్శనం కోసం కాణిపాకం వెళ్లాడు. వాసు వినాయకస్వామి దర్శనం ముగించుకుని స్కూటర్లో ఇంటి వద్దకు రావడంతో దుండగులు మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడం గమనించాడు. వాసు ఇంటిపైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగల గొట్టి ఉండడం గుర్తించారు. రవి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నెక్లెస్, కమ్మలను చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఇళ్లను పరిశీలించారు. ఈ మేరకు ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సులో పక్షులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓను అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ ఆదేశించారు. పులికాట్ సరస్సును అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియ శుక్రవారం సందర్శించారు. అనంతరం అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బడ్డెట్లో సుమారు రూ.100 కోట్లు సముద్ర ముఖద్వారాల పూడికకు కేటాయించినట్టుగా కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె శుక్రవారం పులికాట్ సరస్సు పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అటకానితిప్ప పర్యావరణ కేంద్రం పక్కనే చిన్నపాటి చెరువు ఉండడాన్ని చూసిన ఆమె ఇక్కడ పెడల్బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులు బాగా ఆనందించే అవకాశం ఉంది కదా.. మరి ఎందుకు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేయలేదని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు సీఎఫ్ సెల్వం, డీఎఫ్ఓ హారిక ఉన్నారు. -
సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి
నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి సినీ నటి మీనాక్షి చౌదరి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్డ్స్డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సినీ నటి మీనాక్షిచౌదరి హాజరయ్యారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన వారికి కృష్ణయ్య, మీనాక్షిచౌదరి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరకంగానూ, మానసికంగానూ ధృఢంగా ఉంటేనే చదువుపై దృష్టిని సారించే అవకాశం ఉంటుందన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. దేహ ధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ శనివారం పూర్వ విద్యార్థుల అలుమిని డే, ఆదివారం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సినీ హీరోయిన్స్ నిధి అగర్వాల్, శ్రీలీల, హీరో తేజా సజ్జా, తమన్ సంగీత విభావరి, నటరాజ్ ట్రూప్ నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. -
శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి
తిరుమల: శ్రీవారిని శుక్రవా రం సినీ నటి మీ నాక్షి చౌదరి ద ర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. 32 మంది విద్యార్థుల డిబార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన పలు కోర్సులకు సంబంధించిన యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 32 మంది విద్యార్థులను స్క్వాడ్ అధికారులు డి బార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధి కారి రాజామాణిక్యం తెలిపారు. -
నారాసుర ఆధరహో!
చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మ ద్యం ధరల నియంత్రణ గాలికొదిలేశారు. అమ్ము కున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లు లూఠీ ‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచుకో వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లే దో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లా ల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచు కుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు. తిమ్మిని బమ్మి చేస్తూ.. పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ప్రభుత్వం ధరలు పెంచింది అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీఓ అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పె రిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చే శారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచింనే బోర్డు చూపిస్తున్నారు. ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు. విచ్చలవిడిగా ‘బెల్టు’ రెండు జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొ ట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతి చోటా మ ద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు. తిరుపతి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మద్యం దుకాణాలు – 225 మద్యం బార్లు – 27 రోజుకు వ్యాపారం (సగటు) – రూ. 2 కోట్లు పెరిగిన ధరలతో భారం – రూ.32 లక్షలు -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట అడవిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.డాక్టర్ చీటి విలువ జీరో డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు వి లువ లేకుండా పోయింది. ‘‘ఏ మందైనా ఇ స్తాం’’ అన్న ధోరణితో మెడికల్ షాపులు వ్యవహరిస్తున్నాయి. ఇది వై ద్యవృత్తికే మచ్చగా మారుతోంది. రోగులు అ డగ్గానే మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రా ణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్ చీటీ లేకుండానే. డా క్టర్ ఒక మాత్ర రాస్తే మెడికల్ షాపుల్లో మరొకటి ఇచ్చి, అదే కాంబినేషన్ అని చెబుతారు. కాంబినేషన్ ఒకటే అయినా.. అది తక్కువ ధ ర, ఎక్కువ కమీషన్ ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మో సాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతు న్నా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారులకు ఇదే బలంగా మా రింది. మొత్తంగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మాఫియా ముసుగులో పడి..తనిఖీలకు అంటిముట్టనట్టు తిరుగుతున్నారు. -
● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్షాపులు ● రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి
ఆస్పత్రులే అక్రమాల అడ్డా.. ప్రైవేటు ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆవరణలోనే మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు నగరం, జీడీనెల్లూరు, పలమనేరు, కుప్పం, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి, సత్యవేడు, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా మెడికల్ షాపులు టేర్పాటు చేసుకున్నారు. రోగి బ యటకు అడుగు పెట్టకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో పరీక్షలు, ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకం మూడు ఒకే చోట జరుగుతున్నా, నియంత్రణ మాత్రం శూన్యం. -
స్పెల్–2 ప్రాక్టికల్స్కు 143 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ స్పె ల్–2 ప్రాక్టికల్స్లో భాగంగా తొలిరోజు శుక్రవారం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టి కల్స్ పరీక్షకు 3,785 మందికి గాను 3,697 మంది విద్యార్థులు హాజరుకాగా మధ్యాహ్నం జరిగిన ప్రయోగ పరీక్షకు 3,080 మందికి గాను 3,025మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 10వ తేదీవరకు జరగనున్నాయన్నారు. హోమ్ లోన్ మేళా నేడు, రేపు తిరుపతిఎడ్యుకేషన్ : కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 7, 8వ తేదీల్లో హోమ్ లోన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ బ్యాంకు జీఎం పాండురంగ మితాయ ఓ ప్రకటనలో తెలిపారు. కరకంబాడీ రోడ్డులోని గెస్ట్లైన్ డేస్ హోటల్ సమీపంలోని ఏబీ ఆవాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫొనెక్స్ టవర్ ప్రాంగణంలో రెండు రోజుల పాటు హోమ్ లో న్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో వినియోగదారులకు తక్షణమే లోన్ అప్రూవల్, తక్కువ వడ్డీ రేటు, ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 70134 10562 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.10లక్షల విరాళం తిరుపతితుడా: స్వి మ్స్ బాలాజీ ఆరో గ్య వరప్రసాదిని ప థకానికి బెంగళూరు కు చెందిన నారాయ ణ సిల్క్స్ అధినేత నమ్రత ఆర్ దేవత తండ్రి డీఎస్ రాఘవేంద్ర కోరిక మేరకు రూ. 10,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కు మార్ను ఆయన చాంబర్లో దాత తరఫున తి రుపతికి చెందిన వై రాఘవేంద్ర శుక్రవారం క లసి అందుకు సంబంధించి పత్రాలను, చెక్కు ను అందజేశారు. పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోనికి తీసుకుని విరాళం అందజేసినట్టు దాతలు తెలిపారు. -
ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత
నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో ఉగాది నాటికి లక్షకు పైగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు టిడ్కో గృహాల శాఖ ఎండీ సునీల్కుమార్రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల సముదాయాలను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి టిడ్కో గృహాల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడ్కీ గృహాల శాఖ ఎస్ఈ మహేష్, సీఈ మరియన్, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా, మెప్మా సీఎంఎం సురేంద్ర, డీసీఓ ముషీర్ అహ్మద్, సీఎల్టీసీ మునీర్ తదితరులు ఉన్నారు. -
రెండిళ్లలో చోరీ
నాయుడుపేట టౌన్: పట్టణంలోని రాజగోపాలపురం ఆరో వీధిలో ఉన్న రెండు ఇళ్లలో సుమారు రూ.4 లక్షలకు పైగా నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి అభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. రాజగోపాలపురంలో నివాసం ఉంటున్న గుండుబోయిన నరేష్ ఇంటికి తాళం వేసి, పెళ్లకూరు మండలం బంగారంపేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అలాగే అదే ఇంటి మిద్దైపె నివాసం ఉంటున్న కారిపాక చిట్టిబాబు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. రెండు ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దుండగులు తలుపులు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. నరేష్ గురువారం ఇంటి వద్దకు వచ్చి చూసే సరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో దాచి ఉంచిన రూ. 2లక్షలకు పైగా నగదు, 4.50 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. చిట్టిబాబు కూడా గురువారం సాయంత్రం ఇంటి వద్దకు చేరుకుని, పరిశీలించగా బీరువాలో దాచి ఉన్న 5 సవర్ల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు, 1.50 కిలోలకు పైగా వెండి వస్తువలు అపహరించుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ పద్ధతిలో 4 బార్లు తిరుపతి క్రైమ్: జిల్లాలో మిగిలి ఉన్న నాలుగు బార్లకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయించారు. శ్రీకాళహస్తి బార్కు–4, సూళ్లూరుపేట బార్కు–10, గూడూరులోని రెండు బార్లకు–8 దరఖాస్తులు వచ్చా యి. దరఖాస్తుల ద్వారా రూ.1.10 కోట్లు, ప్రాసెసింగ్ ద్వారా రూ.1.12 కోట్లు, మొదటి కంతు ద్వారా రూ.36.25లక్షలు, మొత్తంగా రూ.1.57 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2028 ఆగస్టు 31 వరకు వీరికి బార్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. -
వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి
తిరుపతి అర్బన్: ఘన, ద్రవ వ్యవర్థాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థల నుంచి నివేదికలు కోరారు. అనంతరం జిల్లాస్థాయిలో ఓ నివేదికను తయారుచేసి న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కి అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో వందశాతం వాస్తవ పరిస్థితులను పొందుపరుస్తూ నివేదికను ఇవ్వాలని ఆయన స్పష్టంచేశారు. -
ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?
ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
టాలెంట్ ఫెస్ట్కు విశేష స్పందన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ ఫెస్ట్–2026కు విశేష స్పందన లభించింది. వర్సిటీలో రెండో రోజు గురువారం దేశంలోని 24 యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి శాస్త్ర ప్రతిభను చాటుకున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన ప్రతిభా పోటీల్లో వేద భాష్య భాషణ, వ్యాకరణ శాస్త్ర భాషణ, సాహిత్య శాస్త్ర భాషణ, వేదాంత శాస్త్ర భాషణ, జ్యోతి ష్య శాస్త్ర భాషణ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో అవార్డులు, బహుమతులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా సాహిత్య విభాగ సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రత్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, అడిషనల్ కోఆర్డినేటర్గా వ్యాకరణ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు. 6 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయయసర్కిల్:శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో కారులో ఎరచ్రందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్చేసి ఆరు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఏఆర్ఎస్ఐ ఈశ్వర్రెడ్డి బృందం, ఎఫ్ఆర్ఓ పి.సుభాష్ గురువారం కేవీబీపురం మండలం వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎఫ్బీఓ సురేష్ కుమార్తో కలసి మారప్పరెడ్డి కండ్రిగ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. అటువైపు వేగంగా వచ్చిన ఒక కారు టాస్క్ఫోర్సు పోలీసులను చూసి కొద్ది దూరం ముందుగా ఆపేశారు. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఆరు ఎరచ్రందనం దుంగలు లభించాయి. అదుపులోకి తీసుకున్న వారిని అరెస్టు చేసి విచారించగా, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కారు సహా వారిని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. వీరిని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ ఖాదర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి రోగికీ నాణ్యమైన వైద్య సేవలు తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవల కోసం విచ్చేస్తున్న ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్ ఎమెర్జెన్సీ విభాగంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, స్విమ్స్ వైద్యం రావద్దంటోందని ప్రచురించిన కథనం అవాస్తమని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు బెడ్, వెంటిలేటర్ వంటి సౌకర్యాలు అందకపోయినా, అడ్మిషన్ నిరాకరించినా వెంటనే మెడికల్ సూపరింటెండెంట్ 94935 47803, ఆర్ఎంఓ 9866356239 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. -
వీరప్పన్లు!
కౌండిన్య, మోర్థానలో..మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దులో పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు -
పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభకు హాజరైన పార్టీ శ్రేణులుచలో పోతిరెడ్డిపాడుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు, శ్రేణులు నిర్వహించారు. చంద్రబాబు నీచ రాజకీయాలతో రాయలసీమకు చేస్తున్న తీవ్ర నష్టం, రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ్, సునీల్కుమార్, ఎమ్మెల్సీ భరత్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, విజయానందరెడ్డి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. – తిరుపతి మంగళం -
ఏనుగు దంతాలపై స్మగ్లర్ల కన్ను
పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ా ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకికర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపుసాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు.విదేశాల్లో భలే డిమాండ్చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది. -
మహిళా వర్సిటీలో వికాస్–2026
తిరుపతి రూరల్: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వేదికగా వికాస్– 2026ను ఘనంగా నిర్వహించనున్నట్టు సదస్సు కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ విద్యావతి, ప్రొఫెసర్ శోభారాణి తెలిపారు. గురువారం వర్శిటీలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వికాస్– 2026 సదస్సులో ‘‘పరిశ్రమ జ్ఞానం, అప్రెంటీస్ షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై ఒక్క రోజు సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి, సంయుక్త కార్యదర్శి డా. అవిచల్ కపూర్ , ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొ ఎస్.విజయభాస్కర్ రావు, వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ హాజరై ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలను జాతీయ అభివృద్ధి, సామాజిక పరివర్తనకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలల నుంచి నిపుణులు, పరిపాలనా అధికారులు హాజరవుతారని చెప్పారు.లారీ ఢీకొని ఒకరి మృతికలువాయి(సైదాపురం): కలువాయి మండలంలోని గురువారం లారీ ఢీకొనడంతో జాతీయ దాటుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసారగం మండలం ఉప్పలపాడు గ్రామనికి చెందిన భాగాది నరసింహులు(38)గా పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని సంఘటన స్థలంలో వదిలి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఒప్పందం
తిరుపతి రూరల్: శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి తెలుగు భాష, సంస్కృతిని నేర్పడానికి శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖ ముందుకు వచ్చింది. బోధన, అభ్యసన, అకడమిక్ సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు నెరవు శ్రీకాళహస్తి మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు సంయుక్తంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించటానికి పరస్పర సహకారం అందించుకోనున్నారు. ఈ అవగాహన ఒప్పందంతో శ్రీలంకలోని తెలుగు విద్యార్థులకు తెలుగు భాషను నేర్పడమే కాకుండావారి మూలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్. ఉష, డీన్ ఆచార్య సి.వాణి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతిపాల్గొన్నారు. -
ఉపాధి, వ్యవస్థాపకతే ఉన్నత విద్య లక్ష్యం
తిరుపతి సిటీ: ఉన్నత విద్య పూర్తిగా డిగ్రీతో కేంద్రీకృతం కాకుండా ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా అనుసంధానించాలని యూజీసీ జాయింట్ సెక్రటెరీ డాక్టర్ అవిచల్ రాజ్కపూర్ సూచించారు. ఎస్వీయూలోని సెనేట్ హాల్లో గురువారం ఎన్ఈపీ–2020తో దేశంలో ఉన్నత విద్య.. మారుతున్న దృశ్యం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యసించారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. 2023లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ పరివర్తన, పరిశ్రమ సహకారం, జీవితాంతం అభ్యసించడం వంటి చర్యలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్యా వ్యవస్థల అవసరాన్ని ప్రపంచ మేధావులు, నాయకులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. సమగ్ర డిజిటల్ వ్యూహాలను విశ్వ విద్యాలయాలను అవలంభించాలని ఆయన కోరారు. వీసీ టాటా నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎన్ఈపీ అమలు స్థితి గురించి, విద్య, డిజిటల్ అభ్యాసం, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, పరిశోధన ప్రమోషన్, పరిశ్రమల అనుసంధానం వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం సంస్కరణలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పలు కళాశాలల నుంచి ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కనికరించలేరా?
కాళ్లావేళ్లాపడినా ఆర్డీఓ కోర్టు తీర్పుకు విలువలేదా! ●ఆక్రమణకు గురైన భూమి సాక్షి ప్రతినిధి తిరుపతి: ‘పండు ముసలి 90 ఏళ్లు.. ఈయన ఓ నిరుపేద రైతు.. బస్టాండ్లలో నిద్రిస్తూ న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అయ్యా నా భూమి ఆక్రమణకు గురైంది.. న్యాయం చేయండి.’ అంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. వివరాలలోకి వెళ్లితే... తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం, బోడేవాండ్లపల్లి గ్రామం, పి వడ్డిపల్లెకు చెందిన కే సిద్ధయ్యకు 50 ఏళ్ల క్రితం అప్పటి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది యల్లమంద గ్రామం సర్వే నంబర్ 1489లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. అదే మండలం వీఆర్ ఆగ్రహారం గ్రామానికి చెందిన భూస్వామి శిరివేలు రమేష్ 2019లో నిరుపేద రైతు అనుభవిస్తున్న 3.65 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీలు నిర్వహించి బతిమలాడుకున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు దిగసాగాడు. ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు ఆ భూస్వామి కుమ్మక్కు కావడంతో వారు అతనికి సపోర్టుగా మాట్లాడే వారు. దీంతో ఏమీ చేయలేని దుస్థితిలో బాధితుడు సిద్ధయ్య అప్పటి ఆర్డీఓ కార్యాలయం మదనపల్లెలో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా ఆక్రమించిన పొలంలో మామిడి మొక్కలు నాటి సాగు చేశాడు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి ఆర్డీఓ కార్యాలయ కోర్టుకు కేసు బదిలీ కావడంతో వాస్తవాలను ఆరా తీసిన కోర్టు 2022 ఆగస్టులో సిద్ధయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆర్డీఓ కోర్టు ఆదేశాలూ బేఖాతరు రైతు సిద్ధయ్యకు చెందిన 3.65సెంట్ల భూమిని తక్షణం తిరిగి అప్పగించాలని ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ అధికారులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆర్డీఓ కార్యాలయంలోనూ, కలెక్టర్ కార్యాలయంలోనూ సిద్ధయ్య ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వృద్ధ రైతు తమని ఏమి చేసుకోలేడనే నమ్మకంతో ఆక్రమణ దారుడు మరో అడుగు ముందుకేసి మిగిలిన 1.38 సెంట్ల భూమిని సైతం తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆర్డీఓ కోర్టు ఆదేశాలిచ్చినా తమ భూమిని ఆక్రమణదారుడు వదలకపోవడంతో తిరుపతి ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ వృద్ధ రైతు ప్రదక్షణలు చేస్తూ కనిపించిన వారిని న్యాయం చేయండని బతిమలాడుతున్నాడు. అయ్యా.. న్యాయం చేయండి మహా ప్రభూ! వయస్సు మీద పడింది. నడవలేని స్థితి. నాకు ఉన్న 5ఎకరాల భూమిని ఆక్రమించారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఆక్రమణ దారుడు శిరివేలు రమేష్ నా భూమిలోకి నన్ను అడుగు పెట్టనీయడం లేదు. 2022లో ఆర్డీఓ కోర్టు ఆదేశించినా కనీసం పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ను అమలు చేయాలని ఏళ్ల తరపడి మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి రావద్దంటూ అధికారులు గర్జిస్తున్నారు. ఈ వయస్సులో ఇంత దారుణంగా ఇటు అధికారులు, అటు ఆక్రమణ దారుడు నన్ను వేధించడం తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికై నా అధికారులు నాకు న్యాయం చేయాలి. – కే సిద్ధయ్య, రైతు, ఎర్రావారిపాళెం మండలం -
సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి
– టీటీడీ ఇన్చార్జి ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుపతి సిటీ: శాస్త్ర సంప్రదాయాలకు సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను సంరక్షించి భావి భారతావనికి అందించాలని టీటీడీ ఇన్చార్జి ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో బుధవారం మూడు రోజుల పాటు జరగనున్న అర్చక శిక్షణ తరగతులను ఆయన వీసీ రాణి సదాశివమూర్తితో కలసి జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని పలు ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కై ంకర్యాలను మరింత నియమబద్ధంగా నిర్వహించేందుకు శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇందులో 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు దోహదపడతాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి సూళ్లూరుపేట: పట్టణంలోని హోలీక్రాస్ సెంటర్ వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటిలోని సీఈటీసీ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేట గాండ్లవీధిలో నివాసముంటున్న గోపిశెట్టి శ్రావణి (31) ఉదయాన్నే కంపెనీ బస్సు ఎక్కి డ్యూటీకి వెళ్లింది. ఆమె సమీప బంధువులు ఫోన్ చేసి బుధవారం పొదుపునకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో మీటింగ్ ఉందని చెప్పారు. ఆమె బస్సు ఆపి తడ రెవెన్యూ కార్యాలయం వద్ద దిగింది. సూళ్లూరుపేటకు వచ్చేందుకు అవతలి వైపు రోడ్డు పక్కకెళ్లి అదే కంపెనీలో పనిచేస్తున్న ఎల్లా రాజశేఖర్ (32) తడ నుంచి సూళ్లూరుపేటకు మోటార్సైకిల్పై వస్తుండగా ఆపింది. అతనితో పాటు మోటార్సైకిల్పై సూళ్లూరుపేటకు వస్తూ హోలీక్రాస్ సర్కిల్ వద్ద షార్రోడ్డులో మలుపు తిరిగే సమయంలో వెనుకనే వస్తున్న కంటైనర్ ఢీకొని, వారు కింద పడ్డారు. కంటైనర్ శ్రావణిపై దూసుకెళ్లడంతో ఆమె మృతి చెందింది. తమిళనాడులోని ఆరణి పట్టణం సుబ్రమణ్యంనగర్కు చెందిన ఎల్లా రాజశేఖర్ మోటార్సైకిల్తోపాటు పక్కకు పడడంతో తీవ్రమైన గాయపడిన గమినించిన స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారమందుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి పాలనపై విసిగిపోయారు!
తిరుపతి మంగళం: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి నమ్మక ద్రోహం చేసిన కూటమి పాలనపై రెండేళ్లకే రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కార్యకర్తలకే అగ్రస్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకరరెడ్డి ఉన్న రెండు సార్లు శ్రీవారి ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. శ్రీవారి భక్తి చానల్, వాడవాడలా శ్రీవారి కల్యాణాలు, దళిత గోవిందం వంటి అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కరుణాకరరెడ్డిదన్నారు. అలాంటి గొప్ప దైవభక్తి కలిగిన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్కళ్యాణ్ లడ్డూలో కల్తీ అంటూ దుష్ప్రాచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలతోనే వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసుకోగలమన్నారు. పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ కమిటీల్లో నియమించాలని సూచించారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి, వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు వారేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అందరి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందాయంటే అది ఒక జగనన్న పాలనలో మాత్రమేనన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అనంతరం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా తిరుపతిలో పదివేల మందితో పార్టీ అనుబంధ కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఉన్న యాభై డివిజన్లకు గానూ 45 డివిజన్లలో కమిటీలను పూర్తి చేయడంతోపాటు డిజలైజేషన్ చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు తిరుపతి నగరంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వల్లేనన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే కార్యకర్తలకే పెద్దపీట -
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం ● ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వేడుకోలు
●విద్యుత్ మీటర్ రీడర్ల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపే కారణమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకండి’ అంటూ టీడీపీ అగ్ర నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, ప్రస్తుతం గృహ వినియోగదారులకు సైతం చకచకా బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్లు ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు అందిస్తారు. ఇందుకు రీడర్లకు ఒక్కో బిల్లుకు పట్టణాల్లో రూ.3.6 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.73 పైసలను విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకొన్న కాంట్రాక్టర్కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో రూ.4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారిగా కాంట్రాక్టర్లు ఉంటారు. గతం ప్రభుత్వంలో కొండంత భరోసా సంబంధిత కాంట్రాక్టర్లు తమకు రూ.3.3 పైసలు చెల్లిస్తున్నారంటూ రీడర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేశారు. రీడర్లకు కొండంత అండగా నిలిచారు. బొక్కేస్తున్న ‘యువగళం’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్కు కష్టాలెక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగళం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు రీడర్లకు రూ.2.8 పైసలు, కొన్నిచోట్ల రూ.3 వంతున ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకో.. లేకుంటే వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్గా రోడ్డుపైకి! శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడిందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులోని చిప్ ద్వారా రీడింగ్ను విద్యుత్ కార్యాలయం నుంచే సేకరించి, మొబైల్ రీచార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగుకానున్నారు.15 ఏళ్లుగా పనిచేస్తున్నా.. గత 15 ఏళ్లుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం వస్తున్న వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగ భద్రత ఆందోళనకరంగా ఉంది. భవితవ్యం అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, మీటర్ రీడర్, పుత్తూరు ఉద్యోగ భద్రత కల్పించాలి మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే పని కల్పించండి. షి ప్టు ఆపరేటర్లుగా, వాచ్ టు వార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, బ్రేక్ డౌన్ గ్యాంగ్, వాచ్మెన్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ వంటి విధుల్లో చేర్పించండి. మా కుటుంబాలకు అండగా నిలవండి. –సి.రమేష్, ఉపాధ్యక్షుడు,ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ కమిటీ విజ్ఞప్తి చేశాం ప్రభుత్వానికి, విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మా ఉద్యోగ భద్రతపై విజ్ఙాపనలు అందజేశాం. ప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాలేదు. ఉపాధి చూపమని వేడుకొంటున్నాం. ప్రభుత్వం కనికరం చూసుతుందని ఆశిస్తున్నాం – యువరాజ్, మీటర్ రీడర్, పుత్తూరు -
రేపటి నుంచి ఇంటర్ స్పెల్–2 ప్రాక్టికల్స్
తిరుపతి సిటీ: జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్ స్పెల్–1 ప్రాక్టికల్స్ గురువారంతో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి స్పెల్–2 ప్రాక్టికల్స్ జిల్లాలోని 89 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే నాలుగో రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాక్టికల్స్కు ఉదయం సెషన్లో 33 మంది, మధ్యాహ్నం సెషన్లో 54 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 7న ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. శ్రీవారి సేవలో యాదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి తిరుమల: మేలుకొటే యాదుగిరి యతిరాజ మ ఠం పీఠాధిపతి యాదుగిరి యతిరాజ స్వామిజీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా రు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ పేష్కార్ రామకృష్ణ, పోటు పేష్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 69,389 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 20,247మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కా నుకల రూపంలో హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టి కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్!
తిరుపతి కల్చరల్: కూటమి ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత నాయుడుపేటలో ఆ పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జనాలు మితిమీరిపోతున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దోపిడీనే లక్ష్యంగా కూటమి నేతలు గంగాధర్ప్రసాద్, చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్రెడ్డి, రాజేంద్ర, రఫీ అక్రమాలు, దౌర్జన్యాలు సాగిస్తూ ప్రశ్నించే వారిపై దాడులతో అ ణచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నాయుడుపేట టౌన్లో లాటరీ ద్వారా 14 వైన్షాపు లు దక్కించుకుని, ఆ షాపుల నుంచి మద్యం గ్రామీణ ప్రాంతాలకు తరలించి, పల్లెల్లో బెల్టు షాపులు నడుపుతున్నారన్నారు. అయితే ఇదే లాటరీలో బొబ్బు వెంకటరత్నం మద్యం షాపులను దక్కించుకుని ఆయన తాను భాగస్వామ్యంగా ఆ మద్యం షాపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు పాటి స్తూ నిబద్ధతతో సమయ పాలన పాటిస్తూ ఎమ్మార్పీ కే మద్యం విక్రయిస్తున్నామని తెలిపారు. దీంతో తమ మద్యం షాపును సిండికేట్లో కలపాలని కూటమి నేతలు తమపై ఒత్తడి తెచ్చారని, దీనిని తాము నిరాకరించామన్నారు. అప్పటి నుంచి అనేక రకాలుగా తమపై దౌర్జన్యాలు, దాడులు చేపట్టడమేకాక సుమారు 14 తప్పుడు కేసులు బనాయించి ఆందోళనలకు గురి చేశారన్నారు. సీఐ బాబి ఓ రోజు తమను బెదిరిస్తూ నెల మామూళ్లు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని, ప్రస్తుతం రూ.45 వేలు ఇవ్వాలని లేకుంటే కేసులు పెట్టి జై లుకు పంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము రూ.30 వేలు ఇస్తామని చెప్పి ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు డబ్బులు తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ రామ్మోహనరావు, సీఐ బాబిపై కేసు పెట్టి వారిని జైలుకు పంపారని తెలిపారు. దీంతో మరింత రెచ్చిపోయిన కూటమి నేతలు నిత్యం తమపై దాడులు చేస్తూ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకుని, తనకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్రెడ్డి, బీసీ సెల్ నేత బాబు, వెంకటరత్నం, జితేంద్ర, గిరిరెడ్డి పాల్గొన్నారు. -
23 కిలోల గంజాయి స్వాధీనం
నాయుడుపేటలో బుధవారం పోలీసులు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.కింది ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు రేణిగుంట మండలం గాజులమండ్యం ప్రాంతానికి చెందిన వ్యక్తి. వయస్సు 70. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడిని జనవరి 27వ తేదీన స్విమ్స్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అక్కడి వైద్యుల బృందం రోగి ఆటో దిగకుండానే వివరాల కూపీ లాగారు. చూడడానికి పేదలుగా ఉండడంతో కేసు సీరియస్గా ఉందని, ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు, మీరు పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. మా ఆయన శ్వాస తీసుకోవడం లేదు, బెడ్లో చేర్చుకోండి అంటూ కంటతడి పెట్టినా.. వైద్యులు మాత్రం కనికరించలేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం, మీరు అర్జెంటుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండంటూ భయపెట్టడంతో చేసేది లేక అదే ఆటోలో రుయాకు తరలించారు. -
స్విమ్స్ వైద్యం..
స్విమ్స్ వైద్యం.. కాసులే ముఖ్యం.. పేదలకు వైద్యం దక్కకపోవడం.. ఆరోగ్యశ్రీ చెల్లకపోవడమే ఇక్కడ ప్రత్యేకం..వాహనంలోనే రోగి స్థితిగతులపై ఆరా తీయడం.. బిల్లులు కట్టగలరా? లేదా?ని కూపీ లాగడం.. పేదలని తెలిస్తే తిరస్కరించడం.. ఆపై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహాలివ్వడం ఇక్కడి వైద్యుల నైజం.. ఇలా స్విమ్స్ వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. పేదలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని స్విమ్స్ ఆస్పత్రికి వస్తే, ఇక్కడ పనిచేసే వైద్యుల బృందం వారికి ఊపిరి పోయలేని పరిస్థితి నెలకొంది. కళ్లు చెదిరే ఈ వాస్తవాలు జనవరి 27వ తేదీన సాక్షి నెట్వర్క్ పరిశీలనలో వెలుగు చూశాయి. తిరుపతి టాస్క్ఫోర్స్: స్విమ్స్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ మైకు కనిపిస్తే పాలకులు.. అధికారులు పోటీ పడి మాట్లాడుతుంటారు. ఇది నమ్మి పొరుగు జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగున వస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీరా ఇక్కడికి వచ్చాక బెడ్లు ఖాళీలేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. వైద్యం కోసం ఎంత మొరపెట్టుకున్నా రోగికి అత్యవసర విభాగంలో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తమ వారికి సకాలంలో వైద్యం అందించలేకపోయామంటూ బోరున విలిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగికి, వారి కుటుంబాలకు స్విమ్స్లో ఎదురవుతున్నాయి. ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు. నిత్యం ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం పదుల సంఖ్యలో వచ్చే రోగులకు ఎదురవుతున్న దుస్థితి. డబ్బులు కట్టే పరిస్థితి లేదని గుర్తిస్తే బెడ్లు లేవని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే అత్యవసర విభాగంలోకి నో ఎంట్రీ చెప్పేస్తున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన రోగికి మంగళవారం స్విమ్స్ వైద్యు లు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో రుయాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యులతో సిఫార్సు చేయించుకుంటే అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ కింద ఒకరిద్దరికి ఇక్కడ అడ్మిషన్ లభిస్తుంది. మిగిలిన రోగులను భయపెట్టి, నిర్దాక్ష్యింగా వచ్చిన దారినే వెనక్కి తరిమేస్తున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితిలో అర్ధరాత్రి వచ్చినా కనికరం లేకుండా మరో ఆస్పత్రికి వెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు. దీంతో పేదలకు ఇక్కడ అత్యవసర వైద్యం అంత ఈజీగా అందడం లేదు. అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ లేదంటున్న అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అత్యవసర వైద్యం కోసం వస్తున్న రోగులకు స్విమ్స్ చుక్కెదురు అవుతోంది. అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ వర్తించదంటూ వైద్య అధికారులు తేల్చి చెబుతున్నారు. అడ్మిషన్ కావాలంటే ముందు డబ్బులు చెల్లించాలని, ఇక్కడ వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా చెల్లిస్తేనే రోగిని లోనికి తీసుకుంటామంటూ నిర్మొహమాటంగా తేల్చి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య నిబంధనలకు విరుద్ధమని తెలిసినా స్విమ్స్ వైద్యాధికారులు ఆరోగ్యశ్రీ రోగి అంటే నో ఎంట్రీ అంటున్నారు. రోజు అడ్మిట్ అయ్యే రోగుల్లో 10 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉండడం లేదని తెలుస్తోంది. ఎక్కువ శాతం మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వాస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో పరుగులు తీస్తున్నారు. స్విమ్స్కు పెరుగుతున్న రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం 70 నుంచి వంద పడకలతో ఎమర్జెన్సీ విభాగాన్ని నిర్వహించాలని సిఫార్సులున్నా టీటీడీ ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్ దించకుండానే వెనక్కి.. అరచేతిలో ప్రాణాలు -
తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్ను జయించడం సాధ్యం
తిరుపతి తుడా: తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ అవగాహన వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇందిరా మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్పై అనవసరమైన భయాన్ని వీడి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్విమ్స్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ను స్టేజ్–1, స్టేజ్–2 దశలో గుర్తిస్తే దాదాపు వంద శాతం కోలుకునే అవకాశం ఉందన్నారు. చెడు అలవాట్లతోనే సమస్య పొగతాగడం, మద్య సేవనం, ఊబకాయం, అసమతుల్య ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, ఇవన్నీ నివారించదగిన కారణాలేనని తెలిపారు. ప్రధానంగా యువత చిన్న వయసులోనే పొగాకు అలవాట్లకు బానిస కావడం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. క్యాన్సర్ అనే మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల, వైద్య సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ అవగాహన వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ -
సంప్రదాయాల విలువలు పెంచండి
నారాయణవనం: భవిషత్తుకు దారి చూపే వృత్తి వి ద్యలతో సమానంగా కుటుంబ, దేశ సంప్రదాయాలకు విలువలు పెంచేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలని అశోకరాజు అన్నారు. సిద్ధార్ధ ఇంజినీ రింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా బుధవారం ట్రెడిషనల్(సంప్రదాయ) డే నిర్వహించారు. చైర్మన్ నుంచి విద్యార్థులు వరకు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు వి చ్చేశారు. అధ్యాపకులకు విద్యార్థులకు తంబోల, ఫొటో కాంపిటీషన్, మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి షీల్డ్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ అశోక రాజు మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించారని తెలిపారు. ఆధునిక, పాశ్చాత్య దేశాల పోకడలతో సంప్రదాయాల విలువలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సా యంత్రం ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక, నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. 23 కిలోల గంజాయి స్వాధీనం – ఐదుగురి అరెస్టు నాయుడుపేట టౌన్: మేనకూరు కేంద్రంగా చేసు కుని గంజాయి విక్రయాలు జరిపే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాకు సంబంధించి ఐదుగురిని బుధవారం పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు బుధవారం వెల్లడించారు. నాయుడుపేట అర్బన్ పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి విలేకరుల సమావేఽశంలో డీఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. నా యుడుపేట మండలంలో మేనకూరు పరిశ్రమల కేంద్రం వద్ద గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో డీఎస్పీ సారధ్యంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, మహిళా ఎస్ఐ భానుప్రసూన పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టించారు. బుధవారం పోలీసులతోపాటు తహసీల్దార్ మా గర్ల రాజేంద్రతో కలిసి మండలంలోని మేనకూరు బైపాసు రోడ్డు వద్ద ఆకస్మికంగా సోదాలు జరిపి, 11 గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బిహర్ రా ష్ట్రానికి చెందిన ముఖేష్ గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన సుధాకర్ దాస్, షీబా దాస్, గోపాబంధు దాస్, జార్ఖండ్కు చెందిన పింకిదేవిని అరెస్టు చేసి నట్టు సీఐ తెలిపారు. విచారణలో ఇతర రాష్ట్రా లకు చెందిన వీరంతా ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా తెస్తు మేనకూరులో విక్రయాలు జ రుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐ , ఎస్ఐని డీఎస్పీ అభినందించారు. -
నర్సింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి
తిరుపతి తుడా: నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, వెంటనే ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం నర్సింగ్ కళాశాల ఎదుట మృతుని తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇదే కళాశాల చైర్మన్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తమను లైంగికంగా హింసించే వాడని అనేకసార్లు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బుధవారం అదే కళాశాలలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సూళ్లూరు పేటకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యా ర్థిని సైతం శారీరకంగా కలవాలని హింసించేవాడని ఆమె తన తల్లిదండ్రులకు పలుసార్లు మొరపెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తూ కట్టని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టేవారన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, ప్రవీణ్, చిన్న, హరి, వినయ్, సురేష్, అశోక్, ఎన్ఎస్యూఐ నాయకులు మల్లికార్జున, బాలాజీ, నల్సా నాయకులు సుందర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్: నగరంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫుట్పాత్ నుంచి దొర్లిపడిన సమయంలో, అటు వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అతని కాలి మీదుగా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన బస్సు తిరుపతి నుంచి తిరువణ్నామలైకి వెళుతున్న చిత్తూరు–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో, అతడిని గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేశారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ పాకాల: గుర్తు తెలియని దుండగుడు మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తెలంగాణ యాత్రికులు ఆలయాల సందర్శన యాత్రలో భాగంగా దామలచెరువు మీదుగా వెళుతూ వేకువ జామున టీ, కాఫీలు తాగడానికి సమీపంలోని వరుణ్ డాబా వద్ద బస్సు ఆపారు. బస్సులో నుంచి దిగిన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా, సాయినగర్కి చెందిన మురళీధర్రావు భార్య సంధ్యారాణి వాష్రూమ్ను వినియోగించుకునేందుకు డాబా ప్రాంగణంలోనే ఉన్న బాత్రూమ్ వద్దకు వెళ్లింది. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు డాబా గోడ దూకి, బాత్రూమ్ వద్దకు చేరుకుని సంధ్యారాణి మెడలోని సుమారు 4 తులాలు బంగారు గొలుసు హఠాత్తుగా అపహరించి, పరుగులు తీశాడు. వెంటనే బాధితురాలు కేకలు వేసి తోటి ప్రయాణికులను పిలిచింది. అప్పటికే దుండగుడు కనిపించకుండా పారిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. పరిశోధనలకు అవకాశాలు కల్పించాలినారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసుకోవడానికి సరైన వసతులను కల్పిస్తే పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుందని తిరుపతి రతన్టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్) సీఈఓ విజయవంత్ మాథూర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా మంగళవారం 16వ నేషనల్ లెవెల్ టెక్నిరల్ సింపోజియం సిద్ధార్థ క్వెస్ట్–2కే26ను నిర్వహించారు. క్వెస్ట్లో వివిధ కళాశాలల నుంచి 575 పేపర్ ప్రెజెంటేషన్లు నమోదు కాగా 10 బ్రాంచీల నుంచి 510 పేపర్లు ప్రజెంటేషన్లను ఎంపిక చేశారు. పరిశోధనల పరస్పర సహకారానికి రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విజరయ్వంత్ మాథూర్ మాట్లాడుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజినీరింగ్ విద్యార్థులకు సరైన ప్లాట్ఫామ్ను కల్పించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సునీల్కుమార్ (ఐఐటీ, తిరుపతి), సాంబయ్య (జేఎన్టీయూ), ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు. బంగారం చోరీ రేణిగుంట: పట్టణంలోని బుగ్గవీధిలో నివాసమున్న బి.కల్పన ఇంట్లో 47 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధి తురాలు రేణిగుంట అ ర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పో లీసుల కథనం మేరకు.. బుగ్గవీధికి చెందిన బి.కల్పన (49) 2 తేదీ ఉదయం సుమారు 7.30 గంటలకు ఆమె ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం తీసి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. ఇంట్లోని బీ రువా తెరిచి ఉండడం, అందులోని వస్తువులు చిందవందరగా పడి ఉండడంతో దాన్ని పరిశీలించగా అందులో ఉన్న బంగారు గాజులు రెండు జతలు, బంగారు చైను, బంగారు ఉంగరం మొత్తం సుమారు 47 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రూపు–1లో శ్రీతేజస్విని
సైదాపురం:గూడూరు మండలానికి చెందిన మూడి శ్రీ తేజస్విని ఏపీపీఎస్సీ గ్రూపు–1 ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గూడూరు మండలం కంద లికి చెందిన శ్రీతేజస్విని తమ స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆరో తరగతి నుంచి కృష్ణా పురంలోని నవోదయ విద్యాలయంలో హైస్కూలు వి ద్యను పూర్తి చేశారు. తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఏపీపీఎస్సీ గ్రూపు–1లో ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూపు–1లో శ్రీతేజశ్విని విజయం సాధించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. -
సివిల్స్చాందిని
తిరుపతి సిటీ: టీటీడీలో రిసెప్షన్–1 డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న బయ్యాల భాస్కర్ కుమార్తె చాందిని శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీ కొలువు సాధించింది. తిరుపతిలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె బీటెక్ చైన్నెలోని ఓ ప్రముఖ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో రెండేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంది. సివిల్ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకున్న ఆమె గ్రూప్–1, గ్రూప్–2 వంటి పోటీ పరీక్షలకు సైతం హాజరవుతూ వచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మూడు రకాల ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించింది. ఇందులో ఇటీవల విడుదలైన గ్రూప్–2లో ఇంటర్మీడియట్ విద్యామండలిలో అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలాగే జుడీషియల్ డిపార్ట్మెంట్లో సైతం ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికై బుధవారమే విధుల్లో చేరింది. ఇంతలోపే గ్రూప్–1 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. పోటీ పరీక్ష ఏదైనా తానున్నానంటూ సత్తా చాటి జిల్లా వాసులు ప్రశంసలందుకుంటోంది. తన లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని డీఎస్పీగా ఉద్యోగంలో చేరి సివిల్స్ కోసం మరింత కష్టపడతానని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న చాందినికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలిందే. -
ఓవరాల్ చాంపియన్గా ఎన్ఎస్యూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా నాలుగు రోజులుగా జరిగిన సౌత్జోన్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. దేశంలోని 13 వర్సిటీల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులు పలు పోటీల్లో ప్రతిభ చూపి, ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మంగళవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎల్ జయరాములు ముఖ్యఅతిథి విచ్చేసి ప్రసంగించారు. సంస్కృత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే తమ తరఫున ఇంటర్నేషనల్ స్పాన్సర్షిప్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాకే వర్సిటీకి రెండు గోల్డ్ మెడళ్లు, బెస్ట్ రీసెర్చ్ గోల్డ్మెడల్, స్పోర్ట్స్లో ప్రతిభ కనబరచిన వారికి రెండు క్రీడా గోల్డ్ మెడల్స్ అందజేస్తామని చెప్పారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత విద్యతో పాటు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సౌత్జోన్ స్పోర్ట్స్ మీట్ గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి అఖిల భారత స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పలు విభాగాలలో ప్రతిభ చూపి పతకాలను గెలుచుకున్న క్రీడాకారులకు అతిథులు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి సేతురామ్, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రొఫెసర్ దక్షిణమూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
సంఘ విద్రోహులతో ప్రాణహాని
పెళ్లకూరు: నియమ నిబంధనల ప్రకారం చట్టానికి లోబడి వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ చట్టాలను కాపాడాల్సిన కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్న వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తే చీకటి వ్యాపారం చేసుకునే పొరికి బ్యాచ్కి ఉలికిపాటు ఎందుకని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చిల్లకూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతి సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్రాజు కలిసి చేస్తున్న అనుచిత ఒత్తిళ్లను తట్టుకోలేక ఉన్నతాధికారులను ఆశ్రయించి ఏసీబీకి పట్టించామన్నారు. ఈ క్రమంలో షాపులో పని చేస్తున్న ఓ గుమస్తాని అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్స్టేషన్లో నిర్భంచి దుర్భాషలాడడంతోపాటు ప్రతి నెలా మాముళ్లు భారీగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారన్నారు. సీఐ బాబీ చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించినట్టు వెల్లడించారు. అయితే ఏసీబీకి పట్టుబడిన సీఐ సహకారంతో చీకటి వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్న నాయుడుపేట, విన్నమాల ప్రాంతాలకు చెందిన షేక్ రఫీ, దార్ల రాజేంద్ర అనే సంఘ విద్రోహులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత దూషణలు చేయడం, పరుష పదజాలంతో దుర్భాషలాడం, వీడియోల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ తెర వెనుక నుంచి నడిపిస్తున్న మరి కొందరు స్మగ్లర్లు వల్ల ప్రాణహాని ఉందన్నారు. ఎందుకంటే ఏసీబీకి పట్టుబడిన సీఐ బాబీ, హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్రాజులకు చాలా కాలంగా రౌడీషీటర్లు, దొంగలు, గంజాయి వ్యాపారులతో సత్సంబంధాలున్నాయని, ఈ క్రమంలోనే ఇరువురు జైల్లో ఉంటూ రఫీ, రాజేంద్రతో బెదిరింపు వీడియోలు గ్రూపుల్లో పెడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు, హోమ్మంత్రి అనిత, డీజీపి, ఐజీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఏసీబీ ఉన్నతాధికారులకు, ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి, తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు విన్నవించారు. -
నిరంతరాయ విద్యుత్ సరఫరానే ధ్యేయం
తిరుపతి రూరల్: వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే ధ్యేయంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ’కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవాశీర్వాదంతో కలిసి తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగేళిలో పర్యటించారు. ఆ గ్రామంలో విద్యుత్ లైన్లను పరిశీలించి, సరఫరా తీరుపై వినియోగదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రూఫ్ టాప్ సోలార్, స్మార్ట్ మీటర్ల ఉపయోగాలను వినియోగదారులకు వివరించారు. ఆ తర్వాత నారాయణవనం 33/11 కేవీ సబ్–స్టేషన్ను తనిఖీ చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల అంశంపై వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, లో–వోల్టేజ్ సమస్యను అధిగమించడం తదితర సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిప్రసాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రావెల్ అక్రమ రవాణాపై గ్రామస్తుల తిరుగుబాటు
వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లం చెరువు సమీపంలో గ్రావెల్ను అక్రమంగా తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలించడంపై స్థానిక గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. దీంతో గ్రావెల్ మట్టితో తమిళనాడుకు తరలిపోతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుండో వచ్చి గ్రావెల్ మాఫియా వ్యాపారం చేయడమేమిటని స్థానికులు వారిని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజులుగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధానంగా లారీల తాకిడికి రోడ్లు ధ్వంసం కావడం, దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్నామలై జిల్లా, పోలూరు తాలూకా, పులియాన్ కుప్పం గ్రామానికి చెందిన పి శేఖర్కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరి ప్రసాద్, కానిస్టేబుల్ పళని కథనం మేరకు.. కార్వేటినగరం పోలీసులకు 2017 జనవరి 5వ తేదీ వచ్చిన సమాచారంతో కార్వేటినగరం మండలం, గురువరాజు గుంట సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐదుగురు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి ఐదు దుంగలుగా మార్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. 163 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసి, పుత్తూరు సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ దశలో నిందితుడు శేఖర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై విచారణ తప్పించి మిగిలిన నలుగురిపై కేసు విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం కేసుల విచారణ కోర్టు తిరుపతిలో ఏర్పాటు కావడంతో కేసు తిరుపతికి బదిలీ అయింది. పోలీసులు నిందితుడు శేఖర్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు శేఖర్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీఎస్పీడీసీఎల్లో పలువురికి ఉద్యోగోన్నతులు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహించే అధికారుల్లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ రామచంద్రరావుకు చీఫ్ జనరల్ మేనేజర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గతంలో హెచ్ఆర్డీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శోభా వాలెంటీనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కూడా సీహెచ్ రామచంద్రరావుకు అప్పగించారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్లో పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన పీహెచ్ జానకిరామ్ గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయడంతో ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న జె.రమణాదేవికి పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.. కర్నూలు సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహించే బి.లతకు జనరల్ మేనేజర్ (ఐటీ– ఎస్ఏపీ)గా, కార్పొరేట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న కె. హేమలతకు సూపరింటెండింగ్ ఇంజినీర్ (డీపీఈ)గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎన్. డేవిడ్ లివింగ్ స్టోన్, ఎల్. ప్రసాద్, ఎస్. కళ్యాణ్ చక్రవర్తికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్.లలితకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
తిరుపతి మంగళం: పద్మావతిపురంలో బు ధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ని యోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థా యి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయ ర్ శిరీష పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్ష కేంద్రం మార్పు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభం కానున్న యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి స్వల్ప మార్పు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడంతో అక్కడ పరీక్ష కేంద్రాలను స్థానిక ఎమరాల్డ్స్, గాయత్రి డిగ్రీ కళాశాలలకు మార్చామని పేర్కొన్నారు. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో సెంటర్ను కేటాయించిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 149 మంది గైర్హాజరు తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ మూడో రోజు పరీక్షకు 149 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 90 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ప్రాక్టికల్స్కు 4,589 మంది గాను 4,506 మంది విద్యార్థులు, మధ్యాహ్నం 90 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 4,135 మందికి గాను 4,069 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 69,262 మంది స్వామివారిని ద ర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల స మ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ
● అనుభవమే తప్ప..ఆ భూములకు పాసు పుస్తకాలే లేవ్ ● క్రయ, విక్రయాలు రుణ అర్హత శూన్యం ●ఐదు శతాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నారు. తరాలుగా ఆ పుడమిని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. అయినా ఆ పొలాలపై వారికి అనుభవం తప్ప, వారి సొంతం కావడం లేదు. వారి పేరున పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. యాజమాన్య హక్కు పత్రాలు లేవు. వారికి ఆ భూముల క్రయవిక్రయాలకు అర్హత లేదు.. ఏ బ్యాంకులోనూ వారికి అప్పు పుట్టదు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం యాభై ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం దక్కలేదు. ఇదీ సైదాపురం మండలం కలిచేడు రైతులు దీనగాఽథ. సైదాపురం: దున్నేవాడిది భూమి అంటూ ప్రభుత్వ ప్రకటలనలు కేవలం కాగితాలు, ప్రచారానికే పరిమితమవుతున్నాయి. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నేటి వరకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవంటే ప్రతి ఒక్కరు అవాక్కవతారు. కేవలం ఆ రైతులు అండగల్లో మాత్రమే అనుభవదారులుగానే మిగిలిపోతున్నారు. కనీసం వన్బీలో అసలు ఆ రైతుల పేర్లే ఉండవు. దీంతో ఆ రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పులు పుట్టడం లేదు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల్వివాలని గతంలో అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామంటూ ముందుకు వచ్చారు. దీంతో ఆయకట్టు రైతులంతా ఎకరాకు కొంత మొత్తం చందాలు వేసుకుని, మరీ అధికారులకు ముట్టజెప్పారు. అయితే ఆ అధికారులు బదిలీ అయిపోయారు. కానీ ఆ రైతులకు నేటికీ పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ సంఘటన మండలంలోని కలిచేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని కలిచేడులో సుమారు 1800 ఎకరాల ఇనాం భూములున్నాయి. రాజాలు పాలించే సమయంలో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సుమారు 50 ఏళ్ల నుంచి ఆ భూములను ఆ గ్రామానికి చెందిన వారు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగానే చూపిస్తున్నారు. కేవలం అడంగల్లో మాత్రం సాగు చేసే రైతుల పేర్లును అనుభవదారులుగా నమోదు చేశారు. ఈ విషయమై గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకోవడంతో అప్పటి జాయింట్ కలెక్టర్ చొరవ చూపి ఆ భూములను సమగ్ర సర్వే చేసి, సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన బదిలీ కావడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది. ఆరెళ్ల కిందట ప్రతి రైతు వద్ద నగదు కూడా వసూలు చేశారు. హడావుడిగా సర్వే పనులు పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే విషయం మళ్లీ పెండింగ్ పండింది. నగదు చెల్లించిన రైతులకు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందారు. అప్పడు వసూలు చేసిన నగదును తీసుకున్న స్థానిక అధికారులు కూడా బదిలీ అయ్యారు. దీంతో రైతులు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పాసుపుస్తకాలు లేకపోవడంతో ఏ బ్యాంకు నుంచి రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టడంలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తాము సాగు చేసుకుంటున్న భూములకు పాసు పుస్తకాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. కలిచేడు రైతులు -
పక్కా ఇళ్లు..
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ హౌసింగ్ భాగోతం అంతా ఇంతా కాదు. ప్రధానంగా జగనన్న కాలనీల్లో(ఎన్టీఆర్ నగర్)ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు మంజూరు చేయడం దుమారంగా మారింది. అప్పటి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 571 లే అవుట్లు వేసి, పేదలకు 61,799 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు మంజూరు చేయించారు. రెండేళ్లలో 50 శాతం ఇళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక కొరత ఓ వైపు, చేసిన పనులకు బిల్లు లు సకాలంలో ఇవ్వకపోవడం మరోవైపు, అప్పటి ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లు వైఎస్సార్సీపీకి అనుకూ లం అంటూ కాంట్రాక్టర్లను మార్పు చేయడం మరోవైపు పెట్టుకుంది. ఈ మార్పులకే ఎనిమిది నెలలు కాలం గడిచింది. దీంతో ఇంటి నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఆ తర్వాత ఏడాది నుంచి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో హౌసింగ్ అధికారులు మార్పులు చేసిన ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్ల స్థానంలో తమ సతీమణి, అన్నదమ్ముళ్లు, బంధువులకే కాంట్రాక్టర్ల బాధ్యతలు అప్పగించి పెత్తనం మొత్తం హౌసింగ్ ఉద్యోగులు చేపట్టడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా నిర్మాణాల్లో ప్రతి వారం, ప్రతి నెలా పురోగమం చూపాలంటూ రాష్ట్రస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో చిత్ర విచిత్రంగా వ్యవహరించారు. సాధారణంగా ఐదు దశల్లో బేస్మెంట్, కిటికీ లెవల్ గోడలు, స్లాబ్ లెవల్ గోడలు, స్లాబ్, పూతలు ఇలా ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ.1.80 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. నాణ్యతకు ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఇంటి నిర్మాణానికి సిమెంట్ 90 బస్తాలు వాడావాల్సి ఉంది, అందుకు రూ. 24,930 ఖర్చు చేయాలి. అలాగే స్టీల్ 480 కిలోలు వాడాలి. అందుకు రూ. 33,600 ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన మొత్తాన్ని ఇసుక, సిమెండ్ రాళ్లు లేదా ఇటుకలకు, కూలీలకు ఖర్చు చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చంద్రబాబు సర్కార్లో నిబంధనలకు విరుద్ధంగా, సంపాదనే ధ్యేయంగా ఇంటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా బేసిమెంట్ లెవల్కు మట్టిని నింపకపోవడం, సిమెంట్ 90 బస్తాలు వాడకుండా అందులో 70 శాతం సిమెంట్ను మాత్రమే వాడుకుని అధిక మొత్తంలో ఇసుకను ఉపయోగించడం, స్టీల్ విషయంలోను 480 కిలోల్లో 50 శాతం మాత్రమే వాడినట్లు తెలుస్తుంది. ఇలా నామమాత్రంగా పనిచేయడంతో నాణ్యత పూర్తిగా లోపించినట్లు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల కిందట పీడీ సస్పెన్షన్ జిల్లా హౌసింగ్ పీడీ దయాకర్ను రెండు నెలల కిందట సిమెంట్, స్టీల్ స్టాక్కు సంబంధించి సక్రమంగా లెక్కలు లేకపోవడంతో సస్పెండ్ చేశారు. అనంతరం గూడూరు ఈఈగా ఉన్న శ్రీనివాసరావుకు పీడీ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా గూడూరు ఈఈగా, శ్రీకాళహస్తి ఈఈగా, సూళ్లూరుపేట ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్క ఉద్యోగికి నాలుగు పోస్టులు కట్టబెట్టారు. అయినా ఆయన కలెక్టరేట్లోని హౌసింగ్ జిల్లా కార్యాలయానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. పీడీ పోస్టు, మూడు ఈఈ పోస్టులు శ్రీనివాసరావుకే గృహనిర్మాణ విభాగానికి సంబంధించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఈఈగా శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. మొత్తంగా ఆయనకు నాలుగు పోస్టులు కట్టబెట్టారు. గృహనిర్మాణానికి సంబంధించి జిల్లాలో నాలుగు డివిజన్లకు నలుగురు ఈఈలు పనిచేయాల్సి ఉంది. ఆ డివిజన్లలో ఈఈ పాత్రే కీలకం. వేగంగా పనులు పూర్తి చేయడం ఈఈ డైరెక్షన్లోనే ఉంటుంది. అయితే నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లకు ఒక్కరే ఈఈ. అంతేకాకుండా జిల్లా అధికారిగా పీడీ పోస్టును ఆయనకే కట్టబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఈ నెల 31న(శనివారం) తిరుపతి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న మోహన్రావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించడానికి డీఈలు ముందుకు రావడం లేదని చర్చసాగుతోంది. దీంతో ఆ పోస్టును శ్రీనివాసరావు తీసుకుంటే ఇక అంతేసంగతులు అంటూ చర్చసాగుతుంది. అడుసు పాళెం జగనన్న లే అవుట్ ఇంటి నిర్మాణ బిల్లులో మోసాలిలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణానికి ఐదు దశల్లో రూ.1.80 వేలు బిల్లు చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో బేసిమెంట్ వేయడంతోపాటు లోపల బేసిమెంట్ లెవల్కు మట్టితో నింపడానికి రూ.70 వేలు, రెండో దశలో కిటికీల వరకు గోడలు నిర్మాణానికి రూ.20 వేలు, మూడో దశలో స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి రూ.30 వేలు, నాలుగో దశ స్లాబ్ వేయడానికి రూ. 40 వేలు, చివరిగా పూతలు వేయడానికి రూ, 20 చొప్పున మొత్తంగా 1.80 లక్షలు ఒక్కో ఇంటికి జమ చేయాలి ఉంది. ఇల్లు కట్టకుండానే బిల్లులు నిర్మాణ దశలు తారుమారు పురోగమనం చూపాల్సి రావడంతో మొదటి దశలో ఉండే పనులు రెండో దశగా, రెండో దశ పనులు మూడో దశగా, మూడో దశను నాలుగో దశగా, నాలుగో దశ పనులను ఐదో దశగా, ఐదో దశ పనులు పూర్తి అయినట్లు చూపించారు. అయితే దశల వారీగా ఫొటోలను అన్లైన్లో అప్లోడ్ చేయాల్సిఉంది. ఈ క్రమంలో మొదటి దశ ఇంటికి సమీపంలో రెండో దశలో ఉన్న ఇంటి ఫొటోను, రెండో దశ ఇంటికి మూడో దశలో ఉన్న ఇంటి ఫొటో, మూడో దశ ఇంటికి నాలుగో దశ ఫొటోను, నాలుగో దశ ఇంటికి ఐదో దశ ఫొటోను అప్లోడ్ చేశారు. ఈ మేరకు ఇంటి బిల్లులు మంజూరు చేయించారు. అయితే ఆ తర్వాత ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు జియోట్యాగింగ్ సర్వే నిర్వహించారు. ఏ దశలో ఉన్న ఇంటిని ఆ దశలో జియో ట్యాగింగ్ చేస్తేనే తీసుకోవడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా దశల్లో తేడాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చా యి. 6,157 ఇళ్లు తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లో తేడాలను సవరించాలని స్పష్టం చేశారు. అయితే వారం రోజు ల్లోనే జిల్లా అధికారులు 5,240 ఇళ్లను సవరించామని అన్లైన్లో కొట్టేశారు. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉందని రిపోర్ట్ పంపించారు. దీంతో మరోసారి అనుమానంతో హౌసింగ్ విజిలెన్స్ కమిటీ వచ్చింది. విజిలెన్స్ వారం రోజులు పరిశీలన తర్వాత గందరగోళంగా దశలను చూపించిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. -
మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు
నాగలాపురం: మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వేదవళ్లి సమేత వేదనారాయణ స్వామి ఆల య కుంభాభిషేకానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. రెండున్నరేళ్లుగా ఆలయంలో బాలాలయం పనులు జరుగుతున్నందున మూలస్థానం మూసివేసి, స్వామి వారి ఉత్సవమూర్తుల ద్వారా భక్తులకు దర్శనం కల్పించేవారు. వేదనారాయణుడి దర్శనాన్ని పునరుద్ధరించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 17న అంకురార్పణ, 18 నుంచి యాగశాల వైదిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం గర్భాలయ మూలవర్లకు మహా సంప్రోక్షణ, నివేదనలు సమర్పించి, భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి సారిగా రాముల వారి ఆలయ గోపురానికి, వేదవళ్లి తాయారు మండపానికి బంగారు వర్ణంతో, ముందు వైపు ఉన్న రాజగోపురానికి తెలుపు రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. -
గ్రామాల అభివృద్ధికి పన్నుల వసూలే కీలకం
తిరుపతి సిటీ: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని, అందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు, శానిటేషన్ నిర్వహణ, పీ3 విధానం అమలుపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూలులో అలసత్వం వహిస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుందని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బకాయి పన్నులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ వసూలు చేయాలన్నారు. శానిటేషన్ – స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇంటింట చెత్త సేకరణ, తడి–పొడి చెత్త, ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను కూడా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్నామన్నారు. పీ3 విధానం అమలులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ రాజ్ సిబ్బందికి కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్రావు, డీపీఓ సుశీలాదేవి, డీడీఓలు, జిల్లా పంచాయతీ శాఖాధికారులు, సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
లోటుపాట్లు సవరిస్తున్నాం
జిల్లాలో తిరుపతి, గూడూ రు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్లు ఉన్నాయి. తిరుపతి మినహా మిగిలిన మూడు డివిజన్లకు నేను ఈఈగా ఉన్నాను. అలాగే జిల్లా అధికారిగా అంటే ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేస్తున్నాను. 6,157 ఇళ్ల తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు రిపోర్ట్ పెట్టారు. దాంతో 5,240 ఇళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉంది. వాటిని చక్కదిద్దుతాం. తిరుపతి ఈఈ ఉద్యోగ విరమణ పొందారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొత్త అధికారిని ఏర్పాటు చేయిస్తాం. – శ్రీనివాసరావు, జిల్లా పీడీ, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట ఈఈ -
ఐఐటీలో ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్
ఏర్పేడు: న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్– 2026నకు అధికారిక ప్రీ–సమ్మిట్ ఈవెంట్ అయిన ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్’ కార్యక్రమం సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో జరిగింది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్యక్షతన జరిగిన ఈ ప్రీ– ఈవెంట్లో చట్టపరమైన అవగాహ న,వినియోగదారుల రక్షణ, గోప్యతను కాపాడే మోసా ల నివారణ, పర్యావరణ స్థిరత్వం, డేటా గోప్యతా సాధనాలు, ఏఐ అక్షరాస్యత వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించే దృక్పథాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సుమారు 60 మంది విద్యార్థులు పరిష్కార మార్గాలను వివిధ కోణాల్లో ప్రదర్శించారు. తిరుపతి ఐఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చిమలకొండ, రిషా ల్యాబ్ (ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ – హ్యూమన్ అనలిటిక్స్లో పరిశోధన), డీన్ (కాంపిటెన్సీ, డెవలప్మెంట్, ఔట్రీచ్) కార్యాలయం ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల పాల్గొన్నారు. -
తుంబూరు అడవిలో చిరుత సంచారం
నారాయణవనం: మండలంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తుందన్న ఫిర్యాదుతో సోమవారం అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తుంబూరు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం గాలించారు. స్థానికుల కథనం మేరకు.. తుంబూరు పంచాయతీ శ్రీనివాస ఎస్టీ కాలనీకి చెందిన మునిరాజ మేకలను ఆదివారం సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం చిరుత సుమారు మేకపిల్లను నోట కరచుకుని అడవి లోకి వెళ్లిపోవాడాన్ని గమనించారు. రాత్రి పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీసులు శ్రీనివాస ఎస్టీ కాలనీ సమీపంలో అటవీ ప్రాంతాన్ని గాలించారు. చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించలేదు. క్రూర జంతువులు మేకను తీసుకుని వెళ్లి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా అడవిలో సంచరించడం, పశువులు, మేకలను మేత కోసం అడవిలోకి తోలవద్దని పోలీసులు సూచించారు. ఫార్మర్ యాప్ సద్వినియోగం చేసుకోండి తిరుపతి అర్బన్: కొత్తగా వచ్చిన ఫార్మర్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు వెల్లడించారు. ఈ–పంట నమోదుకు సంబంధించి రైతులే స్వయంగా తమ పొలంలోకి వెళ్లి మొబైల్ ద్వారా చేసుకోవడానికి కొత్తగా వచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సీజన్కు సంబంధించి ఈ–పంట నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 20వ తేదీకి నూరుశాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రూప్–2 ప్రతిభావంతులకు ఘన సత్కారం తిరుపతి కల్చరల్: గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ప్రతిభావంతులను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వపు డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు సోమవారం ఘనంగా సత్కరించి, అభినందించారు. సత్కారం అందుకున్న వారిలో రవి, మహేష్, సువర్ణ, చేతన్, సాయిరాం, బాలాజీ, విజయ్, మోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభతో గ్రూప్–2లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించి, ఉన్నత కొలువు అధిరోహించాలని సూచించారు. -
కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఇద్దరి మృతి నాగలాపురం: ద్విచక్రవాహనంలో వెళుతూ చింత చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యు వకులు మృతి చెందిన ఘటన మండలంలోని కృష్ణాపురంలో సోమవారం వేకువ జామున చోటు చేసుకుంది. ఎస్ఐ సునీల్ కథనం మేరకు.. నిండ్ర హరిజనవాడకు చెందిన నాగరాజు(23), రామగిరి గ్రామానికి చెందిన సంజయ్ (23) ద్విచక్రవాహనంలో నాగలాపురంలోని టీఆర్ఆర్ కళ్యాణ మండపానికి ఆదివారం సాయంత్రం వివాహానికి బయలుదేరారు. పెళ్లి చూసుకుని రాత్రి మండపంలో తన స్నేహితులతో ఉండి సోమవారం వేకువ జామున నాగరాజు, సంజయ్ తిరిగి ఇంటికి బయలు దేరారు. మార్గం మధ్యలో కృష్ణాపురం సమీపంలో మలుపు వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చింత చెట్టును ఢీకొన్నారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జూపార్కు రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు. ఈ సైన్స్ క్విజ్ పోటీలను లయన్స్ క్లబ్ ఆఫ్ గరుడాద్రి తిరుపతి, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి సైన్స్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం సైన్స్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని వెలికితీయడంతోపాటు వారిలో పోటీ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని, ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో కూడిన బృందంగా హాజరుకాచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ప్రిలిమినరీ రౌండ్, 21, 22, మార్చి 1, 2వ తేదీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్స్, మార్చి 7, 8వ తేదీల్లో సెమీఫైనల్, మార్చి 14న ఫైనల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు ‘‘హెచ్టీటీపీఎస్://టీఐఎన్వైయుఆర్ఎల్.కామ్/ఆర్ఎస్సీటీఏఎన్ఎన్యూఏఎల్ క్విజ్’’ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో, అలాగే సైన్స్ సెంటర్లో నేరుగాను దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 0877–2286 202, 79896 94681 నంబర్లలో, అలాగే ‘‘ఆర్ఎస్సీటీఈడీయుపీఆర్ఓ:జీమెయిల్.కామ్’’ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గరుడాద్రి ప్రతినిధులు మక్కిన భాస్కర్, బండి మధుసూదనరెడ్డి, చక్రవర్తి చెన్నుపాటి, జేసీఐ ప్రతినిధులు మక్కిన జె.లక్ష్మీతేజ, ఉమామహేశ్వర్, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలకు టీం వర్క్ అవసరం
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పురోగతిని సాధించే క్రమంలో చేసే పరిశోధనలకు టీంవర్క్ ఎంతో అవసరమని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు అన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సోమవారం 13 ఇంజినీరింగ్ బీటెక్ బ్రాంచీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ బ్రాంచ్ల విద్యార్థులు పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్లు, జస్ట్ ఏ మినిట్, మిని ప్రాజెక్ట్ ఎక్స్పో, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ డీబగ్గింగ్, లోగో కాంపిట్ షన్, గ్రూప్ డిష్కషన్, ఫొటో కాంపిటిషన్, వర్డ్ ఫజల్, ప్రోమో తదితర పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిచిలిన వారికి బహుమతులను అందజేశారు. చైర్మన్ అశోకరాజు మాట్లడుతూ వృత్తి విద్యలతో ఉనికిని చాటుకోవడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి తిరుపతి తుడా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆవుల చంద్రశేఖర్ వెల్లడించారు. తిరుపతి రుయా ఆస్పత్రిని ఆయన అధికారులతో కలసి సోమవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుయా ప్రాంగణంలో మొక్కల పెంపకానికి అనువైన నాలుగు స్థలాలను ఎంపిక చేశామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్ పార్కుతో పాటు, వాకింగ్ ట్రాక్, సీటింగ్ బెంచీలు, పూల మొక్కలు, తాగునీటి వసతి ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులతోపాటు, పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటామన్నారు. సీఈఓతోపాటు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జే రాధ, ఇంజినీర్ డి లావణ్య, ఆర్ జోత్స్న, అధికారులు డాక్టర్ హరికృష్ణ ఉన్నారు. జాతీయ పోటీల్లో మహిళావర్సిటీ విద్యార్థిని ప్రతిభ తిరుపతి రూరల్: తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పద్మావతీ మహిళా యూనివర్సిటీలో బీపీఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న పి రమ్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు యూనివర్సిటీ వ్యాయామ విభాగ అధిపతి జి.సరోజినీ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య ఉమ, రిజిస్టార్ ఆచార్య ఉషా సోమవారం ఆ విద్యార్థిని అభినందించారు. -
పీజీఆర్ఎస్లో..అర్జీల రచ్చ
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అవసరమైన మేరకు ప్రింటింగ్ అర్జీలు లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. పీజీఆర్ఎస్కు మొత్తం 644 అర్జీలు వచ్చాయి. ఒక్కో అర్జీకి 5 నుంచి 10 మంది రావడంతో కలెక్టరేట్ 3 వేల నుంచి 6 వేల మందితో నిండిపోయింది. అర్జీదారులకు అధికారులు ఇచ్చే ప్రింటింగ్ పేపర్ అర్జీలను అవసరం మేరకు ఉంచకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. పార్టీ కండువా వేసుకుంటే క్యూ అవసరం లేదు అధికారపార్టీకి చెందిన పలువురు తమ పార్టీకి చెందిన కండువాను మెడలో వేసుకుని క్యూలో కాకుండా నేరుగా పీజీఆర్ఎస్ చాంబర్లోనికి గుంపులు గుంపులుగా వెళ్లి, అధికారులను కలసి అర్జీలను అందజేశారు. కొందరు ఏ పార్టీతో సంబంధం లేకున్న.. జేబులో కండువాను మెడలో వేసుకుని క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లి, అర్జీ ఇచ్చిన తర్వాత జేబులో పెట్టుకుని వెళ్లిపోయారు. క్యూలో గంటల కొద్ది వేచి ఉన్న వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు నానా తిప్పులు పడ్డారు. ఒక దశలో క్యూలో ఉన్న అర్జీదారులు అరుపులు కేకలు వేయడంతోపాటు పీజీఆర్ఎస్ హాలు తలుపులను పెద్దగా కొట్టడంతో చాంబర్లో ఉన్న డీఆర్వో నరసింహులు, డీఆర్డీఏ పీడీ శోభనబాబు తదితరులు క్యూ వద్దకు వారే వచ్చి అర్జీలను స్వీకరంచారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీజీఆర్ఎస్ నిర్వహణ బాధ్యత పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్కు అప్పగించారు. పదవి ఆమె చేతిలో ఉన్నా పెత్తనం మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అర్జీదారులకు అవసరం అయిన కుర్చీలు, ప్రింటింగ్ అర్జీలు, తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేయకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, దేవేంద్రరెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ భూములు కాపాడాలి పుల్లంపేట మండలం అనంతసముద్రం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 329, 328, 327, 326, 333లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించారని పుల్లంపేట ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. దీంతో కలెక్టరేట్లో అధికారులకు అర్జీను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. -
శ్రీవారి సేవలో ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: న్యూజిలాండ్ టీ20 సిరీస్లో ఘన వి జయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా ఫీ ల్డింగ్ కోచ్ దిలీప్ సోమ వారం వేంకటేశ్వర స్వా మివారిని దర్శించుకున్నా రు. శ్రీవారి దర్శనం అనంతరం దిలీప్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండు రోజుల్లో ఫీజులు తగ్గిస్తాం తిరుపతి సిటీ: ఎస్వీయూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులు తగ్గించాలని కోరుతూ సోమ వారం వీసీ చాంబర్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకు లు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం రెక్టార్ అప్పారావును కలిసి వినతిపత్రం అందజేశారు. బీఈడీ ఫీజుల విషయంలో ఈసీ సమావేశంలో చర్చించి, రెండు రోజుల్లో తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. -
రెడ్బుక్ రాజ్యాంగంతో నయా బిహార్గా ఏపీ
సూళ్లూరుపేట: ‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రెడ్బుక్ రాజ్యాంగం నయా బిహార్గా మార్చేసింది. ప్రస్తుతం బిహార్ సుభిక్షంగా వుంది కదా! మరి ఏపీని ఎందుకు అల్లకల్లోలం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదు కదా! మరి శ్రీవారికి క్షమాపణ చెప్పి ప్రా యశ్చితం చేసుకోమంటే అది బూతా.. ప్రశ్నించిన వా రి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు కాల్చేస్తారా! డైవర్షన్ పా లిటిక్స్లో టీడీపీ కూటమి పీహెచ్డీ చేసింది.’ అని వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వ క ర్త కిలివేటి సంజీవయ్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై సోమవారం సంజీవయ్య స్థాని క సీఐ మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. కి లివేటి మాట్లాడుతూ హిందువులకు ఆరాధ్య దైవమైన వేంకటే శ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కల్తీ చే శారని బాధ్యత కలిగిన సీఎంగా చంద్రబాబు లేని పోని ప్రచారం చేయడం సబబేనా! అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి పందికొవ్వు, ఆవుకొవ్వు కలిపారని సనాతన హైందవ ధర్మం అని లేని పోని రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందేనన్నారు. వీళ్లు చేస్తున్న లేనిపోని రాద్ధాంతంపై మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి ఈ అబద్ధపు ప్రచారాన్ని సిట్తో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందేనని అన్నారు. గత నాలుగైదు రోజుల ముందు లడ్డూలో జంతుకొవ్వు లేదని చెప్పినా కూటమి నేతలు ఉన్మాదంతో ఊగిపోయి, ప్రతి పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం తప్పు కాదా! అని ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కూటమి నాయకులు దాడికి యత్నించిన సమయంలో మాట తూలి, చంద్రబాబును కాకుండా అక్కడున్న వ్యక్తులను దూ షించారన్నారు. దీనిపై అలా అనకుండా ఉండాలని కూ డా అంబటి బాధపడ్డారనన్నారు. అంత మాత్రాన ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇటీవల నెల్లూరులో ప్రసన్నకుమార్రెడ్డి, నేడు గుంటూరులో అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాలో జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి మారణకాండ సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టం చే యడం సబబేనా బాబూ? అన్నారు. లడ్డూలో జంతుకొవ్వు లేదని సీబీఐ నిర్ధారణ చేసింది కదా! మరి మీ అందరికీ చిత్తశుద్ధి ఉంటే వేంకటేశ్వరస్వామి వద్ద సాగిల పడి, క్షమాపణలు చెప్పి భక్తులకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే దౌర్జన్య కాండ విశాఖపట్నం ఎంపీ, గీతం విద్యాసంస్థలు అధినేత మతకుమిల్లి భరత్కు సుమారు రూ.5 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ బయటకు తీయడంతో వెంటనే డ్రైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం రచయిత నారా లోకేష్కు తోడల్లుడైన భరత్కు భూములను అప్పగించే ప్రయత్నాలపై తమ పార్టీ ఉద్యమాలకు సిద్ధమైన తరుణంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ను చేసి దాడులు, దారుణ మారణ కాండను సృష్టించి రాష్ట్రాన్ని మరో బీహార్లా తయారు చేశా ర న్నారు. దేశమంతా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలో లో కేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని డౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ పట్టణ అఽ ద్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు మీజూరు రామకృష్ణారెడ్డి, బందిల మహేష్, పాల్గొన్నారు. -
కలిచేడులో ఆస్పత్రుల పునరుద్ధరణ ఎప్పుడో చెప్పండి
సైదాపురం: కలిచేడులో 1950లో నిర్మించిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జనరల్ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిల సేవలను ప్రభుత్వం ఎప్పడు పునరుద్ధరిస్తుందో తెలియజేయాలని పార్లమెంట్ సమావేశాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి సోమవారం ప్రశ్నించారు. అలాగే సైదాపురం మండలంలోని తలుపూరు, కలిచేడులో ఉన్న మైకామైన్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఎంఎంఎల్డబ్ల్యూ) పాఠశాలకు నిర్మించి సుమారుగా 77 ఏళ్లు అయ్యిందని, ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఆ పాఠశాలను పునరుద్ధరించేందుకు లేవుట్, డ్రాయింగ్లు సమర్పించినప్పటికీ నేటి వరకు కార్యచరణ ప్రారంభం కాలేదని ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు స్పందించిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 17 ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు ఈఎస్ఐసీ ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డిస్పెన్సరీల నిర్వహణ, సిబ్బంది నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో జాప్యం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. కలిచేడు ఆస్పత్రి పునరుద్ధరణ అంశంపై స్పందిస్తూ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చే యాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలుంటాయని మంత్రి పేర్కొన్నారు. -
గ్రామ కమిటీలతో వైఎస్సార్ సీపీ బలోపేతం
రైల్వేకోడూరు అర్బన్: గ్రామ కమిటీల ద్వారా వైఎస్సార్ సీపీని బలోపేతం చేయనున్నట్లు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని వెంకటేశ్వరపురంలో గ్రామ కమిటీల ఏర్పాటుకు రచ్చబండ నిర్వహించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద ప్రజలకు ఒరింగిందేమీ లేదన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, చివరకు మోసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, చదువు, ఆరోగ్యంతో ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. చంద్రబాబు ఆ పథకాలు ప్రజలకు అందకుండా ధ్వంసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమమే మన పార్టీకి అండదండలని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు జగన్ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలను ప్రేరేపిస్తూ పార్టీ శ్రేణులు, నేతల వేధింపులు, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, వెంకటరెడ్డి, యనమాల మహేష్, శంకరయ్య, బుడుగుశివయ్య, సిద్దూరాయల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజా పాలన ఏదీ?
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలతో రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తున్నారే తప్ప, ప్రజా పాలన ఎక్కడ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు, పంది కొవ్వులు కలిపారంటూ చేసిన ఆరోపణలు సీబిఐ నివేదికతో పటాపంచల్ అయ్యాయన్నారు. ఆ నిజాలను కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు, పవన్కళ్యాణ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కట్టా గోపియాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, మల్లెమొగ్గల ఉమాపతి, రుద్రగోపి, పద్మజ, బాలాజీ, రమణారెడ్డి, ధనశేఖర్, గోలి విజయలక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం
– నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరి(సైదాపురం):‘రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. రాజకీయ నాయకులకే బెదిరింపులు వస్తున్నాయి. హింస, రాజకీయ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్బుక్ పరిపాలన అమలవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విఽధించడం ఎంతో అవసరం’ అని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు బయట పెట్టినందు కు ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబుపై దాడి చేశారన్నారు. ఇది రాజ్యాంగ పాలన కాదని, రెడ్ బుక్ పాలన అని విమర్శించారు. రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతీకార రాజకీయాలు, విషపూరిత వాతావరణానికి తెరలేపుతున్నట్లు తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్కు 105 అర్జీలు తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీకాళహస్తిలో జాబ్మేళా రేపు తిరుపతి అర్బన్: శ్రీకాళహస్తిలో బుధవారం నిర్వహించనున్న జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జాబ్మేళా పోస్ట్ర్ను కలెక్టర్తోపాటు జేసీ గోవిందరావు, డీఏఓ ప్రసాద్రావు, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి లోకనాథం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్, సిడాప్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హజరై..ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న యువత అర్హులని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 89198 89609, 79895 09540, 9988 853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా తిరుమల : తిరుమలలో మంగళవారం జరగాల్సిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినా టీటీడీ ఈఓ బదిలీ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిసింది నూతన ఈఓ బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న నూతన తిరుమల ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనంతరం బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎస్వీయూలో పీహెచ్డీ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఐదో తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్వ్యూలకు 50 మందిగాను 47 మంది హాజరయ్యారని ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాదరాజు తెలిపారు. -
శివ శివా..క్షమించవా?
సాక్షి,టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మ హాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరో వారం రోజు ల్లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. కానీ ఈ తరుణంలో వరుసగా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఒకింత భక్తుల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం.. నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్రిశూల స్నానం..భయం..భయం! శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఆదివారం త్రిశూల స్నాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చివరిలో భక్తులు వెళుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పా టు చేసిన ఐరన్ ఫెన్సింగ్కు కరెంట్ సరఫరా రావడంతో వందల మంది భక్తులు షాక్కు గురయ్యా రు. వెంటనే ఓ ఎలక్ట్రీషియన్ మేల్కొనడంతో పె నుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమా రు వంద మంది భక్తులకు స్వల్పంగా కరెంట్ షాక్ కొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై ఆల య అధికారులు ఏమీ జరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ‘కొంచెం ఆలస్యమైతే వందల మంది ప్రాణాలు పో యేవి. అప్పుడు బాధ్యత ఎవరిది?’ అంటూ మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఫొటోలకు ఫోజులు..సంప్రోక్షణలు త్రిశూల స్నానం సందర్భంగా అధికారులు, కొందరు పాలక మండలి సభ్యులు ఫొటోలకు ఫోజులివ్వడంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఓ ముఖ్య అధికారి, మరొకరు త్రిశూలాన్ని చేత్తో స్పృచించిన్నట్టు తెలుస్తోంది. దీన్ని చూసిన అక్కడి అర్చకులు అవాక్కయ్యారు. త్రిశూల స్నానం అనంతరం ఆలయం అంతటా సంప్రోక్షణ చేపట్టారు. చూసుకోవాలిగా..! త్రిశూల స్నానం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామోత్సవానికి బయల్దేరారు. అదే సందర్భంలో ఓ మృతదేహం ఎదురుగా రావడంతో వాహనాలను అక్కడే ఆపేశారు. కానీ ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ముందుగానే పసిగట్టలేకపోయారు. ఇక చేసేది లేక పట్టణ మాడ వీధులు.. స్వామి, అమ్మవార్ల గర్భాలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. మహాశివరాత్రి ముందు ఇలా వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఒకింత భక్తుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, ఆలయాధికారులు, పాలక మండలి పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మరో వారం రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు -
ఎన్డీడీబీని టీటీడీకి పరిచయం చేసిందే వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ అంశంలో వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై వైయస్సారీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అర్థం వచ్చేలా మాట్లాడ్డాన్ని తప్పు పట్టారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని, తేలడంతో ఆత్మరక్షలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వైయస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో భాగంగానే వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, తన ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ దొంగలు వీరే అంటూ దుష్ప్రచారం చేయడం పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మడం లేదన్న అసహనంతోనే వైయస్సార్సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయనతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో బయటపడ్డ నిజాలను మరుగునపర్చేందుకే ఈ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. సీబీఐ సిట్ అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ (మాజీ హర్ష్ ప్రెష్ డెయిరీ) చంద్రబాబు హయాంలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. మరో నిందిత సంస్థ ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసిందంటూ మాట్లాడటం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను భంగం కలిగించినది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై ఎన్ డీ ఆర్ ఐ కూడా తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయం స్పష్టం చేసింది. అయినా సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేనలు సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత ఆత్మరక్షలో పడ్డారు. తామే తప్పు చేశామన్న సంగతి అర్దమై ఎదురుదాడికి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు వీరేనంటూ వైయస్.జగన్, వైవీ సుబ్బారెడ్డితో పాటు నా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేకపోవడం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని, పక్కా ప్రణాళికతో వైయస్సార్సీపీ నేతలమీద ఏదో ఒక నెపం మోపి దాడి చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల బూతుపురాణంతో దాడికి దిగితే, దానికి స్పందించిన అంబటి ఆ తర్వాత తన మాటలకు క్షమాపణ చెప్పినా.. సహించలేని చంద్రబాబు ముఠా 3వేల మంది రౌడీ మూకలతో ఇంటిపై దాడి చేశారు. అందులో టీడీపీ నేతలు, కార్యకర్తలే కాకుండా అసాంఘిక శక్తులను కూడా ఉసిగొల్పి అంబటి రాంబాబుతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడికి దిగారు.బాబు హయాంలోనే భోలేబాబా డెయిరీకి అనుమతి..రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. సిట్ నివేదిక ద్వారా నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని తేల్చిచెప్పింది. అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఆ వ్యవహారంలో లేదని సిట్ తన అనుబంధ ఛార్జిషీట్ లో పేర్కొంది. అదే నివేదికలో కొద్ది మంది సాంకేతిక నిపుణులు ఎవరైతో టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఉన్న వారే, నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ బోలేబాబా డెయిరీ 2018 వరకు హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో టీటీడికి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరాకి టెక్నికల్ శాంక్షన్ జరిగింది. అప్పటిలో కేజీ రూ.291 చొప్పున ఈ బోలేబాబా డెయిరీ(అప్పటి హర్ష్ ప్రెష్ డెయిరీ) నుంచి సరఫరాకు అనుమతిచ్చింది. సిట్ పేర్కొన్నట్టు కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ.. చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి సరఫరా చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరో నిందితుడుగా ఉన్న ప్రీమియర్ డెయిరీ కూడా కల్తీ చేసిందని చెప్పింది. ఈ ప్రీమియర్ డెయిరీ 2013 లో రూ.273 లకు, 2016లో రూ.332, 2106 సెప్టెంబరులో రూ.364లకు, 2017 ఏప్రిల్ లో రూ.411లకు, అక్టోబరు లో రూ.378లకు, 2018 జనవరిలో రూ.320లకు, 2019 ఆగష్టులో రూ.389 లకు నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ డెయిరీ చంద్రబాబు హాయంలోనే అత్యధిక సార్లు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు . ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డెయిరీకే చంద్రబాబు హాయంలో 90 శాతానికి పైగా నెయ్యి సరఫరాకు అవకాశం ఇచ్చారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు ఇవాళ జంతుకొవ్వు కలిపారు చెప్పారు అన్న తర్వాత సాక్షాత్తూ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిస్ధాయిలో ఇలా మాట్లాడ్డం సరికాదని చెప్పి సీబీఐ విచారణకు ఆదేశించారు.మాట మార్చిన శ్యామలరావు..2024 జూలైలో ఈవో శ్యామలరావు నెయ్యి నాణ్యతపై మాట్లాడుతూ... ఎన్ డీ డీ బీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిందన్నారు. అయితే నెయ్యిలో లడ్డూ సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం సెప్టెంబరు 23న మరలా ఈవో శ్యామలరావు ఎన్ డీ ఆర్ ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబుకి వంతపాడారు. కానీ సీబీఐ విచారణలో అదే ఎన్ డీ ఆర్ ఐ కు శాంపిల్స్ పంపిస్తే అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని అనుబంధ ఛార్జిషీట్ లో నివేదించారు. దీంతో చంద్రబాబును మోసే ఎల్లో మీడియా సంస్థలు సిట్ ను ప్రశ్నిస్తున్నారు? సీబీఐను ప్రశ్నిస్తున్నారు? విచారణ ఫలానా విధంగా చేయలేదని వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు సిట్ నియమిస్తే ఆ అధికారులు బాబు చెప్పినట్లు వినేవాళ్లు. వాళ్లు తప్పుడు నివేదికలు ఇచ్చి, వెంటనే మమ్నల్ని నిందితులు చేసే సిట్ కాకుండా... సరైన న్యాయవిచారణ కోసం సుప్రీం కోర్టు నియమించిన అధికారులతో విచారణ చేయించాలి. దీనికి మేం సిద్ధంగా ఉన్నాం. సీబీఐ తన ఛార్జి షీట్ పేజీ నెంబరు 65లో 2018లో బోలేబాబా డెయిరీ హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా చేసారని పేర్కొంది. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడం ద్వారా ఈ సంస్థలు వచ్చి కల్తీనెయ్యి తయారు చేశాయని ఎల్లో మీడియాలో ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెండరు నిబంధనలను సరళతరం చేయడానికి ముందే హర్ష్ ప్రెష్ డెయిరీ టెండర్లలో పాల్గొంది. ప్రీమియర్ డెయిరీ కూడా గతంలో ఉంది. ఇప్పుడు కొత్తగా రాలేదు. అదే విధంగా మాల్ గంగా కూడా తర్వాత టెండర్లులో పాల్గొంది. టెండరు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత టెండర్లలో పాల్గొన్న ఒక్క సంస్ద పేరు కూడా సీబీఐ పేర్కోలేదు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న నిర్ణయంతో స్ధానికంగా ఉండే తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని డెయిరీ కంపెనీలను ప్రోత్సహించడానికి నిబంధనలను సరళతరం చేశాం.జగన్ హయాంలోనే ఎన్డీడీబీతో ఒప్పందం:అయినా ఒక్క కంపెనీ కూడా రాలేదు కాబట్టి నిబంధనలను మరలా కఠినతరం చేశాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సాహి, గిర్ వంటి ఉత్తమ ఆవులను విరాళాల ద్వారా తెప్పించడమే కాకుండా... ఎన్ డీ డీబీ వంటి సంస్థలను వైయస్.జగన్ ప్రభుత్వం టీటీడీకి పరిచయం చేసిందే వైయస్.జగన్ ప్రభుత్వం. గతంలో ఎన్ డీ డీ బీ ద్వారా పరీక్షలకు పంపించే పరిస్థితి లేదు. ఆ సంస్థ ద్వారా రూ.50 కోట్ల విరాళం స్వీకరించి గిర్, సాహీవాల్ ,కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో ఆడదూడలు పుట్టేలా చేయడం ద్వారా టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా పూనుకున్నదే వైయస్.జగన్. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే అప్పటివరకు అందుబాటులో లేని.. బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ ను వైయస్.జగన్ ఆదేశాలతో ఎన్ డీ డీ బీ వాళ్ల సహకారంతో ఈ టెస్ట్ మిషనరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం. మా హయాంలోనే ఈ రకమైన ఏర్పాట్లు చేశాం. మా హాయంలో నిబంధలను కఠినతం చేసినందువల్లే కల్తీకి కేంద్రబిందువుగా మారిన ఏ ఆర్ డెయిరీ డెయిరీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కల్తీ అని తెలిసింది. అలా నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అని తెలిసినా కూడా ఆ నెయ్యి వేరే ఇన్ వాయిస్ లతో వస్తే దాన్ని లడ్డూ ప్రసాదంలో వాడినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపిన.. చంద్రబాబు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెప్పినట్లు మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? సీబీఐ ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని చెప్పినా... చంద్రబాబు మాత్రం తాను శ్రీవేంకటేశ్వరస్వామి వీర భక్తుడని పదే పదే చెప్పిన మాటలే చెబుతూ... మరలా జంతుకొవ్వులు కలిసాయని ఆరోపిస్తున్నారు.మా ఇళ్లతో టీడీపీ నేతలు భోగిమంటలునాలుగు దశాబ్దాలుగా మిమ్నల్ని గమనిస్తున్నాను. మిగిలివాళ్లు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కాదా? భక్తి పేరుతో స్వామి వారి ప్రసాదాలు, స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవడమే మీ నైజమా? మీరు చెప్పింది నిజమైతే సుప్రీం కోర్టు మిమ్నల్ని ఎందుకు మందలించింది? దానికి సమాధానం చెప్పాలి. మిమ్నల్ని ఆక్షేపించిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ దర్యాప్తులోనే ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని చెప్పిన మాట వాస్తవం కాదా? అయినా మీరు చెప్పిన అబద్దాలు ప్రచారం చేస్తూ.. వాటిని జనాలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఎవరు ఎవరి ఇళ్లమీద దాడి చేస్తున్నారు? టీడీపీ, జనసేన కార్యకర్తలు వైయస్సార్సీపీ నేతల ఇళ్లు కాలబెట్టి బోగి మంటలు వేసుకుని చలికాసుకుంటున్నారు. ఇదే మీ నైజమా? అని సూటిగా ప్రశ్నించారు.లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిపారన్న మీ మాటలతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించారు. మా ఇలవేల్పు అని చెబుతున్న మీరే స్వామి వారి లడ్డూలో ఆవుకొవ్వు కలిపారంటే ఎవరిపై అపవాదు మోపారు? భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది మీరు. మీ ఆరోపణలతో 140 కోట్ల మంది భక్తుల మనోభావాలను, శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహిమని నేలమట్టం చేసేలా మాట్లాడింది మీరు కాదా చంద్రబాబూ? ఇప్పటికైనా మీ అంతరాత్మను ప్రశ్నించుకొండి. దైవద్రోహం చేసినవాళ్లను దేవుడు వాళ్ల జీవితకాలంలోనే శిక్షిస్తాడన్నారు. మీ కంటే ఎవరూ దైవద్రోహం చేసారు చంద్రబాబూ అని భూమన సూటిగా ప్రశ్నించారు. కోట్ల లడ్డూల్లో ఆవుకొవ్వు కలిపారనడం కన్నా అపవాదు ఇంకా ఏముంటుందని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు
నారాయణవనం: నడుస్తున్న టెక్నాల జీ యుగంలో సాంకేతిక పరిశోధనల తో మంచి గుర్తింపును, అవకాశాలను అందుకోవచ్చని పలువురు పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబిలీ వా ర్షికోత్సవాల్లో శుక్రవారం వర్క్షాప్లు, సెమినార్లు, నిపుణుల, అతిథుల ఉపన్యాసాలు జరిగాయి. ప్రముఖ టెక్నాలజీ పరిశ్రమలు, అకాడమిక్ రంగాల నిపుణులు ఎజిల్వన్ (చైన్నె), తిరుపతి ఐఐటీ నిపుణులు విఘ్నేష్, వెంకటయ్య, కౌటిల్య శ్రీధర్, రాజేంద్ర ప్రసాంత్ (ఐఐఐటీ శ్రీసిటీ), వైలూరు పెరుమాలు (ఐటీ కన్సల్టెంట్ డెలాయిట్)లు ఆధునిక సాంకేతికత, పరిశ్రమ అవసరాలు, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమాలు పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు పేర్కొన్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన నగదు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి గురువారం తిరుమలలోని కారు పార్కింగ్ ప్రాంతంలో అనుమానితులు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్ రమేష్ (35), అదే రాష్ట్రం హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్ (32)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు భక్తుల రద్దీని గమనించి అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని ముందుగా పరిచయం పెంచుకుని, భక్తులు స్నానానికి వెళ్లిన సమయంలో వారి లగేజ్ బ్యాగులను చోరీస్తున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి మొబైల్ ఫోను, రూ.45 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
నేడు చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి రాక
తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 226 రోజుల తరువాత తిరిగి చంద్రగిరి నియోజకవర్గానికి శనివారం వస్తున్నారు. ఆ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తుండగా తుమ్మలగుంట వాసులు చెవిరెడ్డి చేత గ్రామ దేవతలకు పూజలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి పరిసరాలకు చేరుకునే చెవిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దామినేడు వద్ద ఘన స్వాగతం విజయవాడ నుంచి రోడ్డు మార్గం మీదు వచ్చే చెవిరెడ్డికి చంద్రగిరి నియోజక వర్గంలోకి అడుగుపెట్టే దామినేడు వద్ద ఘన స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్తో గజమాలలను వేయడం, హారతులతో సాదరంగా ఆహ్వానించడంతోపాటు పూలవర్షం కురిపించేలా నిర్ణయించారు. అలాగే తనపల్లి సర్కిల్, వేదాంతపురం సర్కిల్, రామానుజపల్లి సర్కిల్ వద్ద ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు కార్యకర్తలు కలసి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చివరగా తుమ్మలగుంట తెలుగుతల్లి విగ్రహం వద్ద గ్రామస్తులు దిష్టి తీసి, ఆయనను గ్రామంలోకి ఆహ్వానించనున్నారు. ఆ తరువాత ఆయన కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, శ్రీ శక్తి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు. -
మూకుమ్మడిగా ఇద్దరిపై దాడి
దొరవారిసత్రం: రెండు వర్గాలు మధ్య చిన్నపాటి వివాదం పెద్దది కావడంతో బైక్పై వెళుతున్న ఇద్దరి పై పలువురు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన గురువారం రాత్రి వేణుంబాకం రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ సంఘమేశ్వరావు, ఎస్ఐ అజయ్కుమార్ కథనం మేరకు.. వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వలిపి శివకుమార్, రామాంజనేయులు, అదే గ్రామానికి చెందిన విద్యాసాగర్ మధ్య పాతకక్షల దృష్ట్యా వాదోపవాదాలకు దిగి, గురువారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఇరువురు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగానే ఇరువర్గాల వారు పోలీస్ స్టేష న్ సమీపంలో వాదులాడుకుని తలపడేందుకు సిద్ధపడ్డాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ, పోలీసులు మందలించి పంపారు. అప్పటికే ఓ వర్గానికి చెందిన విద్యాసాగర్ స్వగ్రామం నుంచే కాకుండా బ యటప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులను దొ రవారిసత్రం గ్రామానికి పిలిపించాడు. స్టేషన్ వద్ద ఏమి జరుగుతుందోనని తెలుసుకునేందుకు వడ్డికండ్రిగకు చెందిన హరినాఽథ్, రమణయ్య వచ్చి తిరి గి నాయుడుపేటకు బైక్ పై వెళుతుండగా విద్యాసాగర్ వర్గానికి చెందిన పలువురు వేణుంబాకం రోడ్డు వద్ద కాపుకాసి, మూకుమ్మడి దాడికి దిగడంతో హరినాఽథ్ పరారయ్యాడు. రమణయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పిడిన ఏడు గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వడ్డికండ్రిగలో పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం
బాబు సర్కారు మరోసారి స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచి, ప్రజల నడ్డివిరవనుంది. చాంపియన్స్గా విశాఖ, కృష్ణా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్లుగా విశాఖ, కృష్టా జిల్లా ల జట్లు నిలిచాయి.ముడుపు చెల్లిస్తేనే.. మ్యుటేషన్ శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026మ్యుటేషన్ చేసుకోవడానికి జిల్లాలో సాగుతున్న రెవెన్యూ బేరాలు తెలిసిందే. కొన్నిచోట్ల బాహాటంగానే కొందరు పైసలిస్తేనే ఫైల్ ముందుకు సాగుతుందని చెప్పేస్తున్నారు. మరికొందరు అధికార పార్టీ నేతల అధికారులకు సిఫారసు చేయించి మ్యుటేషన్ చేయిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే పాలకపక్షానికి చెందిన చోటా నేతలు తమకు పెద్ద మొత్తంలో ఇచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులకు మించి అధికార పార్టీ చోటా నేతలు డిమాండ్ చేయడంతో... మళ్లీ అధికారుల వద్దకే క్యూ కడుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా డైబ్భె వేల మంది మ్యుటేషన్ దరఖాస్తులు చేసుకున్నట్లు స్పష్టం అవుతుంది. 15 నుంచి 20 శాతానికి మించి పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా 75శాతం దరఖాస్తులను డాక్యుమెంట్స్ సక్రమంగా లేవంటూ రిజెక్ట్ కొట్టినట్లు తెలుస్తోంది. 30 రోజుల వ్యవధి సాధారణంగా మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సి ఉంది. మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల తర్వాతే ఫైల్ వీఆర్ఓకు వెళుతుంది. ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్కు, అనంతరం తహశీల్దార్కు ఫైల్ చేరుతుంది. అయితే 28 లేదా 29 రోజుల సమయంలో నగదు బేరాలు కుదిరితే ఓకే చేస్తున్నారు. లేదంటే డాక్యుమెంట్స్ పెండింగ్ అంటూ ఓ సాకుగా చూపించి రిజెక్ట్ కొట్టేస్తున్నారు. అందులో వారసత్వ ఆస్తులకు చెందిన మ్యుటేషన్లు సైతం ఇలానే సాగుతున్నాయి. దీంతో సచివాలయ పరిధిలోని వీఆర్ఓల నుంచి జిల్లా కలెక్టర్ వరకు మ్యుటేషన్ దరఖాస్తులు తిరుగుతూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఓజిలి మండలంలో ఓ వీఆర్ఓ, ఓ తహశీల్దార్, రామచంద్రాపురం మండలంలో ఓ వీఆర్ఓను అర్జీల పరిష్కారం అంశంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని తేలడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. అయితే అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు. తడ: కొందరు వీఆర్ఓలు స్థానికులు కావడం, ఏళ్ల తరబడి ఇక్కడే కొలువులు చేస్తూ ఉండడంతో ఎవరి వద్ద ఎంత దండుకోవచ్చు అనే వివరాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఇక్కడి అధికారులు తమ చేతివాటం నిరాటంకంగా సాగిస్తున్నారు. మండలంలో రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 2,419 సర్వే నంబర్లు మ్యుటేషన్కి రాగా అందులో 1,922 నంబర్లు పరిష్కారం అయ్యాయి. మరో 432 తిరస్కరించబడగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయం వద్ద చెట్ల కిందే నిరీక్షిస్తున్న రైతులుమ్యుటేషన్ కోసం రైతు ఒక ఎకరాకు వీఆర్ఓకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు అందించాలి. లేదంటే అక్కడు పలు రకాల తిరకాసులుంటాయి. వెంటనే ఆ ఫైలు ఆర్ఐ వద్దకు చేరుతుంది ఆయనకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు అందించాలి.అక్కడి నుంచి డీటీతోపాటు తహశీల్దార్ వద్దకు ఫైలు వస్తుంది. అక్కడ ఆ అధికారి చెప్పినంత ఇ వ్వాల్సిందే. లేదంటే ఆ ఫైలు అప్పడే తిరస్కారానికి గురవుతుంది. ఇలా ప్రతి ఒక్క అధికారికి ముట్టజెబితేనే పని అవుతుంది. లేదంటే ఫైలు రిజెక్ట్ అవుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ముడుపులు ఇస్తే తప్ప ముటేషన్లు జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవ ల రామచంద్రాపురం మండలం పీవీపురం గ్రామ రెవెన్యూ అధికారిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఇచ్చినంత తీసుకుని గుట్టుగా ముటేషన్లను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. పాకాల మండలంలో మ్యుటేషన్లు ఏవీ పెండింగ్ లేవని తహశీల్దారు చెప్పగా చిన్నగొట్టిగల్లు మండలంలో ఆరు మ్యుటేషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ అవన్నీ కోర్టులో న్నందున అక్కడి తహశీల్దార్ నిలుపుదల చేసినట్టు సమాచారం. రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాల యంలో మ్యుటేషన్లకు గుట్టుగా డబ్బులు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తున్నట్టు దరఖాస్తుదారులు చెబుతున్నారు. చంద్రగిరి మండలంలో మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ ఎంతో కొంత ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని 8 గ్రామ పంచాయతీల పరిధిలో రీసర్వే ప్రక్రియ జరుగుతున్నందున మ్యుటేషన్లు పెద్దగా రావడం లేదు. జనవరి 1 నుంచి మ్యుటేషన్ నిలుపుదల ముందే మ్యుటేషన్ దరఖాస్తులు పేరుకుపోయాయి. దానికితోడు జిల్లాల పునర్విభజన, జేసీ అధికారాలను ఇటీవల తహశీల్దార్లుకు, ఆర్డీఓలకు బదిలీ చేసిన నేపథ్యంలో కొద్ది రోజులు మ్యుటేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో జనవరి 1 నుంచి పూర్తిగా నిలుపుదల చేశారు. సాధారణంగా వారసత్వ ఆస్తుల బదిలీలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులకు సంబంధించి, అన్ రిజిస్టర్డ్ అంశాలు, సర్వే రిపోర్ట్ లేకపోవడం తదితర సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మ్యుటేషన్ పెద్ద సమస్యగా మారిపోయింది. భూముల మ్యుటేషన్ల కోసం రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో లంచాలివ్వలేక ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు భూముల విస్తీర్ణం, మరోవైపు భూముల రేట్లు ఆధారంగా కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన కాసులు ముట్ట చెబితేనే సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. లేదంటే ఏదో ఒక సాకు చూపి, గడువు తీరినాక రిజెక్ట్ కొట్టేస్తున్నారు. దీంతో పేదలకు చెందిన మ్యుటేషన్లు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. కాసులున్నవారు, అధికార పార్టీ నేతలకు మాత్రం అడంగల్, వన్బీలలో పేర్లు మార్పు చేస్తూ రెవెన్యూ అధికారులు తమ విధేయతను చాటుకుంటున్నారు. – తిరుపతి అర్బన్ 14 నెలలుగా తిరుగుతున్నాడు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శేసెట్టి విజయ్కుమార్. వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేటకు చెందిన వారు. ఈయనకు సంబంధించిన సర్వే నెంబర్ 42–2, 42–5లో 63 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల కోసం 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మ్యుటేషన్కు చలానా కట్టి సుమారుగా ఏడాది పైన కావస్తోంది. నేటికీ ఆయన పొలానికి సంబంధించి పాసుపుస్తకాలు అందలేదు. ఈ విషయంపై బాధితుడు నిత్యం రెవెన్యూ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ఎవ్వరూ సమాధానం కూడా ఇవ్వడం లేదు. -
ఓవరాల్ చాంపియన్స్గా విశాఖ, కృష్ణా
తిరుపతి సిటీ: రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్స్గా విశాఖ, కృష్ణా జిల్లాల జట్లు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మూడు రోజుల నుంచి జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఘనంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ పద్మారావు హాజరై విజేతలకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక ధృడత్వానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనే ప్రతి ఒక్కరూ విజేతలేనని తెలిపారు. బాలుర విభాగంలో జరిగిన పోటీల్లో విశాఖపట్నం రీజియన్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్ షిప్ను గెలుచుకున్నారు. అలాగే బాలుర విభాగంలో వ్యక్తిగత చాంపియన్షిప్ను విశాఖకు చెందిన విద్యార్థి త్రినాథ్ కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్ షిప్ను కృష్ణా జిల్లా విద్యార్థినులు కై వసం చేసుకున్నారు. వ్యక్తిగత విభాగంలో కడపకు చెందిన విద్యార్థిని భావ్య సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణారావు, ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, డాక్టర్ ద్వారకనాథ్రెడ్డి, ఎస్వీ కుమార్, ఎస్ శ్రీనివాసులు, ఎస్వీయూ పీడీ డాక్టర్ ఎం శివశంకర్రెడ్డి, హరిప్రసాద్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, 100 మంది పీడీలు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఏర్పేడు: నాన్ థర్మల్ ప్లాస్మా టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం ప్లాస్మా రీసెర్చ్ గ్రూప్, వాటర్ క్వాలిటీ రీసెర్చ్ గ్రూప్లు సంయుక్తంగా నిర్వహించిన నాన్–థర్మల్ ప్లాస్మా టెక్నాలజీపై అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ప్రొఫెసర్ షిహాబుద్దీన్ ఎం.మాలియేకల్, డాక్టర్ రీతేష్ కుమార్ గంగ్వార్ నేతృత్వంలోని బృందం ప్లాస్మా శాస్త్రాన్ని వ్యవసాయం, పర్యావరణ భద్రత, పారిశ్రామిక రంగాల్లోని కీలక సవాళ్లకు ఎలా వినియోగించాలో వివరించారు. ఈ ప్రదర్శనలో ప్రధానంగా వికేంద్రీకృత స్థాయిలో, ప్రత్యక్ష ప్రదేశంలో పోషక విలువలు గల లిక్విడ్ ఫెర్టిలైజర్ల తయారీకి అనువైన స్కేలబుల్ ప్లాస్మా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వాతావరణంలోని నైట్రోజన్న్ను ప్లాస్మా సాంకేతికత ద్వారా పంటలు సులభంగా గ్రహించగల నీటిలో కరిగే నైట్రేట్లు, రియాక్టివ్ పదార్థాలుగా మార్చడం ద్వారా స్థిరమైన పోషక వనరును అందించవచ్చని చెప్పారు. ఈ విధానం ద్వారా ఖరీదైన దిగుమతి రసాయన ఎరువులపై వ్యవసాయ రంగం ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు, స్థిరమైన వ్యవసాయం, పర్యా వరణ పరిరక్షణకు ఈ సాంకేతికత మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ అధికారి షణ్ముగం, కాలుష్య నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక దందా ఆగేంతవరకు పోరాటం సాగిస్తా
కలువాయి(సైదాపురం): ‘అధికారపార్టీ నేతలు ధన దాహానికి సహజవనరులు అడుగంటి పోతున్నాయి. అక్రమ తవ్వకాలతో పెన్నానది గర్భశోకంతో అల్లాడిపోతోంది. ఈ అక్రమ ఇసుక దందా ఆగేంత వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాను.’ అని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి శపథం చేశారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలతో కలసి కలువాయి మండలంలోని తెలుగురాయపురం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను శుక్రవారం నేదురుమల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగురాయపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా కూటమి నేతలు బరితెగింపునకు నిదర్శనమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో పెన్నానదిలో పెద్ద పెద్ద యంత్రాలతో నిత్యం వందల సంఖ్యలో ఇక్కడ నుంచి ఇసుకను స్థానిక రెవెన్యూ కార్యాలయం మీదుగానే తరలించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా ఈ ఇసుక దందా జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. నదీగర్భంలోని రహదారి ఏర్పాటు చేయడంతోపాటు యంత్రాలను అక్కడే ఉంచడం, ఇసుక రీచ్పై టీడీపీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే అధికారపార్టీకి చెందిన నేతలు ఎంత బరితెగించారన్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఇసుక దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబునల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యులు అనీల్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మాగినేని కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, మన్నారపు రవికుమార్యాదవ్, శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్రెడ్డి, పులి ప్రసాద్రెడ్డి, నేతలు నారాయణరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులికాట్లో పక్షుల గణన
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సుకు వచ్చే విదేశీ వలస పక్షుల లెక్కింపును అటవీశాఖాధికారులు, పర్యావరణ నిపుణులు, పక్షి పరిశోధకులు, వలంటీర్లు శుక్రవారం చేపట్టారు. ఈ సరస్సుకు ఎన్ని జాతులు పక్షులు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయ నే అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నా రు. ఈ సర్వే శని, ఆదివారాల్లో కూడా నిర్వహిస్తా మని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సె ల్వం, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజనల్ అధికారి హారిక తెలిపారు. పక్షి జాతుల వైవిధ్యం, వాటి సంఖ్య, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసుకోవడం, వాటి జీవనశైలిపై అధ్యయ నం చేస్తున్నారు. ఈ ఏడాది పక్షులు గణనలో గణనీయంగా కనిపించే ప్రముఖ జాతుల్లో పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, స్పాట్బిల్ట్ బాతులు, హెరా న్లు, ఎగ్రెట్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. మొత్తంగా తీసుకుంటే 118 రకాలైన పక్షులు 1,99,659 ఉన్నట్టుగా గుర్తించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు! నాయుడుపేట టౌన్ : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయ స్వార్థం కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయడంతో ప్రపంచంలోని 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని సూళ్లూరుపేట మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మండలంలోని తిమ్మాజీకండ్రిగలోని అభయానుగ్రహ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంజీవయ్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి తదితరులతో కలిసి ఆలయం వద్ద పూజలు చే సి, టీడీపీ, జనసేన నేతలకు కనువిప్పు కల గాలని మొక్కుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సు ప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా తెలియజేసిందన్నారు. వైఎస్సార్ సీపీ నేత కామిరెడ్డి స త్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ లో కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. నాణ్యమైన భోజనం అందించండి తిరుపతి అర్బన్: బీసీ వసతి గృహాల్లో ఉంటు న్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మల్లికార్జున్ వెల్లడించారు. విజయవాడ నుంచి శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతిలోని పలు బీసీ హాస్టళ్లను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్టల్ విద్యార్థులకు ఓ వైపు చదువుతోపాటు ఆరోగ్య విషయాల్లోను నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భరత్రెడ్డికి సూచించారు. నిత్యం పిల్లలపై నిఘా పెట్టాలని చెప్పారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల ప్రతినిధులు ఎంపిక తిరుపతి కల్చరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుప తి జిల్లాలో వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీ ప్ర తినిధులకు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కా ర్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా రాష్ట్ర మైనారిటీ సెల్ సహా య కార్యదర్శిగా శ్రీకాళహస్తికి చెందిన షేక్ ఖా దీరుల్లా, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సహాయ కార్యదర్శి గా కంచి గురవయ్య, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సహాయ కార్యదర్శిగా కె.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ సహాయ కార్యదర్శిగా పి.అఽశోక్రెడ్డి, వైఎస్సార్టీయూసీ సహాయ కార్యదర్శిగా సత్యవేడుకు చెందిన బి.సురేష్ నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తిరుపతికి చెందిన ఇమ్రాన్బాషా, ఖాదర్ బాషా, ఆరణి సంధ్య నియమితులయ్యారు. హరిత పాఠశాలలకు 8 అవార్డులు తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 పాఠశాలలు గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్కు ఎంపిక కా వడంతో ఆ స్కూళ్ల హెచ్ఎంలు న్యూఢిల్లీలో శుక్రవారం అవార్డులు అందుకున్నారు. వారితోపాటు ఏపీఎన్జీసీ జిల్లా సమన్వయకర్త బాలచైతన్యకు అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్లలోని స్టెయిన్ ఆడిటోరియంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ సునీత అవార్డులను ప్రదానం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగవరం మండలంలోని పత్తికొండ జెడ్పీ హైస్కూలు, బొమ్మసముద్రం ప్రభు త్వ హైస్కూలు, తరిగొండ జెడ్పీ హైస్కూల్, కరకంబాడి జెడ్పీ హైస్కూలు, వెదురుకుప్పం జెడ్పీ హైస్కూలు, పుత్తూరు బాలికల హైస్కూలు, ఆర్కేఎంపురం హైస్కూలు, చింతలపట్టడ హైస్కూలు కు హరిత అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల డీఈఓలు కేవీఎన్ కు మార్, రాజేంద్ర ప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీలు గౌ రీశంకర్, వెంకటరమణతోపాటు పలువురు అవా ర్డు అందుకున్న వారిని అభినందించారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ
రేణిగుంట: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సేవల వేగం, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశా రు. చాలా మంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, మార్కెట్ విలువ ధ్రువపత్రాలు, భార రహి త ధ్రువపత్రాలు జారీ విషయంలో ఆలస్యం అవుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, సి బ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలో అనధికార వ్యక్తులు ఉండడం గమనించిన ఇలా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉంటా యని హెచ్చరించారు. -
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
తిరుపతి అర్బన్: పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్లో ఉత్తీర్ణత సాధించిన యువతీయువకులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు. రష్యాకు సంబంధించిన సైబర్ స్టీల్ కంపెనీలో మెటల్, పైప్నకు చెందిన ఉద్యోగులకు ఐటీఐ, డిప్లొమా చదువుకున్న వారు ఏడాది పాటు అనుభవం ఉన్న యువతకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన 24–40 ఏళ్లు వారు రెండేళ్లు ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ విభాగాల్లో అనుభవం ఉన్న యువతీ, యువకులకు దుబాయ్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అదనపు సమాచారం కోసం 91609 12690 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు పింఛన్ల పంపిణీ తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు శనివారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వస్తున్న నేపథ్యంలో ముందు రోజు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఏ, మెప్మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో 2,64,902 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. శనివారం పంపిణీ చేయకుండా మిగిలినపోయిన వారికి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 300 మీటర్ల లోపు దూరం నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,03,77,227 వచ్చినట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయ ఆవరణలోని కొట్టు మండపం వద్ద శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 94 గ్రాములు, వెండి 677 కిలోలు, విదేశీ కరెన్సీ 181 వచ్చింది. ఈ హుండీ లెక్కింపును పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు. పీజీ తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో పలు పీజీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంఏ, ఎమ్మెస్సీలోని పలు విభాగాలకు చెందిన ఫలితాలు శుక్రవారం విడుదల చేశామని, ఫలితాల కోసం విద్యార్థులు మనబడి వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. జపాన్ సైన్స్ ప్రొగ్రామ్కు ఎస్వీయూ బృందం తిరుపతి సిటీ: జపాన్ దేశం టోయామాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ ఆధ్వర్యంలో వచ్చే నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రొగ్రామ్కు ఎస్వీయూ బృందం హాజరుకానుంది. ఈ మేరకు ఎంపికై న బృందానికి వీసీ నర్సింగరావు శుక్రవారం ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జపాన్లో జరిగే సాకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కు వర్సిటీ నుంచి ఫిజిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ హేమలత రుద్రమదేవితోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి బాలాజీ ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి సంజయ్ యాదవ్తో కూడిన బృందం హాజరుకానున్నారని తెలిపారు. విద్యా, పరిశోధన, అధునాతన సైన్న్స్, టెక్నాలజీపై అవగాహనతోపాటు ప్రయోగశాల సందర్శనలు, నిపుణుల ఉపన్యాసాలు, సైన్న్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం ప్రధాన లక్ష్యంతో ఈ ప్రొగ్రామ్ జరగనుందని చెప్పారు. ఎంపికై న బృందాన్ని రెక్టార్ అప్పారావు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
అక్రమ ఆస్తుల కేసులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి అరెస్టు
తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఆఫీస్ సబార్డినేట్పై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మూడో శ్రేణి ఆఫీస్ సబార్డినేట్ నల్లిపోగు తిరుమలేష్పై తిరుపతి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గురువారం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో మొత్తం 11 స్థిరాస్తులు (ఇళ్ల స్థలాలు, ఫ్లాట్, భవనాలు), 1.472 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, రూ.15.26 లక్షల నగదు, ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉండగా, సోదాలు కొనసాగుతున్నా యని పేర్కొన్నారు. నిందితుడిని నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసి, నెల్లూరులోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
సూళ్లూరుపేట: స్థానిక పోలీస్స్టేషన్లో 2018 సెప్టెంబర్ 10న నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ జిల్లా ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత గురువారం తీర్పు చెప్పారని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపారు. తమిళనాడులోని సేలం జిల్లా పెదనాయకంపాళెం తాలూకా, ఎరివలవూరుకు చెందిన ఆర్ మహాదేవన్ (24), అదే జిల్లా, తాలూకాలోని పూడూర్ గ్రామానికి చెందిన పీ వెంకటేష్ (23)ను గంజాయి అక్రమ రవాణాకేసులో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అధికారులు ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించి, ప్రాసిక్యూషన్ తరుఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్కే రఫీ మాలిక్కు అందజేయడంతో ఆయన వాదనలు వినిపించి నేరం రుజువు చేశారు. దీంతో గురువారం నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ ఫస్ట్క్లాస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత తీర్పు చెప్పారని సీఐ తెలిపారు. కరెంట్ షాక్తో యువకుడి మృతి ఏర్పేడు: పచ్చిగడ్డి కోస్తుండగా, గట్టుపై పడి ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన కుప్పయ్యకండ్రిగలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం కుప్పయ్యకండ్రిగకు చెందిన ఆరూరు కేశవులు కుమారుడు ఆరూరు వెంకటరమణ అలియాస్ అజయ్కుమార్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో పొలం పనులు, ఇంటి పనులు చేస్తూ కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటున్నాడు. వీరికి ఉన్న రెండు ఆవులను మేపటానికి గురువారం గ్రామానికి సమీపంలోని బీడు భూములకు తోలుకెళ్లాడు. ఆవులు మేస్తుండగా, పక్కనే ఉన్న పంట పొలాల గట్లపై ఉన్న పచ్చిగడ్డిని కొడవలిలో కోస్తుండగా, 11కేవీ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగ తెగి గట్టుపై పడి ఉండగా, గడ్డిని కోస్తూ అతను విద్యుత్ తీగను పట్టుకోవడంతో షాక్కు గురై అపరస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
తిరుపతి అర్బన్: గృహ నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్ త్రీలో డీవియేషన్, రెక్టిఫైకేషన్(అవకతవకలు)పాల్పడిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో గృహనిర్మాణశాఖకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాల సమయంలో బేస్మెంట్కు మట్టి పోయకుండా, బేసిమెంట్ వేయకుండా కొందరు బిల్లులు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి అవాస్ యోజన స్కీమ్ ద్వారా 1,608 గృహాలను ఉగాదికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాల్లో తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అలాగే గడువులోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. -
రాజకీయ ప్రతీకారంతోనే చెవిరెడ్డి అక్రమ అరెస్టు
– మాజీ ఎమ్మెల్సీ యండపల్లి చంద్రగిరి: ‘లిక్కర్ స్కామ్ అనే రాజకీయ ప్రతీకార కక్ష్య ముసుగులో ప్రజలతో సంబంధం లేని తప్పుడు కేసులు సృష్టించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ పరాకాష్ట.’ అని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన గురువారం ఆనందం వ్యక్తం చేస్తూ, ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. ప్రజాస్వామ్యంలో విపక్ష రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య కార్యకర్తల గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో, ఆధారాలు లేని కేసులు పెట్టి, వ్యక్తిత్వ హననం చేస్తూ, రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టించడమే కూటమి ప్రభుత్వ పాలనగా మారిందన్నారు. -
పట్టపగలే రెండిళ్లలో చోరీ
దొరవారిసత్రం: ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగలు పట్టపగలే రెండిళ్లలోకి చొరబడి రూ.2.65 లక్షలు నగదు, ఐదు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన అయ్యపాళెంలో బుధవారం చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు... అయ్యపాళెం గ్రామానికి చెందిన చెవూరు శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్లిపోగా, మాయారి బాబు, భార్య గౌరి రోజూలాగానే తడలోని కంపెనీకి ఉదయమే విధి నిర్వహణకు వెళ్లిపోయారు. వీరి ఇద్దరు పిల్లలకు ఇంటికి తాళాలు వేసి పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్లారు. వ్యవసాయ పనులకు 11 గంటలకు ముగించుకుని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసికి ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 నగదు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. అదే సమయంలో వీరి ఇంటి వెనుకనే ఉన్న మరో ఇంటి తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించి, పరిశీలించగా బీరువాలో ఉన్న రూ.1.15 లక్షల నగదు, ఐదు సవర్లు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ అజయ్కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం తిరుపతి నుంచి క్లూస్ టీమ్ను పిలిపించగా కొన్ని వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యార్థులకు సృజనాత్మకత అవసరం నారాయణవనం: సృజనాత్మక పరిశోధనలతోనే ఇంజినీరింగ్ విద్యార్థులు గుర్తింపు పొందుతారని అనంతపురం జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్(అటానమస్) సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా గురువారం వ్యర్థాల(స్క్రాప్)తో సృజనాత్మకతను ప్రతిబింబించేలా తయారు చేసిన మోడళ్ల ప్రదర్శనను సిద్ధార్థ సంస్థల చైర్మన్ డాక్టర్ అశోక్ రాజు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయని తెలిపారు. అశోక్రాజు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను సద్వినియోగం చేసుకుంటూ కొత్త ఆలోచనలతో మోడళ్లను రూపొందించడం విద్యార్థుల్లో సృజనాత్మకతను, పర్యావరణపై అవగాహనను పెంపొందిస్తుందన్నారు. నెల్కాస్ట్ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆలోచించే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగాలంటే ఇన్నోవేటిట్ ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు. -
దేవుడితో రాజకీయాలా?
శ్రీవారి భక్తురాలిగా గత 30 ఏళ్ల నుంచి తిరుమలకు తరచూ వెళ్తున్నా. ప లుసార్లు మొక్కులు తీర్చుకునేందుకు కాలినడక సై తం వెళ్లా. శ్రీవారి లడ్డూ ప్ర సాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ప్రచారం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై బహిరంగంగా ప్రకటించారు. విచారణ చేపట్టకముందే ఇలా వదంతులు రావడం బాధేసింది. ప్రస్తుతం సీబీఐ నివేదికతో అసలు విషయం తేలిపోయింది. –సుభద్రమ్మ, భక్తురాలు, తిరుపతి రూరల్ అసలు విషయం తేలిపోయింది శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొ వ్వు కలిసిందనే విషయంపై ప్రభుత్వం నానా రా ద్ధాంతం చేసింది. రాజకీయాలకు టీటీడీని వేదిక చే సుకోవడం మంచిది కాదు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని బాబు సర్కారు సిట్ ను నియమించి విచారణ చేపట్టింది. కానీ సీబీఐ విచారణలో జంతు కొవ్వు కలవలేదని నివేదిక సమ ర్పించింది. –రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి -
అవినీతి అధికారుల్లో అలజడి
సైదాపురం: మ్యూటేషన్ పనుల్లో మాయజాలం ప్రదర్శించిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పని చేసిన రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ కావడంతో జిల్లాలో అలజడి నెలకొంది. ఏకంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లతోపాటు ముగ్గురు వీఆర్వోలకు, ఒక్క సర్వేయర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదేశాలు రావడంతో రెవెన్యూ అధికారుల్లో కలవరం మొదలైంది. 2022 జూలై 2, 3 తేదీల్లో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏకకాలంలో 16 మంది నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారులు సైదాపురం తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో అలజడి 2022లో ఏసీబీ దాడుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారుల్లో అలజడి మొదలైంది. ఆ అధికారుల జాబితాలో ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం చిల్లకూరు తహసీల్దార్గా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈనెల 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే ఎంవీ సుధాకర్రావు, మునిలక్ష్మి, కాయల సతీష్ ఉద్యోగ విరమణ చేశారు. ఇతర జిల్లా నుంచి 2019లో ఎన్నికల సమయంలో వచ్చిన వి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం పాలకృష్ణ, కె.జయజయరావు విధుల్లో కొనసాగుతున్నారు. ఆ సమయంలో డీటీలుగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి ప్రస్తుతం బాలాయపల్లి తహసీల్దార్గా ఉన్నారు. అలాగే కిషోర్రెడ్డి కూడా ఉన్నారు. సర్వేయర్ హజరత్తయ్య ఇటీవలే మృతి చెందారు. వీఆర్వోలు రమాదేవి, హరిబాబు, మునిబాబు విధుల్లో ఉన్నారు. వీరంతా పదిరోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.14400కు ఫిర్యాదుతో దాడులు మండలంలో పేదలకు అందాల్సిన ప్రభుత్వ భూములను ముగ్గురి పేర్లతో ఒకే ఏడాదిలో మ్యుటేషన్ చేసి యాజమాన్య హక్కులు కల్పించే ప్రయత్నం, అగ్రిమెంట్లు చేసుకున్న భూములకు పట్టాదారుపాసుపుస్తకాలు ఇవ్వడం లాంటివి గోల్మాల్ చేయడంతో కొంత మంది బాఽధితులు ప్రభుత్వ ట్రోల్ ఫ్రీ 14400కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డిజిటల్ కీని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీ గండిపడినట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే భూమార్పిడి చేయడంతో పాటు 22ఏ జాబితాలో ఉన్న భూములను కూడా పట్టాదారు పాసుపుస్తకాలను అందించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
పట్టపగలే రెండిళ్లలో చోరీ
అయ్యవారిపాళెంలో పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.కూటమి అపచారానికి పరిహార హోమంతిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అసత్య ప్రచారానికి శుక్రవారం తిరుపతిలో ఉదయం 10 గంటలకు శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం నిర్వహించనున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీపై బురదజల్లాలన్న దురాలోచనతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే నీచ రాజకీయాలు చేసి లడ్డూలో ఆవు, పంది కొవ్వు కలిపామంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ దుష్ప్రాచారం చేశా రని మండిపడ్డారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. ఆ దర్యాప్తులో శ్రీవారి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని తుది నివేదికలో తేల్చిచెప్పిందన్నారు. దాంతో చంద్రబాబు, పవన్కళ్యాణ్లు వైఎస్సార్సీపీపై మోపిన నింద సీబీఐ నివేదికతో పటాపంచలయ్యిందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్కళ్యాణ్ చేసిన పాపాలకు తిరుపతిలో పరిహార హోమం నిర్వహించనున్నట్లు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. -
ఏం సమాధానం చెబుతారో?
పవిత్రమైన తిరుమల ప్ర సాదంపై గుడిమెట్లు కడిగి మరీ సీఎం, డెప్యూటీ సీఎంలు దుష్ప్రచారం చే శారు. అసత్యపు ఆరోపణ లు చేశారు. అయితే విచా రణలో సీబీఐ ఎటువంటి కొవ్వు కలపలేదని తేల్చింది. ఇప్పుడు సీఎంచంద్రబాబు, డెప్యూటీ సీ ఎం పవన్కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు. వా స్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు ఉద యం నుంచి డైవర్షన్ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్కల్యాణ్, చంద్రబాబు భక్తులకు బహిరంగంగా క్షమా పణ చెప్పాలి. – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అప్పుడస్సలు నమ్మలేదు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని విచారణ చేపట్టక ముందే కూటమి ప్రధాన నేతలు దారుణంగా ప్రకటనలు చేశారు. శ్రీవారి భక్తులుగా మా కుటుంబం నమ్మలేదు కానీ కొందరు భక్తులు ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి లడ్డూ తో రాజకీయాలు చేయడం బాధగా అనిపించింది. రెండేళ్లుగా సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్నా. నివేదికలో జంతు కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలవలేదని తేల్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు ఏవైనా శ్రీవారిని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు. – శ్రీనివాసన్, తమిళ భక్తుడు, తిరుపతి ● -
బోధనేతర సిబ్బంది వర్సిటీకి వెన్నెముక
తిరుపతి సిటీ: యూనివర్సిటీకి బోధనేతర సిబ్బంది వెన్నెముకతో సమానమని, విద్యార్థులకు సంస్థకు సేవ చేయడం దైవంతో సమానమని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుసా సహకారంతో వర్సిటీలో బోధనేతర సిబ్బందికి వృత్తి నైపుణ్యంపై నెల రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం గురువారం సెనేట్ హాల్లో ప్రారంభభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఒక సాధారణ పరిపాలనా వ్యాయామం కాదని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవాతత్పరత బలోపేతం చేయడానికి ఉద్దేశించిందన్నారు. ఉద్యోగులు అడ్మిషన్లు, పరీక్షలు, స్కాలర్షిప్లు, జీతం, ఆడిట్లు, డిజిటల్ రికార్డులు, ఫిర్యాదుల పరిష్కారం వంటివి విషయాలను నైపుణ్యంతో చేయాల్సి ఉంటుందన్నారు. రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్వీయూ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీధర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
అంతులేని ఆనందం
అంతటా సంబరం తిరుపతి రూరల్: అక్రమ మద్యం కేసులో 226 రోజులుగా రిమాండ్లో ఉన్న చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రతి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, సంబరాలు చేసుకున్నారు. తమ ఆరాధ్య నాయకుడు చెవిరెడ్డి బెయిల్పై విడుదల కావడం సంతోషాన్ని తెచ్చిపెట్టిందని అంతటా సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం, గ్రామ శివార్లలో నేతలు సంబరాలతో హోరెత్తించారు. చెవిరెడ్డి అభిమానులు, పార్టీ నేతలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెవిరెడ్డి ప్లెక్సీకి పా లుతో అభిషేకించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తుమ్మలగుంటకు చెందిన యువత భారీగా బాణసంచా పేల్చగా మహిళలు ఆలయాల్లో పూజలు చేశారు. అలిపిరిలో మొక్కుల చెల్లింపు చెవిరెడ్డికి బెయిల్ రావడంతో చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు అలిపిరి పాదాల మండపం వద్దకు వెళ్లి శ్రీవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు పాదాల మండపంలోని స్వామి వారిని దర్శించుకుని చెవిరెడ్డి పేరిట అర్చన చేయించారు. పులి లాంటి వ్యక్తి చెవిరెడ్డి – భూమన కరుణాకరరెడ్డి తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీలో యాక్టీవ్గా ఉంటూ కూటమి నాయకుల గుండెల్లో దడ పుట్టించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా ఏడు నెలల పాటు జైల్లో నిర్బంధించారని, అయితే పులి బయట ఉన్నా, బోన్లో ఉన్నా పులి పులేనని, పులి లాంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని గురువారం మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి పే ర్కొన్నారు. కేవలం వైఎస్సార్సీపీ నేతల్లో భయం కలిగించాలన్న నీచపు ఆలోచనలతో చంద్రబాబు, పవన్కళ్యాన్, లోకేష్ లిక్కర్ స్కామ్ పేరుతో తప్పుడు కేసులు బనాయించి ఏడు నెలల పాటు జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు.అక్రమ కేసులకు, జైలు ని ర్బంధాలకు భయపడే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. రా ష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లాంటి అనేక మంది తమ పార్టీ నేతలకు అక్రమంగా జైళ్లకు పంపడమే నిదర్శనమన్నారు. అ యితే చంద్రబాబు అక్రమాలు, దుర్మార్గులు ఎంతో కాలం సాగవనడానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ రావడం, శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక ఇవ్వడం వంటి అంతా మంచి శుభాలే జరిగాయన్నారు. -
ఎస్పీడీసీఎల్ ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ యాప్
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెనన్స్ యాప్ను రూపొందించామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందిచడానికి ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 229 మంది ఉద్యోగులతోపాటు పొరుగుసేవల సిబ్బందికి కూడా ఫిబ్రవరి 1వతేదీ నుంచి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలులోకి వస్తుందన్నారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడవ, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల్లో కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని సీఎండీ శివశంకర్ లోతేటి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్ టీచర్, థెరపిస్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంతిరుపతి కల్చరల్: కేంద్ర ప్రభుత్వం సహకారంతో తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుత్తణి ప్రాంతాల్లో రాష్ట్రీయ సేవా సమితి(రాస్)నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయులు, థెరపిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాస్ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పోస్టుల 18–40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ప్రకటన వెలువడిన 10 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ సేవా సమితి(రాస్), అన్నమయ్య మార్గ్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్–517502 చిరునామాకు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0877–2242404, 8500382542లను సంప్రదించాలన్నారు. ప్రాణదాన పథకం కింద 387 మంది ఎంపిక తిరుపతి తుడా: స్విమ్స్లో టీటీడీ ప్రాణదాన పథకం కింద 387 మంది రోగులను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. రోగులను ఎంపిక చేసేందుకు తన కార్యాలయంలో గురువారం వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్విమ్స్ అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆర్థిక సాయంతో పేద రోగులకు ప్రాణదానం పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు రోగులను ఎంపిక చేశామన్నారు. ఇందులో కార్డియాలజీ ఆరుగురు, కార్డియో థొరాసిక్ 29, జనరల్ సర్జరీ 10, మెడిసిన్ 42, నెఫ్రాలజీ 134, న్యూరాలజీ 21, న్యూరో సర్జరీ 69, గైనకాలజీ 8 మంది రోగులను శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశామన్నారు. అలాగే సైకియార్టీలో ఒకరు, రేడియేషన్ ఆంకాలజీ 4, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రీలజీ 60, సర్జికల్ ఆంకాలజీ ఒకరు, యూరాలజీలో ఇద్దరు చొప్పున ఎంపిక చేశామన్నారు. సమావేశంలో బర్డ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వెంకారెడ్డి, మెటర్నరీ ఆస్పత్రి నుంచి డాక్టర్ శ్రీనివాస్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, పద్మావతి చిన్న పిల్లల హృదయాల నుంచి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హోరా హోరీగా రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా రెండు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ హోరా హోరీగా సాగుతోంది. రెండోరోజైన గురువారం జరిగిన పలు పోటీల్లో విజేతలకు ఎస్వీ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నిర్మల్ కుమార్ ప్రియ, ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథ్రెడ్డి, అధికారులు అభినందనలు తెలిపారు. బ్యాడ్మింటన్ సింగిల్, డబుల్ విభాగాల్లో మహిళలు, పురుషుల పోటీలు గురువారం హోరాహోరీగా సాగాయి. -
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుట్రలు పటాపంచలు
● సీబీఐ నివేదికపై సర్వత్రా హర్షం ● కపట కూటమికి కళ్లు తెరిపించావు గోవిందా! ● స్వార్థ రాజకీయాలకు దేవదేవుడినే వాడుకుంటారా? ● సీఎం, డెప్యూటీ సీఎంలు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● అలిపిరి పాదాల వద్ద పూజలు ● నేడు కూటమి అపచారానికి పరిహార హోమం భక్తుల మనోభావాలతో ఆటలా? తిరుమల శ్రీవారి లడ్డూ అంటేనే ప్రపంచంలోని హిందూవులకు పరమ ప విత్ర ప్రసాదం. అలాంటి ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారనే అవస్తవాన్ని ప్రచారం చేశారు. సీబీఐ నివేదికలో అలాంటిది ఏమీ లేదని, కల్తీ జరగలేదని తేలింది. గత ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నంలో శ్రీవారిని వినియోగించుకోవడం దారుణం. భక్తుల మనోభావాలతో పార్టీలు పబ్బం గడుపుకోవడం మానాలి. – మధు స్వామి, అర్చకులు, వరదయ్యపాళెం దారుణం నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ జరిగిందని చంద్రబాబు సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణం. సీబీఐ నివేదికలో కల్తీ జరగలేదని తేలింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. సున్నితమైన విషయాలను గందరగోళం సృష్టించే విధంగా ప్రచారం చేశారు. – విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి -
అధిక చార్జీలపై చర్యలు తప్పవు
తిరుపతి మంగళం: మోటారు వాహనాల కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. మంగళంలోని తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం మోటారు వాహన డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మురళీమోహన్ మాట్లాడుతూ వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం వాహన డీలర్లకే అనుసంధానం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్దేశిత రుసుము కంటే వాహన డీలర్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తున్న ఆర్టీజీఎస్ ద్వారా వెల్లడి అయిందన్నారు. వాహన డీలర్లు కొనుగోలుదారులతో సరైన ప్రవర్తన నియమావళితో మెలగాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చార్జీల పట్టికను ప్రదర్శించాలని డీలర్లకు ఆదేశించారు. మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, స్వర్ణలత, ఏఓలు విజయకుమార్, విజయ ప్రశాంతి, వాహన డీలర్లు పాల్గొన్నారు. -
ఒకేషనల్ ప్రాక్టికల్స్కు 72 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం రెండో రోజు జరిగిన పరీక్షలకు 72 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జి.రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 కేంద్రాల్లో జరిగిన ఫస్టియర్ ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలకు 409 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 362 మంది హాజరయ్యారని, అలాగే ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 348 మందికి 323 మంది హాజరయ్యారని తెలియజేశారు. అసభ్యకర ప్రవర్తనపై కేసు దొరవారిసత్రం: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించి, ఇబ్బంది పెట్టిన యనమల అశోక్పై పోలీసుల బుధవారం కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు... వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన అశోక్ నాలుగు రోజుల కిందట బైక్లో వెళ్తూ పొలంలో పని చేసే ఓ వివాహితను వదిలిపెడుతానని బైక్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ విచారణ జరిపి కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆగమమే శాస్త్రాలకు మూలం తిరుపతి సిటీ: శాస్త్రాలకు మూలం ఆగమ శాస్త్రమేనని, వందల వృత్తుల వారు దేవాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారని వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. ఎస్వీ వేదిక్ వర్సిటీలో ఏడు రోజులపాటు నిర్వహించనున్న శిల్ప శాస్త్ర వర్క్షాపు బుధవారం వర్సిటీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన అకడమిక్ డీన్ గోలి సుబ్రమణ్యశర్మతోపాటు పలువురు పండితులతో కలసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, విద్యాలయాలు, మాతృగర్భంలాంటి సంస్కార కేంద్రాలని తెలిపారు. ఆగమంలో చెప్పబడిన శిల్ప సంబంధమైన విషయాలను శిల్పశాస్త్ర సహాయంతో వారం రోజులపాటు జరిగే కార్యాశాల ద్వారా తెలుసుకోవాలన్నారు. ఆగమ అధ్యాపకులు, డీన్ డాక్టర్ రాజేష్కుమార్, డాక్టర్ నీలకంఠం, రామకృష్ణ, భరతశేఖరాచార్యులు, కార్తికేయన్ పాల్గొన్నారు. వెండి నాగపడగల తయారీ కేంద్రంలో ప్రమాదం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని వెండి నాగపడగల తయారీ కేంద్రంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వెండి కరిగించేందుకు ఉపయోగించే గ్యాస్ పైపు ఊడిపోవడంతో మాధవ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈఓ బాపిరెడ్డి స్పందించి ఆలయం తరఫున ఆర్థిక సాయం అందించారు. అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాలిటెక్నిక్ స్పోర్ట్స్మీట్ ప్రారంభం తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–26 బుధవారం కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్వీయూ రీజియన్ ఆర్జేడీ నిమ్మల కుమార్ ప్రియ, ఏయూ రీజియన్ ఆర్జేడీ రామచంద్రరావు ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్మీట్ను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. తొలిరోజు బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, లాంగ్, హైజంప్ పోటీలు నిర్వహించారు. కాపు సంఘం చైర్మన్ వరప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమల బాషా, నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ ద్వారకనాథ్రెడ్డి, పీడీ రాజీవ్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు, 15 మంది కేంద్రకమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్గో ఏజెన్సీకి అవకాశం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: చంద్రగిరి, పాకాల, రంగంపేట, పాపనాయుడుపేట, ఏర్పేడు, తడ, శ్రీసిటీ, నాగలాపురం, మేనకూర్ సెజ్ ప్రాంతాల్లో ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ఏపీబీ(ఆథరైజ్డ్ పార్సెల్ బుకింగ్) ఏజెన్సీ నిర్వహణకు అవకాశం ఉందని కమర్షియల్ ఏటీఎం తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ తీసుకొని కార్గో వ్యాపారం చేయడానికి ఆసక్తి గలవారు డిపాజిట్ చెల్లించాలన్నారు. అందుకుగాను బుకింగ్ నెట్ అమౌంట్కి 15 పర్సెంట్ రిసీవింగ్కి 2 పర్సెంట్ కమీషన్ లభిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు ఏటీఎం కమర్షియల్ తిరుపతి 73311 47268 లేదా పురుషోత్తం 95538 55667 నెంబర్లను సంప్రదించాలని కోరారు. సత్వర సేవలే లక్ష్యం తిరుపతి కల్చరల్: డిజిటల్ పద్ధతిలో అత్యాధునిక సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ఎంఎన్వీ కేర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎంఎన్వీ సొల్యూషన్స్ ఎండీ ఎంఎన్.వెంకటేష్ తెలిపారు. అశోక్నగర్లోని తమ కార్యాలయంలో ఎంఎన్వీ కేర్ యాప్ను బీఎస్ఎన్ఎల్ డీజీఎం వెంకోబారావు బుధవారం ఆవిష్కరించారు. యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. -
జనసేన నాయకుల ఇసుక దోపిడీ
కలువాయి(సైదాపురం): రాజుపాళెంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి వెంకటరెడ్డి, ఇతర జనసేన నాయకులు అక్రమంగా ఇసుకను తరలించేశారు. సిమెంట్ రోడ్లు నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా పెన్నా నదికి తూట్లు పొడుస్తున్నారు. పగలు అయితే గ్రామస్తులు అడ్డగిస్తారని అర్ధరాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. తరలించిన ఇసుకను డంపింగ్ చేసి పెట్టుకున్నారు. తెలుగు రాయపురంలో టీడీపీ నేతలు, రాజుపాళెంలో జనసేన ఇలా పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుకను తరలించేందుకు వాటాలు పంచుకుంటున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఇక యుద్ధమే..
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇక యుద్ధం మొదలుపెడతాం.. ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అవినీతిని ప్రజల ముందు పెడతాం.. రాష్ట్రంలో వున్న 175మంది ఎమ్మెల్యేల్లో పులివర్తి నాని అంత అవినీతి పరుడు మరెవ్వరు లేరని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఎక్కడెక్కడ ఎంత సంపాదించారు, ఏయే భూములు కాజేశారన్న వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ హెడ్ ఆఫీసుల నుంచి కూడా విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.. అనునిత్యం దోచుకో.. దాచుకో.. అన్నట్టుగా ప్రకృతి వనరులను దోచేస్తున్న నాని తాను నీతిమంతుడనని కబుర్లు చెప్పుకుంటూ నిజాయతీగా బతికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రూ.300 కోట్ల అవినీతి గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో రూ.300 కోట్లు చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతితో సంపాదించారని ఆరోపించారు. తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెవిరెడ్డి మోహిత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయించి అందులో వాటాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఆయన గెలవగానే మొదటగా తాను అభినందించానని, ప్రజలు అవకాశం ఇచ్చారు బాగా పరిపాలన చేయమని కోరుకున్నట్టు తెలిపారు. ఒక ఏడాదిన్నర లోపు ఇంత అవినీతి చేస్తారని, ప్రజలను ఇంతలా పీడిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రతిరోజు ఎమ్మెల్యే నాని ఇంటికి అవినీతి సొమ్ము రాకపోతే వారికి నిద్ర పట్టదని, ఎంత దోచేసినా ప్రజలకు సాయం చేయడానికి మనస్సు రాదన్నారు. చంద్రగిరిలో జరిగే అవినీతి, అక్రమాలపై పోరాడుతాం... కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి పాల్పడ లేదని ఆయన కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. నిజాయతీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసి ఆ సంపాదనలో 90 శాతం ప్రజలకే ఖర్చు పెట్టిన చెవిరెడ్డి కుటుంబంపై నిందలు వేయడం మంచిది కాదని హెచ్చరించారు. రాజకీయాల్లో అత్యధిక శాతం ప్రజల కోసమే బతికిన తన తండ్రి చెవిరెడ్డి చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటారని తెలిపారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిని అడుగుతుంటే సాయం చేయడం చేతకాక చేసిన వారిపై అపనిందలు వేస్తున్నారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఒక అవినీతి తిమింగలంగా మారారని, ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు. లాలూచీ పడడం తెలియదు.. అందుకే జైలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటం చేయడం తప్ప అధికార పార్టీ నేతలతో లాలూచీ పడడం తమకు తెలియదన్నారు. ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేయడంతోనే మద్యం అక్రమ కేసులో తన తండ్రి చెవిరెడ్డిని జైలుకు పంపారన్నారు. ఆ విషయం ప్రజలు అందరికీ తెలుసనన్నారు. అవసరానికి కాళ్లు పట్టుకోవడం అవసరం తీరాక నిలువునా ముంచేయడం ఎమ్మెల్యే నానికి తెలిసినంత తమకు తెలియదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎవరెవరి ద్వారా ఎన్ని పనులు చేసుకున్నారో తనకు తెలుసునని, అలా రాజీ పడడం తమకు తెలియదు అన్నారు. సమావేశంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మస్తాన్, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, యారాశి శంకర్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి ఉన్నారు. -
సిద్ధార్థలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
నారాయణవనం: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు నిర్వహించే సిల్వర్ జూబ్లీ సావనీర్ను కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. బుధవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి అశోకరాజు దంపతులు రుత్వికులు గణపతి, సరస్వతి, సుదర్శన హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో ప్రతి రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్లపై ప్రాజెక్ట్, పేపర్ ప్రజెంటేషన్లు, సెమినార్లు, క్రీడల పోటీలు, అకడెమిక్ ఎక్స్పర్ట్స్ ప్రసంగాలు, అవార్డులు, నృత్య ప్రదర్శనలు ఉంటాయని అశోకరాజు తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో 24 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ ఇందిరవేణి, డైరెక్టర్ చాందిని, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్టార్టర్లు, కాపర్ చొరీ పెళ్లకూరు: మండలంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్ కాపర్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు రైతులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. పెళ్లకూరు, టెంకాయతోపు, రావులపాడు, భీమవరం, కానూరు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న 40కి పైగా స్టార్టర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులో ఉన్న కాపర్తోపాటు ఆయిల్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. తరచూ స్టార్టర్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మట్టిమాఫియా ఆగడాలు
ఏర్పేడు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలోని చిందేపల్లిలో కొందరు టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి గ్రామ శివార్ల నుంచి రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. ఎస్టీ కాలనీ సమీపంలో చెరువు పోరంబోకు స్థలంలో మట్టిని జేసీబీల సాయంతో తవ్వి ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్లు వరుసపెట్టి పెద్ద శబ్దాలు చేసుకుంటూ మట్టిని తీసుకెళ్తుండడంతో ఎస్టీ కాలనీవాసులకు రాత్రిళ్లు నిద్ర కరువవుతోంది. చిందేపల్లి సమీపంలోని తిరుపతివాసులకు ఇళ్లు కేటాయించిన జగనన్న కాలనీ మధ్యలోనే మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే అధికారగణం కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అలాగే మండలంలోని కృష్ణాపురానికి వెళ్లే మార్గంలో అడవి నుంచి వచ్చే వాగులో మట్టిని టిప్పర్ల సాయంతో ఎత్తేసి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షాత్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా మండలంలో మట్టిమాఫియా ఆగడాలు అదుపులోకి రావడం లేదు. మండలంలోని పాగాలి జగనన్న కాలనీలోని ఓ చెరువులోనూ నిత్యం మట్టి ఎత్తుతూ ఓ టీడీపీ నేత సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి మట్టిమాఫియా ఆగడాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
దశాబ్దాల డివిజన్
దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి ఐదు జిల్లాలవాసుల కల.. చినుకులా మొదలైన ఉద్యమం.. తారస్థాయి చేరింది. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రతి ఒక్కరి మది నిండా ఉంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కూటమి ఎంపీలు సహకరించాలని ప్రజానీకం కోరుతోంది. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి గళమెత్తాలని స్పష్టం చేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తోంది.తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఆధ్యాత్మిక క్షేత్రంన తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఈ సారైనా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారా లేదా..? అనే అంశం ఐదు జిల్లాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా చేయాలనే ప్రజల ఆకాంక్ష నేరవేర్చేలా ఏపీ ఎంపీలు గళమెత్తి నినదించాల్సిన అవసరముంది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో సానుకూల నిర్ణయం ఉంటుందనే ఆశాభావం రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యమం.. ఉధృతం బాలాజీ రైల్వే డివిజన్కు కేంద్రం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఐదు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. డివిజన్ ఏర్పాటుకు అనుకూల అంశాలు ఉన్నా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని, కొత్త డివిజన్లు, రైలు మార్గాలు ప్రకటన వెలువడుతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు. రైల్వేట్రాక్ మీద రాజకీయ భవిష్యత్తును ఉంచుకునే దిశగా కేంద్రం బడ్జెట్ రూపకల్పన ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఇందులో భాగంగా బాలాజీ రైల్వేడివిజన్కు చోటు లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే డివిజన్ ఏర్పాటుకు రైల్వేబోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే డివిజన్ సాధన సమితి చేపట్టిన ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కడప. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది. ఐదు జిల్లాల ప్రజల ఆకాంక్ష నెరవేరేనా? -
వీళ్లా పాలించేది
మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే మహిళలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అలాంటిది ఎమ్మెల్యేలే ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. సీ్త్రల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లా మనల్ని పాలించేది. ఆడవారిపై ఎవరైనా చేయివేస్తే నరుకుతానని ప్రకటించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆచరించి చూపాలి. బాధితురాలికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. – నదియా, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి, తిరుపతి సిగ్గుచేటు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కూటమి ఎమ్మెల్యేలు కొందరు కీచకులుగా మారిపోయారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. బెదిరింపులతో లొంగదీసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. దీనిపై చంద్రబాబు, పవన్కల్యాణ్తోపాటు హోంమంత్రి అనిత కూడా స్పందించాలి. కీచక ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలి. – చంద్రకళ, ప్రజాతంత్ర మహిళా సంఘం మండల కార్యదర్శి, నాయుడుపేట -
లోపాల రీసర్వే
వరదయ్యపాళెం: రీసర్వేతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సమస్యలు తీరి రికార్డు పక్కాగా అనుభవదారుడి పేరిట చేయాలన్న రీసర్వే లక్ష్యం అధికారుల అలసత్వానికి నీరు గారుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా పరిష్కారం కాని వైనం. అయితే రీసర్వేకు ఎంపికై న గ్రామాల్లో సగానికి పైగా సమస్యలు అలానే ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి మ్యుటేషన్, కరక్షన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే వీటికి సంబంధించి సర్వర్లను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో రోజువారీ సచివాలయాలు, మీసేవల చుట్టూ అర్జీదారులు తిరుగుతున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఇటు మండల తహశీల్దార్ కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తుతున్నారు. వరదయ్యపాళెం మండలంలో మొదటి దశ కింద అప్పటి ప్రభుత్వంలో కోవూరుపాడు, నెల్లటూరు, అయ్యవారిపాళెం గ్రామాలు రీసర్వేకు ఎంపికయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా గడిచిన మూడేళ్ల నుండి సర్వే ప్రక్రియ పూర్తికాలేదు. అంతేకాక సమస్యలు సైతం పుట్టుకొస్తున్నాయి. పాసు పుస్తకాల పంపిణీకి హడావిడి ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి కోవూరుపాడు రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 169 మంది రైతులకు చెందిన భూఖాతాలు ఉన్నాయి. అందులో 74 మంది రైతుల ఖాతాలకు సంబంధించి అన్ని వివరాలతో సక్రమంగా ఉన్నవిగా గుర్తించారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఈకేవైసీ సైతం చేపడుతున్నారు. అయితే సర్వే నెంబర్లు కొన్ని నమోదు కావాల్సి ఉందని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సర్వర్ల సమస్య ప్రధానంగా రీసర్వేలో సమస్యల పరిష్కారం జరగాలంటే సర్వర్లు ఓపెన్ కావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. రోజువారీ జిల్లా ఉన్నతాధికారులు హడావిడి చేస్తున్నారే గానీ అందుకు సంబంధించి విడుదల చేయాల్సిన సర్వర్లు మాత్రం పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో వచ్చే అర్జీదారులకు సమాధానం చెప్పలేక, సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్నారు. -
స్పోర్ట్స్ మీట్కు సర్వ సిద్ధం
తిరుపతి సిటీ : ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్’అండ్ గేమ్స్ మీట్కు సర్వ సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు తిరుపతికి చేరుకున్నట్లు వెల్లడించారు. వారి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ప్రశాంతంగా ఒకేషనల్ ప్రాక్టికల్స్ తిరుపతి సిటీ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ను మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 కేంద్రాల్లో చేపట్టిన ఫస్ట్ఇయర్ ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్స్కు 406మంది విద్యార్థులకు గాను, 361మంది హాజరైనట్లు వెల్లడించారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 350 మందికి గాను 326మంది హాజరైనట్లు వివరించారు. స్విమ్స్లో ‘డయాబెటిక్ ఫుట్ క్లినిక్’ తిరుపతి తుడా : స్విమ్స్లో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ను మంగళవారం ప్రారంభించారు. స్విమ్స్ పద్మావతి ఆస్పత్రిలో డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ మాట్లాడుతూ డయాబెటిక్ కారణంగా పాదాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు సమగ్ర చికిత్స అందిస్తామన్నారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ హరిప్రసాద్ ఈ క్లినిక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని వెల్లడించారు. ఆయన పొడియట్రిక్, డయబెటిక్ ఫుట్ సమస్యల నివారణపై ప్రత్యేక శిక్షణ పొందారని వివరంచారు. ఫుట్ పరిశీలన, ప్రమాద స్థాయి అంచనా, న్యూరోపతి, ఇస్కీమియా ఇన్ఫెక్షన్ గుర్తింపు, గాయం సంరక్షణ, శస్త్ర చికిత్స వంటి సేవలందించనున్నట్లు వివరించారు. డాక్టర్ అలోక్ సచిన్, డాక్టర్ ముక్తేశ్వరయ్య, డాక్టర్ ఉషా కళావత్, డాక్టర్ కోటి రెడ్డి పాల్గొన్నారు. -
పేదలకే భూములు దక్కాలని ఆందోళన
పెళ్లకూరు: నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు నిరుపేదలకే దక్కాలంటూ ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన పలువురు దళితులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబరు 1లో 61ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ భూములను పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామంలోని దళితులు సంబంధిత భూముల్లోకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఆర్ఐ సంతోషిణిబాయి, సర్వేయర్ సుప్రజ, లక్ష్మణ్ భూముల వద్దకు చేరుకొని పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి వరకు భూముల్లోకి ఎవ్వరూ దిగకూడదని హెచ్చరించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి తిరుపతి మంగళం : వాహన డ్రైవర్లతో పాటు ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి సూచించారు. మంగళంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు. కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. వాహన డ్రైవర్లకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, హైదరాబాదు నుంచి విజయవాడకు వస్తున్న బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణించిన విషయాన్ని వాహనదారులకు గుర్తు చేశారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకుండా ప్రమాద బీమాను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎస్.వెంకటేశ్వరరావు, మోటారు వాహనాల తనిఖీల అధికారులు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, ప్రసాద్వర్మతో పాటు డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
అన్ని అర్హతలు ఉన్నాయి
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖ జోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజనే అని భావిస్తున్నా. అన్ని అర్హతలు బాలాజీ డివిజన్కు ఉన్నాయని రైల్వే నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నాఉ. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా ఆడుగులు వేయాలని కోరుతున్నా. – పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట గట్టిగా వాణి వినిపిస్తా మరుగున పడిన తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వెలుగులోకి తెచ్చా. పలుమార్లు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లా. రైల్వే డివిజన్ ఏర్పాటుకు సాధన సమితి ఉద్యమ నాయకులు సహకారం కోరారు. వారి వినతులను స్వీకరించా. బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా వాణి వినిపించి రైల్వేడివిజన్ సాధనకు కృషి చేస్తా. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి పూర్వ వైభవం బాలాజీ డివిజన్ ఏర్పాటుకు తిరుపతి చాలా అనుకూలం. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. గతంలో కూడా అధికారులు పరిశీలనలు కూడా చేశారు. తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు అమలు చేయాలని పెద్దల సభలో చర్చించా. కొత్త డివిజన్ ఏర్పాటుతో ఐదు జిల్లాలకు పూర్వవైభవం వస్తుంది. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
నేటి నుంచి భూ సర్వేకు బ్రేక్!
తిరుపతి అర్బన్ : జిల్లాలో భూ సర్వే పనులను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లియాకత్ అలీ, కార్యదర్శి జ్యోతిగన్ వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా సర్వే అధికారి అరుణ్కుమార్కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రమోషన్లు, బేసిక్ పే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు రూ.32వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కనీస అర్హతను ఐఐటీ నుంచి డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్కు మార్పు చేయాలని కోరారు. రీ సర్వేలో భాగంగా సాంకేతిక పనులు నిర్వహిస్తున్నందుకు టెక్నికల్ అలవెన్స్ ఇప్పించాలన్నారు. రీసర్వేకు అవసరమైన లాప్టాప్లు, రోవర్లు, స్టేషనరీని సరిపడా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
సైన్స్ సెంటర్లో బయోమిమిక్రీ గ్యాలరీ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ప్రకృతి స్ఫూర్తితో సైన్స్ అనే థీమ్తో నూతనంగా ఏర్పాటు చేసిన బయోమిమిక్రీ గ్యాలరీని మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్) డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య హాజరై గ్యాలరీని ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులతో కలిసి గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. తిరుపతి సర్కిల్ అటవీ అధికారి సి.సెల్వం, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం(వీఐటీఎం) డైరెక్టర్ సాజు భాస్కరన్, సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్టీ పురుషోత్తమ, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణరాజు పాల్గొన్నారు. పీఆర్ఎస్ఐ తిరుపతికి బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు తిరుపతి అన్నమయ్యసర్కిల్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) తిరుపతి చాప్టర్కు జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి.రవి చేతుల మీదుగా మంగళవారం చాప్టర్ చైర్మన్ డాక్టర్ జీఎస్.ప్రసాద్, కార్యదర్శి దుద్యాల చంద్రమోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు అందుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాథక్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పీఎల్కే మూర్తి, వైస్ ప్రెసిడెంట్ (సౌత్) యుఎస్.శర్మ కలిసి తిరుపతి చాప్టర్కు బెస్ట్ చాప్టర్ అవార్డును ప్రకటించారు. సీపీఆర్ఓను పీఎస్ఆర్ఐ తిరుపతి చాప్టర్ కార్యవర్గ సభ్యులు మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోశాధికారి కె.మధుసూదన్, జాయింట్ సెక్రటరీ సంస్కార్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి, వివి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. దేశీయ పద్ధతిలో చెరకు సాగు పరిశీలన తిరుపతి రూరల్: వేమూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సాగు రైతు అయ్యప్పనాయుడు పొలంలో కొత్తరకం చెరకు(16టి7) రకాన్ని దేశీయ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ఆ విధానాన్ని మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం.రెడ్డికుమార్, బ్రీడింగ్ విభాగం శాస్త్రవేత్త ఠాగూర్, మండల వ్యవసాయ అధికారి సుబ్బారావు పరిశీలించారు. ప్రకృతి వనరులతో తయారు చేసిన ఎరువుల వాడకం, పంట సాగులో సరికొత్త పద్ధతులతో చెరకు పంట ఏపుగా పెరగడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వివరాలను రైతు ద్వారా తెలుసుకున్నారు. ఏనుగుల బీభత్సం – తుమ్మచేనుపల్లిలో పంటలు ధ్వంసం భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని తుమ్మచేనుపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్రెడ్డి మామిడి తోటలోకి సోమవారం రాత్రి చొరబడిన ఏనుగులు పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. తోటలోని 30 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు నేలమట్టం అయ్యాయి. దీంతో రైతు లక్ష్మణ్రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేయాలని, ఏనుగుల దాడులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
తప్పులు లేని పాస్ పుస్తకాలు అందించండి
తిరుపతి అర్బన్: సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం చూపాలని చెప్పారు. ఈకేవైసీ, మ్యుటేషన్, డిజిటల్ సైన్ తది తర సమస్యలకు పరిష్కారం చూపాలని వెల్లడించారు. ఆ మేరకు ఆర్డీవోలు పర్యవేక్షించాలని వివరించారు. అనంతరం రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై అధికారులతో సమావేశం అయ్యా రు. ఏ పనులు ఏయే దశల్లో ఉన్నాయో తెలుసుకు న్నారు. పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించా రు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నేషనల్ హైవే పీడీలు, ఆర్డీవోలు పాల్గొన్నారు. సూపర్ మార్కెట్లో చోరీ తిరుపతి క్రైమ్: నగరంలో ఐఎస్ మహల్ సమీపంలోని ఎస్మార్ట్ సూపర్ మార్కెట్లో చోరీ జరిగిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్మార్ట్ సూపర్ మార్కెట్ల్లోకి సోమవారం అర్ధరాత్రి తర్వాత షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. 15 నిమిషాల్లోనే షాపులో ఉన్న లక్షల రూపాయల నగదు దోచుకెళ్లినట్లుగా గుర్తించారు. ముగ్గురు దుండగులు ముసుగు వేసుకొని ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిపై షాపు యజమాని జాబీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెప్పపై శ్రీపార్థసారథి స్వామి విహారం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీరుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్వామివారు దేవేరులతో కలిసి తెప్పను అధిరోహించి పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బుధవారం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రదర్శించిన హరికథాగానం, భజనలు, సంగీత విభావరి భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు. -
శ్రీరంగ నీతులు ఆపండి
మహిళలకు అన్యాయం జరిగితే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పదే పదే చెప్పేవారు. చివరుకు తాను తప్పు చేసినా ఉరి తీయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే చెప్పారు. అప్పుడు మహిళల రక్షణ పై ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న శ్రీరంగనీతులు చెప్పడం అపి రైల్వేకోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి. – కుమారి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, మహిళ సమాఖ్య ఏదీ చిత్తశుద్ధి రైల్వే కోడూరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మహిళలు ఎవరైనా ఒక్కటే. అందులో ప్రభుత్వ ఉద్యోగిని వేధించి భయాందోళనకు గురిచేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యం పై ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వచ్చింది. ఎంత వేధించి ఉంటే ఆ మహిళ అంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది. ఇప్పటికై న చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చిట్టెమ్మ, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి, ఐద్వా -
మైనారిటీ నేత ఇల్లు కూల్చివేతకు యత్నం
శ్రీకాళహస్తి: పట్టణంలోని అయ్యలనాడుచెరువు ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీ మైనారిటీ నాయకుడు అమాన్ గత ప్రభుత్వంలో కట్టుకున్న ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికార యంత్రాంగం మొత్తం కదలివచ్చింది. అయ్యలనాయుడుచెరువు మొత్తం కూడా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారే. అయితే వైఎస్ఆర్ సీపీ నేత కావడంతో అమాన్కు గండంగా పరిణమించింది. గత నెల 20వ తేదీ కోర్టును ఆశ్రయించగా మూడు వారాల్లో సంబంధిత పత్రాలను పురపాలక అధికారులకు సమర్పించాలని సూచించింది. అయితే తను పత్రాలు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా అధికారులు తీసుకోలేదని బాధితుడు అమాన్ తెలిపాడు. కదిలివచ్చిన యంత్రాంగం పురపాలక కమిషనర్, డీఎస్పీ, ముగ్గురు సీఐలు, సుమారు 15మంది పోలీసులు, సుమారు 15 మంది పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు 15 మంది, రెండు జేసీబీలతో ఉదయం ఇంటి వద్దకు చేరుకున్నారు. అమాన్ను టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించి కూల్చివేయాలని ప్రయత్నించారు. అయితే అవమాన్ కుటుంబసభ్యులు పెట్రోల్ బాటిల్ పట్టుకుని, బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇంటికి వెళ్లే విద్యుత్ కనెక్షన్, వాటర్ పైపులైను, సీసీ కెమెరాను, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే ౖపైపులైన్లను పురపాలక సంఘం అఽధికారులు పగులగొట్టారు. చివరకు బుధవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బుధవారం సాయంత్రం వరకు గడువు ఇస్తారా లేక రాత్రికి రాత్రే తొలగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సుమారు 400 ఇళ్లు, పునాదులు ధ్వంసం చేశారు. ఈ చర్యలతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురయ్యారు. -
నదిలో మునిగిపోయి ఇద్దరి మృతి
చిట్వేలి:చిట్వేలి గుంజన నదిలోకి సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఇద్దరు మృతిచెందినట్లు ఎస్ఐ వినోద్కుమార్ తెలియజేశారు. తిరుపతి నెహ్రూ నగర్కు చెందిన షేక్ అప్రిద్ (30) తన కుమార్తె పుట్టెంట్రుకలు తీయించడానికి శనివారం రాత్రి చిట్వేలిలోని షేక్ సయ్యద్ సాదక్ వల్లి దర్గాకు సుమారు 15 మంది బంధువులతో చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బసచేసి ఆదివారం పుట్టెంట్రుకలు తీయించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు తిరుపతికి వెళ్లిపోగా ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు. షేక్ ఆసిస్ (14), నూరుల్లా (36) సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దర్గాకు దగ్గరలోని గుంజన నదిపై ఉన్న హైలెవల్ బ్రిడ్జి కిందకు పోయారు. ఈతకోసం బాలుడు ఆసిస్ నీటిలోకి దిగాడు. ఈతరాక మునిగిపోతుండగా బాలుడికి దగ్గర బంధువు అయిన నూరుల్లా కాపాడడానికి నీటిలోకి దిగి ఈత రాకపోవడంతో ఆయన కూడా మునిగిపోయి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వినోద్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సార్టెంట్ దేవరాజ్ హఠాన్మరణం తిరుపతి సిటీ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి విశ్రాంత ఎయిర్ఫోర్స్ సార్జెంట్ ఎస్.దేవరాజ్ (64) సోమవారం హఠాన్మరణం చెందారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని బాలాజీనగర్ లేఔట్లో నివసిస్తున్న ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. దేవరాజు కుటుంబంలో రెండు రోజుల్లోనే రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. దేవరాజ్ అక్క భర్త డేనియల్ శనివారం ఉదయం మృతి చెందడం గమనార్హం. వెంట వెంటనే రెండు విషాదాలు వాటిల్లడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు. ఎయిర్ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి సార్జెంట్ దేవరాజ్ భౌతికకాయానికి ఎయిర్ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి చాప్టర్ వారు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి అంజలి ఘటించారు. దేశానికి, క్రీడారంగానికి దేవరాజ్ చేసిన సేవలను కొనియాడారు. సంఘం సభ్యులు ఏఎస్బీ ప్రసాద్, బాలాజీ, ఎస్ఎస్ రెడ్డి, ఎస్ఎమ్కే కృష్ణమూర్తి, ఎస్బీన్ స్వామి, పి.సుధాకర్, సిద్ధయ్య, గిరిధర్సింగ్, సురేష్ కుమార్, జనార్ధన్, రత్న కుమార్, హర్షవర్ధన్రెడ్డి, డేవిడ్ రాజు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడికి రిమాండ్ సాక్షి టాస్క్ఫోర్స్ : పాకాల మండలం దామలచెరువుకు చెందిన అశోక్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడు విష్ణువర్ధన్కు సోమవారం పాకాల కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితుడిని చిత్తూరు జైలుకు తరలించారు. -
రేపటి నుంచి ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు
తిరుపతి కల్చరల్: సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వేడుకగా చేపడుతున్నట్లు ఆ కళాశాల చైర్మన్ కె.అశోక్ రాజు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న విద్యార్థులు వ్యర్థ వస్తువులతో తయారుచేసిన రోబో లు, గన్స్, హెలికాప్టర్ వంటి సుమారు 65 వస్తువులను ప్రదర్శన ఉంటుందన్నారు. 30న కళాశాలలోని అన్ని విభాగాల వర్క్షాపు, 31న ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థుల ప్రాజెక్టు ఎగ్జిబిషన్, ఫిబ్రవరి 1న 24 గంటల పాటు హ్యాకథాన్ పేరుతో 1,750 డెలిగేట్ల వివిధ అపరిష్కృత సమస్యల పరిష్కార మార్గాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో సమస్య పరిష్కారాలు చూపిన వారికి రూ.3.50లక్షలను బహుమతిగా ఇస్తామని వెల్లడించారుు. 2న అన్ని విభాగాల కార్యక్రమాల నిర్వహణ, 3న నైపుణ్యాలపై పత్రాలు సమర్పణ, 4న మన సంస్కృతి,సాంప్రదాయాలు తెలిపేలా ప్రముఖ ప్రవచనకర్త ప్రసంగం, 5న పేరెంట్స్ డే, 6న స్పోర్ట్స్ డే, 7న తమ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులతో జూనియర్లకు ఆన్లైన్ తరగతుల, 8న సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు. కళాశాల వేడుకలకు సినీ నటి మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గంగ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహంతొట్టంబేడు : తెలుగుగంగ కాలువలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడింది. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలోని తెలుగంగ కాలువ సబ్ కెనాల్ గేట్ల వద్ద ఓ మహిళ మృతదేహం కాలువ నీటిలో కొట్టుకుంటూ పోతోందని గమనించిన గ్రామస్తులు ఎస్ఐ బాలకృష్ణకు తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన మహిళ వయసు 55 ఏళ్లు ఉంటుందని, ఆమె వద్ద శ్రీకాళహస్తి పట్టణంలోని మాధురి గోల్డ్ సంస్థ పర్సు ఒకటి ఉందని, అందు 460 రూపాయల నగదు కూడా ఉందని తెలిపారు. ఒక్కో చేతికి ఒక్కో ఇత్తడి రంగు గాజు, చెవులకు బంగారు వర్ణం కమ్మలు ఉన్నట్టు గుర్తించారు. మృతురాలి ఆచూకీ తెలిసినవారు. బుచ్చినాయుడు కండ్రిగ సీఐ 9440796763, ఎస్ఐ 9440900724 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసుల అవినీతిపై ఏసీబీ దర్యాప్తు నాయుడుపేటటౌన్ : పట్టణంలోని అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్రాజు అవినీతిపై ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సీఐ అవినీతి చిట్టాను పూర్తిస్థాయిలో వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ మల్లికార్జున సోమవారం సాయంత్రం నాయుడుపేటలోని సీఐ బాబీ, హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర వైన్షాపు నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు సీఐ, హెడ్కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే అవినీతి పోలీసుల అక్రమాస్తులను లెక్కగట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితుల ఇళ్లలోని నగదు, బంగారు నగలు సైతం స్వాధీనం చేసకుని వివరాలను నమోదు చేస్తున్నారు. సీఐ బాబీకి సంబంధించి నెల్లూరు, ఆయన స్వగ్రామమైన మాచర్ల తదితర ప్రాంతాల్లో కూడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్:వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయా లని పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు సురేష్బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు వైఎస్సార్సీపీ రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశా రు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి జగనన్న విప్లవాత్మకంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. బాబు పాలనపై జనం విసిగిపోయారని, రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కో–ఆర్డినేటర్ వజ్రం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలను అధినేతన జగనన్న, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వెల్లడించారు. అందుకే ఏమాత్రం అలసత్వం వహించకుండా సమష్టిగా పనిచేసి ఫిబ్రవరి 15వ తేదీలోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీఎమ్మెల్యే గుంటివెంకటేశ్వరప్రసాద్కు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, పార్టీ ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట మండలాల అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, ముస్తాక్, పంజంవే ణుగోపాల్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు లు రత్నమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మారెళ్ల రాజేశ్వరి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్కుమార్రెడ్డి, యనమాల మహేష్, నందాబా ల, డీవీ రమణ, రత్తయ్య, సుబ్బరామరాజు, జనార్ధన్రాజు, హరికృష్ణారెడ్డి, బండారుమల్లి, ముజీబ్, సుదర్శన్రెడ్డి, ఘని ఆర్వీ రమణ, లక్ష్మీనారాయణ మ్మ, రాజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కల్తీ ఎక్కడ బాబూ?
కార్వేటినగరం: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మత విధ్వేషాలు రగిల్చి ఓ వర్గాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరం చేయాలన్న కుట్రకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోసిందని మాజీ డెప్యూటీ మాజీ నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకపోయినా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి డైవర్షన్ రాజకీయాలు చేసినట్లు చెప్పారు. తీరా కల్తీ జరగలేదని తేలుతుండడంతో ఇప్పుడు పామాయిల్ వాడినట్లు కొత్త నాటకారానికి తెరదీశారన్నారు. లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏరోజుటికై నా అవాస్తవమని తేలుతుందని, ఆ రోజు వారికి శిక్ష పడడం ఖాయమని స్పష్టం చేశారు. దేవుళ్లకు కులాలను అంటగట్టి రాజకీయ లబ్ధిపొందాలన్న దురాలోచన కూటమి నేతలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా 1.5 సెంటు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడితే దాన్ని కూడా వక్రీకరించారన్నారు. నేను అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ప్రజలను నమ్మబలికినట్లు గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం వెచ్చించకూడదా? రూ.కోట్ల ప్రజాధనాన్ని ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు వెచ్చించే బదులు పేద ప్రజల సంక్షేమం కోసం ఎందుకు వెచ్చించకూడదని నారాయణస్వామి ప్రశ్నించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్ఆర్పేట కొండను తచ్చూరు రోడ్డు పేరుతో భారీగా తవ్వకాలు జరిపి రోజూ వందల టిప్పర్లలో గ్రావెల్ను చైన్నెకి తరలించి రూ. కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీలు జిల్లా కలెక్టర్కు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మైనింగ్ శాఖలో ఓ అధికారి కూటమి నేతలతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలో గీతం ప్రైవేటు యూనివర్సిటీకి అప్పనంగా 54.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నట్లు నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరంచేసి పేదలను ఉన్నత విద్యకు దూరం చేసినట్లు గుర్తుచేశారు. గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తీసుకొస్తే దానిపై కూడా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రయివేటు వర్సిటీకి ప్రభుత్వ భూములా? -
ఆర్థిక వ్యవస్థ బలోపేతం
వాణిజ్య ఉపగ్రహాలతో.. సూళ్లూరుపేట : వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. సోమవారం షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మకుమార్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పేస్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులను, అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందో మహానుభావులు ప్రాణత్యాగాల ఫలితాలను మనం అనుభవిస్తున్నామన్నారు. యువత బాగా చదువుకుని దేశానికి ఉపయోగడే సైంటిస్టులుగా తయారు కావాలని కోరారు. యువభారత్ రాబోయే 25 ఏళ్లలో శక్తివంతమైన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఇస్రో అర్థవంతమైన పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఎల్వీఎం3 రాకెట్ల ద్వారా 5 టన్నుల నుంచి 6 టన్నుల ఉపగ్రహాలను సునాయాసంగా ప్రయోగిస్తోందని వివరించారు. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చి మనదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఎస్ఎప్ కమాండెంట్ సంజిత్కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ నిధి, షార్ ఎంఎస్ఎం డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ
తిరుపతి రూరల్:మండలలోని పెరుమాళ్లపల్లెలో ‘యంగ్ మెన్స్ రిక్రియేషన్ క్లబ్ వారు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ హోరా హోరీగా సాగింది. రెండు రోజులుగా నిర్వహించిన పోటీలకు ఏపీతోపాటు త మిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి 60 జట్లు పాల్గొన్నా యి. క్రీడాకారులు అందరికీ వసతి, భోజన సదుపా యాలను నిర్వాహకులు కల్పించారు. విజేతలకు 1.25 లక్షల నగదు బహుమతులు, ట్రోఫీలను అందించారు. పట్టుకో.. పట్టుకో.. రిపబ్లిక్ డే రోజున సోమవారం కబడ్డీ టోర్నమెంట్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రెండు కోర్టుల్లో క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో తలపడ్డారు. పట్టుకో.. పట్టుకో.. అంటూ ప్రేక్షకులు క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. విజేతలు వీరే.. కబడ్డీ పోటీల్లో పాల్గొన్న 60 జట్లులో మొదటి స్థానంలో బెంగుళూరు రాయల్స్, రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన సేలం జట్టు, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సదుం జట్టు, నాలుగో స్థానంలో ఏపీకి చెందిన మహదేవజట్లు నిలిచాయి. విన్నర్స్కు రూ.50వేలు, రన్నర్స్కు రూ.35వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25వేలు, నాలుగోస్థానంలో నిలిచిన వారికి రూ.15వేలు అందించారు. -
సోలార్ వెలుగుల్లో గ్రామీణం
తిరుపతి రూరల్ : గ్రామీణ ప్రాంతాలను సోలార్ వెలుగుల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ శివశంకర్ తెలిపారు. సోమవారం ఎస్పీడీసీఎల్ కార్యలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండియన్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి 5 జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని 54 విద్యుత్ సంస్థల్లో ఏపీ ఎస్పీడీసీఎల్ 27వ ర్యాంకుతో గ్రేడ్–బిలో స్థానం దక్కించుకోవడం గర్వకారణమని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని వివరించారు. 2.07లక్షల రూఫ్టాప్ ప్లాంట్లు ఎస్పీడీసీల్ పరిధిలో 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక్కో గృహానికి 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద ఇప్పటి వరకు 16 వేల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయడం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఉత్తమ సేవలకు ప్రశంస విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు, బెస్ట్ సర్కిల్, బెస్ట్ డివిజన్, బెస్ట్ సబ్–డివిజన్, బెస్ట్ సెక్షన్లకు సీఎండీ శివశంకర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.వీరిలో చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం. మురళీ కుమార్, ఎన్. శోభావాలెంటీనా, జనరల్ మేనేజర్లు టీఎస్. రాజశేఖర్ రెడ్డి, జి. చక్రపాణి ఉన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఆర్. పద్మ, పీహెచ్ జానకిరామ్, కె. ఆదిశేషయ్య, ఎం. ఉమాపతి, ఎం.కృష్ణా రెడ్డి, జాయింట్ సెక్రటరీ యం. గోపాలకృష్ణ, చీఫ్ విజిలెన్న్స్ ఆఫీసర్ కె. జనార్ధన్ నాయుడు, సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ ఎ. శ్రీనివాస ఆంజనేయమూర్తి పాల్గొన్నారు. -
సత్కారం.. రుణసాయం
హోరాహోరీగా అంతర్రాష్ట్ర కబడ్డీ టోర్నీ తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నీ హోరాహోరీగా సాగింది.సోలార్ వెలుగుల్లో గ్రామీణం గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉత్తమ సేవలకు పురస్కారం మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో పండుగ వాతావరణం ఆవిష్కృతమైంది. ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సంబరం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ఇనుమడింపజేసింది. ఈ క్రమంలోనే కలెక్టర్ చేతులమీదుగా జాతీయ జెండా సగర్వంగా ఎగిరింది. త్రివర్ణ పతాకం సమున్నతంగా రెపరెపలాడింది. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రతిభ కనువిందు చేసింది. ప్రగతి శకటాల పరుగు కట్టిపడేసింది. వినూత్నంగా చేపట్టిన డాగ్ షో అబ్బురపరిచింది. విభాగాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలోని సామగ్రి ప్రత్యేకతను చాటుకుంది. అలాగే ఉద్యోగుల విశిష్ట సేవలకు అవార్డులతో గుర్తింపు లభించింది. జాతీయ జెండా ఆవిష్కరించి వందనం సమర్పిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, పక్కన ఎస్పీ సుబ్బరాయుడుశ్రీవారి దర్శనానికి 20 గంటలుతిరుమల:తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు చేరుకుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,131 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. జాతీయ విద్యా సదస్సుకు సురేష్ కేవీబీపురం: కేవీబీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూనాటి సురేష్కు కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న జాతీ విద్యా సదస్సుకు ఆహ్వానం అందింది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు చేపట్టనున్నారు. పరీక్షలు సంస్కరణలు అనే అంశంపై ఢిల్లీలోని ఎన్సీఆర్టీ క్యాంపస్లో మంగళవారం నుంచి జరగనున్న సదస్సులో సురేష్ మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులు, విద్యాశాఖ అధికారులు, దేశంలోని అన్ని రాష్ట్రాల నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. ఎకై ్సజ్ సీఐకి సేవా పతకం నారాయణవనం: విజయవాడలో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలేఓ్ల పుత్తూరు ఎకై ్సజ్ సీఐ మురళీమోహన్కు ఉత్తమ సేవా పతకం లభించింది. ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు.తిరుపతి అర్బన్/ తిరుపతి క్రైమ్ : తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం మైదానంలో ఆయన ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి ఓపెన్ టాప్ వాహనంలో ముందుకు సాగుతూ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. అలాగే వివిధ శాఖలకు చెందిన ప్రగతి శకటాలు, పలు విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్ సందర్శించారు. అలరించిన విద్యార్థులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీరిలో ఉత్తమ ప్రతిభను కనబరచి మొదటి బహుమతిని తిరుపతిలోని శ్రీచైతన్య పాఠశాల పిల్లలు, రెండో బహుమతిని ఏర్పేడులోని ఎస్వోఎస్ చిల్ర్ట్న్స్ స్కూల్, మూడో బహుమతి చంద్రగిరిలోని అక్షరధామ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు దక్కించుకున్నారు. పోటీపడిన మిగిలిన పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్ చేతులమీదుగా అందించారు. ఈ క్రమంలోనే పోలీస్ జాగిలాలతో ప్రదర్శించిన డాగ్ షో విశేషంగా ఆకట్టుకుంది. తొమ్మిది ప్రగతి శకటాలు గణతంత్ర వేడుకల్లో అధికారులు పోటీలు పడి 9 ప్రగతి శకటాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో మొదటి బహుమతి విద్యుత్శాఖకు, రెండో బహుమతి వ్యవసాయ, ఉద్యానశాఖ, మూడో బహుమతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు దక్కింది. మద్దిలేటి, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ హారిక,డీఎఫ్ఓ, సూళ్లూరుపేట బాపిరెడ్డి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం చంద్రశేఖర్,ఎస్ఈ, ఎస్పీడీసీఎల్శ్రీరామ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్బాలాజీ నాయక్, మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఎస్ఈ, ఆర్అండ్బీసురేష్బాబు, తిరుపతి తహసీల్దార్రోజ్మాండ్, ఎస్డీసీదేవేంద్రరెడ్డి, ఎస్డీసీతిరుపతి అర్బన్/తిరుపతి క్రైమ్ : పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించిన వివిధశాఖల ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ మేరకు అవార్డులను అందించారు. ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, జేసీ గోవిందరావు, డీఆర్ఓ నరసింహులతోపాటు అవార్డు గ్రహీతల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఘనంగా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడైన రాజంపేట తాలూకా ఉర్లగట్టుపాడుకు చెందిన రామలింగరాజు వారసుడైన ఆయన కుమారుడు రాధాకృష్ణమరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు. అనంతరం డీఆర్డీఏ పీడీ శోభనబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి పథకాలకు చెందిన లబ్దిదారులకు రూ.410.60 కోట్ల మెగా చెక్కును అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రామచంద్రుడు, తిరుపతి, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. 11 స్టాళ్లు విభాగాల వారీగా 11 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో మొదటి బహుమతిని పశుసంవర్థక శాఖ, రెండో బహుమతి మత్స్య శాఖ, మూడో బహుమతి ఐసీడీఎస్ శాఖలకు లభించాయి. అలాగే వివిధ విభాగాలకు చెందిన 246 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ సేవల నేపథ్యంలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. -
వనరుల విధ్వంసం!
పచ్చటి పొలాలు.. ప్రశాంత వాతావరణం.. సగటు మనిషి స్వేచ్ఛగా జీవించేందుకు అనుకూలమైన ప్రాంతం చంద్రగిరి. అలాంటి ప్రస్తుతం ఇసుకాసురుల దాడులు.. రణగొణధ్వనులతో రాత్రింబవళ్లు తిరుగుతున్న భారీ టిప్పర్లు.. ప్రకృతి వనరులను కరిగించేస్తున్న జేసీబీలు.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చమూక అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నదులు.. వంకలు.. వాగులను తవ్వేస్తున్నారు. కొండలు.. గుట్టలను స్వాహా చేసేస్తున్నారు. మాఫియా ఏర్పడి వనరులను విధ్వంసం చేస్తున్నారు. అక్రమంగా రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. అధికారులు సైతం రాజకీయ ఒత్తిడికి తలొగ్గి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్ : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో గ్రావెల్ దందా కొనసాగుతూనే ఉంది. ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో రాత్రింబవళ్లు ఇసుక, మట్టి తవ్వకాలు.. తరలింపు సాగుతూనే ఉంది. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీ దళవాయి చెరువులో సుమారు 40 అడుగుల మేర తవ్వేసి గ్రావెల్ను తరలిస్తున్నారు. 15శాతం మేర కమీషన్ల రూపంలో వాటాలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లె, అనుప్పల్లె, గుండోడుకణం, నెత్తకుప్పం, రాయలచెరువు, సిద్ధేశ్వరగుట్ట ప్రాంతాల నుంచి వందలాది టప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించేసినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో సుమారు రూ.200కోట్లకు పైగా విలువైన మట్టిని అక్రమార్కులు కొల్లగొట్టారని స్పష్టం చేస్తున్నారు. మారిన రూపురేఖలు ఇసుక స్మగ్లింగ్కు చంద్రగిరి మండలం కేంద్రంగా నిలుస్తోంది. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో గత ఏడాదిన్నరగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతాలను భారీ యంత్రాల సాయంతో తవ్వేస్తున్నారు. పట్టపగలే జేసీబీలు, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించేస్తున్నారు. ఒక్కో ఇసుక ట్రాక్టర్ నుంచి నెలకు రూ.3వేల వరకు ఓ శాఖకు చెందిన అధికారికి ముడుపులు ముడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇసుకలోనే పట్టణంలోని ఓ మైనారిటీ నేత, మరికొందరు టీడీపీ యువ నేతలు రూ.కోట్లు కూడబెట్టినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా శానంబట్ల, రెడ్డివారిపల్లె, నాగయ్యగారిపల్లె, బుచ్చినాయుడుపల్లె, చంద్రగిరి, పనపాకం, శివగిరి, నరసింగాపురం ప్రాంతాల రూపురేఖలు ఇసుకాసురుల తాకిడికి పూర్తిగా మారిపోవడం గమనార్హం. -
● తెప్పోత్సాహం
శ్రీగోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజుసీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. – తిరుపతి కల్చరల్ రేపటి నుంచి స్పోర్ట్స్ మీట్ తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ వేదికగా బుధవారం నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం వరకు కొనసాగనున్న స్పోర్ట్స్ మీట్ రాష్ట్రంలోని పలు కళాశాలల నుంచి సుమారు 1,500మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సౌకర్యాలకు కల్పించనున్నట్లు వివరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఎన్నిక తిరుపతి సిటీ : ఎస్వీయూలో రెండు రోజులుగా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, సహాయ కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ కొత్త కమిటీని ప్రకటించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పవిత్ర, అక్బర్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, వినోద్, తేజ, రవీంద్ర, అనిత, మరో 21మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. -
పులికాట్లో పక్షుల లెక్కింపు
సూళ్లూరుపేట రూరల్ : పులికాట్ సరస్సుతోపాటు దొరవారిసత్రంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఆదివారం వాటర్ బర్డ్స్ సెన్సెస్ చేపట్టారు. డీఎఫ్ఓ హారిక మాట్లాడుతూ రెండు రోజులుగా పక్షుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముంబయికి చెందిన బీఎన్హెచ్ సొసైటీ, తిరుపతిలోని ఐఐఎస్ బృందం, క్రియా యూనివర్సిటీ విద్యార్థులు, వన్యప్రాణి విభాగం అధికారులు మొత్తం 8 బృందాలు లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. ఏఎస్పీ రవి మనోహరాచారికి రాష్ట్రపతి మెడల్ తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ మెడల్కు ఎంపికాయ్యారు. మన రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ మెడల్కు ఎంపికై న ఏకై క వ్యక్తి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన రవిమనోహరాచారి 1991 మ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు శాఖలోకి అడుగుపెట్టారు. శిక్షణ అనంతరం 1992లో చిత్తూరు జిల్లా ఐరాలలో ఎస్ఐగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. 2005లో సీఐగా పదోన్నతి పొంది చిత్తూరు ఈస్ట్, వెస్ట్, సర్కిళ్లు, సత్యవేడు, తిరుపతి టౌన్ సీఐగా పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుమల కై మ్ డీఎస్పీగా.. అనంతరం మదనపల్లి, కడప, నరసాపురం ప్రాంతాల్లో పనిచేశారు. తరువాత 2024 నుంచి తిరుపతి టౌన్ డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. తన సర్వీసుల్లో అనేక సంచలనమైన కేసులను చాకచక్యంగా దర్యాప్తు చేశారు. 2027లో ఆయన మెడల్ అందుకోనున్నారు. -
బ్రహ్మాండ తేజం
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ● శోభాయమానంగా ప్రకాశించిన తిరుగిరులు ● శ్రీమలయప్పస్వామికి విశేష వాహన సేవలు ● పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు సూర్యప్రభ వాహనంపై శ్రీవారుసూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడుబలోపేతమే లక్ష్యంగా కమిటీలు సూళ్లూరుపేట రూరల్ : వైఎస్సార్సీపీ మరింత బలోపేతమే లక్ష్యంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరపేట నియోజకవర్గస్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాథరెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తండిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు భీరేంద్రవర్మ, ఎన్డీసీసీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. కాకాణి మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, అనుబంధ సంస్థలకు కమిటీలు వేస్తున్నామన్నారు. 18లక్షల మందిని జగనన్న సైనికులుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. 19 నెలల చంద్రబాబు పాలనపై ప్రజలకు విసిగిపోయారని, వైఎస్సార్సీపీకి ఆదరణ పెరిగిందని వివరించారు. సర్కారు అరాచకాలు, దౌర్జన్యాలను వైఎస్సార్సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొంటున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలే తిరగబడ్డారని తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసాలను జనం గుర్తించారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నేతలను పార్టీ శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు వేళ్లపాలెం కృపాకర్రెడ్డి , తడ మండలం అధ్యక్షుడు కెలివి ఆర్ముగం, పెళ్లకూరు మండలం అధ్యక్షుడు వెంకటరత్నం, నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు ఓట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండలం అధ్యక్షుడు పాదర్తి హరనాథరెడ్డి, కలికి మాధవరెడ్డి, నేతలు జెట్టి వేణు, అలవల సురేష్ పాల్గొన్నారు. 25ఎస్ఎల్పి141 నేతలను గజమాలతో సత్కరిస్తున్న నేతలు 25ఎస్ఎల్పి 142 హాజరైన నేతలు, కార్యకర్తలు పవిత్ర రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి సేవకు ముక్కోటి దేవగణం ఆదివారం తిరుమలకు తరలివచ్చిందా అన్నట్టు తిరుగిరుల తేజం ఇనుమడించింది.. తిరుమలేశుని వైభవం త్రిలోకాలను మైమరపించింది.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి సకల ప్రాణకోటిని పరవశింపజేసింది.. వివిధ వాహనాలపై విశేషాలంకరణలో దర్శనమిచ్చిన వేంకటాచలపతిని వీక్షించి అశేష భక్తజనం తన్మయత్వం చెందింది.. తొలుత సూర్యప్రభల కాంతులీనుతూ సాక్షాత్కరించిన మలయప్పస్వామి దివ్యతేజస్సుకు పులకరించింది.. చిన్నశేషునిపై చిద్విలాసంగా ఆశీనులైన శ్రీనివాసునికి కై మోడ్పులర్పించింది.. అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని అధిరోహించిన శ్రీమన్నారాయణుని సేవించుకుని చరితార్థమైంది.. పుణ్య పుష్కరిణిలో చేపట్టిన చక్రస్నాన ఘట్టంలో పాలుపంచుకుని పునీతమైంది.. కల్పవృక్ష నీడలో కొలువుదీరిన సర్వాంతర్యామి అనుగ్రహంతో సకల అభీష్టాలను సిద్ధించుకుంది.. గోపాలా.. సర్వభూపాలుడి నువ్వేనంటూ వేనోళ్ల కొనియాడింది.. చంద్రప్రభ శోభితంగా ఊరేగుతున్న ఏడుకొండలస్వామికి మొక్కులు సమర్పించుకుని తరించింది. – తిరుమల -
సూపర్ సిక్స్ పేరుతో మోసం
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మేడా రఘునాఽథరెడ్డి ఆరోపించారు. పార్టీ బలోపేతానికి ఈ నెల 31వ తేదీలోపు గ్రామ, పట్టణస్థాయి కమిటీలను పూర్తి చేయాలని కోరారు. సూళ్లూరుపేట:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేతలు ముందు వరుసలో కార్యకర్తలు వెనుక ఉండేవారని, రాబోయే జగనన్న 2.0లో శ్రేణులకే పెద్దపీట వేసేలా అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ ఉమ్మ డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎంకేఎం కల్యాణమండపంలో సూళ్లూరుపేట నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కాకాణి మాట్లాడుతూ ఇకపై జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలను భుజాల మీద మోస్తామని తెలిపారు. అలాగే శ్రేణులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అక్ర మ కేసులు, దౌర్జన్యా లు తప్ప పాలన సాగడం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కోటి సంతకాలు సేకరణ చేపడితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబుకు త్వరలోనే ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. త్వరితగతిన కమిటీ పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఒక్కో కమిటీలో 9 నుంచి 15 వరకు ఉంటారన్నారు. కష్టపడి చేసిన ప్రతి కార్యకర్త నేరుగా జగనన్నను కలిసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం నేతలను వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ, రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వెంకట నారాయణరెడ్డి, సనత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అల్లూరు అనిల్కుమార్రెడ్డి, కె.ఆర్ముగం, దువ్వూ రు రాహుల్రెడ్డి, పాదర్థి హరినాథ్రెడ్డి, ఒబ్బు వెంకటరత్నం, వట్టూరు కిషోర్యాదవ్, పట్టణ అధ్యక్షులు కృపాకర్రెడ్డి, కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు దబ్బల శ్రీమంత్రెడ్డి, కటకం దీపిక, నేతలు కామిరెడ్డి రాజా రెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, చిన్ని సత్యనారాయణ, అలవల సురేష్ పాల్గొన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్దపీట -
నేడు తిరుమలలో రథసప్తమి
తిరుమల :వేంకటేశ్వరస్వామివారి రథసప్తమి మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాటు పూర్తి చేసింది. రథసప్తమి సందర్భంగా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్పస్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్తకోటిని మంగళవారం అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంతోపాటు మాడ వీధుల్లో 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేలు కట్ ఫ్లవర్స్తో అలంకరించారు. రథసప్తమి పర్వదినానికి విస్తృత ఏర్పాటు తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు గ్యాలరీల్లో, మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు పీఏసీలో అన్నదానం నిర్వహిస్తారన్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం, 9 నుండి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, అనంతరం 3 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరుగుతుందన్నారు. విద్యుత్ దీపాల వెలుగులో శ్రీవారి ఆలయంభారీగా తరలి వస్తున్న భక్తులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల రథసప్తమి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుపతిలో ప్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్ఓ) టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల క్యూ శనివారం సాయంత్రానికి తిరుమలలోని సేవాసదన్ వరకు ఉంది. వీరికి శ్రీవారి దర్శనం 16 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 60,726 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ. 1.12 కోట్లు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. -
తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
తిరుపతి క్రైమ్: నగరంలో ఈ నెల 21వ తేదీన కిడ్నాప్ అయినా బాలికను ఈస్ట్ పోలీసులు సురక్షితంగా శనివారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు ఆధ్వర్యంలో లాండర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చింతలచేనులో నివాసం ఉంటున్న సుజిత్ర, ఆమె భర్త మస్తాన్ దంపతుల 13 నెలల పాపను వారి ఇంటికి సమీపంలో నివాసముంటున్న మారియమ్మ, ఆమె భర్త కన్నన్ కందన్ అలియాస్ మురుగన్ ఈనెల 21వ తేదీన కిడ్నాప్ చేశారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు నేతృత్వంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. పాపని భిక్షాటన చేసేందుకు రూ. 25 వేలకు విక్రయించారన్నారు. బాలికను తీసుకుని తమిళనాడులోని ఈ రోడ్డు రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుండగా పోలీసులు గుర్తించి, ఈనెల 23వ తేదీన సాయంత్రం తమిళనాడులోని వేలూరు జిల్లా విడదంపట్టు ప్రాంతంలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి బాలికను, రూ.2500 నగదు, రూ.279 చిల్లర నాణ్యాలు, పాల బుడ్డి, చిన్న టవలు, టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించే విషయంలో డీఎస్పీ భక్తవత్సలం నాయుడు, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హేమాద్రి సిబ్బంది ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. -
జగనన్నను సీఎం చేద్దాం
కలసికట్టుగా పోరాడదాం..వెంకటగిరి(సైదాపురం): కలసి కట్టుగా పోరాడాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి టాస్క్పోర్స్ సభ్యులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి , నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలతతో కలసి వెంకటగిరి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న చంద్రబాబు పాలనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. రెండేళ్లు పూర్తికాకముందే టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు గ్రామ కమిటీలు బలోపేతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. ఎగిరిపడేవారికి తగిన బుద్ధి చెబుదాం అఽధికారం అండదండలున్నాయని ఎగిరెగిరి పడే వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పడం తథ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్ధానాలతోపాటు రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 10వేల మందితో జగనన్న సైన్యంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు సముచితమైన స్థానం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు జగనన్న 2.0 సముచిత స్థానం దక్కుతుందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీకీ పూర్వ వైభవం తేవడానికి సమష్టిగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వెంకటగిరిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, జగనన్నకు బహుమతిగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్, ఆత్మకూరు పరిశీలకులు కోటేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరమణారెడ్డి, నేతలు చిట్టేటి హరికృష్ణ, రామతులసమ్మ, అనిల్కుమార్రెడ్డి, పార్టీ కన్వీనర్లు పులి ప్రసాద్రెడ్డి, కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మన్నారపు రవికుమార్ యాదవ్, మధుసూదన్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద రహిత జిల్లాగా తిరుపతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్:రోడ్డు ప్రమాద రహి త జిల్లాగా తిరుపతి ఉండాలనే లక్ష్యంతో డ్రైవర్లు పనిచేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి జ గదీష్ సూచించారు. డ్రైవర్స్ డే సందర్భంగా శని వారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో రోజాలను అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ సురక్షితంగా వాహనాలు నడుపుతున్నారంటూ డ్రై వర్లను కృతజ్ఞతలు తెలిపారు. చెడు అలవాట్లను దూరం చేసి ఆరోగ్యంగా ఉండాలని ఉత్తమ డ్రైవర్గా పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథ్, తిరుపతి డిపో మేనేజర్ సురేంద్ర కుమార్, సెంట్రల్ బస్టాండ్ ఏటీఎం, బస్టాండ్ అసిస్టెంట్ మేనేజర్, బస్టాండ్ కంట్రోలర్లు డ్రైవర్లు పాల్గొన్నారు. పోలీసులే కబ్జాలకు పాల్పడుతున్నారు –బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి తిరుపతి కల్చరల్: కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన పోలీసులే కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యానికి ఒడిగట్టారని బాధితుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో తిరుపతి అర్బన్ మండలం మంగళం సర్వే నంబర్ 109/2 లో 88 అంకణాల స్థలాన్ని తన భార్య అంజనా దేవి పేరుతో కొనుగోలు చేశానన్నారు. అయితే ఈ నెల 7వ తేదీన ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ రామకృష్ణ ఈ స్థలం తనదంటూ దౌ ర్జన్యానికి దిగుతూ ఆ స్థలంలో ప్రహరీ గోడ నిర్మా ణం తలపెట్టారని తెలిపారు. ప్రజలకు అన్యా యం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. తన స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని అలిపిరి డీఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
రామచంద్రాపురం: మండలంలోని బలిజపల్లిలో ఉన్న ఒంటరి మహిళ మునీశ్వరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు విశ్వనాథ్ (ప్రశాంత్)ను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. బలిజపల్లికి చెందిన మునీశ్వరి తన నివాసంలో ఒంటరిగా నివసించేవారు. ఈ నెల 11వ తేదీన ఆమె తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలి కుమారుడు కుప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్సై భక్తవత్సలం నేతృత్వంలోని బృందం సాంకేతిక టెక్నాలజీతో నిందితుడి కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో రాయలచెరువు సమీపంలోని చిట్టతూరు, కాళేపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం నిందితుడు విశ్వనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ నెల 8వ తేదీనే తాను మునీశ్వరిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గత ఏడాది వెంకట్రామాపురం వద్ద పొలాలు ఒంటరి మహిళ మునీశ్వరి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ భక్తవత్సలం, ఏఎస్ఐ ఈశ్వరయ్య ఇతర సిబ్బందిని సీఐ సురేష్ కుమార్ అభినందించారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టెకెట్ల విడుదల
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను శనివారం విడుదల చేసినట్లు ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల లాగిన్లో కానీ నేరుగా httpr://bie.ap.gov.in వెబ్సైట్ నుంచి కానీ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టికెట్ల డౌన్లోడ్ కోసం తమ ఫస్ట్ ఇయర్ హాల్టికెట్ నంబర్ను లేదా ఆధార్ నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు రేణిగుంట: మండలంలోని పిళ్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రోటోకాల్, బందో బస్తు విధుల్లో బిజీగా ఉన్న సమయాన్ని అదునుగా చూసుకుని ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. శనివారం ఉదయం జేసీబీలతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో స్థానికులు ఎవరూ అడ్డుకునే సాహసం చేయడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి హవా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రాంతీయ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేణిగుంట మండలంలోని స్థానిక వ్యక్తి జేసీబీ ఇసుక తవ్వి, ట్రాక్టర్లతో తరలిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే గాజులమండ్యం పోలీస్ స్టేషన్లోని కొందరు సిబ్బంది సహకరిస్తుండంతో రోజూ రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి కడప సెవెన్ రోడ్స్ : రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటిపారుదలకు 15 శాతం నిధులు కేటాయించాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరిస్తే నే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సామాజిక న్యాయం ఒనగూరుతుందని అభిప్రాయపడ్డా రు. విభజన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన శనివారం కడపలోని బీసీ భవన్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఈఎస్ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య హాజరయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే సంపద సృష్టి జరుగుతుందా? అని ప్రశ్నించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మహా నగరాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చుచేస్తున్నారు తప్ప ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
తుమ్మలగుంటలో రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఏర్పాట్లు చేయించారు. స్వామివారు ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలపైన చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు. సూర్య జయంతి పర్వదినాన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఇప్పటికే ఆలయంతో పాటు పుష్కరణి పరిసరాలను శుభ్రం చేశారు. గర్భాలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచే వాహన సేవలు ప్రారంభం అవుతుండడంతో తగిన ఏర్పాట్లు చేశారు. -
పూటకు 550 బిర్యానీలు అమ్ముతాం
తిరుపతిలో 2020 నుంచి బిర్యానీలకు ప్రత్యేక క్రేజ్ పెరిగింది. చిన్న పిల్లలు, యువత ఇంట్లో వండిన వంటకాలపై శ్రద్ధ చూపడం లేదు. బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటూ తల్లిదండ్రులను మారం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. కరోనా సమయంలో చికెన్, మటన్ ప్రతి ఇంట్లో విపరీతంగా వినియోగించారు. దీంతో ఆ అలవాటుతో ప్రస్తుతం బిర్యానీల క్రేజ్ పెరిగింది. నగరంలో మాది చిన్న బిర్యానీ హోటల్ మాత్రమే. ఆన్లైన్లో ఒక పూటకు 200 బిర్యానీల వరకు పంపుతాం. ప్రజలు నేరుగా మరో 250 బిర్యానీల వరకు కొనుగోలు చేశారు. పండగలు, పార్టీల వంటి ప్రత్యేక రోజుల్లో రోజుకు 2 వేల వరకు సేల్ అవుతాయి.–మస్తాన్, హోటల్ యజమాని, తిరుపతి అతిగా తింటే ప్రమాదమే! ఫైబర్, మినరల్స్ తక్కుగా ఉండి, అఽధిక క్యాలరీలు, నూనె, వనస్పతి, ఫ్యాటీ మీట్స్ ఉండడంతో బిర్యానీ అధికంగా తినేవారికి ఊబకాయం తప్పదు. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్, ప్యాటీ లివర్, షుగర్, బీపీ, జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల భారినపడుతున్నా రు. అధికంగా తింటున్న యువత చిన్న వయస్సులోనే గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. బిర్యానితో పాటు శీతలపానీయాలతో మరిన్ని ఆరో గ్య సమస్యలకు గురవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు హోటల్ బిర్యానీలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ రమేష్రెడ్డి, వైద్య నిపుణులు, తిరుపతి -
పీఏఎల్ఎస్తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ శనివారం పీఏఎల్ఎస్(పాన్–ఐఐటీ పూర్వ విద్యార్థుల అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, పీఏఎల్ఎస్ ట్రస్టీ ఎన్.అలిమేలు, చైర్మన్ సీఎన్ చంద్రశేఖరన్తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కాంపిటెన్సీ డెవలప్మెంట్ అండ్ ఔట్ రీచ్ యూనిట్ వ్యూహాత్మక సహకారాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, విద్యా ఔట్రీచ్, సామర్థ్య నిర్మాణంలో సంస్థాగత చొరవలను నడిపించడానికి బాధ్యత వహిస్తుందని వారు విశ్వసించారు. వివిధ ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థుల నేతృత్వంలో స్వచ్ఛంద సేవకుల ఆధారిత విద్యా చొరవ, ఇంజినీరింగ్ విద్యను మెరుగుపరచడానికి, సంస్థలు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లు, ఔత్సాహిక వ్యవస్థాపకులను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం విద్యార్థి ఇంటర్న్షిప్ కార్యక్రమాలు, అధ్యాపక అభివృద్ధి కార్యకలాపాలు, ఉమ్మడి హ్యాకథానలు వంటి సహకార కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డీన్లు ప్రొఫెసర్ అరుణ్ కె. తంగిరాల, ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా, ప్రొఫెసర్ రామకృష్ణ సాయి గోర్తి, ప్రొఫెసర్ అనిల్ కుమార్ కాంపిటెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సలహాదారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గోర్తి, రిటైర్డ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె. పి. కృష్ణకుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ రుచిక, పీఏఎల్ఎస్ ప్రతినిధులు సుబ్రమణియన్, మోహన్ పాల్గొన్నారు. -
● ఉప్పొంగే శక్తి.. దేశభక్తి
పరాయి పాలన నుంచి దేశం విముక్తి పొంది..సర్వసత్తాక ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ ఊపిరిపోసుకున్న మహోన్నత రోజు ఇది. ప్రతి ఒక్కరి హృది దేశభక్తితో సంపూర్ణంగా నిండిన రోజు ఇది..అందుకే ఆ రోజును గుర్తు చేసుకుంటూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో 26వ తేదీన జరిగే వేడుకలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన భవనానికి త్రివర్ణ రంగుల తో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన భవనం త్రివర్ణ రంగుల వెలుగుల్లో మెరుస్తోంది. దీనికితోడు భవనం ఎదుట ఉన్న జాతీయ పతాకం కనువిందు చేస్తోంది. కాగా కలెక్టరేట్ను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ముస్తాబు చేశారు. – రేణిగుంట/తిరుపతి అర్బన్ -
ఫౌండేషన్ విద్య.. మిథ్య!
ఏర్పేడు: ‘‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన ఫౌండేషన్ స్కూల్ విధానంతో రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ అంపశయ్యకు చేరువవుతున్నదనేందుకు ఈ పాఠశాలలో అమలవుతున్న విద్యనే నిలువెత్తు నిదర్శనం. అది ఏర్పేడు మండలం గుడిమల్లం ప్రాథమిక పాఠశాల.. ఇక్కడ ఉపాధ్యాయురాలు జయంతి ఒక్కరే తరగతి గదిలో కూర్చుని పాఠశాల గోడలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. ఈ పాఠశాలలో 2వ తరగతిలో ఎం.శివ అనే ఒక్క విద్యార్థే చదువుతున్నాడు. గతంలో ఈ పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సమీపంలోని రావిళ్లవారికండ్రిగ మోడల్ ప్రైమరీ స్కూల్లో కలిపేశారు. దీంతో ఇక్కడ ఫౌండేషన్ స్కూల్ పేరుతో 1,2 తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నా రు. ఈ రెండు తరగతులకు ఒక్క విద్యార్థే ఉన్నాడు. ఆ చిన్నారికి పాఠ్యాంశాలను బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయిని నియమించారు. ఇది కేవలం ఒక్క గుడిమల్లం ఫౌండేషన్ స్కూల్కే పరిమితం కాదు. జిల్లాలోని దాదాపు అన్నీ ఫౌండేషన్ స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గత ప్రభుత్వ పాలనలో గుడిమల్లం పాఠశాలను నాడు–నేడు నిధులు రూ.12 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ వసతులన్నీ అడవికాచిన వెన్నెలను ప్రతిబింబిస్తోంది. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
తిరుపతి రూరల్: అవిలాల గ్రామ పంచాయతీ సుబ్బయ్య కాలనీలో కాంక్రీట్ పనులు చేస్తున్న యువకుడు విద్యుత్షాక్ గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుబ్బయ్య కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం కాంక్రీట్ పనులు చేస్తున్న మహేష్ (25) అనే యువకుడుకి విద్యుత్తు షాక్ గురయ్యాడు. దీంతో తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహేష్ అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు తిరుచానూరు యోగిమల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తోటి కార్మికులు చెబుతున్నారు. తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలకించండి.. ఆదుకోండి
ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్కు పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. సైబర్ నేరగాడి అరెస్టు పశ్చిమ బెంగాల్కు చెందిన సైబర్ నేరగాడిని రేణిగుంట జీఆర్పీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.చేనేతల డిమాండ్లు ఇవీ శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్ ఆర్డర్. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. మగ్గం నేస్తున్న దృశ్యంవెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్ లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉచిత విద్యుత్ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీఓ నంబర్ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు. ఒత్తిడి తెచ్చినా... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్ లూమ్ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్ సంస్థలు బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్లో నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమాధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం ఎన్విరాన్మెంట్ పరీక్షకు 381మంది గైర్హాజరు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షకు 381మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జి రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు పక్కా ఉత్తీర్ణత సాధించాల్సిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 30,373 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 29,992 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తిరుపతి తుడా: మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మెప్మా సంచాలకులు ఇప్రీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా సంస్థ సహకారంతో పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు కర్ణాటక రాష్ట్రం తుమకూర్లోని హాస్పిటల్ స్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాఽధి, ఉద్యోగవకాశాలను కల్పిస్తారని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో భోజన వసతితోపాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ట్రైనర్ మధుసూదన్రావు 8309154991 నంబర్లో సంప్రదించాలని సూచించారు శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు స మర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తుల కు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. జీఓ నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి. మొత్తం రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం రూ.8 వేల కోట్లు కేటాయించాలి. నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి. నూలు, సిల్క్కు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. చేనేత కుటంబాలకు రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలుఇవ్వాలి. గృహం, వర్క్షెడ్ పతకాన్ని అమలు చేయాలి. జీవిత బీమా సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసిన కొనసాగించాలి. సహకార సంఘాలను బలోపేతం చేయాలి. ప్రత్యేకపోరాటానికి సిద్ధం ఉచిత విద్యుత్పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మికుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు. – కూన మల్లిఖార్జునరావునేతన్న నేస్తం అమలు చేయాలి గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. –రవి, నేత కార్మికుడు, వెంకటగిరి ఉచిత విద్యుత్ అమలు చేయాలి ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్ జీఓను వెంటనే అమలు చేయండి. – బాలాజీ, నేత కార్మికుడు, వెంకటగిరిగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరుస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేతలకు నోటీసులు
తిరుపతి సిటీ: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు ప్రేమ్కుమార్కు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. విద్యార్థి సంఘాల నేతలపై ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేసినందుకు కేసులు పెట్టడం దుర్మార్గమని, ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని వారు అన్నారు. ఎస్వీయూలో రిమోట్ పైలట్ శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూలో చిన్న, మధ్యస్థ తరగతి రోటర్ క్రాఫ్ట్ కింద రిమోట్ పైలట్ శిక్షణను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఆమోదం లభించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18–65 ఏళ్ల వయస్సుగల ఔత్సాహికులకు డ్రోన్ పైలెట్ శిక్షణకు అర్హులుగా నిర్ణయించారు. 5 నుంచి 7 రోజుల పాటు శిక్షణ పొందిన వారికి 10 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా సర్టిఫికెట్లను అందజేయనున్నారు. శిక్షణ విజయవంతగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు భారతదేశం అంతటా వాణిజ్య, పారిశ్రామిక, పరిశోధన, ప్రజా సేవా అనువర్తనాల కోసం చట్టబద్ధంగా డ్రోన్లను ఆపరేట్ చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ విషయంపై ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావు క్యాంపస్లోని డ్రోన్ శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో శిక్షణకు సంబంధించి కోర్సు ఫీజు, సిలబస్, శిక్షణ సమయాలను వెల్లడిస్తామని తెలిపారు. పీబీసీ ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్రణవ్ కుమార్ చిట్టే , రితేష్ కుమార్ సింగ్, రూసా కోఆర్డినేటర్లు ఆచార్య సుచరిత ఆచార్య బాలాజీ, సీఈఓ వంశీ రాయల్ హాజరయ్యారు. శ్రీసిటీలో బాధ్యతాయుత వ్యాపార విధానాలపై వర్క్షాప్ శ్రీసిటీ (వరదయ్యపాళెం): తయారీ రంగ సంస్థలను అజెండా–2030కు సంసిద్ధం చేసే క్రమంలో భాగంగా ’బాధ్యతాయుత వ్యాపార విధానాలు’ అంశంపై శుక్రవారం శ్రీసిటీలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీసిటీ, దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్ఐసీసీఐ) సంయుక్తంగా స్థానిక స్టేషన్–ఎస్ ఆడిటోరియంలో నిర్వహించింది. ఎస్ఐసీసీఐ సీఎస్ఆర్ కమిటీ చైర్మన్ రత్నవేల్ రాజన్ మాట్లాడుతూ మానవ హక్కులు, స్థిరత్వాన్ని వ్యాపార కార్యకలాపాల్లో భాగం చేయడంతో పరిశ్రమలను శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ది రెమెడీ ప్రాజెక్ట్ సీఈఓ ఆర్చనా కోటేచా, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ)కు చెందిన బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ స్పెషలిస్ట్ నుస్రత్ ఖాన్ మాట్లాడుతూ గ్లోబల్, జపాన్, భారతీయ నియంత్రణా విధివిధానాలపై అవగాహన, వివిధ విభాగాల్లో తయారీ రంగ సంస్థలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత తయారీ రంగంలో బాధ్యతాయుత వ్యాపార విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగమైన ఈ వర్క్షాప్ చొరవను ప్రశంసించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వర్క్షాప్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ఏజీఎం (హెచ్ఆర్) వి.శివకుమార్ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, ప్రశ్నోత్తరాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమం ముగిసింది.


