breaking news
Tirupati District Latest News
-
పాఠశాల చదువులకు అంగన్వాడీ పునాదులు
పెళ్లకూరు : ప్రాథమిక పాఠశాల చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు పిల్లలకు అంగన్వాడీ పునాదులని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతబాయి పేర్కొన్నారు. మంగళవారం తాళ్వాయిపాడు, చిల్లకూరు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. చిల్లకూరులో నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాళ్వాయిపాడు అంగన్వాడీలో చిన్నారులకు అమలు చేస్తున్న మెనూ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ ఉమామహేశ్వరి, వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 17 నుంచి పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ తిరుపతి సిటీ: ఏపీ పాలిసెట్–2025కు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియకు కౌన్సెలింగ్ చివరి దశ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ కోఆర్డినేటర్, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వై ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని అభ్యర్థులు 19వ తేదీలోపు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే లేటరల్ ఎంట్రీ, బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన ఐటీఐ అభ్యర్థులు డిప్లొమో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని కోరారు. సీటు సాధించిన అభ్యర్థులు రూ.6 వేలు ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందాలని సూచించారు. -
పంటల బీమాపై అవగాహన కల్పించాలి
చంద్రగిరి : జిల్లాలోని రైతులందరూ 2025–26 గాను రైతులు స్వచ్ఛందంగా పంటల బీమాకు నమోదు చేసుకోవచ్చునని, ఇందుకోసం జిల్లా అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో వ్యవసాయ , ఉద్యాన శాఖల అధికారులతో పంటల బీమా పథకంపై డీఎల్ఎంసీ కమిటీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి రైతు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. బీమా ప్రీమియం వివరాలను వెల్లడించిన జేసీ వరి పంటకు గ్రామాన్ని యూనిట్గా, సజ్జ పంటకు జిల్లాను బీమా యూనిట్గా పరిగణిస్తారని జేసీ తెలిపారు. వరి పంటకు ఒక హెక్టారుకు రూ.420 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా సజ్జ పంటకు హెక్టారుకు రూ.160 చెల్లించాలన్నారు. వేరుశనగకు హెక్టారుకు రైతు రూ.1400 , నిమ్మ పంటకు హెక్టారుకు రూ.6,250 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వరి పంట ప్రీమియం కోసం ఆగస్టు 15వ తేదీలోపు, సజ్జకు జులై 31వ తేది, వేరుశనగ, నిమ్మ పంటలకు జులై 15లోపు ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు చివరి తేదీ ఆయన తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులతో కలిసి పంటల బీమా వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ గుంటూరు రవికుమార్, ఇన్సూరెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ -
వెబ్ ఆప్షన్లలో ఆ కోర్సుపై విద్యార్థుల మక్కువ
● సీఎస్ఈ తరువాత ఏఐ, డేటాసైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులకు డిమాండ్ ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న ప్రైవేటు కళాశాలలు ● ఏడాదికి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తున్న వైనం ● పేద విద్యార్థులకు దూరంగా సీఎస్ఈలోని అధునాత కోర్సులు ● మిగిలిన కోర్సులకు వెబ్ ఆప్షన్ పెడితే చాలు సీటు పక్కా తిరుపతి సిటీ : జిల్లాలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల హడావుడి ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడినా వెబ్ ఆప్షన్ల ఎంపికపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ ఈఏఎమ్సెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రెండు రోజుల నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో నెట్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. సెట్లో మంచి ర్యాకులు సాధించిన 90 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులపై కనీసం 10 శాతం మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలు సొమ్ము చేసుకుంటూ.. సీఎస్ఈ కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇదే అదునుగా రెచ్చిపోతూ ఫీజుల పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యా సంస్థలలో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లును పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఏఐసీటీఈ గత ఏడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఎత్తి వేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం రూ.70 వేలకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంతా ఫీజు చెల్లించి వెనుదిరుగుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చోవడం గమనార్హం. 20 వేల మందికి ఇదే కోర్సుకు .. ఇప్పుడంతా సీఎస్ఈ బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఆ గ్రూప్నకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఏపీఈఏమ్సెట్ పరీక్షకు హాజరు కాగా ఇందులో 22,500 మంది అర్హత సాధించారు. ఇందులో ఇప్పటివరకు సుమారు 22 వేల మందికి పైగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్లోని పలు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారంటే డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డేటా సైన్స్, ఏఐ ఆప్షన్లు పెట్టాను ఏపీఈఏఎమ్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. డేటా సైన్స్ లేదా ఏఐ చేయాలని ఉంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం డేటా సైన్స్, రెండో ప్రాధాన్యం ఏఐకి ఇచ్చాను. కచ్చితంగా నేను అనుకున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఫారిన్లో ఎమ్ఎస్ చేయాలని ఉంది. – పృధ్వి, విద్యార్థి, తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. సాఫ్ట్ వేర్ రంగంలో రాణించాలనేది నా చిన్ననాటి కోరిక. ఏపీఈఏఎమ్సెట్లో 3 వేల లోపు ర్యాంక్ సాధించా. కచ్చితంగా పేరొందిన కళాశాలలో సీఎస్ఈ జనరల్ సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే వెబ్ ఆప్షన్ తొలి ప్రాధాన్యతగా సీఎస్ఈ జనరల్, రెండో ప్రాధాన్యతగా ఈఎస్ఈకి ఇచ్చా. – రజిని, విద్యార్థిని, తిరుపతిఏఐ కోర్సు చేయాలని.. ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లలో సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రథ మ ప్రాధాన్యం ఇచ్చాను. ఏఐకి క్రేజ్తో పాటు భవిష్యత్తు ఉంది. కష్టపడి చదివితే మంచి ప్యాకేజ్తో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. ఏఐ కోర్సుకు ఎస్వీయూ పరిధిలో పేరొందిన కళాశాలలకు తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్నా. –ప్రవల్లిక, విద్యార్థిని, తిరుపతి -
బీసీ మహిళలకు రక్షణ కరువు
● కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్పై దాడి హేయం ● వైఎస్సార్సీపీ నేతల నిరసన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైయిందని, అడుగడుగునా బీసీ మహిళలకు అవమానాలు చోటు చేసుకుంటున్నాయని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ , జనసేన గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకు అంతులేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పోలీసులు కూటమి నేతల కీలుబొమ్మలా మారిపోయిందన్నారు. ఒక జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూడటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా న్యాయం చేయడంలేదని మండిపడ్డారు. బీసీలంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని మేయర్ ప్రశ్నించారు. గత జగనన్న పాలనలో బీసీ మహిళలకు ఉన్నత పదవులను కల్పించి ఉన్నత స్థాయిని కల్పించారని గుర్తు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాదవిరెడ్డి మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై కూటమి గూండాలు దాడు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడడం దుర్మార్గమన్నారు. మహిళలపై దాడులు చేస్తే తాటతీస్తానన్న పవన్కళ్యాణ్కు ఇలాంటివి కనబడవా? అని ప్రశ్నించారు. కూటమి గూండాలకు ప్రజలే బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆరణి సంద్య, కోటమ్మ, ఆదిలక్ష్మి, పుణీత, కోటూరు ఆంజినేయులు, బోకం అనీల్కుమార్, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, బీసీ నాయ కులు పుల్లయ్య, చిన్నియాదవ్, మల్లెమొగ్గల ఉమాపతి, పార్టీ నాయకులు తలారి రాజేంద్ర, ఉదయ్వంశీ, వాసుయాదవ్, మల్లం రవికుమార్రెడ్డి, దినేష్రాయల్, మద్దాలి శేఖర్, కడపగుంట అమరనాధరెడ్డి, పడమటికుమార్, పెరుగు బాబూయాదవ్ తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు -
‘మధ్యవర్తిత్వం’పై అవగాహన
దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై మంగళవారం జిల్లా అదనపు న్యాయమూర్తి అవగాహన కల్పించారు.పేదలకు దూరంగా అధునాతన కోర్సులు డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సీఎస్ఈ బ్రాంచ్లోని ఏఐ, డేటా సైన్స్, ఎమ్ఎల్, ఎస్ఎస్ కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. ఏపీఈఏమ్సెట్లో సీటు సాధించినా ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్ట తరమవుతోంది. లక్షలలో ఫీజుల చెల్లించలేని పేద విద్యార్థులు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సీఎస్ఈ కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – 8లో -
ఎన్ఎస్యూలో ముగిసిన బ్రిడ్జి కోర్సు
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు వారం రోజులుగా నిర్వహించిన బ్రిడ్జి కోర్సు మంగళవారం ముగిసింది. వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ మాట్లాడుతూ.. సంస్కృతంలోని 14 శాసీ్త్రయ అంశాలపై విద్యార్థులకు వారం రోజుల పాటు పరిచయాత్మక బోధన చేశామన్నారు. విద్యార్థులు వర్సిటీలోని సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థాయి చేరుకుని వర్సిటీకి పేరు ప్రతిష్ట తీసుకురావాలని సూచించారు. అనంతరం బ్రిడ్జి కోర్సుకు హాజరైన విద్యార్థులకు ప్రమాణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాకరణ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, డాక్టర్ యశస్వీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి చెస్ పోటీలకు శ్రీగురువర్షిణి
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరానికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. విశాఖపట్నంలో ఈ నెల 12, 13వ తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్–15 ఓపెన్ అండ్ గరల్స్ చెస్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతికి చెందిన చెస్ క్రీడాకారిణి ఒంటి శ్రీగురువర్షిణి పాల్గొంది. మొత్తం 7 రౌండ్లకు 6 పాయింట్లతో 4వ స్థానం సాధించి రూ.5 వేలు నగదు బహుమతి, ట్రోఫీని అందుకుంది. అలాగే ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీగురువర్షిణిని కోచ్ కాకినాడ ప్రసాద్ అభినందించారు. అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి చిల్లకూరు: మండలంలోని కాకువారిపాళెం సమీపంలో ఉన్న సొనకాలువ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిక్కవరం గ్రామానికి చెందిన గారా అవినాష్ (25) తన అమ్మమ్మ గ్రామమైన కాకువారిపాళేనికి ఆదివారం రాత్రి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిని తరువాత అతను ఇంట్లో లేక పోవడంతో బయటకు వెళ్లి ఉంటాడని అతడి అమ్మమ్మ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఉదయం సొన కాలువ వైపు బహిర్బూమికి వెళ్లిన వారు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు.వారు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి గ్రామంలో కొంత మంది మధ్య వివాదం నెలకొనడం మృతుడు వారి అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి, అక్కడ మృతి చెందడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించినట్లు తెలిసింది. -
తీవ్రవాదిలా తీసుకుని వస్తారా?
చిల్లకూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని నె ల్లూరు నుంచి గూడూరు కోర్టులో హాజరుపరిచే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కూట మి ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఆయన్ని తీవ్రవాదిని తీసుకుని వచ్చినట్లు తీసుకుని వస్తారా? అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రశ్నించారు. గూడూ రు రెండో పట్టణంలోని వైఎస్సార్సీపీ రూరల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధారమైన కేసు ల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి, పలు కోర్టులకు తిప్పుతున్నా రని విమర్శించారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసులు పీటీ వారెంట్ వేసి, గూడూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకుని వచ్చే క్రమంలో అప్పటికప్పుడు 144వ సెక్షన్ను అమలులోకి తీసుకుని రావడం, రెండో పట్టణంలోని కోర్టుకు మూడు వైపులా ఉన్న దుకాణా లు మూసి వేయడం, పోలీసుల మోహరింపు చూస్తుంటే ఎందుకంత భయమో అర్థం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ నాయకులను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు బనాయించా రన్నారు. చట్ట సభలో చట్టాలను చేసే తమ లాంటి ప్ర తినిధులకు కూడా గూడూరు పోలీసులు అనుమతి ఇ వ్వకుండా కోర్టు ఆవరణలోకి వెళ్లనీయకుండా ఎండ లోనే గేటు బయట గంటల పాటు ఆపడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. గతంలో బ్రిటీష్ పోలీసులు భారతీయులపై చేసిన తప్పిదాలను నేడు రాష్ట్ర పోలీసులు గుర్తు చేస్తున్నారని, దీంతోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో పలు రకాల ఆంక్షలు విధించడం దారుణమైన విషయమని అన్నారు. తనతో పాటుగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ మండల కార్యాలయంలో ఉంటే అ క్కడకు వచ్చి బయటకు వస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్గౌడ్, యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్రెడ్డి, గూడూ రు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు గొట్టి పాటి రవీంద్రరెడ్డి, కామిరెడి కస్తూర్రెడ్డి, ఓడూరు బా లక్రిష్టారెడ్డి, బాబురెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, యల్లా శ్రీనివాసులరెడ్డి, సాయిరెడ్డి, దీప్తి పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణిని కోర్టు హాజరులో పోలీసుల అత్యుత్సాహం శాసన మండలిలో ఫిర్యాదు చేస్తా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ -
అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ లో సోమవారం మధ్యాహ్నం లూప్లైన్లో ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్ప్రెస్ రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల నగరంలో ఆకతాయిల తాకిడి అధికమైంది. వారికి హోటల్ భీమాస్ వెనుక ప్రాంతంలోని రైల్వేట్రాక్ (లూప్లైన్) పరిసరాలు అడ్డాగా మారాయి. కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు, బార్లు ఉండడంతో ఆకతాయిలకు మరింత అనుకూల వాతావరణంగా మారింది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఉదయం వేళల్లో సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగు ప్రయాణం రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునే క్రమంలో లూప్లైన్ ట్రాక్లోకి తరలిస్తున్నారు. వాటిలో రాయలసీమ ఎక్స్ప్రెస్తోపాటు వారాంతపు రైళ్లను నిలుపుతున్నారు. ఇలా ఆగి ఉన్న రైలు బోగిలను ఆకతాయిలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గంజాయి, మద్యం మత్తులోని ఆకతాయిలు బీడీ, సిగరెట్టు వంటివి కాల్చి ఆగి ఉన్న ఇసాక్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగిలో వేసి ఉంటారనే అనుమానాలకు తావిస్తొంది. ఈ విషయం అగ్ని ప్రమాద సంఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానికులతో పాటు పోలీసు వర్గాల్లో సైతం చర్చకు దారి తీసింది. ఆకతాయిలకు అడ్డగా లూప్లైన్ పరిసరాలు వారిపైనే అనుమానాలు విచారణలో వెలుగుచూసేనా..? భిన్నంగా స్పందనలు కాగా రైలు బోగిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదపై రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి, జిల్లా అగ్నిమాపకాధికారి రమణయ్య స్పందించిన తీరు భిన్నంగా ఉంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితి, నష్టం వంటి వాటిపై విచారణ కమిటీ నివేదిక ఇస్తుందని స్టేషన్ మేనేజర్ చెప్పడం, మరోవైపు తిరుపతిలోని అధిక ఉష్ణోగ్రత కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాఽపకాధికారి వెల్లడించడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదు. ఆకాయిల కట్టడి సాధ్యమేనా..? ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైన్షాపుల నుంచి బ్రాందీ, విస్కీ, బీరు తెచ్చుకుని దర్జాగా సేవిస్తున్నారంటూ సమీపం నివాస గృహాల ప్రజలు బాహటంగా చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం, గంజాయి మత్తులో వీరంగం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పులు లేవనే తెలుస్తోంది. కూత వేటు దూరంలో రైల్వేస్టేషన్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీపీ విభాగాలు, మరోవైపు వెలుపలి ప్రాంతంలో ఈస్ట్ పోలీసుస్టేషన్ ఉన్నాయి. అయినప్పటికీ ఆకతాయిల్లో భయమనేది లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడడంతో రైల్వేట్రాక్లపై ఆకతాయిల ఆగడాలు మితీమీరుతున్నాయనే విమర్శలున్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నం రైలు బోగిలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెప్పుకోదగిన సంఖ్యలో పోలీసుల మొహరింపు కనిపించింది. ఏదేని భారీ సంఘటన జరిగితే తప్ప మిగిలిన సమయాల్లో పర్యవేక్షణ అంతంత మాత్రమేనా? అనే సందేహాలకు తావిస్తోంది. -
ఒకే ఆటోలో 25 మంది విద్యార్థుల ప్రయాణం
– పాఠశాల విలీన ఫలితం బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం రద్దు చేయడంతో మరో పాఠశాలకు వెళ్లటానికి విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొంతమంది ఆటోవాలాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించటానికి వెనుకాడడం లేదు. మండలంలోని మొక్కలచేను గిరిజన కాలనీ లోని ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి కల్లివెట్టులోని ప్రైమరీ పాఠశాలలో విలీనం చేశారు. మొక్కలచేను గిరిజన కాలనీలో 25 మంది పిల్లలు చదువుకుంటు న్నారు. మొక్కలచేను గిరిజన కాలనీ నుంచి కల్లివెట్టు పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. కల్లివెట్టు పాఠశాలకు వెళ్లటానికి 25 మంది విద్యార్థులు ఒకే ఆటోలో వెళుతున్నారు. పాఠశాల విలీన ఫలితంగానే విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. -
జాతీయ చేనేత, హస్తకళ విభాగంలో జిల్లాకు మొదటి బహుమతి
– వెంకటగిరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ గుర్తింపు తిరుపతి అర్బన్: ఢిల్లీ ప్రగతి భవన్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రాడక్ట్ కార్యక్రమంలో చేనేత హస్త కళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని కై వసం చేసుకుంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేనేత, హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం చాలా గర్వకారణమని తెలిపారు. వెంకటగరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి జిల్లా హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ కేటగిరీలో మొదటి బహుమతి (బంగారు కేటగిరి)ని గెలుచుకోవడం చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒకరి కృషి ఫలితమేనన్నారు. జిల్లాలో ఓడీఓపీ కింద ప్రోత్సహిస్తున్న వెంకటగిరి పట్టు చీరలు, స్థానికంగా తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తుల వైశిష్ట్యం, నాణ్యత ఈ గౌరవానికి కారణమని తెలిపారు. ఇలాంటి పురస్కారాలు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని కలిగించడంతోపాటు, వారి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జితిన్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖ గుప్త, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ మినిస్టర్ సవిత, జిల్లా చేనేత అధికారి రాచపూడి రమేష్ పాల్గొన్నారు. ఘరానా దొంగ అరెస్ట్ తిరుపతి క్రైమ్: జిల్లాలోని నాయుడుపేట, సత్యవేడు ప్రాంతాల్లోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు, ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తి నాయుడుపేటలోని మూగాంబికా దేవాలయం వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 416 గ్రాముల బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూళ్లూరుపేట డీఎస్పీ చెంచు బాబు, సీఐ బాబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పార్వతీపురం జిల్లాకు చెందిన చందాక మణికంఠ(28) అనుమానాస్పదంగా తిరుగుతుంటే నాయుడుపేటలో అరెస్ట్ చేశారు. ఎవరిరీ అనుమానం రాకూడదని ఉద్దేశంతో పార్వతీపురం నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనాలు పాల్పడేవారు. ఇతనిపై సూళ్లూరుపేట పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తడ, శ్రీ సిటీ, వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని మొవ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్లో మూడు కేసులు, ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి. సుమారు ఇప్పటివరకు 14 కేసులకు పైగా ఉన్నట్లుగా గుర్తించారు. నాలుగు కేసులకు సంబంధించి 416 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇతన్ని రిమాండ్కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. -
వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక పోటీలకు 16 మంది హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : కడపలోని డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 11, 14వ తేదీల్లో తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో ఎంపిక పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల నుంచి హాజరైన 16 మంది చిన్నారులకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, డీఎస్ఏ కోచ్ల ఆధ్వర్యంలో ఆరు రకాల ఈవెంట్లలో పరీక్షలు నిర్వహించారు. అలాగే వీ రందరికి వైద్య బృందం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను శాప్కు పంపించినట్లు డీఎస్డీఓ తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను త్వరలో ఆన్లైన్లో శాప్ ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో లెక్చరర్ పోస్టుల భర్తీకి మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ తిరుపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న లెక్చరర్ పో స్టుల పరీక్షలకు 6,412 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, ఎల క్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదన్నారు. జిల్లాలో పుత్తూరు సి ద్ధార్థ, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణ మ్మ ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి జూపార్క్ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్, గూ డూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఎన్బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే హాజరు కావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. -
ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం
తిరుపతి సాక్షిటాస్క్ఫోర్స్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 746 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలున్నారు. వీరిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 693 మందికి సాధారణ బదిలీలు చేయగా.. మిగిలిన వారిని మెడికల్ గ్రౌండ్స్ కింద చూపించారు. తొలుత మాన్యువల్ ప్రకారం బదిలీలు చేయాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సిఫార్సుల వెల్లువ బదిలీల ప్రకటనతో ఏఎన్ఎంలు వారికి అనుకూలమైన ప్రాంతాలు వరించేలా ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూటమి బడా నేతలు, ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. వారి సిఫార్సు లేఖలను బదిలీలకు జత చేశారు. ఈ సిఫార్సులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని చోటామోటా నాయకులు కూడా సొంత లెటర్లతో సిఫార్సులు పంపారు. ఎవరికి వారు సత్తా చాటుకోవాలని శాఖపై పట్టుబట్టారు. సిఫార్సులతో పాటు ఫోన్లు చేసి అధికారులను విసిగించారు. వారి హోదాను గుర్తు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేశారు. ఈకారణంగా ఎవరి సిఫార్సుకు తలొగ్గాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. బదిలీల ప్రక్రియను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖపై బురద కూటమి నేతల జోక్యం, ఒత్తిడి, సిఫార్సులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శాఖ అధికారులు బదిలీల్లో జూమ్ కౌన్సెలింగ్ను తీసుకొచ్చారు. ఈనెల 8వ తేదీ నుంచి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ను ప్రారంభించారు. 11వ తేదీ రాత్రితో ఈ ప్రక్రియను ముగించారు. అయితే చాలా మందికి అశించిన ప్రాంతాలు రాక అయోమయానికి గురవుతున్నారు. మరికొందర్ని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన ఇప్పటికీ సిఫార్సుల గోల తగ్గడం లేదు. అధికారులపై కొందరు ఏఎన్ఎంలు ప్రజాప్రతినిధులు, కూటమి నేతల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆర్డర్ పత్రాలు ఇచ్చేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా శాఖపై బురద పడుతోంది. కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతల జోక్యంతో వచ్చిన యవ్వారమని ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.గందరగోళం ఏమీ లేదు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. జూమ్ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నాం. మాకై తే ఎవరినీ ఇబ్బంది పెట్టించాల్సిన అవసరం లేదు. శాఖలో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులే. వాళ్లను ఇబ్బంది పెట్టించాలని మేము ఏరోజూ కోరుకోం. ఇప్పటి వరకు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ప్రయత్నం చేస్తున్నాం. గందరగోళం ఏమీ లేదు. తప్పులుంటే కచ్చితంగా సరిదిద్దేలా చూస్తాం. సమస్యలుంటే నేరుగా తీసుకురావొచ్చు. –సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, చిత్తూరు ముందస్తు బుకింగ్లు ఏఎన్ఎంల బదిలీల విషయంలో డిమాండ్ పెరిగే కొద్దీ పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో తమకు తెలియకుండా బదిలీలు చేయకూడదని హుక్కుం జారీ చేశారు. తమకు అనుకూలమైన వారినే వేయించుకుంటామని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ముందస్తుగానే 80శాతం ప్రాంతాలను వారి గుప్పట్లోకి తీసుకున్నారు. అక్కడికి రావాల్సిన వారిని వారే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపారు. కాగా వారి ఒత్తిడికి అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఇక్కడి నుంచి శాఖలో పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసేది లేక వారు చెప్పినట్లు బదిలీలను ముగించారు. కొందరు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉన్న ఏఎన్ఎంలు, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఏఎన్ఎంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. సహాయకులతో వసూళ్లు? కొందరు ఏఎన్ఎంలే వారి సహాయకులకు కాసులతో ఆశ చూపించారు. తాను అనుకున్న స్థానానికి బదిలీ చేయిస్తే అడిగింత ఇచ్చుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఎన్ఎంల బదిలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు రెచ్చిపోయారు. వారు ఒక్కో బదిలీకి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు పలువురు ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బెదిరింపులు 80 శాతం ముందస్తు బుకింగ్లు ఆపై కొందరు ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరుల దందాలు కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తామంటూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు మండిపడుతున్న ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం జోరందుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో గందరగోళమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 80 శాతం ముందస్తు బుకింగ్ చేసుకుంది. ఆపై పలువురు ప్రజాప్రతినిధుల అనుచరులు తెరపైకి తళుక్కుమన్నారు. కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యేందుకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ దందాతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. కూటమి పెత్తనంపై ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు. -
వెలుగులో చీడపై మహిళల కన్నెర్ర
● బ్యాంకు వద్ద ఆందోళనకు దిగిన డ్వాక్రా మహిళలు ● వైఎస్సార్ సీపీ నేత భూమన అభినయ్రెడ్డి మద్దతుతిరుపతి తుడా:వెలుగులో చీడ పురుగులుగా మారిన సిబ్బందిపై డ్వాక్రా సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. తమ నగదుకు భద్రత కరువడంతో సభ్యులు రోడ్డెక్కారు. ఆర్పీ హే మలత రూ.70 లక్షలు స్వాహా చేయడం వె నుక దాగి ఉన్న మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. ఆర్పీ ద్వారా మోసపోయిన పలు డ్వాక్రా సంఘాల మహిళలు లింగేశ్వరనగర్ లోని ఇండియన్ బ్యాంకు వద్దకు చేరుకుని సోమవారం ఆందోళనకు దిగారు. మహిళ లు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అధికారు లు బ్యాంకు గేటుకు తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు గేటు విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. రిసోర్స్ పర్సన్ హేమలత అవినీతి అక్రమాల్లో బ్యాంక్ సిబ్బంది ప్రమే యం ఉందని నిలదీశారు. బ్యాంకు మేనేజర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ సంఘాల సభ్యులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డితోపాటు, ఆ పార్టీ నాయకులు, సీపీఐ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం పెద్దది కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకు నుంచి బయటికి వెళ్లాలని కోరారు. దీంతో మహిళలు బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. సంబంధిత బ్యాంకు మేనేజర్ మహిళలకు వివరణ ఇచ్చారు. అప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు మహిళలను కోరారు. దీంతో ఆర్పీ హేమలతతోపాటు బ్యాంక్ సిబ్బందిపై డ్వాక్రా సంఘాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు స్వాహా విధానం ఆశ్చర్యం డ్వాక్రా సంఘాల నగదును కాజేసిన విధా నం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు భూమన అభి నయ్ మద్దతుగా నిలిచి ఆందోళనలో పా ల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో 44 వేల మందికి పైగా డ్వాక్రా సంఘాల సభ్యులు ఉన్నారన్నారు. వారి డబ్బులు ఏమాత్రం భద్రమో తేల్చా లన్నారు. డ్వాక్రా సంఘాల నగదుపై ఆడి ట్ నిర్వహించి మహిళల్లో నెలకొన్న ఆందోళను తొలగించాల్సిన బాధ్యత మెప్మా అధికారులదేనన్నారు. ఎస్ఎల్ఎఫ్ పరిధి లో సభ్యులందరి సమక్షంలో ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆర్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్లపై లోతైన విచారణ జరిపితేనే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.డ్వాక్రా సంఘాల పొదుపు ఇతర రుణాలను కాజేసిన ఆర్పి హేమలతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు పెంచల య్య, విశ్వనాథ్, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
ముగిసిన గ్రాప్లింగ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని గిరిజన భవన్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. సబ్ జూనియర్స్, క్యాడెట్ (బాయ్స్ అండ్ గర్ల్స్) విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్ విభాగంలో 20మంది బాలురు, 20మంది బాలికలు, అలాగే క్యాడెట్ విభాగంలో 10మంది బాలురు, 10మంది బాలికలు, మొత్తం 60మంది రెజ్లర్లను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి గ్రాప్లింగ్ పోటీల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో ఒక్రీడా భారతి అధ్యక్షుడు ఎంవీ.మాణిక్యాలు, కార్యదర్శి పి.ధనంజయరెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేంద్రరెడ్డి, విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏజీ రేఖారాణి పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,221 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాయం కంటే ముందు వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కలెక్టర్, జేసీ, డీఆర్ఓతోపాటు వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది సూచిస్తున్నారు. రేపటి నుంచి పీ–4 రీసర్వే తిరుపతి అర్బన్ : ప్రభుత్వం చేపట్టిన పీ–4 పాలసీలో రెండో దశ కింద రీసర్వేను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి జీరో ప్రావర్టీ కింద జిల్లావ్యాప్తంగా 80,324 కుటుంబాలను గుర్తించారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ కుటుంబాలను దత్తతకు అప్పగించాలని లక్ష్యం నిర్దేశించారు. అయితే కుటుంబాల సంఖ్యలో ఎక్కువగా ఉండడంతో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అనంతరం ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 కుటుంబాలను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. మిగిలిన కుటుంబాలను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సేవా సంస్థలకు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. 29 వరకు ‘నవోదయ’ దరఖాస్తుకు గడువు తిరుపతి ఎడ్యుకేషన్:జాతీయ స్థాయిలో 2026– 27విద్యాసంవత్సరానికి సంబంధించి నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 29వ తేదీ ఆఖరు గడువని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షను డిసెంబరు 13న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
తిరుపతికి మరో ‘వందే భారత్’
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతికి మరో వందేభారత్ రైలు రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఈ కొత్త రైలును విజయవాడ–బెంగళూరు వయా తిరుపతి మధ్య నడిపేందుకు రూట్ నిర్ణయించారు. కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు, నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఎప్పటి నుంచి పట్టాలపైకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సమయం ఆదా విజయవాడ నుంచి చైన్నెకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే శాఖ మేలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోచ్లు సమస్య కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఇందులో బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల సమయం ఆదా కానుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. రూట్ షెడ్యూల్ ఇదీ.. కొత్త వందేభారత్కు రైలుకు 20711 నంబర్ కేటాయించారు. అలాగే రూట్ షెడ్యూల్ మేరకు ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45 గంటలకు చేరుకుంటుంది. అనంతరం చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం, 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు బయలుదేరి కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది.వందే భారత్ రైలు -
ప్రాణాలతో చెలగాటమా?
తిరుపతి మంగళం : ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లను వెలిగించకుండా వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి కరకంబాడి మార్గంలో ప్రజలు, వాహనదారుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సెంటర్ లైట్లు ఏడాది కాలంగా వెలగడం లేదు. దీంతో వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి తిరుపతి–కరకంబాడి మార్గంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యుత్లైట్లు వీఐపీల కోసమా, ప్రజల కోసమా అంటూ నినదించారు. ప్రజలు, వాహనదారుల రక్షణ కోసం చేస్తున్న నిరసన కార్యక్రమంలో కొంతసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడినా సహకరించాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి వాహనదారులను అభ్యర్థించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు మంగళం పంచాయతీ, తిరుపతి నగర ప్రజలు నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని తెలిపారు. దాంతో పాటు ఆ మార్గంలోని కళాశాలలకు వెళ్లి వచ్చే విద్యార్థులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అయితే విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి ఏడాది కాలం అవుతున్నా వాటిని వెలిగించడంలో టీటీడీ, తుడా, విద్యుత్శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు చిమ్మచీకటిలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు, పవన్కళ్యాణ్కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ దీపాలను వెలిగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అయితే నిరసన కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడుతున్న అభినయ్రెడ్డితో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు లాగి పక్కకు నెట్టేశారు. దాంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుపైన నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు -
కుమార్తె పెళ్లికి తెచ్చిన బంగారు ఆభరణాలు చోరీ
● వరుసగా రెండిళ్లలో చోరీ చిల్లకూరు : పట్టణంలో శనివారం వేకువ జామున దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని గమ్మళ్లపాళెం, అశోక్నగర్ ప్రాంతాలలో రెండిళ్లలో చోరీకి పాల్పడి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గూడూరు పట్టణ నడి బొడ్డున ఉన్న గమ్మళ్లపాళెంకు చెందిన పరుచూరి శివయ్య తన కుమార్తె వివాహం ఆగష్టులో నిర్ణయించుకోవడంతో ఇంటిలో ఉన్న సొమ్ముతో పాటుగా అప్పు చేసి సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలు చేయించి ఇంటిలోని బీరువాలో ఉంచాడు. తన కుమారుడు చైతన్యను ఇంటిలోనే ఉంచి నెల్లూరులో ఓ పని మీద కుటుంబ సభ్యులు అందరూ వేకువజామున వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనక బాగం నుంచి లోనికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. కుమార్తె పెళ్లికి తెచ్చి పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడంతో కుమార్తె పెళ్లి ఎలా చేయాలని శివయ్య కన్నీటి పర్యంతం కావడం అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. అలాగే సమీపంలోనే ఉన్న అశోక్ నగర్లోని శేషయ్య ఇంటిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శేషయ్య ప్రస్తుతం తన కుమార్తె హైదరాబాద్లో ఉంటుండడంతో ఆమె వద్దకు వెళ్లడంతో ఇంటిలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంత మేర నగలు, డబ్బులు చోరీ జరిగిందనే విషయం ఆయన ఫిర్యాదు మేరకు పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు, వాకాడు సీఐ హుస్సేన్బాషా సంఘటనా స్థలంలో పరిశీలించిన అనంతరం క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా వారు వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేఖర్బాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రేణిగుంట : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఏర్పేడు మండలానికి చెందిన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మర్రిగుంట సర్కిల్ నుంచి విమానాశ్రయ రహదారి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఏర్పేడు మండలం కాట్రకాయ గుంట గ్రామానికి చెందిన రత్నయ్య కుమారుడు భాస్కర్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి గాజుల మండ్యం పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైస్ ఎంపీపీ సరోజని మృతి సత్యవేడు: మండలంలోని మదనంబేడు పంచాయతీకి చెందిన వైస్ ఎంపీపీ(వైఎస్సార్సీపీ) డి.సరోజని శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మండలం, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆమె మృతి పార్టీకి తీరనిలోటని జెడ్పీటీసీ పి.విజయలక్ష్మీ, సర్పంచ్ ఎస్.శివరంజని తదితరులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అర్చకులకు రూ.5 వేలు తిరుపతి అర్బన్: ధూపదీప నైవేద్యాల సమర్పణకు అర్చకులకు రూ.5 వేలు అందిస్తున్నట్లు జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ఆలయాల నిర్మాణం కోసం రూ.10 లక్షలు అందిస్తున్న నేపథ్యంలో అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 130 ఆలయాలకు నిధులు ఇచ్చినట్లు చెప్పారు. గుర్తింపు పొందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ.15 వేలు ఇస్తున్నట్లు వివరించారు. రైల్వే స్టేషన్లో 12 కిలోల గంజాయి పట్టివేత గూడూరు రూరల్ : గూడూరు రైల్వే స్టేషన్లోని 4వ నంబర్ ప్లాట్ఫారం చివరన అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని గూడూరు రైల్వే పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు విలువ చేసే 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే సీఐ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు నెల్లూరులోని రైల్వే డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీధర్ వివరాలను వెల్లడించారు. నిషేధిత మాదక ద్రవ్య రవాణా నిరోధానికి ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన హరిహరన్ అనే వ్యక్తి టాటానగర్– ఎర్నాకుళం జంక్షన్ ఎక్స్ప్రెస్లో గూడూరు రైల్వే స్టేషన్లో దిగి అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో నెల్లూరు రైల్వే ఎస్ఐ మాలకొండయ్య, రైల్వే పోలీసు సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, కిరణ్ పాల్గొన్నారు. -
ఐచర్ను ఢీకొన్న బైక్
● ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐచర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాష(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్తో పాటు ఐచర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో పడి బోల్తా పడగా, టమాటా బాక్స్లు , బైక్ మహబూబ్ బాషపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐచర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లి వచ్చే సరికే ఇల్లు గుల్ల 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యంనాయుడు (పలమనేరు), రూపేష్రెడ్డి(చిత్తూరు), ప్రభురాజ్(నగరి), ఆఫ్రిడ్ మాలిక్(పుంగనూరు), ప్రధాన కార్యదర్శులుగా దిలీప్యాదవ్(శ్రీకాళహస్తి), మోహన్వంశీ(తిరుపతి), పి.శివ(పుంగనూరు), నవీన్కుమార్రెడ్డి(జీడీనెల్లూరు), శశింద్ర(తిరుపతి), మనోహర్రెడ్డి(చంద్రగిరి), మునివెంకటలోకేష్(తిరుపతి), షేక్బావాజీ(పుంగనూరు), వంశీకృష్ణ(పూతలపట్టు), కార్యదర్శులుగా శేషాద్రిరెడ్డి(జీడీనెల్లూరు), రమేష్(సత్యవేడు), రెడ్డిప్రసాద్(పలమనేరు), ధనుంజయరెడ్డి(చంద్రగిరి), సుధీర్(తిరుపతి), హేమంత్కుమార్రెడ్డి(కుప్పం), ఈసీ మెంబర్లుగా 16 మందని నియమించారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.అనిల్కుమార్రెడ్డి(తిరుపతి), ఎ.భానుప్రకాష్(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ది.షణ్ముగంరాయల్(తిరుపతి), ఈశ్వర్రెడ్డి(పుంగనూరు), ప్రదీప్రెడ్డి(చిత్తూరు), యోగానందరెడ్డి(చంద్రగిరి), శోభన్కుమార్(సత్యవేడు), కార్తీక్రెడ్డి(జీడీనెల్లూరు), ఎన్.మురుగేష్(తిరుపతి), కార్యదర్శులుగా జి.రమేష్(కుప్పం), అరుణ్కుమార్(చిత్తూరు), మహేష్రెడ్డి(పుంగనూరు), హరిప్రసాద్(తిరుపతి), ఈశ్వర్(పలమనేరు), మదన్(జీడీనెల్లూరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా శశిదీప్(చిత్తూరు), సోమశేఖర్(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా మహేష్చౌదరి(చిత్తూరు), మహేష్(జీడీనెల్లూరు), మధుసూదన్రెడ్డి(తిరుపతి), భానుప్రకాష్రెడ్డి(చంద్రగిరి), వీరమణి(కుప్పం), కార్యదర్శులుగా అజిత్కుమార్(చిత్తూరు), అశ్విత్(పలమనేరు), వేణురెడ్డి(జీడీనెల్లూరు), ప్రదీప్కుమార్(తిరుపతి), పృధ్వీరెడ్డి, సుధీర్రెడ్డి, దినేష్, నరేష్బాబు(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 11 మందిని నియమించారు. వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా రూపేష్కుమార్రెడ్డి(తిరుపతి), ప్రసాద్(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా రాధికరెడ్డి(జీడీనెల్లూరు), విజయరెడ్డి(తిరుపతి), రవి(కుప్పం), రమేష్(తిరుపతి), కార్యదర్శులుగా పెద్దన్న (కుప్పం), రోహిత్బుచ్చిరెడ్డి(చిత్తూరు), సుబ్రమణ్యంరెడ్డి(జీడీనెల్లూరు), అమర్నాథ్రెడ్డి(పలమనేరు), చలపతి, మంజూరు, కిషోర్(పుంగనూరు), జీవరత్నం (తిరుపతి), ఈసీ మెంబర్లుగా 19 మందిని నియమించారు. వలంటీర్ల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జయచంద్ర(తిరుపతి), అబ్దులజైలా(జీడీనెల్లూరు),బోస్రెడ్డ్డి(చంద్రగిరి),శివలింగం(కుప్పం),బాలసుబ్రమణ్యం(సత్యవేడు), కార్యదర్శులుగా పి.వరదరాజన్, పురుషోత్తం(తిరుపతి), రాము (జీడీనెల్లూరు), మనోహర్(శ్రీకాళహస్తి), ప్రభాకర్రెడ్డి(పలమనేరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. చేనేత విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏలుమలై(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా రవిరెడ్డి(జీడీనెల్లూరు), పి.చంద్రశేఖర్(తిరుపతి), సుధాకర్, మునిరాజా(శ్రీకాళహస్తి), విజయ్భాస్కర్(సత్యవేడు), కార్యదర్శులుగా రమేష్రెడ్డి(పలమనేరు), తిరుమల(జీడీనెల్లూరు), కన్నాయిరం(నగరి), వెంకటేష్(కుప్పం), అమరలింగయ్య(సత్యవేడు), నలుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. వైఎస్సార్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిరుమలరెడ్డి(తిరుపతి), షేక్ ఫిరోజ్అహ్మద్(పూతలపట్టు), ప్రధాన కార్యదర్శులుగా వెంకటేష్(జీడీనెల్లూరు), ఎం.బాబు(నగరి), శ్రీమంతుల రామయ్య(తిరుపతి), సుబ్రమణ్యంరెడ్డి(చంద్రగిరి), వేణుగోపాల్(కుప్పం), కోటేశ్వరరావు(చంద్రగిరి), కార్యదర్శులుగా శ్రీనివాసులు(పలమనేరు), రఘు(పూతలపట్టు), మునికృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), మాంగండన్(నగరి), వెంకటముని(చిన్ని)(తిరుపతి), జి.కోటేశ్వరరావు(సత్యవేడు), సురేష్(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా 16 మందిని నియమించారు. -
పచ్చముఠా దోపిడీ
● ఇష్టారాజ్యంగా ఇసుక, గ్రావెల్, బండరాళ్ల తరలింపు ● రాజుపాళెంలో యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు అక్రమంగా తరలిస్తూ సహజ సంపద లూటీ చేస్తున్నారు. ఓ నేత కనుసన్నల్లో పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహజ సంపద గుల్ల చేసి రూ.కోట్ల సొమ్ము వెనుకేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు. కానీ తమ్ముళ్లు ఇసుక రేవుల్లో పడి దొరికందంతా దోచేస్తున్నారు. దీనికి తోడు పెన్నాలో నీటి ప్రవాహంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లభించే పెద్ద పెద్దరాళ్లతో పాటు గ్రావెల్ను సైతం నిర్భయంగా తరలించుకుపోతున్నారు. రీచ్లకు పుల్ స్టాప్.. అయినా ఆగని అక్రమ రవాణా నెల్లూరు జిల్లాలోని ఇసుక రీచ్లను అక్టోబర్ 15 వరకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. కానీ ఉన్నతాఽధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు రాజుపాళెం రీచ్లో ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు చేసి యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పగలు, రాత్రి లేడా లేకుండా తరలిస్తూ దోపిడీ సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నదిలోకి రాచబాట పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డు వేశారు. రాజుపాళెంలోకి ప్రధాన రహదారి నుంచి ప్రైవేటు వ్యక్తికి చెందిన మామిడి తోట నుంచి రోడ్డును నిర్మించారు. ఆ రహదారి వేసేందుకు ఆ ప్రైవేటు వ్యక్తికి నెలకు రూ. 50 వేలు ముట్టచెబుతున్నారు. నది గర్భంలోకి రోడ్డు వేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడంలేదు. అధికార పార్టీ నేతల సహకారంతో పచ్చ మాఫియా నదిలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు దోపిడీ చేస్తుంటే అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
కేసులతో భయపెడతారా?
రైతులతో ఆటలొద్దు. మేము రోడ్డు మీదకు వస్తే మళ్లీ మా మూళ్లగా ఉండదు. రైతు పండించే పంటకు గిట్టుబా టు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది చేయలేకపోతే..ఇలా ప్రతిపక్షాలు రోడ్డుపైకి వస్తాయి. ఇదీ ఆయన సొంత కార్యక్రమం కాదు కదా. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి సమస్యలను వినేందుకు వచ్చారు. అందులో తప్పేంముంది. అడ్డకుంలు సృష్టించడంతో పాటు గొంతు కూడా నొక్కేస్తున్నారు. కేసుల పేరుతో భయపెట్టడం న్యాయం కాదు. – ఉమాచంద్ర, రైతు నాయకులు -
ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే
ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి ని అధిగమించి మా కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్తో పంచుకోవాలని పర్యటనకు వెళ్లాం. కనీసం ద్విచక్ర వాహనం కూడా వదల్లేదు. ఎ క్కడికక్కడ కట్టడి చేసి విఘాతం కలిగించారు. ఆయనకు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక కూటమి ప్రభు త్వం ఈ రకంగా హింసించింది. రైతులను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. వాళ్లు ఏం చేసి నా జనబలాన్ని ఆపలేకపోయారు. ఇలా చేస్తే ప్రజా లే భవిష్యత్లో తీర్పునిస్తారు. ఏ అధికారమైనా జనబలం ముందు తలవంచాల్సిందే..అనడానికి ఇదీ ఒక నిదర్శనం. – వెంకటేష్, రైతు, జీడీనెల్లూరు -
జగన్ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు
● పోలీసుల అణచివేతతోనే భారీగా జనం ● రక్షకభటులే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలా? ● ఖాకీల తీరును తప్పుబడుతున్న రైతన్నలు పలమనేరు/కాణిపాకం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ బుధవారం బంగారుపాళెంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఎందుకు వారిపై ఇంత కఠినంగా వ్యవహరించారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాళెంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు ఎందుకిలా అడ్డుకున్నారనే మాట రైతుల్లో అయోమయాన్ని కల్గిస్తోంది. ఏ మార్గంలోనూ జనం వెళ్లకుండా ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. ఎటుచూసినా కర్ఫూ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం నడిచి వెళుతున్న వారితోనూ దురుసుగా మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పట్టనీయకుండా చేశారు. జగన్ పర్యనటలో భాగంగా కొన్ని చోట్ల గుమిగూడిన రైతులపై లాఠీతో విరుచుకుపడ్డారు. బంగారుపాళెం మార్కెట్లోని మామిడి రైతులను బయటకు పంపేశారు. వ్యాపారులు లేకుండా చేశారు. అసలు జనాన్ని చూస్తేనే పోలీసులు కోపంతో ఊగిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన అణచివేత చర్యల కారణంగానే రైతులు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందనే మాట జనంలో వినిపిస్తోంది. పోలీసులు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఉండకపోతే కార్యక్రమం ప్రశాంతంగానే జరిగిపోయేదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరి రైతుల మాటల్లోనే.. -
కర్షకులపై కర్కశమా?
కూటమి ప్రభుత్వం రైతులను కట్టడి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసింది. పోలీసులతో నిలువరించింది. తెల్లచొక్కా, రైతు కండువ కనిపిస్తే చాలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ సమస్యను మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని వెళితే తప్పా..? సమస్యలు చెప్పుకుందామని నడుచుకుని వచ్చాం. అడ్డదారులో చేరాం. రాళ్లురప్పలను లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చెంత మామిడి కష్టాలను కన్నీళ్లతో వెలిబుచ్చాం. కర్షకులపై ఇంత కర్కశం పనికిరాదు. – వెంకటరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శత్రువులా చూశారు జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయనొస్తే..వీళ్లకెందుకు నొప్పి. కూటమి ప్రభుత్వం ప్రజాధరణతోనే గెలిచింది కదా. అలాంటప్పుడు జగన్మోహన్రెడ్డి వచ్చి వెళితే మీకేంటి?.. దానికి ఇంత రాద్ధాంతం చేయలా..?. ఇంతటి దౌర్జన్యం చేసినా రైతులు గుండెనిండా అభిమానంతో జగన్మోహన్రెడ్డిని కలవాలని వచ్చారు. ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులను శత్రువులను చూసినట్లు చూశారు. – పద్మనాభరెడ్డి, రైతు నాయకులు ● -
మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దు
చిల్లకూరు : మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దని గూడూరు మండలం మేకనూరు గ్రామస్తులు శుక్రవారం సర్వే చేపట్టేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మేకనూరు గ్రామానికి సమీపంలో సర్వే నంబర్ 1లో సుమారు 240 ఎకరాల మేత పొరంబోకు భూములు ఉన్నాయి. వీటిని పరిశ్రమల కోసం కేటాయించేందుకు అధికారులు ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ చైతన్యతో పాటుగా సిబ్బంది భూముల వద్దకు చేరుకోవడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని అధికారులు తెలిపారు. దీనిపై గ్రామస్తులు కూడా సోమవారం కలెక్టర్ను కలిసి వినతులు అందజేస్తామని గ్రామస్తులు తెలిపారు. -
‘రూసా’ పనులు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ : రుసా ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా) పథకం కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి ఎస్వీయూలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం వర్సిటీ వీసీ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు వర్సిటీలో రూసా పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం రూసా కోర్డినేటర్ ప్రొఫెసర్ రమశ్రీ వర్సిటీలో జరిగే పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, రుసా సీఈఓ, ఆర్థిక, అభివృద్ధి విభాగాల కీలక అధికారులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యంపై ఏఈ సరెండర్
బుచ్చినాయుడు కండ్రిగ : మండలంలోని ట్రాన్స్కో ఏఈ చలపతి విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ఏడీఈ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈ చలపతి 33 కేవీ బీఎన్కండ్రిగ ఫీడర్లో మరమ్మతుల్లో నిర్లక్ష్యం వహించి, రైతుల వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా ఇవ్వలేదని తెలిపారు. వినియోగదారుల సమస్యలపై స్పందించకపోవడం, విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం చోటు చేసుకున్నా పట్టించుకోకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. ఎస్ఈ సురేంద్రనాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మండల ఏఈగా విధుల నుంచి తప్పించి ఎస్ఈ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం, బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఎన్ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం తిరుపతి సిటీ : హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారువైద్య అధ్యాపకులకు ముగిసిన శిక్షణ తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంశంపై వైద్య అధ్యాపకులకు మూడు రోజులగా నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో వైద్య విద్య సంచాలకులు, ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ.. మూడు రోజులుగా వైద్య నిపుణులతో వైద్య విద్య బోధనా పద్ధతులు, వైద్య విద్యార్థులకు ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన ప్రధాన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాధ, వేలూరు సీఎంసీ వైద్య కళాశాల అబ్జర్వర్స్ డాక్టర్ మినురేఖ, డాక్టర్ భోఢన రాజన్, అకడమిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్ఎన్ మూర్తి, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి, వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు -
ఆదరణ చూసి ఓర్వలేక
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీల విషయంలో మాట దాట వేసింది. రైతులకు చేసేందేమీ లేదు. వేరుశనగ పంట పూర్తిగా నేటమట్టమైంది. మామిడి రైతులు మద్దతు ధర లేక రోడ్డుపై అల్లాడుతున్నాము. అయితే ఈ రోదనను వినేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనను అడ్డుకోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం ఆయన ఆదరణ చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఈ రకంగా రైతులను, జనాన్ని రాకుండా తొక్కిపడేస్తోంది. వాళ్లు ఎంత తొక్కితే అంతా పైకి లేస్తాం. – రవీంద్రనాథ్, రైతు నాయకులు -
మేమూ రైతులమే
మా కష్టాలు మాకు తెలుసు. మా కష్టాలు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తప్ప తీరదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులను ఆదుకోవాలి. మా కష్టసుఖాలను వినాలి. అలా ఎవరు వచ్చినా కష్టాలను చెప్పుకోవడానికి రైతులు ముందు పడతాం. వస్తే అందుకు ఈ రకంగా చేస్తారా..? దారుణమండి. ఇలా చేయడం కరెక్టు కాదు. పోలీసులు మారాలి. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. మనుషులని చూడండి. రైతు కష్టాలను అన్ని శాఖల అధికారులకంటే.. పోలీసులే దగ్గరుండి చూశారు. మీలో కూడా రైతు కుటుంబాలు ఉన్నాయి..కదా. టోకన్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా.. మళ్లెందుకు ఇలా చేశారు. – పెద్దిరెడ్డి, రైతు, వేపంజేరి -
విద్యార్థుల ఆస్తకిని ప్రోత్సహించాలి
వెంకటగిరి రూరల్: విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జిల్లా అఽధికారులు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలన్నారు. ఐసర్లో కేవలం 3 శాతం మంది మాత్రమే తెలుగువారు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్, ఏపీసీ గౌరిశంకర్, ఎంపీపీ తనుజారెడ్డి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధర్, ఎంఈఓ బాబయ్య, పాఠశాల ప్రిన్సిపల్ తులసిజ్యోతి, తహశీల్దార్ వెంకట నరసింహారావు, ఎంపీడీఓ గుణశేఖర్రెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ గిరిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థాల నిర్వహణ పరిశీలన
తిరుపతి తుడా : తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్లను కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం, కమిషనర్ మౌర్యతో కలిసి గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా తూకివాకం, రామాపురం చెత్త నిర్వహణ ప్లాంట్లతో పాటు తిరుపతి నుంచి తూకివాకం వరకు మురుగు నీటి సరఫరా అయ్యే భూగర్భ డ్రైనేజీ పైపులైన్ రేణిగుంట మార్గంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తూకివాకం వద్ద గల మురుగు నీటిశుద్ధి కేంద్రం, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. మురుగు నీరు శుద్ధి చేసి ఫ్యాక్టరీలు, పంటలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ వివరించారు. అనంతరం రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ను పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో అమృత్ పథకం సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్, రాష్ట్ర కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి , మున్సిపల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యలోపంపై డీపీఓ ఆగ్రహం
రేణిగుంట : పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై గురువారం సాక్షిలో ‘చెత్తగించకంటే చిక్కులే’ కథనం రావడంతో డీపీఓ సుశీలాదేవి స్పందించారు. గురువారం ఉదయం రేణిగుంట పంచాయతీలోని వీధులను పరిశీలించారు. వార్డులలోని ప్రజలను తడి, పొడి చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.రావడం లేదని స్థానికులు తెలపడంతో పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పారిశుద్ధ్య లోపం రేణిగుంటలో కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభురావు, ఈవో మాధవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సర్పంచ్ నగేషంతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇద్దరికీ కలిపి 250 కుటుంబాలను కేటాయించాలని,ఆ ఇళ్లలో చెత్త సేకరణ వీధుల శుభ్రం వంటి బాధ్యతలు వారికి అప్పగించాలని ఆదేశించారు. మరోసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఎక్కడైనా పారిశుద్ధ్య లోపం ఉంటే సంబంధిత పారిశుద్ధ్య కార్మికులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలాలలో చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్ తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్ర చందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను గురువారం తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ జి.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్ బుధవారం రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు , సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారని వారిని చుట్టు ముట్టే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించగా నలుగురిని పట్టుకున్నారు. వీరిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. పట్టుబడిన వారిని 22 దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్స్ నిర్వహణపై ఆరా తిరుపతి అర్బన్ : ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆరా తీశారు. ఇటీవల నాణ్యతలేని ఆహారం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని ఓ హాస్టల్ విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పలువురు అధికారులు కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ హాస్టల్పై తీసుకుంటున్న చర్యలను సీఎస్కు వివరించారు. -
సంతకబీర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన
వెంకటగిరి(సైదాపురం) : చేనేత కళల్లో నైపుణ్యం జోడించి మగ్గంపై ఆసక్తికరమైన డిజైన్లను నేసిన వెంకటగిరి వాసి లక్కా శ్రీనివాసులు సంతకబీర్ అవార్డు కై వసం చేసుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగు గంగ అతిథి గృహంలో చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులను కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాలువకప్పి అభినందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోనే వెంకటగిరికి చెందిన శ్రీనివాసులు ఎంపిక కావడం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందని తెలిపారు. వస్త్రంపై రెండు వైపులా ఒకే డిజైనింగ్ ఉండేలా తయారు చేసి అవార్డు సాధించడం గొప్పవిషయమన్నారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట రైల్వేస్టేషన్ మధ్య శెట్టిపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా, వడ్డేపల్లికి చెందిన సాకలి వీరేష్( 27) ఆటోనగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. యువకుడు కోరమీనుగుంటలో నివాసం ఉంటున్న లోకేష్ బాబు జేసీబీకి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సొంతూరికి వెళ్తున్నానని స్నేహితులకు చెప్పి బుధవారం రాత్రి రూమ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే రూమ్ నుంచి వచ్చిన వీరేష్ రైలు కింద పడి మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయవాదులు, సంఘ సేవకులు పాల్గొన్నారు. 20న ఐఐటీ 7వ స్నాతకోత్సవం ఏర్పేడు:ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ లో ఈనెల 20వ తేదీన 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన 417 మంది విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందించనున్నారు. ముఖ్య అతిథిగా కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్, జేఎస్డబ్ల్యూ ఎండీ సజ్జన్ జింధాల్ హాజరై విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిషేధిత వస్తువులపై 191 కేసులు తిరుపతి క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన నిషేధిత వస్తువుల స్పెషల్ డ్రైవ్లో గురువారం రాత్రి వరకు 191 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొ న్నారు. స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాలలో నిషేధిత వస్తువులైన గుట్కాలు, సిగరెట్లు విక్రయించిన వారిపై 200 రూపాయల చొప్పున జరి మానాలు విధిస్తున్నామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇకపై నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా పూతలపట్టు నుంచి జయశంకర్, నగరి నుంచి ఆనంద్, కుప్పం నుంచి సుగుణప్ప, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి జస్టిన్ అజయ్ రాజ్, బీ.శ్రీనివాసులు, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, చిత్తూరు నుంచి లక్ష్మణస్వామి, నగరి నుంచి ఎస్.సుబ్రమణ్యం, పూతలపట్టు నుంచి దేవరాజులు, చంద్రగిరి నుంచి ఎం.వాసు, పుంగనూరు నుంచి మునిరత్నం, కార్యదర్శులుగా జీడీనెల్లూరు నుంచి మణివణ్ణన్, చిత్తూరు నుంచి రాజేంద్రన్, పలమనేరు నుంచి ఆంజనేయులు, నగరి నుంచి అరుణచలం, పుంగనూరు నుంచి రవికుమార్, కుప్పం నుంచి వెంకటప్ప, సత్యవేడు నుంచి శేఖర్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి టీ.శివకుమార్, టీ.వంశీ, జీడీనెల్లూరు నుంచి మణి, చిత్తూరు నంంచి సురేష్, పలమనేరు నుంచి నాగరాజు, పుంగనూరు నుంచి జయరామ్, సీతాపతి, కుప్పం నుంచి చిన్నతంబి, సత్యవేడు నుంచి రమణయ్య, చంద్రగిరి నుంచి మహదేవ్, సత్యవేడు నుంచి గోవిందం, దేశప్ప, ఈశ్వరయ్య, శ్రీకాళహస్తి నుంచి మహదేవ్, పీ.ఆనందరావు, పూతలపట్టు నుంచి టీ.పరదేశి, చంద్రగిరి నుంచి ఏకాంబరం, సురేష్బాబు, రంగయ్య, రామకృష్ణయ్య, దేవేంద్ర, నాగరాజు, సత్యవేడు నుంచి ప్రతాప్ ఉన్నారు. చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. మహిళ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలుగా చిత్తూరుకు చెందిన హరీషారెడ్డి, జీడీనెల్లూరు నుంచి జ్ఞానమ్మ, పూతలపట్టు నుంచి భారతిమధుకుమార్, తిరుపతి నుంచి నైనూరు మధుబాల, చంద్రగిరి నుంచి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా పుంగనూరు నుంచి జయసుధ, తిరుపతి నుంచి మునీశ్వరి, కుప్పం నుంచి కాంతమ్మ, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి ప్రతిభ భారతి, శ్రీలత, జీడీనెల్లూరు నుంచి అనితరెడ్డి, చిత్తూరు నుంచి భాగ్యలక్ష్మి, తిరుపతి నుంచి షర్మిల, రెడ్డిరాణి, ఈసీ మెంబర్లుగా పలమనేరు నుంచి గౌరమ్మ, జమీలా, చిత్తూరు నుంచి కవిత, సత్యవేడు నుంచి కవిత, వెంకటమ్మ, శ్రీకాళహస్తి నుంచి వేలూరు జయశ్రీ,, నగరి నుంచి మంజులరెడ్డి, సత్యవేడు నుంచి దీప, చంద్రగిరి నుంచి గౌతమి, దీపశ్రీ, తిరుపతి నుంచి కవితమ్మ, పుంగనూరు నుంచి ఉష, జీడీనెల్లూరు నుంచి నీలమ్మ, కుప్పం నుంచి అశ్వినీ, పూతలపట్టు నుంచి లీలజ, దీప్తిరెడ్డి, లతను నియమించారు. అంగన్వాడీ అంగన్వాడీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా చంద్రగిరి నుంచి హసీన, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి చిత్తూరు పుష్పలతయాదవ్, జీడీనెల్లూరు నుంచి రమాదేవి, మీనాకుమారి, శ్రీకాళహస్తి నుంచి దేవిక, కార్యదర్శులుగా తిరుపతి నుంచి మునిలక్ష్మి, పద్మ, జీడీనెల్లూరు నుంచి అరుణ, శ్రీకాళహస్తి నుంచి వనజ, రమా, పూతలపట్టు నుంచి భారతి, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి మస్తానమ్మ, రాణెమ్మ, చిత్తూరు నుంచి శాంతి, భారతి, షకీరా, చంద్రగిరి నుంచి బాలసర్వసతి, లక్ష్మి, ఇంద్ర, జీడీనెల్లూరు నుంచి సుమతి, కుప్పం నుంచి నాగమ్మ, మాధవి, వరలక్ష్మి, సత్యవేడు నుంచి స్వప్న నియమితులయ్యారు. బీసీసెల్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నగరి నుంచి పరంధామయాదవ్, తిరుపతి నుంచి బీ.అరుణ్యాదవ్, పుంగనూరు నుంచి వెంకటరమణ, కుప్పం నుంచి రాజా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి నవీన్యాదవ్, నగరి నుంచి భాస్కర్యాదవ్, పుంగనూరు నుంచి ఎన్.నరసింహులు, జీడీనెల్లూరు నుంచి వేణుబోయడు, తిరుపతి నుంచి దామోదారం, పూతలపట్టు నుంచి యోగమూర్తి, కుప్పం నుంచి రమేష్, చంద్రగిరి నుంచి రాజేష్, తిరుపతి నుంచి టీ.మహేష్, కార్యదర్శులుగా చిత్తూరు నుంచి చంద్ర, నగరి నుంచి కార్తీకేయన్, పలమనేరు నుంచి ప్రకాష్, పుంగనూరు నుంచి వెంకట్రెడ్డి, వెంకటేష్, జయచంద్ర, జీడీనెల్లూరు నుంచి విజ్వేల్రెడ్డి, మునిరాజా, వై.మురళీయాదవ్ ఉన్నారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జీడీనెల్లూరుకు చెందిన యేసురత్నం, తిరుపతి నుంచి రాజేశ్వరి, చంద్రగిరి నుంచి ఉమాపతి, కార్యదర్శులగా జీడీనెల్లూరు నుంచి ఆశ్వీరాదం, నగరి నుంచి రవి, తిరుపతి నుంచి ఎన్.మురళీ, సత్యవేడు నుంచి మాణిక్యం, జేమ్స్, పుంగనూరు నుంచి శ్రీరాములు, చిత్తూరు నుంచి దీనదయాలన్, కుప్పం నుంచి శ్రీరాములు, చంద్రగిరి నుంచి ఎస్.జి.జాన్ను నియమించారు. కల్చరల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడుగా తిరుపతి నుంచి కే.కేశవులు, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎ.రాఘవనాయుడు, జీడీనెల్లూరు నుంచి దామోదర్, చిత్తూరు నుంచి బిందు, నగరి నుంచి మురళీరెడ్డి, చంద్రగిరి నుంచి గురుశంకర్, కార్యదర్శులుగా తిరుపతి నుంచి కృపావతి, జీడీనెల్లూరు నుంచి మోహన్, చిత్తూరు నుంచి సల్మా, పలమనేరు నుంచి శ్రీనివాసులు, నగరి నుంచి నారాయణరెడ్డి, కుప్పం నుంచి జయప్రకాష్, ఈసీ మెంబర్లుగా నగరి నుంచి షణ్ముగం, సుబ్రమణ్యం, జీడీనెల్లూరు నుంచి శేషాద్రి, పలమనేరు నుంచి మునిరాజు, చంద్రగిరి నుంచి ఓ.బాలరామ్రెడ్డి, వీరనారాయణరెడ్డి, ఈశ్వరయ్య, కుప్పం నుంచి రామ్మూర్తిజోని, వెంకటేష్, సత్యవేడు నుంచి సూరిబాబురెడ్డి, పళనిలు ఉన్నారు. బూత్కమిటీ ఉపాధ్యక్షులుగా రాంగణేష్(చిత్తూరు)ఎన్.యోగంజనేయరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా శివాజీ (జీడీనెల్లూరు), యువన్(చిత్తూరు), ఎస్.హరిప్రసాద్రెడ్డి(తిరుపతి). రామకృష్ణంరాజు(నగరి), ప్రకాష్(శ్రీకాళహస్తి), కార్యదర్శులుగా మణి(పలమనేరు), లోకేష్రెడ్డి(జీడీనెల్లూరు), మురళీకృష్ణనాయుడు (నగరి), కే.ధనంజయులు(తిరుపతి), రామకృష్ణ(కుప్పం) గుణశేఖర్రెడ్డి(చంద్రగిరి), మధుమోహన్రెడ్డి (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా రెడ్డప్ప, సాయికుమార్, నీల, సుబ్రమణ్యం, రామచంద్రారెడ్డి, రవి, ప్రకాష్, అజయ్కుమార్, షేక్గఫూర్, దయాకర్, భూపతిలు ఉన్నారు. ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం ప్రధాన కార్యదర్శులుగా డీ.నారాయణరెడ్డి (తిరుపతి), దొరస్వామి (జీడీనెల్లూరు), కార్యదర్శులుగా కనికిరెడ్డి (తిరుపతి), సింగరం (నగరి), అపంరాజు (జీడీనెల్లూరు), బాలరామిరెడ్డి (తిరుపతి), ఈసీ మెంబర్గడా నీలకంఠం (తిరుపతి)లు ఉన్నారు. గ్రీవెన్స్ విభాగం కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా గంగప్ప(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా గిరిధర్రెడ్డి (జీడీనెల్లూరు), దశరాథరెడ్డి(నగరి), విజయ్భాస్కర్రెడ్డి(పుంగనూరు), ఎం.నాగేశ్వరరావు(తిరుపతి),కార్యదర్శులుగా దేవరాజులు(పలమనేరు), జగదీష్రెడ్డి(జీడీనెల్లూరు), కుమార్రెడ్డి, గురువయ్య (నగరి), కుమార్నాయుడు(పుంగనూరు), పీ.దుర్గా, మనోహర్రెడ్డి(తిరుపతి), మణి(కుప్పం)ఈసీ 19 మందిని ఎంపిక చేశారు. ఇంటలెక్చువల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోహన్(జీడీనెల్లూరు), చెంగాల్రాజు(తిరుపతి), వెంకట్రెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా అరవింద్(చిత్తూరు), పెరిస్వామిరెడ్డి(జీడీనెల్లూరు), వీరభద్ర(పలమనేరు), రామకృష్ణ(పుంగనూరు), ఫరీడ్సాహెబ్(తిరుపతి), మనోహర్రెడ్డి(కుప్పం), వజ్రవేలు(సత్యవేడు), ఈసీ మెంబర్లుగా 12 మందిని ఎంపిక చేశారు. ఐటీవిభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీన్కుమార్రెడ్డి(చిత్తూరు), లతీష్రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా లక్ష్మిదీపక్వేమూరి, నిశాంత్ కసిరెడ్డి(తిరుపతి), శంకర్రెడ్డి(పుంగనూరు), శివకుమార్రెడ్డి(శ్రీకాళహస్తి), ప్రకాష్రెడ్డి(నగరి), కార్యదర్శులుగా రెడ్డిసాయి(చిత్తూరు), వెంకనసాయిచంద్(తిరుపతి), లోకేష్రెడ్డి వేపంజేరి(జీడీనెల్లూరు), పవన్కుమార్(శ్రీకాళహస్తి), ఇంద్రేష్(పలమనేరు), హేమంత్(చంద్రగిరి), పెనుమూరు అమర్నాథ్రెడ్డి(పుంగనూరు), ఈసీ మెంబర్లుగా 23 మందిని ఎంపిక చేశారు. లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా రవీంద్రనాధ్రెడ్డి(తిరుపతి), పీ.సుధాకర్రెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా మహదేవ్(తిరుపతి), హరిబాబు(జీడీనెల్లూరు), ఉదయభాను(నగరి), కార్యదర్శులుగా బాలాజీ(తిరుపతి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్రెడ్డి(పలమనేరు), సతీష్, సుజాత(సత్యవేడు), తులసీరామ్ (శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా ఏడుగురిని నియమించారు. మున్సిపల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ.రాధరెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా కే.ఆంజనేయులు(తిరుపతి), వెంకటేష్(నగరి), కార్యదర్శులుగా పీ.సునీత(తిరుపతి), గిరిబాబు(చిత్తూరు), లోకేష్(పలమనేరు), బుబాలన్(నగరి), ఈసీ మెంబర్లుగా నలుగురిని నియమించారు. ఆర్టీఐ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ప్రభాకర్రెడ్డి(తిరుపతి), కృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), ట.గంగధర్(నగరి), బీ.సుధాకర్, శ్రీరాములు(చంద్రగిరి), కార్యదర్శులుగా మురళి(తిరుపతి), లోకనాథరెడ్డి, హరిప్రసాద్రెడ్డి(జీడీనెల్లూరు), దినేష్(చిత్తూరు), వెంకటరత్నం(పలమనేరు), రాగేష్(నగరి), మురళీకృష్ణ(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 17 మందిని నియమించారు. మైనారిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన మస్తాన్సయ్యద్, నగరి నుంచి జలభాయ్, తిరుపతి నుంచి చాన్బాషా, శ్రీకాళహస్తి నుంచి జి.షేక్జుమ్లాషా, ప్రధాన కార్యదర్శులుగా చిత్తూరు నుంచి మహమ్మద్ యాయాజ్ హుస్సేన్, జీడీనెల్లూరు నుంచి తౌకిరీఖాన్, చిత్తూరు నుంచి జైనులాబిద్దిన్, తిరుపతి నుంచి గఫూర్, కార్యదర్శులుగా పుంగనూరు నుంచి మునీర్ఖాన్, చిత్తూరు నుంచి సుల్తానాబేగం, పలమనేరు నుంచి షమీర్, జీడీనెల్లూరు నుంచి గాఫోర్, కుప్పం నుంచి ఖలీల్, అబ్దుల్లతీష్, చంద్రగిరి నుంచి ఇర్షాద్, తిరుపతి నుంచి సలీంబాషా, ఈసీ మెంబర్లుగా పుంగనూరు నుంచి షేర్ఖాన్, మస్తాన్వాలి, డీకేం జియా, షేక్ఇమ్రాన్, అస్లాంబాషా, ఖలీల్, చిత్తూరు నుంచి ఆరీఫ్, పలమనేరు నుంచి థబ్రేజ్, జీడీనెల్లూరు నుంచి అమీన్, సత్యవేడు నుంచి ఎసక్, ఇస్మాయిల్, శ్రీకాళహస్తి నుంచి షేక్బాబు, సయ్యద్కరీముల్లా, షేక్ అజీబాషా, తిరుపతి నుంచి మహబూబ్బాషా, కుప్పం నుంచి గౌస్బేగ్, చంద్రగిరి నుంచి ఖాజాపీర్, రషీద్, వై.రఫిక్బాషా, నాగూర్బాషాలు ఉన్నారు. ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా చంద్రగి నుంచి రత్నమ్మ, ప్రధాన కార్యదర్శులుగా తిరుపతి నుంచి వై.వెంకటరమణ, జీడీనెల్లూరు నుంచి మార్కొండేయులు, కార్యదర్శులుగా తిరుపతి నుంచి ఎం.నవీన్కుమార్, జీడీనెల్లూరు నుంచి చిరంజీవి, పలమనేరు నుంచి చంద్రయ్య, కుప్పం నుంచి చంద్రశేఖర్నాయక్, ఈసీ మెంబర్లుగా తిరుపతి నుంచి జయమ్మ, చిత్తూరు నుంచి రాము, పలమనేరు నుంచి గోవిందు, పుంగనూరు నుంచి బసవరాజు,లోకనాథ్, చంద్రగిరి నుంచి వెంకటరమణనాయక్, చెంచయ్య, సత్యవేడు నుంచి కలివెలయ్య, యెల్లయ్య, వెంకటేశులు, శ్రీకాళహస్తి నుంచి భారతి, మనోహర్, చంద్రను నియమించారు. డాక్టర్ల విభాగం ఉపాధ్యక్షులుగా డాక్టర్ జనార్దన్రాజు(తిరుపతి), డాక్టర్ శివకుమార్రెడ్డి(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చందన(తిరుపతి), డాక్టర్ పృథ్వీరాజు(జీడీనెల్లూరు), డాక్టర్ రాజేష్ (చంద్రగిరి), డాక్టర్ ప్రదీప్కుమార్(తిరుపతి), డాక్టర్ ఢిల్లీప్రసాద్(చిత్తూరు), చంద్రశేఖర్రెడ్డి(పలమనేరు), డాక్టర్ రాజేష్రెడ్డి(శ్రీకాళహస్తి), డాక్టర్ రాజేష్(సత్యవేడు), డాక్టర్ సురేష్రెడ్డి(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా డాక్టర్ లియఖత్, డాక్టర్ జనార్దన్రాజు, డాక్టర్ ధనంజయ్రెడ్డి ఉన్నారు. పంచాయతీరాజ్ జిల్లా ఉపాధ్యక్షులుగా కమలాకర్రెడ్డి(పుంగనూరు), రమేష్బాబు(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ప్రసాద్బాబు(చిత్తూరు), ధనంజయ్వర్మ(జీడీనెల్లూరు), సుధాకర్రెడ్డి(నగరి), దామోదార్(పుంగనూరు), దుర్వాసులురెడ్డి(పూతలపట్టు), శ్రీరాములుగౌడ్, రంగప్పగౌడ్(కుప్పం), యతీశ్వర్రెడ్డి, మహేంద్రరెడ్డి(చంద్రగిరి), కార్యదర్శులుగా పరంధామరెడ్డి(చంద్రగిరి), సురేంద్రబాబు(చిత్తూరు), మల్లీశ్వరరెడ్డి(పలమనేరు), గోవిందయ్య(జీడీనెల్లూరు), సి.ప్రసాద్రాజు(నగరి), నిరంజన్కుమార్రెడ్డి, రవిచంద్రరెడ్డి(పుంగనూరు), శంకర్రెడ్డి (చంద్రగిరి), 17 మందిని ఈసీ మెంబర్లను నియమించారు. ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా ఎ.సూరి(పుంగనూరు), ఎస్.నాగేంద్ర(తిరుపతి), సుధాకర్, యోగానందరెడ్డి(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా యశోదమ్మ(జీడీనెల్లూరు), నరసింహమూర్తి(పుంగనూరు), రామచంద్రరెడడ్డి(నగరి), మధుసూదన్నాయుడు(తిరుపతి), కార్యదర్శులుగా శరన్కుమార్(చిత్తూరు), మాకయ్య(పలమనేరు), భువనేశ్వరి(జీడీనెల్లూరు), బాబురెడ్డి(నగరి), కృష్ణవంశీ(తిరుపతి), ఈసీ మెంబర్లు 17 మందిని నియమించారు. -
గ్రీన్ఛానల్ ద్వారా గుండె మార్పిడి
● గుంటూరు నుంచి తిరుపతికి తరలించిన వైద్యులుతిరుపతి తుడా : గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న గోదావరి జిల్లాకు చెందిన నారాయణరావు( 34)కు గుంటూరుకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి గుండెను విజయవంతంగా అమర్చిన ఘటన తిరుపతిలోని టీటీడీ పరిధిలో నడుస్తున్న శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన జ్యోత్రిభాను(55) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్కు గురైనట్లు రమేశ్ హాస్పటల్ వైద్యులు నిర్ధారించారు. ఆ విషయాన్ని వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యులకు వివరించడంతో అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి నిర్వాహకులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో జ్యోత్రిభాను అవయవాలను తరలించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే నారాయణరావు(34) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం జీవన్ధాన్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి చేరుకొని అక్కడి వైద్యులు, కుటుంబ సభ్యులతో సంప్రదించి జ్యోత్రిభాను నుంచి గుండె సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి గురువారం రేణిగుంట విమానాశ్రయానికి అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చి నారాయణరావుకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. -
పీజీ ఆన్లైన్ కోర్సులను రద్దు చేయాలి
తిరుపతి సిటీ : పీజీ విద్యలో ఆన్లైన్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం ఎస్వీయూ వీసీ అప్పారావును కలసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆష మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఫీజులు పెంచడం, ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉన్నత విద్యాధికారులు పీజీ విద్యార్థులను తాము చదివే చదువుతో సంబంధం లేని నాలుగు రకాల ఆన్లైన్ కోర్సులు స్వయం యాప్లో ఎంపిక చేసుకుని, ఒక్కొక్క కోర్సుకు రూ.1000 చొప్పున నాలుగు సబ్జెక్టులకు రూ.4000 ఫీజు చెల్లించాలంటూ చెప్పడం దారుణమన్నారు. ఆన్లైన్ కోర్సులో మార్కులు తక్కువ వచ్చి సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే యథావిధిగా ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలని, అటెండెన్స్ తప్పనిసరి అని, ఈ కోర్సులు పూర్తి చేయకపోతే మొత్తంగా పీజీ కోర్సు ఫెయిల్ అయినట్టేనని విద్యార్థులను ఉన్నత విద్యామండలి వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3220 అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా, ల్యాబ్లు, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించకుండా ఆన్లైన్ కోర్సులలో ప్రతిపాదించడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐ నాయకులు నరసయ్య, గీత, పీడీఎస్ఓ నాయకులు స్రవంతి, దేవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. -
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలు, మూడు బైక్లను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది మంచి పద్ధతి కాదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలో దండుపాళ్యెం బ్యాచ్ దాడులంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. పత్రికలంటే ఎంతో గౌరవం ఉంది. ఒక వేళ రాజకీయంగా మీకు అనుకూలంగా ఉన్న నాయకుడిపై మంచి కథనాలు రాసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే రైతులకు వ్యతిరేకంగా దండుపాళ్యెం బ్యాచ్ అంటూ కథనం ఇవ్వడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. – సుబ్రమణ్యం, రైతు, జంగాలపల్లి, వెంకటగిరి రూరల్ మండలం మంచి చెడులతో సంబంధం లేదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మంచి చెడులతో సంబంధం లేదు. రైతులు, పేదోడు అనే భావన లేదు. ఒకటే మార్గం చంద్రబాబు ఏమీ చేసినా అదే కరెక్ట్గా భావిస్తున్నారు. ఆయనపై ఒక కథనం చెడుగా ఇప్పటి వరకు ఆ పత్రికల్లో రాలేదు. అంటే సీఎం చంద్రబాబు వందశాతం మంచే చేస్తున్నారా? ప్రతి పక్షనేతపై ఒక్క మంచి కథనం ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరికి దండుపాళ్యెం బ్యాచ్ అంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయమో తెలియడం లేదు. – గుర్రం నాగిరెడ్డి, రైతు, ఆర్సీ పురం దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఎంటీ ? రైతులను ఎల్లో మీడియా దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటో తెలియడం లేదు. ఎంతో దారుణంగా కథనాలు రాస్తున్నా రు. చంద్రబాబును బతికించడానికే ఆ పత్రికలు పనిచేస్తున్నాయి. మామిడి రైతులు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చిన వారిపై విషాన్ని చిమ్మడం ఎందుకో అర్ధం కావడం లేదు. పత్రిక విలువలు పూర్తిగా దిగజార్చి కథనాలు రాస్తున్నా యి. రైతులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. – తిరుమల రెడ్డి, రైతు, కారూరు, సూళ్లూరుపేట నియోజకవర్గం – 8లో -
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయ్యప్ప మాలధారణ
తిరుపతి కల్చరల్:శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అయ్యప్ప మాల ధారణ చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన పెద్దిరెడ్డి పుష్కరిణిలో స్నానం అనంతరం ఆలయంలో అర్చకుల చేత అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. అనంతరం ఆలయంలో శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ : స్థానిక అలిపిరి, జూపార్క్ రోడ్డులోని ఉదయమానిక్యం మహాత్మా జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేష్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 90007 83185 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. మహిళల అభివృద్ధికి ప్రోత్సాహకం తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో పీఎం ఉషా స్కీంలో భాగంగా గురువా రం జెండర్ ఇంక్లూజీవ్ ఎంపవర్మెంట్ ఇనిషియేటీవ్ అనే అంశంపై కళాశాలల ప్రిన్సిపల్స్కు వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, రుసా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మహిళా సాధికారత, జీవనోపాధి పెంపొందించడమే రుసా లక్ష్యమని, అందుకోసం మహిళలను ప్రోత్సహించేందుకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ.. పీఎం ఉష ద్వారా రూ.100 కోట్లు మహిళా యూనివర్సిటీకి రావడం చాలా సంతోషమని, ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పరిసర ప్రాంత మహిళల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి సాధికారిత వైపు ప్రోత్సహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో కేరళ ఏఎస్ఏపీ సీఎండీ డాక్టర్ ఉష, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ తులసి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజిని పలు కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. పీటీఎంలో ప్రొటోకాల్ రగడ చిట్టమూరు : ప్రభుత్వ పాఠశాల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మండలంలోని ఆరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. సమావేశంలో పనిచేసే ఉపాధ్యాయుడు ముందుగా స్కూల్ కమిటీ చైర్మన్ను స్టేజీ మీదకు పిలవకుండా టీడీపీ నేతలను పిలిచారని ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పాఠశాలకు రంగుల వేసేందుకు ఉపాధ్యాయులు గ్రామంలో కూటమి నాయకుల వద్ద చందాలు వసూలు చేసి రంగులు వేయించారు. దాతలను ముందుగా స్టేజ్ పైకి పిలిచారని, ప్రొటోకాల్ పాటించలేదని మరో వర్గానికి చెందిన కూటమి నేతలు ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉపాధ్యాయులు కూటమి నేతలకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మండల విద్యాశాఖ అధికారి బీవీ కృష్ణయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్డే నిర్వహించారు. -
ప్రతి పక్షనేత వచ్చాక కేంద్రానికి లేఖ ఏమిటో?
మామిడికి నెలరోజులుగా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వారిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తరువాత వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు కేంద్రానికి లేఖ రాయడం ఏమిటో తెలియడం లేదు. ఓ పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరించడం సరికాదు. వారి కష్టాలను ఆ పత్రికలు గుర్తించాల్సి ఉంది. వారికి అండగా ఉండాలే తప్ప, వారికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మంచిది కాదు. – అత్తిరాల సురేష్, రైతు, అంజూరు, కేవీబీపురం మండలం -
పాఠశాల విలీనంపై నిరసన
● పేరెంట్స్– టీచర్స్ సమావేశంలోనే తల్లిదండ్రుల ఆవేదన నాయుడుపేట టౌన్ : చంద్రబాబు నాయుడు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేస్తామని ఎంఈవో చెబితేనే తిరిగీ 1, 2 తరగతుల పిల్లలను పాఠశాలకు పంపుతున్నామని ఇప్పటి వరకు సమస్యను పట్టించుకోలేదని కాలనీ వాసులు పాఠశాల వద్ద గురువారం జరిగిన తల్లిదండ్రుల సమావేశం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు స్పందించకపోతే మళ్లీ 1, 2 తరగతుల విద్యార్థులను పాఠశాలకు పంపకుండా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇక్కడి పాఠశాలకు చెందిన 3,4,5 తరగతులకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులను తుమ్మూరు పాఠశాలలో విలీనం చేసినా అక్కడికి వెళ్లడం లేదు. పాఠశాలను చంద్రబాబు కాలనీలోనే యథావిధిగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల విలీనం రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు కాలనీలో 3,4,5 తరగతులకు చదివే విద్యార్థులు సుమారు 30 మందికి పైగా విలీనం అయిన పాఠశాలకు వెళ్లడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. చంద్రబాబు కాలనీ నుంచి ప్రమాదకరంగా ఉండే రైలు పట్టాలు, జాతీయ రహదారి దాటుకుని తుమ్మూరు పాఠశాలకు ఎట్టి పరిస్ధితిలో విద్యార్థులను పంపలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టి చంద్రబాబు కాలనీ పాఠశాల విలీనం రద్దు చేయాలి. – నిర్మల, స్కూల్ కమిటీ చైర్పర్సన్, చంద్రబాబు నాయుడు కాలనీ -
సర్కార్కు రైతులంటే చులకన
కూటమి సర్కార్కు రైతు లంటే చులకనగా ఉంది. దాంతోనే వారి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగా అన్న మహానుభావుడు. ఈ నేపథ్యంలోనే గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నా, వారిని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నేత కర్షకులను పరామర్శించడం ఎంతో నేరంగా భావిస్తున్నారు. దానికితోడు చంద్రబాబు కు అనుకూలంగా ఉన్న మీడియా రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరిస్తూ కథనాలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. పత్రికలు ప్రజల పక్షాన పనిచేయాల్సి ఉందే తప్ప.. కూటమి సర్కార్ వైపు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. – బాలయ్య, రైతు, వాకాడు మండలం ● -
మొక్కుబడిగా సమావేశాలు
● పీటీఎంపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు ● విలీనమైన పాఠశాలల్లో సమావేశాలు రద్దు తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం తలపెట్టిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఈ సమావేశానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. అనుకున్న షెడ్యూలు ప్రకారం సాయంత్రం వరకు నిర్వహించాల్సిన వీటికి తల్లిదండ్రులు అధిక శాతం హాజరుకాక పోవడంతో చాలా వాటిలో మధ్యాహ్నానికే సమావేశాలను ముగించేశారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూలు మేర ఈ సమావేశాలను నిర్వహించలేకపోయారు. ఈ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను లీప్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని చెప్పినా యాప్ సర్వర్ పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో గైర్హాజరవ్వడంతో ప్రోగ్రెస్ కార్డులు, మొక్కలను పంపిణీ చేసి మమ అనిపించేశారు. హాజరైన తల్లిదండ్రులతో ఆటలపోటీలు నిర్వహించి మధ్యాహ్నానికే సమావేశాలను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకులకండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మరో పాఠశాలలకు విలీనం చేయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో సమావేశాలను వాయిదా వేశారు. -
రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరణపై ఆగ్రహం
● విలువలు పాటించకుండా కర్షకులపై వ్యతిరేక కథనాలు ● కూటమి సర్కార్కు తొత్తుగా మారిన పచ్చమీడియా ● మండిపడుతున్న అన్నదాతలు రైతులను అవమానించడం దారుణం బంగారుపాళెం సమావేశానికి వెళ్లిన వారు రైతు లు కాదు.. దండుపాళెం బ్యాచ్ అంటూ ఓ పత్రిక లో వార్త చూశా. ఓ రైతు గా మనసులో చాలా బాధేసింది. పదిమందికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ చులకన అయినట్టుంది. అన్నీ తెలిసి, బాగా చదువుకున్న వారే ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదు. ఆ స్థానంలో మామిడి రైతే కాదు ఏ రైతున్నా ఒక్కటే కదా? ఎవరిపైనో కోపాన్ని రైతులపై చూపడం భావ్యం కాదు. – గోవిందురెడ్డి, రైతు, బేరుపల్లి -
జగన్ జనాదరణను అడ్డుకోలేరు
● పర్యటనలో అడుగడుగునా రెడ్బుక్ రాజ్యాంగం ● వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి తిరుపతి కల్చరల్ : పంటకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే చర్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోతున్న మామిడి రైతుల పరామర్శకు మాజీ సీఎం మార్కెట్ యార్డుకు రావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పర్యటనలో ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడమే కాక వారిని దూర ప్రాంతాలకు తరలించి నిర్భంధించడం దుర్మార్గ చర్య అన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ నిర్భంధాలకు పూనుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం నేతగా తనతో మరో 30 మందిని జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకొని నిర్భంధించడమే కాక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వ్యవహరించడం చూస్తే పోలీసులు కూటమి ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని, రౌడీషీట్ పెడతామని స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి ఒక అవివేకని విమర్శించారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కేంద్ర సహకారంతో మామిడి కిలో రూ.16 కల్పిస్తే ఆంధ్రాలోని మామిడి రైతులు నష్టపోతున్నా నోరు మెదపక, శ్రీవారి దర్శనాలే ప్రరమావధిగా వ్యవహరించే బీజేపీ నేత పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేష్రెడ్డి, కె,వెంకటాచలం పాల్గొన్నారు. -
అనుమతి లేదంటూ అరెస్టు
పెళ్లకూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మామిడి సాగు రైతుల పరామర్శకు జిల్లాకు వచ్చిన సందర్భంగా హాజరయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిందేపల్లి మధుసూదన్రెడ్డి పుల్లూరు నుంచి వెళుతుండగా మార్గమధ్యలో రెడ్డిగుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి రైతుల పరామర్శ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొనేందుకు అనుమతి లేదంటూ చిందేపల్లిని అరెస్టు చేసి ఆయన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిగరపల్లి బడిని కొనసాగించాలి పాకాల : మండలంలోని చిగరపల్లి ఎంపీపీ పాఠశాలను గతంలో మాదిరిగానే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పాఠశాలను 5వ తరగతి వరకు కొనసాగించాలని, పాఠశాలను విలీనం చేయడంతో సుమారు 4 కిలో మీటర్లు నడిచి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి వరకు, గతంలో నిర్వంహించిన మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు మమత, ఝాన్సీ, గౌరి, మీన, జ్యోతి, పుష్ప, సుబ్రమణ్యం, శిరీష, శ్రీనివాసులు, గోపి, కుమార్, మంజునా థ్, విశ్వనాథ్, హేమలత, ధనమ్మ, ధనలక్ష్మి, చిట్టి పాల్గొన్నారు. -
రక్తమోడినా తరగని అభిమానం
లాఠీ కాఠిన్యం..● అభిమాననేత కోసం వెళ్లిన అతడిపై లాఠీ చార్జ్ ● తలపగిలి రక్తం కారుతున్నా లెక్క చేయని వైనం ● పోలీసుల దుశ్చర్యపై అధినేత ఆగ్రహం సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్రెడ్డికి వైఎస్ఆర్ అన్నా.. ఆ కుటుంబమన్నా అతనికి ప్రాణం.. మహానేత రాజశేఖరరెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా.. పది మందికీ అన్నం పెడతాడు; రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకుంటాడు.. జననేత జగనన్న అంటే అతనికి మహాఇష్టం.. రాజన్న బిడ్డగానే కాదు.. తన అభిమాన నాయకునిగా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అతడు అభిమాననేత పర్యటనకు ఉత్సాహంగా వెళ్లాడు. అయితే అడుగడుగునా పోలీసుల అవరోధాలు, ఆంక్షలు అధిగమించి వెళ్లిన అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. లాఠీచార్జ్ చేసి తల పగగొట్టారు. వివరాలు..మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వాన్ని నిలదీయడానికి బంగారుపాళెంకు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని శశిధర్రెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం 5 గంటలకే తిరుపతి నుంచి బయలుదేరి పోలీసుల ఆంక్షలన్నీ అధిగమించి బంగారుపాళెం వెళ్లిన శశిధర్రెడ్డి అక్కడకు వచ్చిన వేలాది మంది జనంలో ఒక్కడిగా జగనన్న రాక కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో జగనన్న కాన్వాయ్ వస్తుండగా జనం తోపులాటలో తాను దగ్గరకు వెళ్లి కళ్లారా జగనన్నను చూడాలని తపించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. రాక్షసత్వంగా వ్యవహరించి తలపై లాఠీలతో బలంగా కొట్టారు. ఆ లాఠీ దెబ్బకు తలపగిలిన శశిధర్రెడ్డి ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అలాగే ముందుకొచ్చాడు.. ఇది చూసి జగనన్న చలించిపోయారు. కాన్వాయ్ దిగి అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాయపడ్డ శశిధర్రెడ్డిని దగ్గరకు తీసుకుని తలకు తగిలిన గాయం చూసి మరింత ఆవేదనతో పోలీసుల తీరుపై అక్కడే ఉన్న ఎస్పీ మణికంఠ చందోలుపై మండిపడ్డాడు. తన కోసం వచ్చిన కార్యకర్తల తలలు పగలగొట్టడమేమిటని ప్రశ్నించారు. అనంతరం శశిధర్రెడ్డిని ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. శశిధర్రెడ్డి కూడా తన అభిమాన నాయకున్ని చూశానన్న ఆనందంలో తలకు తగిలిన గాయా న్ని లెక్క చేయకపోవడం విశేషం! ఆ తరువాత కొంతసేపటికి అక్కడే ఉన్న అంబులెన్స్లో ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాడు. -
సహకార సంఘాల సేవలు వినియోగించుకోండి
తిరుపతి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్ విండో సొసైటీలు)సేవలను రైతులతోపాటు అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆ విభాగానికి చెందిన జిల్లా అధికారిణి నాగవర్ధిని పేర్కొన్నారు. ఇటీవల చిత్తూరు నుంచి బదిలీపై తిరుపతి జిల్లాకు విచ్చేసిన ఆమె బుధవారం కలెక్టరేట్లోని తమ చాంబర్ నుంచి మాట్లాడారు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా సొసైటీల ఆధ్వర్యంలో జిల్లాలో 8 పెట్రోల్ బంకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో తంగేళ్లపాళెం, కాయంపేట, సత్యవేడు, ఎర్రావారిపాళెం, వెంకటగిరి, చిట్టమూరు, చిల్లకూరు, నాయుడుపేట సింగల్ విండో సొసైటీల ఆర్థిక బలోపేతం కోసం రెండేళ్ల క్రితం పెట్రోల్ బంకులు మంజూరు చేశారని వాటిని వాడుకలోకి తీసుకురానున్నామని చెప్పారు. సొసైటీల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు నాణ్యమైన ఎరువులను రైతులకు తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట రుణాలతోపాటు తక్కువ వడ్డీలతో బంగారు రుణాలు ఇస్తున్నామని వివరించారు. ఆయా మండల పరిధిలోని రైతులు సింగిల్ విండో సొసైటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మల్టీపర్పస్ గోదాములను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందాలి
తిరుపతి అర్బన్ : దేశంలోనే కీలకమైన ప్రదేశాల్లో తిరుపతి ఒకటని, అయితే ఆ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్ కటికితల అభిప్రాయపడ్డారు. తిరుపతి పట్టణ సమగ్రాభివృద్ధిపై స్టేక్ హోల్డర్లతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇషా కాలియా, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ , తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి బుధవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి శర వేగంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లడంతోనే సరిపెట్టేస్తున్నారని పేర్కొన్నారు. అలా కాకుండా రెండు మూడు రోజులు ఈ ప్రాంతంలో యాత్రికులు ఉండేలా వసతులు కల్పిస్తే వారు ఉంటారని చెప్పారు. దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ ఏటా రూ.లక్ష కోట్లతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే తిరుమలలో పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు ఉండడం లేదని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీనివాస్ -
విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్కూల్ ఆఫ్ దర్శన్ డీన్ ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, సహాయక ఆచార్యులు డాక్టర్ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి తుడా:ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు తిరు పతి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద పలు పీహెచ్సీ, యూపీహెచ్సీ పరిధిలో 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా వైద్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 25 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 16లోపు తమ పరిధిలోని పీహెచ్సీ, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లకు దరఖాస్తులను అందజేయాలని కోరారు.ఆల్ ఇండియా వీసీ కాన్ఫరెన్స్లో ఎన్ఎస్యూ వీసీ తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో విస్తృతంగా చర్చించారు. అత్తపై హత్యాయత్నం కేసులో అల్లుడి అరెస్టు నాయుడుపేటటౌన్ : అత్తపై హత్యాయత్నం చేసిన కేసులో అల్లుడు రవీంద్రనాథ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఆదిలక్ష్మి తెలిపారు. పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో నివాసం ఉంటున్న అత్త మహేశ్వరి ఇంటి వద్దకు బాలయపల్లి మండలం హస్తకావేరి గ్రామానికి చెందిన అల్లుడైన రవీంద్రనాథ్ వచ్చి ఈనెల 2వ తేదీ రాత్రి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడు రవీంద్రనాథ్ వివాహేతర సంబంధం పెట్టుకుని ఉన్నాడని అత్త నిలదీయడంతో కోపంతో అత్తపై దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకుని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెండిళ్లల్లో చోరీ – 17 సవర్ల బంగారం అపహరణ శ్రీకాళహస్తి : రెండు పక్క పక్క ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని సాలిపేటలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని సాలిపేటలో మంగళవారం అర్ధరాత్రి ఎవరూ లేనిది గుర్తించి మునిరాజ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రెండు సవర్ల బంగారు, ఇంటి పత్రాలు, పిల్లలు చదువుకునే సర్టిఫికెట్లను దోచుకెళ్లారు. అదే విధంగా పక్కనే ఉన్న వీరస్వామి ఇంట్లో బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు, రూ.70 వేల నగదు, 150 గ్రాముల వెండి, విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి క్లూస్టీంతో పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు చోరీకి గురి కావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. -
నల్లపరెడ్డి ఇంటిపై దాడి హేయం
చిట్టమూరు : మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు చేసిన దాడి హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ షేక్ జిలానీబాషా పేర్కొన్నారు. చిట్టమూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలో ఎంతో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, పలువురికి ఆశ్రయమిచ్చిన జమీందారి కుటుంబమన్నారు. అలాంటి కుటుంబంపై రాజకీయ ముసుగులో గుండాల చేత ఇంటిపై దాడి చేయించడం తగదన్నారు. ఎన్నికల ముందు తర్వాత అధికార, ప్రతిపక్షంలో ఉన్న విమర్శలు, ఆరోపణలు సహజమన్నారు. అంతేకాని వ్యక్తిగతంగా తీసుకుని ఆస్తి, ప్రాణనష్టం కలిగే విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 13న ఐఐటీలో కామన్ ఇంకుబేషన్ సెంటర్ ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈ నెల 13న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా కామన్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. -
పోలీసుల ఓవర్యాక్షన్!
పలమనేరు: పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎక్కడాలేని ఆంక్షలు పెట్టి ఓవర్యాక్షన్ చేశారు. పలమనేరు వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పంపకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వాహనాన్ని ఆపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆపై అక్కడున్న వారిని పోలీసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటకు పంపారు. పోలీసుల జులుం పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బంగారుపాళెం ఫ్లైవర్ నుంచి కాలినడకన వెళ్తుండగా అక్కడున్న పోలీసులు జనంపై లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులపై ప్రజలు తిరగబడాల్సి వచ్చింది. ఎటూ చూసి నా జనాన్ని చూసిన పోలీసులు శత్రువులును చూసినట్టుగా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల కవ్వింపుల కారణంగానే ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. బైక్ల తాళాలు లాక్కునీ.. రోడ్డుపై బైకులో వస్తున్న వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. తాము స్థానికులమని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. వారి బైక్ కీలను లాక్కొన్నారు. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటక ముగిశాక సైతం మార్కెట్ నుంచి జనం బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లను వేసేశారు. దీంతో భయపడిన జనం గోడలు, గేట్లు దూకి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం.. డౌన్డౌన్ కాణిపాకం: బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్ గేటు ఎదుట బుధవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో రైతులు, జగనన్న అభిమానులు రెండో గేటు ఎదుట ఆగ్రమానికి గురయ్యారు. లోపాలికి పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పట్టించుకోని పోలీసులతో విసిగిపోయిన వారు సీఎం డౌన్..సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు మిన్నంటించారు. ఆపై ఒక్కసారిగా వారంతా మొదటి గేటులో నుంచి మార్కెట్ లోపలకి దూసుకొచ్చారు. కొందరు మార్కెట్ ప్రహారీ గోడను ఎక్కి లోపలికి తరలివచ్చారు. చిన్నారి పులకింత కాణిపాకం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, స్థానికులతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా వైఎస్ జగన్ను చూసేందుకు తరలివచ్చారు. అందులో భాగంగా ఓ (చిత్తూరుకు చెందిన హోమ శైలుషా 7వ తరగతి) చిన్నారి తన భామతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రోడ్డుపై వేచి ఉంది. వీరిని గమనించిన జగన్మోహన్రెడ్డి తన కాన్వాయ్ని ఆపి వారిని దగ్గరకు పిలిచారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారిద్దరూ ఆనందంలో మునిగితేలారు. -
బంగారుపాళెంలో జన సునామీ
● కూటమి కుయుక్తులు.. ఆంక్షల కంచె పటాపంచలు ● అభిమాన నేతను చూసి మురిసిపోయిన అక్కచెల్లెమ్మలు ● మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చిత్తూరు అర్బన్/ కాణిపాకం/ పలమనేరు/ బంగారుపాళెం: ఒకే ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి వందలాది మంది ఖాకీలు. కానీ వేలాది మంది అభిమానం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. చివరకు ఏ సంబంధం లేని సామాన్యులను సైతం అడ్డుకున్నారు. అడగుడగునా ఆంక్షల చట్రం విధించినా ఏ మాత్రం అవి పనిచేయ లేదు. మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం బంగారుపాళెంకు వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రెడ్జోన్గా బంగారుపాళెం వాహనాల్లో బంగారుపాళెంకు వెళుతున్న పలువురు నాయకులను మహాసముద్రం టోల్గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలందర్నీ అదుపులోకి తీసుకుని చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అసలు ఏ బస్సు కూడా బంగారుపాళెం లోపలకు వెళ్లకూడదని, జాతీయ రహదారి మీదుగా కూడా వెళ్లకూడదని హుకూం జారీ చేశారు. బంగారుపాళెం బస్సు టికెట్లే ఇవ్వలేదు. పలమనేరు టికెట్టు కొనుక్కున్న ప్రయాణికులు హైవేల వైపు దిగి కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహాసముద్రం టోల్ గేటు వద్ద బస్సుల్లోకి ఎక్కిన పోలీసులు ఎవరైనా బంగారుపాళెంకు వెళుతున్నారా..? అని అడుగుతూ.. వెళుతున్నామంటే ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేటు వద్ద దించేశారు. పలుచోట్ల లాఠీ చార్జ్ వైఎస్.జగన్ను చూడడానికి పలుచోట్ల ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడ్డారు. వీళ్లను తరమివేయడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. చాలా చోట్ల ప్రజలు పోలీసుల మాటల్ని లెక్కచేయకపోవడంతో లాఠీలతో చావ బాదారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం గాయపడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజల్ని నెట్టేయడంతో తోపులాటకు కింద పడిపోయారు. నాయకులపై జులుం వైఎస్సార్సీపీ నాయకులపై చాలా చోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు డా.సునీల్, వెంకటేగౌడ, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తమ కార్యకర్తలతో హెలిప్యాడ్ వద్దకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. తాను మాజీ ఎంపీ అని రెడ్డెప్ప చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, వెంకటగౌడ్, బియ్యపు మధుసూదన్రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, కృపాలక్ష్మి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారుపాళెంలో జగన్ జాతర మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన జన జాతరను తలపించింది. బంగారుపాళెం చుట్టూ పోలీసులు విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. పోలీసుల అడ్డగింతలు, నోటీసులతో జనం ఉలిక్కిపడ్డారని అధికార పక్షం, అధికారులు అనుకున్నారు. మార్కెట్ ప్రాంగంణం, రోడ్డు మార్గంలో జనం పలుచగా ఉన్నారని తెగ సంబరపడ్డారు. ఆ తర్వాత ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వీరి రాకతో మార్కెట్ ప్రాంతమంతా నిండిపోయింది. కర్ణాటక సరిహద్దు నుంచి ఆంక్షలు బంగారుపాళెంకు జనం వెళ్లకుండా పోలీసులు కర్ణాటక సరిహద్దుల్లోని గంగవరం మండలం, కుప్పం ప్రాంతంలో వీకోట, బైరెడ్డిపల్లి, జాతీయ రహదారిలో గాంధీనగర్ వద్ద భారీగా మోహరించారు. బంగారుపాళెంకు వెళ్లే గ్రామీణ రహదారులను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. -
‘శతాధిక’ సంబరం
చిట్టమూరు : మండల పరిధిలోని మొలకలపూడి గ్రామానికి చెందిన సంక్రాంతి రమణయ్య అనే వృద్ధుడు మంగళవారంతో వందేళ్లు పూర్తి చేసుకున్నాడు. రమణయ్యకు నేటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100లో అడుగు పెట్టడంతో కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. తాను నెహ్రూ కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నానన్నాడు. అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. కుక్ కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్: వన్ స్టాప్ సెంటర్కు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన మల్లీపర్పస్ స్టాఫ్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా పీడీ వసంత బాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 14వ తేది లోపు దరఖాస్తులు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఇవ్వాలని లేదా పోస్టులో పంపవచ్చన్నారు. నెలకు వేతనం రూ.13 వేలు ఉంటుందని చెప్పారు. 18–42 ఏళ్లలోపు మహిళలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీలు అయితే రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.200 డీడీ లేదా చెక్కు రూపంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి పేరిట చెల్లించాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ఐసీడీఎస్ వెబ్సైట్ చూడాలని సూచించారు. ఉపాధి సిబ్బందిపై కేసు – విధుల నుంచి తొలగింపు కలువాయి(సైదాపురం) : ఉపాధి ఉద్యోగులపై సస్పెన్షన్, కేసు నమోదు అయిన ఘటన కలువాయిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఈసీ శ్రీనివాసులు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ప్రసన్న, ప్రసాద్ అనే ఉద్యోగులు రూ. 56 లక్షల అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ చేశారు. నెల్లూరు డ్వామా అధికారులు ఈ నలుగురు ఉద్యోగులను పూర్తిగా విధుల నుంచి తొలగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయమై నెల్లూరు డ్వామా కార్యాలయం నుంచి కలువాయి మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. -
తిరిగి రాని లోకాలకు!
తిరువణ్ణామలై వెళ్లి వస్తూ.. ● ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం ● పాల ట్యాంకర్ను ఢీకొన్న కారు ● ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి ● మరో మహిళ పరిస్థితి విషమం చంద్రగిరి : తిరువణ్ణామలైలోని అరుణాచల శివయ్యను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. మరో మహిళ తీవ్ర గాయాలపాలైన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడ అర్బన్, చిట్టినగర్కు చెందిన కోటేశ్వరరావు, భార్య పద్మావతి, కుమారుడు జశ్వంత్ సాయి, చెల్లెలు హేమలతతో కలసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కారులో వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తొండవాడ సమీపంలో వెళ్తున్న క్రమంలో ముందు కారు నడుపుతున్న కోటేశ్వరరావు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జనుజ్జు అయింది. అనంతరం కారులో ప్రయాణిస్తున్న పద్మావతి (38) అక్కడికక్కడే మృతి చెందగా.. కోటేశ్వర రావు, కుమారుడు జశ్వంత్ సాయి (21), చెల్లెలు హేమలత తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమారుడు మృతి ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అప్పటికే కోటేశ్వరరావు కుమారుడు జశ్వంత్ సాయి మృతి చెందినట్లు తెలిపారు. హేమలత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా డ్రైవింగ్ చేస్తున్న తండ్రి కోటేశ్వర రావుకు ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి గోడు వినరే!
● గిట్టుబాటు కాని మామిడి ● మాయమైన ప్రభుత్వ మద్దతు ధర ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ● ఆదుకోవాలంటూ విన్నపాలు ● పట్టించుకోని కూటమి నేతలు ఒక్క పంటకూ దిక్కులేదు చక్కెర ఫ్యాక్టరీ మూయించిన ఘనత చంద్రబాబుదే. దీనికి ముందు పాల ఫ్యాక్టరీని మూయించారు. ఇదే మాదిరిగానే మామిడి రైతులను ముంచేయాలని చూస్తున్నట్లు ఉంది. ఈ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి. చెరుకు పండించి బెల్లం తయారీ చేస్తే ఆంక్షలు పెడుతున్నారు. వేరుశనగ పండిస్తే చేతికి అందే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట మామిడి ఒక్కటే. –రాము, చిత్తూరు మండలం ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు 2018లో ఇలానే అల్లాడిపోయాం. అప్పు డు కాయలు కొనే వారు లేక చెట్లల్లోనే వదిలేశాను. ఈ సారి కాయలు అడిగే వారు లేరు. బలవంతంగా ప్యాక్టరీలకు తోలుకుంటున్నాం. ప్యాక్టరీ రేటు తొతాపురి రూ.8 అని ప్రకటించాయి. ఎక్కడ ఆ రేటుకు కొనుగోలు చేస్తున్నారు..?. కానీ ప్యాక్టరీలను ఏం చేయలేక పోతోంది. సీఎం, మంత్రులు అలా వచ్చి...ఇలా వెళ్లిపోయారు. –సాము, చిత్తూరు మండలం -
చిల్లకూరులో రొట్టెల పండుగ
చిల్లకూరు : నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు అనుబంధంగా చిల్లకూరులో ఒక్క రోజు నిర్వహించే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. నెల్లూరుకు వెళ్లలేని భక్తులు చిల్లకూరులోని దోషాహీద్ దర్గా వద్దకు వచ్చి తమ మొక్కబడులును తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిల్లకూరులోని సయ్యద్ అహ్మద్షా, సయ్యద్ మహ్మద్షాలకు చెందిన దో షాహీద్ దర్గాలో రొట్టెలు వదలడం, తిరిగి పట్టుకోవడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గూడూరు డివిజన్లోని పలు గ్రామాలకు చెందిన ముస్లింలు, హిందువులు ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం విశేషం. దీంతో ఆరోగ్య ,కళ్యాణ రొట్టెను పట్టుకునేందుకు డిమాండ్ ఏర్పడింది. -
నకిలీ పట్టాలతో భూ ఆక్రమణలు
వెంకటగిరి (సైదాపురం) : అక్రమాలు..అరాచకాలు..దౌర్జన్యాలు.. భూ కబ్జాలకు వెంకటగిరి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దుండగలు విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు. వసూళ్ల సంస్కృతికి శ్రీకారం అక్రమాలు, దౌర్జన్యాలు, వసూళ్లు వెంకటగిరిలో శ్రీకారం చుట్టాయన్నారు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి మెనూ కార్డు ప్రకారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రామ్కుమార్ విమర్శించారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఖాళీగా జాగా కనిపిస్తే యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. స్థానికంగా ఉండి విశ్రాంతి పొందిన తహసీల్దార్ రాత్రి.. పగలు తేడా లేకుండా నిరంతరం కూటమి నేతల కన్నుసన్నల్లో సేవలు అందించారని ఆరోపించారు. దొంగ పట్టాలను సృష్టించి అమాయకులకు విక్రయాలు చేసిన దళారులతో పాటు విశ్రాంతి పొంది ఇంట్లో ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారుల మాటలు విని దొంగ పట్టాల భూములను ఎవ్వరూ కొని మోసపోవద్దని వెంకటగిరి ప్రజలకు ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ బీసీ నేత డాక్టర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనప్పటి నుంచి వెంకటగిరిలో భూ ఆక్రమణలు పెట్రేగిపోతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ కూడా కూటమి నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, పద్మశాలీ కార్పొరేష్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మహిళా విభాగం కార్యదర్శి కాటూరు రామతులసి, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్లు రవికుమార్యాదవ్, వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, మధుసూదన్రెడ్డి, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి సదానందరెడ్డి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి హేయం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి -
జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు కేంద్రం సంసిద్ధం
● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖకు స్పందన తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. ప్రతి జిల్లాలో ఒక్కో జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన రెండు జిల్లాలలో ఒకటైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1986–87 నుంచే జవహర్ నవోదయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అయితే 2022 ఏప్రిల్ 3న కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో ఇప్పటికీ నవోదయ విద్యాలయం లేదని, దీని స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని, అలాగే నూతన పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా ఆయా ప్రమాణాలకు అనుగుణంగా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. మరోవైపు– రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దీనికి అవసరమైన భూ కేటాయింపులు చేయాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. -
మరుపురాని మహానేత
తిరుపతి అర్బన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని జిల్లాలో ఊరూరా జరుపుకున్నారు. ప్రమాదంతో ఆయన ప్రజలకు దూరం అయినప్పటికీ ఆయన పాలనలో చేసిన మంచిని గుర్తుచేసుకుంటూ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రధానంగా వైఎస్సార్ పాలనలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయంబర్స్మెంట్, వ్యవసాయ రుణాలమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను గుర్తుచేసుకున్నారు.వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పలుచోట్ల అన్నదానం , తిరుపతిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఊరువాడ తేడా లేకుండా ఆయన అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి మహానేత, పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు జయంతి ఉత్సవాల్లో కేక్ కటింగ్, అన్నదానం చేస్తుంటే నాయుడుపేట, గూడూరులో పోలీసులు అడ్డుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అన్నదానం చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.నియోజకవర్గాల్లో ఇలా..● వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయనతో పాటు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, పార్టీ నేతలు రవికుమార్, కార్తీక్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి బంగ్లాలో చేపట్టిన వైఎస్సార్ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ అనంతరం అన్నదానం నిర్వహించారు.● శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని సినిమా వీధిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేపట్టారు. తర్వాత అన్నదానం చేశారు. రేణిగుంట మండలంలో హరిప్రసాద్రెడ్డి, తిరుమల రెడ్డి నేతృత్వంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఏర్పేడు మండలంలో రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండలంలో సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.● సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని జరుపుకున్నారు. ప్రధానంగా నారాయణవనం, నాగలాపురం, సత్యవేడు మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. వారితోపాటు కార్మిక విభాగం మాజీ చైర్మన్ బీరేంద్ర వర్మతో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేపట్టారు. మరో వైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతలు పాల్గొన్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా అన్నదానం చేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నేతలు సర్ధి చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు. మరోవైపు ఆయా మండల కేంద్రాల్లో మండల నేతల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ంగా చంద్రగిరి టౌన్ క్లాక్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. అలాగే పాకాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కటింగ్ చేపట్టారు. ౖలింగేశ్వర్నగర్లోను కేక్ కటింగ్తో పాటు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు, నిమ్మలగుంటపల్లి, ఎర్రావారిపాళెం మండలంలోని నెరబైలు, చిన్నగొట్టిగల్లు మండల కేంద్రాల్లోనూ కేక్ కటింగ్ చేపట్టారు.గూడూరు నియోజకవర్గం సనత్నగర్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరుగు మురళీధర్ నేతృత్వంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా చేపట్టారు. ముందుగా గూడూరులోని బనిగేసాహెబ్పేటలో కేక్ కటింగ్ చేయాలని భావించారు. అయితే పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో సనత్నగర్లో నిర్వహించారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు అందించారు. ఈ సందర్భంగా గూడూరు అభివృద్ధికి వైఎస్సార్ పరిపాలనలో చేపట్టిన పలు అంశాలను గుర్తుచేసుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.తిరుపతిలో వేడుకగా వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు● పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు● చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమనతిరుపతి మంగళం : ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఊరంతా నీ జ్ఞాపకాలే రాజన్నా.. పొలానికెళ్లినా..పట్టణానికి వచ్చినా నీ ప్రతిరూపాలే.. నీ పథకాలు పదిలం.. నిన్ను మేము మరువలేం! జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్ అంటూ అభిమానులు చెమర్చిన కళ్లతో తమ అభిమాన నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నీవు మా మధ్య లేకపోయినా మా గుండె చప్పుడు నీవ్వే రాజన్నా అంటూ స్మరించుకున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డిలతో పాటు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ఫ్లకార్డులను చేతపట్టుకుని జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు.అనంతరం 76 కిలోల భారీ కేక్ను కట్చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం వెయ్యి మందికి పైగా పేదలకు భూమన కరుణాకరరెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని, తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడ వెరవకుండా ప్రజలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించే ఉన్నారన్నారు.వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు వైఎస్సార్సీపీ ఓడిపోయిందని కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, విధ్వంశాల ను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేయించినా తమ పార్టీ నాయ కులు, కార్యకర్తలకు అండగా నిలబడుతామన్నా రు. ఇప్పటికై నా తమ పార్టీ నాయకులు, కార్యకర్త లు, సానుభూతిపరులపైన దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
● త్వరలో పట్టాలపైకి తిరుపతి–చిక్మంగళూరు ఎక్స్ప్రెస్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే కర్ణాటక భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని ప్రజల సౌకర్యార్థం కొత్తగా వీక్లి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ప్రధానంగా బెంగళూరు, చిక్మంగళూరు, తుంకూరు ప్రాంతాల వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. తాజాగా కేంద్ర రైల్వేశాఖ తిరుపతి– చిక్మంగళూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. చిక్ మంగళూరు నుంచి శుక్రవారం బయలుదేరి తిరుపతి చేరుకుంటుంది. అధికారికంగా ఈ రైలు నెంబర్లు 17423–17424గా నిర్ణయించారు. రైలు ప్రారంభం, షెడ్యూల్, టైమింగ్స్ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు రైల్వేశాఖ అధికార వర్గాల సమాచారం. ఈ రైలు మొదటి విడతగా వారానికోసారి నడుపనుంది. తరువాత ప్రజల స్పందన మేరకు వారంలో మూడు సార్లు నడిపే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులకు అనుకూలం ఈ రైలు ప్రయాణించే మార్గంలో ముఖ్యమైన ప్రాంతా లు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారుపేట, వైట్ఫీల్డ్, కృష్ణరాజపురం, బెంగళూరు ఎస్ఎంవీబీ, తుంకూరు, తిప్తూరు, అరిసికెరె, బిరూర్, కదూర్, బిసలె హళ్లి, శంకరాయ పట్న స్లేషన్లు ఉంటాయి. ఈ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు సౌకర్యవంతంగా మారనుంది. ఈ రైలుకు పాకాల స్టేషన్ స్టాపింగ్ ఇవ్వడం మరో విశేషం. చిత్తూరు, కుప్పం, బంగారుపేట ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
వాటర్ ప్లాంట్పై దాడి
పాకాల : స్థానిక శివశక్తి నగర్లోని హేమాద్రి మినరల్ వాటర్ ప్లాంట్పై దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు యోగిత కథనం మేరకు బ్యాంకు రుణం పొంది శివశక్తి నగర్లో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని పక్కింటి వారు రోజూ ఆమెతో గొడవ పడుతున్నారు. ఉదయం వాటర్ప్లాంట్పై రాళ్లతో దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. కొళాయిలను విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యోగిత స్కూటీపై బయల్దేరింది. దీంతో ఆమెను పక్కను నెట్టేసి, స్కూటర్ని కింద పడేసి ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
లారీని ఢీకొన్న కారు
పెళ్లకూరు:లారీని కారు ఢీ కొనడంతో దంపతులకు స్వల్ప గాయాలైన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చైన్నె నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న కారు టెంకాయతోపు గ్రామం ప్లై ఓవర్ మీద ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న అక్కగారిపేటకు చెందిన రవినాయుడు దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ మైఖేల్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. రైలు కింద పడి ఎస్ఐ దుర్మరణం సైదాపురం: రైలు కింద పడి మండలానికి చెందిన ఎస్ఐ దుర్మరణం పాలు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన పడ్డాల పోలయ్య సీఐఎస్ఎఫ్ చైన్నె విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలయ్యకు భార్య రమాదేవితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం ఆయన గూడూరులోనే కాపురం ఉంటున్నారు. సీఐఎఫ్ఎస్లో కానిస్టేబుల్గా చేరిన పోలయ్య ఇటీవలనే ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆదివారం డ్యూటీ నిమిత్తం చైన్నెకు చేరుకున్నారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో దిగి లోకల్ ట్రైన్లో సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ రైలు దిగే సమయంలో రైలు కింద పడి దుర్మరణం చెందారు. దీంతో అక్కడే కేసును నమోదు చేసి సోమవారం సాయంత్రం చైన్నెకు చెందిన సీఐఎస్ఎఫ్ అధికారులు పోలయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
విద్యా ప్రదాత వైఎస్సార్
తిరుపతి సిటీ: ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్ ఉండాలని కలలు కన్న పేదల పక్షపాతి వైఎస్సార్. బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో అందించి ప్రోత్సహించారు. దీంతో పేదింటి పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి రైతు బాంధవుడిగా తెలుగు ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీలను వైఎస్సార్ మానసపుత్రికలుగా నేటికీ ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు.నేడు వైఎస్సార్ జయంతిదివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిలేని లోటు రైతులకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చలవతో పశువైద్య విద్యను అభ్యసించిన పేద విద్యార్థులు సైతం నేడు ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు. నేడు వారంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ 76వ జయంతిని ఘనంగా జరపుకోనున్నారు.మా ఆరాధ్య దైవంరెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో హోటళ్లలో భార్యాభర్తలు పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్ హయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. ఆ తరువాత లండన్లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడింది. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్ ఆరాధ్యదైవం. మేము బతికున్నంత కాలం ఆయన సేవలను మరచిపోలేం. – సరస్వతి, గృహిణి, తిరుపతి రూరల్ఆయన పేదల పక్షపాతిపేదల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్సార్ మా గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీతో జిల్లాలో లక్షలాదిమంది లబ్ధి పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే ఇది వైఎస్సార్ చలువే. విద్యారంగంలో మహిళలకు పెద్ద పీట వేశారు. ఆయన తీసుకొచిచన సంస్కరణలు ఎంతో మంది మహిళలను ఉన్నత స్థానానికి చేర్చాయి. – పద్మావతమ్మ, తిరుపతిఆయనలేని లేటు స్పష్టంగా కనిపిస్తోందిడాక్టర్ వైఎస్సార్ పేదల పక్షపాతిగా ప్రజలు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన సంస్కరణలతో ఎంతో మంది పేదల పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ, విదేశాలలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఆయన లేనిలోటు ప్రస్తుతం తెలుగు ప్రజలకు స్పష్టంగా కనబడుతోంది.– రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతివైఎస్సార్ మా ఇంటిదేవుడుమాలాంటి పేదలు అందుకోలేని వైద్య విద్యను మాకు దగ్గర చేశారు. వైఎస్సార్ చేపట్టిన సంస్కరణలతో నాకు ఎంబీబీఎస్ లో సీటు వచ్చింది. తల్లి దండ్రులు కూలికి వెళ్లితేగాని కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇదంతా డాక్ట ర్ వైఎస్సార్ చలవే. ఆయన్ను మా ఇంటిదేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నాం. – డాక్టర్ కేశవులు, తిరుపతి -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
● నాలుగు నెలలు దాటినా జాడ లేని రుణాలు ● తమ వారికే రుణాలు అందేలా కూటమి ఆదేశాలు ● సిబిల్ స్కోర్ లేదని తిరస్కరించిన బ్యాంకులు ● జిల్లాలో స్వయం ఉపాధి రుణాల ఊసే లేదు చిల్లకూరు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు ఉద్యోగాలు చూపక, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక, కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేయక యువతకు మొండి చేయి చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోండి నెల రోజుల్లో రాయితీ రుణాలు అందిస్తామంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే ప్రతి పంచాయతీ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో మండల స్థాయి అధికారులు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేయాలని కూటమి నాయకులు ఆదేశాలు జారీ చేశారు. వారిని ఎంపిక చేసి దరఖాస్తులను ఆయా బ్యాంకులకు మండల అధికారులు పంపారు. అయితే బ్యాంకు అధికారులు కూడా తామేం తక్కువ కాదని పంపిన దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ లేదని ఆ దరఖాస్తులను తిరిగి పంపేశారు. దీంతో తమ వారికి రాయితీ రుణాలు ఇప్పించే పరిస్థితి కనిపించక పోవడంతో రుణాల మంజూరుకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. నాలుగు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అర్హులైన వారు ఎంతో మంది ఉన్నప్పటికి తమకు అనుకూలంగా వ్యవహరించే వారికే రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపించారు. అయితే బ్యాంకు అధికారులు సిబిల్ స్కోర్ లేని వారు రాయితీ రుణాలకు అనర్హులంటూ ఆ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో తమకు అనుకూలమైన వారు అనర్హులు కావడంతో మరొకరికి ఆ రుణాలు ఇవ్వకూడదంటూ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు మిన్నకుండి పోయారు. చివరగా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ రాయితీ రుణాలపై మరోమారు మార్గదర్శకాలు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపి వేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే నాలుగు నెలలవుతున్నా రాయితీ రుణాల ఊసే ఎత్తడం లేదు. –ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండు వర్గాల వారికే రుణాలు ఇస్తుండగా బీసీ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరుపతి జిల్లాలో 1,267 , బీసీ కార్పొరేషన్ ద్వారా 2,082 యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఇప్పటికే బ్యాంకులకు పంపిన జాబితాలో ఎంపికై న వారు బ్యాంకు అధికారులను కలుసుకుని అవసరమైన గ్యారంటీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే అందరికీ ఒకేసారి రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు మిన్నకుండిపోయారు.కార్పొరేషన్ యూనిట్లు దరఖాస్తులు కేటాయింపులు రాయితీ రుణం ఎస్సీ 1,267 6, 284 రూ 52.89 కోట్లు రూ 20.88 కోట్లు రూ 29.36 కోట్లు బీసీ 2,082 17,487 రూ 50.14 కోట్లు రూ 25.07 కోట్లు రూ 25.07 కోట్లు ఆదేశాలు రావాలి కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. ఇంటర్వ్యూలు నిర్వహించడం పూర్తి చేశాం. అయితే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సి ఉంది. ఆదేశాలు అందిన వెంటనే ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందిస్తాం. – చెన్నయ్య, ఇన్చార్జ్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగ భృతి ఇవ్వరు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడంతో కనీసం వయస్సు మీరేలోగా ప్రభుత్వం ద్వారా ఉపాధి అయినా పొందుతామనుకుని దరఖాస్తులు చేశారు. అలాంటి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక పోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. -
స్కూల్ నుంచి పారిపోయిన పిల్లలు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ముగ్గురు పిల్లలు తిరుగుతుండగా వారిని రేణిగుంట పోలీసులు వారు విచారించి వారిని మాతృశ్రీ చైల్డ్ హోమ్కు అప్పగించారు. తిరుపతి బైరాగి పట్టెడలో ఉన్న మాతృశ్రీ చైల్డ్ హోమ్లో ఉంటూ ప్రయివేటు స్కూల్లో చదువుతున్న లంకేష్ (9), సహదేవ (11), ముఖేష్ (12) ఇంగ్లీష్ మీడియం చదవడం కష్టంగా ఉందంటూ పాఠశాల నుంచి పారిపోయారు. వారిని పోలీసులు సోమవారం పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి విచారించారు. అనంతరం మాతృశ్రీ చైల్డ్ హోమ్ వారిని పిలిపించి వారికి అప్పగించారు. -
టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
తిరుమల: తిరుమలలో సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి పుష్కరిణి, బంగారు డాలర్ల విక్రయ కౌంటర్, అగరబత్తి, కొబ్బరికాయలు విక్రయ కౌంటర్లు, పబ్లికేషన్ స్టాళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ కౌంటర్, పబ్లికేషన్ స్టాళ్లు, బంగారు డాలర్ల విక్రయ కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయల కౌంటర్ వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్
తిరుమల: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ చైర్మన్ లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అంతకు ముందు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో సైకో వీరంగం ● కర్రతో ముగ్గురిపై దాడి ● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు తిరుపతి క్రైమ్: తిరుపతి నగరంలో సోమవారం ఓ సైకో కర్రతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలిపిరి ఎస్ఐ లోకేశ్ వివరాల మేరకు.. కపిలతీర్థం రోడ్డులో సోమవారం ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించి తనకు ఎదురుపడినవారిపై దాడి చేశారు. అక్కడున్న యాచకుడు శేఖర్ (55), వాహనాల పార్కింగ్లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, కల్పనపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ వ్యక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వల వేసి.. బంధించి అంతటితో ఆగని సైకో గంటపాటు పోలీసులకు, స్థానికులకు చుక్కలు చూపించాడు. రోడ్లపై వీరవిహారం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. మొదట కపిలతీర్థం నుంచి మున్సిపల్ పార్క్ వరకు కర్రతో వీరంగం చేశాడు. అతన్ని చూసి స్థానికులంతా పరుగులు తీశారు. సైకో దృఢంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి మున్సిపల్ సిబ్బందితో కలసి ఎస్ఐ లోకేశ్, కానిస్టేబుల్ స్వయంప్రకాశ్ వల వేసి చాకచక్యంగా బంధించారు. సైకో వద్ద కత్తి కూడా ఉందని, అతను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
వందశాతం హాజరు
తిరుపతి అర్బన్: పాఠశాలలు పునఃప్రారంభం నుంచి అంటే జూన్ 12 నుంచి జూలై 7 వరకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జిల్లాలోని విద్యార్థులు వందశాతం హాజరు సాధించడంతో తిరుపతి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్తోపాటు పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్తోపాటు తిరుపతి జిల్లా విద్యాశాఖను సోమవారం అభినందించారని డీఈవో ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూ లా కళాశాల భవనంలోనూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్లను ప్రారంభించారు. విద్యార్థులు ఈ నెల 16వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 19వ తేదీ ఆప్షన్స్ మార్పులకు అవకాశం ఇస్తూ ఈనెల 22న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మామిడి రైతులకు అండగా ఉంటాంతిరుపతి అర్బన్: మామిడి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76,700 మంది రైతులు 80వేల హెక్టార్లలో తోతాపురి మామిడి పంట సాగు చేశారని చెప్పారు. అందులో తిరుపతి జిల్లాలో 14,582 హెక్టార్లలో సాగుచేస్తే 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. జిల్లాలో 8 గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్లు, 39 ర్యాంప్లు, 3 మండీలు ఉన్నాయని వివరించారు. 8 యూనిట్ల సామర్థ్యం 1.21 లక్షల మెట్రిక్ టన్నులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో టన్ను రూ.12కి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ వారు రూ.8కి కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని చెప్పారు. అందరికీ న్యాయం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,938 మంది స్వామివారిని దర్శించుకోగా 28,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నది నుంచి ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్వర్ణముఖి సమీప గ్రామాలైన అయ్యప్పరెడ్డిపాళెం, మూర్తిరెడ్డిపాళెం, కల్లిపేడు, పండ్లూరు, అన్న మేడు, చిగురుపాడు, తిమ్మాజి కండ్రిగ, తుమ్మూరు , మర్లపల్లి, కాలవ గట్టు, వేమగుంటపాళెంలో ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. దీన్ని ఎక్కడికక్కడ అరికట్టలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వర్ణముఖి నది కాజ్వే వద్ద గేట్లు తీసివేడయడంతో ఇసుక రాత్రి పగలు తేడాలేకుండా తరలిపోతోంది. అధికారులకు నెలవారీ ముడుపులు అందుతుండడంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
శ్రీకాళహస్తి పెద్దాస్పత్రిలో రక్తపాతం
సాక్షి టాస్క్ ఫోర్స్: అర్ధరాత్రి వేళ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వర్గానికి చెందిన వారిపై, మరో వర్గం యువకులు దాడి చేయడంతో క్యాజువాలిటీ విభాగం రక్తంతో తడిచింది. ఏం జరుగుతోందో అర్థం కాక వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక ఘటన ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఏరియా ఆసుపత్రి సీసీ కెమెరాలో నమోదైన దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని మంచినీళ్లగుంట, వీఎం పల్లికి చెందిన యువకుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్నిగుండ ప్రవేశం ముగిసిన అనంతరం అర్ధరాత్రి వేళ, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మంచినీళ్ళగుంట, వీఎంపల్లికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంచినీళ్లగుంటకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని వెంట తీసుకొచ్చిన వీఎం పల్లి యువకులు ఏరియా ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలోకి చొరబడి చికిత్స పొందుతున్న యువకులు, వారి బంధువులపై కర్రలు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంచినీళ్ల గుంటకు చెందిన వారు కూడా తిరగబడి రాళ్లు రువ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో వీఎంపల్లికి చెందిన యువకుల ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే దాడులకు పాల్పడింది టీడీపీకి చెందిన యువకులు కావడంతో ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ స్పందించడం లేదు. ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల దాడులు ఐదుగురికి తీవ్ర గాయాలు భయభ్రాంతులకు గురైన సిబ్బంది ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ ప్రకటన శాంతిభద్రతల వైఫల్యం ఆస్పత్రిలో రెండు వర్గాలు దాడులు చేసుకుంటుంటే ఆ సమయంలో పోలీసు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసినా స్పందన లేదని ఆసుపత్రి ఉద్యోగి ఒకరు చెప్పారు. రెండు దశాబ్దాల్లో ఈ తరహా ఘటనలు ఎన్నడూ చూడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య దాడి జరిగితే, ఈ సంఘటన ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ నరసింహమూర్తి ప్రకటించడం గమనార్హం. వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు. -
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ఆయనతోపాటు కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 284 అర్జీలు వచ్చాయి. అందులో రెవన్యూ సమస్యలపై 149 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● మదనపల్లిలో బుద్ద భగవాన్ విగ్రహ తలను నరికిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర నేతలు పాలకుంట శ్రీనివాసులు, మల్లారపు వాసు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్కు వినతిపత్రాన్ని అందించారు. ● వెంకటగిరి మండలం బుసపాళెం ఎస్టీకాలనీకి చెందిన పలువురు యానాదులు తమ శ్మశానాన్ని కబ్జా చేశారని, కాపాడాలని మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్లో అధికారులను కలసి వారికి వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే పలు సార్లు స్థానిక అధికారులకు అర్జీలు ఇచ్చామని, ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్కు వచ్చామని తెలియజేశారు. -
లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి ..
చంద్రగిరి : లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి–పీలేరు జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. సీఐ సుబ్బరామిరెడ్డి వివరాల మేరకు.. ఆదివారం సాయంత్రం సుమారు 38 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి భాకరాపేట ఘాట్లోని పెద్ద మలుపు లోయలో పడి మృతి చెందినట్లు అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరామిరెడ్డి తన సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని, లోయలో పడి ఉన్న మృతదేహాన్ని పైకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించగా, ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం లోయలో పడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడు ఆచూకీ తెలిసిన వారు చంద్రగిరి పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. -
కలెక్టరేట్లో నేడు గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులతో పాటు పలు విభాగాలకు చెందిన జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేయడానికి అవకాశం కల్పించారు. విద్యుత్ సర్వీసులపై ఆకస్మిక తనిఖీలు తిరుపతి రూరల్ : తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలోని కోట సబ్ డివిజన్ వాకాడు, చిట్టమూరు సెక్షన్లలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుత్తు శాఖ డీపీఈ విభాగపు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా చేపల పెంపకం చేపడుతున్న అక్వా రైతుల పొలాల వద్దకు వెళ్లి చేపల చెరువులకు వినియోగించే విద్యుత్తు సర్వీసులను తనిఖీ చేశారు. వాకాడు, చిట్టమూరు సెక్షన్ల పరిధిలో అనధికారిక విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు డీపీఈ విభాగపు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు గంగాధర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 87,536 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
అనుమతి గోరంత.. తవ్వేది కొండంత
చిట్టమూరు : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మట్టి, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీలో సాగరమాల పేరుతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వి తరలించి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. 20 సెంట్ల ప్రభుత్వ భూమిలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతి గనుల శాఖ నుంచి కాకుండా స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రంలో ఎంత మేర తవ్వకాలు చేపట్టాలనే విషయాన్ని నమోదు చేయకుండా అనుమతి ఇవ్వడం చూస్తుంటే ఈ అక్రమ బాగోతం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. లేఅవుట్లకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ.. యాకసిరి గ్రామ సర్వే నంబర్ 425లో 20 సెంట్లలో సాగరమాల రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అయితే పెత్తనం కూటమి నాయకులదే కావడంతో వారు అనుమతి లేని మరో 3 ఎకరాలలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి నాయుడుపేట, కోట, చిల్లకూరు ప్రాంతాలలో వేస్తున్న లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు అధికారులకు అక్రమ తవ్వకాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ భారీ స్థాయిలో ముడుపులు ముట్టడంతో కనీసం అటు వైపుగా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు సైన్యం పహారా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టే ప్రాంతంలో యువకులు ఒక ప్రైవేటు సైన్యంలా ఉంటూ పహారా కాస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలు భారీగా చేపడుతున్నారని గ్రామస్తులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకునే సరికే ప్రవేటు సైన్యంలా వ్యవహరించే సుమారు 15 మంది యువకులు క్రికెట్ బ్యాట్లు, స్టంప్లతో అక్కడికి చేరుకుని ఈ ప్రాంతంలోకి ఎవ్వరూ రాకూడదని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సాగరమాల పేరుతో గ్రావెల్ తరలింపు పట్టించుకోని అధికారులు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఎంత మేర తవ్వకాలు చేపడుతున్నారు. వారికి ఎంత అవసరం ఉంది అనే విషయాలను ఒక్కసారైనా పరిశీలించాల్సిన అధికారులు అనుమతి ఇచ్చాం, మీకు ఎంత వీలుంటే అంత తవ్వుకోపోండని అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు రెండు హిటాచీలు, పది టిప్పర్లు నిరంతరాయంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు తవ్వకాలపై పర్యవేక్షణ ఉంచి అనుమతికి మించి తవ్వకాలు చేయకుండా అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. -
అసలు సిసలైన నాయకుడు జగనే
● హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే ● ఇది ప్రజలకు చెప్పడానికే రీకాలింగ్ మేనిఫెస్టో ఉద్దేశం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా నగరి : అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అసలు సిసలైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. నగరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్ తప్ప ఏమీ అందిచలేదన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారని దుయ్యబట్టారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారని చమత్కరించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. గెలిచాక ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఏ హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశమన్నారు. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసం ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యతన్నారు. సనాతన యోధుడు ఏమయ్యాడు తిరుమలలో దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, శ్రీ కూర్మంలో తాబేళ్లు చనిపోతున్నాయని వీటిపై సనాతన యోధుడు పిఠాపురం పీఠాధిపతి పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆయన తమిళనాడుకెళితే తాను అక్కడే పుట్టానంటాడు.. గుంటూరుకు వెళితే అక్కడా పుట్టానంటాడు.. పిఠాపురం వెళితే అక్కడే పుట్టానంటున్నాడు.. అసలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అందరూ వీకెండ్కు వెకేషన్కు వెళితే, పవన్ వీకెండ్కు మాత్రమే రాష్ట్రానికి వస్తారన్నారు. ఎవరు రాష్ట్రానికి మంచిచేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, విజయలక్ష్మి, దీప, వైస్చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవన్ తిక్కకు బాబు లెక్కలు పవన్ తిక్కకు చంద్రబాబు వద్దే లెక్కుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ హామీలు నెరవేర్చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతమంది ఉంటే అంత మందికి జగన్ చేసిన సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తాం అంటూ ఎన్నికల బీరాలు పలికిన బాబు నేడు దీన స్వరంతో పథకాలు తలచుకుంటే భయమేస్తోందంటున్నారని ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని పేర్కొన్నారు. ఆయనకు అబద్ధాలు చెప్పే కళ ఉందని, నిజం చెబితే తల పగిలే శాపం కూడా ఉందేమో అన్నారు. అందుకే ఆయన అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఆయన చంకలో కూర్చున్న పవన్ తానే టీడీపీని అధికారంలోకి తెచ్చానంటుంటే, తాము లేకుంటే పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరని టీడీపీ చెబుతోందని, ఇలాంటి నాయకులందరూ కూటమిగా కొనసాగుతుండడం దౌర్భాగమ్యమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వారికి కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తానన్నారు. ఇంత మంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు బలవుతున్నా నోరుమెదపడం లేదేమిటని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు చూపే గ్రాఫిక్స్ తప్ప మిగతా విషయాలు ఏవీ కనబడవన్నారు. -
అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి చర్యలు
రాపూరు : అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేట్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ వివరించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాపూరు వెలుగొండ అడవుల్లోన్ని కూటలమర్ని పోయే ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి ఆదివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో నిత్యం అటవీశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మూడు జిల్లా సరిహద్దు ప్రాంతంలో సహజ సిద్ధంగా ఎర్రచందనం ఉందని వాటిని రక్షించాలని సూచించారు.అలాగే పెనుశిల అభయార్యణంలో అనేక రకాలైన వన్యప్రాణులు జీవిస్తున్నాయన్నారు. వన్యప్రాణులకు రక్షణ కల్పించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఎర్ర చందనం అంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని దానిని కాపాడుకోవాల్సి బాధ్యత ఉందన్నారు. అటవీ సిబ్బంది పరస్పర సహకారంతో అడవుల్లో తిరగాలన్నారు. అడవి లోపలకు వెళ్లకపోతే విషయాలు తెలియవని అధికారులు తిరుగుతుంటే బయట వ్యక్తులు అడవిలోకి రాలేరన్నారు. ఆయన వెంట నెల్లూరు డీఎఫ్ఓ మహబూబ్బాషా, రేంజర్ రవీంద్రబాబు , నెల్లూరు, అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నారు. -
అస్తవ్యస్తంగా సచివాలయాలు
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సచివాలయాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. అందులో భాగంగా జిల్లాలో చూస్తే 691 సచివాలయాల్లో 5625 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే....వాటిని 353 సచివాలయాలుగా కుదింపు చేశారు. దీంతో ఉద్యోగుల మిగులు తప్పలేదు. తాజాగా నిర్వహించిన బదిలీల్లో 1975 మంది ఉద్యోగులకు పోస్టింగ్లు లేవంటూ రిజర్వులో పెట్టేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్పష్టతలేని బదిలీలు బదిలీల్లో స్పష్టత లేకుండా పోయింది....ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులకు చిత్తూరులో, 30 శాతం ఉద్యోగులకు నెల్లూరులోను, 10శాతం ఉద్యోగులకు తిరుపతి కలెక్టరేట్లోను బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కార్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా బదిలీలు నిర్వహించాలని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దీంతో జూన్ 30తో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ...బదిలీల్లో పారదర్శకత కొరవడడంతో పలువురు ఉద్యోగులు నాయ్యం కోసం రోడ్డెక్కారు. మరికొందరు కోర్టుమెట్లు ఎక్కడానికి సిద్ధం అవుతున్న క్రమంలో వాటిని సరిచేయాలనే ఉద్దేశంతో జులై 5 వరకు కౌన్సెలింగ్ గడువు పెంచారు. మేజర్గా జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కౌన్సెలింగ్ పూర్తి అయినప్పటికీ బదిలీల జాబితాను మాత్రం గోప్యంగా ఉంచారు. వెల్లడించడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని చర్చ సాగుతోంది. కుంటుపడుతున్న పాలన రేషన్కార్డుల సవరణ కేంద్రాల్లో ఇక్కట్లు సచివాలయాలు 691 నుంచి 353కు కుదింపు స్తంభించిన పాలన జిల్లాలో సచివాలయ పాలన నెల రోజులుగా స్తంభించిపోయింది. సచివాలయంలో అందిస్తున్న పలు సేవలు కుంటుపడ్డాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా రేషన్ కార్డుల సవరణ కోసం ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 8 సచివాలయాల్లో చేసుకోవడానికి వీలుగా నెల రోజుల క్రితం కేంద్రాలను కేటాయింపు చేశారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 55 వేల దరఖాస్తులను అందుకున్నారు. ప్రధానంగా చిరునామా మార్పుల కోసం 2490, ఆధార్ సవరణ 660, కార్డులో సభ్యుల చేరిక కోసం 39,050, సభ్యుల తొలగింపునకు 1360, కొత్త కార్డుల కోసం 7262, కార్డుల విభజన కోసం 4581, ప్రభుత్వానికి సరెండర్ చేసిన కార్డులు 34 ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రాలు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నేపథ్యంలో వేగవంతంగా ముందుకు సాగడం లేదని పలువురు వాపోతున్నారు. బదిలీలు పూర్తి చేస్తే...కొత్త ఉద్యోగులైన వచ్చి వారి పనులు వారు చేసుకుంటారని అంతా చర్చించుకుంటున్నారు. -
జిల్లా సమాచారం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 78 టీటీడీ డిగ్రీ కళాశాలలు 5 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 132 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 66 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 521 టీటీడీ జూనియర్ కళాశాలలు 3 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 52 డిగ్రీ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్న తాత్కాలిక అధ్యాపకులు 75 జూనియర్ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారు 37 -
సార్వత్రిక సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మికుల ప్రయోజనాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు తమ మద్దతు ఉంటుందని టీటీడీ ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ప్రకటించారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ లేకుండా చేసి వారి హక్కులను హరింపజేశారన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ ఎస్డబ్లుఎఫ్ నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, పట్నం దయాకర్, నైనార్ పద్మనాభం, వేణుగోపాల్, రవికుమార్ , ఆదిలక్ష్మి, మునికిరణ్ కుమార్, ధనంజేయులు, శ్రీనివాసులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
యోగ నిద్రలో నరసింహుడు
– పెంచలకోనలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు రాపూరు : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశినాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉప క్రమిస్తారని తెలిపారు. తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నట్లుగా శ్రీవారి కల్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలు ,ఆభరణాలతో అలంకరించారు. శ్రీవారికి 15 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. శేషవాహనం స్వామి అమ్మవార్లు తొలిఏకాదశి సందర్భంగా శేష వాహనంపై లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. -
చోరీపై క్లూస్టీం విచారణ
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలోని ముకాంభిక గుడి వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేందర్ ఇంటిలో ఆదివారం చోరీ జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీంతో పోలీసులు విచారణ చేశారు. దుండగులు బీరువాలో దాచి ఉంచిన 55 సవర్లు బంగారు నగలు చోరీ అయ్యాయి. కాగా బీరువా లోపలి అరలో దాచి ఉంచిన రూ.3 లక్షల నగదును అలానే ఉండడడాన్ని సీఐ బాబి గుర్తించారు. అయితే దుండగులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటిలో చొరబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమలలో కార్డన్ సెర్చ్ తిరుపతి క్రైమ్ : తిరుమలలోని పాప వినాశనంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాప వినాశనంలోని 140 షాపులను తనిఖీ చేసి 40 అనధికారికంగా ఉన్న లైసెన్సులను గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
● ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ● ఉద్యోగ భద్రత కరువు..బతుకు భారం ● ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు అందని రెన్యూవల్ ఉత్తర్వులు ● తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ● మూడు నెలలుగా అందని వేతనాలు ● దయనీ
తిరుపతి సిటీ : ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భద్రత కరువై బతుకు భారంగా మారింది. కళాశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు తప్ప మిగిలిన డిగ్రీ, టీటీడీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. 2025–26 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అధ్యాపకులు మే నుంచి జులై వరకు మూడు నెలల జీతాలకు నోచుకోలేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 2002 నుంచి పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 800 మందికి పైగా అధ్యాపకులు ఉద్యోగ భద్రత కరువై చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వం పర్మినెంట్కు ఆదేశాలిచ్చినా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు 2024లో జీఓ 114 విడుదల చేసి ప్రక్రియ శర వేగంగా కొనసాగుతున్న తరుణంలో సాధారణ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టి డిగ్రీ అధ్యాపకుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ ద్వారా నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అయోమయంలో పడింది. రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై న అధ్యాపకులతో తాత్కాలిక అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. కొంత మంది అధ్యాపకులు గత 22 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ రెగ్యులర్ చెయ్యకపోవడం కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వకపోవడం దారుణం.రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో ప్రభుత్వ, టీటీడీ కళాశాలలో 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోలేక సతమతమతం అవుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 75 మంది తాత్కాలిక అధ్యాపకులు రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అటు పర్మినెంట్ చేయకపోగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించకపోవడంతో వారికి ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా 12 నెలల పాటు అధ్యాపకుల చేత సేవ చేయించుకుని కేవలం 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు వేతనాలు సరైన సమయానికి అందించకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రక్రియ పూర్తయే వరకు నూతన రిక్రూట్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం 2025–26 సంత్సరానికి సంబంధించి తాత్కాలిక అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. దీంతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్న సబ్జెక్ట్లకు వదిలేసి ఖాళీగా ఉన్న సబ్జెక్ట్లకు మాత్రమే నూతన రిక్రూట్మెంట్ ద్వారా అధ్యాపకుల ఎంపిక చేయాలి. – డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, తిరుపతి జిల్లా ఏటా నాలుగు నెలల నిరీక్షణ గతంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి రెన్యూవల్ ఆర్డర్స్ వచ్చేవి. గత ఏడాది నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ కళాశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి కాకుండా మూడు నెలలు ఆలస్యంగా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం నాలుగు నెలలు జీతభత్యాలు ఆలస్యమవడంతో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. -
● అగ్నిగుండం .. పాపహరణం
అగ్నిగుండం మహోత్సవానికి తరలివచ్చిన భక్తజనంకణకణ మండుతున్న నిప్పు కణికలు , భక్తి పారవశ్యంతో ఆదివారం కంకణదారులైన భక్తులు నిప్పుల గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో చివరిగా అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి సింహ వాహనంపై అధిష్టించారు. అగ్ని గుండంలో నిప్పులను తీసుకుని మల్లెపూలలో పెట్టి అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆలయ అనువంశిక పూజారులు అగ్నిగుండ ప్రవేశం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో నిప్పుల గుండం తొక్కారు. పోలీసులు, ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. – శ్రీకాళహస్తి అగ్నిగుండం ప్రవేశం చేస్తున్న భక్తులు -
సమరం
కూటమి మోసాలపై చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్దాం ● వంచించడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి ● ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి ● నాగలాపురం సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి దిశా నిర్దేశం వరదయ్యపాళెం : చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల కేంద్రంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాది పూర్తయినా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ పథకాలను గాలికొదిలేసి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ రాజకీయాలకు కూటమి నాంది పలుకుతోందని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రతి గడపకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఒక్క చక్కటి అవకాశమని , ఆ దశగా ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు నడుం బిగించి ప్రజలకు తెలియజేయడంలో ముందుండాలని భూమన పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకూ దగా సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సంపద సృష్టిస్తా నని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. కూటమి ఏడాది పాలనలో ఎక్కడా లేనంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారని, దాని ఫలితమే జగనన్న ఎక్కడికి వెళ్లినా జనం జేజేలు కొడుతున్నారన్నారు. ఆ ఆదరణను చూసి ఓర్వలేక జగనన్న పర్యటనలకు కుట్రలు పన్నుతున్నారన్నారు. పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సెల్ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయించి అందులో చంద్రబాబు మోసాలను ప్రజలకు వారి ఫోన్ల ద్వారానే వివరించాలని సూచించారు. జగన్ 2.0 లో కార్యకర్తలకే ప్రాధాన్యం నాగలాపురంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆ దిశగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడగులు వేస్తున్నారన్నారు. కూటమి పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్రెడ్డి నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సారథ్యంలో సత్యవేడు గెలుపునకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, పళ్లికొండేశ్వరాలయ మాజీ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అపరంజిరాజు (నాగలాపురం), సుశీల్కుమార్ రెడ్డి (సత్యవేడు), నాయుడు దయాకర్ రెడ్డి (వరదయ్యపాళెం), గవర్ల కృష్ణయ్య (కేవీబీపురం), మణి నాయుడు (బీఎన్కండ్రిగ), చలపతిరాజు (పిచ్చాటూరు), సొరకాయలు (నారాయణవనం), మండల రైతు విభాగం అధ్యక్షులు చిన్నదొరై, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.9న వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయండి ఆపదలో ఉన్న మామిడి రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈనెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డ్కు వస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని సత్యవేడు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో సైతం పెద్దఎత్తున రైతులు మామిడి పంటను సాగు చేశారని, అయితే ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి రైతులు నష్టపోయారని, అందుకు కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. -
చంద్రగిరిలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు
● ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలనే కుట్ర ● తలలు పగలగొడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర ● బాధితులపైనే కేసుల నమోదు ఏం సాధిస్తారో..? వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు వరుసగా దాడులు చేయడం వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో చెప్పాలని చంద్రగిరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శరీరంపై కారం చల్లడం, కర్రలతో తల పగలగొట్టడం, చేతులు విరిచేయడం వంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీ నేతల రక్తం కళ్ల చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఎంతో మంచిగా చూసుకున్నారు కాబట్టే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయానికి టీడీపీ క్యాడర్ గట్టిగా నిలబడిందన్న విషయం గుర్తు చేసుకోవాలని వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు సూచిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నేతలను చెవిరెడ్డి ఎక్కడా ఇబ్బంది పెట్టలేదన్న విషయం ఆ పార్టీలోని సీనియర్లు అందరికీ తెలుసని, అయినా వారు ఈ సమయంలో మౌనం వహించి భౌతిక దాడులను ప్రోత్సహించడం భవిష్యత్తు తరాలకు మంచిది కాదంటున్నారు. కరోనా సమయంలో చెవిరెడ్డి చేసిన సాయం వల్ల ఎంత మంది టీడీపీ నేతలు ప్రాణాలతో బయటపడ్డారో ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అదును చూసి.. అరాచకాలకు తెర లేపింది. తమ క్యాడర్కు అండగా నిలబడతాడనుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారు.. ఆ నాయకుడి కుమారుడు పైనా తప్పుడు కేసులు పెట్టి క్యాడర్కు దూరమయ్యేలా చేశారు. ఎవ్వరి అండా లేదని తెలుసుకుని పార్టీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై కారం చల్లడం.. కర్రలతో తలలు పగలగొట్టడం.. మహిళ మెడలో మంగళ సూత్రాలు తెంచడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలకు పోలీసులు అండగా నిలబడటంతో మరింతగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రగిరిలో ఎన్నడూలేని విధంగా పల్లెల్లో రాజకీయ వైషమ్యాలను కలిగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి వారు నచ్చిన పార్టీకి పనిచేయడం, ఆ తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్నదమ్ముల్లా కలిసి మెలసి ప్రశాంతమైన రాజకీయాలు చేసుకునే చంద్రగిరిలో ప్రస్తుతం అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. కుట్రలో భాగంగానే దాడులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ కేసులో అరెస్టు జరిగిన తరువాత చంద్రగిరిలో ఏం జరుగుతోంది..? ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్పై అధికార టీడీపీ నేతలు చేస్తున్న వరుస దాడులకు కారణం ఏమిటి ? ప్రశాంతమైన పల్లెల్లో రాజకీయ చిచ్చు పెడుతున్నది ఎవ్వరు? బాబు స్వగ్రామం చంద్రగిరిలో ప్రత్యర్థి పార్టీని లేకుండా చేయాలనేనా..? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారా..? చంద్రగిరి ప్రజలకు పదేళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన చెవిరెడ్డిని జైలుకు పంపింది ఆ వ్యూహంలో భాగమేనా..? అన్న ప్రశ్నలకు అందరి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉంది. రాజకీయ విధ్వేషాలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను పది మందిలోకి పిలిపించడం, ఆ తరువాత అవమాన పరిచి దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని అన్నివర్గాల ప్రజలు తప్పు బడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా స్థాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈనెల 9వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రగిరి పార్టీ నేతలు వివరించనున్నట్లు సమాచారం. బరితెగింపు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ క్యాడర్ను టార్గెట్ చేసుకుని వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రక్తం కళ్ల చూడాలనుకునే టీడీపీ గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంపై బాధిత కుటుంబీకులు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రగిరిలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యం, పోలీసుల సహకారంపై ఈనెల 7వ తేదీన తిరుపతి జిల్లా ఎస్పీని కలసి వినతిపత్రం అందించాలని, అప్పటికీ న్యాయం జరగకుంటే బాధితులతో కలసి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
వణుకెందుకు బాబు?
● ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం రావడం ఖాయం ● మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా? ● హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా? ● మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇలా.. ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, హేమంత్కుమార్ రెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్గౌడ, కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. హెలీప్యాడ్కు అనుమతులివ్వడం లేదు ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటకు హెలీప్యాడ్కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురికి ధరలేక కాయలు అమ్ముకోలేక తోటల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం ఇప్పుడు జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్ వస్తేగానీ రైతుల కష్టం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. -
హాస్టల్స్లో ప్రవేశాలు
తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బీసీ హాస్టల్స్లో అడ్మిషన్లు చేసుకుంటున్నామని, ప్రస్తుతం జిల్లాలోని 62 హాస్టల్స్లో 5060 మంది వరకు విద్యార్థులు ఉన్నారని బీసీ హాస్టల్స్ జిల్లా అధికారి భరత్కుమార్ తెలిపారు. 2025–26కి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన అన్ని వస్తువులను అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్స్కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి హాస్టల్లోను నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లో ఏదైన ఫంక్షన్లు జరిగితే మిగిలిన భోజనం హాస్టల్స్కు ఇస్తే తీసుకోరాదని స్పష్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రతి హాస్టల్ను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ఇసుక తవ్వకాలకు కొత్త నిబంధనలు ● అరణియార్,స్వర్ణముఽఖిలో తవ్వకాలు నిషేధం తిరుపతి అర్బన్ : ఇసుక తవ్వకాలకు కొత్త నిబంధనలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు నదులలో ఇసుక తవ్వకం , రవాణాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో స్వర్ణముఖినది, ఆరణియార్ నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు నిషేధించాలని స్పష్టం చేశారు. అయితే పంచాయితీ పరిధిలోని వాగులు, వంకల నుంచి సచివాలయం అనుమతులతో రసీదు తీసుకుని ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. మిగిలిన వారు గూడలి (స్వర్ణముఖి బేరేజీ) డీ–సిల్టేషన్ యార్డు–ఆవిలాల (తిరుపతి) యార్డు, కాటన్ మిల్ (తిరుపతి) యార్డు, గాజులమాండ్యం (రేణిగుంట) యార్డు, శ్రీకాళహస్తి యార్డు, వెంకటగిరి యార్డుల్లో ఇసుకను తీసుకుపోవచ్చునని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు నిఘా ఉంటుందని వివరించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
● మహిళా ఉద్యోగి మృతి, 15 మందికి గాయాలు రేణిగుంట : టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు వెనుక వైపు వేగంగా వచ్చి ఢీకొనడంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మహిళా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందింది. 15 మందికి గాయాలు కాగా ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు నారాయణవనం నుంచి తమ కంపెనీ ఉద్యోగులను ఎక్కించుకొని వస్తున్న సమయంలో శనివారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు రేణిగుంట సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాల ఎదురుగా టైర్ పంచర్ అవడంతో రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక వైపున ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న నారాయణవనానికి చెందిన ఊహ మహాలక్ష్మి (25) మృతి చెందగా మరో మహిళకు కాలు విరిగింది. మొత్తం 15 మందికి గాయాలు కాగా పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి పరామర్శించారు. -
లోక్ అదాలత్లో 2352 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 2352 కేసులు పరిష్కారం అయినట్లు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ గురునాథ్ తెలిపారు. పరిష్కారమైన కేసులలో 371 కోర్టుల్లో పెండింగ్ ఉన్న సివిల్ , క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద కేసులు, వివాహ సంబంధాల కేసులు, తదితర కేసులు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే 1981 జరిమానాలు చెల్లించే క్రిమినల్ కేసులను పరిష్కరించి నిందితులకు 60 లక్షలా 25 వేల వంద రూపాయలు జరిమానా విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10:30 గంటలకు తిరుపతి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. కేసుల పరిష్కారం కోసం ఈ జాతీయ లోక్ అదాలత్లో 8 బెంచ్లను ఏర్పాటు చేశారు. జడ్జి గురునాథ్తో పాటు ఐదవ అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి విజయసారధిరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, ఇతర జూనియర్ సివిల్ జడ్జిలు గ్రంధి శ్రీనివాస్ ,శ్రీకాంత్ , సత్యకాంత్ కుమార్, సంధ్యారాణి, కోటేశ్వరరావు ఈ లోక్ అదాలత్ బెంచ్లకు అధ్యక్షులుగా వ్యవహరించి కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్లో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంకు, బీమా, ఆర్టీసీ ఇతర వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదం.. పట్టుబడ్డ ఎర్రచందనం నాయుడుపేటటౌన్: పట్టణ పరిధిలోని అగ్నిమాపకశాఖ కార్యాలయం సమీపంలో రహదారిపై బైక్ను ఢీకొని ఎర్రచందనం తరలిస్తున్న వాహనం శనివారం పోలీసులకు పట్టుబడింది. ఫారెస్ట్ డీఆర్వో కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. వెంకటగిరి వైపు నుంచి వస్తున్న కారు పట్టణ పరిధిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదుట రహదారిపై వెళుతున్న బైక్ను ఢీకొంది. అక్కడ యూనిఫామ్లో అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చేటప్పటికే కారులో ఉన్న డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. కారు వెనుక డోర్లో తెరిచి చూడగా ఎర్ర చందనం దుంగలు ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వాహనం అప్పగించినట్లు డీఆర్వో తెలిపారు. 237 కేజీలకు పైగా ఉన్న 46 ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనం విలువ రూ. 3 లక్షలు వరకు ఉంటుందన్నారు.అటవీశాఖ రేంజ్ అధికారి రమణయ్య పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు. -
దాడి చేసిన వారెవ్వరినీ వదలం
చంద్రగిరి: చంద్రగిరిలో అరాచక పాలన సాగుతోందనడానికి వరుసగా జరుగుతున్న దాడులే నిదర్శనం.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి లేరని క్యాడర్పై దాడులు చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదాడులు చేస్తే భయపడి లొంగిపోతారని ఎలా అనుకుంటున్నారు... ఇక్కడ వున్నది పిరికిపందలు కాదు.. జగన్మోహన్రెడ్డి సైనికులు.. మా క్యాడర్ను కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం.. అవసరమైతే జగన్మోహన్రెడ్డి చంద్రగిరికి వస్తారు.. అంటూ వైఎస్ఆర్ సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని నరశింగాపురం పంచాయతీ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్పై టీడీపీ గూండాలు దాడి చేసి తల పగలగొట్టడాన్ని ఆయన ఖండించారు. శనివారం ప్రవీణ్కుమార్ ఇంటికి చెవిరెడ్డి హర్షిత్రెడ్డితో కలసి వచ్చిన ఆయన టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్కు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన మాట్లాడుతూ.. చెవిరెడ్డిని, ఆయన బిడ్డను అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన వెంట నడిచే క్యాడర్ను భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చెవిరెడ్డి చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని, దాడులకు పాల్పడిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. పల్లెల్లో ప్రశాంతమైన రాజకీయాలు చేసుకోవాలే తప్ప దాడులు చేసుకునే పరిస్థితి రాకూడదన్నారు. చంద్రగిరి చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడే వస్తోందన్నారు. దీనిని ఆరంభంలోనే అడ్డుకోవాలని, దానికి పోలీసులు సహకరించకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని సూచించారు. ఆ తరువాత చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ప్రవీణ్కుమార్తో పాటు వారి కుటుంబీకులకు అండగా నిలబడతామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు లేరని క్యాడర్పై దాడులు అమానుషం క్యాడర్ను కాపాడుకోవడానికి మేమున్నాం.. అవసరమైతే జగన్మోహన్రెడ్డి చంద్రగిరికి వస్తారు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
● రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా తిరుపతి అర్బన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్ పేర్కొన్నారు. తిరుపతి డిపోలో రెండో రోజు ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఉద్యోగో న్నతులు వెంటనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్సులను తొలగించి, కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టా రు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జునయ్య, కార్యదర్శి రమేష్కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి సతీష్నాయుడు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్ నెల్లూరుకు చెందిన వి.సుందర్ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్ రెడ్డిను నియమించారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్.చెంగారెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్ సిరాజ్బాషా ఉన్నారు. రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్: అండర్–15 రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు తిరుపతికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. జూన్ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు మదనపల్లిలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు 2వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తిరుపతికి చెందిన ఆదిత్య, హిమకేష్లను రాష్ట్ర జట్టుకు రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డెప్ప తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో నిర్వహించనున్న క్యాంపులో పాల్గొననున్నారని, ఆ తరువాత పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున వీరిద్దరు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న వీరిని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. తాళం పగులగొట్టి చోరీ ● 55 సవర్ల బంగారు నగలు, 3 లక్షల నగదు అపహరణ నాయుడుపేటటౌన్ : నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక గుడి వీధిలోని ఓ ఇంటిలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనను బాధిత కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్తించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముకాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న హరేంద్ర, అతడి భార్య సునీత శనివారం ఉదయం 10.30 గంటలకు గూడూరులో జరిగే జగన్నాథ యాత్రలో పాలు పంచుకునేందుకు వెళ్లారు. తిరిగీ రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి అవాక్కాయ్యారు. ఇంటిలోకి వెళ్లి చూడగా 30 సవర్ల బంగారు, నగదు రూ.50 వేలు, వెండి వస్తువులు, సునీత స్నేహితురాలిగా ఉన్న మరో మహిళకు సంబంధించిన 25 సవర్ల బంగారు నగలు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేసుకుని వెళ్లి ఉండటాన్ని బాధితులు గుర్తించారు. అయితే ఈ దొంగతనం మధ్యాహ్న సమయంలో జరిగి ఉండవచ్చునని బాధితులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిరసనలు
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై భాకరాపేట: కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే తప్పుడు కేసులు నమోదు చేయించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోహిత్రెడ్డిపై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, రామచంద్రాపురం ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ట్రబుల్ మేజర్
● డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్నే కొనసాగించాలి ● డబుల్ మేజర్ వద్దే వద్దు అంటున్న కళాశాలలు ● ప్రైవేటు కళాశాలల పట్టు.. మెట్టు దిగిన ఉన్నత విద్యామండలి ● సింగిల్ మేజర్ విధానం వైపే ప్రభుత్వం మొగ్గు ● త్వరలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్తిరుపతి సిటీ : ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై తిరగబడ్డారు. దీంతో ఉన్నత విద్యామండలి కాస్త వెనుకడుగు వేసింది. డిగ్రీ కోర్సులలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని, డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానంతో తమకు తలనొప్పి తప్పదని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యా మండలికి తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి సందిగ్ధంలో పడింది. గత నాలుగు మాసాలుగా డబుల్ మేజర్ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించి సుదీర్ఘంగా చర్చించి నివేదిక తెప్పించుకుంది. దీంతో పాటు డబుల్ మేజర్ సబ్జెక్ట్లకు సంబంధించి కరిక్యులమ్ సైతం కమిటీ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పేరొందిన కార్పొరేట్, ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ మేజర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. డబుల్ మేజర్తో సమస్యలు డిగ్రీ కోర్సులలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానానికి, మల్టీ డిసెప్లేనరీ విధానానికి పెద్ద తేడా లేదని ప్రైవేటు కళాశాలలు, మేథావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానానంతోనే విద్యార్థులకు, అటు కళాశాలలకు ఎంతో ఉపయోగకరమని వారు వాదిస్తున్నారు. డబుల్ మేజర్ విధానంతో అధ్యాపకుల కొరత, నూతన అధ్యాపకుల నియామకం, కళాశాలలలో ల్యాబ్ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఈ విధానం తలనొప్పితో పాటు భారీ ఖర్చుతో కూడుకున్నదని ప్రభుత్వానికి విన్నవించారు. ఇటు ప్రభుత్వ కళాశాలలు మాత్రం డబుల్ మేజర్ విధానం ప్రవేశపెడితే అడ్మిషన్లు పెరుగుతాయని అభిప్రాయాన్ని వెళ్లడిస్తున్నారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని కొనసాగించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడాల్సి ఉంది. జిల్లా సమాచారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 టీటీడీ కళాశాలలు 5 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104 సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలంటున్న కళాశాలలు 106 డబుల్ మేజర్ కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని కోరిన కళాశాలలు 15 ఏదైనా సరే అంటూ సిద్ధపడ్డ కళాశాలలు 6 సింగిల్ మేజర్ సబ్జెక్ట్తో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సుమారు 25 మంది డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు 32,600సింగిల్ మేజర్తో విద్యార్థులకు ప్రయోజనం డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్లో డిగ్రీ పొందిన విద్యార్థికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా పోటీ పరీక్షలలో ఆప్షనల్ సబ్జెక్ట్గా యూజీలో తీసుకున్న మేజర్ సబ్జెక్ట్ను ఎంపిక చేసుకొని మంచి మార్కులు స్కోర్ చేసుకునేందుకు వీలుంటుంది. – ప్రభాకర్రెడ్డి, ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు, తిరుపతి డబుల్ మేజర్ను ఎవరూ కోరడం లేదు డబుల్ మేజర్ను ఏ విద్యార్థి కోరుకోవడం లేదు. మూడు, రెండు సబ్జెక్టులను మేజర్గా చదువుకునే విద్యార్థికి శ్రమ తప్ప ఉపయోగం ఉండదు. అధ్యాపకులు, మౌలిక సదుపాయా ల కల్పనలో విద్యా సంస్థలు వెనుకబడతా యి. – రాజేశ్వరి, కార్పొరేట్ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి పోటీ పరీక్షలకు ఉపయోగకరం డిగ్రీలో సింగిల్ మేజర్ విధానం చదివిన వారికి సివిల్స్, గ్రూప్స్, రీసెట్, పీజీసెట్, ఐసెట్, వంటి పోటీ పరీక్షలలో నెగ్గేందుకు సులువుగా ఉంటుంది. డబుల్ మేజర్తో రెండు ప్రధాన సబ్జెక్ట్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది. – శిరీషా, డిగ్రీ విద్యార్థిని, తిరుపతి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ తర్వాతే నోటిఫికేషన్ డిగ్రీ నోటిఫికేషన్ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు మూడు మాసాలుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఇంటర్ ఫలితాలు విడుదలైనా ఇంత వరకు డిగ్రీ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోకపోవడంతో దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. కాగా ఈనెల 6వ తేదీ నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.నోటిఫికేషన్ రాకపోవడం బాధాకరం ఇంటర్ ఫలితాలు ఏఫ్రిల్ నెలలో వచ్చాయి. కానీ ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం ఆశ్చర్యం. విద్యావ్యవస్థలో ఏ విధానాన్ని కొనసాగించాలో తెలియక ఉన్నత విద్యామండలి తికమక పడుతూ అడ్మిషన్లు జరపకుండా ఆల స్యం చేయడం బాధాకరం. – ప్రసన్న, డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని, తిరుపతి రూరల్ ఫీజురీయింబర్స్మెంట్ ఊసేలేదు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. మళ్లీ నూతన విధానం అంటూ డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ను ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలతో అడుకుంటోంది. తల్లిదండ్రులు గత ఏడాది అప్పులు చేసి ఫీజు చెల్లించిన పరిస్థితి చూశాం. – లక్ష్మీనరసింహులు, విద్యార్థి, రేణిగుంట -
● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గోదాముల నుంచే 50కి బదులు 46 కేజీలే వస్తున్నాయంటున్న డీలర్లు ● రేషన్ బండ్లలో ఇచ్చేటప్పుడే బాగుండేదంటున్న జనం ● రేషన్ బియ్యం తూకాలపై భూమన అభినయ్రెడ్డి తనిఖీలు
తిరుపతి మంగళం : ప్రతి నెలా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అటు ప్రభుత్వం, ఇటు డీలర్లు బొక్కేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందక.. కూలీనాలి చేసుకుని వచ్చిన చిల్లర డబ్బుతో మసూరా బియ్యం కొనుక్కుని తినలేక.. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యంతో కడుపు నింపుకుంటున్న పేదల నోటి కాడ అన్నాన్ని కొంత మంది కూటమి నేతలు , రేషన్ డీలర్లు లాగేసుకుంటున్నారు. పేదలకు ఇచ్చే 10, 20 కిలోల రేషన్ బియ్యం తూకాల్లో కక్కుర్తి పడి కోతలు కోస్తున్నారు. ఇది తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలను వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి వెలికితీశారు. రేషన్ అక్రమాలు భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై ఏకతాటిగా 12 రేషన్ షాపులలో బియ్యం తూకాలను పరిశీలించామన్నారు. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించే ఇటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించేందుకు వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి అందాల్సిన రేషన్ను అందే విధంగా రసీదు వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. దాంతో రేషన్ సరుకుల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎండీయూ వాహనాలను రద్దు చేసి తనకు అనుకూలంగా ఉన్న కూటమి నాయకులకు రేషన్ దుకాణాలను కేటాయించి పేదల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అక్రమాలతో సుమారు 35 నుంచి 40 కోట్ల కేజీల రేషన్ బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తూ తద్వారా రూ. 900 కోట్లపై పైగా స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. సీజ్ చేసేదెప్పుడు ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం మామమైపోతోంది, పెద్ద ఓడల్లో పక్క దేశాలకు వెళ్లిపోతున్నాయని పవన్ కల్యాణ్, నాదేండ్ల హడావుడి చేసి సీజ్ ద షిప్ అని డైలాగులు కొట్టారన్నారు. ఇప్పుడు ఎవ్వరిని సీజ్ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని సీజ్ చేస్తారా? ఈ రేషన్ వ్యవస్థను సీజ్ చేస్తారా అని భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ను దూషించడానికి తప్ప ప్రజలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను, ఇంటి వద్దే ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్న ఎండీయూ వాహనాలను రద్దు చేశారే తప్ప మరొకటి కాదన్నారు. రేషన్షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతోనే రేషన్షాపుల తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి గతంలో వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన వ్యవస్థనే కొనసాగించాలని భూమన అభినయ్రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అయితే రేషన్ దుకాణాల వద్ద ఇలా చేయడం సరికాదని, ఏదైనా ఉంటే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ అలిపిరి పోలీసులు రేషన్షాపు వద్దకు వచ్చి భూమన అభినయ్రెడ్డితో వాదించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకు ఉందని అభినయ్ అన్నారు. లబ్ధిదారుడికి ఇనుప డబ్బాతో తూకం వేసిన 35 కిలోల రేషన్ బియ్యాన్ని సంచితో తూకం వేయగా 31.640 కేజీలుగా తూకం చూపెడుతున్న దృశ్యంమోసాలు బట్టబయలు తిరుపతి నగరంలోని రేషన్ షాపుల్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో జరుగుతున్న అక్రమాలను శుక్రవారం వెఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి బయటపెట్టారు. తిరుపతి జీవకోనతో పాటు పలు ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో పేదలకు వేస్తున్న బియ్యం తూకాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తీసుకెళుతున్న రేషన్ బియ్యాన్ని పార్టీ నాయకులు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెయిట్ మిషన్ (త్రాసు)పై పెట్టించారు. దాంతో 10 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో రెండు కేజీలు, 20 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో నాలుగు కేజీలు తక్కువ కనిపించాయి. ఏమక్కా మీరు తీసుకున్న బియ్యం ఎంత? మీకు రేషన్ షాపు వాళ్లు ఇస్తున్న బియ్యం తూకం ఎంత చూశారా ? అంటూ వారికి రేషన్ షాపుల్లో జరుగుతున్న తూకల్లో అక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇదేమిటని ఆ రేషన్షాపు నిర్వాహకురాలిని అడిగితే ఇదేమీ కొత్త కాదు..ఎప్పటి నుంచి జరుగుతున్నదేనంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ రేషన్ గోదాముల నుంచే వచ్చే 50 కేజీల బియ్యానికి గానూ 46 కేజీలే వస్తున్నాయని రేషన్ డీలర్లే చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు రేషన్ డీలర్లు కలిసి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్నారు. -
తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్తో కీలక ప్రతిపాదనలు
● టాటా కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ కలిసిన ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి అభివృద్ధికి సహాయపడాలంటూ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముంబయిలో టాటా సనన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్న్ను ఎంపీ కలిశారు. తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రం, ఐజర్, ఐఐటీ, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ వివరించారు. ఈ ప్రాంత యువతకు డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు. అదే విధంగా బీపీఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. కలంకారి ప్రాచీన కళకు ప్రోత్సాహం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవానికి టాటా క్లిక్, వైస్ట్సెడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ వివరించారు. స్పందించిన చంద్రశేఖరన్ అందుకు అవసరమైన చర్యలు చేపడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. -
17 నుంచి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
తిరుపతి సిటీ : ఎస్వీయూ గంథ్రాలయం, యూజీసీ ఇన్ ప్లిబ్నెట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు క్యాలిబర్–2025 అనే అంశంపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ను శుక్రవారం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏడు దేశాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని ఆర్గనైజర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య సుధారాణి, ఆచార్య చండ్రాయుడు, సైంటిస్ట్లు డాక్టర్ వల్లభ్ ప్రధాన్, శేఖర్, రాజన్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఎస్వీయూలో ఉద్యోగమేళా తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టూడెంట్స్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వర్సిటీలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య మురళీధర్, కో ఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు. పురుష అభ్యర్థులకు మాత్రమే జరిగే ఈ మేళాకు ప్రముఖ ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్వీయూలోని అన్నమయ్య భవన్కు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు. మా బడిని తరలించొద్దు రేణిగుంట : పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ మండలంలోని కుమ్మరపల్లెలోని బేసిక్ ప్రైమరీ స్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. తమ పిల్లలు అంగన్వాడీ నుంచి ఐదో తరగతి వరకు మా ఊరిలోని బడిలోనే 40 మంది చదువుతున్నారని, వీరిలో ఎక్కువ మంది తుమ్మలగుంట గిరిజన పిల్లలు ఉన్నారన్నారు. విలీనం చేయడంతో 3 కిలో మీటర్ల దూరంలోని ఎల్ఎం కండ్రిగ స్కూల్కు 3,4,5 తరగతి పిల్లలు వెళ్లలేక పాఠశాల మాని ఇంటి వద్ద ఉన్నారని ఆవేదన చెందారు. ఆటో వాళ్లు ఒక రోజు వస్తే మరొక రోజు రారని అందువల్ల పిల్లలను బడికి పంపించేందుకు వీలు పడటం లేదని వాపోయారు. తూపిలిపాళెం భూముల పరిశీలన వాకాడు : మండలంలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో శుక్రవారం ప్రభుత్వ భూములను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు తన బృందంతో కలసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ , గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్తో కలిసి నిలిచిపోయిన దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ నిర్మాణం చేపడతారనేది ఇంకా స్పష్టత రాలేదని, 2500 ఎకరాల భూములు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ రామయ్య తెలిపారు. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ పనులు పూర్తి చేయండి చిల్లకూరు : చిల్లకూరు, కోట మండలాలలోని తీర ప్రాంత గ్రామాలైన తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో వందల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ కారిడార్ను శుక్రవారం ఏపీ ఇండ్రస్టియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్తో పాటుగా జిల్లా , డివిజన్ అధికారులు పరిశీలించారు. -
విలీనం.. ఆగని పోరాటం
కేవీబీపురం : ప్రభుత్వ బడుల విలీనానికి వ్యతిరేకంగా పాతపాళెం,ఏపీపురం, గురుకులకండ్రిగ తదితర గ్రామాల ప్రజలు శుక్రవారం ఆయా పాఠశాలల వద్ద ఆందోళనకు దిగారు. ఇరవై రోజులుగా మూతవేసిన పాఠశాలలను అధికారులు తెరిపించడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బడులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రియ చేపట్టడం దారుణమని మండిపడ్డారు. రీమ్యాపింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తేనే తమ పిల్లలను బడికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు గురుకులకండ్రిగ వాసులు ఈఓపీఆర్డీకి వినతిపత్రం అందించారు. -
ఏడాది పాలనపై కలెక్టర్ సంతృప్తి
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం వైఎస్సార్సీపీ సర్కార్ 2022 ఏప్రిల్ 4న జిల్లాల పునర్విభజన చేపట్టి తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. మొదటి కలెక్టర్గా వెంకట రమణారెడ్డి రెండేళ్లపాటు పనిచేశారు.ఆ తర్వాత లక్షీశ నెల రోజులు, అనంతరం ప్రవీణ్కుమార్ మూడు నెలలు, అనంతరం వెంకటేశ్వర్ ఏడాది పాటు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్లోని ఉద్యోగులు విభాగాల వారీగా శుక్రవారం కలెక్టరేట్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్లోని ఉద్యోగులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఏడాది పాలనపై శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా ఏడాదిపాటు తిరుపతి జిల్లా కలెక్టర్గా పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీని సందర్శించిన సిక్కీ బృందం శ్రీసిటీ (వరదయ్యపాళెం) : చైన్నెలోని దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్ఐసీసీఐ)కి చెందిన 22 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ పారిశ్రామిక కార్యకలాపాలు, ఇక్కడ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల అధ్యయనం, పెట్టుబడి అవకాశాల పరిశీలన దిశగా వీరి పర్యటన సాగింది. శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) బోడ్గన్ జార్జ్ బృంద సభ్యులకు స్వాగతం పలికారు. చర్చల సందర్భంగా శ్రీసిటీ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక స్థానం, వ్యాపారానుకూల పర్యావరణ వ్యవస్థకు సంబంధించి వారికి ప్రదర్శన ఇచ్చారు. శ్రీసిటీలో విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఈ పర్యటనపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దక్షిణ భారతదేశ వ్యాపార స్వరూపాన్ని రూపొందించడంలో సిక్కీ పాత్ర ఎంతో కీలకం, విలువైనదని వ్యాఖ్యానించారు. వివిధ రంగాలలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులతో కూడిన ఈ బృందం పరిశ్రమలను సందర్శించింది. సిక్కీ ప్రాజెక్ట్స్ హెడ్ ఆర్.శరణ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పర్యటన కొనసాగింది. ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన వళ్లియన్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. టాస్క్ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది 2019లో శేషాచలం అటవీ ప్రాంతం, నాగపట్ల బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నిందితుడు వళ్లియన్ ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నించాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
నేడు ఏపీపీఎస్సీ పరీక్ష
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. ఆయన శుక్రవారం పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం రోడ్డు సత్య ఎన్క్లేవ్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 472 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష మూడు సెషన్స్లో జరుగుతుందన్నారు. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు రెండో సెషన్, అదేవిధంగా సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదని వివరించారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ పరీక్షల అసిస్టెంట్ సెక్రటరీ రాజ్గోపాల్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేవీఎస్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఠాణాలోనే దళిత నేతపై దాడి పెళ్లకూరు : మండలంలోని పునబాక గిరిజన కాలనీకి చెందిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న దళిత నేత యాగాని బెన్నీపై అదే గ్రామానికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అమాస సాయి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న బెన్నీపై స్టేషన్లోనే నీలం నరసింహులు, రెడ్డి శ్రీనివాస్, సుమన్రెడ్డి, తాళ్ల నితిన్, నీలం రాజేష్ తదితరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను మోసగించే అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు ● 114 గ్రాముల బంగారం స్వాధీనం శ్రీకాళహస్తి : మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 లక్షలు విలువ గల 114 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ఇలా.. శ్రీకాళహస్తిలో గత ఏడాదిలో ఓ మహిళను బురిడీ కొట్టించి 58 గ్రాముల బంగారు కొట్టేసిన కేసులో నెల్లూరుకు చెందిన సునీత స్థానిక సచివాలయ ఉద్యోగి ఫిర్యాదు చేయగా వీరిని పట్టుకున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ ఒక బాలున్ని అడ్డం పెట్టుకుని మోసం చేసి డబ్బులు దోచుకోవడం, బంగారు నగలు ఇస్తే డబ్బులు ఇస్తామని తమ వద్ద బంగారు నగలు ఉన్నాయని మీ వద్ద బంగారు ఇస్తే కొత్త బంగారు ఎక్కువ ఇస్తామని మాయమాటలు చెప్పి నగలు, డబ్బులు అపహరిసున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండులో అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడు చోరీల్లో దోచుకున్న నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజక వర్గానికి చెందిన దుమ్మగూడ ప్రాంతంలో నివాసం ఉండే గుజరాతి కిషన్(24), న్యూఢిల్లీ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో ఉంటున్న ప్లాస్టిక్ పవ్వుల వ్యాపారం చేస్తున్న శ్యామ్లా(30)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిద్దరిపై తెలంగాణలో 7 కేసులు నమోదు అవ్వడంతో పాటు జైలుశిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, కడప, చిత్తూరులో మూడు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా తిరుపతి అర్బన్ : కొత్తగా రానున్న విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు అర్జున్, రమేష్కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. అలిపిరి, తిరుపతి, మంగళం డిపోల్లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లోని పదోన్నతులు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే డబుల్ డ్యూటీలు చేస్తున్న వారికి డీడీ అమౌంట్ పెంచాలన్నారు. విజయవాడలోని సీసీఎస్ ఆఫీస్ను బస్టాండ్కు 8 కిలోమీటర్ల దూరానికి మార్పు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండు చేశారు. ప్రధానంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్, ప్రచార కార్యదర్శి సతీష్నాయుడు, సత్యనారాయణ, ఆయా డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
దర్జాగా రేషన్ దందా
● ఆగని అక్రమ రవాణా ● మిల్లర్ల లైసెన్స్ పేరుతో టోకరా ● నకిలీ బిల్లులతో అక్రమ వ్యాపారం ● తమిళనాడు, ఏపీ రేషన్ బియ్యం తరలింపుసాక్షి టాస్క్ఫోర్స్ : పేదల నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతోంది. సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ పలు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని ఆంధ్రా, తమిళనాడు రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసుకుని వాటిని గోతాలు మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ఈ వ్యాపారాన్ని స్థానికంగా ఉన్న కొన్ని రైస్ మిల్లులను కేంద్రంగా చేసుకుని అక్రమ రవాణా సాగించేవారు. దీనివల్ల కలిగిన ఇబ్బందులతో ఈ వ్యాపారాన్ని మిల్లర్లు మానేయడంతో పట్టణంలో లైసెన్స్ల పేరుతో అక్రమంగా రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు. తమిళనాడు రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఉప్పుడు బియ్యం, ఏపీలోని రేషన్ దుకాణాల్లో ఇచ్చే ఆంధ్రా బియ్యంను బ్లాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి పట్టణంలోని పలు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ రేషన్ బియ్యానికి గోతాలు మార్చి మామూలు బియ్యం లాగానే బస్తాలను తయారు చేసుకుని ప్రతి రోజు ఇతర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు రవాణా చేస్తున్నారు. దీనికి నకిలీ బిల్లులు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి రోజూ చైన్నె నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న సబర్బన్ రైళ్లో చిన్న చిన్న బస్తాలుగా తయారు చేసి తమిళనాడుకు చెందిన కొంత మంది సూళ్లూరుపేటకు తెస్తున్నారు. ఇక్కడ కొంత మంది చిల్లర వ్యాపారాలు కొనుగోలు చేసి గోదాములో నిల్వ చేసుకుంటున్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న డీలర్లును కూడా మేనేజ్ చేసి రేషన్ బియ్యం బస్తాలను కొనుగోలు చేసి గోతాలు మార్చేసి అక్రమ రవాణా చేసేస్తున్నారు. కొనుగోళ్లు ఇలా.. తమిళనాడు ప్రాంతం నుంచి చిల్లరగా తెచ్చే రేషన్ బియ్యంను సూళ్లూరుపేటలో కొంత మంది కిలో రూ. 5 నుంచి 9 దాకా కొనుగోలు చేస్తారు. ఇలా రోజుకు సుమారు టన్నుకు పైగా కొనుగోలు చేసి గోతాలు మార్చి కొత్త బస్తాల్లాగా తయారు చేస్తారు. వీటితో పాటు తమిళనాడు పార్శిల్ ఆటోల ద్వారా అక్రమ రేషన్ బియ్యం తెస్తున్నారు. వీరి వద్ద నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి మిల్లర్లకు 15 నుంచి 20 రూపాయలు దాకా అమ్మేస్తారు. మిల్లర్లు ఆ బియ్యానికి పాలిష్ పట్టి మార్కెట్లోకి పంపించి కిలో 50 రూపాయల లెక్కన అమ్ముతారు.అదే విధంగానే ఏపీ రేషన్ బియ్యం కూడా ఇదే తరహాలోనే కొనుగోలు చేసి పాలిష్ పట్టి 25 కేజీల బస్తాలో సుమారు 8 కేజీలు దాకా పాలిష్ పట్టిన రేషన్ బియ్యం కలుపుతారు. ఇలా నెల్లూరు, విజయవాడ, మండపేట ప్రాంతాల్లో రైస్ మిల్లులకు తరలించి కోట్ల రూపాయలను ఆర్జిస్తుండడంతో అందరి చూపు ఈ అక్రమ రేషన్ వ్యాపారంపై పడింది. ఈ వ్యాపారంలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉండడంతో ఈ వ్యాపారాన్ని లక్షలాది రూపాయలు ముడుపులు పోలీసులు, విజిలెన్స్ వారికిచ్చి సజావుగా నడిపిస్తున్నారు. లెసెన్స్ బియ్యం వ్యాపారం దుకాణం పేరుతో ఈ అక్రమ వ్యాపారం చేస్తుండడం, అందరికీ నెల మామూళ్లు ఇస్తుండడంతో ఈ అక్రమ రవాణా గురించి తెలిసినా అధికారులు, పోలీసులు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు.ఒకవేళ లారీని పట్టుకున్నా 6ఏ కేసు నమోదు బియ్యం అక్రమ రవాణాలో పట్టుకున్నా ఆదాయమే. ఎందుకంటే కేసుల కోసం పోలీసులు ఒకటి రెండు లారీలను పట్టుకుంటారు. వాటిపై 6ఏ కేసు నమోదు చేసి నెమ్మదిగా బియ్యం లారీలను రిలీజ్ చేస్తారు. నామమాత్రంగా ఒకరిద్దరు మీద కేసులు పెడతారు. ఈ తంతు బియ్యం అక్రమ వ్యాపారాలు చేసే వారికి అలవాటుగా మారిపోయింది. అందుకే పోలీసులు దాడులు చేసి ఎన్ని లారీల బియ్యం పట్టుకున్నా సరే అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఆపడం లేదు. ఇందులో ఉన్న లొసుగులను ఔపోసన పట్టేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక వారి ఇచ్చిన నెల మామూళ్లు తీసుకుని కేసుల కోసం మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకటి రెండు లారీలను పట్టుకుని కేసులు పెడుతున్నట్టుగా చేతులు దులుపేసుకుంటున్నారు. వాటాల కోసం కూటమి నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యాపారంలో వాటాలు కావాలని కూటమి నేతలు పట్టుబట్టడంతో కొద్దిరోజులు వ్యాపారాన్ని అపేశారు. ఇందులో ఒక బ్యాచ్ ఆపకపోవడంతో వారి లారీలను కూటమి నేతలు పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత దీనిపై పెద్ద ఎత్తున రాజీ చర్చలు జరిగాయి. ఒక దశలో టీడీపీ అగ్ర నాయకులు దాకా కూడా ఈ వ్యవహారం వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్యాచ్ల మధ్య రాజీ కుదుర్చుకుని కూటమి నేతలకు నెల మామూళ్ల కింద వాటాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని అక్రమ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు. -
వైద్యాధికారుల విచారణ
సత్యవేడు : పంచాయతీ పరిధిలోని పల్లాపు వీధిలోని క్లినిక్, మెడికల్ స్టోర్ను దాసుకుప్పం పీహెచ్సీ డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీహెచ్ఓ సుబ్రమణ్యం కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. గురువారం సాక్షి దినపత్రికలో శ్రీకాలం చెల్లిన ఔషధాల పంపిణీశ్రీ వార్తకు మెడికల్ అధికారులు స్పందించారు. కాలం చెల్లిన మందుల విక్రయంపై విచారణ చేపట్టారు. డేట్ పరిశీలించకుండా పొరబాటున మందులు ఇచ్చానని, ఇకపై పొరబాట్లు చేయమని ఆర్ఎంపీ సమాధానం ఇచ్చారు. బాధితురాలు శోభారాణిని విచారించి వివరాలు సేకరించారు. తనిఖీ నివేదిక వివరాలను డీఎంహెచ్ఓకు పంపుతామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 640,15 మంది స్వామి వారిని దర్శించుకోగా 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. పీహెచ్సీలో ప్రసవాలు పెరగాలి బుచ్చినాయుడుకండ్రిగ : పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెరగాలని రాష్ట్ర వైటల్ స్టాటస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్రావు తెలిపారు. శుక్రవారం బుచ్చినాయుడుకండ్రిగలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ మృదులరాణి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్తో కలసి ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్స్ రికార్డులను, లేబొరేటరీలోని సౌకర్యాలను, పరికరాలను, ఫార్మసీ విభాగంలోని మందులను, పరిశీలించారు. ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామ సచివాలయాల వద్దనున్న క్లినిక్లలో వైద్యసేవలను సక్రమంగా అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మురళీధర్రెడ్డి, ఉదయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్యం నుంచే అల్లూరికి దేశభక్తి
● మన్యం వీరుడికి కలెక్టర్, ఎస్పీ నివాళులుతిరుపతి అర్బన్ : చిన్నతనం నుంచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు దేశభక్తి ఉండేదని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అల్లూరి 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. 1897 జులై 4న సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు జన్మించారని, అల్లూరి సీతారామరాజుకు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నిత్యం ధ్యానం, దైవపూజతో జీవనశైలి కొనసాగించిన ఆయన, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను తెలుసుకున్న ఆయన తెల్లదొరల రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజల్లో చైతన్యం నింపి, వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారని చెప్పారు. ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్, సుధారాణి పాల్గొన్నారు. తిరుపతి క్రైమ్ : స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులు పడాలి
తిరుపతి అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ వైపు రైతు సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు అడుగులు వేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ ఈడీ సతీష్ నేతృత్వంలో వారాహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు వర్క్ షాపు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, పలువురు చిరు వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికనుగుణంగా రైతు సంఘాల ప్రతినిధులు, చిరువ్యాపారులు మారాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం బిహార్ నుంచి విచ్చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అందిస్తున్న రాయితీలను వివరించారు. ఆహారంగా తీసుకునే అన్ని వస్తువులకు చెందిన చిన్నపాటి యంత్రాలను కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రాయితీలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీహెచ్ఆర్వో దశరథరామిరెడ్డి, రాస్ ప్రతినిధి ప్రభాకర్, డీపీఎం షణ్ముగం,వారాహి ఫౌండేషన్ డైరెక్టర్లు హరికుమార్రెడ్డి, ఎల్డీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా
సైదాపురం : ఆటోలో బతుకు దెరువు కోసం 10 మంది గని కార్మికులు కూలీ పనులకు వెళుతూ ప్రమాదశాత్తు పొలంలో బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు గని కార్మికులు గాయాలపాలయ్యారు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని పల్లెమిట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు ఇలా.. మండల కేంద్రమైన సైదాపురానికి చెందిన శ్రీనివాసులు ఆటో ద్వారా మండలంలోని తురిమెర్ల గ్రామ సమీపంలోని ఓగని పనులకు ప్రతి రోజు సైదాపురం నుంచి కూలీలను తీసుకుని పనులు ముగిసిన వెంటనే మళ్లీ స్వగ్రామానికి వస్తుండేవారు.ఈక్రమంలో శుక్రవారం ఉదయాన్నే 10 మంది గని కార్మికులతో సైదాపురం నుంచి గని పనులు జరిగే తురిమెర్లకు ఆటోలో బయలుదేరారు.సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట దగ్గరకు వచ్చే సరికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న రాధమ్మ, వెంకటమ్మ గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ పలువురు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది -
మహిళపై లైన్మెన్ దురుసు ప్రవర్తన
రేణిగుంట : తన కూతురు గర్భిణిగా ఉండడంతో హాస్పటల్లో చూపించుకునే క్రమంలో విద్యుత్ బిల్లు చెల్లింపులో జాప్యం అయిందని లైన్మన్కు చెబుతుండగా వినకుండా విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను నిలుపుదల చేశారు. మీరు ఇప్పుడు డబ్బులు చెల్లించినా రెండు రోజుల వరకు సరఫరా చెయ్యము మీకు దిక్కున చోట చెప్పుకోండి శ్రీఅంటూ దురుసుగా ప్రవర్తించిన సంఘటన రేణిగుంట మండలంలో చోటుచేసుకుంది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి పంచాయతీ, అంబేడ్కర్ కాలనీలో కనపర్తి సౌజన్య కొడుకు ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక లైన్మెన్ గోవిందరాజులు విద్యుత్ బిల్లు చెల్లించలేదని సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో నిండు గర్భిణి అయిన కూతురు, కొడుకుతో చిమ్మ చీకటిలో ప్రస్తుతం కాలం వెల్లదీస్తున్నారు. ఆన్లైన్లో 7 గంటలకు కరెంట్ బిల్లు చెల్లించామని, జేఎల్ఎంకు ఫోన్ చేయగా లైన్మన్ రెండు రోజుల వరకు కరెంటు ఇవ్వద్దని చెప్పాడని అన్నారు. ఉన్నతాధికారులు దయ ఉంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
● సుపరిపాలన కార్యక్రమంలో ప్రమాదం నాయుడుపేట టౌన్ : కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి షామియాన వేస్తున్న వ్యక్తి కందుకూరి మునీశ్వర్(45) విద్యుదాఘాతానికి గురై గురువారం మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని మహాలక్ష్మమ్మ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. తుమ్మూరుకు చెందిన మునీశ్వరయ్య అక్కడ హైరర్స్కు చెందిన యజమానికి స్నేహితుడు కావడంతో మహాలక్ష్మమ్మ నగర్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి షామియానా వేసేందుకు కార్మికులతో కలిసి వెళ్లాడు. లేదోటమ్మ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమానికి షామియానా వేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అప్పటికీ స్థానికులు అతడిని ప్రైవేట్ అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మునీశ్వరయ్య మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని మహాలక్ష్మమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహా లక్ష్మమ్మ కాలనీలో విద్యుత్ వైర్లు ఇళ్లపైనే వేళాడుతూ.. చేతికందే ఎత్తులో ఉన్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు పేద కుటుంబానికి చెందిన మునీశ్వర్కు భార్య లలిత, రోహిణి, బిందు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వర్ ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో వారి బోరున విలపించారు. సంఘటన స్థలంతో పాటు వైద్యశాల వద్ద లే.. డాడి అంటూ కుమార్తెలు రోదించిన తీరును చూసి చలించిపోయారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మునీశ్వర్ మృతి చెందడం బాధాకరమని, ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని అంత్యక్రియల కోసం రూ 50 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు. అదే విధంగా మృతుడి ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్ తదితరులు ఉన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు. -
సర్వ దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధ రాత్రి వరకు 74,510 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
బీఎస్ఎన్ఎల్ అవగాహన సదస్సు రేపు
తిరుపతి సిటీ: తిరుపతి బిజినెస్ ఏరియా, భారత్ టెలికాం నియంత్ర సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ వెంకోబరావు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ హైజన్, సైబర్ మోసాల నివారణ అనే అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పలు అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వినండహో.. ఇది గ్రామస్తుల హెచ్చరిక – ఇసుక ట్రాక్టర్ వస్తే..రూ.1000 జరిమానా తిరుపతి రూరల్ : ఆ దారిలో ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు.. అలా కాదని వస్తే.. రూ.1000 జరిమానా విధించబడును.. అంటూ గ్రామ పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.. బోర్డు పెట్టడమే కాదు.. ఆ గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లు వస్తే అందరూ ఏకమై అడ్డుకుంటున్నారు. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఇరుకు రోడ్లు ఉన్నప్పటికీ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి పిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలన్నా ఇబ్బంది పడేవారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులతో కలసి తమ గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్ వస్తే రూ.1000 లు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా సరే రాత్రివేళ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇసుక ట్రాక్టర్లు వస్తే రూ.1000 కచ్చితంగా వసూలు చేస్తుండటంతో చాలా మంది ఇసుక అక్రమార్కులు ఆ గ్రామం మీదుగా ట్రాక్టర్లు తీసుకురావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఏటీఎం కార్డు దొంగ అరెస్ట్
రేణిగుంట : ఏటీఎం సెంటర్ల వద్ద కార్డులు దొంగిలించి డబ్బులను విత్ డ్రా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ మంజునాథరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి జిల్లాలో పలు ఏటీఎంల వద్ద కార్డులను దొంగలించి, వారికి తెలియకుండా డబ్బులు విత్ డ్రా చేసేవాడని తెలిపారు. మే నెల 16వ తేదీ శెట్టిపల్లి ఎస్బీఐ వద్ద ఇదే తరహాలో దొంగతనం చేశాడని అన్నారు. ఎల్లమండ్యం ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు. అతడి వద్ద వివిధ రకాల ఏటీఎం కార్డులు ఒక స్వైపింగ్ మిషన్, మొబైల్ ఫోన్, రూ.6000 డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ నిమిత్తం తిరుపతి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సిబ్బంది మహేంద్ర, మణి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కత్తితో దాడి
ఏర్పేడు : మండలంలోని గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీలో గురువారం ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో నరికి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సీతారాముడు మద్యం తాగి వీధిలో వెళుతూ, పక్కన కూర్చుని ఉన్న కేశవులు(45)ను మద్యం మత్తులో కత్తితో తలపై నరికాడు. తలపై బలమైన రక్తగాయం కావడంతో కేశవులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత కక్షలేవైనా.. ఉన్నాయా.. మద్యం మత్తులో నరికాడా.. అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నేడు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తిరుపతి సిటీ : ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూసిన విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం ఇస్తూ 18 వరకు వెబ్ ఆప్షన్లకు ఎంట్రీకి అవకాశం కల్పించనున్నారు. 22న సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయనున్నారు. 23 నుంచి 26వ తేదీ వరకు సీట్లు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగష్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి 27 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్షలు నిర్వహించగా జూన్ 8న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు నెల రోజుల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుండటం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు పొందిన విషయం తెలిసిందే. -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన 3వ అంతర్జాతీయ సమావేశం -
వివాహిత అనుమానాస్పద మృతి
– భర్త, కుటుంబ సభ్యులే చంపారంటూ ఆందోళన తడ : మండలంలోని అక్కంపేటలో గురువారం చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వివాహిత శిల్ప(26) అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. తమ బిడ్డ మృతికి భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఉరి వేసినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తొలుత అక్కంపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చెయ్యడంతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం తడ పోలీస్ స్టేషన్కు చేరుకుని శిల్ప ఫొటోలతో ఆందోళన చేశారు. ఎస్ఐ కొండపనాయుడు ఆందోళన చేస్తున్న వారిని సర్దుబాటు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కాలం చెల్లిన ఔషధాల పంపిణీపై ఫిర్యాదు సత్యవేడు : సత్యవేడుకు చెందిన శోభారాణి బుధవారం రాత్రి ఓ క్లినిక్కు వెళ్లగా కాలం చెల్లిన మాత్రలు అంటగట్టారని డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. సత్యవేడులోని ఓ క్లినిక్కు వెళ్లి మెడికల్ షాపులో ఐదు రకాల మాత్రలు ఇచ్చారని, అందులో రెండు మాత్రలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. దీనిపై శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై దాడి
చంద్రగిరి:వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా చంద్రగిరి మండలంలో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. మహిళా సర్పంచ్ కుటుంబంపైన, ఆతర్వాత దళిత మహిళపై దాడి ఘటనలు మరువక ముందే దళిత నాయకుడు, వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురానికి వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీ సభ్యురాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రవీణ్కుమార్పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలో జాతర నిర్వహణపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రవీణ్, గ్రామంలోని వెంకటరమణకు ఫోన్చేసి జాతర వివరాలను అడిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త అమ్మగుంట శీను, వెంకటరమణ వద్ద నుంచి ఫోన్ లాక్కుని ప్రవీణ్ను నానా దుర్భాషలాడాడు. ‘‘నువ్వు ఇక్కడు రారా.. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. నిన్ను ఇక్కడ చంపకపోతే చూడు రా.. నా...’’ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికి ప్రవీణ్ గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు. వెంటనే అక్కడే ఉన్న కర్రలతో అమ్మగుంట శీను ఒక్కసారిగా ప్రవీణ్పై దాడికి తెగబడ్డాడు. దీంతో ప్రవీణ్ తల పగిలి, తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్థానికులు శీనును నిలువరించి, ప్రవీణ్ను హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన టీడీపీ కార్యకర్త చంద్రగిరిలో క్షీణిస్తున్న శాంతి భద్రతలువైఎస్సార్సీపీలో ఉన్నాననే నాపై దాడి వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తుడడంతోనే తన పై టీడీపీ కార్యకర్త దాడికి తెగబడ్డాడని బాధితుడు ప్రవీణ్ వాపోయారు. టీడీపీ నేతలు తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకే రక్షణ కరువైతే సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
సమ్మెకు తాత్కాలిక బ్రేక్
● రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్ కార్మికులు తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అత్తపై అల్లుడు దాడి ● అత్తకు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు. ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి గూడూరు రూరల్ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూ రు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి. – చంద్రశేఖర్, ప్రగతి సంస్థ మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థలో విద్యార్థుల మరుగుదొడ్లు (ఇన్సెట్) దెబ్బతిన్న బాత్రూమ్ తలుపులు ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’ శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు. పర్యవేక్షణ లోపించి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు కక్కుర్తి చూపుతూ విద్యార్థులను అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది ఆస్పత్రికి చేరారు. తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. వార్డెన్ సస్పెన్షన్ – ఇన్చార్జిగా విజయ శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్చార్జిగా విజయను నియమించారు. వంట మనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
మామిడి..
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో..మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని ఐఐటీ డెరెక్టర్ అన్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి వైఎస్సార్సీపీ నరసింగాపురం పంచాయతీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్పై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడిచేశాడు. ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవంశుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025– 8లోతిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మారానని చెప్పి .. ధర పెంచకుండా మారాం చేస్తున్నారు! ఆర్కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, సునీల్కుమార్, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోట రాజేష్, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ నేతలుతపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డెవలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ కుమార్ను 93907 36277 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తిరుపతి ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి ఏరియా బాలాజీనగర్, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఐఐహెచ్టీ స్పాట్ అడ్మిషన్లు వెంకటగిరి రూరల్:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్డీ గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు. తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ఉపాధ్యక్షులు పవన్ జి చందక్, కౌన్సిల్ సభ్యుడు సీఎస్ మోహన్ కుమార్, సీఎస్ వెంకటరమణ, ఐసీఎస్ఐ ఎస్ఐఆర్సి చైర్మన్ సీఎస్ మధుసూధనన్, ప్రీతి కౌశిక్ బెనర్జీ పాల్గొన్నారు. – 8లో– 8లోన్యూస్రీల్నష్టాల్లో మామిడి రైతు మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు ఏ ప్రాంతానికెళ్లినా జన సునామీనే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో మామిడి రైతులు మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామి డి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడి యాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు. ‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వి యా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్సీ వైద్యాధికారిణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యా బోధన తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది. తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు. ఎయిడెడ్కు అందించాం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తెరిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది. –కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), తిరుపతి త్వరలోనే అందిస్తాం టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయితే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ కారణంతోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పాఠ్యపుస్తకాలను అందిస్తాం. –వెంకట సునీల్, టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి -
వీసీ కోసం వెతుకులాట!
● ఎస్వీయూ వైస్ చాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీలు తిరుపతి సిటీ : ఎస్వీయూ వీసీ నియామకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడాదిగా పూర్తి స్థాయి వైస్ చాన్సలర్ను నియమించేందుకు ఇప్పటికే రెండు సార్లు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సమావేశమైన రెండో సెర్చ్ కమిటీ ఓ మంత్రి తోడల్లుడు సిఫార్సు చేసిన రెండు పేర్లతో పాటు ప్రస్తుత ఇన్చార్జి వీసీ పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై తమ వారిని పక్కన పెట్టారని కూటమిలో భాగమైన ఓ ప్రధాన పార్టీ నేత మండిపడ్డట్టు సమాచారం. ఈక్రమంలో వీసీ నియామక ప్రక్రియ సందిగ్ధంలో పడింది. మొదటి, రెండో సెర్చ్ కమిటీ సమర్పించిన నివేదికలను రద్దు చేసి ప్రస్తుతం మరోసారి మూడో సెర్చ్ కమిటీని నియమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రాంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒత్తిడిలో కమిటీలు ప్రధానంగా ఎస్వీయూ వీసీ నియామకంపై ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలపై రాజకీయ ఒత్తిడి అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే సెర్చ్ కమిటీలో సభ్యులుగా తమను ఎంపిక చేయవద్దని పలువురు ఉన్నత విద్యామండలి అధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. ప్రతిభ, అనుభవం, సామాజిక వర్గ సమీకరణల ప్రాతిపదికన వీసీ నియామకానికి సమర్థులైన ముగ్గురు వ్యక్తులను సెర్చ్ కమిటీ ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఎస్వీయూకు పూర్తి స్థాయి వీసీ నియామకం జరిగేలా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. -
నగదు చెల్లించలేదని నిరసన
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం సమీపంలోని రెడ్డిగుంట వద్ద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన దళితుల భూములను తమిళనాడుకు చెందిన కొందరు భూస్వాములు కొనుగోలు చేశారు. సుమారు 60 మంది రైతులు 60 ఎకరాలను ఏడాది క్రితం విక్రయించారు. ఎకరా రూ.17 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూస్వాములు, ఒక్కో రైతుకు రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన రూ.2 లక్షల సొమ్మును చెల్లిస్తామని నమ్మబలికారు. అయితే ఈ ఏడాది గడిచిపోయినా పెండింగ్ నగదు చెల్లించకనే కొనుగోలు చేసిన భూముల్లో ప్రహరీగోడ పనులను చేపట్టారు. బుధవారం ఈమేరకు బాధిత రైతులు అక్కడకు వెళ్లి నిర్మాణ పనులు చేపట్టుకోవాలని పనులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయి నగదు చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు అక్కడే నిరసన తెలిపారు. -
బడి కోసం..ఆగని పోరాటం
నాయుడుపేటటౌన్ : పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలు విద్యాభ్యాసం చేసే ప్రాథమిక పాఠశాలలను మోడల్ బడుల్లో విలీనం చేసేందుకు తెగబడుతోందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని బడిలో ఉన్న 3,4,5 తరగతులను చదివే విద్యార్ధులను తుమ్మూరు మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నిరసన తెలిపారు. బడికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయిని ప్రేమలీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మునిరత్నం హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. నచ్చజెప్పి పాఠశాలకు తాళం తీయించారు. ఈ సందర్భంగా స్కూల్కమిటీ చైర్పర్సన్ నిర్మల మాట్లాడుతూ 25 మంది విద్యార్థులను తుమ్మూరులోని పాఠశాలకు పంపడం దారుణమన్నారు. రైలు పట్టాలు దాటుకుని పిల్లలు అంత దూరం వెళ్లలేరని స్పష్టం చేశారు. హైవేపై ధర్నా నారాయణవనం: మా పిల్లలు మా ఊరి బడిలోనే చదవాలంటూ బుధవారం మండలంలోని ఇప్పన్తాంగాళ్ దళితవాడ పాఠశాల పిల్లలు, తల్లులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. 14 మంది విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలోని డీకే పాళ్యం మోడల్ స్కూల్కు పంపడానికి ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీఎస్పీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి ధనుంజయ మాట్లాడుతూ బడుల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. -
కొలువుల కోత
● రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల కుదింపు ● ప్రశ్నార్థకంగా ఉద్యోగుల భవిత ● ప్రభుత్వ వైఖరిపై సిబ్బంది ఆగ్రహం తిరుపతి అర్బన్ : క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, సత్వరమే సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కక్షగట్టింది. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోని 691 సచివాలయాలను 353కి తగ్గించింది. అదే క్రమంలో 5,625 మంది సిబ్బందికి గాను 3,650 మందికి మాత్రమే ప్రస్తుత బదిలీల్లో పోస్టింగ్ ఇచ్చింది. మిగిలిన 1,975 మంది సచివాలయ సిబ్బంది భవితను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉద్యోగుల తగ్గింపు! సచివాలయాల్లోని ఒక్కో విభాగంలో 30 నుంచి 80 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఒక్కో సచివాలయంలో 30 విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో భారీగా కోత విధించినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన బదిలీల్లో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే రేషనలైజేషన్ నేపథ్యంలో ఖాళీలు లేవని...ఏదో ఒకచోట సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు వారంతా రిజర్వులోనే ఉండాల్సిన దుస్థితి దాపురించింది. నిబంధనలకు నీళ్లు ఇటీవల చేపట్టిన బదిలీల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందామని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కూటమి నేతల సిఫార్సు ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అలాగే లంచాలు ముట్టజెప్పిన వారికి సైతం ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. మిగిలిన వారిని పట్టించుకోకుండా రిజర్వులో పెట్టేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేతనం కూడా నిలిపేసే ప్రమాదముందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.డివిజన్ గతంలో ప్రస్తుతం సచివాలయాల సంఖ్య తిరుపతి 245 125 శ్రీకాళహస్తి 154 82 సూళ్లూరుపేట 137 68 గూడూరు 155 78 మొత్తం 691 353జిల్లా సమాచారం -
అక్రమ అరెస్ట్ పై ఆగ్రహం
తిరుపతి రూరల్ : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని, ఆయన కుమారుడు మోహిత్రెడ్డిపై సైతం కక్షగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామాన్ని కాపాడు మహాత్మా అంటూ.. బుధవారం భాకరాపేటలోని పార్టీ కార్యాలయం నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి సీడీసీఎంస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. సహదేవరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, జగనన్న సైనికులను జైలుకు పంపి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సిట్ అధికారులు లిక్కర్ కేసులో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, దీనికి భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఎంపీపీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను బిడ్డల్లా చూసుకున్న చెవిరెడ్డికి కష్టం వస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యుడికే వచ్చినట్టు బాధపడుతున్నారని తెలిపారు. సింహాల మోహన్ మాట్లాడుతూ చెవిరెడ్డిపై ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ యశోద, రామచంద్రాపురం జెడ్పీటీసీ సభ్యులు ఢిల్లీరాణి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, భాకరాపేట సర్పంచ్ భూపాల్, యూత్ అధ్యక్షుడు మునిరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు. ● భాకరాపేటలో భారీ ర్యాలీ.. నిరసన -
స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు
అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తిరుపతి అర్బన్: స్వర్ణ నారావారిపల్లి–2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి ఇప్పటి వరకు చేపట్టిన అంశాలు, చేయాల్సిన పనులపై ప్రత్యేక అధికారి, డీపీఓ సుశీలాదేవిని ప్రశ్నించారు. ఆమె చేపడుతున్న పనులను వివరించారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రుణాల మంజూరు, వ్యవసాయ రంగానికి సంబంధించి కిచెన్ గార్డెనింగ్, టెరరస్ గార్డెనింగ్పై గుర్తించిన కుటుంబాలకు శిక్షణ ఇవ్వడం, రైతుల పొలాల్లో కిట్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ ఏడీ ప్రసాద్, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్, మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నరేంద్రబాబు, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా
ఓజిలి: నెల్లూరు– చైన్నె జాతీయ రహదారిపై పెదపరియ క్రాస్ సమీపంలో బుధవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి చైన్నెకు గ్యాస్లోడ్తో లారీ వెళుతోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగింది. అయితే గ్యాస్ లీక్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాలువ కట్ట కింద మృతదేహం డక్కిలి : మండల కేంద్రానికి సమీపంలో తెలుగు గంగ కాలువ కట్ట కింద ఓ వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఆలస్యంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో కట్టపై వాకింగ్ చేస్తున్న వారు అక్కడి ముళ్లపొదల్లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివ శంకర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అన్నంరాజుపల్లెకు చెందిన కోండూరు రవీంద్రరాజు (60)గా గుర్తించారు. మృతుడు రెండు రోజులు కిందట దేవునివెల్లంపల్లి స్తంభాలగిరీశ్వరయ్యస్వామి ఆలయంలో అవధూత గురుకల పోలయ్యస్వామి ఆరాధన మహోత్సవానికి వచ్చాడని, అతిగా మద్యం తాగడంతో మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి : మండలంలోని తొండమనాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన పూజారి శోభన్బాబు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి తిరుపతి వైపు చేపల లోడ్తో వెళుతుండగా తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభన్బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పచ్చనేతను వదిలేసి.. పక్కనోళ్లపై కేసు చంద్రగిరి : మండలంలోని జరిగిన ఓ దాడి కేసులో అసలు సూత్రధారి అయిన పచ్చనేతను పోలీసులు వదిలేసి, ఆయనతో కలిసి వెళ్లిన వారిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. సోమవారం ఏ.రంగంపేటలో మద్యం దుకాణం వద్ద స్థానిక టీడీపీ నేతకు, నారావారిపల్లెలోని మరో నేతకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన టీడీపీ నేతను ఆయన ఇంటికే వెళ్లి, నారావారిపల్లెకు చెందిన నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పగ పెంచుకున్న రంగంపేట టీడీపీ నేత, కొంత మంది యువకులతో కలసి నారావారిపల్లెలోని టీడీపీ నేత ఇంటికి వెళ్లి దాడికి దిగారు. దీంతో ఆ నేత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గొడవకు ప్రధాన కారణమైన ఏ.రంగంపేట టీడీపీ నేతను ఫిర్యాదులో తప్పించి, ఆయన వెనుక వెళ్లిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారిని వదిలేసి, అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నారు. నేటి నుంచి తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ సదస్సు ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఐఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. నిర్మాణ రంగం మెటీరియల్, టెక్నాలజీ, హెల్త్ మానిటరింగ్, రెట్రోఫిట్టింగ్, స్మార్ట్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించనున్నారు. -
అరణియార్లో చేపల వేటపై నిషేధం
నాగలాపురం : పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టులో ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, ఎఫ్డీఓ మధుసూదన్రావు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో రెండు నెలల పాటు వేటను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఆదేశాలను అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సహకరించాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన 19–34 ఏళ్ల వారు మాత్రమే అర్హులని వెల్లడించారు.ఆసక్తిగలవారు సదరన్ సర్టిఫికెట్తోపాటు ఆధార్కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో తిరుపతిలోని భవానీ నగర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో యూత్ ఫర్ జాబ్స్ కార్యాలయానికి రావాలని కోరారు. ఇతర వివరాలకు 9347411952 నంబర్లో సంప్రదించాలని సూచించారు. హస్త కళాకారులకు అండగా ఉంటాం తిరుపతి అర్బన్ : జిల్లాలోని హస్త కళాకారులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసువులేటి హరిప్రసాద్తో కలిసి డీఆర్డీఏ, డీఐసీ, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్ , హ్యాండ్ లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హస్త కళంకారీకి మార్కెట్ కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం నినాదంతో కళాకారులకు చేయూతనందిస్తామన్నారు. అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల ఏడీ సత్యమూర్తి, చేనేత వస్త్రాల ఏడీలు రమేష్, వెంకట రావు,ి మూర్తి, ఎల్డీఎం రవికుమార్, పర్యాటకశాఖ ఆర్డీ రమణ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు తిరుపతి అర్బన్ : జిల్లాలో డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జూన్ 6 నుంచి మొత్తం 8 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 33,181 మంది అభ్యర్థులకు గాను 30,952 మంది హాజరైనట్లు వెల్లడించారు. 2,229 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసేందుకు సహకరించివన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారం తిరుమల : తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల ధరలపై సోషల్ మీడియాల్లో సాగుతోందని అసత్య ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు వార్తలను వైరల్ చేసి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది. భక్తులకు ఎలాంటి సమాచారం కావల్సి వచిన్నా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, కాల్ సెంటర్ 180042 54141కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించింది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
రెచ్చిపోతే సహించం
తిరుపతి మంగళం/ చంద్రగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడుల్లో గాయపడిన పనపాకం, ముంగిలిపట్టు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలను బుధవారం ఆయన పరామర్శించారు. భూమన మాట్లాడుతూ పనపాకంలో దళిత కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేత అజయ్ ఆయన భార్య రోజాతో పాటు వారి సోదరిపై టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేశారన్నారు. బాధితుల దుస్తులు చించివేసి, చెప్పు కాళ్లతో తన్ని విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లేడని, ఇక జైలు నుంచి రాడని, చెవిరెడ్డి మోహిత్రెడ్డి నియోజకవర్గంలో లేడనే ధైర్యంతో పచ్చమూక రెచ్చిపోతోందని, ఇకపై వారిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ నేత సుబ్రమణ్యం నాయకుడు కక్షగట్టి, కళ్లలో కారం కొట్టి అజయ్, ఆయన సతీమణి రోజాపై దుర్మార్గంగా దాడి చేశాడన్నారు. అలాగే ముంగిలిపట్టు సర్పంచ్ భారతి, ఆమె భర్త దామోదర్నాయుడు, కుమారుడు భార్గవ్పై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ తాళిబొట్టు కూడ తెంచేసి కుమారుడు భార్గవ్ చెయ్యి విరిచేశారన్నారు. ఈ క్రమంలో మాకు అధికారం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చూపే తీవ్రత ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమచంద్రకుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, నేతలు పొర్లపల్లె చంద్రశేఖర్రెడ్డి, అగరాల భాస్కర్రెడ్డి, మస్తాన్, దేవారెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్రెడ్డి, ఒంటి శివ, కొత్తపాటి కోటి, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, ప్రవీణ్, సూరి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటాం టీడీపీ గూండాల దౌర్జన్యాలను అడ్డుకుంటాం దళితులు, మహిళలపై దాడి అమానుషం బాధితులను పరామర్శించిన భూమన -
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్మోహన్రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
● అక్రమ అరెస్ట్పై ఆగ్రహం
8లో..చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా బుధవారం భాకరాపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయిఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
యూరియా.. ఏదయా..?
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి సాయంగా అందించాల్సిన అన్నదాతా సుఖీభవ నిధుల సంగతి దేముడెరుగు, కనీసం సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు సంగతి నామమాత్రమేనని చర్చ సాగుతోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు 80వేల ఎకరాల్లో వరి పంట సాగు చేపట్టారు. ఇందుకోసం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 7,500 మెట్రిక్ టన్నుల యూరియాను అందించినట్లు చెబుతున్నారు. రైతులకు 27,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రైవేటు వ్యాపారులు 17,500 మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు తెలుస్తుంది. అయినప్పటికి మరో 10వేల మెట్రిక్ టన్నులు యూరియా అన్నదాతలకు అవసరమవుతోంది. ఈ సీజన్లో పంట చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు వేయాల్సిన యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా యూరియా బస్తా రూ. 266.50కి విక్రయించాల్సి ఉంది. అయితే కొందరు ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి, బస్తా యూరియాను రూ. 285 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనల హోరు
చంద్రగిరి: ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధినేత వైఎస్ జగన్కు వివరించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు, అక్రమాలపై అధినేతకు వివరించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించినట్లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విధుల నుంచి ఉపాధ్యాయుడి తొలగింపు బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్ల ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్న హరిబాబును విధుల నుంచి తొలగిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు రమణయ్య మంగళవారం తెలిపారు. హరిబాబు 02.08.2017 నుంచి 26.08.2024 వరకు 7 సంవత్సరాల 25 రోజులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై విచారణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏడాది కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకుంటే ఆయన్ను ప్రభుత్వ సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. 30.06.2025 నుంచి హరిబాబును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. రేపు అన్ఎయిడెడ్ బంద్ తిరుపతి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు గురువారం బంద్ చేపడుతున్నట్లు అపుస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలను నిరసిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నియమాలు సరిగ్గా పరిశీలించకుండా ఎటువంటి నోటీసులు, చర్యలకు ఉపక్రమించకూడదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తరిగిపోతున్న పింఛన్లు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు కూడా కరిగిపోతున్నాయి. గత ఏడాది జూన్లో జిల్లాలో 2,71,183 మందికి సామాజిక పింఛన్లు అందించారు. ఈ ఏడాది జూలైలో 2,59,732 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. కూటమి పాలనలో జిల్లాలో 11,451 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా సుమారుగా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే, పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. మరోవైపు జిల్లాలో గత ఏడు నెలలుగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.6వేలు పింఛన్లు తీసుకుంటున్న వారిని తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగించేస్తారోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రూ.4వేలు పింఛన్ తీసుకుంటున్న వారిని జూలైలో తనిఖీలు చేస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా జిల్లాలో పింఛన్ల ఏరివేత కొనసాగుతోందన్న విషయం మాత్రం తేలిపోయింది. వితంతు పింఛన్లకు కొత్త మెలిక వితంతు పింఛన్లలో జాప్యం లేకుండా గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు 7వేల మంది ఉన్నట్లు ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. వీరికి పింఛన్లు వస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. -
భార్య పుట్టింటికి.. భర్త ఆత్మహత్మ
చిల్లకూరు : భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు తిప్పగుంటపాళెంలో మిక్సెడ్ కాలనీకి చెందిన తాటిపర్తి ఏడుకొండలు(25)కు ఉషాతో వివాహమైంది. కొంత కాలంగా సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు చోటు చోసుకోవడంతో 8 నెలల క్రితం ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రోజున స్థానికులకు కనిపించిన ఏడుకొండలు తరువాత కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పరిశీలించగా, ఇంటిలోపలి నుంచి గడియ వేసి ఉంది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు తీసి లోపలకు వెళ్లిన పోలీసులు కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 95.89 శాతం పంపిణీ తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ మంగళవారం తొలి రోజు 95.89 శాతం మందికి అందించినట్లు డీఆర్డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. జూలై నెలకు 2,59,732 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా, 2,49,054 మందికి అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి బుధవారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తిరుపతి క్రైం: శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆరుసార్లు చోరీలకు పాల్పడిన ముగ్గురిని సోమవారం సాయంత్రం శ్రీకాళహస్తి మిట్ట కండ్రిగ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు తమిళనాడు రాష్ట్రం, వందలూరు కండ్రిగకు చెందిన మూతం మని మారన్ అలియాస్ మనీ(27), వెంకటగిరి చెందిన మారి మాణిక్యం(25), శ్రీకాళహస్తికి చెందిన కొట్టం బేటి రాజా(20)గా తేలిందన్నారు. వీరి నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 139 గ్రాముల బంగారు, హీరో స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు, క్రైమ్ పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. 55 మందిపై నిఘా జిల్లా వ్యాప్తంగా 55 మంది చెయిన్ స్నాచర్లపై నిఘా పెట్టమని ఎస్పీ పేర్కొన్నారు. వారిలో ఇప్పటికే 40 మందిని పూర్తిస్థాయిలో గుర్తించామన్నారు. వీరందరిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాడుబడ్డ గృహాల వద్ద ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ డ్రోన్ కెమెరాలకు దొరికారన్నారు. వీరందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి, కేసులు నమోదు చేశామన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
తిరుపతి క్రైమ్: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీటీడీ విజిలెన్స్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన సతీమణి అమ్ములుకు రూ.5 లక్షల డీడీని ఎస్పీ అందజేశారు. విరమణ పొందిన హోంగార్డుకు సత్కారం జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకటరమణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు వేతనం రావలసిన రూ.5 లక్షలు అందజేశారు. -
ఘనంగా సీజీఎస్టీ వార్షికోత్సవం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): తిరుపతిలోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) కమిషనరేట్ పరిధిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కార్యాలయ ఆవరణలో శ్రీసరళీకృత పన్నులు, పౌరుల సాధికారత్ఙ అనే థీమ్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పన్నుల చెల్లింపులలో అగ్రశ్రేణి సంస్థలుగా గుర్తించిన ఏడింటిలో శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.దినకరన్ సమక్షంలో గుంటూరు సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ ఎంపిక చేసిన సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. 30 వరకు జన సురక్ష తిరుపతి అర్బన్: జన సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 774 పంచాయతీల్లోనూ ఈ నెల1 నుంచి 30 వరకు జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరో సమావేశంలో జేసీ శుభం బన్సల్తో కలిసి మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా డిసిప్లినరీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
రీ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేనందున రీ కౌన్సెలింగ్ చేయాలంటూ మహిళా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సంరక్షణ కార్యదర్శులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఉద్యోగ సంఘం మహిళా నేతలు విజయలక్ష్మి, నజ్మా, జ్ఞానాంబిక, శాంత కుమారి తదితరులు మాట్లాడారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల్లో పారదర్శకత లేదని చెప్పారు. రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు. వార్డు పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క వార్డుకు, మండల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. ప్రధానంగా పంచాయితీల్లో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి కాకుండా 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తిగా సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని అందించారు. దీంతో ఆయన చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఫోన్ చేసి మాట్లాడి, సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఉద్యోగులు దివ్యభారతి, కుమారి, నిహారిక, యోగప్రియ, లక్ష్మీప్రసన్న, లావణ్య, కళ్యాణి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబడిన చైన్స్నాచర్
సత్యవేడు: వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకుని పారిపోతున్న దుండగుడిని స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు పంచాయతీ పరిధిలోని పాపానాయుడు పేట వీధిలో కే.నాగమ్మ(85) మంగళవారం ఉదయం మార్కెట్కు వెళ్లింది. తిరిగి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఈమె పరిస్థితి గమనించిన తమిళనాడులోని నేమళ్లూరుకు చెందిన ఈ.ప్రదీప్ వెంబడించాడు. పాపానాయుడు వీధి సమీపంలో జనసంచారం తక్కువ ఉండడంతో ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని పరుగు తీశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంబడింయి చాముండేశ్వరి థియేటర్ సమీపంలో పట్టుకొని, ఎస్ఐ రామస్వామికి అప్పగించారు. బాధితురాలికి బంగారు గొలుసును అప్పగించారు. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న యువకుడు జగన్ను పోలీసులు అభినందించారు. -
కాళంగినదిలో మునిగి వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: కాళంగి నదిలో నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు, గ్రామానికి చెందిన బాబురెడ్డి (54) గేదెలను పోషణతో జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కాళంగి నది సమీపంలోని పొలాల వద్దకు గేదెలను తోలుకుని వెళ్లారు. గెదేలు నదిలోకి దిగి రాకపోవటంతో వాటిని బయటకు తీసురావటానికి నీటిలో దిగాడు. అయితే ఈతరాని బాబురెడ్డి నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన అక్కడి రైతులు బాబురెడ్డిని నీళ్ల నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందడంతో వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాబురెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ విశ్వనాథనాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష
తిరుపతి సిటీ: ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష పేరుతో చేపట్టిన ఇంటర్వ్యూలు అగ్ని పరీక్షలుగా మారాయి. గత విద్యా సంవత్సరంలో అకడమిక్ కన్సల్టెంట్లు, కో–ఆర్డినేటర్ల పనితీరుపై వీసీ చాంబర్లో మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటర్వ్యూలకు వీసీ, రిజిస్ట్రార్తో పాటు పలు విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. సంబంధిత సబ్జెక్ట్లో కమిటీ సంధించిన ప్రశ్నలకు అకడమిక్ కన్సల్టెంట్లు వైట్బోర్డ్పై డెమో ఇచ్చారు. తొలిరోజు పలు విభాగాల్లో పనిచేస్తున్న 43మంది తాత్కాలిక అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరై పనితీరు పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఎస్వీయూలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో పెద్ద సంఖ్యలో అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించే వ్యూహంలో భాగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూలకు పలు విభాగాల నుంచి మరో 200మంది అకడమిక్ కన్సల్టెంట్లు హాజరుకానున్నారు. -
మేయర్కు దక్కని గౌరవం
● పార్లమెంటు జాతీయ స్థాయి సదస్సుకు మేయర్లు, చైర్ పర్సన్లకు ఆహ్వానం ● తిరుపతిలో మేయర్ పేరును విస్మరించిన కూటమి ప్రభుత్వం ● ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ పేరు ప్రతిపాదన ● కూటమి నేతల తీరుపై విమర్శల వెల్లువ తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక తొలిసారి మేయర్ ఎన్నికలను 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించింది. మేయర్ స్థానం ఓసీ మహిళ రిజర్వుడ్ కాగా బీసీ మహిళకు కేటాయించేలా నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, యువ నేత భూమన అభినయ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి విజ్ఞప్తి మేరకు పార్టీ అధిష్టానం తిరుపతి మేయర్ స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్సీ పీ తరఫున మేయర్గా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీపడ్డారు. విద్యావంతురాలిని బరిలోకి దింపాలని భూమన తిరుపతిలో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్గా విశేష సేవలు అందిస్తూ, వివాదరహితురాలుగా గుర్తింపు పొందిన డాక్టర్ ఆర్ శిరీషను ఎంపిక చేశారు. ఈమె ఎంపికపై నగరవాసులు, మేధావులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా 49 స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. నగర ప్రథమ పౌరురాలికి దక్కని గౌరవం నాడు బీసీ మహిళకు అగ్రతాంబూలం ఓసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించి వైఎస్సార్ సీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, తమ పార్టీకి బీసీలు అంటే బ్యాక్ బోన్ అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేకమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ శిరీషను ఏరికోరి మేయర్ ను చేసి బీసీలకు పట్టం కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం అదే మహిళను అవమానించేలా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బీసీలు సైతం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా యాదవులు తమ వర్గానికి చెందిన మహిళకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు బీసీల పాట పాడే చంద్రబాబు ఎన్నికలయ్యాక బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుంటారని ఓ వర్గం మండపడుతోంది. రెండో డిప్యూటీ మేయర్ పేరు హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా నిర్వహించే జాతీయ సెమినార్కు తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను వెళ్లనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ జాతీయ సెమినార్కు గుంటూరు కార్పొరేషన్ నుంచి మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ని, మరో మున్సిపాలిటీ నుంచి చైర్ పర్సన్తో పాటు వైస్ చైర్మన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం తిరుపతిలో మాత్రం మేయర్ను పూర్తిగా పక్కన పెట్టి రెండవ డిప్యూటీ మేయర్ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా ఇవ్వకుండా వ్యవహరించడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. వివాదరహితురాలైన మేయర్ను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ముఖ్యంగా బీసీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఇలా బీసీ మహిళా మేయర్ పట్ల అవమానించేలా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మేయర్ స్థానంలో రెండవ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణను పంపించడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే పంపించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు నిర్వహిస్తున్న ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ జాతీయ కాన్ఫరెన్స్కు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల నుంచి మేయర్లు, మున్సిపాలిటీల నుంచి చైర్ పర్సన్లను పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం జాతీయ సదస్సుకు ఎవరెవరిని పంపించాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కక్ష సాధింపుగా, ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత లేకుండా చేసేలా ఉండడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా ఎంపిక చేసి ఉన్నత పదవుల్లో ఉన్న మేయర్లకు మొండి చేయి చూపించి, ఆ పదవులకు అవమానం తెచ్చేలా వ్యవహరించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్లమెంటు నిర్వహించే ఈ అత్యున్నత జాతీయ సదస్సుకు వైఎస్సాఆర్సీపీకి చెందిన మేయర్లు, చైర్ పర్సన్లను పంపించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!
● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం అడుగడుగునా అక్రమాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకటం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపా లన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామిడి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై శ్రీచంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూశ్రీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పథకాలు అడగరా? ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. భయపెడుతున్న మామిడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారి అవస్థలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.