సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జూపార్కు రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు. ఈ సైన్స్ క్విజ్ పోటీలను లయన్స్ క్లబ్ ఆఫ్ గరుడాద్రి తిరుపతి, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి సైన్స్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం సైన్స్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని వెలికితీయడంతోపాటు వారిలో పోటీ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని, ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో కూడిన బృందంగా హాజరుకాచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ప్రిలిమినరీ రౌండ్, 21, 22, మార్చి 1, 2వ తేదీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్స్, మార్చి 7, 8వ తేదీల్లో సెమీఫైనల్, మార్చి 14న ఫైనల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు ‘‘హెచ్టీటీపీఎస్://టీఐఎన్వైయుఆర్ఎల్.కామ్/ఆర్ఎస్సీటీఏఎన్ఎన్యూఏఎల్ క్విజ్’’ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో, అలాగే సైన్స్ సెంటర్లో నేరుగాను దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 0877–2286 202, 79896 94681 నంబర్లలో, అలాగే ‘‘ఆర్ఎస్సీటీఈడీయుపీఆర్ఓ:జీమెయిల్.కామ్’’ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గరుడాద్రి ప్రతినిధులు మక్కిన భాస్కర్, బండి మధుసూదనరెడ్డి, చక్రవర్తి చెన్నుపాటి, జేసీఐ ప్రతినిధులు మక్కిన జె.లక్ష్మీతేజ, ఉమామహేశ్వర్, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


