breaking news
Tirupati District Latest News
-
ఎర్రచందనం పట్టివేత
బాలాయపల్లి(సైదాపురం) : మండలంలోని అలిమిలి వద్ద ముళ్లపొదల్లో దాచి ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది భవానీ, అశోక్, గిరి పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి (45) రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ వెళ్లే హరిప్రియ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఐదో నంబర్ ప్లాట్ఫామ్పై నుంచి జారి రైలు కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడ్డాడు. మృతుడి వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు సమాచారం తెలిసిన వారు 9440627638 నంబర్ను సంప్రదించాలని కోరారు. కనుమలో లారీ బోల్తా చంద్రగిరి : తిరుపతి–పీలేరు జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శనివారం వేకువజామున ఓ లారీ బోల్తా పడింది. వివరాలు.. పీలేరు నుంచి టమాట లోడ్తో వస్తున్న లారీ కనుమలోని పెద్ద మలుపు వద్ద అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. అయితే లారీ డ్రైవరు, క్లీనర్లు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెనుక వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అనంతరంయంత్రాల సాయంతో లారీను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు బస్సులో వ్యక్తి మృతి నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరు వెళుతున్న తమిళనాడు బస్సులో ఎల్లసిరి శ్రీనివాసులు(42) అనే వ్యక్తి గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందారు.వివరాలు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెంది శ్రీనివాసులు సూళ్లూరుపేటలో తమిళనాడు బస్సు ఎక్కి గూడూరుకు టికెట్ తీసుకున్నారు. పండ్లూరు సమీపంలో వచ్చేసరికి శ్రీనివాసులు అచేతనంగా పడిపోయారు. కండక్టర్ ధనంజయులు సమాచారం మేరకు 108 సిబ్బంది చేరుకుని శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ప్రయాణికులను తమిళనాడు చెందిన మరో బస్సులో నెల్లూరుకు చేర్చారు. శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాగలాపురంలో మహిళ హత్య
నాగలాపురం: స్థానిక బీసీ కాలనీలో నివసిస్తున్న మునిలక్ష్మి (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. వివరాలు.. భర్త మరణించడంతో మునిలక్ష్మి ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఓ హోటల్లో పనిచేసుకుంటూ పొట్టపోసుకునేది. శుక్రవారం యథావిధిగానే హోటల్కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం హోటల్కు రాక పోవడంతో యజమాని పక్కింటి వాళ్లకి ఫోన్ చేశాడు. వారు ఆమె కోసం వెళ్లగా ఇంట్లో మునిలక్ష్మి విగత జీవిగా పడివుంది. గొంతు వద్ద గాయం ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రవికుమార్, సీఐ రవీంద్ర, ఎస్ఐ సునీల్, శిక్షణ ఎస్ఐ ప్రసాద్, పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు , తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారం కోసమేనా..? మునిలక్ష్మి మెడలో బంగారు గొలుసు, చేతికి వేలుకి ఉన్న ఉంగరం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఒక మహిళ, పురుషుడు ఆమె ఇంట్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. మునిలక్ష్మిని హత్య చేసి ఆనవాళ్లు చెరిపేసేందుకు ఇంట్లో కారప్పొడి సైతం చల్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డాగ్ స్క్వాడ్, వేలి ముద్ర నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. -
ప్రయాణికుల భద్రతే ప్రధానం
తిరుపతి క్రైం:ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి, డీటీఓ మురళీమోహన్ తెలిపారు. కర్నూలు ఘటన నేపథ్యంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రయివేటు ట్రావెల్స్ను ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయా లేదా..? గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయా లేదా..? బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్సులు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేవా అని నిర్ధారించారు. లగేజ్ కంపార్ట్మెంట్లలో మండే పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయోలేదో చెక్ చేశారు. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించారు. . నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో శాంతిభద్రతల ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి పాల్గొన్నారు. -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి
చంద్రగిరి: విద్యుత్ తీగలు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్థరాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలోని తనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి తనపల్లిలోని ఓ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఆపై విద్యుత్ తీగలను పట్టుకోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది, తలకిందులుగా వేలాడాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయినాథ్ చౌదరి తెలిపారు. -
తుపాను ప్రమాదం.. అప్రమత్తం
తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ముంచుకొస్తోందని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తన నివాసం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ మౌర్య, డీఆర్ఓ నరసింహులు ఇతర అధికారులు వారి కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురవనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా 27,28,29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉందని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు 0877–2236007 ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాగాన్నిఅప్రమత్తం చేసినట్లు చెప్పారు. జేసీ మౌర్య మాట్లాడుతూ వర్షాలకు ముందే తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై కొత్తూరు గ్రామం వద్ద శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాలు.. రాజమండ్రి నుంచి బెంగళూరుకు 34మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ఐరన్ బారికేడ్లను ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. టెంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. వినియోగంలో లేని వస్తువుల విక్రయం తిరుపతి అర్బన్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వినియోగంలో లేని వస్తువుల అమ్మకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి విక్రమకుమార్రెడ్డి శనివారం తెలిపారు. ఆసక్తి గలవారు కలెక్టరేట్ బి–బ్లాక్లోని మూడో అంతస్తు రూమ్ నంబర్ 309లో దరఖాస్తులు పొందవచ్చని వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో టెండర్లు ఓపెన్ చేస్తామని వివరించారు. 30 నుంచి శ్రీవారి మెట్లోత్సవం తిరుమల : తిరుమల ఆస్థాన మండపంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు శనివారం వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించనున్నట్లు వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకండి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీ (సహిత విద్యా రిసోర్స్ పర్సన్)లు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ఐఈఆర్పీలకు రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. 3 తర్వాతే స్పాట్ అడ్మిషన్లు తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మరో వారం రోజుల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓఎండీసీ ఆధ్వర్యంలో ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల పేరుతో రెండు విడతలుగా ప్రవేశాలు కల్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మూడవ విడతగా వచ్చే నెల ఒకటో తేదీన అర్హత కలిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీంతో వచ్చేనెల 3వ తేదీ పైన ప్రభుత్వ, టీటీడీ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ క్రీడా పోటీలు వాయిదా తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 27వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఇంటర్ కాలేజియేట్ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శివశంకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1న వాయిదా వేసిన క్రీడలను ఒకే రోజు నిర్వహిస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నవోదయ, సైనిక్ పరీక్షలపై ఉచిత అవగాహన తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రంలో ఆదివారం ఉదయం 10గంటలకు నవోదయ సైనిక్ మోడల్ టెస్ట్పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8688888802/03, 9399976999 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. వేగంగా ఓటరు క్లెయిమ్ల పరిష్కారం తిరుపతి రూరల్ : ఓటరు క్లెయిమ్లను వేగంగా పరిష్కరిస్తున్నామని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పలుచోట్ల కొత్త కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
కళ్లకు గుంతలు!
స్వర్ణముఖిలో బరితెగించిన ఇసుకాసురులు సాక్షి, టాస్క్ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం పరిధిలోని వేదాంతపురం, కేసీపేట, చిగురువాడ, దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లె, శివగిరి ప్రాంతాల్లోని ఇసుకాసులు బరితెగించేశారు. స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్విన గోతుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో అందులో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అడ్డుకట్ట పడేనా..? వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు మృత్యువాత పడిన తర్వాతైన ఇసుకాసురులకు అధికారులు చెక్ పెడతారా అని పరీవాహక గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం కంటే ఆ ప్రమాదానికి కారణమైన ఇసుక తవ్వకాలకు అడ్డుకోవాలని కోరుతున్నారు. స్వర్ణముఖి నదిలో వర్షాకాలం ముగిసేంత వరకు తవ్వకాలు జరగకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్జనకే ప్రాణాలు బలి ఇసుకాసురులు కేవలం అక్రమార్జనకే ప్రాధాన్యమిస్తున్నారని, ఎన్ని ప్రాణాలు పోయినా కనికరించడం లేదని పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కఠిన వైఖరి తీసుకోకుంటే మరింత మంది బలవుతారని హెచ్చరిస్తున్నారు. స్వర్ణముఖిలో ఉసురు తీస్తున్న గుంతలు ఇవే..కూటమి నేతల అండతోనే .. కూటమి నేతల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినా అక్రమార్కులు లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా చేసే టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే స్వర్ణముఖి స్వరూపం మారిపోయిందని, సరిహద్దులను కూడా తవ్వేస్తుండడంతో గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అడపారెడ్డిపల్లె నుంచి తనపల్లె వరకు సుమారు 10కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా ఇసుక మేటలను తవ్వేశారని వెల్లడిస్తున్నారు. -
తిరుమలను వదలని వరుణుడు
సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
మైనర్పై ఫోక్సో కేసు నమోదు
సత్యవేడు: సొంత బంధువు కుమారుడు తన కూ తురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితు రాలి తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మైనర్ బాలుడిపై ఫోక్సో కేసు నమో దు అయ్యింది. పోలీసుల కథనం మేరకు.. దాసుకుప్పం పంచాయతీలో తాపీ మేస్త్రి దంపతులు జీవిస్తున్నారు. వారికి రెండో తరగతి చదువుతు న్న కుమార్తె(7), యూకేజీ చదువుతున్న కుమా రుడు ఉన్నారు. తాపీ మేసీ్త్ర బావమర్ధి కుమారుడు మైనర్ బాలుడు తాపీమేస్త్రి ఇంట్లోనే ఉంటున్నా డు. ఊత్తుకోటలో పనిచేస్తున్న తాపీమేస్త్రి తన పిల్లలను బడి నుంచి ఇంటికి తీసుకురావాలని బావమర్ధి కుమారుడికి ఫోన్లో చెప్పాడు. పిల్లల్ని తీసుకువచ్చిన ఆ బాలుడు, బాలికపై అఘాయి త్యం చేశాడు. ఈ విషయం ఆ బాలిక తన తల్లికి చెప్పింది. తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్, శ్రీసిటీ డీఎస్సీ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ ట్యాంకర్ బోల్తా రేణిగుంట:మండలంలోని గాజులమండ్యం సమీపంలోని తిరుపతి–చైన్నె రహదారిలో గురువారం తెల్లవారుజామున కెమికల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి తమిళనాడులోని శ్రీ పెరంబూరుకు వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజ్ కావడంతో గాజుల మండ్యం గ్రామస్తులు భయాందోళన చెందారు. పెయింట్లో వాడే కెమికల్ పదార్థంగా పోలీసులు గుర్తించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో ట్యాంకర్పై నీటిని చల్లుతూ క్రైన్ల సహాయంతో ట్యాంకర్ను పైకి తీయించారు. స్థానిక కంపెనీల సాంకేతిక నిపుణులు వచ్చి ప్రమాదకర కెమికల్ కాదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
రేషన్ దందా
పచ్చనేతలసాక్షిటాస్క్ఫోర్స్: రేషన్ మాఫియాకు పాల్పడుతు న్న కూటమి నేతలు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. లక్షల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో బుధవారం అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువగల 31.4 టన్నుల రేషన్ బి య్యం, ఏడు వాహనాలను డీఎస్పీ మహమ్మద్ స య్యద్ అజీజ్ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలల కిందట.. ఈ ఏడాది జూన్ 30న ఇదే ప్రాంతంలో సుమారు 6 లక్షలు విలువ గల 13 టన్నుల బియ్యం పట్టుకు న్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్తోపాటు వై.ధనుష్, డి.బోస్, ఎన్.రోహిత్, వి.దినేష్, గజేంద్రన్, రాజేష్ అలియాస్ రాజు అనే వారిని అరెస్టు చేశారు. జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేతదే అక్రమ బియ్యం నిల్వలు రెండుసార్లు పట్టుపడిన జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేత అమృతరాజ్ నాడార్దే అని, ఆయన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుడని నగరి పట్టణ ప్రజలు అందరికీ తెలిసి న విషయమే. అయినా పట్టుకున్న బియ్యం ఎవరిదో కనిపెట్టాలంటూ పోలీసులు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిండ్ర మండలంలోనూ అదే తంతు ఈ నెల 14వ తేదీన నిండ్ర మండలం, అత్తూరులోను నిల్వ ఉంచిన 34 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆ కేసులోను పోలీసులు నిందితుల పేర్లు వెల్లడించకుండా నగరి పట్టణానికి చెందిన వ్యక్తి బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని మాత్రమే పేర్కొన్నారు. అక్రమార్కులపై ప్రత్యేక నిఘా బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ విక్రమ్ వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకొని మూతబడి ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ, సీఐ సిబ్బందిని వెంటబెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం, వీఆర్వోతో పాటు సంబంధిత స్థలానికి చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, నాలుగు పెద్ద వాహనాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వను కొలత వేయగా 31.4 టన్నులు ఉన్నట్లు తేలింది. ఈ రేషన్ బియ్యం ఎవరెవరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అక్రమ రవాణాలో పాత్రదారులు ఎవరు అనే విషయాలు ప్రత్యేక దర్యాప్తు చేసి అందరిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్ గోదాముకు సేఫ్ కస్టడీ నిమిత్తం తరలించారు. భారీగా పట్టివేత సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అ యితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తా మని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కా కూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ స మాచారం. అందరికీ తెలిసిన విషయమే అయి నా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. -
చెరువులకు జలకళ
తిరుపతి అర్బన్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే వాగులు, వంకలు, కాలువలు సాగడంతో రైతులు ఈ ఏడాది పంట సాగుకు ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి నది సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి వర్షంతో రూ.కోటి నష్టం మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రయాణికులు తగ్గిపోయారు. మరోవైపు ఆర్టీసీ అన్ని మార్గాల్లో తిప్పలేదు. దీంతో రోజుకు రూ.30 లక్షలు చొప్పున మూడు రోజుల్లో రూ.కోటికి పైగా నష్టం చోటుచేసుకుంది. కూలిన పూరిగుడిసెలు బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆలత్తూరు గ్రామ దళితవాడలో ఒక పూరి గుడిసె, పట్టాభిగిరిజన కాలనీలో మూడు పూరిగుడిసెలు కూలాయి. పూరి గుడిసెలు కూలిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాత్రంతా వర్షానికి తడుస్తూ, చలి గాలులతో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి కూలిన పూరిగుడిసెలకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు కలువాయి(సైదాపురం): మండలంలోని దాచూరు కొలపనాయుడుపల్లి గ్రామాల మధ్యలో గురువారం ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. వర్షాలకు బురదమయం కావడంతో రోడ్డు పక్కన దిగిన బస్సు ఇరుక్కుపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం వాకాడు: మండలంలో గురువారం దాదాపు 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా రావడంతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం – గంగన్నపాళెం గ్రామాల మధ్య వంతెన నీట మునిగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రపు కెరటాలు తీర గ్రామాలను తాకుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒడ్డున ఉన్న తమ వేట సామగ్రిని భద్రపరుస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు, మైరెన్ అధికారులతోపాటు వాకాడు తహసీల్దార్ మహ్మద్ ఇగ్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్ సముద్ర తీరాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రొయ్యల కాలవ, పులికాలవ పొంగిపొర్లడంతో అక్కడక్కడా లోతట్టు రహదారులు నీటి మునిగిపోయాయి. బ్యారేజ్లో 35 ఎంసీటీఎఫ్ నీరు నిల్వ ఉండగా 8 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు వరదనీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. -
తిరుపతి బాలోత్సవం తేదీ మార్పు
తిరుపతి కల్చరల్: నగరంలో ఈ నెల 25, 26వ తేదీల్లో జరగాల్సిన తిరుపతి బాలోత్సవం 4వ పిల్లల పండుగను భారీ వర్షాల కారణంగా నవంబర్ 1, 2 తేదీలకు మార్పు చేసినట్లు తిరుపతి బా లోత్సవం అధ్యక్ష, కార్యదర్శులు మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బాలోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తయినా 160 పాఠశా లల నుంచి 10 వేల మందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారని, ఎడతెరపిలేని వర్షాల కారణంగా పిల్లలు హాజరు కాలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తిరుపతి బాలోత్సవం కమిటీ సదరు తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొ క్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు. కో ర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, ఏ.ఖ్యాతి, కోర్ట్ కానిస్టేబుల్ చంద్రకళ కథనం మేరకు.. 2018 డిసెంబర్ 6వ తేదీ పీలేరు రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిబ్బంది పీలేరు రోడ్డులోని యల్లమంద క్రాస్ సమీపంలో వాహనాలను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఓ టాటా సఫారీ వాహనం అతివేగంగా వచ్చింది. ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపిన ఆగలేదు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించి వాహనాన్ని ఆపారు. వాహనంలోని తమిళనాడు, వేలూరు జిల్లా, వానం బాడీ తాలూకా, బాలప్పనూరు గ్రామానికి చెందిన కె విజయ్కుమార్, తిరువణామలై జిల్లా, సింగం తాలూకా, కుత్తు టూరు గ్రామానికి చెందిన వి రామరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా పీలేరు రేంజ్, రొంపిచర్ల సెక్షన్, మేళ్లచెరువు బీట్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి కర్ణాటకకు తరలిస్తున్నట్టు ఫారెస్టు సిబ్బందికి తెలిపారు. వాహనంలో 71 కిలోల ఆరు ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ అమరనారాయణ వాదించారు. -
ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీ నాయకులమంతా తమ ప్రాణాలైనా అర్పించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాగే ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి బిడ్డా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు నగదు జమ చేశారన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న సంకల్పంతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూట మి ప్రభుత్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యతోపాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చే సి, రూ.వేల కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్ర లు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైఎస్. జగన్ మోహన్రెడ్డి శ్ర మిస్తుంటే, చంద్రబాబు పేదల భవిష్యత్తును నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పేదలంటే చంద్రబాబుకు ఎ ప్పుడూ చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్:మరో రెండేళ్లలో తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయని సికింద్రాబాద్ సెంట్రల్ ప్యాసింజర్ సేవల విభాగం కమర్షియల్ మేనేజర్ (సీసీఎం) డి.సత్యనారాయణ వెల్లడించారు. ప్రయాణికుల భాగస్వామ్యంతో రైల్వేష్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్లోని వీఐపీ విశ్రాంత భవనంలో ‘అమృత్ సంభాషణ– ప్రజల స్వరమే అభివృద్ధి శక్తి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రైల్వే అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తిరుపతి స్టేషన్ కూడా ఒక్కటన్నారు. ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. తిరుపతి స్టేషన్న్ను మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. బాలజీ డివిజన్గా పరిగణించాలనే డిమాండ్తోపాటు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేయాలనే సలహాలు, అభిప్రాయాలను కేంద్ర రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ముందుగా సదస్సుకు హాజరైన తిరుపతి వాసులు బుజ్జిబాబు, రామిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, అనిల్గౌర్, మురళి, శేషగిరిరావు, మునీశ్వరరెడ్డి, యాసిన్, అరవ జయపాల్ వేర్వేరుగా మాట్లాడుతూ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి లోపాలను ఉదహరిస్తూ శాఖా పరంగా చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, మేనేజర్ చిన్నపరెడ్డి, సీసీఆర్ఐ శ్రీకాంత్, సీనియర్ కమర్షియల్ క్లర్క్ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు
దొరవారిసత్రం: వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గ ల్లంతయ్యారు. వివరాల్లో కి వెళితే.. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన మేకల పోలయ్య(31) కాళంగి నదిలో కాలనీ వాసులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు జారిపడి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన తనియాలి పంచాయతీ కమ్మకండ్రిగ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేక్షపాత్ర వహించారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నారు. చల్లకాలువలో వ్యక్తి గల్లంతు కోట: చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతైన సంఘటన కర్లపూడిలో చోటుచేసుకుంది. ఎస్ఐ పవన్కుమార్ కథనం మేరకు.. కర్లపూడి గిరిజన కాలనీకి చెందిన మానికల పోలయ్య(75) బుధవారం సాయంత్రం స్వర్ణముఖి చల్లకాలువలో చేపటవేటకు వెళ్లాడు. పొద్దుపోయిన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా కనిపించకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసులు తమ సిబ్బందితో వెళ్లి చల్లకాలువలో బోట్ల సాయంతో తీవ్రంగా గాలింపు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదు. చీకటిపడడంతో గాలింపు నిలిపివేశారు. పోలయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎట్టకేలకు పీజీ ఫలితాలు విడుదలతిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎంఏ, ఎమ్మెస్సీ పరీక్షలకు సంబంధించి పలు సెమిస్టర్ల ఫలితాలు ఎట్టకేలకు వర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫలితాల విడుదలపై ఇప్పటికే పలుసార్లు అధికారులను విద్యార్థులు నిలదీయడంతోపాటు నిరసనలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం పరీక్షల విభాగం అధికారులు, ఉద్యోగులతో నూతన వీసీ సమావేశం ఫలితాల ప్రకటనలపై ఆరా తీశారు. దీంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు పీజీ మూడో సెమిస్టర్కు సంబంధించి పలు కోర్సుల ఫలితాలను ప్రకటించారు. దీంతో విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్టైంది. బాల్బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక శ్రీకాళహస్తి: రాష్ట్రస్థాయిలో జరిగే 17 బ్యాడ్మింటన్ బాలబాలికల జుట్లకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్నంలోని దర్శ బ్యాండ్మిటన్ అకాడమిలో ఈ పోటీలు జరిగాయి. 150 మంది క్రీడాకారులు చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక పోటీలకు హాజరయ్యారు. బాలుర జట్టుకు కార్తీక్, ఏ ప్రణవ్, హెచ్ కార్తీక్, ఎస్కే ప్రణీత్, కే పుష్కర్ను ఎంపిక చేశారు. బాలికల జట్టులో బి జీవిత, పి శరణ్య, ఎస్ సువర్ణాంజలి, హెచ్ యుగభారతి, ఎం షష్టిని ఎంపిక చేశారు. ఈ పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్, భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పీడీలు హేమకుమార్, భక్తగోపాల్, వినోద్, బాబు, జేమ్స్, రమణ, సురేంద్ర, నిరంజన్, లోకనాథం, కిరణ్, చంగల్ రాయులు, గోపి, క్రాంతి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్
తిరుపతి మంగళం : రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అందులో భాగంగానే తమ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీకి సంబంధించిన గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో గురువారం భూమన కరుణాకరన్నను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారన్నారు. ఎస్వీ యూనివర్సిటీ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తు చేశారు. తప్పుల్ని సరిదిద్దుకోడానికి, వాస్తవాల్ని బయటపెట్టిన భూమనను విచారణ పేరుతో వేధించడం సబబు కాదన్నారు. గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు, అందుకు విరుద్ధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ వేర్వేరు సంఖ్యలు చెప్పారన్నారు. గోవుల మరణాలపై పాలకుల్లోనే స్పష్టత లేదన్నారు. విచారణ పేరుతో గంటల తరబడి విచారించడం తగదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే నకిలీ మద్యం తయారీ తదితర అంశాలపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే భూమనను విచారణకు పిలిచారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా తన పద్ధతుల్ని మానుకుని, హామీల అమలుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన విద్యార్థి లోకం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వికృత చేష్టలపై విద్యార్థి లోకం కదం తొక్కింది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్సిటీలో విద్యార్థి సంఘం నాయకు లు గురువారం పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సంతకాలు చేశారు. స్వచ్ఛందంగా క్యూకట్టిన విద్యార్థులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుల పిలుపు మే రకు ఎస్వీయూలోని పీజీ విద్యార్థులు పెద్దఎత్తున కోటి సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు క్యూలో నిల్చుని సంతకాలు చేశారు. ఇందులో ప్రధానంగా వందలాది మంది మహిళా విద్యార్థులు పాల్గొని, పోటీ పడి సంతకాలు చేయడంతో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ స్థాయిలో విద్యార్థులు గళమెత్తడంతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి చెంపపెట్టు రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వంపై విద్యా ర్థి లోకం తిరగబడి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములై గళమెత్తడం అభినందనీయ మని, ఇది ప్రభుత్వ నిర్ణయానికి చెంప పెట్టు అని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యవిద్యను పేదలకు దూ రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణ, పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి కళాశాలలను కూటమి ప్రభుత్వం లాభార్జనే ధ్యేయంగా తమ అనుచరుల చేతుల్లో పెట్టి పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు ప్రేమ్కుమార్, చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షుడు చెంగల్రెడ్డి, విద్యార్థి విభాగం మండలాల అధ్యక్షులు నక్క హరినాథ్, శేషారెడ్డి, వెంకటరమణ నాయక్, విద్యార్థి నేతలు ముని, హరినాయక్ , లిఖిత్, సతీష్, మహేష్, నవీన్, నీరజ్ రెడ్డి, సాయి పాల్గొన్నారు. -
30 వరకు ఆధార్ శిబిరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 30వ తేదీ వర కు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయాధికారి తెలిపారు.కూటమి ప్రభుత్వం రాకతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం కదంతొక్కిన విద్యార్థి లోకం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్వీయూనివర్సిటీలో విద్యార్థిలోకం గురువారం కదం తొక్కింది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కుర్రకాల్వకు పొంచి ఉన్న ప్రమాదం
రేణిగుంట : జి.పాళ్యం పంచాయతీ పరిధిలోని కుర్రకాల్వ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చెరువు కలుజు కింద అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేసి ప్రహరీ గోడను నిర్మించారు. దీంతో భారీ వర్షం వస్తే ప్రమాదం తప్పదని సాక్షి పత్రికలో పలు కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. ఆ కథనాలను ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండు కుండలా మారి కలుజు ప్రవహిస్తోంది. అయితే అడ్డుగా అక్రమ లేఅవుట్ ప్రహరీ గోడ ఉండడంతో నీరు పైకి ఎగదన్నుతూ ఉంది. ఈ క్రమంలో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదముంది. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి ప్రహరీగోడను తొలగించకుంటే కుర్రకాల్వ గ్రామాన్ని వరద ముంచెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ : జిల్లావ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అంద రూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ మౌర్య హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రేణిగుంటలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశమున్న శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటతోపాటు సముద్రతీర ప్రాంతాలైన కోట, వాకాడు, తడలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల ని కోరారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. చెరువులతోపాటు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఏ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్– 0877–2236007ను పరిశీలించారు. హెల్ప్డెస్క్కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ సుశీలాదేవి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, అగ్రికల్చర్ జేసీ ప్రసాద్రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, సీపీఓ రాజశేఖర్, ఇరిగేషన్ అధికారి వెంకటశివారెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్లోకి వరద కలెక్టరేట్ భవనం సెల్లార్లోకి వరద నీరు చేరింది. దీంతో ఉద్యోగులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొట్టుకుపోయిన రింగ్బండ్ ఏర్పేడు : మండలంలో స్వర్ణముఖీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందవరం, పాతవీరాపురం వద్ద లోలెవల్ కాజ్వేలపై నీటి ప్రవాహం పెరిగింది. అలాగే చెన్నంపల్లి, పెన్నగడ్డం గ్రామాలకు వెళ్లే నక్కలవంక వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే జంగాలపల్లి కలుజు వద్ద తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్ కొట్టుకుపోయింది. మల్లె మడుగు పరిశీలన రేణిగుంట మండలంలోని మల్లె మడుగు రిజర్వాయర్ను బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్ట మౌర్య, ఏఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. అల్లకల్లోలంగా సముద్ర తీరం వాకాడు: వాయుగుండంగా ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం తీరం వద్ద సాధారణం కంటే 15 మీటర్లు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మత్స్యకారులందరిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి బ్యారేజ్లో వరదనీరు అధికంగా చేరడంతో 7 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలి పెట్టారు. వాకాడు : ఉవ్వెత్తున్న ఎగస్తున్న అలలురాపూరు మండలం పంగిలి వద్ద కొట్టుకుపోయిన రోడ్డుతిరుమలలో నిండుకుండలా గోగర్భం డ్యామ్చిల్లకూరు : తిప్పగుంట పాళెంలో వరద ఉధృతిజిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు అరణియార్లో పెరిగిన నీటి మట్టం నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్ రిజర్వాయర్లో నీటి మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద నిఘా పెట్టినట్లు వెల్లడించారు. కల్యాణిడ్యామ్కు వరద చంద్రగిరి:ఏ.రంగంపేట సమీపంలోని కల్యాణి డ్యామ్ కు వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి సామ ర్థ్యం 900 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 849 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
అనుక్షణం.. అప్రమత్తం
తిరుపతి క్రైమ్ : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎడతెరపి లేని వానలకు రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గేవరకు సెలవులపై ఎవరూ వెళ్లకుండా సేవలందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖీ నది చెక్డ్యామ్ను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, కాలువలను ఎవరూ దాటకుండా రోడ్డుపై ముళ్ల కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉంటామని, ఎవరైనా నేరుగా కూడా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటల్లోనే.. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
తిరుపతి సిటీ : భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ బుధవారం తెలిపారు. అంగన్వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి తిరుపతి అర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో అంగన్వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ పీడీ వసంతబాయితో కలిసి సీడీపీఓలతో సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు మాత్రం క్రమం తప్పకుండా పౌష్టికాహారం పంపిణీ చేయాలని కోరారు. ప్రధానంగా పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్ల పరిమాణం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు కాంట్రాక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. పీడీ, సీడీపీఓలు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సరిచేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ అవసరం తిరుపతి సిటీ : ఎస్వీయూలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేందుకు అంతర్జాతీయ సిలబస్ అవసరమని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ నూతన పాఠ్యాంశాల రూపకల్పన, తరగతుల నిర్వహణ, టైమ్ టేబుల్, ప్లేస్మెంట్ తదితర అంశాలపై కళాశాల అధికారులు, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ, సెమీ కండక్టర్ డిజైన్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలపై కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. మామండూరు పర్యాటక కేంద్రం మూత రేణిగుంట: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా రేణిగుంట మండలంలోని మామండూరు పెద్ద ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫారెస్ట్ అధికారులు బుధవారం మామండూరు వద్దనున్న పర్యాటక కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి పర్యాటకును అనుమతిస్తామని మామండూరు వన సంరక్షణ సమితి చైర్మన్ కుమార్ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 26 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,343 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. 18,768 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
కొనసాగుతున్న గజ బీభత్సం
నాశనమైన వరి పంట చంద్రగిరి : మండలంలోని ఏ.రంగంపేట అటవీ ప్రాంత సమీపంలో ఉన్న పంట పొలాలపై మూడు రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం వేకువజామున కందులవారిపల్లె, కూచువారిపల్లె పంట పొలాలపై ఏనుగులు విరుచుకుపడ్డాయి. వరి, అరటి, కొబ్బరి చెట్లు, గ్రాస్ గడ్డిని ధ్వంసం చేశాయి. పొలానికి వేసి ఉన్న ఫెన్సింగ్, నీటి సరఫరాకు అమర్చిన పైపులను కూడా నాశనం చేశాయి. ఏనుగులు పంటల పొలాలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులు గుంపును దారి మళ్లించారు. బుధవారం రాత్రి కూడా చిన్నరామాపురం, కందులవారిపల్లె, భీమవరం ప్రాంతాలలో గజరాజులు సంచరించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
● గరుడ వారధిపై నుంచి కిందకు దూకిన తమిళనాడు వాసి తిరుపతి క్రైమ్ : ెపళ్లి కాలేదని మనస్తాపంతో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు బుధవారం తిరుపతిలోని గరుడ వారధిపై కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మధురైకి చెందిన పాండ్యరాజన్(31) వివాహం కాలేదని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకులతో కలిసి తిరుమలకు వచ్చాడు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబసభ్యులను మధురై వెళ్లేందుకు రైలు ఎక్కించాడు. తాను బస్సులో వస్తానని వారికి చెప్పి బుధవారం ఉదయం మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు అలిపిరి ఎస్ఐ లోకేష్కుమార్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిమృతి కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పరిధిలో తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థి పవన్ (20) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిర్వాహుకులు తెలిపిన వివరాల మేరకు.. పవన్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో ఏడాది చదువుతూ ఓ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ గదిలో బొద్దింకల నివారణకు పురుగుల మందును సిబ్బంది పిచికారీ చేశారు. ఆ విషయం తెలియని పవన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తెలియకుండానే పురుగుల మందును పీల్చడంతో కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గదిలో ఎవరూ లేరు. కొంతసేపటికి మందు ప్రభావంతో యువకుడు మరణించాడు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే దీనిపై తోటి విద్యార్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
యూరియా పంపిణీకి చర్యలు
చిట్టమూరు:‘యూరియా కోసం రైతుల ఆందోళన’ శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. చిట్టమూరు తహసీల్దార్ రైతులకు యూరియా అందించేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా యాకసిరి గ్రామ సచివాలయంలో వీఆర్ఓ సునయన చేతుల మీదుగా రైతులకు యూరియా గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ అందుబాటులో యూరియా ఉంచేలా వ్యవసాయాధికారుల ద్వారా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రైతులకు గుర్తింపు కార్డులను అందించామని, ఆ మేరకు యూరియా పంపిణీ చేయాలని ఏఓ నిరంజన్ కుమార్ను ఆదేశించారు. పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్ సైదాపురం : మైనర్ బాలికను వేధించి, కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం ఈ మేరకు నిందితులు నన్నేం ప్రేమ్రాజ్, చింత సాయి, గానుగపెంట శరత్కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలందించండి
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని 410 సెక్షన్లలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటూ నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద 11 కేవీ ఫీడర్లు, ఓవర్ లోడెడ్ 33 కేవీ ఫీడర్లను గుర్తించి వేరు చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి, ఈ పథకంపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. విద్యుత్ శాఖ ఏఈఈలు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155333కు కాల్ చేసి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్, హెచ్ఆర్డీ డైరెక్టర్ కె.గురవయ్య, ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ డైరెక్టర్ పి.ఆయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పి. సురేంద్రనాయుడు, సీఎస్సీ జనరల్ మేనేజర్ చక్రపాణితోపాటు 9 జిల్లాల నుంచి సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఐజర్లో ఘనంగా స్వచ్ఛోత్సవ్
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్లో బుధవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించిన నాటినుంచి గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛత పట్ల సమాజంలో అవగాహన పెరిగిందన్నారు. దేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, ‘పరిశుభ్రతే సేవ’ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతా హి సేవ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ భుక్య మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ కుమార్ హిమాన్షు శేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని అందులో భాగంగా అమ్మ పేరిట ఒక్క మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు స్వచ్చత పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలను అందజేశారు. -
తండ్రిని పరామర్శిస్తే తప్పా?
తిరుపతి రూరల్ : ‘‘ఆరోగ్యం సరిగా లేక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన తండ్రిని ఆయన కొడుకు పరామర్శిస్తే తప్పా..? అందరి సమక్షంలో కేవలం 15 నిముషాలు మాట్లాడితే నేరమా..? రాజ్యాంగంలో అలా ఎక్కడైనా రాసి ఉందా? ఇప్పటికే చేయని తప్పుకు 130 రోజులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జైలులో ఉన్నారు.. ఆయన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసి ఈనెల 24వ తేదీన తీర్పు ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఆయనకు బెయిల్ రానీయకుండా చేయడానికి ఓ దిన పత్రిక (సాక్షి కాదు)లో అసత్య వార్తలు రాయడం, కోర్టులను ప్రభావింతం చేసేలా కథనాలు వండి వార్చడం అనైతికం’’ అంటూ తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టు ఇచ్చిన ముందస్తు బెయి లులో సహ నిందితులను కలవకూడదు అని ఎక్కడా చెప్పలేదన్నారు. అది కూడా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మోహిత్ రెడ్డి వెళ్లి పలకరించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చెవిరెడ్డి ధర్మబద్ధంగా వచ్చే బెయిల్ను అడ్డుకోవడానికి ఇంత అనైతికంగా ప్రభుత్వానికి అనుకూలమైన ఓ పత్రికలో వార్తలు రాయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అలా రాసిన వారి విచక్షణకు వదిలేస్తున్నామని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. -
భవిష్యత్ పరిశోధనలపై దృష్టి అవసరం
తిరుపతి సిటీ: భవిష్యత్తు పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అందుకోసం పరస్పర సహకారంపై అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్వీయూ వీసీ నర్సింగరావుతో బుధవారం వర్సిటీలోని వీసీ చాంబర్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీలో ఉమ్మడి పరిశోధన చేయడానికి చర్చలు జరిపారు. పరిశోధన అంశాలపై రెండు వర్సిటీలు సమన్వయంతో నూతన పరిశోధనల బలోపేతం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్చించారు. ఎస్వీయూ క్వాంటమ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ వంటి పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని వీసీ తెలియజేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పాల్గొన్నారు. -
రొమ్ము క్యాన్సర్కు అత్యాధునిక చికిత్స
తిరుపతి తుడా: రొమ్ము క్యాన్సర్కు స్విమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. ఈ మేరకు స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి మెడికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకుని వైద్యులు సూచించిన విధంగా తరచు స్వీయపరీక్ష చేసుకోవాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో క్యాన్సర్పై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు పింక్ బస్సుల ద్వారా ఇప్పటివరకు 713 క్యాంపులు నిర్వహించి, దాదాపు 42 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, దాదాపు 3 వేల మంది అనుమానితులను గుర్తించి 895 మందికి క్యాన్సర్ వైద్యం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, డాక్టర్ భార్గవి, డాక్టర్ సుబ్రమణ్యన్, డాక్టర్ విజయలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు. -
గందరగోళంగా చైన్నె ప్యాసింజర్ రైలు ప్రయాణం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : చైన్నె ప్యాసింజర్ రైలు ప్రయాణం గందరగోళంగా మారింది. సాధారణంగా ఈ రైలు తిరుపతి నుంచి నడుస్తోంది. బుధవారం నుంచి తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ రైలు కోసం వందల మంది ప్రయాణికులు, విద్యార్థులు తిరుపతి రైల్వే స్టేషన్లో వేచి ఉన్నారు. అధికారులు ఉన్నఫళంగా రైలును తిరుచానూరు స్టేషన్ నుంచి నడపాలని నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ లేకుండా నడిచే ప్యాసింజర్ రైలు కావడంతో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారని, రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఖాళీగా వెళ్లిన రైలు తిరుచానూరు స్టేషన్ నుంచి బయలుదేరిన చైన్నై ప్యాసింజర్ రైలు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లింది. చైన్నె నగరంతోపాటు అక్కడి ప్రాంతాలకు చెందిన భక్తులు ఎక్కువగా చైన్నె ప్యాసింజర్ రైలులో తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైలును మార్చడం సరైన పద్ధతి కాదని ప్రయాణికులు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం
చిల్లకూరు: వర్షాల కారణంగా సోమవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఓ ఇల్లు కాలిపోయిన సంఘటన మండలంలోని లింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. లింగవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఆదివారం నెల్లూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఆమె అక్కడే ఉండి పోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఇంటితోపాటు అందులోని ఎలక్ట్రికల్ వస్తువులు పూర్తిగా కాలి పోయాయి. స్థానికులు ఆమెకు మంగళవారం సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లో వస్తువులు ఏమి మిగలకపోవడంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. -
బతుకు వేటలో గిరిజనం
సూళ్లూరుపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులికాట్లో నీరు చేరడంతో గిరిజన జాలర్లకు బతుకు పంట పండింది. వేటలో నిమగ్నమై చేపలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఆదాయం చేకూరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో ఆటుపోట్ల కారణంగా కడలి కల్లోలంగా మారింది. పెద్దపెద్ద ఆలలు వస్తుండడంతో సముద్రం నుంచి నీరు భారీగా పులికాట్ సరస్సుకు చేరుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో ఉండే గిరిజన జాలర్లుకు చేతి నిండి పనిదొరికినట్లు అయ్యింది. చేపలవేట జీవనాధారంగా బతుకుతున్న గిరిజన జాలర్లు నాలుగు డబ్బులు సంపాదించేందుకు విసురుడు వలలతో చేపల వేటలో నిమగ్నమై బతుకు పోరాటం సాగిస్తున్నారు. పులికాట్ సరస్సు వెంబడి తడ మండలం నుంచి చిట్టమూరు మండలం వరకు ఉన్న సుమారు ఐదారు వేల గిరిజన కుటుంబాలకు చేపల వేటే ప్రధానవృత్తి. గిరిజనులకు పడవలు, పెద్ద పెద్ద వలలు కోనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేక పోవడంతో విసురుడు వలలను వారే స్వయంగా అల్లుకుని చేపల వేట సాగిస్తారు. ఈక్రమంలో సూళ్లూరుపేట–శ్రీహరికోట మార్గంలో ఉన్న చిన్న బ్రిడ్జిలపై నిలబడి వల విసిరి చేపల వేట సాగిస్తున్నారు. -
శ్రీకాళహస్తీశ్వరునికి బంగారు తొడుగు, రుద్రాక్షలు అందజేత
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి బి.కొత్తకోటకు చెందిన ఉషారాణి దంపతులు మంగళవారం రూ.3 లక్షలు విలువ చేసే 25 గ్రామలు బంగారు తొడుగు రుద్రాక్ష మాలను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు ఈఓ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారికి ఆశీర్వవచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. మాయమాటలతో మహిళ చైన్ అపహరణ తిరుపతి క్రైమ్: నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయిస్తున్న మహిళలను గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో మోసం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వెదురుకుప్పం గ్రామానికి చెందిన కళావతి దీపావళి పండగ సందర్భంగా తిరుపతిలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయించేందుకు తిరుపతికి వచ్చింది. ఇదే క్రమంలో గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి, మన వద్ద ఉన్న నగలను జాగ్రత్తగా ఉంచుకోవాలని మొదటగా నమ్మించింది. పక్కకు పిలిచి ఆ నగలను చేతికి తీసుకుని మూట కట్టుకోవాలని తెలిపింది. లేదంటే మూట కూడా వద్దని పేపర్లో చుట్టుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నకిలీ చైన్ను కళావతికి పేపర్లో చుట్టి ఇచ్చి ఆమె బంగారు చేన్తో ఉడాయించింది. ఆమె తేరుకుని పరిశీలించగా తాను మోసపోయామని తెలుసుకుంది. ఈ విషయమై బాధితురాలుతన 16 గ్రాములు చేన్ చోరీ జరిగినట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈస్ట్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్ఎంఎస్లు ఉంటాయని తెలిపారు. ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్ఎంఎస్లు, 6నెలల పాటు బైటీవీ సబ్స్క్రిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
సినీ ఫక్కీలో చోరీ
పాకాల:మండల కేంద్రంలో సోమవారం గొలుసు దొంగల ముఠా సినీ పక్కీలో చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పాకాల మండలం గాదంకి వద్ద కమలమ్మ(84) వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఎక్కి పాకాల బస్స్టాండ్లో దిగింది. అదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు కమలమ్మ వద్దకు చేరుకుని ఆమెతో కలిపారు. తమది కూడా మీ పక్క ఊరే అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. మెడలో వేసుకున్న బంగారు నగలు వైపు చూస్తూ పట్టపగలు ఇలా ఎందుకు నగలు వేసుకొచ్చావ్, అసలే పాకాలలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారంటూ వృద్ధురాలికి నమ్మకం కలిగేలా మాటలు చెప్పారు. ఏమీ కాదులే అన్న వృద్ధురాలితో లేదు లేదు ఈ మధ్యనే తమ బంధువులు ఒకావిడ ఇలాగే నగలు వేసుకొస్తే నగలు దొచుకెళ్లారని నమ్మబలికింది. వారి మాటలు వినిన వృద్ధురాలు వారితో మాటలు కొనసాగింది. ఇదే అదునుగా భావించిన ఆ గుర్తు తెలియని మహిళలు వృద్ధురాలి మెడలోని గొలుసుని తీసుకుని, వృద్ధురాలి వద్ద ఉన్న బ్యాగులో వేసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన కమలమ్మ మెడలోని సుమారు 3 సవర్ల బంగారు గొలుసును తీసి బ్యాగులో పెట్టే ప్రయత్నం చేసింది. అలా కాదంటూ గుర్తు తెలియని మహిళలు తమ వద్ద ఉన్న ఓ పేపర్లో చుట్టి ఇలా బ్యాగులో పెట్టాలని నమ్మించారు. నమ్మిన కమలమ్మ పాకాలలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లి పోయింది. అనంతరం తన బ్యాగులో బంగారు గొలుసు కోసం బ్యాగులో ఉన్న పేపర్ను తెరవగా అందులో అసలు బంగారు గొలుసు బదులు నకిలీ గొలుసు ఉండడం చూసి షాక్కు గురైంది. తనను ఆ ఇద్దరు మహిళలు మోసం చేశారని గుర్తించిన కమలమ్మ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు పాకాల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కేదారీగౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ముందు కలశస్థాపన చేసి కేదారీగౌరీదేవి వ్రతం జరిపారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కేదారీగౌరీదేవి వ్రతం సందర్భంగా నోములు నోచుకున్నారు. నోముదారాలు స్వీకరించారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయంలో రద్దీ పెరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ టీసీ అరెస్టు
తిరుపతి క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్గా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ టీసీని అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైన్నెకి చెందిన జితేందర్షా కొంతకాలంగా రైల్వేస్టేషన్లో నకిలీ టికెట్ కలెక్టర్గా చలామణి అవుతున్నాడు. రైల్వేస్టేషన్లో రైలు దిగిన ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిని టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ దోచేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఓ ప్రయాణికుడితో గొడవ పడుతుండగా పోలీసులు గమనించారు. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించగా ప్రయాణికుడు సార్ టికెట్ లేదని రూ.500 చెల్లించాలని, రసీదు ఇవ్వకుండా మరో రూ.500 చెల్లించాలని బెదిరిస్తున్నాడని తెలిపారు. నకిలీ టికెట్ కలెక్టర్ను ఆధారాలు చూపించమని పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, తాను పొట్టకూటి కోసం మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. అతని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భాకరాపేట ఘాట్లో లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కలకడ నుంచి టమాట లోడ్తో లారీ విశాఖపట్నం నగరానికి మంగళవారం బయలుదేరింది. భాకరాపేట కనుమలో పెద్ద మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ యజమాని నాగేశ్వరరావు, లారీ డ్రైవర్ ప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భూసేకరణ వేగవంతం చేయండి తిరుపతి అర్బన్: జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవే పీడీలు, తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి సంబంధిత మండలాల తహసీల్దార్లు, తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులపై రేణిగుంట, పూడి, గూడూరు, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఆరులేన్ల రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుంచి చైన్నె రహదారి పనులు పూర్తి చేయాలని, భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అమరుల సేవలు చిరస్మరణీయం
తిరుపతి క్రైమ్: అమర వీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి హాజరై, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు రాకుండా సమాజాన్ని కాపాడుతూ, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మన అందరి బాధ్యతని, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సమాజాన్ని కాపాడడంలో ముందుంటూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత ఏడాది 191 మంది పోలీసు సిబ్బంది దేశ సేవలో ప్రాణత్యాగం చేశారని, అందులో మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, వారి త్యాగాలకు మనమంతా జోహార్లు అర్పించాల అన్నారు. ‘దేశ సేవలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వృథా కావని, రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసు సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 191 మంది అమరవీరుల కుటుంబాలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకునే పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం మన దేశానికి గర్వకారణమైన రోజని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది తమ కర్తవ్య నిష్ఠను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకాలను గౌరవంగా తలచుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దు భద్రత, అంతర్రాష్ట్ర నేరాలు, టెరర్రిజం, నక్సలిజం నిర్మూలన, అంతర్గత ముప్పులను ఎదుర్కొనడంలో అనేక మంది భద్రతా దళాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి కర్తవ్యనిబద్ధత, ధైర్యం, త్యాగం ఫలితంగానే ఈ రోజు మనం శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘పోలీసు సేవ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది ఒక మహత్తరమైన బాధ్యత అన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. వివరాలిలా ఉ న్నాయి.పుంగనూరు మండలంలోని ఉలవలదిన్నెకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి తన తల్లి కోరిక మే రకు 352 గ్రాముల బంగారు నగలను 2008లో శ్రీవారికి విరాళంగా ఇచ్చినట్లు, ఆ నగలను అప్పటి ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు అందజేయగా, తనకు ఆ సమయంలో రశీదు ఇచ్చారని ఆరోపించారు. ఆ నగలు ప్రస్తుతం గరుడసేవలో వినియో గించకపోవడంతో ప్రస్తుతం పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి టీటీడీ ఆధీనంలో ఉంది. దీంతో టీ టీడీ వారిని ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా అలాంటి ఆభరణాలు టీటీడీ వద్ద లేవని తెలిపినట్లు దాత ఆది నారాయణ తెలిపారు. తన నగలు మాయం చేసిన ఈఓ, ఇప్పటి డీసీ ఏకాంబరంపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై డిప్యూటీ క మిషనర్ ఏకాంబరం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ఆదినారాయణ ఎలాంటి నగలు విరాళంగా స్వామివారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ రశీదు సృష్టించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై చ ర్యలు తీసుకో వాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 21పిజిఆర్ 04 : పుంగనూరులో నగలు మాయం చేశారని ఆరోపిస్తున్న ఆదినారాయణ 21పిజిఆర్ 05 : నగలు ఇవ్వలేదని తెలుపుతున్న డీసీ ఏకాంబరం -
జర్నలిస్టు కాలనీలో దొంగలు పడ్డారు..!
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. చీకటి పడిన వెంటనే విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు కథనం మేరకు.. గాంధీపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న జర్నలిస్టు కాలనీలో ఇళ్లలోకి దొంగలు యథేచ్ఛగా వస్తుండడంతో ఇంటి లోపల మహిళలు ఒంటరిగా ఉండాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆ కాలనీలోని వీధుల్లో విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడం, ఆ ఇళ్లకు ఆనుకుని ముళ్ల చెట్లు ఏపుగా పెరగడంతో దోపిడీ దొంగలు, మత్తుకు భానిసైన యువకులు ఆ చెట్ల మాటున దాక్కుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి విద్యుత్ మోటార్లు, విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నం చేశారు. గుట్టుగా చోరీకి పాల్పడుతున్న ఆ ఇద్దరిని ఓ జర్నలిస్టు గుర్తించి, ఎవరని ఆరా తీయగా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు చుట్టుముట్టి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగెత్తి ముళ్ల చెట్ల మాటున చీకట్లో దాకున్నారు. ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి రూరల్ ఎస్ఐ షేక్షావల్లీతో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని ముళ్ల చెట్లు మాటున దాక్కున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ చెట్లు మాటు నుంచి బయటకు వచ్చిన మగ వ్యక్తి పరారుకాగా, మహిళ పోలీసులకు చిక్కింది. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కాగా జర్నలిస్టుల కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 72,026 మంది స్వామివారిని దర్శించుకోగా 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆలయం వెలపులకు వచ్చిన భక్తులు పరుగులు తీస్తూ చలువపందిళ్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుమల దుకాణాల్లో కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. తిరుమలలో నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణం -
అమరుల సేవలు చిరస్మరణీయం
అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను ప్రతి పౌరుడు స్మరించుకోవాలని కలెక్టర్ వేంకటేశ్వర్ అన్నారు.ఔషధ మొక్కలపై పీజీ కోర్సులు తిరుపతి సిటీ: ఎస్వీయూ ఔషధ మొక్కల పెంపు, హెర్బల్ చికిత్సలపై ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలోపు రెండేళ్ల పీజీ కోర్సు, ఏడాది పీజీ డిప్లొమో కోర్సుల ప్రా రంభం దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సు గంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికా రి ఆవుల చంద్రశేఖర్ యూనివర్సిటీని సందర్శించారు. నూతన వీసీ ప్రొఫెసర్ తాతా నరసింహరావుతోపాటు అధికారులను కలిసి సమీక్ష సమా వేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సుల ప్రారంభానికి వర్సిటీ అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్వీ యూ ప్రాంగణంలో ఔషధ మొక్కల నర్సరీని పెంచడానికి రూ.6.50 లక్షల నిధులను విడుదల చేసినట్లు బోర్డు సీఈఓ చంద్రశేఖర్ ప్రకటించారు. హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలను పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, బోటనీ విభాగం ప్రొఫెసర్లు ప్రొఫెసర్ టీ విజయ, ప్రొఫెసర్ కామాక్షి, అధికారులు పాల్గొన్నారు. స్కిట్, జేఎన్టీయూలో విలీనం జీఓ విడుదల శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేస్తూ మంగళవారం జీఓ విడుదలైంది. అయితే ఆలయానికి సంబంధించిన స్కిట్ కళాశాల భూములు, భవనాలను 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ఎకరాకు రూ.వెయ్యి, భవనాలకు రూ.50 వేల చొప్పున అద్దె చెల్లించేలా జీఓలో ఉంది. బోధన, బోధనేతర సిబ్బంది సంబంధించిన నియామకాలకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి డైలామాలో పడింది. -
నేడు పాఠశాలలకు సెలవు
తిరుపతి సిటీ: జిల్లాలో భారీ వర్షాలు కురు స్తున్న కారణంగాఈ నెల 22 తేదీన జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు బుధవా రం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలో వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున తి రుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మే రకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రై వేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తమ పరిధి లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే చేరవేయాలన్నారు. విద్యాసంస్థలు పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరీక్షా విభాగం పనితీరుపై ఆ వర్సిటీ వీసీ నరసింగరావు మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా విభాగంలోని ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు నిర్ణీత సమయంలో విడుదలయ్యేలా సంబంధిత అధికారులు చొర వ చూపాలని ఆదేశించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, క్రమశిక్షణతో నిజాయితీగా వ్యవహరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. పరీక్షకు సంబంధించిన పనిలో నిర్లక్ష్యం, అలసత్వం, ఆలస్యం, క్రమశిక్షణా రాహిత్యం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఏదైనా లోపాలకు సంబంధిత సిబ్బంది వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని, ఎక్కడ నిర్లక్ష్యం గమనించినా కఠిన చర్యలకు వెనుకాడబోమనని హెచ్చరించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజమాణిక్యం, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పరీక్ష విభాగం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై శ్రద్ధ పెట్టండి తిరుపతి అర్బన్: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సమీక్షకు జూమ్ కా న్ఫరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడు తూ మండల, డివిజన్, కలెక్టరేట్లో జరు గుతున్న పీజీఆర్ఎస్కు క్రమం తప్పకుండా అధికారులు హాజరుకావాలని చెప్పారు. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించే దిశగా పనిచేయాలని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థా యిలో పీజీఆర్ఎస్ నిర్వహించడంలో నిర్లక్ష్యం చూపితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రధానంగా కలెక్టరేట్లో తాగునీరు, వీధి లైట్లు, దారి సమస్య, శ్మశానం సమస్య తదితర అనేక అంశాలకు సంబంధించి కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్లో అ ర్జీలు ఇవ్వడం తప్పులేదని, అయితే చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారిసత్తే, అర్జీదారులు వ్యయప్రయాసాలకోర్చి కలెక్టరేట్కు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ను ప్రతిష్ట్మాకంగా భావించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి కల్చరల్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలకు యువ కళాకారులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ య శ్వంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు నరసింహతీర్థం రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ, పీజీ కళాశాల జరుగుతాయన్నారు. జానపద గ్రూపు నృత్యాలు, జానపద గ్రూపు గీతాలు వాయిద్య కళాకారులతో సహా 10 మంది చొప్పున పాల్గొనవచ్చని తెలిపారు. కవిత్వం, ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రకటన పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రథమ స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీలలో 16 నుంచి 29 ఏళ్ల వయస్సులోపు కలిగిన యు వత పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 27వ తేదీ లోపు తమ పేర్లను పుట్టి తేదీ, పోటీలో పాల్గొనే అంశాలతో కూడి దరఖాస్తులను వాట్సాప్ నంబర్ 8341111687లో సంప్రదించాలని తెలిపారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ సీప్టీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యువత విభాగం కార్యదర్శిగా కె.కళ్యాణ్కుమార్ (పలమనేరు), అసెంబ్లీ ని యోజకవర్గ ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అ ధ్యక్షులుగా చీకాల శివప్రసాద్ (పూతలపట్టు), కె.నాగభూషణం (పలమనేరు), పి.సుబ్రమణ్యం (సత్యవేడు) నియమితులయ్యారు. -
అపాయం.. అందని అభయం
అవి సరస్వతీ నిలయాలు.. ఆ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో చిరుతల సంచారం.. ఈ పరిష్కారానికి శాశ్వత చర్యలు లేమి.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో విద్యార్థులు.. అయినా అటవీ, వర్సిటీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యం.. హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్న వైనం.. వెరసి ఆ వర్సిటీల్లో విద్యార్జనకు వచ్చిన వేలాది మంది యవతీ యువకులు.. కోటి ఆశలతో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తిరుపతి సీటీ: శేషాచలం అడవులకు సమీపంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులు చిరుతల సంచారంతో కొన్నేళ్లుగా బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. గత ఏడాదిగా ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాల ప్రాంతాల్లో పలుసార్లు చిరుతలు సంచరించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అలిపిరి నుంచి జూపార్క్ రోడ్డులో గతంలో పలుసార్లు ఉద్యోగులు, యాత్రికులపై చిరుతలు దాడి చేసి గాయపరిచినా అటు అటవీశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సమాచారం వర్సిటీల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల్లో కేవలం మూడు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. చిరుతలు సంచరించే ప్రాంతాలపై అటవీ శాఖ రాత్రి సమయాల్లో పర్యవేక్షించకపోవడంతో చిరుతల సంచారం అధికమవుతోంది. ప్రస్తుతం వర్సిటీల్లో సుమారు రెండు చిరుతలు సంచరిస్తున్న పక్క సమాచారం ఉంది. కానీ తూతూ మంత్రంగా తాత్కాలిక బోన్లను ఏర్పాటు చేసి చిరుత బోనులో దొరికితే తాము ఏదో సాధించినట్లు వ్యవహరించి, బోనులో చిక్కుకున్న చిరుతలను మామండూరు, కోడూరు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో వదులుతున్నారు. దీంతో తమ పని పూర్తి అయ్యిందని వర్సిటీ అధికారులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించరా? వర్సిటీల్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతలకు అటవీశాఖ, వర్సిటీ అధికారులు చెక్ పెడతారా? లేదా? దీనిపై పోరాటం చేయాలా అని వర్సిటీ విద్యార్థులు అధికారుల ను హెచ్చరిస్తున్నారు. అలిపిరి నుంచి వర్సిటీల సరిహద్దుల్లో తక్షణం కంచె ఏర్పాటు చేసి, చిరుతల సంచారానికి చెక్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంచె ఏర్పాటు చేయకుంటే చిరుతల సంచారంతో జరగరాని సంఘటనలు జరిగి ప్రాణనష్టం జరిగితే వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పట్టపగలు తిరగాలన్నా భయం ఎస్వీ వెటర్నరీ వర్సిటీ సమీపంలో గెస్ట్హౌస్ ప్రాంతంలో చిరుత ఓ శునకాన్ని చంపినట్లు అక్కడి విద్యార్థులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అటు అటవీ శాఖ అధికారులు, ఇటు వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు వర్సిటీల్లో చిరుతలు హల్ చల్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. ఈ విషయంపై వర్సిటీ అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేని విద్యార్థులు చెబుతున్నారు. పట్టపగలు వర్సిటీలో తిరగాలన్నా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అర్బన్: ఈశాన్య రుతుపవనాలతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులు, డీఆర్వో నరసింహులుతో కలిసి వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షంతో ఇబ్బందులుంటే వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0877–2236007 నంబర్కు సమాచారం ఇ వ్వాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి అధికారులు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వరదనీరు పంపించే వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే అవసరం అయితే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఆ విభాగానికి చెందిన జేడీ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పాఠశాల, అంగన్వాడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు చెందిన పాత భవనాలను పరిశీలించి, ప్రమాదకరమైన స్థితి ఉంటే తగు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అత్యధికంగా వాకాడులో 104.6 మి.మీ. జిల్లాలో 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం నమోదైనట్లు సీపీఓ కార్యాలయ అధికారులు వెల్లడించారు. అయితే సరాసరిగా జిల్లాలో 32.9 మిల్లీమీటర్లుగా పేర్కొన్నారు. ప్రధానంగా వాకాడు మండలంలో 104.6 మి.మీ, సూళ్లూరుపేటలో 74.4 మి.మీ, ఓజిలిలో 62.8 మి.మీ, కోటలో 56.6 మి.మీ, దొరవారిసత్రంలో 53.8 మి.మీ, చిట్టమూరులో 53.6 మి.మీ, ఎర్రావారిపాళెంలో 5.2 మి.మీ, నారాయణవనంలో 4.6 మి.మీటర్ల నమోదైనట్లు పేర్కొన్నారు. -
తీరంలో రెడ్ అలర్ట్
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో దీని ప్రభావంతో వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో మంగళవారం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దాదాపు 5 నుంచి 7 మీటర్లు ఎత్తుకు ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంపై వేటకు ఎవరూ వెళ్లవద్దని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ ఆదేశించారు. మండలంలోని సముద్ర తీర మత్స్యకార గ్రామాలైన తూపిలిపాళెం, కొండూరుపాళెం, దుగ్గరాజపట్నం, అంజలాపురం, శ్రీనివాసపురం, ఓడపాళెం, వైట్కుప్పం, మొనపాళెం, చినతోట, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట గ్రామాల వద్ద హోరుగాలితోపాటు భారీ వర్షంతో సముద్రం ఉధృతంగా ఎగసి పడుతుంది. మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తగా రెండు రోజుల ముందుగానే వేటకు పోవడం మానుకున్నారు. తమ వేట సామగ్రిని ఒడ్డున భద్రపరిచి బోట్లకు లంగరు వేశారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత గత నాలుగు నెలల నుంచి అల్పపీడనాలు, వాయుగుండాలతో చేపల వేట సక్రమంగా జరగడం లేదు. దాదాపు ఈ నాలుగు నెలల్లో 45 రోజులుపాటు వేట నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మత్స్యకారులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సెల్ఫోన్ దొంగలు అరెస్ట్
తిరుపతి క్రైం: సెల్ఫోన్ దొంగలను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం.. సెల్ఫోన్ దొంగల సమాచారం మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామాంజినేయులు, సిబ్బంది తిరుపతిలోని విష్ణునివాసం, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర పరిసరాల్లో నిఘా పెంచారు. అక్కడ తచ్చాడుతున్న అనంతపురం జిల్లాకు చెందిన పవన్కుమార్నాయక్, హైదరాబాద్కు చెందిన మందాల దినేష్, ప్రకాశం జిల్లాకు చెందిన మోగానందరెడ్డి, మదనపల్లికి చెందిన అశోక్, కడపకు చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భక్తులు, యాత్రీకులు, ప్రయాణికుల వద్ద సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో విష్ణునివాసం వద్ద బెంగళూరుకు చెందిన యాత్రికుల రెండు సెల్ ఫోన్లు, 30 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు అంగీకరించారు. అలాగే టీటీడీ శ్రీనివాసం వద్ద యాత్రికుల రూమ్లో మూడు సెల్ఫోన్లు, రూ.10 వేల నగదు దొంగతనం చేసి పట్టుబడ్డారు. ఈ మేరకు వారి నుంచి 18 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఆపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. -
గ్రామదేవత విగ్రహ ధ్వంసం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కుక్కంబాకం పంచాయతీ తానిగిల్లు గ్రామ దేవత వేమలమ్మ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఈ మేరకు పోలీసుస్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గేట్ల తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ప్రతిమను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పరిపూర్ణం.. పవిత్రోత్సవం చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో దేవదేవేరులను ఊరేగించారు. ఈ క్రమంలోనే యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. వీధి కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు బుచ్చినాయుడుకండ్రిగ : స్థానిక ఈబీసీ కాలనీలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైలు కిందపడి వ్యక్తి మృతి తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట మార్గంలోని రిలయన్స్ అండర్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని వెల్లడించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు 9440627638 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
కమీషన్ల వైద్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరఫ్ పసి ప్రాణాలను బలిగొంది. అలాగే రాజస్థాన్లోని మరణాలు సంభవించాయి. సిరఫ్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, పొట్ట ఉబ్బిపోయి...మూత్రపిండాలు దెబ్బతినడంతో మరణాలు సంభవించాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ఆందోళనకు దారి తీసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్యంలో భద్రతను ప్రశ్ని స్తోంది. కాసుల కక్కుర్తి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి జిల్లాలో మందులు, మాత్రల వ్యాపారాన్ని నడిపిస్తోంది. కాసుల కక్కుర్తికి పాల్పడుతోంది. నాణ్యత లేని వాటిని అంటగడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తోంది. ప్రధానంగా పసి వైద్యం పెనుగండంగా మారింది. పసి ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో అధికారికంగా 1200 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అనాధికారికంగా 1000పైగా నడస్తున్నాయి,. ఆర్ంఎపీ క్లీనిక్లు 2వేల వరకు ఉంటున్నాయి. ఇటీవల 150 వరకు నకిలీ ఆర్ఎంపీలు పట్టుబడగా..ఇంకా వేల మంది నకిలీ ఆర్ఎంపీల అవతారాన్ని గుట్టు రట్టు చేయాల్సి ఉంది. దీనికి తోడు మెడికల్ షాపులు 1500 వరకు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు అతి క్రమిస్తున్నాయి. ఇష్టానుసారంగా మందులు, మాత్రలు అమ్మేస్తున్నాయి. అనుమతి లేని ఏజెన్సీలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు అత్యధికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నాయి. నిత్యం రూ. కోటి విలువ చేసే మెడిషన్లు జిల్లాకు దిగుమతి అవున్నాయి. రోజు వారీగా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వ్యాపారం నడుస్తోంది. ఇదే అదునుగా చేసుకుని మెడికల్ ఏజెన్సీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. జిల్లాలో 40పైగా ఏజెన్సీలు ఉండగా...అనుమతులు లేని ఏజెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కొన్ని నాణ్యత లేని మందులు, మాత్రలు మార్కెట్లోకి చేరిపోతున్నాయని అంటున్నారు. కంపెనీలు కొత్తగా తయారు చేసిన మందులు, మాత్రలు డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు రాకముందే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. చాలా మంది వైద్యులు కమీషన్లకు కుక్కర్తి పడి... నాణ్యత లేని మందులను రెఫర్ చేస్తున్నారని, ఇది ప్రజానీకానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోల్డ్రిఫ్లో ఏముంది.. మధ్యప్రదేశ్లో దగ్గు సిరఫ్ తీసుకున్న పిల్లలు మరణించారు. అక్కడి ప్రభుత్వం చేపట్టిన పరిశీలనలో పలు విషయాలు బయటకొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సైతం ఆ సిరఫ్పై పరిశీలన చేయగా వాస్తవాలను బయటపెట్టి..ఉత్పత్తిని ఆపేసింది. కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరఫ్లో (బ్యాచ్ నంబర్ –ఎస్ఆర్ –13), డై ఇథైలిన్ గ్లైకాల్ (డీఈజీ–48.6శాతం) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఇదంతా పిల్లలను హరించేలా పనిచేస్తాయని వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇదీ కిడ్నీపై ప్రభావితం చేస్తోందని బయటపడింది. కట్టడి చర్యలు ఏమాత్రం... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనలు చూసి కూడా జిల్లా అధికారుల్లో కనీస చలనం లేదు. జిల్లా లో అనధికారిక ఆస్పత్రులు కుప్పలు తెప్పలుగా ఉన్న చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో పలు ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుని పిల్లలు మృతి చెందిన ఘటనలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్ నియంత్రణ శాఖ అధికారులకు కనువిప్పు కలిగించడం లేదు. ఇలానే వదిలేస్తే..మరో మధ్యప్రదేశ్ వంటి ఘటనలను జిల్లాలో చూడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లల మందులు సైతం... జిల్లాలో ప్రధానంగా గుండె, బీపీ, షుగర్, క్యాన్సర్, తదితర సమస్యలకు సంబంధించిన మందులు, మాత్రలు మాత్రమే ఎక్కువగా అమ్ముడుబోతున్నాయి. తర్వాత గర్భిణులు, చిన్నపిల్లలకు సంబంధించిన మాత్రలు అధిక మొత్తంలో విక్రయాలు జరుగుతున్నాయి. కానీ పిల్లల విష యంలో చాలా మంది వైద్యులు సరైన నిబంధన లు పాటించడం లేదు. చికిత్స చేయడంతో పాటు జ్వరం, జలుబు వంటి వాటికి కూడా ఇంజెక్షన్లు, సిరఫ్ ఇచ్చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన వాదనగా నడుస్తోంది. అందులోనూ అధికంగా కమీషన్ ఇచ్చే మందులు, మాత్రలను మాత్రమే రెఫర్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో తరహాలో జిల్లాలో కూడా చాలా మంది వైద్యులు చిన్న పిల్లల దగ్గు, జలుబు నివారణకు కోల్డ్రిఫ్ను రెఫర్ చేశారని పలువురు అంటున్నారు. ఈ కోల్డ్రిప్ తయారీ కంపెనీ తమిళనాడులోని చైన్నెలో ఉండడం గమనార్హం. -
కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం
కోట : కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టిందని, దీంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ స్పష్టం చేశారు. ఆదివారం కోట మండలంలోని అల్లంపాడు, వంజివాక, పుచ్చలపల్లెలో పార్టీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మోసపూరితంగా సాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆరోపించారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే, వాటిని కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్రవర్మ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని కొనియాడారు. సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు క్యూలో బారులు తీరిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట, చిల్లకూరు మహిళా కన్వీనర్లు రేష్మ, లలిత, నేతలు రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ రాంబాబు, సాయిరెడ్డి, ప్రసాద్గౌడ్, సురేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు కోటయ్య పాల్గొన్నారు. -
చిన్నారి అప్పగింత
తిరుపతి క్రైమ్ : తల్లిదండ్రుల నుంచి దూరమైన చిన్నారిని మహిళా పోలీసులు తిరిగి అప్పగించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సుమారు 6 నెలల పాప ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో రాత్రి అంతా ఓ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి పాపను జాగ్రత్తగా చూసుకుంది. ఆదివారం ఉదయం మహిళా పోలీసుల వద్దకు చేర్చింది. ఈ క్రమంలో చిన్నారి అదృశ్యంపై ఈస్ట్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు అందిందని తెలియడంతో వెంటనే అక్కడకు వెళ్లి తల్లిదండ్రుల వివరాలను సేకరించి పాపను అప్పగించారు. పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ముక్కంటి సేవలో కల్వకుంట్ల కవిత
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆమె ప్రత్యేకంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి ఆదిదంపతుల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రంమలో వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, నేతలు పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి, కంఠా ఉదయ్కుమార్, గున్నేరి కిషోర్రెడ్డి, మున్నా రాయల్, మునికృష్ణారెడ్డి, కూనాటి రమణయ్యయాదవ్, పఠాన్ ఫరీద్, పసల కృష్ణయ్య, ముని, శివకుమార్యాదవ్, పులి రామచంద్ర, శ్రీను, సాగీరాబీ, షర్మిల ఠాగూర్, పెరుమాళ్ చౌదరి, ఫజల్ పాల్గొన్నారు. -
పోలీసుల తీరుపై పాత్రికేయుల నిరసన
చిల్లకూరు : మీడియా ప్రతినిధులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆదివారం గూడూరు టవర్ క్లాక్ వద్ద పలువురు పాత్రికేయులు నిరసన తెలిపారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికమవుతున్నాయని, వాటిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఫూటుగా మద్యం తాగి బైక్పై వెళుతూ కిందపడిపోయారని, వారిని పైకి లేపినందుకు విలేకర్లపైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పోలీసుల దృష్టికి తీసుకెళితే హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ తిరుపతయ్య వెంటనే అక్కడకు చేరుకుని విలేకర్లకు నచ్చజెప్పారు. డీఎస్పీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. రోడ్డుపై భైఠాయించిన మీడియా ప్రతినిధులు -
24న చైన్నెలో కార్గో వస్తువుల వేలం
తిరుపతి అర్బన్ : చైన్నెలోని మాధవరం బస్టాండ్లో ఉన్న తిరుపతి కార్గో పాయింట్ వద్ద డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు ఆర్టీసీ కార్గో ఇన్చార్జి నిర్మల తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు వేలం ఉంటుందని, పాట దక్కించుకున్నవారు వెంటనే మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వస్తువులను సైతం తక్షణమే తీసుకువెళ్లాల్సి ఉంటుందని వివరించారు. పారా మెడికల్ కోర్సులకు ఫైనల్ కౌన్సెలింగ్ రేపు తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ డిప్లొమా, పారామెడికల్ కోర్సుల్లో మిగులు సీట్లకు మంగళవారం తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిప్లొమా, పారామెడికల్ కోర్స్లలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు 9440879943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అంధకారంపై విజయమే దీపావళి తిరుపతి అర్బన్ : అంధకారంపై వెలుగు సాధించిన విజయమే దీపావళి పండుగని కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ అనిల్కుమార్ సంఘాల్ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ జిల్లావాసులందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు. ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి రూరల్ : ఏపీ లాసెట్– పీజీఎల్సెట్–2025 అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావలసిందిగా కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. 23న వెబ్ ఆప్షన్లు మార్పు, 25న సీటు అలాట్మెంట్, 27 నుంచి 29 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు httpr://cetr.aprche.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. రేపు తుమ్మలగుంటలో నరకాసుర వధ తిరుపతి రూరల్ : దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
ప్రాణం తీసిన గుంత
వరదయ్యపాళెం: మండలంలోని శ్రీకాళహస్తి–తడ మార్గంలో ఆర్ అండ్ బీ రహదారిపై పడిన గుంత నిండు ప్రాణాన్ని బలిగొంది. సత్యవేడు మండలం, జడేరి పంచాయతీ, కేవీకండ్రిగకు చెందిన ఎం.వెంకటేశులు (35) శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ తడలో నివాసముంటున్నారు. ఈ నెల 6న రాత్రి 10 గంటల సమయంలో వరదయ్యపాళెంలో తన స్నేహితుడిని కలుసుకుని తిరిగి తడలోని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బత్తలవల్లం సమీపంలో ఇనమాలగుంట వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపై ఉన్న గుంతలో దిగి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్ల దుస్థితి కారణంగా నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఈ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
అధ్యాపకుల కొరత
శాశ్వత అధ్యాపకుల కొరత వర్సిటీని తీవ్రంగా వేధిస్తోంది. సుమారు 400 మందికి పైగా శాశ్వత అధ్యాపకులు అవసరం ఉండగా కేవలం 130మంది మాత్రమే ప్రస్తు తం ఉన్నారు. తాత్కాలిక అధ్యాపకులను సైతం ఇటీవల తొలగించడంతో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారు. భాషా ప్రాతిపదిక కోర్సులైన సంస్కృతం, తెలుగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో పాటు హిస్టరీ, పొలిటికల్ సైనం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, హోంసైన్స్ వంటి కోర్సులలో ఈ ఏడాది కనీసం 15శాతం సైతం అడ్మిషన్లు కూడా లేకపోవడం దారుణం. ఎస్వీయూ పరిపాలనా భవనం -
కూటమి అరాచకాలపై సమరం
శ్రీకాళహస్తి : కూటమి అరాచకాలపై ఉద్యమించాలని, రెడ్బుక్ ఆగడాలను డిజిటల్ బుక్లో నమోదు చేద్దామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో శనివారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని మండలాలు, పట్టణం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా గ్రామ, వార్డు, మండల కమిటీల నియామకాలపై వైఎస్సార్సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. అక్రమ కేసుల అరెస్టుపై పోరాటం చేసేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉండాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని నిరంకుశ పాలనకు మంగళం పాడే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. జగనన్న చేసే యజ్ఞంలో మనం క్రియాశీల పాత్రదారులం కావాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని బూతు స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ ఉండాలన్నారు. టీడీపీ ఎల్లో మీడియా, సోషల్ మీడియా చేస్తున్న గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమని జగనన్న మాటగా గ్రామస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ముక్కంటి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి సిటీ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. శనివారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంధమనేని శివయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కాసులకు కక్కుర్తి పడి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలలో 7 కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకొని, 5 కళాశాలలో అడ్మిషన్లు పూర్తయ్యి, మిగిలిన కళాశాలల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరే వేసలుబాటు ఉన్నా చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఇందులో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యంకావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమానికి మద్దుతు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో తీసుకొస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రామకృష్ణ, ప్రవీణ్. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు జ్ఞానేంద్ర, నరేష్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెంగల్ రెడ్డి, వినోద్, యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు రామకృష్ణ, విక్రమ్, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ రాజు, జై భారత్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు భార్గవ్, పలు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
వైద్య విద్యను కాపాడుకుందాం
పుత్తూరు: కోటి సంతకాల ప్రజాఉద్యమంతో వైద్య విద్యను కాపాడుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏడీకే కల్యాణ మండపంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో ఐదింటిని పూర్తిచేసి ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెల్టుషాపులపై ఉన్న శ్రద్ధ.. మెడికల్ కాలేజీలపై లేదా? గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, మెడికల్ కాలేజీలపై ఎందుకు లేదని చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. వైద్య విద్య ప్రైవేటీకరణను ప్రజాఉద్యంతోనే అడ్డుకోవాలని, దీనికి ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు కంకణధారుడు కావాలని పిలుపునిచ్చారు. జగనన్న సీఎంగా తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలను సైతం తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘సూపర్గా’ మోసం! సూపర్ సిక్స్ పేరిట ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, చేయూత, ఆసరా వంటి పథకాలను అటకెక్కించారన్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోటి సంతకాలతో అడ్డుకుందాం మెడికల్ కళాశాలల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించి సంతకాలు చేయించాలని మాజీ మంత్రి రోజా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయించే కోటి సంతకాల పేపర్లతో జగనన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలసి వెళ్లి గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. తద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.జయప్రకాష్, డీ.శంకర్, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, రూరల్ పార్టీ ఆధ్యక్షుడు అన్నా లోకనాథం, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన యువ తరంగ్
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మూడు రోజులుగా ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువ తరంగ్ కార్యక్రమం శనివారం ముగిసింది. శ్రీనివాసా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ భాస్కరరావు మాట్లాడుతూ.. మనిషి జీవన వికాసానికి కళలు మూలాధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప చారిత్రక సాంస్కతిక కార్యక్రమాలను యూనివర్సిటీ చేపట్టిందని గుర్తు చేశారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం, అన్నమయ్య భవనం, సేనెట్ హాల్ వంటి కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ బీవీ మురళీధర్, కల్చర్ అఫైర్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, న్యాయ నిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
30న ముగియనున్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు
తిరుపతి సిటీ: 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువుని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడే డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్ వంటి మరిన్ని వివరాలకు వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించాలని, లేదా 8688888802 /9399976999 నంబరులో సైతం సంప్రదించవచ్చని తెలిపారు. సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల శిక్షణలో విశ్వం విద్యార్థులు గత కొన్నేళ్ల నుంచి అగ్రగామి సీట్లు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మద్యం మత్తులో మీడియా ప్రతినిధిపై దాడి చిల్లకూరు : తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద ముగ్గురు యువకులు స్థానికంగా ఉండే ఓ టీవీ రిపోర్టర్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు మద్యం తాగి గురువారం రాత్రి బైక్ నడుపుతుండగా బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. తాగి అంత వేగంగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న ఓ టీవీ రిపోర్టర్ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధి తన సెల్ఫోన్తో వారిని వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతడి సెల్ఫోన్ లాక్కుని ముగ్గురు యువకులు మూకుమ్మడిగా మీడియా ప్రతినిధిపై దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేయడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు అక్కడ నుంచి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు రోజుల తరువాత స్పందించి యువకులను స్టేషన్కు పిలిచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాగి వాహనం నడిపిన 26 మందిపై కేసు నాయుడుపేటటౌన్ : నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 26 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీనిపై న్యాయమూర్తి విచారించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం 26 మందికి రూ.2.60 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బాబి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి చంద్రగిరి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి మామండూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఒడిస్సాకు చెందిర రుద్రప్రసాద్(33) ముంగళిపట్టు సమీపంలోని జగనన్న కాలనీలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రుద్ర ప్రసాద్ మామండూరు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జేసీగా మౌర్యకు బాధ్యతలు
తిరుపతి అర్బన్:తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యకు జాయింట్ కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించా రు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటికే తుడా వీసీగా, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. టీటీడీలో కొరవడిన పారదర్శకత తిరుపతి కల్చరల్: టీటీడీలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడిందని శివరామేశ్వరి శక్తి పీఠాధిపతి శివానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ భక్తులు కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పినప్పుడు కలవాలని నిర్ణయం చేయడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తిరుమల స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొంది వాటిని డబ్బులకు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈవోను కలిసేందుకు తాము శుక్రవారం వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈవోను కలవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలని చెప్పడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈవో వ్యవహార తీరుతో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అనిల్కుమార్, జయరామిరెడ్డి, డిల్లీ, దీపక్, యజ్ఞేష్ పాల్గొన్నారు. -
రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా
– నవంబర్ 5వ తేదీకి మార్పు సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 5న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ప్రయోగాన్ని ఈనెల 16న చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో 25వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ 25 నుంచి నవంబర్ 5కి వాయిదా వేశారు. దీనికి తోడు ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో జీశాట్–7ఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని అనుకున్నారు. ఇందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలతో 25న అనుకున్న జీశాట్–7ఆర్ ప్రయోగాన్ని నవంబర్ నెల 5న ప్రయోగించనున్నారని తెలుస్తోంది. 2013 ఆగస్టు 30న ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో ఉపగ్రహాన్ని పంపనున్నారు. రేపు విద్యాసంస్థలకు సెలవు తిరుపతి సిటీ:జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల లకు సోమవారం మాత్రమే దీపావళి పర్వదినానికి సంబంధించి ప్రభుత్వ సెలవు ప్రకటించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోములు ఉన్న ఉపాధ్యాయులు స్థానిక అధికారు ల అనుమతితో అదనంగా లోకల్ హాలీడేకి అను మతి పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. -
ఏర్పేడు ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
● పనులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి జాతీయ రహదారి బైపాస్ మార్గం ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సూచించారు. శనివారం ఆయన ఏర్పేడు సమీంలోని రోడ్డు పనులను పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఏర్పేడు–వెంకటగిరి మార్గం వాహనాల రాకపోకలకు రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2023లో రూ. 98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలైనా కాంట్రాక్టర్లు ఇంకా పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటీ, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఏర్పేడు సమీపంలో రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతోనే తాను ఆగిపోయిన వంతెన పనులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పత్రికలపై కక్ష సాధింపు చిల్లకూరు : ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం సమంజసం కాదని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టడం తగదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక వార్త ప్రచురించారని కక్ష కట్టి సాక్షి ఎడిటర్పై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ శిరీషాను కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతు తుడా: దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం స్విమ్స్ ఆస్పత్రి ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,681 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. అట్టహాసంగా ‘దీక్షారంభం’ చంద్రగిరి : శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వహించిన దీక్షారంభం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీక్షారంభం కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు నూతన విద్యార్థులను డైరీ టెక్నాలజీపై క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పాటు బీటెక్ (డైరీ టెక్నాలజీ) 43వ బ్యాచ్ ఫ్రెషర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ జేవీ రమణ, ప్రత్యేక అతిథిగా డైరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యక్షుడు డాక్టర్ వైకుంఠరావు, అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. దీక్షారంభం కార్యక్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం, విద్యా అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. 15 రోజుల కార్యక్రమానికి సంబంధించిన నివేదికను విద్యార్థులు వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో ఫ్రెషర్డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వెటర్నరీ సైన్స్ డీన్ డాక్టర్ ఆర్వి. సురేష్ కుమార్, డాక్టర్ శోభారాణి, కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్లో మొదలై ఏప్రిల్లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. పక్షుల కేంద్రంలో గూడబాతులు తెల్లకంకణాయిలునత్తగుళ్లకొంగలు -
కలెక్టరేట్కు మళ్లీ బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపులు తప్పలేదు. శుక్రవారం ఏకంగా కలెక్టరేట్ భవనాన్ని పేల్చి వేస్తామంటూ సంక్షిప్త సందేశాలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో బెదిరింపులు వచ్చిన సందర్భంగా బాంబు పెట్టామని సమాచారం ఇచ్చారు. ఈ సారి పేల్చి వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో పాటు ఉదయం 10 గంటల సమయంలో మెసేజ్ పెట్టారు. దీంతో ఉద్యోగులు భయం భయంగా డ్యూటీలు చేశారు. కొందరు అయితే డ్యూటీకి వచ్చి చిన్న పని ఉందంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణం అంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది తప్పుడు సమాచారంగా నిర్ధారించారు. ఈ సంఘటనతో కొంతసేపు కలెక్టరేట్ ప్రాంగణంలో మొత్తం హడావుడి పరిస్థితి నెలకొంది. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. మెసేజ్ చేసిన వ్యక్తి వివరాలు కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు. -
వసూళ్ల పండగ!
చిత్తూరులో తాత్కాలిక టపాసుల షాపులు ఏర్పాటు చేస్తున్న వ్యవసాయమార్కెట్ స్థలం చిత్తూరు కలెక్టరేట్ : దీపావళిని కూటమి నేతలు, అధికారులు కాసుల వసూళ్ల పండుగా మార్చేశారు. టపాసుల దుకాణాలకు నిబంధనలను పక్కాగా పాటించినా తమ చేతులు తపడకుంటే అనుమతులు జారీచేసేది లేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీపావళి సందర్భంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక దుకాణాల ఏర్పాటులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే.. దుకాణాల యజమానులు మాత్రం అడిగినంత లంచం ఇచ్చి అందినకాడికి దోచుకుందామనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ లంచాల పర్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు 283 వరకు తాత్కాలిక టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. టపాసుల విక్రయాల్లో మార్జిన్ 50 శాతం కంటే ఎక్కువగా ఉండడంతో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుకు పోటీ పెరిగింది. నిబంధనలు పాటించకున్నా మామూళ్లు ఇస్తే ఏమైనా చేసుకోవచ్చని, ఏ రేట్లకై నా అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖలో ఇద్దరు అధికారులకు రెగ్యులర్ దుకాణాలకు ఒక్కొక్క ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లకు రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తాత్కాలిక దుకాణాలకు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో తాత్కాలిక టపాసుల దుకాణాలకు అనుమతులు కావాలంటే ప్రతి షాపునకు రూ.25 వేల చొప్పున స్థానిక కూటమి ప్రజాప్రతినిధికి ముట్టుజెప్పుకోవాల్సిందే. దీంతో పాటు అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులకు సైతం అదనంగా లంచం ఇచ్చుకుంటేనే అనుమతులు దక్కే పరిస్థితి నెలకొంది. తనిఖీలు తూచ్ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగుతున్న అక్రమ టపాసుల వ్యాపారాలను అరికట్టడంతో పాటు అనుమతులు జారీచేస్తున్న ఆయా శాఖల్లో జరుగుతున్న లంచగొండుతనాన్ని అరికట్టడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాల్సిన అవసరం ఉంది. సేల్స్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టపాసుల గోడౌన్లలో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి.. ఎంత మొత్తానికి ట్యాక్స్లు చెల్లించారు..? అన్న విషయాలను అధికారులు పట్టించుకోవడం లేదు. టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్, అగ్నిమాపక, శానిటేషన్, మున్సిపాలిటీ, నగరపాలక శాఖల నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేప్టీ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అనుమతులను జారీచేస్తారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు, పుంగనూరుతో పాటు తిరుపతి జిల్లాలోని తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చంద్రగిరి, నాయుడుపేట, సత్యవేడు, వెంకటగిరిలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 40 వరకు తాత్కాలిక షాపులను పెడుతున్నారు. వీటన్నింటికీ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తాత్కాలిక టపాసుల దుకాణాల ఏర్పాటుకు అందిన కాడికి దోచుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే ఏదో ఒక కారణంతో కొర్రీలు వేసి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అనుమతి పేరుతో భారీగా వసూళ్లు -
మార్కెట్లోకి న్యూ విక్టరీస్ కారు
తిరుపతి కల్చరల్ : మారుతీ సుజికీ సరికొత్త ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన న్యూ విక్టరీస్ కారును శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేశారు. రేణిగుంట రోడ్డులోని భార్గవి ఆటో మొబైల్స్ షోరూంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి కె.మురళీమోహన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్ హాజరై నూతన విక్టరీస్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సరికొత్త కారు అత్యధిక సేప్టీతో అత్యాధునిక టెక్నాలజీతో చాలా బాగుందని తెలిపారు. మొదటి సారిగా భారత్ ఎన్సీఏపీ గ్లోబల్ ఎన్సీఏపీ, 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. భార్గవి ఆటో మొబైల్స్ చైర్మన్ బలరామిరెడ్డి మాట్లాడుతూ.. ఎంఐడీఎస్యూవీ రేంజ్ కారులో ఏడీఏఎస్ లెవల్–2 ప్రవేశపెట్టారని తెలిపారు. షోరూం ఎండీ కె.నిరంజన్ మాట్లాడుతూ.. ఈ కారు డైనామిక్ ఇన్ మోషన్ డిజైన్తో ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇందులో 4 ఇంజన్ ఆప్షన్స్తో స్మార్ట్ లైబ్రడ్, స్ట్రాంగ్ బైబ్రో, 5 సీఎన్జీ ఆల్ గ్రిప్తో మార్కెట్లో అందుబాటులో ఉందన్నారు. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19,93,900 వరకు లభిస్తుందన్నారు. అంతేకాక ఈ కారు ఆకర్షణీయమైన పది రంగులలో అందుబాటులో ఉందని తెలిపారు. భార్గవి ఆటో మొబైల్స్ ఈడీ కొండా ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ కొత్త కారులో యువత మెచ్చే ఎంతో ఇష్టమైన మ్యూజిక్, డాల్బీ ఆటోమొడ్స్ హార్మన్ ఆలాంగ్ విత్ అండ్ స్పీకర్స్, సౌండ్ సిస్టమ్స్ సౌలభ్యం ఉందన్నారు. యువతను ఆకర్షించేలా 360 డిగ్రీ కెమెరా సదుపాయంతో పాటు అత్యధిక మైలేజీ వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భార్గవి సీజీఎం రమేష్ బాబు, డీజీఎం మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కుటుంబ కలహాలతో గురువారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునెయ్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండవ కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను నిరంజన్ ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. పెళ్లైన తర్వాత కొంత కాలం సజావుగా జరిగిన వీరి కాపురం అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి గ్రామ శివారున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అమ్మా.. నాన్నా ఇక సెలవు.. మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పెళ్లైనప్పటి నుంచి మా భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చారు. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. దయచేసి నాకు న్యాయం చేయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ వాళ్లు నా దగ్గర చాలా అప్పులు చేయంచారు. నేను కట్టలేని అప్పులు చేపించారు. దయచేసి వీళ్లను వదలొద్దు అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో మృతుని భార్య, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రైతు సభను అపహాస్యం చేయడం విడ్డూరం
తిరుపతి కల్చరల్ : రైతుల గోడుపై పూతలపట్టులో ఆక్రందన సభ పెట్టుకుంటే దానిని పూతలపట్టు ఎమ్మెల్యే ఆపహాస్యం చేయడం దుర్మార్గమని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ జాగీరు కాదని రైతు సంఘాల నేతలు పి.హేమలత, టి.జనార్దన్, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు ఎమ్మెల్యేకు ఘాటైన సమాధానం చెప్పారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నీ ప్రతాపం మామిడి రైతులపై కాదు, ఫ్యాక్టరీలపై చూపించాలని హితవు పలికారు. మామిడి రైతుకు రూ.8 , సబ్సిడీ రూ.4 కలిపి మొత్తం సొమ్ములు రైతులకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.4 సబ్సిడీ మాత్రమే చెల్లించిందన్నారు. అది కూడా ఆక్రందన సభకు ముందు రోజు విడుదల చేయడం అంటే అది రైతు సంఘం విజయమని తెలిపారు. బంగారు పాళ్యంలో రైతు సభను జరగనీయకుండా ఎమ్మెల్యే అధికారులతో, ప్రవేటు వ్యక్తులతో భయపెట్టి సభ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.40 ఫ్యాక్టరీలను నియంత్రించలేక 40 వేల మంది రైతులకు అన్యాయం చేయడం మీకు తగదన్నారు. మామిడి రైతులకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి పూనుకోవడం బాధాకరమన్నారు. బెదిరింపులతో మామిడి రైతుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.370 కోట్ల బకాయిలను తక్షణం ఇప్పించకపోతే జరగబోయే ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
బినామీల కోసమే ప్రైవేటీకరణ
వెంకటగిరి (సైదాపురం) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ఆంధ్ర రాష్ట్ర పేద బతుకులకు తలరాతలని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో అరాచకాలు పెరిగిపోతున్నాయని వాటికి పదింతలు బుద్ధి చెప్పే విధంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ 2.0 డిజిటల్ బుక్ను ప్రవేశ పెట్టారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు తగ్గరలోనే ఉందన్నారు. తాజాగా జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్యాదవ్, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను రాజకీయ కక్షతో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని కూటమి ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం మొదలైందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి 26వ డివిజన్లోని బండ్లవీధిలో శుక్రవారం కార్పొరేటర్ తాజిన్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూమన అభినయ్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలను పక్కన పెట్టి కేవలం రూ. 6 వేల కోట్లను ఖర్చుపెట్టి మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజినేయులు, బోకం అనిల్కుమార్, ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
భూరికార్డుల మార్పుపై ఒంటిపై డీజిల్ పోసుకుని నిరసన
బుచ్చినాయుడుకండ్రిగ : ఆన్లైన్లో భూ రికార్డులు మార్పు చేయడంపై తహసీల్దారు కార్యాలయంలోని చాంబర్ వద్ద బాధితుడు పాండురంగయ్య శుక్రవారం డీజిల్ పోసుకుని నిరసన తెలపడంతో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. మండలంలోని పల్లమాల గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 79–3లో తన తల్లి అనసూయమ్మ పేరున ఆన్లైన్లో 5 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని తహసీల్దారు పల్లమాల గ్రామానికి చెందిన రవీంద్రబాబు పేరుతో ఈనెల 8వ తేదీన మార్చారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే అనుసూయమ్మ పేరున ఉన్న భూమిని రవీంద్రబాబు పేరుతో మార్చారని ఆరోపించారు. ఈ ఘటనపై తహసీల్దారు శ్రీదేవి స్పందిస్తూ పల్లమాల గ్రామానికి చెందిన గోవిందమ్మ పేరుతో 5 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే శ్రీకాళహస్తి రాజీవ్నగర్కు చెందిన పాండురంగయ్య గోవిందమ్మ పేరుతో ఉన్న భూమిని తన తల్లి అనసూయమ్మ పేరుతో ఆన్లైన్లో 2020లో మార్చుకున్నారని తెలిపారు. దీనిపై గోవిందమ్మ కొడుకు రవీంద్ర తనవద్ద ఉన్న రికార్డులతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు భూ రికార్డులను మార్చామని తెలిపారు. -
చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడం ఏమిటని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్ఓ మోహన్కుమార్కు వినతి పత్రం అందజేశారు. -
‘శ్రీనివాసా’ ఇదేంది స్వామీ?
● ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిపై ఆరోపణలు ● వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు దుర్వినియోగం చేశారని లేఖలు సాక్షి టాస్క్ఫోర్స్: ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శివకామేశ్వరి శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివానందస్వామి టీటీడీ ఈఓ, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓకు లేఖ రాశారు. టీటీడీ కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయంపై విచారణ చేయాలని ఆలేఖ ద్వారా కోరారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను దుర్వినియోగం చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. టీటీడీ నుంచి పొందిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఆయన వనం శ్రీనివాస్ అనే దళారీ ద్వారా భక్తులకు ఒక్కో లెటర్ను రూ.20వేల చొప్పున విక్రయించినట్లు తనకు సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండడంతో పాటు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయన్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామికి టీటీడీ ద్వారా ఎన్ని వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు జారీచేశారో, ఆ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారో, వాటి వినియోగం ఎలా జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. భక్తుల వద్దకు టికెట్లు విక్రయించినట్లు నిరూపణ అయితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్వామీజీ ముసుగులో దళారీతో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని శ్రీశ్రీశ్రీ శివానందం స్వామి వివరించడం గమనార్హం. ఈమేరకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. -
కొల్లగొట్టు.. అడిగేదెవరు!
గూడూరు నియోజకవర్గంలో ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. గనుల లీజుల కాల పరిమితి దాటిపోయినా తవ్వకాలు ఆగడంలేదు. లీజు కాలం ముగిసిందని అడిగే అధికారి లేరు. ప్రభుత్వ సంపదను అక్రమంగా దోచేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులకు చెవికెక్కడంలేదు. స్థానికంగా ఉన్న ఓ కూటమి నేత అండ దండలతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ఖనిజ సందను కొల్లగొడుతున్నారు. అధికారుల నుంచి నేతల వరకు ముడుపులు ముట్టుజెబుతుండడంతో తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉన్నతాధికారులైనా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.! సాక్షి టాస్క్ఫోర్సు : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఖనిజ సంపదపై కన్నెసి అక్రమ మార్గంలో తవ్వి పచ్చనేతలు జేబులు నింపుకుంటున్నారు. అక్రమంగా ఖనిజ సంపదను తరలించడంలో స్థానిక నేత అండ దండలు ఉండడంతో గూడూరులో దొరికే ఖనిజ సంపద అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 2024లో కాలం ముగిసినా.. 50 ఏళ్లకు గూడూరు మండలం కందలిలోని మైన్స్కు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం 2024 నవంబర్ నాటికి కాల పరిమితి పూర్తి అయ్యింది. అయితే మైనింగ్ యజమానులు రెండవ సారి దరఖాస్తు చేసుకున్న 20 ఏళ్ల కాల పరిమితిని బూచిగా చూపుతూ స్థానిక కూటమి నేతల అండ దండలతో గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయితో పాటుగా ఇతర ఖనిజాలను తరలించేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే గనుల్లో గతంలో తవ్విన గుంతల్లో మట్టి నింపేందుకు పనులు చేస్తున్నామని చెబుతున్నారు. రాత్రి పూట తవ్వకాలను చేపట్టి మెటీరియల్ను మరోచోట డంప్ చేసి తరలించేస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టినా .. మైనింగ్కు సంబంధించిన ప్రతి ఖనిజానికి లీజుదారులు ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించాల్సి ఉంది. ఈ రాయిల్టీ ప్రభుత్వానికి అందడం లేదని ఇటీవల ఓ ప్రవేటు ఏజెన్సీకి రాయిల్టీ వసూళ్లకు అనుమతి ఇచ్చింది. వారు పలు ప్రాంతాలలో చెక్ పోస్టులు పెట్టారు. అయితే కందలిలోని మైనింగ్ యజమానులు గతంలో తవ్వి నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించుకునేందుకు అనుమతులు లేకపోయినా ఉన్నట్లు చెబుతూ అక్రమంగా తెల్లరాయిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఉన్నట్లా..లేనట్లా..! గూడూరు మండలం కందలి గ్రామ సమీపంలో కాలం చెల్లిన మైన్లో ప్రతి రోజు అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారని రెవెన్యూ, గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో కూటమి నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులు పట్టించుకోకపోవడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నిబంధనలకు తూట్లు మైనింగ్ లీజు పొందిన వారు కాల పరిమితి తీరి పోయిన తరువాత తవ్వకాలు చేపట్టిన భూమికే కాకుండా అదనంగా ఉండే ప్రాంతానికి కూడా డెడ్ రెంట్ చెల్లించాల్సి ఉంది. అయితే అలాంటివి ఏమి చెల్లించకుండా ఖాళీగా ఉండే భూమిలో తవ్వకాలు చేసి గతంలో తవ్విన గుంతలను నింపి వేస్తున్నారు. ఇలాంటి వాటిపై గనుల శాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చినా స్థానిక నేత అండ దండలు మెండుగా ఉండడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. స్థానిక నేతల అండదండలు గూడూరు నియోజకవర్గంలో దొరికే తెల్లరాయి, సిలికా, ఇసుక, లాంటి ఖనిజాలు అక్రమ తవ్వకాలు ఆగకుండానే కొనసాగుతున్నాయి. తెల్లరాయిని రాత్రి సమయంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెల్లరాయి తవ్వకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసినట్లు కనికట్టు చేసినా లోపల జరిగే తంతు మాత్రం అడ్డుకోలేకపోతోంది. గూడూరు మండలం కందలి గ్రామంలో ఉన్న ఓ మైన్కు లీజుల కాల పరిమితి అయిపోయినా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని దర్జాగా తరలించేసి సొమ్ము చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. -
బాలుడి ఆత్మహత్యపై విచారణ
చంద్రగిరి: బాలుడి ఆత్మహత్యపై గురువారం పోలీసు, ఎకై ్సజ్ అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన బాలుడిని మందలించడంతోపాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పారిపోయిన బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణాధికారులు బాలుడు పాఠశాలకు ఎన్ని గంటలకు వచ్చాడు. మద్యం సేవించి ఎందుకు వచ్చాడు. మద్యం బాటిల్ బ్యాగులో పెట్టుకుని ఎందుకు వచ్చాడన్న కోణంలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉదయం 8.30 గంటలకు పాఠశాల వచ్చిన బాలుడు మద్యం సేవించడంతోపాటు బ్యాగులో మద్యం బాటిల్ను పెట్టుకుని వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపై బాలుడిని హెచ్ఎం వద్దకు తీసుకెళ్లామని, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో బాలుడు పరుగులు తీస్తూ పాఠశాలలో గోడ దూకి పారిపోయినట్లుగా అధికారులకు తెలిపారు. మా బిడ్డను మాకు ఎందుకు అప్పగించలేకపోయారు మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు పాఠశాల నుంచి హెచ్ఎం ఫోన్ ద్వారా సమాచారం అందించాడని బాలుడు బంధువులు తెలిపారు. తాము వస్తున్నామని చెప్పిన 10 నిమిషాలకు పాఠశాలకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే తమ బాలుడు పాఠశాల నుంచి పారిపోయినట్లుగా ఉపాధ్యాయులు చెప్పడం వారి విధులు నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. తమ బిడ్డకు ఎలాంటి దుర అలవాట్లు లేవని, బాలుడిపై అసత్యప్రచారం చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఇలాగే ప్రవర్తిసారా? అంటూ మండిపడ్డారు. తమ బిడ్డను తమకు అప్పగించలేకపోవడంలో ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. బాలుడు తప్పు చేస్తే, వారికి తెలియకుండా సమాచారం ఇవ్వాలే తప్ప, ఇలా బాలుడి ముందే ఎలా ఫోన్ చేస్తారంటూ మండిపడ్డారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డ మద్యం సేవించి ఉంటే పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడవుతుందని, ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించాడని చెప్పడం దారుణమన్నారు. బెల్టు దుకాణం ద్వారా మద్యం కొనుగోలు చేసినట్లు ఆరోపణలు సీఎం చంద్రబాబు సొంత మండలంలో విచ్చల వి డిగా బెల్టు దుకాణాలు వెలిశాయి. 24 గంటలూ మద్యం లభిస్తుండడంతో ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పనపాకం నుంచి చంద్రగిరి వరకు 12 కిలోమీటర్ల దూరంలో సుమారు 15కు పైగా బెల్టు దుకాణాలను నడుపుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోకుండా, అధికారులు మామూళ్లకు అలవా టు పడి వారికి సహకరిస్తున్నారంటూ మండిపడ్డా రు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
2026 డిసెంబర్కు పనులు పూర్తి
చిల్లకూరు: గ్రీన్ఫీల్డ్ రహదారుల పనులు నాలుగు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకునివచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిల్లకూరు మండలంలో శరవేగంగా జరుగుతున్న సాగరమాల,(గ్రీన్ఫీల్డ్)రహదారి పనులను ఆయన 35 కి.మీ. మేర పరిశీలించారు. అలాగే చిల్లకూరు, కోట మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న క్రిస్ సిటీలో అభివృద్ధి పనులను పరిశీలించి, తీర ప్రాంతంలోనే ఏర్పాటు కానున్న సోలార్ ప్లాంట్ వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగరమాల నిర్మాణ సంస్థ ప్రతినిధులు, క్రిస్ సిటీ ప్రతినిధులతో వేర్వేరు సమీక్ష నిర్వహించి, వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే పను లు నాలుగు ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయన్నా రు. ఇందులో ఒకటి నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు, ఒకటి అంతర్గత రహదారి ప్రాజెక్టు, మరొకటి వరగలి క్రాస్ రోడ్డు నుంచి కృష్ణపట్నం వర కు, నాలుగోది నెల్లూరు జిల్లా ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వరకు మొత్తంగా 125 కి.మీ. మేర రహదారు ల నిర్మాణం జరుగుతుందన్నారు. వీటిలో మూడు ప్రా జెక్టు పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నాయుడుపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న రహదారి పనులు 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సుమారు రూ.3 వేల కోట్లతో చేపడుతున్న ర హదారుల నిర్మాణ పనులు పూర్తయితే, తీర ప్రాంతం సుందరంగా ఉంటుందని తెలిపారు. చిల్లకూరు, కోట మండలాల మధ్యలో ఏర్పాటు అవుతున్న క్రిస్ సిటీకి సంబంధించి తొలివిడతగా 2,500 ఎకరాల్లో ప నులు చేపడుతున్నామన్నారు. ఇందుకుగాను రూ.1200 కో ట్లు వెచ్చించనుండగా ప్రస్తుతం రూ.200తో పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఆయన వెంట గూడూరు ఎఫ్ఏసీ ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, నేషనల్ హైవే పీడీ నెల్లూరు చౌదరి, జిల్లా మైనింగ్ అదికారి బాలాజీ నాయక్, చిల్లకూరు, కోట తహసీల్దార్లు శ్రీనివాసులు, జేజే రావు ఉన్నారు. -
సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపును సద్వినియోగం చేసుకోండి
తిరుపతి మంగళం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, జిల్లా రవాణాశాఖాఽధికారి కొర్రపాటి మురళీమోహన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ అధికారులు రాజ్యలక్ష్మి, నవీన్కుమార్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, రమణా నాయక్, ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత, పరిపాలన అధికారులు విజయ ప్రశాంతి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
యువతే దేశ సంపద
తిరుపతి సిటీ: యువతే మన దేశానికి నిజమైన సంపదని ఎస్వీయూ వీసీ తాతా నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియం వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న యువతరంగ్ – 2025 కార్యక్రమంలో గురువారం వీసీ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితానికి కళలు, సాహిత్యం వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి సంప్రదాయాలకు కళలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా కళలు, సంగీతంపై ఆసక్తి ఉన్నా, సాధన చేయడం సాధ్యం కాలేదని తెలిపారు. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో యూనివర్సిటీ మంచి గుర్తింపును సంతరించుకోవడం శుభపరిణామన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సాంస్కృతిక అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. ర్యాలీలో అలరించిన వేషధారణ యువతరంగ్–2025లో భాగంగా వర్సిటీలోని అన్నమయ్య భవన్ నుంచి శ్రీనివాస ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణలో ర్యాలీలో పాల్గొన్నారు. కోలాటాలతో భక్తిరస గీతాలతో ఆలపిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన శ్రీవారి, అమ్మవారి వేషధారణలో వీక్షకులను అలరించాయి. ర్యాలీలో కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థినులు హల్చల్ చేసిన సినీనటుడు కిరణ్ అబ్బవరం ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం సందడి చేశారు. యువతరంగ్– 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, హల్చల్ చేశారు. విద్యార్థుల కేరింతల నడుమ ఆయన మాట్లడుతూ తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంతో ఉత్తేజం పొందానని తెలిపారు. తనకు వచ్చిన గుర్తింపునకు యువ త ముఖ్యకారణం అన్నారు. భవిష్యత్తులోనూ తనను ఇలాగే ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. తొలినాళ్లలో తనకు లక్ష్యం ఏమిటో అర్థం కాలేదని తెలిపారు. పాతికేళ్ల వయసులో జీవిత లక్ష్యం అర్థమైందని, కళాకారుడిగా రాణిస్తానని నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్, డీన్ ఆచార్య చెండ్రాయుడు, ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు సుధారాణి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆచార్య బీవీ మురళీధర్, కల్చరల్ అఫైర్స్ కో– ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ ఉదయ్, రాజశేఖర్, ప్రసన్న, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
భూ చోళ్లు
ప్రభుత్వాలు అడవుల పెంపకానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే కూటమి నేతలు ఉన్న అడవులు నరికివేసి, కొండలను చదును చేసి, మామిడి తోటల పెంపకం పేరుతో కబ్జా చేస్తున్నారు. కొంత కాలం తరువాత గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. కూటమి నేతలకు వంతపాడుతున్నారు. ఫలితంగా పచ్చదనం కరిగిపోతోంది. కొండను చదును చేస్తూ, వాహనాల్లో మట్టిని లోడ్ు చేస్తున్న హిటాచీరామచంద్రాపురం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే అటవీభూములు కనుమరుగైపోతాయి. 2014–19 నాటి ఆక్రమణలు ఏడాదిన్నర కాలంగా మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది.. అవకాశం ఉన్న మేర అటవీ భూములను ఆక్రమించేద్దాం.. దొంగ పట్టాలు సృష్టించుకుని ఇనుప కంచెలతో హద్దులు ఏర్పాటు చేసుకుని, కేంద్ర పథకం ఎన్ఆర్జీఎస్ నిధులతో మామిడి తోటలు పెంపకం, ఆపై రూ.కోట్లకు ఎన్నారైలకు భూములను విక్రయించేస్తున్నారు. అనుపల్లి, సి.రామాపురం, గుండోడు కనం, చిట్టత్తూరు, రాయలచెరువు, పిల్లారి కొండలు కబ్జా కోరల్లో చిక్కి భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మండల ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రజల ఆస్తులను ప్రకృతి సంపద కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు విధులను విస్మరించి, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ శాఖ సహకారం రైతులు, సామాన్య ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు కావాలంటే నెలలు తరబడి కార్యాలయల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల చేయి తడపనిదే సామాన్యుల పనులు ముందుకు సాగవు. అయితే అటవీ భూముల అక్రమణదారులకు, కూటమినేతల నివాసాల వద్ద అధికారులే పడిగాపులు కాసి, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్న సందర్భాలను చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. రెవెన్యూ మౌనమెందుకు? రామచంద్రాపురంలో జరుగుతున్న అటవీ భూములను, ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటూ.. ప్రజా సంపదను లూటీ చేస్తున్న రూ.కోట్ల విలువచేసే మట్టిని, భూములను కొల్లగొడుతున్న పట్టీపట్టనట్టు చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బందిపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. చట్టాలు, శిక్షలు సామాన్యులకేనా? కూటమి నాయకులకు వర్తించవా? అంటూ బహిరంగంగా నే ప్రజలు విమర్శిస్తున్నారు. సామాన్య రైతులు పట్టా భూములను ఆన్లైన్, పాస్ బుక్ చేసుకోవాలన్న ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ ఫైళ్లు ముందుకు కదలవని, అక్రమణ దారులకు, కూటమి నేతలకు మాత్రం అన్నీతామై కబ్జాదారుల పనులు సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అటవీ భూముల్లో మట్టి చదును చేస్తున్న జేసీబీరెవెన్యూ వ్యవస్థపై మండిపాటు మండలంలో రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటవీ భూములు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేక భూ బకాసురుల చేతులో బందీలుగా మారారు. అనుపల్లి సర్వే లెక్కల దాఖలాలో 411, 480లో గతంలో ఎన్నడూ లేని పట్టాలను సృష్టించుకుని అటవీ భూములను అదును చూసి చదును చేస్తున్నారు. గతంలో అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వ అనుకూల పత్రికలో ప్రచురితమైన కథనాల మేరకు అప్పటి జిల్లా అధికారులు స్పందించి బోగస్ పట్టాలను రద్దు చేసి, ఆక్రమణలను అడ్డుకున్నారు. మండల కేంద్రానికి 15 మైళ్ల దూరంలో అనుపల్లి అటవీ భూములున్నాయి. భారీ యంత్రాలతో రేయింబవళ్లు చదును చేస్తున్నారని, జిల్లా అధికారులకు సమాచారం తెలిసి వారువచ్చే సమయానికి మండల అధికారులు కూటమి నేతలకు సమాచారం చేరవేయడంతో అక్రమణదారులు అప్రమత్తమై యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాత్రి సమయంలో పనులను సజావుగా సాగిస్తున్నారని అనుపల్లి, కూనేపల్లి ప్రజలు మండిపడుతున్నారు. నిరసన చేపడతాం తమ పశువులు, జీవాలు మేతకు అటవీ భూములు ఆశ్రయంగా ఉండేవని ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకొని ఇనుప కంచెలు నిర్మించేశారని, భారీ యంత్రాల శబ్దాలకు జంతువులు అడవులు విడిచి జనావాసాలకు వస్తున్నాయని, ఈ ఆక్రమ ణలు ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు కనుమరుగుతుందని, ఒకప్పుడు అడవులు ఉండేవని చెప్పుకొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడక రైతులు వలసి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై జి ల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున అనుపల్లి కునేపల్లి ప్రజలు నిరసన చేపడతామని తెలియజేశారు. -
ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యం
● సౌత్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు తిరుపతి కల్చరల్: ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని సౌత్ ఇండియా ఓబీసీ వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఈనెల 12వ తేదీన జరిగిన సౌత్ ఇండి యా ఓబీసీ సెమినార్లో దక్షిణాదితోపాటు ఉత్తరాది రాష్ట్రాల ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఓబీసీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడంతోపాటు సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన శాసీ్త్రయ పద్ధతిగా చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన తమ వాటా హక్కు లను తమకు కేటాయించాలన్నారు. తెలంగాణ తరహాలో 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు -
కేసులతో మీడియాను భయపెట్టలేరు
వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి. – కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ -
శాస్త్రోక్తం..అంకురార్పణం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు గురువారం అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం ఆచార్య రిత్వికరణం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటలకు గ్రామోత్సవం, 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించి, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయమైన చర్య
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపితే పత్రికలపై ప్రభుత్వం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య. సాక్షి దినపత్రిక ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి. విచారణ పేరుతో హైదరాబాద్లోని కార్యాలయంలో గంటల తరబడి పోలీసులు హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే ఖండిచాలి తప్ప ఇలాి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. – కల్లుపల్లి సురేందర్రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి -
బైకును ఢీకొన్న టిప్పర్
● నాగలాపురం మండల సర్వేయర్ సునీత మృతి ● గ్రామ సర్వేయర్ దినేష్కు స్వల్పగాయాలు నాగలాపురం: ద్విచక్రవాహనాన్ని టిప్పర్ డీకొన్న ఘటనలో మండల సర్వేయర్ సునీత మృతి చెందగా గ్రామ సర్వేయర్ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని బైటకొడియంబేడులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. నాగలాపురం మండలంలో సర్వేయర్గా పనిచేస్తున్న సునీత, గ్రామ సర్వేయర్ దినేష్తో కలిసి సురుటుపల్లిలో సర్వే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో బైటకొడియంబేడు హైవేపై తిరుపతి వైపు వెళుతున్న ఓ టిప్పర్ బైకును ఓవర్టైక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెనుక కూర్చొని ఉన్న మండల సర్వేయర్ సునీత టిప్పర్ చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న దినేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన దినేష్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ షణ్ముగం తెలిపారు. -
కలానికి సంకెళ్లు!
ప్రశ్నిస్తే కేసులు.. వేధింపులు చిత్తూరు అర్బన్ : ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను పాత్రికేయులు ఎత్తిచూపితే అధికారులు, పాలకులు పొరపాట్లను సరిచేసుకోవాలి. బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రశ్నించే పత్రికలపై కేసులు పెడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కుకు సంకెళ్లు వేస్తున్నారు. మద్యంపై వార్తలు రాస్తున్నందుకు ‘సాక్షి’ పత్రికపై కక్షగట్టి కేసులు పెడుతున్నారు. జిల్లాలో కేసులు ఇలా.. పత్రికలో ఏదైనా కథనం ప్రచురితమైతే అందులో ఉన్న విషయాన్ని గుర్తించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. తప్పుచేసిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోచ్చు. కథనంలో ఏదైనా తప్పుగా ఉందనిపి స్తే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు. న్యాయపరంగా ముందుకు వెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి వార్తలు రాసిన పాత్రికేయులే లక్ష్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జర్నలిస్టులపై కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితి.. ములకలచెరువులో కల్తీ మద్యం తయారుచేయడం పై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇవ్వాలని బుధవారం ఏకంగా హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నల పేరిట ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డికు సైతం నోటీసులు ఇచ్చి, విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు. -
బ్యాంక్లో చోరీకి యత్నం
నాగలాపురం: నాగలాపురంలోని యూనియన్ బ్యాంకులో మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. బుధవారం ఉదయం బ్యాంకు అధికారులు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పుత్తూరు రోడ్డులోని బ్యాంకు పక్కనే సిమెంట్ గోడౌన్ షట్టర్ను పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. తర్వాత గోడౌన్ నుంచి బ్యాంకు గోడకు కన్నం వేసి చొరబడ్డారు. ముందుగా అలారం, సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. అనంతరం లాకర్ గదిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీటీవీ డీవీఆర్ బాక్సులు, హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారు. డీఎస్పీ రవికుమార్, ఎస్ఐ రామస్వామి, ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్ ఘటనాస్థలం పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీ ద్వారా ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,473 మంది స్వామివారిని దర్శించుకోగా 23,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఫీజు చెల్లింపులు.. తప్పని పడిగాపులు
తిరుపతి సిటీ : ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ రాజ్యమేలుతోంది. చివరకు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం ఆన్లైన్ చెల్లింపులను అందిపుచ్చుకున్నారు. అయితే డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ అంటూ ఆధునిక కోర్సులను బోధించే ఎస్వీయూనివర్సిటీలో మాత్రం ఫీజుల చెల్లింపులకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఫీజు కట్టాలంటే వర్సిటీలోని యూనియన్ బ్యాంకులో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. గంటల తరబడి నిరీక్షణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల క్రితమే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఎస్వీయూలో మాత్రం కళాశాల, హాస్టల్ ఫీజులు చెల్లించాలంటే విద్యార్థులు బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్సిటీలోని యూనియన్ బ్యాంక్లో ఒకే క్యాషియర్ ఉండటంతో సాధారణ కస్టమర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో సేవల కోసం ఎదురు చూస్తుంటారు.దీంతో ఫీజులు చెల్లించాలంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఫీజు చెల్లింపులకు ఒక రోజు కళాశాలకు సెలవు పెట్టాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ చొరవ చూపాలి ఎస్వీయూలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను తక్షణం అమలులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులో సిబ్బంది కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీసీ నర్సింగరావు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. -
పాఠశాలలో మందుబాబుల వికృత చేష్టలు
కేవీబీపురం: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కళత్తూరులోని ప్రాథమిక పాఠశాలలో మద్యం బాబులు వికృత చేష్టలకు దిగారు. రాత్రిళ్లు మద్యం సేవించి, పేకాట ఆడేందుకు, వ్యక్తిగత, అసాంఘిక కార్యకలాపాల కోసం పాఠశాలను వినియోగించుకోవడం అలవాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి బడికి వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అర్ధ రాత్రిలో బడిలోని పలు రికార్డులను చించేశారు. అక్కడే చిందరవందరగా పడేశారు. మద్యం సేవించిన వారు ఆ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లారు. సాపా, దిండు అక్కడే పడేశారు. దీనిపై స్థానిక నేత ద్వారా పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఎస్ఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే విధంగా తాళాలు పగలగొట్టి ,పాఠశాలలోకి చొరబడి నానా హంగామా చేశారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి పోలీసులు నిఘా పెట్టాలని కోరారు. ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ పూర్తిగా నిఘా ఉంచుతామని, దొరికిన రోజు మందు బాబుల మత్తు దించడమే కాకుండా, కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. -
జమేదారు బదిలీ
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలిపై ఆలయంలో దాడికి పాల్పడిన జమేదారు అలివేలుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా భక్తురాలిపై కుటుంబ సభ్యుల సమక్షంలో జమేదారు అలివేలు దాడికి పాల్పడింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆమెను ఆలయం నుంచి విధులను తప్పించి, అలిపిరికి బదిలీ చేశారు. గతంలోనూ ఇదే రీతిలో ఓ భక్తుడిపై దాడికి పాల్పడడంతో అప్పట్లో ఆమెను ఆలయం నుంచి బదిలీ చేశారు. కొద్ది రోజులకే కూటమి నేతల అండదండలతో ఆమె తిరిగి అమ్మవారి ఆలయానికి తిరిగి రావడం గమనార్హం. కాగా వివాదస్పద జమే దారు అలివేలును సున్నితమైన అలిపిరి సెక్టార్–5కు బదిలీ చేయడం విమర్శలకు తావ్విస్తోంది. -
పేదల ఆస్పత్రిపై
చక్రం తిప్పుతున్న సీఎం సమీప బంధువు ●పేద రోగుల ప్రాణాలకు భరోసా కల్పించాలి.. నాణ్యమైన చికిత్సలందించాలి.. నిపుణులైన వైద్యులతో సేవలందించాలి.. ఇదే లక్ష్యంతో స్విమ్స్ ఆస్పత్రిని టీటీడీ నెలకొల్పింది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వైద్యాలయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలకు వేదికగా మారిపోయింది. అందులో భాగంగానే నైపుణ్యంతో పనిలేకుండా తమ అనుచరులకు కొలువులు ఇప్పించే దిశగా పచ్చగద్దలు పథకం రూపొందించారు. టీటీడీపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేయించారు. ప్రజారోగ్యంతో యథేచ్ఛగా ఆడుకునేందుకు తెగబడ్డారు.సాక్షి టాస్క్ఫోర్స్ : ేపదల వైద్యాలయంగా ప్రసిద్ధి చెందిన స్విమ్స్ ఆస్పత్రి నేడు రాజకీయాలకు వేదికగా మారుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని కొందరు అధికార పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్విమ్స్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ, తాజాగా వైద్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అదునుగా టీడీపీ నేతలు తమ అనుచరులకు అవకాశం కల్పించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. తమ వర్గీయులకే పెద్దపీట స్విమ్స్ ఆస్పత్రిలో నియామకాల నుంచి బదిలీలు, ప్రమోషన్ల విషయంలో టీడీపీ నేతలు తమ వర్గీయులకే పెద్ద పీట వేస్తున్నా రు. సదరు ఇద్దరు నేతల ఆదేశాల మేరకు స్విమ్స్లో ప్రతి ఒక్కటీ నడుస్తోందని పలువురు కూటమి నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అనుచరు లను వైద్యులుగా నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయించారని చెబుతున్నారు. చివరకు బుధవారంనుంచి ఇంటర్వ్యూలు సైతం మొదలుపెట్టించారని స్విమ్స్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆస్పత్రిలో రాజకీయ జోక్యం మంచి పద్ధతి కాదని వాపోతున్నారు. మభ్య పెట్టి మంత్రాంగం స్విమ్స్ ఆస్పత్రిలో అక్రమాలపై కొందరు కూటమి నేతలు సైతం మండిపడుతున్నారు. పేదలకు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన స్విమ్స్ అధికారులు ఇద్దరు టీడీపీ నేతలకు తలొగ్గి అర్హత లేని వైద్యులను, సిబ్బంది నియమిస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నియామకాలకు పక్కా స్కెచ్ వేసిన సదరు టీడీపీ నేతలు మంత్రాంగం నడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని మభ్యపెట్టి తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేను డమ్మీని చేసి చక్రం తిప్పినట్లు సమాచారం. నీరుగారిన వైద్య సేవలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో పేదలకు వైద్యసేవలు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే విరాళాలను సైతం కొందరు టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పచ్చమూక అక్రమాలకు మంగళం పాడి, పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు స్విమ్స్ ఆస్పత్రిపై పెత్తనం వదిలిపెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ నియామకాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు. పునః పరిశీలించాలి స్విమ్స్లో వైద్యుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ను టీటీడీ అధికారులు పున:పరిశీలించాలి. కొత్త నియామకాల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అర్హతలు, నైపుణ్యం ప్రామాణికంగా పోస్టులను భర్తీ చేయాలి. వివక్ష, రాజకీయ జోక్య లేకుండా పేద రోగుల సేవే లక్ష్యంగా భావించే వారికే అవకాశం కల్పించాలి. ప్రస్తుత నోటిఫికేషన్లో కొన్ని అనవసరమైన పోస్టులను చేర్చారు. వాస్తవంగా అవసరమైన వాటిని తొలగించారు. దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇంటర్వ్యూలను చేపట్టడం సరికాదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, మళ్లీ కొత్తగా విడుదల చేయాలి. – నవీన్కుమార్రెడ్డి, బీజేపీ నేత, తిరుపతి స్విమ్స్లో తిష్ట వేసేందుకు టీడీపీ నేతల యత్నం సీఎం సమీప బంధువు స్విమ్స్ ఆస్పత్రిని శాసిస్తున్నారు. వైద్యుల నియామకాల్లో ఆయన చక్రం తిప్పుతున్నట్లు స్విమ్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని వైద్యుల పోస్టుల విక్రయాలపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక కోసం విభాగాలుగా వేసిన అన్ని కమిటీల్లోనూ సీఎం సమీప బంధువు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పేటశ్రీకి సాహితీ పురస్కారం
తిరుపతి సిటీ : ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి (పేటశ్రీ) రచించిన తిరుపతి కథలు పుస్తకానికి సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పుర స్కారం ప్రకటించింది. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నాంపల్లిలోని నందమూరి తారకరామారావు కళామందిరంలో ఆయనకు అవార్డుతోపాటు రూ.2,116 నగదు బహుమతి అందించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న శ్రీరంగం మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం ఉడిపిలోని కానీయూరు మఠం పీఠాధిపతి విద్య వల్లభ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత తిరుపతి అర్బన్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ మౌర్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై అవగాహన అవసరమని, రీసైక్లింగ్ చేయడం మంచిదని వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వర రాజు, డీపీఓ సుశీలాదేవి, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. ఎర్రచందనం పట్టివేత భాకరాపేట:అటవీ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో బుధవారం సుమారు రూ.25లక్షల విలువైన 15 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. అటవీ శాఖ అధికారి ఎన్.వెంకటరమణ, ఎఫ్బీఓలు వై.రాజేష్ కుమార్, ఎం.సదాశివయ్య, జి.ప్రదీప్ చంద్, సి.రవి, జేబీ నిఖిల్, డ్రైవర్లు హెచ్.శంకర్, ఎన్.రోహిత్ పాల్గొన్నారు. -
టీటీడీ చొరవ చూపాలి
టీటీడీ విద్యా సంస్థలలో చదువుకోవడం అదృష్టంగా విద్యార్థులు బావిస్తారు. అయితే హాస్టల్ సీట్లు దక్కకపోవడంతో చాలా మంది టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ చొరవ చూపాలి. ఇంటర్లో 950 మార్కులు సాధించిన విద్యార్థినికి పద్మావతి కళాశాలలో హాస్టల్ సీటు దక్కకపోవడం విచారకరం. తక్షణం హాస్టల్ సీట్లు పెంచాల్సిన అవసరముంది. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి ఉద్యమం తప్పదు టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించాలి. దూరాభారం నుంచి పేద విద్యార్థులు డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారు. కానీ ఇంటర్లో 95శాతం మార్కులు పొందిన విద్యార్థులకు కేవలం కాలేజ్లో సీటు ఇచ్చి హాస్టల్ వసతి కల్పించకపోవడం దారుణం. టీటీడీ అధికారులు పట్టించుకోకుంటే ఉద్యమం తప్పదు. – రవి, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి విద్యార్థుల జీవితాలతో ఆటలా.. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వందలాది మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హాస్టల్ సీట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అలాగే ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. కళాశాలల్లో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించాలి. కానీ టీటీడీ అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. తీరు మారకుంటే పోరుబాట పడతాం. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, తిరుపతి దారుణంగా ఉంది టీటీడీ విద్యా సంస్థలలో డిగ్రీ ప్రవేశాలు ఆలస్యంగా చేపట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నా రు. రెండు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా హాస్ట ల్ సీట్లు కేటాయించడంతో ఇటు కళాశాల అధికారు లు, అటు టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. కళాశాలలో సీటు పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి. ప్రధానం పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థినుల పరిస్థితి దారుణంగా ఉంది. – శివశంకర్ నాయక్, జీఎస్ఎన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి -
కమిషనర్తో ఎస్పీఏ బృందం
తిరుపతి తుడా: తిరుపతిలో జోనింగ్ నిబంధనలు – శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల 28న స్థానిక కచ్చపి ఆడిటోరియంలో వర్క్షాపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం (ఎస్పీఏ) కమిషనర్ను కలిసి మంగళవారం వివరించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో ‘‘ఎనర్జీ ఎఫిషెన్సీ కన్సిడరేషన్స్ ఇన్ జోనింగ్ రెగ్యులేషన్స్ – ఎ స్టడీ ఆఫ్ తిరుపతి’’ అనే ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా ఎస్పీఏ బృందం ప్రధానంగా భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసి కమిషనర్కు వివరించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్, డిప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు. -
ఇద్దరు చిన్నారులను రక్షించిన పోలీసులు
పాకాల : ఇద్దరు చిన్నారులను పాకాల పోలీసులు రక్షించారు. వివరాలు.. రైల్వే స్టేషన్లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రైల్వే పోలీసులు పాకాల పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు చిన్నారులను పట్టుకుని రక్షించారు. వారు సత్యసాయి జిల్లా, చెన్నెకొత్తపల్లి మండలానికి చెందిన మోహన్రాజ్ కుమారుడు కుమ్మరవరుణ్(12), సురేంద్ర(సూరి) కుమారుడు సి.తరుణ్(11)గా గుర్తించారు. ఈ నెల 11న ఇంటి నుంచి తప్పిపోయినట్టు తల్లిదండ్రులు చెన్నె కోత్తపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాకాల పోలీసులు చెన్నె కొత్తపల్లి పోలీసులకు వివరాలు అందించారు. అనంతరం పాకాల పోలీస్ స్టేషన్కు చేరుకున్న చెన్నేకొత్తపల్లి పోలీసులకు చిన్నారులను అప్పగించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాకాల పోలీసులను అభినందించారు. -
పత్తి గుట్టలో మట్టి దోపిడీ
సాక్షి, టాస్క్ఫోర్స్ : చంద్రగిరి సమీపంలోని పత్తి గుట్ట పచ్చనేతలకు ఆదాయ వనరుగా మారింది. ఏడాదిగా యథేచ్ఛగా మట్టిని తవ్వుకుంటూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ రెవెన్యూ అధికారులు దాడులు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం లెక్కచేయడం లేదు. వారం రోజులుగా రాత్రివేళల్లో అక్రమంగా పత్తిగుట్ట నుంచి వందలాది ట్రిప్పుల గ్రావెల్లో దోచేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరి బీసీ హాస్టల్ సమీపంలోని సర్వే నంబరు 1479లో సుమారు 5 ఎకరాలకుపైగా పత్తిగుట్ట ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పచ్చనేతలు ఈ గుట్టను చెరబట్టారు. జేసీబీల సాయంతో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల మట్టిని తరలించేస్తున్నారు. నెల క్రితం వరకు పగటి పూట అక్రమ దందా సాగిస్తున్న క్రమంలో రెవెన్యూ అధికారులు దాడులు చేయడంతో కాస్త తగ్గారు. అయితే వారం రోజులుగా గ్రావెల్ మాఫియా పడగవిప్పినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు సుమారు 10 ట్రాక్టర్లు, రెండు టిప్పర్లతో మట్టి తోలేస్తున్నారు. మంగళవారం రాత్రి ఒకేసారి 10 ట్రాక్టర్లు వరుస క్రమంలో మట్టిని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టవర్క్లాక్ సర్కిల్ నుంచే 10 ట్రాక్టర్లు ఏకకాలంలో వెళుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గస్తీ చేస్తున్న పోలీసులు సహకారం అందించడంతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు. -
తిరుమలలో తనిఖీలు
తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. పిడుగుపాటుకు 30 మేకలు మృతి ఓజిలి: పిడుగుపాటుకు 30 మేకలు మృతి చెందిన ఘటన ఓజిలి మండలం, భువనగిరిపాళెం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన తురక గురవమ్మ 60 మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు మేత కోసం మేకలు తోలుకుని అడవీ ప్రాంతానికి తరలించాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. గాలి విపరీతంగా వీయడంతో 28 మేకలు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాయి. మిగిలిన మేకలను తోలుకుని శ్రీనివాసులు ఇంటికి చేరుకున్నాడు. గాలీవాన నిలిచే సమయానికి రాత్రి కావడంతో మేకలు ఇంటికి రాలేదు. ఉదయం సమీపంలో బంధువులతో కలిసి వెదికాడు. పిడుగుపాటుకు గురై చెట్టు కిందనే 28 మేకలు మృత్యువాతపడ్డాయి. అలాగే గ్రామానికి చెందిన కొండూరు రవీంద్రరాజు, ముచ్చకాయల చంద్రమోహన్కు చెందిన మేకలు చెరొకటి మృతిచెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారుగా రూ.3.5 లక్షలు వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వీఆర్ఏ ఘటనా స్థలిని పరిశీలించారు. తహసీల్దార్పద్మావతికి నివేదిక పద్మావతికి నివేదిక అందించారు. రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు తిరుపతి క్రైమ్: తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ద్విచక్ర వాహనం కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రామకిషోర్ కథనం.. చౌడేపల్లి మండలం, శెట్టిపేటకు చెందిన శరత్బాబు జీవనోపాధి నిమిత్తం కారు డ్రైర్గా కుటుంబంతో కలిసి తిరుపతి క్రాంతినగర్లో నివాసముంటున్నాడు. అతని కుమారుడు కె.రిత్విక్ (9) ఓ ప్రయివేటు స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 7.40 గంటలకు రిత్విక్ ఇంటి ముందర రోడ్డుపై సైకిల్ తొక్కుతున్నాడు. సదరు స్కూల్ నుంచి జీవకో న రోడ్డు వైపు అతివేగంగా వచ్చిన రాయల్ ఎన్ఫిల్డ్ బైక్ ( AP39 C9049) ఢీకొట్టింది. బాలుడి తలకు, ముఖానికి, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. విచారణలో బైక్ నడిపింది తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన కే.సంతోష్గా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకిషోర్ తెలిపారు. -
జాతీయ సెమినార్ బ్రోచర్ విడుదల
తిరుపతి సిటీ: స్థానిక అంబేడ్కర్ గ్లోబల్ న్యాయ కళాశాల వేదికగా డిసెంబర్ 13, 14న నిర్వహించనున్న జాతీయ సదస్సుకు సంబంధించి బ్రోచర్లను కళాశాల చైర్మన్ డాక్టర్ తిప్పారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి ఎంతో మంది లా విద్యార్థులు, పరిశోధకులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని, నాలెడ్జ్ షేరింగ్, నూతన అంశాలపై విద్యార్థులకు సదస్సులు మరింత జ్ఞానాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిజయ కుమార్ బెహెరా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఉపాధ్యాక్షులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోండి
తిరుపతి అర్బన్: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఽఘం అధ్యక్షులు విజయభాస్కర్, కార్యదర్శి ధన్వంత్కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని కరూర్ వైశ్యాబ్యాంక్ వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ చేపట్టాలని పేర్కొన్నారు. క్లరికల్, సబ్స్టాఫ్ ఉద్యోగాల నియామకం, సీఎస్బీ బ్యాంకుల్లో సత్వర వేతన సవరణ, ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగుల పెన్షనర్లకు ఎక్స్గ్రేషియా చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘం కమిటీ సభ్యులు జనార్దన్, యగ్నేష్బాబు, కేశవరెడ్డి, భాస్కర్, రేష్మ, సుమంత్, నిర్మలదేవి, పవన్కుమార్, వెంకటలక్ష్మి, లక్ష్మీపతి, మహేష్, శంకరరావు, నటరాజ్ పాల్గొన్నారు. -
కొత్త టీచర్లకు సర్వీసు రిజిస్టర్లు పంపిణీ
తిరుపతి సిటీ: డీఎస్సీ–2025లో టీచరు పోస్టులు సాధించిన వారు మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరారు. వారికి యూటీఎఫ్ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు స్వాగతం పలికి సర్వీసు రిజిస్టర్లు, సేవా పుస్తకాలను అందజేసి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బండి మధుసూదన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పరంజ్యోతి, నగరపాలక అధ్యక్షులు వై.హేమాద్రి, ప్రధాన కార్యదర్శి ఎస్.ఖాదర్బాషా, కోశాధికారి ప్రభుకుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు వరలక్ష్మి, సుధ, ఢిల్లీ ప్రసా ద్, మహాలక్ష్మి, పెద్ద రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. -
నెత్తకుప్పంలో రోడ్డుకడ్డంగా గోడ
రామచంద్రాపురం: మండలంలోని నెత్తకుప్పం గ్రామంలో ఓ కూటమి నాయకుడు అధికార అహంకారంతో ఊరిని అక్రమ నిర్బంధంలోకి నెట్టేశాడు. రాజకీయ కక్షలతో గ్రామంలోకి ఓ కుటుంబం రాకపోకలను పూర్తిగా నిలిపివేశాడు. గ్రామ ప్రధాన రోడ్డుకే గోడ కట్టి మూసేశాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం.. స్థానికంగా జరిగిన చిన్న పంచాయితీ వివాదానికి దారితీసింది. దీంతో స్థానిక కూటమి నాయకుడు రెచ్చిపోయాడు. ఓ విలేకరి (సాక్షి కాదు) ఇంటి వద్ద ఏకంగా గోడను నిర్మించాడు. ఆ కుటుంబాన్ని గ్రామంలోకి రానీయకుండా అడ్డుకట్టవేశాడు. రోడ్డుకు అడ్డుగా గోడ కట్టేశాడు. గ్రామస్తులను కూడా నిర్బంధించాడు. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణకు చర్యలు చేపట్టారు. వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. -
17 నుంచి పవిత్రోత్సవాలు
– అంకురార్పణ రేపు చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 17వ తేది నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం తిరుప్పావడ సేవ, అక్టోబర్ 17 నుంచి 19 వరకు నిత్య కళ్యాణోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన శాఖను సోమవారం ఆ బ్యాంకు సీజీఎం రాజేష్కుమార్ పటేల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ స్థానిక ప్రజలకు మెరుగైన, విస్తృత సేవలందించేందుకు నూతన శాఖను ఏర్పాటు చేశామన్నారు. తమ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందించడం, ప్రాంతీయ ఆర్థిక సమ్మిళత లక్ష్యాలను అధిగమించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ జీఎం అమరేంద్రకుమార్ సుమన్, డీజీఎం దినేష్ గులాటి, ఆర్ఎం ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫోన్ లాక్కున్నారని ఆత్మహత్యాయత్నం పాకాల : సెల్ఫోన్ లాక్కున్నారని మనస్తాపంతో ఓ బాలుడు (15) ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం రాత్రి పాకాల భారతంమిట్టలో జరిగింది. ఇన్స్ట్రాలో చాటింగ్ చేస్తుండగా కుటుంబసభ్యులు సెల్ఫోన్ లాక్కోవడంతో బాలుడు వెంటనే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి బాలుడిని బయటకు తీసుకువచ్చారు. చేయి కోసుకుని అపస్మారకస్థితి చేరుకుని ఉండడంతో 108లో కొత్తకోట సీహెచ్సీకి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో.. అధికారి బరితెగింపు చంద్రగిరి : భక్తుల సేవే..భగవంతుని సేవ అనే సూత్రానికి టీటీడీ అధికారులు నీళ్లొదిలేశారు. భక్తులు ఎదురు మాట్లాడితే దాడులు చేస్తాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమలంఓనే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ అధికారి తీరు దారుణంగా తయారైంది. భక్తులపైనే దాడులకు పాల్పడుతున్నారు. వివరాలు.. అమ్మవారి దర్శనానికి చైన్నెకు చెందిన ఆండాళ్ అనే హిజ్రా తన కుటుంబంతో మంగళవారం వచ్చింది. గర్భాలయంలో పద్మావతీదేవిని ఆండాళ్ దర్శించుకునే సమయంలో అలివేలు అనే జమేదారు దురుసుగా ప్రవర్తించింది. ఆవేశంతో హిజ్రాపై చేయి చేసుకుంది. దీంతో ఇరువురూ దూషణ పర్వానికి దిగడంతో భక్తులు దిగ్భాంత్రి చెందారు. గతంలో అనేక సార్లు అలివేలు ఇదే తరహాలో భక్తులపై దాడి చేసిన ఘటనలు ఉన్నట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
పౌష్టికాహారంతో ఆరోగ్యం
తిరుపతి అర్బన్ : పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంతో ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ పోషకాహార మాసోత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రజలతోనే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు పీఎం పోషణ్ అభియాన్ను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బాలామృతం. బాలామృతం ప్లస్ కార్యక్రమాలను కచ్చితంగా చేపట్టాలని కోరారు. అనంతరం ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ను పరిశీలించారు. బెస్ట్బేబీస్గా ఎంపికై న పిల్లల తల్లులు, ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ కేవీఎన్ కుమార్, డీఐఓ డాక్టర్ శాంతాకుమారి, టాటా ట్రస్ట్ మేనేజర్ సుబ్రమణ్యం, విజయవాహిని ట్రస్ట్ వీరబాబు, స్కిల్ డెవల్మెంట్ అధికారి లోకనాథం పాల్గొన్నారు. -
ఐజర్కు ఎస్బీఐ భారీ విరాళం
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్)కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.23.60లక్షల విరాళం అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఐజర్లో మౌలిక వసతుల కల్పన ఈ మొత్తం అందజేసింది. ఇందులో అత్యవసర వైద్య సేవల నిమిత్తం రూ.15.38లక్షల విలువైన అంబులెన్స్, క్యాంటీన్ సేవల మెరుగుపరిచేందుకు రూ.8.22లక్షల విలువైన ఆటోమెటిక్ కియోస్క్ వ్యవస్థను వితరణ చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్బీఐ ఉన్నతాధికారులు రాజేష్కుమార్ పటేల్, అమరేంద్రకుమార్ సుమన్, దినేష్ గులాటీ చేతుల మీదుగా ఐజర్ ప్రతినిధులకు అందజేశారు. ‘సంతకాల’తో ప్రజా ఉద్యమం నాగలాపురం : మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం చేపట్టామని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో కోతి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. రాజేష్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 వైధ్య కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి సర్కారు నిర్ణయం సరికాదన్నారు. గత ప్రభుత్వం 6 కళాశాల నిర్మాణం పూర్తి చేసిందని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి, సంతకాల సేకరిస్తున్నామని వెల్లడించారు. పేద విధ్యార్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని మండి పడ్డారు. దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నేతలు అపరంజిరాజు, చిన్నదొరై, శ్యామ్, జగదీష్ రెడ్డి, మహేష్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, మోహన్ మొదలియార్, కులశేఖర్ రెడ్డి, వజ్రవేలు, షాబుద్దీన్,ఈశ్వర్, దానివేలు, ఏలుమలై, బాబు, చిరంజీవి, ఉదయ్ కుమార్, హరిబాబు పాల్గొన్నారు. నేటి నుంచి టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం ఆనవాయితీగా టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద జాబిలి భవనంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డు చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ తీసుకోవాలని సూచించింది. పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుందని వెల్లడించింది. 15, 16 తేదీలలో 164 నుంచి 5,500 పీపీఓ నంబర్ వరకు, 17న 5,501 నుంచి 7,000, 18న 7,001 నుంచి 8,500, 22న 8,501 నుంచి 10,000 వరకు, 23న 10,001 నుంచి 12,500 వరకు, 24వ తేదీన 12,501 నుంచి మిగిలిన వారికి ప్రసాదాలు అందించనున్నట్లు పేర్కొంది. బుద్ధుని విగ్రహావిష్కరణ డక్కిలి : మండలంలోని వెంబులూరు పంచాయతీ అంబేడ్కర్ నగర్లో మంగళవారం గౌతమ బుద్ధుని విగ్రహం ఆవిష్కరించారు. అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షుడు గండోలు గోపాల్ ఆధ్వర్యంలో బంతేజి దమ్మానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమితి వ్యవస్థాపకుడు ఇంగిలాల రామచంద్రరావు, నేతలు ఎరబోతు సుబ్రమణ్యం, నిజమాల ప్రసాద్, చిట్టేటి రమణయ్య, జంగిటి వెంకటయ్య, నావూరు శంకర్ పాల్గొన్నారు. -
తట్టోడు గుంట దర్జాగా కబ్జా
రామచంద్రాపురం: తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న సి.రామాపురం మండలం తట్టోడుగుంట ప్రస్తుతం కూటమి నాయకుల అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. గతంలో రైతుల సాగుకు ఆధారమైన ప్రభుత్వ కుంటభూమి కొంతమంది కూటమి నాయకుల కబ్జాలోకి వెళ్లిపోయింది. తిరుపతికి కూత వేటుదూరంలో సి.రామాపురం ఉంది, పట్టణాభివృద్ధి సంస్థలో భాగమై ఉండడం వలన మండల వ్యాప్తంగా భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కూటమి నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సర్వే నంబర్ 34/3లో తట్టోడు కుంట సుమారు ఐదు ఎకరాల్లో ఉంది. ఈ తట్టోడుగుంట గతంలో రామాపురం రైతులకు సాగు తాగునీరు అందించేది. కొంతమంది నాయకుల స్వార్థంతో తట్టోడుగుంటకు వచ్చే కాలువలను పూడ్చి, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తట్టోడుగుంటలో ముళ్ల పొదలు బలంగా ఉన్నాయి. రహదారికి సమీపంలో గదులు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భారీ ముళ్లపొదలు అడ్డుగా ఉండడం వల్ల కనిపించడం లేదు. ఇదే అదునుగా భావించిన కూటమి నాయకులు దర్జాగా గదుల నిర్మించేసి, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులకు, ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఈ ప్లాట్లను అమాయకులు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
ఇవేం గొడవలు బాబోయ్!
రేణిగుంట: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి, అటెండర్ తిరుమలేష్ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం సదరు అటెండర్తో డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ ఘర్షణ పడ్డారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ నేతలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ తిరుమలేష్తో వాగ్వాదానికి దిగారు. తిరగబడిన క్రయవిక్రయ దారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తిరగబడ్డారు. డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ మధ్య రోజూ గొడవలు జరుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు మానుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇలా ఘర్షణ పడటం తగదని మండిపడ్డారు. ఏదైనా ఉంటే బయట చూసుకోండని తెగేసి చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ జోక్యం చేసుకుని డాక్యుమెంట్ రైటర్లను వెలుపలకు వెళ్లాలని ఆదేశించారు. రైటర్ల నిరసన జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిరసన తెలిపారు. అటెండర్ తిరుమలేష్పై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించారు. -
తుడా వీసీకిఘనంగా వీడ్కోలు
తిరుపతి తుడా:తుడా వీసీ శుభం బన్సల్కు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం ఈ మేరకు తుడా కార్యాలయంలో కార్యదర్శి శ్రీకాంత్, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో సత్కరించారు. తుడా అభివృద్ధికి శుభం బన్సల్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. అధికారులు సుజన, దేవకికుమారి, శైలజ పాల్గొన్నారు. గజదాడులపై ఆందోళన భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ తుమ్మచేనుపల్లెలో ఏనుగుల దాడు లు పెరిగిపోతున్నాయని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పంట పొలాలు, కొబ్బరి చెట్లను ఏనుగుల నాశనం చేస్తున్నాయన్నారు. దీనిపై గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. -
బస్సులు.. తప్పవు పడిగాపులు
తిరుపతి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు(ఫైల్) తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ సభలు నిర్వహించినా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత 5 నెలల వ్యవధిలో 6 సమావేశాలకు మొత్తం 1,170 బస్సులను తిరుపతి నుంచి తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఈక్రమంలోనే గురువారం కర్నూలులో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సైతం జన సమీకరణ నిమిత్తం బుధవారమే జిల్లా నుంచి 325 బస్సులను తీసుకెళుతున్నారు. తిరిగి శుక్రవారం ఆ సర్వీసులు జిల్లాకు రానున్నాయి. దీంతో మూడు రోజుల పాటు ప్రయాణికులకు బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు తప్పని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో మొత్తం 774 బస్సులు ఉన్నాయి. అందులో 70 బస్సులు మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. మిగిలిన 700 బస్సుల్లో 325 సర్వీసులను తరలిస్తే కేవలం 375 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 50శాతం బస్సులను ఒక్క సభ కోసం పంపిస్తే ప్రజలు ఎంత ఇబ్బందిపడతారో కూడా ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు మండిపడుతున్నారు.జిల్లా నుంచి తరలిన బస్సుల వివరాలు మే 2న : అమరావతి సభకు – 156 మే 18న : యోగా దినోత్సవానికి వైజాగ్కు – 35 మే 29న : టీడీపీ మహానాడుకు – 154 సెప్టెంబర్ 10న : అనంతపురంలో సూపర్ సిక్స్ సభకు – 335 సెప్టెంబర్ 19న: విజయవాడలో డీఎస్సీ ఉపాధ్యాయుల సభకు – 165 అక్టోబర్ 15న : కర్నూలు సభకు 325 -
మంచి విధానం కాదు
ఎక్కడో నిర్వహించే సభలకు ఇక్కడి నుంచి బస్సులను పంపించడం మంచి విధానం కాదు. జన సమీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. అంతగా అవసరమైతే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోవాలి. అంతే కానీ ఆర్టీసీ సర్వీసులను తీసుకెళితే ప్రయాణికులు ఎంతగా అవస్థలు పడతారో పాలకులు గుర్తించాలి. ఇందులో కూటమి ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. – వేణుగోపాల్, తిరుపతి వ్యతిరేకత తప్పదు ప్రతి దానికీ అనవసరంగా ఆర్టీసీ బస్సులను వాడేస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పకుండా పెరుగుతుంది. ప్రయాణికులను ఈ విధంగా అవస్థలకు గురిచేయడం దారుణం. బస్టాండుల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వచ్చే అరకొర బస్సుల్లో ఎక్కేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుంది. జిల్లాలో ఆర్టీసీ తీరు కూడా అధ్వాన్నంగా ఉంది. – జనార్ధన్రెడ్డి, రేణిగుంట -
నిబంధనల మేరకే బాణసంచా విక్రయం
తిరుపతి రూరల్ : నిబంధనల మేరకే బాణసంచా విక్రయాలు సాగించాలని, అనుమతి లేకుండా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తహసీల్దార్లు, బాణసంచా వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భారీ శబ్దాలు వచ్చే టపాకాయలపై నిషేధం ఉందని వెల్లడించారు. ఇళ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. పన్నులను సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ క్రమంలోనే బాణసంచా దుకాణాలను తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయా షాపుల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో.. తిరుపతి నగరంలో తుడా కార్యాలయం వద్ద ఇందిరామైదానం, ఇస్కాన్ ఆలయం సమీపంలోని మైదానం, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, తారకరామా స్టేడియంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆదేశించారు. -
టీటీడీకి రూ.1.05 కోట్ల విరాళం
తిరుమల:టీటీడీ ట్రస్టులకు సోమవారం రూ.1.5 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఏడీఓ ఫౌండేషన్ వారు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేశారు. బెంగుళూరుకు చెందిన ఎం.రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. డీడీని టీటీడీ చైర్మన్కు అందజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పల గిరిధర్ అనే భక్తుడు సైతం బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు అందించారు. ఈ మేరకు దాత టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు. గుంటూరుకు చెందిన సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళం అందించారు.తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,424 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,872 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారిరిక 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ..!
రేణిగుంట : భూముల రిజిస్ట్రేషన్లతో కళకళలాడే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఒక్కోసారి సిబ్బంది.. మరోసారి డాక్యుమెంట్ రైటర్ల వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూనే ఉంటోంది. ఇదే క్రమంలో సోమవారం సైతం కార్యాలయంలోనే పరసర్పం దాడులు చేసుకునే దుస్థితి దాపురించింది. అటెండర్ తిరుమలేష్, డాక్యుమెంట్ రైటర్ల మధ్య వివాదం ముదిరి ఆఫీస్ రణరంగంగా మారిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం చేయడంపై అటెండర్ ప్రశ్నించడంతో గొడవ పెరిగింది. మమ్మల్ని అడ్డుకునేందుకు నువ్వెవరు అంటూ అటెండర్పై డాక్యుమెంట్ రైటర్లు దాడికి ప్రయత్నించారు. దీంతో సుమారు రెండు గంటలపాటు దూషణ పర్వం కొనసాగింది. ఇదే సమయంలో వివిధ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు నానా అవస్థలు పడ్డారు. డాక్యుమెంట్ రైటర్లదే హవా సబ్ రిజిస్ట్రార్తో సన్నిహితంగా నడిచే కొందరు డాక్యుమెంట్ రైటర్లు ప్రస్తుతం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హవా సాగిస్తున్నారు. దాదాపు అన్ని రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయంతోనే జరుగుతున్నాయనే విమర్శలు వినపడుతున్నాయి. అందులోనూ ప్రస్తుత వివాదాల కారణంగా రిజిస్ట్రేషన్ త్వరితగతిన కావాలంటే డాక్యుమెంట్ రైటర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి వస్తోందని క్రయవిక్రయదారులు వాపోతున్నారు. దీంతో అటు ప్రభుత్వం ఇటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు భారీగా నష్టపోతున్నారు. అటెండర్పై ఫిర్యాదు అటెండర్ తిరుమలేష్పై సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డికి సోమవారం దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి వచ్చే వారితో తిరుమలేష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దూషిస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెండర్ సైతం పలు ఆరోపణలు చేశారు. తన విధులను డాక్యుమెంట్ రైటర్లు, దళారులు అడ్డుకున్నారని చెప్పారు. దాడి చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. క్రయవిక్రయదారుల నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 300 మీటర్ల దూరంలో ఉండాల్సిన డాక్యుమెంట్ రైటర్లు నిత్యం నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.తొలి నుంచి అటెండర్, సబ్ రిజిస్ట్రార్ మధ్య గొడవలు అటెండర్ తిరుమలేష్ నాలుగు నెలల క్రితం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. అప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి జాయినింగ్ లెటర్ తీసుకోకుండా ఇబ్బంది పెట్టాడని అటెండర్ తన కుల సంఘం నేతలను తీసుకురావడంతో వివాదం తలెత్తి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. ఉన్నతాధికారుల జోక్యంతో తిరుమలేష్ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే వారం క్రితం అటెండర్ తిరుమలేష్ విధులకు ఆలస్యంగా వస్తున్నారని సబ్రిజిస్ట్రార్ హెచ్చరించడంతో మళ్లీ గొడవ మొదలైంది. దీనికితోడు వాటాల పంపకంలో తేడా రావడం కూడా వివాదాలకు కారణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వేర్వేరు చోట్ల బాణసంచా పట్టివేత
సూళ్లూరుపేట/చంద్రగిరి : జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణం, చంద్రగిరి నియోజకవర్గంలోని తనపల్లెలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.7.5లక్షల బాణసంచాను పోలీసులు సోమవారం సీజ్ చేశారు. వివరాలు.. సూళ్లూరుపేట పట్టణంలోని కోటపోలూరు రోడ్డులో ఉన్న గోడౌన్లో లైసెన్స్ లేకుండా నిల్వ చేసిన సుమారు ’ 2.5 లక్షలు విలువ చేసే 85 బాక్సులు బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. అలాగే తిరుచానూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తనపల్లెలో కొల్లు దామోదర్రెడ్డి అనే వ్యక్తి నిల్వ చేసిన రూ.5లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. -
శభాష్ పోలీసు.. !
చంద్రగిరి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని అతన్ని కాపాడి శభాష్ అనిపించున్నారు. తిరుపతికి చెందిన మురళీనాయక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాసమంగాపురం సమీపంలో రైల్వే ట్రాక్పైకి చేరుకున్నాడు. డయల్ 100కు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపారు. అప్రమత్తమైన కమాండ్ కంట్రోల్ అధికారులు చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూకోట్స్లో విధుల్లో వున్న కానిస్టేబుల్ చిరంజీవి, కిరణ్, శ్రీను ఫోన్ నంబరు ఆధారంగా మురళీ నాయక్ వద్దకు చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పి క్షేమంగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం ఇంటికి పంపించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. -
ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్
తిరుపతి రూరల్ : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా లోతేటి శివశంకర్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయనను రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఐఏఎస్ క్యాడర్కు కేటాయించారు. దీనిపై ఆయన డీఓపీటీను ఆశ్రయించారు. ఎట్టకేలకు ఏపీ కేడర్కు పంపించారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్కు రిపోర్ట్ చేశారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ప్రభుత్వం నియమించడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాన శాఖల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. సంతోష్రావుకు వీడ్కోలు ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సంతోషరావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్క రైతుకు సోలార్ పవర్ను చేరువ చేస్తామని నూతన సీఎండీ లోతేటి శివశంకర్ తెలిపారు. ఆయన సోమవారం తిరుపతి నగరంలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
మహిళా క్రికెట్ జట్టులో ఐదుగురికి చోటు
తిరుపతి ఎడ్యుకేషన్:ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇటీవల ప్రకటించిన ఆంధ్రా ఉమెన్స్ అండర్–19 క్రికెట్ జట్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు చోటు సాధించినట్లు ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్కుమార్ తెలిపారు. వీరిలో గిరిష్మా సైనిరెడ్డి (వైస్ కెప్టెన్), ఎ.విష్ణుప్రియ, ఎం.పర్ణిత యాదవ్, కె.శుభశ్రీ, ఎం.రుక్సార్ తబ్సమ్ వున్నారని తెలిపారు. వీరు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు బీసీసీఐ అండర్–19 ఉమెన్స్ టీ–20 చాంపియన్షిప్లో పాల్గొననున్నట్లు తెలిపా రు. ఎంపికై న మహిళా క్రికెటర్లు బాగా రాణించి రంజి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి భ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
టిప్పర్ ఢీకొని వైఎస్సార్సీపీ నేత మృతి
రామచంద్రాపురం : మండలంలోని సి.రామాపురం వద్ద సోమవారం టిప్పర్ ఢీకొని వైఎస్సార్సీపీ నేత సురేంద్రనాయుడు(63) మృతి చెందారు. వివరాలు.. కొత్తకండ్రిగకు చెందని సురేంద్రనాయుడు కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంట ఉత్పత్తులను తిరుపతిలోని రైతుబజారులో విక్రయించి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా బండరాళ్ల లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేంద్రనాయుడి కాలు నుజ్జునుజ్జుగా మారింది. క్షతగాత్రుడు తీవ్రమైన రక్తస్రావంతో ఘటనాస్థలంలోనే కొంత సమయంపాటు నరకయాతన అనుభవించాడు. అదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఆయనను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్రెడ్డి పరామర్శ వైఎస్సార్సీపీ నేత సురేంద్ర నాయుడు మృతి విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్ సోమవారం రాత్రి కొత్తకండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సురేంద్ర నాయుడు భౌతికకాయా నికి నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు. -
ప్రజా ఉద్యమానికి దిశానిర్దేశం
చంద్రగిరి : గత ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కల్తీ మద్యంపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని, ఉద్యమానికి ప్రజలను సైతం సిద్ధం చేయాలని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం చంద్రగిరిలోని వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో ప్రజా ఉద్యమ సన్నాహక సభ నిర్వహించారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, అన్యాయాలతో పాటు వైద్య విద్యను పేద ప్రజలకు దూరం చేసిన విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కనీసం 60వేల సంతకాలను నిర్దేశిత గడువులోపు సేకరించాలని కోరారు. పేదలకు మెరుగైన వైద్యం, నిరుపేదద విద్యార్థులకు వైద్య విద్యను అందించే అవకాశం వున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాలతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్య అభ్యసించేందుకు వీలుగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అందులో 5 కళాశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహిస్తుండగా మరో 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఆయా నిర్మాణ పనులు పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు లభిస్తాయని చెప్పారు. పేదలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేపట్టిన పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అందుకే కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి పంచాయతీలో 500 నుంచి 600మందిని కలసి మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తే తలెత్తే నష్టాలను వివరించి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులుషెడ్యూల్ ఇదీ... మెడికల్ కాలేజీల అంశంపై ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న ప్రజా ఉద్యమానికి పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసిందని మోహిత్రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి నవంబరు 22 వరకు దశల వారీగా నిరసనలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నవంబరు 23నజిల్లా కేంద్రాలకు సంతకాల సేకరణ పత్రాలు తరలించాలని వెల్లడించారు. నవంబరు 22న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు కోటి సంతకాల సేకరణ పత్రాలు పంపించాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఆరు గంటలు దాటితో బయటకు రావద్దు
తిరుపతి సిటీ: నగరంలోని వేదిక్ వర్సిటీ, ఎస్వీయూ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వర్సిటీల్లో చిరుత సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేదిక్ వర్సిటీలోని శైక్షిక (అకాడమిక్)భవనాల వద్ద చిరుత సంచరించిందని వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై విద్యార్థులకు సమాచారం అందించారని తెలిపారు. ఎస్వీయూ, వేదిక్ వర్సిటీలలో అటవీశాఖ సుమారు నాలుగు బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటలు దాటితే బయటకు రాకూడదని నిషేధాజ్ఞలు విధించారు. -
మనమూ ‘స్పేస్’ తీసుకుందాం
● అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఎయిర్ కమాండర్ రాజేష్ సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ స్పేస్లో బలీయమైన శక్తిగా ఎదగాలంటే యువ శాస్త్రవేత్తలు తయారు కావాల్సిన అవసరం ఉందని ఇనిస్టిట్యూట్ ఆప్ ఏరోస్పేస్ మెడిసిన్ అండ్ కమాండర్ రాజేష్కుమార్ విద్యార్థులకు సూచించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన బ్రహ్మప్రకాష్ హాలులో సోమవారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఎండ్ కమాండర్ రాజేష్కుమార్ ముఖ్య అథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ యువతరం సాఫ్ట్వేర్వైపు చూస్తున్నారని, ఇస్రోలో చేరితే ఉద్యోగంతో పాటు దేశానికి సేవలు అందించే అవకాశం దక్కుతుందని వివరించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు డాక్టర్ హోమీజే బాబా బీజం వేస్తే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్కలాం, డాక్టర్ కస్తూరి రంగరాజన్ లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమాలను ప్రపంచం అబ్బురపడేలా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సుమారు మూడు రాష్ట్రాల్లోని తొమ్మిదో ప్రాంతాల్లో అంతరిక్ష కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు. అనంతరం ఈఎస్ పద్మకుమార్ మాట్లాడుతూ 1999 నుంచి అంతరిక్ష వారోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఏటా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గగన్యాన్–1 ప్రాజెక్ట్, చంద్రయాన్–4, వీనస్ (శుక్రయాన్) వంటి ప్రయోగాలతో అంతరిక్షంలో సత్తాచాటుతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతితోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ రమేష్ కుమార్, అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చైళియన్, ఎంఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు చేయూత
తిరుపతి క్రైం: విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ సుబ్బరాయుడు బాసటగా నిలిచారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విదులు నిర్వహిస్తూ గత నెల 12న అనారోగ్యంతో మరణించిన టీఎల్. వెంకటరత్నం సతీమణి టీ.ఉషాదేవికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వాహణలో సేవలందించి ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీస్ శాఖ ఎప్పటికీ మరిచిపోదన్నారు. వీరి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంలో సంబంధిత శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందిని చెప్పారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వర పాల్గొన్నారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి స్పష్టం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మ్యాంగో మార్కెట్ యార్డు సమీపంలోని గరుడ వారధి వద్ద ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు ఓ పుష్పాన్ని అందించారు. హెల్మెట్– ప్రాణ రక్షక కవచం అంటూ నినాదాలు చేశారు. గరుడ వారధిపై గరిష్ట వేగ పరిమితి 30 కి.మీ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు సంజీవ్కుమార్, సుబ్బరామిరెడ్డి, ఎస్ఐలు బాలాజీ, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్:ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, అర్జీదారులకు సంతృప్తికరంగా సమాధానం చెప్పాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్జీదారులకు మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణితో కలసి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్కు మొత్తం 290 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కనీస వేతనం కోసం.. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.10వేలతో సరిపెట్టేస్తున్నారని మండిపడ్డారు. సూపర్వైజర్లకు రూ.21,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.11వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 175 అర్జీలు తిరుపతి క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 175 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించినట్లు వెల్లడించారు. దయచూపండి పొలం పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతింది. దీంతో రెండు కాళ్లు పనిచేయడం లేదు. మంచానికే పరిమితమయ్యా. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తే వైద్య ఖర్చులు పెట్టుకుంటా. దయచూపండి. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లకు అనుమతి రాలేదని తిప్పి పంపేస్తున్నారు. – మునస్వామి, దివ్యాంగుడు, చంద్రగిరి -
దామినేడులో కార్డెన్ సెర్చ్
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని దామినేడులో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రధానంగా స్థానిక ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ సునీల్ కుమార్, నలుగురు ఎస్ఐలు, 9 మంది ట్రైనీ ఎస్ఐలు, సుమారు 60 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అందులో నివసించేవారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. అద్దె గదులలో ఉన్న వారి వివరాలను సైతం సేకరించారు. వరుస చోరీల నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ ఇటీవల తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్న క్రమంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వేకువజామున 4.30 నుంచి ఉదయం 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని వెల్లడించారు.. ఈ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే చోరీ కేసులో పరారీలో ఉన్న జోసెఫ్ అనే నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. కొత్త వ్యక్తులు కదలికలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. -
ఆదాయముంటే చాలు!
తిరుపతి అర్బన్: చెప్పేదొకటి చేసేది మరొకటి అన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం. 13 రకాల ఆర్టీసీ సర్వీసులు ఉన్నప్పటికీ సీ్త్రశక్తి పథకానికి జిల్లాలో పల్లెవెలుగు సర్వీసులను మాత్రమే వినియోగిస్తున్నారు. అరకొర ఎక్స్ప్రెస్లను అక్కడక్కడా తిప్పుతున్నారు. అయితే రద్దీగా ఉండే సమయంలో తిరుపతి బస్టాండ్లో పల్లెవెలుగు సర్వీసులు లేకుండా ఆల్ట్రాడీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్లను ప్లాట్ఫాంలపై పెట్టేస్తున్నారు. పల్లెవెలుగు సర్వీసులు రావడానికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు పల్లెవెలుగు సర్వీసులు లేవంటూ మరికొందరు డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక మహిళలు కూడా ఆల్ట్రాడీలక్స్లు, సప్తగిరి ఎక్స్ప్రెస్ల్లో టిక్కెట్ కొనుగోలు చేసి జర్నీ చేయాల్సి వస్తోంది. ఇది మరీ మోసం తిరుపతి నుంచి కాణిపాకంకు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు తిరుపతి నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సప్తగిరి, ఆల్ట్రాడీలక్స్లు మాత్రమే తిరుపతి బస్టాండ్లోని కాణిపాకం ప్లాట్ఫాంపై ఉంచుతున్నారు. అలాగే సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు ప్రయాణికుల రద్దీ కాణిపాకానికి ఎక్కువ. ఆ సమయంలోనూ అదే పరిస్థితి. మిగిలినప్పుడు గంటకో రెండు గంటలకో ఓ పల్లెవెలుగు సర్వీసు అటొచ్చి ఇటు తళుక్కుమని వెళ్తుంది. మహిళలు సైతం టిక్కెట్లు చెల్లించి సప్తగిరి బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఒక్క కాణిపాకం మార్గంలోనే కాదు.. రద్దీగా ఉండే శ్రీకాళహస్తి, ఇతర మార్గాల్లోనూ అద్దే పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు ప్రయాణం చేయాల్సిన మార్గాల్లో ఇలాంటి పద్ధతులను అధికంగా ప్రయోగిస్తున్నారు. -
ఇంజినీర్లపై కేసులు దారుణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్రాభివృద్ధి కోసం సైనికుల్లా పనిచేసిన పంచాయతీ ఇంజినీర్లపై కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ (ఏపీ పీఆర్ఏఈ) అధ్యక్షుడు కె.సంగీతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్లో ఏపీ పీఆర్ఏఈ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఇంజినీర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 619 సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. 3 వేల కోట్లు విలువైన ఉపాధి పనులు పూర్తి చేసినందుకు పంచాయతీ ఇంజినీరింగ్శాఖ అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద మూడుశాతం నగదు విడుదల చేయాలని కోరారు. డివిజనల్ డెవలప్మెట్ ఆఫీసర్స్ పోస్టులలో 30 శాతం పీఆర్ ఇంజినీర్లకు కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి పీఆర్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. లేకుంటే డిసెంబర్ నుంచి దశలవారీగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సంఘం గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం జేఈలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పనిభారం తగ్గించేందుకు వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. పీఆర్ ఇంజినీర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారే కానీ, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. దీంతో అర్హులకు అవకాశాలు దక్కక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి బీడీ శ్రీనివాసరావు, జిల్లా జనరల్ సెక్రటరీ డి.చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ మహేష్, జనరల్ సెక్రటరీ అజయ్, యం.శంకరయ్య, టి.లీలాకృష్ణ, యం. లక్ష్మీపతి రెడ్డి, మధుసూదన్రావు పాల్గొన్నారు. -
ఎస్వీయూలో మందుబాబులు పడ్డారు!
తిరుపతి సిటీ :ఎస్వీయూ ప్రాంగణంలో నిత్యం మందుబాబులు హల్ చల్ చేస్తున్నారు. గతంలో పలు మార్లు వర్సిటీ అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు తీసుకెళ్లిన పట్టించుకోలేదు. దీనిపై క్షేత్రస్థాయి లో సాక్షి పర్యటించి సాక్ష్యాధారాలతో ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వర్సిటీని జల్లెడపట్టి సుమారు రెండు ట్రాక్టర్ల ఖాళీ మద్యం సీసాలు రావడంతో నివ్వెరపోయారు. పాత కథ పునరావృతం ఎస్వీయూలో మళ్లీ మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రతి చెట్టు కిందా మద్యం తాగే వారే కనిపిస్తున్నారు. మహిళా హాస్టళ్లకు సమీపంలో కూడా మద్యం తాగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే ఎస్వీయూ ప్రకాశం భవనంలో ఎదుట ఓపెన్ ఆడిటోరియంలోకి సైతం ఇష్టారాజ్యంగా ప్రవేశించి మద్యం సేవిస్తున్నారు. ఆడిటోరియంలో ప్రాంతంలో వందలాది ఖాళీ మద్యం సీసాలు పడిఉండడం గమనార్హం. అన్నపూర్ణ క్యాంటిన్ సమీపంలో కూడా మందు బాబుల హల్ చల్ చేస్తున్నప్పటికీ వర్సిటీ సెక్యూరీటీ, పోలీసులు పట్టించుకోవడం లేదదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని కోరుతున్నారు. -
కోడి పందాల స్థావరంపై దాడి
వాకాడు: మండలంలోని కొండాపురంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఎస్ఐ నాగబాబు తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు పందెం రాయళ్లతోపాటు మూడు కోడి పుంజులు, వారి వద్ద ఉన్న రూ.1,200 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి సోమవారం కోర్డులో హాజరుపరచనున్నట్టు ఆయన వెల్లడించారు. నేడు పాఠశాలలకు కొత్త గురువులు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1394 మంది నూతన టీచర్లు సోమవారం నుంచి కేటాయించిన బడుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట్లో ఉద్యోగంలో చేరేటప్పుడు ఉండే ఉత్తేజం రిటైర్ అయ్యే వరకు కొనసాగించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నూతన అయ్యోర్లకు సూచించారు. నేత్రదానం నాయుడుపేటటౌన్: పట్టణంలోని గాంధీ పార్కు సమీపంలో నివసిస్తున్న కావేరి పాకం పురుషోత్తం(46) బ్రెయిన్ స్ట్రోక్తో ఆదివారం కన్నుమూశారు. మృతుడి నేత్రాలను ఆయన భార్య సుమలత దానం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల వారు నాయుడుపేటకు వచ్చి నేత్రాలను సేకరించుకుని వెళ్లారు. ఈ సందర్భంగా పురుషోత్తం కుటుంబీకులను పలువురు ప్రశంసించారు. 25న జీశాట్–7ఆర్ ప్రయోగం సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈనెల 25వ తేదీన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా జీశాట్–7ఆర్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 16న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక పరమైన కారణాలతో వాయిదా పడింది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లాక్–2 బ్లూబర్డ్ అనే వాణిజ్య ఉపగ్రహం సైతం ప్రయోగించాల్సి ఉంది. ఆ ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతోనే జీశాట్–7ఆర్ ప్రయోగం వాయిదాపడినట్లు సమాచారం. 2013 ఆగస్టు 30న ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి పారిస్కు చెందిన అరైన్–5 రాకెట్ ద్వారా జీశాట్–7 ఉపగ్రహాన్ని తొలుత ప్రయోగించారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కాలపరిమితి అయిపోవడంతో దాని స్థానంలో జీశాట్–7ఆర్ పేరుతో రీప్లేస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో ఎల్వీఎం3–ఎం5 రాకెట్ అనుసంధానం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. -
300 ఎకరాలు హాంఫట్!
కంచే చేను మేసినట్టు సత్యవేడు మండలంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరించారు. కాసులకు కక్కుర్తి పడి సుమారు 300 ఎకరాల అటవీ భూములను కబ్జాకోరులకు అప్పనంగా అప్పగించేశారు. తమిళనాడుకు చెందిన ఆరుగురి పేరిట వెబ్ల్యాండ్లోకి సైతం ఎక్కించేశారు. ఇందుకోసం కొత్తగా సర్వే నంబర్లను సృష్టించేశారు. ఇష్టారాజ్యంగా సబ్ డివిజన్లు నమోదు చేసి అక్రమార్కులకు హక్కులు కల్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద మొత్తంలో నగదు చేతులుమారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా భూములను రీసర్వే చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని స్పష్టం చేస్తున్నారు. సత్యవేడు : సత్యవేడు మండలంలోని వానెల్లూరు గ్రామంలో సుమారు 3 వందల ఎకరాల అటవీ భూమిని తమిళనాడు చెందిన ఆరుగురు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు కట్టబెట్టేశారు. వెబ్ల్యాండ్లో సైతం అక్రమార్కుల పేర్లను నమోదు చేయడంపై పోలీసులకు తహసీల్దార్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. గ్రామ సమీపంలోని 300 ఎకరాలు 2024 వరకు అటవీ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో ఉండేది. ఇందులో ఫారెస్ట్ అధికారులు జీడిమామిడి, నీలగిరి చెట్ల పెంపకం సైతం చేపట్టారు. నూతనంగా సబ్ డివిజన్లు వానెల్లూరులోని సర్వే నెంబరు 197/1లో 252 ఎకరాలు , 200/1లో 49–88 ఎకరాలు అటవీ భూమిగా ఉంది. దీనిపై చైన్నె వాసులు కొందరు కన్నేశారు. 2024 జూన్లో రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క రికార్డులను తారుమారు చేశారు. సర్వే నెంబరు 197/1లో శ్రీధరన్ పేరుతో 50.34 ఎకరాలు, 197/బీలో అమృతవర్షిణి పేరుతో 50.34 ఎకరాలు, 197/1సీలో నవీన్ రాజ్కన్న పేరుతో 50.34 ఎకరాలు, 197/డీలో అనూరాధ జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/ఈలో అతా జైకుమార్ పేరుతో 50.34 ఎకరాలు, 197/1ఎఫ్లో ఆశసురేష్ పేరుతో 34 సెంట్లను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లోకి ఎక్కించేశారు. ఈ మేరకు వెబ్ల్యాండ్లో నమోదు చేసేశారు. ఇందుకోసం 197/1 సర్వే నంబరును తమిళనాడు వాసుల కోసం సబ్ డివిజన్లుగా మార్చేశారు. ఈ మేరకు అప్పట్లో తహసీల్దార్గా పనిచేసిన రామాంజులునాయుడు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపి భూ ఆక్రమణకు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు వానెల్లూరు అటవీ భూమిని నాలుగు సబ్ డివిజన్లు విభజించి తమిళనాడుకు చెందిన ఆరుగురి పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ రాజశేఖర్ తెలిపారు. వివాదాస్పద భూములపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని, వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ మేరకు సత్యవేడు సీఐ మురళీనాయుడు కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆక్రమిత భూమిలో నీలగిరి చెట్లు ఆ భూములు మావే.. అటవీ భూముల విషయమై ఆక్రమణదారులకు సంబంధించి వారు వివరణ ఇచ్చారు. సర్వే నెంబరు 197/1లోని 300 ఎకరాల భూమిని ముత్తు కుమారస్వామి అయ్యర్ అనే వ్యక్తి చాలా ఏళ్ల క్రితం టీటీడీ నుంచి పొందారని చెప్పారు. అయన వారసుల నుంచి తాము కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఫారెస్టు రేంజర్ త్రినాథ్రెడ్డి దీనిపై స్పందిస్తూ.. అటవీ శాఖ చట్టం ప్రకారం 1972లో ఈ భూమి రక్షిత అటవీ భూమిగా గెజిట్ అయినట్లు వివరించారు. ఇటీవల రెవెన్యూ, అటవీశాఖ చేపట్టిన జాయింట్ సర్వేలో సైతం ఇది ఫారెస్ట్ ల్యాండ్గానే నమోదైనట్లు తెలిపారు. రీసర్వే చేయాలి వానెల్లూరు సమీపంలోని ఈ భూమి అటవీశాఖ పరిధిలోనే ఉందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చైన్నె వాసులు కట్టుకథలు అల్లుతున్నారని, విలువైన భూములను కాజేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయా భూములను రీసర్వే చేస్తే నిజాలు బయటపడతాయని వెల్లడిస్తున్నారు. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమస్యలను అర్జీల రూపంలో అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన తిరుపతి సిటీ : శ్రీచైతన్య విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఝాన్సీలక్ష్మీ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అధ్యాపకులు, టెక్నో స్కూల్ టీచర్లు, బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆదివారం ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారికి క్రమశిక్షణ అవసరమని వెల్లడించారు. శ్రీచైతన్య చిన్న సంస్థగా మొదలైందని, నేడు ఆసియాలోని అతిపెద్ద విద్యాసంస్థగా ఎదిగిందని వివరించారు. నేను అనే భావనతో కాకుండా, మేము అని పనిచేస్తే ప్రగతి పథంలో పయనించవచ్చని తెలిపారు. శ్రీచైతన్యలోని ప్రతి విద్యార్థి కలను సాకారం చేసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కాలేజీల ఏజీఎం బీవీ ప్రసాద్, పాఠశాలల ఏజీఎం సురేష్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామివారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేటి నుంచి రెండో విడత అడ్మిషన్లుతిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ విద్యాసంస్థలలో రెండో విడత అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓఏమ్డీసీ నుంచి విద్యార్థుల మొబల్ ఫోన్లకు సమాచారం అందించారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రెండు రోజులోపు ఆయా కళాశాలలో తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో రెండు రోజుల తర్వాత ఆయా కళాశాలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. -
వరసిద్ధుని సేవలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి దర్శించుకున్నారు. ఆమెతో పాటు సినీ నటుడు నార్నె నితిన్, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలికి దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. ఒకే ఊరిలో 8మంది డీఎస్సీకి ఎంపిక చంద్రగిరి: మండలంలోని పనపాకం పంచాయతీ అరిగెలవారిపల్లెలో 2025 డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 8మందిని రిటైర్డ్ హెచ్ఎం అరిగిల రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఎంపికై న వారిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా బి.లిషా నందిని, స్కూల్ అసిస్టెంట్గా దళవాయి సూర్య లోకనాధం, పీఈటీగా బొజ్జా సుమలత, ఎస్జీటీలుగా కె.దిలీప్ కుమార్, దళవాయి సురేంద్ర, ఆవుల కళ్యాణి, అరిగెల భానుప్రకాష్, డి.మహేష్ ఉన్నారు. ఒకే గ్రామంలో 8 మంది డీఎస్సీలో ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని పలువురు వారిని అభినందించారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఇదే స్ఫూర్తితో మరెందరో విద్యార్థుల భవితకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆవుల క్రిష్ణయ్య(గార్డు), గేనే సుబ్బయ్య, జూ పార్క్ మాజీ డైరెక్టర్ మణి యాదవ్, అరిగిల కృష్ణ, భీమరాజు, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రైల్వే డివిజన్ మన హక్కు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుకోవడం మనందరి హక్కు దీని కోసం ఉద్యమిద్దాం అంటూ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో బాలాజీ రైల్వే డివిజన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1990లో వచ్చిందన్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాయ అసమానతలు తలెత్తకుండా రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. 35 ఏళ్ల కలను సాకారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాట్లాడుతూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రానికి పెద్దసంఖ్యలో తరలివచ్చే ప్రయాణికులకు రైల్వే డివిజన్ ఏర్పాటుతో వసతులు కల్పించవచ్చని తెలిపారు. మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైల్వే అనుసంధాన వ్యవస్థ, వాణిజ్యం, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు డివిజన్ దోహదం చేస్తుందన్నారు. డిప్యూటీ మేయర్ మునికృష్ణ మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ కోసం ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని వెల్లడించారు. నవీన్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే తిరుపతికి రైల్వే డివిజన్ పొందే అర్హతలు ఉన్నాయని వివరించారు. రాజకీయ ఒత్తిడితోనే బాలాజీ డివిజన్ ఆశలను తుంగలో తొక్కి గుంటూరు డివిజన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ మాజీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, పీసీ రాయల్, బీమ్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ చౌదరి, న్యాయవాది దినకర్, నేతలు మహీధర రెడ్డి, శ్రీధర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, కుప్పాల నీలిష్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కుప్పాల గిరిధర్ కుమార్ -
కల్తీ మద్యంపై నిరసనలు
పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం మాఫియా, వేల కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా దోచుకోవడంపై సోమవారం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు , వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, వల్లివేడు పృధ్వీధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీంబాషాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వ్యాపారంతో వేల కోట్లు దోచుకుంటున్న తెలుగుదేశం నాయకుల వ్యాపారాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేయాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, నాయకులు గౌస్, అఖిల్, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తి: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలా తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మదుసూదన్రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులకు సోమవారం వినతిపత్రం ఇవ్వనున్నట్లు వైఎస్ఆర్ సీపీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, నేతలు, మహిళలు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని కోరారు. -
పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శశిధర్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా శశిధర్, ప్రధాన కార్యదర్శిగా చెంచురత్నం యాదవ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లుగా లక్ష్మీపతి యాదవ్, గిరిధర్రెడ్డి, చక్రపాణి, త్రివిక్రమరావు, ఉపాధ్యక్షులుగా మూర్తి, వాణి, లోకేష్, కుమార్, సంయుక్త కార్యదర్శులుగా అలీ, లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. -
కల్వర్టు కింద ఖరీదైన మాత్రలు
తిరుపతి రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో ఉండాల్సిన మాత్రలు కల్వర్టు కింద కనిపించాయి. ఖరీదైన ఈ మాత్రలను సర్కారు సైతం అంతంత మాత్రంగానే సరఫరా చేస్తుంది. అయితే ఫిజీషియన్ శాంపుల్స్ కింద సంబంధిత మందుల కంపెనీ వారు ఉచితంగా వైద్యులకు పంపుతుంటారు. వీటిని అవసరమైన రోగులకు వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. వాటిని వెసుకున్న వారు కాసేపటికే మత్తులోకి వెళ్లక తప్పదు. ఒకటి, రెండు మాత్రలు తీసుకుంటే చాలు శరీరంలోని అలెర్జీ మొత్తం ఇట్టే తగ్గిపోతుంది. ‘మత్తు’ను కలిగించే ఆ మాత్రలు గుట్టలు, గుట్టలుగా ఓ కల్వర్టు కింద బయట పడడంతో స్థానికులు నివ్వెరపోయారు. పరిశీలనకు వెళితే.. తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు నుంచి పాతకాల్వ కుంటలోనికి నీరు చేరే కాలువ (కల్వర్టు కింద)లో ఖరీదైన మందుల డబ్బాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు వద్ద మట్టి తవ్వకాలు లోతుగా చేయడం, చెరువు స్థలాన్ని కప్పేయడంతో స్థానికంగా నివాసముంటున్న ఎంపీపీ మూలం చంద్ర మోహన్రెడ్డి ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఆయన వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులకు అక్కడి కల్వర్టు కింద అలెర్జీకి ఉపయోగించే మాన్టెక్–ఎల్సీ అనే మాత్రల డబ్బాలు కనిపించాయి. మొదట ఎక్స్పైర్ అయిన మందులు అక్కడ పడేశారని తేలిగ్గా తీసుకున్నారు. ఒక సారి చూద్దామని పరిశీలిస్తే తయారీ తేదీ 09/2024, ఎక్స్పైర్ తేదీ 02/2027గా నమోదై ఉంది. అవి ఒక్కో స్ట్రిప్ రూ.330లుగా బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంత ఖరీదైన మాత్రలను కల్వర్టు కింద ఎందుకు పడేశారని ఆరా తీయగా, ఎవరైనా మత్తుకు బానిసలుగా మారి వారు అక్కడ దాచిపెట్టారనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తవయ్యాయి. అయితే ఆ మాత్రల డబ్బాలపై ఫిజీషియన్ శాంపిల్స్.. నాట్ ఫర్ సేల్ అని రాసి ఉండడం గమనార్హం. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కల్వర్టులు కింద కొందరు యువకులు చేరుతున్నారని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
పరిహారం ఎగ్గొట్టి.. పొలం గట్లు తెగ్గొట్టి!
●వరదయ్యపాళెం : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఏపీఐఐసీ అధికారులు వేధిస్తున్నారు. భూసేకరణ కింద తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పొలాలు సాగుకు పనికిరాకుండా గట్లు తెగ్గొట్టేశారు. వివరాలు.. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు రైవెన్యూలోని సర్వే నెంబర్ 83/2లో 1.48 ఎకరాలు డి.శకుంతలమ్మ పేరిట, 83/3లో 1.73 ఎకరాలు డి. రత్నం పేరిట 45ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం డీకేటీ పట్టాలను అందజేసింది. అప్పటి నుంచి ఆ భూముల్లో వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. 2016లో చిన్న పాండూరు సమీపంలో ఏపీఐఐసీ సెజ్ రావడంతో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఎకరాకు రూ. 6.5లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అయితే వారికి బీ కేటగిరీలో ఎకరాకు రూ. 3.25లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన పరిహారం కోసం గత 9ఏళ్లుగా ఈ ఇద్దరు రైతులు అటు కలెక్టర్, ఆర్డీఓతోపాటు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ పరిహారం మాత్రం అందలేదు. అయితే గత ఏడాది వరకు భూమిని వారే సాగు చేసుకుంటూ ఉండేవారు. బెదిరించి.. తొలగించి అయితే రెండు రోజుల క్రితం రైతులు డి. రత్నయ్య, శకుంతలమ్మకు చెందిన భూముల్లోకి ఏపీఐఐసీ సిబ్బంది ప్రవేశించారు. హిటాచీతో పొలంగట్లను పూర్తిగా తొలగించి భూముల రూపురేఖలను మార్చేశారు. సాగు చేసుకునేందుకు వీలు లేకుండా పొలం ఆనవాళ్లను చెరిపేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. న్యాయం చేయండి సుమారు 45 ఏళ్ల నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గత ఏడాది కూడా సాగు చేశాం. అయితే బుధవారం సాయంత్రం ఏపీఐఐసీ అధికారులు మా పొలం గట్లు తొలగించేశారు. వరినాట్లకు సిద్ధం చేసుకున్న భూమిని నాశనం చేసేశారు. పైగా మాపైనే కేసులు పెడతామని బెదిరించారు. అప్పట్లో ఆ భూమిని రూ.లక్షలు వెచ్చించి సాగుకు సన్నద్ధం చేసుకున్నాం. భూమినే నమ్ముకున్న మమ్మల్ని ఇలా ఇబ్బందిపెట్టడం దారుణం. పూర్తిస్థాయి పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – రత్నయ్య, బాధిత రైతు, చిన్న పాండూరు -
టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి
సూళ్లూరుపేట: మండలంలోని బైపాస్రోడ్డు ఎన్హెచ్–16 డంపింగ్యార్డు వద్ద శనివారం రాత్రి టిప్పర్ ఢీకొని అపాచి కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వరదయ్యపాళెం రాచర్ల గ్రామానికి చెందిన కంరారపు ప్రసన్నకుమార్ (36) పాచిలో పని చేస్తూ తడ మండలం కాదలూరులో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సూళ్లూరుపేటకు వచ్చి పనులన్నింటినీ చూసుకుని తిరిగి కాదలూరుకు మోటార్సైకిల్పై వెళుతుండగా హఠాత్తుగా టిప్పర్ దూసుకొచ్చి ఢీ కొంది. అతన్ని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు వారికి సమాచారం అందించి కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీగంధం చెట్లు నరికివేత: వ్యక్తి అరెస్టు తిరుమల : శేషాచలం అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లు నరికివేసిన వ్యక్తిని ఆటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది దాడిచేసి పట్టుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తిరుమల–పాపవినాశనం రోడ్డులోని జపాలీ తీర్థానికి సమీపంలో ఓ వ్యక్తి శ్రీగంధం చెట్టును నరికివేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అటవీశాఖ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు శ్రీగంధం చెట్టు వేరు భాగాలు రంపాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని తిరుపతికి తరలించి అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు. అక్రమ వెంచర్కు నోటీసు తొట్టంబేడు: తొట్టంబేడు రెవెన్యూ పరిధిలోని బీడీ కాలనీ వద్ద సర్వే నంబర్ 269/4లో వేసిన అక్రమ వెంచర్ను వెంటనే తొలగించాలని పంచాయతీ సెక్రటరీ భార్గవ్ ఆదివారం నోటీసు జారీ చేశారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో సుచిత్ర గార్డెన్న్ పేరుతో వేసిన లేఅవుట్కు అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి సందిగ్ధంలో పడింది. -
వానెల్లూరు అక్రమాల గుట్టురట్టు
సత్యవేడు : సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో 300 ఎకరాల అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ వెబ్ ల్యాండ్లో అక్రమ నమోదుకు సంబంధించి 16 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీ నాయుడు తెలిపారు. శనివారం సత్యవేడు తహసీల్దారు రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వానెల్లూరులో సర్వే నంబరు 197లో 287.64 ఎకరాలు తంబి అలియాస్ రాజ ిపిళ్లై పేరుపై ఉన్నట్లు రెవెన్యూ ఎస్ఎల్ఆర్ రికార్డుల్లో ఉందన్నారు. అనంతరం ఆ భూమి నాలుగు సబ్ డివిజన్లుగా విభజించి ఇందులో 197/1లో 252.16 ఎకరాలు 1972లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అటవీ భూములుగా ప్రకటించారు. అయితే ఇదే సర్వే నంబరు భూములను 197/1 ఏ నుంచి ఎఫ్ వరకు చైన్నెకి చెందిన ఆరుగురి పేర్లుపై 2024 జూన్ 12వ తేదీన రెవెన్యూ వెబ్ ల్యాండ్లో నమోదు చేశారన్నారు. ఈ భూముల నమోదులో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సాదాబైనామా ద్వారా అప్పటికే మల్లీశ్వరీ పేరుతో ఉన్న సర్వే నంబరు 186–2ఏ2 , హనుమంతు బాతమ్మ పేరుతో సర్వే నంబరు 138/2కు సంబంధించి వెబ్ ల్యాండ్ తెరిచి నమోదు చేశారు. అయితే ఈ ప్రక్రియలో అప్పటి తహసీల్దారు రామాంజనేయులు వేలి ముద్ర వేస్తేనే వెబ్ల్యాండ్లో నమోదు అవుతుందన్నారు. ఎన్నికల విధులకు వచ్చిన రామాంజనేయులు 2024 ఫిబ్రవరి 7 నుంచి జూలై 27 వరకు సత్యవేడులో తహసీల్దారుగా పనిచేశారు. అప్పటి కన్నావరం సచివాలయం వీఆర్ఓ భార్గవ్ ఆయన సతీమణి తేజస్వీ, అప్పటి సచివాలయ సిబ్బంది పూర్ణచందునాయుడు, ఆధార్ కార్డులతో పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు లేని భూములను తప్పుడు రికార్డులతో విక్రయించడానికి చైన్నెకి చెందిన ఆరుగురు స్కెచ్ వేశారన్నారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు అందడంతో ప్రస్తుత తహసీల్దారు రాజశేఖర్ దీనిపై దృష్టి సారించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారన్నారు. అటవీ భూములు వెబ్ల్యాండ్లో నమోదైన వారిలో తమిళనాడుకు చెందిన శ్రీధరన్, అమృతవర్షిని, నవీనరాజ్కన్న, అనూరాధ, జైరేమార్, లతజయ్కుమార్, ఆశాసురేష్ ఉన్నట్లు తెలిపారు. ఆశా సురేష్ పేరుతో సర్వే నంబరు 200/1లో 49.88 ఎకరాలు వెబ్ల్యాండ్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి ఆధార్ కార్డులు, రికార్డులు ఏవీ లేకుండా వెబ్ల్యాండ్ల్లో అటవీ భూములను నయోదు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి సంబందించి ఆరుగురు అధికారులపైన మిగిలిన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీ అధికారులు ఉమ్మడి సర్వే చేయిస్తామన్నారు. సర్వే నంబరు 197/1లో అటవీ భూములు యథాస్థితిలో ఉండగా ఇదే సరే నంబర్ ఆరు సబ్ డివిజన్లుగా ఇతరుల భూ ఖాతాల్లోకి వెళ్లి నమోదు చేశారన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి అసలైన సూత్రదారులు ఎవరో నిగ్గు తేల్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
చంద్రగిరి : శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్తున్న కుటుంబం నుంచి బాలుడు తప్పిపోయిన ఘటన శనివారం చోటు చేసుకుంది. విజిలెన్స్ అధికారుల వివరాల మేరకు... రాజంపేటకు చెందిన వెంకటేష్ కువైట్లో పనిచేస్తున్నాడు. శ్రీవారి దర్శనార్థం వెంకటేష్ భార్యతో పాటు తమ్ముడు రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో శ్రీవారిమెట్టు వద్ద వెంకటేష్ కుమారుడు పార్థీవ్ తప్పిపోయి ఏడుస్తూ ఉండడాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న జమేదారు చిరంజీవి గుర్తించాడు. అనంతరం బాలుడిని విచారించగా వివరాలను తెలిపాడు. ఈ మేరకు వెంకటేష్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం వెంకటేష్, తన తమ్ముడు రమేష్కు సమాచారాన్ని చేరవేశాడు. అనంతరం రమేష్తో పాటు బాలుడు తల్లి శ్రీవారిమెట్టు వద్దకు చేరుకుని తమ బాలుడిని గుర్తించారు. జమేదారు తప్పిపోయిన బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘ప్రేమిస్తున్నా’
తిరుపతి కల్చరల్ : ఐబీఎం ప్రొడెక్షన్ ద్వారా చక్కటి ప్రేమ కథతో పాటు మదర్ సెంటిమెంట్ మిళతంతో యూత్ ఎంటర్టైన్మెంట్తో రూపొందించిన ‘ప్రేమిస్తున్నా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని ఈ చిత్రం దర్శకుడు భాను తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్రం యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూనిట్ సభ్యులు శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల పొందిన అనంతరం ఈ చిత్రం ట్రైలర్తో పాటు రెండు పాటలను యూటూబ్ ద్వారా విడుదల చేశామని, దీనికి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను రూపొందించిన ఫ్యామిలీ చిత్రాలు రూపొందించి విజయం సాధించడం జరిగిందని, ప్రస్తుతం ఈ చిత్రాన్ని పూర్తి లవ్ స్టోరీతో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రంలో 19 సినిమాల్లో చైల్డ్ అర్టిస్టుగా నటించి మెప్పించిన సాత్విక్ వర్మ తొలి సారి హీరోగా నటించారని తెలిపారు. ఈ సినిమాలో తిరుపతికి చెందిన ప్రీతి నేహా హీరోయిన్గా నటించిందన్నారు. అంతేకాక ఈ సినిమాకు టాప్ టెక్నీషన్స్ పనిచేయడంతో పాటు సిద్దార్థ సాల్వా సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం జరిగిందన్నారు. చిత్రం హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తన ప్రతిభను గుర్తించి తొలిసారిగా ఈ చిత్రంలో హీరో అవకాశాన్ని దర్శకుడు భాను కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నటించి మెప్పించానని తెలిపారు. నవంబర్ 7వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఐబీఎం ప్రొడెక్షన్ అధినేత కనక దుర్గారావు, రవికుమార్ పాల్గొన్నారు. -
యల్లంపల్లిలో గజరాజులు
చంద్రగిరి:అటవీ సమీప ప్రాంతాల్లోని పంట పొలా లపై గజరాజుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గజ దాడులతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నా రు. గ్రామస్తుల వివరాల మేరకు.. మండల పరిధిలోని యల్లంపల్లిలోని పంట పొలాలపై శుక్రవారం రాత్రి సుమారు 11 ఏనుగుల గుంపు చేరుకున్నాయి. రాత్రి 7 గంటలకు ఏనుగులను గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు గంటల పాటు అటవీ అధికారులు రాకపోవడంతో పంట పొలాలను తొక్కి నాశనం చేసినట్లుగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఉంటే నష్ట తీవ్రత తగ్గేదని, అయితే అటవీ అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా తమ పంటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికి రాకపోవడంతో తీవ్ర అప్పులపాలవుతున్నామంటూ వాపోతున్నారు. చివరకు అర్ధరాత్రి తర్వాత గ్రామస్తులు, అటవీ అధికారులు సంయుక్తంగా బాణాసంచా పేల్చూతూ, కేకలు వేయడంతో ఏనుగులు అడవుల్లోకి వెళ్లిపోయాయి. అయితే శనివా రం రాత్రి కూడా ఏనుగులు వచ్చే అవకాశం ఉండటంతో యల్లంపల్లితో పాటు పరిసర అటవీ సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
10 టన్నుల ఎర్ర చందనం స్వాధీనం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో పది టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తిరుపతి ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ఫోర్స్ వెల్లడించింది. తిరుపతిలోని కార్యాలయంలో టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్ శనివారం వారు మీడియాతో మాట్లాడారు. టాస్క్ఫోర్స్ బృందం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని పత్తూరులో తమిళనాడుకు చెందిన రాజ్కుమార్ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఆగస్టు 2న పట్టుబడ్డాడన్నారు. విచారణలో మరికొంతమంది నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు తేలడంతో దీనిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపామన్నారు. ఈ నెల 6న ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఇర్ఫాన్, మరో నిందితుడు అమిత్సంపత్ పవార్ను అరెస్టు చేశామన్నారు. మొత్తం 356 ఎర్రచందనం దుంగలను (9,576 కిలోలు) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ జలాశయం గేట్ల ఎత్తివేత
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కలవకుంట వద్ద ఉన్న ఎన్టీర్ జలాశయం గేట్లను శనివారం ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు, పాకాల, దామలచెరువు, ఐరాల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పది వేల క్యూసెక్కుల నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ ఏఈ భరత్ తెలిపారు. చిత్తూరు– పెనుమూరు జాతీయ రహదారిపై జలాశయం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయానికి దిగువన ఉన్న జీడీనెల్లూరు ప్రజలు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎలాంటి పరిస్థితుల్లోనూ నదిని దాటేందుకు సాహసించొద్దని సూచించారు. -
చిరుత సంచారంపై అధికారుల అప్రమత్తం
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టాఫ్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచారంపై వీసీ ఆచార్య నర్సింగరావు విశ్వవిద్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ పరిసరాల్లో ఆయన పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు, ఆ ప్రాంతంలో తిరిగే వారికి తెలిసేలా బారికేడ్లను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో వెంకన్న శ్లోకం – ఓం నమో వెంకటేశాయ తిరుపతి అర్బన్ : ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద శనివారం ఏర్పాటు చేశారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం టీటీడీకి చెందిన భవనం నేపథ్యంలో ప్రధాన ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లకు చెందిన పెద్ద చిత్రపటాలను ఎప్పటి నుంచో ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే భక్తి భావాన్ని మరింత పెంచేలా ఓం నమో వెంకటేశాయ శ్లోకాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఈ శ్లోకాన్ని ఉంచుతారా? ప్రతి శనివారం ఉంచుతారో చూడాల్సిందే. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ : జాతీయ స్థాయి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్న్స్ ఎగ్జామినేషన్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ, 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2014 నుంచి 2016 మధ్య జన్మించిన విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశాలకు, 9వ తరగతిలో ప్రవేశాల కోసం 2011 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2013 మార్చి 1వ తారీఖు మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్తో పాటు మరిన్ని వివరాలకు తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రం నందు లేదా 8688888802 / 9399976999 నంబర్ల నందు సంప్రదించాలని ఆయన తెలిపారు. ‘నేలపట్టు’లో జర్మనీ దేశస్తులు దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని శనివారం తడ ప్రాంతంలోని శ్రీసిటి నుంచి జర్మనీ దేశానికి చెందిన విదేశీయులు యాసుకోచిఎసి, మసాటోనిషియారా సందర్శించారు. కేంద్రంలోని చెరువుల్లో ఆశించిన స్థాయిలో వలస పక్షులు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ విదేశీయులను పలకరించి జామ మొక్కలను అందజేశారు. తాళపత్రాల భద్రత అభినందనీయంతిరుపతి సిటీ : ఎస్వీయూలో ప్రతిష్టాత్మకమైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలయాన్ని ( ఓఆర్ ఐ)ని శనివారం నూతన వీసీ తాతా నర్సింగరావు సందర్శించారు. గతంలో వెబ్సైట్లో చూసిన తాళపత్ర గ్రంథాలను నేరుగా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిరక్షణకు తీసుకుంటున్న శాసీ్త్రయ విధానాలను చూసి అభినందించారు. ఇంత పెద్ద స్థాయిలో ప్రాచీన సాహిత్యం భద్రంగా సంరక్షించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, చంద్రశేఖర్, డాక్టర్ వెంకటేష్, సిద్దయ్య, బాషా, నాగరాజు,శోభన్ బాబు,విశ్వనాథ్ రెడ్డి, పరిశోధకులు సంతోష్,స ోమలింగడు, శోభన్ పాల్గొన్నారు. -
ఉగ్రరూపం దాల్చిన బహుదానది
●తవణంపల్లె: మండలంలోని బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పాటు అరగొండ వద్ద బహుదానది ఉగ్రరూపం దాల్చింది. పడమటి మండలాల్లోని అడవుల్లో నుంచి భారీగా వర్షపు నీరు చేరుతోంది. మాధవరం వంక, బోయపల్లె వంక, మత్యం వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇవి బహుదానదిలో కలవడంతో నదికి వరద నీరు పోటెత్తింది. శనివారం సాయంత్రానికి నదిలో నీటి శాతం కొంతమేర తగ్గింది. తెగిన కల్వర్టులు ప్రతి ఏటా భారీ వర్షాలప్పుడు కల్వర్టులు తెగిపోవడం రివాజుగా మారుతోంది. అరగొండ– గాజులపల్లె మధ్యలో ఉన్న కల్వర్టు, గాజులపల్లె–సరకల్లు రోడ్డు మధ్యలో తొడతర దగ్గర ఉన్న కల్వర్టు, అరగొండ– ఎ.గొల్లపల్లెకు వెళ్లే దారిలోని కల్వర్టు, మత్యం క్రాస్– ఎగువ మత్యం వెళ్లే దారిలోని కలర్టులు వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పాల వ్యాన్లు, స్కూల్ బస్సులు కూడా తిరగడం లేదు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. కొట్టుకుపోయిన నాలుగు కల్వర్టులు అప్రమత్తంగా ఉండాలి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 35 గంటల పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గుముఖం పట్టి వాగుల్లో ప్రవాహం ఉధృతి తగ్గే వరకు జనాలు తెగిన కల్వర్టులపై వెళ్లరాదు. వరద ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాహనాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకట్టలు వేయించారు. – సుధాకర్, తహసీల్దార్ -
మైండ్ ‘బ్లాంక్’!
చిత్తూరు కలెక్టరేట్ : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన డీఎస్సీ నూతన టీచర్లకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పోస్టింగ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. తమకు నచ్చిన విధంగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టింది. పోస్టింగ్ల కౌన్సెలింగ్లో నిబంధనలను అమలు చేయకుండా సూచించిన చోటే కోరుకోవాలని నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 500 పోస్టులకు పైగా బ్లాక్ చేయడం దుమారం రేపుతోంది. ఎప్పుడూ ఇలా లేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హెచ్ఆర్ఏ పేరుతో (కేటగిరీ 1, 2) పోస్టులను 500కు పైగా బ్లాక్ చేశారు. కొత్త టీచర్లకు హెచ్ఆర్ఏ పోస్టులు ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఇలా బ్లాక్ చేసిన పోస్టులన్నీ ప్రధాన ప్రాంతాల్లో ఉండడంతో వాటిని డిప్యూటేషన్స్ (ప్రభుత్వ ఆర్డర్) పేరుతో దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో డీఎస్సీ పోస్టింగ్లు ఇచ్చే సమయంలో పోస్టులను బ్లాక్ చేసిన సందర్భాలు లేవని యూనియన్ నాయకులు వాదిస్తున్నారు. లోగుట్టుగా కౌన్సెలింగ్ ప్రక్రియ తిరుపతి జిల్లా కేంద్రంలో ఎస్జీటీలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ లోగుట్టుగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే నూతన టీచర్లకు ముందస్తుగా ఖాళీలను చూపించాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా మోసం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులను లోనికి అనుమంతించ లేదు. కౌన్సెలింగ్ ప్రక్రియను అర్ధరాత్రిలో ప్రారంభించి వేకువ జాము వరకు నిర్వహించారు. ఒకే ప్రాంతంలో నూతన టీచర్లందరికీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలా చేయకుండా కొందరికి ఒక కేంద్రంలో, మరికొందరికీ మరొక కేంద్రంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో విశ్వం పాఠశాల శిక్షణా కేంద్రంలో ఈ నెల 9న ఉదయం 4.30 గంటల వరకు 1 నుంచి 250 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 10న మెడ్జీ స్కూల్లో వరుస సంఖ్య 250 కు పైన ఉన్న వారిని ఉదయం 7 గంటలకు కౌన్సెలింగ్కు పిలిపించి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరీక్షింపజేశారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు అన్యాయం డీఎస్సీలో ఎంపికై న దివ్యాంగ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్యాయం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో వారికున్న రిజర్వేషన్, రోస్టర్ల ప్రకారం ముందస్తుగా పిలువాల్సి ఉంటుంది. అయితే అలా చేయకుండా చివర్లో కౌన్సెలింగ్ నిర్వహించి దివ్యాంగ టీచర్లకు అన్యాయం చేశారు.అవకతవకలు ఇలా... -
గంజాయి కేసులో మరో నిందితుడు అరెస్టు
సత్యవేడు : గంజాయి కేసుకు సంబంధించి నిందితుడు విజయ్(30)ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు. సీఐ మాట్లాడుతూ.. గత నెల 19న ఒకటిన్నర కిలో గంజాయిని , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడు శ్రీధర్ను అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు విజయ్ పరారీలో ఉండగా శుక్రవారం గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచి రిమాండుకు పంపామన్నారు. సమావేశంలో ఎస్ఐ రామస్వామి, పోలీసులు ఉన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో పనిచేద్దాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయ స్ఫూర్తితో పనిచేసి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను జయప్రదం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపు నిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం శుక్రవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలక మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమష్టి సహకారంతో విజయవంతం చేయగలిగామన్నారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుంచే మార్గదర్శిని రూపొందించామన్నారు. జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టీటీడీ, విజిలెనన్స్ , పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు. ిసీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తులు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘మంత్ర’
చంద్రగిరి : ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోహన మంత్ర–2025 మహోత్సవం మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబియు)లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, వారి మేధస్సును, వెలికితతీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చిన ప్రతి విద్యార్థిని అతిథులుగా భావించి వారికి తగిన సౌకర్యాలు కల్పించామన్నారు. సందడి చేసిన మోహన్ బాబు మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్బాబు సందడి చేశారు. యూనివర్శిటీలో నిర్వహిస్తున్న వివిధ ఈవెంట్లను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. అనంతరం కొన్ని చోట్ల ఆయన విద్యార్థులతో పాటు ఆయన ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అదే విధంగా ప్రో ఛాన్సలర్ విష్ణు విద్యార్థులతో డ్యాన్సులతో జత కలసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఉత్సాహంగా ఈవెంట్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టెక్నోహాలిక్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఎంబెడెడ్ వర్క్షాప్, కోడ్ స్రింట్, లైఫ్ సేవర్ వర్క్షాప్, ఈవీ వర్క్షాప్, టెక్ ఎక్స్–ప్రోటోటైప్, ఈవీ ఈక్స్పో, క్యూజోనోమిక్స్లు ఆకట్టుకున్నాయి. కళాక్షేత్ర, స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా లెట్స్ నాచో, చికెన్ డిన్నర్(పబ్జీ), కరోకే కెచప్, పుష్ ఆప్ ఛాలెంజ్– ఎం ప్రాజా ఈవెంట్లు విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్రీ ఫైర్, గల్లీ క్రికెట్, మిక్స్డ్ బాస్కెట్ బాల్, ట్రెజర్ హంట్, లక్కీ డ్రా, ఫన్ గేమ్స్, ఫుడ్ ఛాలెంజ్, జార్బింగి బాల్స్ వంటి ఈవెంట్లు ఆకట్టుకున్నాయి. అదరగొట్టిన డ్రమ్స్ శివమణి డీజే మోహన మంత్ర–2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ విద్యానికేతన్లో మైదానంలో నిర్వహించి డీజే కార్యక్రమం అదరగొట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ వాయిద్యకారుడు డ్రమ్స్ శివమణి తన సంగీతంతో విద్యార్థులను అలరించారు.


