breaking news
Tirupati District News
-
మట్టి మనుషులు
అన్నదాతలు పుడమి తల్లినే నమ్ముకుంటారు.. ఆరుగాలం కష్టిస్తుంటారు.. చక్కటి దిగుబడి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు.. అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటను కాపాడుకునేందుకు ఆరాటపడుతుంటారు.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభుత్వం స్పందించకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల విరుచుకుపడిన దిత్వా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మడుల్లో వరదనీరు నిల్వ చేరడంతో నార్లు దెబ్బతిని కుమిలిపోతున్నారు. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. చిట్టమూరు : జిల్లాలోని పలు మండలాల్లో రైతులు దిత్వా తుపాను కారణంగా కుదేలయ్యారు. ఒక్క చిట్టమూరు మండలంలోనే సుమారు 5వేల ఎకరాల్లో వరినాట్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. నారుమడుల్లో ఎక్కువ రోజులు వరద నీరు నిల్వ చేరడంతో నార్లు పాచిపోయి పనికిరాకుండా పోయినట్లు వెల్లడిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు యుద్దప్రాతిపదికన సర్వే నిర్వహించి రైతుభరోసా కేంద్రాల ద్వారా 80శాతం రాయితీతో ఇంటి వద్దకే వరి విత్తనాలు పంపించారని గుర్తుచేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో స్పందించే నాథుడే కరువైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్వవసాయాధికారులు కనీసం పొలాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని వాపోతున్నారు. రాయితీ విత్తనాల సంగతి దేముడెరుగు, అవసరాలకు అనుగుణంగా యూరియా కూడా పంపిణీ చేయలేక చేతులెత్తేశారని మండిపడుతున్నారు. పంటలకు అదును తప్పుతున్నప్పటికీ సర్కారు సాయం అందకపోవడంతో మళ్లీ అప్పులు చేసి సాగుకు సన్నద్ధమవ్వాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైతులను ముంచేసిన దిత్వా -
మన లక్ష్యం.. రైల్వే డివిజన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వేడివిజన్ ఏర్పాటునే లక్ష్యంగా ముందుకు సాగుదామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి నగరంలో ఆటో, ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్ధానిక తారకరామ స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ బాఆజీనగర్, వెస్ట్ చర్చి, ఎమ్మార్పల్లె, అన్నమయ్య, లక్ష్మీపురం, రామానుజ సర్కిల్ మీదుగా రైల్వేస్టేషన్ వద్దకు సాగింది. గిరిధర్కుమార్ మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్గా ప్రకటించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులను కలసి వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలసి డివిజన్ అవశ్యకతను వివరించినట్లు తెలిపారు. సాధన సమితి అధ్యక్షుడు ఎం.వేణుగోపాల్ రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ చౌదరి, సూరినేని బుజ్జి బాబు నాయుడు, కె.కళాదర్, కృష్ణయ్య, సీఆర్కే శేషగిరి రావు, కృష్ణమూర్తి, కార్మిక నేతలు యు.ప్రసాద్ రావు, మునీశ్వర్ రెడ్డి, టీవీ రావ్ పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక బస్సులు తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుపతి బస్టాండ్ నుంచి అప్పలాయగుంట ఆలయానికి, శ్రీనివాసమంగాపురానికి ఐదేసి సర్వీసుల చొప్పున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం ఆదివారం తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ఇవి నడుస్తాయన్నారు. -
పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అన్ని 5,158 వరకు రాహుకేతు పూజలు నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా రూ.500, రూ.750 రాహుకేతు పూజలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. చిన్న లడ్డు, వడ, పులిహోర, జిలేబీ తదితరాలతో మొత్తం 25,592 ప్రసాదాలను భక్తులకు అందించినట్లు సమాచారం. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భక్తులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. – శ్రీకాళహస్తి -
గగన వైకుంఠం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం తిరుపతి వాసులకు గగనంగా మారింది. టీటీడీ నిర్ణయాల కారణంగా మొత్తం పది రోజుల్లో చివరి మూడు రోజులు మాత్రమే స్ధానికులకు అవకాశం దక్కనుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆన్లైన్ ద్వారా రిజిష్టేషన్ చేసుకున్న వారిలో లక్కీడిప్ ద్వారా రోజుకు 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి లభించనుంది. ఈ లెక్కన చివరి మూడు రోజుల్లో కేవలం 15 వేల మంది స్థానికులకు మాత్రమే దర్శన భాగ్యం ఉండనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానికులకు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తూ తిరుపతిలోనే ప్రత్యేక కేంద్రాల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఆ మేరకు పది రోజుల పాటు రోజుకు 8 వేల మందికి చొప్పున 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి అనాలోచిత నిర్ణయాల కారణంగా తిరుపతి వాసులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గగనంగా మారడం గమనార్హం. -
ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఫెలో–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ప్రూఫ్ రీడర్– 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు. వైన్షాపు దగ్ధం చంద్రగిరి : మండలంలోని తొండవాడ కూడలి వద్ద వీబీ వైన్షాపు ఆదివారం వేకువజామున దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో దుకాణంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాచ్మన్ వెంటనే షాపు యజమానికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే లోపే దుకాణంలోని మద్యం దాదాపు ఆహుతైంది. రెండు రోజుల క్రితమే సుమారు రూ.35లక్షల మద్యం తీసుకువచ్చి నిల్వ చేశామని షాపు యజమాని వెల్లడించారు. మద్యంతోపాటు సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి కాలిబూడిదైనట్లు తెలిపారు. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత బలవన్మరణం సత్యవేడు: మండలంలోని బాలకృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన మారయ్య భార్య మంజుల శనివారం రాత్రి బలవన్మణం చెందింది. వివరాలు.. మారయ్య, మంజులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. మారయ్య మద్యానికి బానిసగా మారాడు. తాగుడు మాన్పించేందుకు భర్తతో అయ్యప్ప మాల వేయించింది. ఈ క్రమంలో శనివారం మాల తీసి వేసిన మారయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. రాత్రి 9గంటలకు భర్త ఇంటి బయటకు వెళ్లడంతో మంజుల గుళికుల మందును నీటిలో కలుపుకుని తాగేసింది. కుటుంబీకులు గుర్తించి సత్యవేడు పీహెచ్సీకి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందతూ ఆదివారం వేకువజామున మంజుల మరణించింది. హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం పట్టివేత తిరుపతి అన్నమయ్యసర్కిల్ : పాదిరేడు గొల్లపల్లి పరిధి దిగువ నేరేడుచర్ల ప్రాంతంలో దాచిపెట్టిన 32 ఎరచ్రందనం దుంగలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సుదర్శనరెడ్డి తెలిపారు. తనిఖీల్లో తిరుపతి ఎఫ్ఆర్ఓ మునియా నాయక్, చెల్లూరు బేస్ క్యాంపు వాచర్లు పాల్గొన్నారని వెల్లడించారు. పరశురామేశ్వరుని సేవలో నిశాంత్కుమార్ ఏర్పేడు : మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవల్లీ సమేత శ్రీపరశురామేశ్వరుని ఆదివారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ కుటుంబ సమేతంగా సేవించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ రామచంద్రారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల ఆశీర్వచనం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. వ్యక్తి ఆత్మహత్య పెళ్లకూరు : మండలంలోని పాలచ్చూరు సమీపంలో కోనేటిరాజుపాళెం మార్గంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఈ మేరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, రామాపురం గ్రామానికి చెందిన పి.గుణశేఖర్(40) అనే వ్యక్తి మేనకూరు సెజ్లో హిటాచీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఏమైందో తెలియదు కాని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహం కుళ్లిపోయింది. రెండు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గొలుసు అపహరణ భాకరాపేట : ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణిక్యం పంచాయతీ ఎగువరాజుపల్లెలో ఆదివారం ఓ మహిళ మెడలో గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
పది మంది ఉంటే ఈఎస్ఐ తప్పనిసరి
తిరుపతి సిటీ: దుకాణాలు, వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటిలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తుంటే ఆయా సంస్థలు తప్పనిసరిగా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వస్తాయని ఈఎస్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన దుకాణాలు, సంస్థలు వెంటనే శ్రమ సువిధ, ఈఎస్ఐసీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్పీఆర్ఈఈ పథకం ద్వారా అర్హత కలిగిన సంస్థలు ఈనెల 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, గత కాలానికి సంబంధించిన బకాయిలు, పరిశీలనలు, జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా బీమా చేయబడిన కార్మికుల, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య సేవలు, ప్రమాద బీమా, వికలాంగ భద్రత, ప్రసూతి ప్రయోజనాలు సహా పలు సామాజిక సంక్షేమ పథకాల లబ్ధి పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో సామాజిక భద్రతాధికారి ఎల్.వేణుగోపాల్, ఈఎస్ఐసీ తిరుపతి బ్రాంచ్ మేనేజర్ సి.నాగమణి, అపుస్మా రాయలసీమ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.విశ్వనాధ రెడ్డి పాల్గొన్నారు. చంద్రగిరిలో సైబర్ మోసం చంద్రగిరి : సైబర్ మోసానికి ఓ వ్యాపారవేత్త బలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు సైబర్ మోసగాళ్లు ఆదివారం ఫోన్ చేశారు. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారని, డెలివరీ పూర్తయ్యిందని చెప్పి బాధితుడిని నమ్మించారు. డెలివరీ నిర్ధారణ కోసం ఓటీపీ చెప్పాలని కోరారు. దీంతో సదరు వ్యాపారవేత్త ఓటీపీ వివరాలు వెల్లడించగా, నిమిషాల వ్యవధిలోనే బాధితుడి ఖాతా నుంచి రూ.4 లక్షలు మాయమయ్యాయి. జరిగిన మోసం గుర్తించిన బాధితుడు వెంటనే చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సైబర్ క్రైమ్కు బదిలీ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నియంత్రణలోనే నేరం
తిరుపతి క్రైమ్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల అదుపులో మెరుగైన ఫలితాలు సాధించామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. 2025 వార్షిక నివేదికను ఆయన ఆదివారం మీడియాకు వివరించారు. 2024లో 9,118గా ఉన్న మొత్తం ఎఫ్ఐఆర్లు 2025లో 9,253కు చేరినట్లు తెలిపారు. అయితే ఈ పెరుగుదల కేవలం 0.71 శాతమేనని స్పష్టం చేశారు. భౌతిక దాడులు 2024లో 1,095గా ఉండగా, 2025లో 1,029తో 6.03 శాతం తగ్గుదల నమోదైందన్నారు. సైబర్ నేరాలు 241 నుంచి 186తో 22.82 శాతం తగ్గినట్లు చెప్పారు. అయితే ఆస్తి సంబంధిత నేరాలు 1,052 నుంచి 1,109కు పెరిగినట్లు వివరించారు. ఆయన మాటల్లోనే.. -
ఆకలితో అలసి.. సొలసి!
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు.దీంతో పది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంట నుంచి గంటన్నర పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్యం స్లిప్ టెస్ట్లు చేపట్టి విద్యార్థుల మార్కులను యాప్లో అప్లోడ్ చేయడమే ఈ వందరోజుల ప్రణాళిక లక్ష్యం. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లావ్యాప్తంగా సర్కారు బడుల్లో సుమారు 22వేల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఆకలితో అలమటిస్తూ చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది. వందరోజుల ప్రణాళికలో భాగంగా వీరు పాఠశాలకు ఉదయం 8గంటలకు చేరుకోవాల్సి ఉంది. అలాగే సాయంత్రం ఆరు గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పొద్దుపొద్దునే అల్పాహారంతో బడికి బయలు దేరిన పిల్లలకు మధ్యాహ్నం భుజించే ఆహారమే దిక్కు. దీంతో సాయంత్రం 7గంటలకు ఇంటికి చేరేవరకు కనీసం మంచినీళ్లు తప్ప ఎటువంటి ఆహారం ఉండదు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు నీరసించి పోతున్నారు. కొందరు తల్లిదండ్రులను సమాచారం అందించి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతున్నారు. కనిపించని శ్రద్ధ సర్కారు బడుల్లోని పది విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహిస్తున్న అధికారులు కనీసం సాయంత్రం సమయంలో పిల్లలకు స్నాక్స్ అందించాలనే ఆలోచన చేయకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. స్పెషల్ క్లాస్కు వచ్చిన వారికి పాలు, బిస్కెట్లు వంటివి అందిస్తే ఆకలితో అలమటించాల్సిన అవస్థ తప్పుతుందని సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు ముగిసే సరికి విద్యార్థులు అలసిపోతున్నారని వెల్లడిస్తున్నారు. ఆకలి కారణంగా పాఠాలను సైతం వినేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదని వివరిస్తున్నారు. సాయంత్రం ఏమైనా స్నాక్స్ అందించగలిగితే విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో చదువుకుంటారని సూచిస్తున్నారు. -
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైమ్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల, తిరుపతితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు తిరుపతి క్రైమ్ : నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రజలు న్యూఇయర్ సంబరాలను ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. ఇతరులను ఇబ్బంది పెట్టేలా డీజే సౌండ్లు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టప్రకారం అనుమతులు తీసుకుని మాత్రమే వేడుకలు జరుపుకోవాలని, డీజే సౌండ్స్కు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ‘పేటశ్రీ’కి మరో విశిష్ట అవార్డు తిరుపతి కల్చరల్ : ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి(పేటశ్రీ)ని మరో విశిష్ట అవార్డు వరించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పొనకా కనకమ్మ దువ్వూరు రామిరెడ్డి స్మారక అవార్డుకు ఎంపిక చేసినట్లు నెల్లూరు దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ వారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించనున్న దువ్వూరు రామిరెడ్డి జయంతి సభలో పేటశ్రీకి రూ.25 వేల నగదుతో పాటు అవార్డును బహూకరించనున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యంలో పేటశ్రీ చేసిన కృషిని గుర్తించి జ్యూరీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పేటశ్రీ 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. గతంలో ఆయన రచించిన తిరుపతి గంగజాతర, కొండ కథలు, తిరువీధులు, తిరుపతి కథలు గ్రంథాలకు సైతం పురస్కారాలు లభించాయి. పేటశ్రీ ఇప్పటి వరకు 300 వ్యాసాలను ప్రచురించారు. చైనా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో పరిశోధనా పత్రాలను సమర్పించడం విశేషం. 9న టెన్నిస్ బాల్ క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : తుమ్మగుంట మైదానంలో జనవరి 9వ తేదీన జిల్లా టెన్నిస్ బాల్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.దేవరాజ్, బి.మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వ్యక్తిగతంగా, జట్టుగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన క్రికెటర్లను జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జిల్లా జట్టు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 94902 52821నంబరులో సంప్రదించాలని సూచించారు. నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్ తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్కు అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. అర్జీదారులకు మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. -
ఆర్టీసీలో ప్రైవేటును సహించం
తిరుపతి అర్బన్ : కొత్త బస్సుల పేరుతో ఆర్టీసీలో ప్రైవేటు పల్లవి పాడితే సహించే ప్రసక్తే లేదని ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ కల్యాణ మండపంలో ఆర్టీసీ ఎన్ఎంయూఏ జిల్లా సమావేశం నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బస్సులంటూ ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు చేసే అధికారం ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించే 1–19 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంయూఏ జిల్లా అధ్యక్షుడు డీవీఆర్ కుమార్, కార్యదర్శి బీఎస్ బాబు పాల్గొన్నారు. -
దారి లేక దీక్ష!
పొలం గట్టుపై తమ కాలనీకి వెళుతున్న గిరిజనులు దారి కోసం గిరిజనులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సోమవారం ఈమేరకు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగనున్నారు. సూళ్లురుపేట మండలం కడపత్రి పంచాయతీ పాటిమిట్ట గిరిజన కాలనీలో 27 కుటుంబాలవారు సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నారు. గతంలో బండిబాటనే రాకపోకలకు వాడుకునేవారు. అయితే ఆ బాట కాస్తా ఆక్రమణకు గురికావడంతో కాలనీకి దారి లేకుండా పోయింది. పొలం గట్టే దిక్కుగా మారింది. ఇటీవల అల్లమ్మ అనే మహిళ అనారోగ్యం బారిన పడడంతో ఆస్ప త్రికి తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు ఎలాగోలా ఆస్పత్రికి తరలించినా ఆలస్యం కావడంతో ఆమె మరణించింది. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శ్మశానానికి తీసుకెళ్లాలన్నా పొలం గట్టు మీద నుంచే వెళ్లాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు కూడా ఇదే మార్గంలో పాఠశాలకు వెళుతున్నారని, ఈ క్రమంలో అప్పుడప్పుడు పడిపోయి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. దీనిపై ఇటీవల తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాకు తమ కష్టాలు వినిపించినా ఫలితం లేకుండా పోయిందని వెల్లడిస్తున్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్లో సైతం పలుమార్లు అర్జీలు సమర్పించినా అతీగతీ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. అందుకే సోమవారం నుంచి కలెక్టరేట్ వద్దే ఆమరణ దీక్షకు దిగనున్నట్లు తెలిపారు. తమ కాలనీకి దారి సౌకర్యం కల్పించే వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. – తిరుపతి అర్బన్ -
అంతులేని సాగరంలో ఆటుపోట్లను ఎదుర్కొనే మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఆధునిక పడవలు.. పరికరాలను రాయితీపై అందిస్తామని ఆశపెట్టి అదనపు భారం వేసేందుకు యత్నిస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన సొమ్మును గంగపుత్రులే భరించాలని
●చిల్లకూరు : జిల్లాలోని మత్స్యకారులకు బోట్లు, వలలు, ఇంజిన్లు రాయితీపై అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో సుమారు 450 మంది జాలర్లు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్కారు మాత్రం ఇప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. వాటా.. మాటే లేదు మత్స్యకారులకు బోట్లు, ఇతర పరికరాలు అందించేందుకు వెచ్చించే మొత్తంలో ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం భరిస్తుంది. మిగిలిన 40శాతం రాయితీ నగదును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు సర్కారు ఈ విషయంలో మత్స్యకారుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతోంది. 40శాతం రాయితీ నగదును గంగపుత్రులే చెల్లించాలని స్పష్టం చేసింది. అంత మొత్తం చెల్లించలేమని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు చేసేది లేక కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 15శాతం అయినా భరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే డీజిల్ సబ్సిడీ కింద పడవ యజమానులకు ప్రతి నెలా చెల్లించే రూ.2,700లను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలో సముద్ర తీరం 75 కి.మీ మత్స్యకార గ్రామాలు 42 ప్రస్తుతం ఉన్న పడవలు 821 సబ్సిడీ బోట్ల కోసం వచ్చిన దరఖాస్తులు 450మత్స్యకారులకు అందని సబ్సిడీ డీపీఆర్ ఇచ్చాం జిల్లాలోని మత్స్యకారుల వివరాలను సేకరించాం. బోట్లు అవసరమైన వారి వివరాలను డీపీఆర్లో పొందుపరిచాం. ఈ మేరకు నివేదికను కలెక్టర్కు అందించాం. రాయితీపై నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. – రాజేష్, జిల్లా మత్స్యశాఖాధికారి, తిరుపతిసబ్సిడీ ఇవ్వాలి సముద్రంలో వేట సాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. బోట్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రాయితీ అందించాలి. కనీసం 75శాతం సబ్సిడీ ఇస్తే మిగిలిన మొత్తం బ్యాంకు రుణం తీసుకుంటాం. – మునస్వామి, లైట్హౌస్, వాకాడు మండలం -
తుమ్మలగుంటకు
వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటే అందరి చూపు తిరుమల గిరుల వైపు వెళుతుంది. అయితే కొండంత జనం నడుమ శ్రీవారిని దర్శించుకోలేని వారు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని ఆలయానికి తరలివస్తుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఉత్తర ద్వారం తరహాలోనే తుమ్మలగుంట ఆలయంలో సైతం వైకుంఠ ద్వారాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఈ ఏడాది కూడా తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం ఈ మేరకు ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యవేక్షించారు. పలు సూచనలు అందించారు. పనులపై సమీక్ష వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామి దర్శనార్థం వచ్చి వైకుంఠ ద్వార ప్రవేశం చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి పనుల పురోభివృద్ధిపై సమీక్షించారు. ఆలయం వద్ద గ్రామ పెద్దలతో సమావేశమై వివరాలను తెలుసుకున్నారు. పనులను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అద్భుతం.. వైకుంఠ ద్వారం.. ఆలయంలో భక్తులు ప్రవేశించే వైకుంఠ ద్వారాన్ని అత్యద్భుతంగా తయారు చేస్తున్నారు. శ్రీవారి దశావతారాల ప్రతిమలతో పాటు అష్ట లక్ష్మీ దేవిల ప్రతిమలను వైకుంఠ ద్వారంలో ఏర్పాటు చేయిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరిస్తున్నారు. దర్శనానంతరం వైకుంఠ ద్వారంలోకి వెళ్లిన భక్తులకు గోవింద నామాలు వినపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భాలయంతో పాటు పరివార దేవతా మూర్తుల ఆలయాలను సైతం విశేషంగా అలంకరిస్తున్నారు. -
ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యుడిగా అంకయ్య
శ్రీకాళహస్తి : ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యుడిగా శ్రీకాళహస్తికి చెందిన కేసీ అంకయ్యను ఎంపిక చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో (ఐలు) ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ యూనియన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఈనెల 8వ తేదీన జిల్లా కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో తిరుపతి నుంచి పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి, చల్లా వెంకటయ్య, భాను సుందర్, చిత్తూరు నుంచి సుగుణ శేఖర్రెడ్డి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పీవీ ప్రసాద్, సోమశేఖర్, శ్రీకాళహస్తి నుంచి కాకి చిన్న అంకయ్య తదితర 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెలనెలా పింఛన్ల కోత తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు చంద్రబాబు పాలనలో ప్రతినెలా తగ్గిపోతున్నాయి. 19 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 14,544 పింఛన్లు తగ్గాయి. గత నెలలో 2,62,108 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే...ఈ నెలలో 2,61,543 మందికి ఈ నెల 31న పంపిణీ చేయనున్నారు. గత నెలతో పోల్చుకుంటే జిల్లాలో 565 పింఛన్లు తగ్గాయి. మరోవైపు మూడు నెలల క్రితం 7,543 మంది దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు నోటీసులు ఇచ్చి కొందరి పింఛన్ల తొలగించారు. మరి కొందరి పింఛన్ల తగ్గింపు చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున రోడ్డెక్కి పోరాటం చేయడంతో రీవెరిఫికేషన్ అంటూ కాలయాపన చేస్తున్న విషయం విదితమే. రీవెరిఫికేషన్ అనంతరం తమ పింఛన్ల తొలగిస్తే మరోసారి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు భర్త ఫించన్ తీసుకుంటూ మృతి చెందిన 472 కుటుంబాల్లో వాళ్ల భార్యకు స్పౌజ్ పేరుతో పింఛన్లు ఇస్తున్నారు. అంతకు మించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇప్పటివరకు కల్పించలేదు. దీంతో జిల్లాలో వితంతువులే దాదాపుగా 5 వేల మందికిపైగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వృద్ధులు 14 వేల మంది, వ్యాధిగ్రస్తులు మరో 6 వేల మంది, ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్లు ఇస్తామని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే. వారికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో అలాంటి వారు 70వేల మంది వరకు ఉన్నారు. మొత్తంగా చూస్తే లక్ష మంది తిరుపతి జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
టీటీడీ భూములు ప్రైవేట్కు ధారాదత్తం దుర్మార్గం
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన సీపీఐ నాయకులతో కలసి అలిపిరి–చెర్లోపల్లి మార్గం అరవింద్ కంటి ఆస్పత్రి సమీపంలోని టీటీడీ భూములు ఒబెరాయ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ హోటళ్లకు టీటీడీ భూములు కేటాయిస్తే మద్యం, మాంసం, క్లబ్బులు, క్యాడ్బరీ డాన్సులు వేయరా? అని ప్రశ్నించారు. గతంలో టీటీడీకి సంబంధించిన భూములను కేవలం విద్యాలయాలకు కేటాయించేవారన్నారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కేటాయించే అధికారం ఎవరికీ లేదన్నారు. గత ప్రభుత్వం కేటాయిస్తే తప్పు అన్నారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి టీటీడీ దేవుని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హోటళ్లకు కేటాయించిన భూముల్లో రాత్రి పూట మాత్రమే పనులు చేస్తున్నారని, పగులు ఎందుకు పనులు చేయడం లేదన్నారు. ఈ స్థలంలో సంవత్సరాల చరిత్ర కలిగిన ఎరచ్రందనం చెట్లు ఉన్నాయని, వాటిని ఓబెరాయ్ కంపెనీకి కట్టబెడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇక్కడే చదువుకున్నారు.. శ్రీవారి భక్తుడు అంటారు.. అతనికి తెలియదా టీటీడీ భూములు ఇవ్వకూడదని? ప్రశ్నించారు. ఇలాంటి భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా మానవసేవయే మాధవసేవ అనే సూక్తిని దేవుడు కూడా హర్షిస్తారన్నారు. టీటీడీ భూముల ప్రైవేట్ పరంపై కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కచ్చితంగ పోరాడుతామని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిశీలనలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, విశ్వనాధ్, ఉదయ్కుమార్, బండి చలపతి పాల్గొన్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలనే ధ్యేయం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడమే ఈ ఏడాదిలో ప్రధాన ధ్యే యంగా పెట్టుకుని గణనీయమైన విజయాలను సా ధించినట్లు టాస్క్ఫోర్స్ హెడ్, జిల్లా ఎస్పీ సుబ్బరా యుడు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సభా ప్రాంగణంలో అక్రమ రవాణా ప్రత్యేక దళ వార్షిక సమగ్ర పనితీరు నివేదిక ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టాస్క్ఫోర్స్ విభాగం, అటవీశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని మెరుగైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 87.5 శాతం దోష నిర్ధారణ రేటు సాధించగా అందులో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 35,476 కిలోల బరువు కలిగిన 1,872 దుంగలు, 63 వాహనాలు సీజ్ చేశామన్నారు. 64 కేసుల నమోదులో 263 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 216.5 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా అక్రమ రవాణాలో క్షేత్రస్థాయి స్మగ్లర్లు, రవాణాదారులు, నిర్వాహకులు అలవాటైన నేరస్తులు ఉన్నారన్నారు. ఎర్రచందనం అరుదైన, విలువైన వృక్ష జాతి కావడం, దీనికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న కారణంగా సంఘటిత అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాల లక్ష్యంగా మారుతోందన్నారు. 2025 సంవత్వరంలో సమగ్ర, గూఢదారి ఆధారిత, సాంకేతికతతో చట్టపరంగా బలమైన వ్యూహాన్ని అమలు చేశామన్నారు. 2016 నుంచి 2024 మధ్యకాలంలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 52 మంది నిందితులను గుర్తించి, అరెస్టు చేయడంతో కోర్టు ప్రక్రియలను బలోపేతం చేసిందని గుర్తు చేశారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సీసీఎఫ్) సెల్వం మాట్లాడుతూ ఈ ఏడాదిలో మొత్తం 920 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 816 ఎంట్రీ ఎగ్జిట్ ఆపరేషన్లు, 24 డి కాంబింగ్ ఆపరేషన్లు, 80 ప్రత్యేక 0 ప్లస్ 1 కాంబింగ్ ఆపరేషన్లు ఉన్నట్లు చెప్పారు. అనంతరం టాస్క్పోర్స్ బృంద సభ్యులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లా అటవీశాఖాధికారి సాయిబాబ, టాస్క్ఫోర్స్ ఏసీఎఫ్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ కులశేఖర్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. -
తిరుపతిని ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
తిరుపతి అర్బన్: జిల్లాను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు సమావేశాన్ని ఇన్చార్జి జేసీ నారపురెడ్డి మౌర్యతో కలసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని ఎలక్ట్రానిక్స్, స్పేస్, అడ్వాన్స్డ్ ఎనర్జీ సిస్టమ్స్ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి బోర్డు పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. ప్రాధాన్యత రంగాలైన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పే స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఎనర్జీ సిస్టమ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తిరుపతి జిల్లాతో పాటు అనుబంధ జిల్లాల పారిశ్రామిక సామర్థాన్ని అంచనా వేస్తూ, ఆ ప్రాంతాల్లోను స్టార్టప్ వ్యవస్థాపకతను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో ఆదాని, నవయుగ, అమరరాజా కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ తిరుపతి బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బండారుపల్లి జెడ్పీహెచ్ఎస్ను సందర్శించిన గుజరాత్ టీమ్ ఏర్పేడు: మండలంలోని బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. పాఠశాల లో అమలవుతున్న విద్యాపథకాలను గురించి తెలసుకున్నారు. విద్యార్థులను పాఠ్యాంశాల గురించి ప్రశ్నించి, ప్రతిభను పరీక్షించారు. పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లు, ఆహ్లాదకరంగా ఉన్నాయని, పాఠశాల మౌలిక వసతులను వారు ప్రశంసించారు. ఇన్చార్జి హెచ్ఎం సుబ్రమణ్యం, పాఠశాల ఉపాధ్యాయులు చిట్టిబాబు, ద్వారకనాథరెడ్డి, కుమార రాజా, రాధాకుమారి, రామచంద్రయ్య, వెంకటేశులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ – ముందస్తు ప్రణాళిక లోపంతో ఇక్కట్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయంలో శనివా రం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఒక్కరోజే 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శని, ఆది, సోమవారాల్లో శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయి తే ఈసారి తిరుమలలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ముందస్తుగానే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జిల్లాకు తరలివచ్చారు. ఈ ప్రభావం శ్రీకాళహస్తి ఆలయంపైనా పడింది. ఒక్కసారిగా 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో ఆలయంలోని అన్ని క్యూలు కిక్కిరిసిపోయా యి. ముందస్తు ప్రణాళికలు, రద్దీ నియంత్రణ చర్యలు సరైన స్థాయిలో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. గంటల తరబడి క్యూలో దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చిందని భక్తులు వాపోతున్నారు. ఐఐటీలో ప్లాస్మా జాతీయ సింపోజియం ప్రారంభం ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో 40వ ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీ..ప్లాస్మా ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ (పీఎస్ఎస్ఐ) జాతీయ సింపోజియం శనివారం ప్రారంభమైంది. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చర్హాల్లో ఆ సంస్థలోని ఫిజిక్స్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి సింపోజియంలోఆ సంస్థలోని ఫిజిక్స్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి సింపోజియంలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్య నారాయణ పాల్గొని, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐసర్తో కలసి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి పర్యావరణ ఇంజినీరింగ్పై, ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలపై పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఆయా రంగ ప్రముఖులు ప్రసంగించనున్నారని తెలిపారు. -
ఖండాంతరాలు దాటిన ఆదిత్య రాగం
ఆ బాలుడి స్వరం వీనులు చేరగానే హృదయం ఉప్పొంగిపోయింది.. గుండె గదుల్లో కళారాధన తొణికిసలాడింది.. ఆ రాగం మనస్సును పరవళ్లు తొక్కించింది.. ఒక్కొక్క కీర్తన మధురానుభూతిని కలిగించింది.. ఇదంతా ఏమిటా అనుకుంటున్నారా.. మన కళ ఖండాంతరాలు దాటినా చెక్కుచెదరలేదనడానికి నిదర్శనం. భారతీయ సంస్కృతి.. సంప్రదాయం.. కళలు ప్రపంచాన్ని కట్టిపడేస్తున్నాయనడాకి ఉదాహరణే ఆమెరికా సెంట్లూయిస్లో నివాసమున్న చెంగల్వ ఆదిత్య. విజయవాడకు చెందిన రమణమూర్తి బాలాత్రిపుర సుందరి దంపతుల మనవడు చెంగల్వ ఆదిత్య ప్రస్తుతం అమెరికా సెంట్ లూయిస్లో నివాసముంటున్నా. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, భక్తి సంకీర్తనలపై మక్కువతో ఆదిత్య అన్నమయ్య సంకీర్తనాలాపన సాధన చేశాడు. ఆ బాలుడు శనివారం అన్నమయ్య కళామందిరంలో ఏర్పాటు చేసిన కచేరిలో ‘పొడగంటిమయ్యా పురుషోత్తమా’.. అని ఆలపిస్తుంటే అంతా నిశ్చేష్టులై విన్నారు. ఆ బాలుడు కళారాధనకు మెచ్చిన చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రతినిఽధి చిత్రపు హనుమంతరావు, సభ్యులు, పురోహితులు సురేష్ స్వామి, లోక ప్రభాకర్ నాయుడు, రంగస్థలి చైర్మన్ గోపినాథ్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఆ బాలుడిని జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందించారు. – తిరుపతి కల్చరల్ -
దళితులపై అధికార పార్టీ కుట్ర
రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచా యతీ దొడ్లమిట్ట దళితవాడకు చెందిన చలపతి అనే దళితుడు ఆంజనేయపురం సమీపంలో ఉన్న కడప– చైన్నె రహదారి పక్కన హోటల్ పెట్టుకుని బతుకుదాం.. అనుకుని కరకంబాడిలోని రామ య్య స్వాధీన అనుభవంలో ఉన్న ఎకరా భూమి లోని మామిడి తోటను ఆరేళ్లు లీజుకు తీసుకుని రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టారు. 4 నెలలుగా నిర్మాణ పనులు చేస్తున్నారు. పంచా యతీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని కరెంటు సరఫరా తీసుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపె ట్టి రెండు రోజుల్లో హోటల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో స్థాని క అధికార పార్టీ నాయకులు అతన్ని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిగా ముద్ర వేసి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా రెవెన్యూ అధికారులను శనివారం సాయంత్రం హోటల్ వద్దకు పంపి, ప్రభుత్వ భూమిలో హో టల్ నిర్మించుకున్నారని చెబుతూ కూల్చేందుకు ప్రయత్నించారు. ఎటువంటి ముందస్తు నోటీసు లు ఇవ్వకుండా ఇలా ఉన్నఫళంగా వచ్చి కూల్చివేస్తామంటే ఎలా అని చలపతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమకు పంచాయతీ నుంచి అను మతులు తీసుకున్నామని, ఎంత చెప్పినా రెవె న్యూ అధికారులు సర్వే నంబర్ 59లోని సుమారు 20 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఆన్లైన్లో ఉందని తెలుపుతూ, ఇందులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి జేసీబీతో హోటల్కు వేసిన ది మ్మెలను కూల్చివేశారు. హోటల్ ప్రధాన భవ నం కూల్చేందుకు ప్రయత్నించగా చలపతి కుటుంబంలోని మహిళలు పెట్రోల్ తీసుకుని కూల్చివే స్తే కాల్చుకుని మరణిస్తామని కూర్చున్నారు. రా త్రి 7 గంటల వరకు రెవెన్యూ అధికారులు కూ ల్చేందుకు ప్రయత్నాలు చేశారు. బాధిత కుటుంబం సమయం ఇవ్వాలని కోరగా రెండు రోజులు గడువు ఇచ్చి రెవెన్యూ అధికారు లు వెనుతిరిగి వెళ్లారు. చలపతి మాట్లాడుతూ దళితులమని తమపై కక్ష కట్టి స్థానిక అధికార పార్టీ నాయకులు రెవెన్యూ వారిని పంపించారన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ నేతలు కరకంబాడి పంచాయతీలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యల సంఘటనను తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షు డు గంగారి రమేష్, పార్టీ పంచాయతీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి భరోసా ఇచ్చారు. -
వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం ఉదయం ఆయన తిరుమలలోని క్యూలను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. క్యూల్లో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు అదనపు ఈఓ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈఓ రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ఈఈ శ్రీనివాసులు, డీఈ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. జనవరి 7వ తేదీ వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తేదీ వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే ఈ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలిలా.. డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ–డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారదర్శనం. టోకెన్ పొందిన భక్తులు ఆయా తేదీల్లో మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాలిని టీటీడీ కోరుతోంది. -
తుమ్మలగుంట వెంకన్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
తిరుపతి రూరల్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయం లోపల, బయట చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గర్భాలయంను శుద్ధి చేసిన అర్చకస్వాములు ఆయలంలోని పరివార దేవతామూర్తుల ఆలయాలను పరిశుభ్రం చేశారు. అలాగే అలంకార మండపంలోని స్వామి వారి వాహనాలు, ఆలయ పుష్కరణిని సుంగభరిత ద్రవ్యాలతో శుభ్రం చేశారు. ఆలయం ముందు ప్రత్యేకంగా ఇనుప బ్యారికేడ్లతో క్యూలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి, రంగ వల్లులతో తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ధ్వజస్తంభం, పరివార దేవతామూర్తుల ఆలయాలకు జరిగే పుష్పాలంకరణకు దేశ, విదేశాల నుంచి పుష్పాలను తీసుకువస్తున్నారు. వైకుంఠ ద్వారాన్ని సిద్ధం చేస్తున్న కార్మికులు కల్యాణ వేంకటేశ్వరస్వామి గర్భాలయం చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారాన్ని అందంగా పుష్పాలంకరణతో సిద్ధం చేస్తున్నారు. శంకు, చక్ర నామాలతో కూడా వైకుంఠ ద్వారం నుంచి భక్తులు ప్రవేశించగానే భక్తితో మైమరిపించేలా గోవింద నామ సంకీర్తలతో పాటు సుగంధాలను వెదజల్లే పరిమళ భరిత పుష్పాలు, పత్రాలను అమర్చడానికి వీలుగా ప్లైవుడ్ ఏర్పాటు పనులు చేపట్టారు. వైకుంఠ ద్వారంలో అందమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అర్ధరాత్రి ధనుర్మాస కై ంకర్యాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 29వతేదీ అర్ధరాత్రి దాటిన తరువాత స్వామి వారికి ధనుర్మాస కై ంకర్యాలు, తోమాలసేవ, కొలువు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తరువాత తెల్లవారు జామున 4 గంటలకు వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభిస్తారు. అనంతరం వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కనువిందు చేయనున్న దశావతారాలు తుమ్మలగుంట గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన దశావతారాల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ పనులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు మధ్యన దేవదేవుని దశావతారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. -
హైవోల్టేజీతో కుటీర పరిశ్రమ దగ్ధం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కల్లివెట్టు గ్రామంలో హైవోల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో మోటార్లు వైడింగ్కు సంబంధించిన కుటీర పరిశ్ర మ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కల్లివెట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసులు విమల ఎలిక్ట్రికల్ మోటార్లు రిపేర్, వైడింగ్ పేరుతో ఇంటి వద్దనే కుటీర పరిశ్రమను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమలు, వ్యవసాయ, గృహ అవసర మోటార్లకు మరమ్మతుల కోసం వైడింగ్ చేసేందుకు ఇంటి వద్దనున్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసి నడిపిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు హైవోల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో ట్రాన్ఫార్మర్ కాలిపోవడంతోపాటు కుటీర పరిశ్రమలో షార్టు సర్క్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగి, వైడింగ్ చేసిన భారీ మో టటార్లు, వైడింగ్కు వినియోగించే 150 కిలోల రాగివైరు, మోటార్లు అమర్చే కూలింగ్ ఫ్యాన్లు, ఇన్సులేషన్ వైర్లు కాలిపోయాయి. రూ.5 లక్షలు మేర నష్టం వాట్టిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదు కోవాలని బాధితుడు శ్రీనివాసులు తెలిపారు. అంతే కాకుండా గ్రామంలో ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్డ్లు, కాలి పోయాయని, విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం కా రణంగానే నష్టపోయామని గ్రామస్తులు అన్నారు. ఎస్టీవీడీ 152 కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ -
ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఫారెస్ట్ రేంజ్లో భాకరాపేట రేంజ్ అటవీ క్షేత్రాధికారి ఎన్.వెంకటరమణ నేతృత్వంలో అటవీ సిబ్బంది శనివారం దాడులు చేసి, ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎరచ్రందనం దుంగలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దిన్నెల అటవీ పరిసర ప్రాంతాల నుంచి ఎరచ్రందనం అక్రమంగా తరలిస్తున్నారన్న రహస్య సమాచారం మేరకు శుక్రవారం రాత్రి రేంజ్ సిబ్బంది, బేస్ క్యాంపు, స్ట్రైక్ ఫోర్స్ ప్రొటెక్షన్ వాచర్లు తలకోన నార్త్ బీట్ పరిధిలోని వీఆర్ కాలనీ సమీపంలో నిఘా పెట్టారు. శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించగా, కోటకాడపల్లి దిన్నెల రోడ్డులో వీఆర్.కాలనీ వద్ద కారు వదిలి కొందరు పారిపోవడానికి యత్నించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకుమార్, శక్తివేల్ ముత్తు, బాబు దొరైరాజ్, కే.శక్తి, శివకుమార్ (సెంజి), అనుమన్ అనే వ్యక్తులను అటవీ సిబ్బంది చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. కారులోని 167 కిలోల బరువున్న 6 ఎరచ్రందనం దుంగలను కారుసహా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కారు, ఎరచ్రందనం విలువను సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎఫ్ఎస్ఓ బి. మునిస్వామి నాయక్, ఎఫ్బీఓలు వై.రాజేష్ కుమా ర్, జి.ప్రదీప్, జే.బి.నిఖిల్, ఎం.సదాశివయ్య, సి.రవి, డ్రైవర్ హెచ్.శంకర్, తేజ పాల్గొన్నారు. -
కర్షకుడికి కన్నీటి కష్టాలు
సుదూర ప్రాంతాల్లో నారు మడులను కొనుగోలు చేసి తరలిస్తున్న రైతులు(ఇన్సెట్) వాకాడు వద్ద పాచిపోయిన వరి పంటఇటీవల వచ్చిన దిత్వా తుపాన్ ప్రభావంతో సంభవించిన వరదలకు నష్టపోయిన వరి రైతులు నేటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తుపాన్కు ముందు వరి నాట్లు వేసుకున్న రైతులను వరదలు ముంచేశాయి. మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 1,550 ఎకరాల్లో వరినాట్లు వరద నీటిలో మునిగి పాచిపోయాయి. 30 రోజుల తరువాత వరదలు తగ్గడంతో మళ్లీ రెండోసారి రైతులు దుక్కి సిద్ధం చేసి సుదూర ప్రాంతాల నుంచి నార్లు అధిక ధరలకు కొనుగోలు చేసి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు ఎకరాకు దాదాపు రూ. 20 వేలు వరకు పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకు ఇది గోరుచుట్టుపై రోకటి పోటు చందంగా మారింది. పంట కోత దశకు వచ్చేదాకా ఎంత పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందోనని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత కష్టపడి పండించిన ధాన్యానికి అమ్ముకునే సమయంలో కనీస మద్దతు ధర లభిస్తుందా? లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద నష్టాలతో సతమవుతున్న రైతులకు ప్రభుత్వం కంటితుడుపుగా 80 శాతం రాయితీతో ఎకరాకు ఒక బస్తా విత్తనాలు అందజేయడంపై రైతులు కనెర్ర చేస్తున్నారు. – వాకాడు -
చోరీకి విఫలయత్నం
పుత్తూరు : పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే వరుసగా మూడు దొంగతనాలు జరగ్గా 105 గ్రాముల బంగారు నగ లు, 400 గ్రాముల వెండి ఆభరణాలను దుండగు లు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము 2–30 గంటల ప్రాంతంలో స్థానిక నగరం రోడ్డులోని సూర్య ఎలక్ట్రికల్ దుకాణంలోకి ఓ దుండగు ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. రాడ్ ను ఉపయోగించి రెండు తాళాలు విరగొట్టిన దొంగ మూడవ తాళం తొలగించలేకపోయాడు. దీంతో వెనుదిరిగాడు. ఉదయం షాపు వద్ద జరిగిన దొంగతనం ప్రయత్నాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ చిత్రాల ఫుటేజీని అందజేశాడు. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రీశక్తి పీఠంలో సినీ హీరో సుమన్
రామచంద్రాపురం: మండలంలోని రాయల చెరువు సమీపంలో ఉన్న శ్రీశక్తి పీఠాన్ని శుక్రవారం ప్రముఖ సినీ హీరో సుమన్ సందర్శించారు. పీఠానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శక్తిపీఠంలోని శ్రీమరకత శక్తి కాళీదేవి, శ్రీ శ్వేత వారా హిదేవికి ప్రత్యేక పూజలు చేయించి, శివలింగానికి ముడుపుకట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతులు శ్రీసిద్ధేశ్వరనంద భారతి మహాస్వామి, స్థానిక పీఠాధిపతి రమ్యానంద భారతి స్వామివారు ఆయన్ని ఆశీర్వదించి, అమ్మవారి శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం కార్యదర్శి శ్రీకాంత్, ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలకలం రేపిన ప్రొఫెసర్ మృతి
తిరుపతి క్రైమ్ : ఎస్వీయూ ఎంబీఏ విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ గుగలోత్ సర్దార్ నాయక్ మృతి కలకలం రేపింది. తన సొంత కారులోనే ఆయన అనుమానాదస్పదంగా మృతి చెందడం పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆయన మద్యానికి బానిసై తరగతులకు హాజరుకావడంతో గుర్తించిన అధికారులు పలుసార్లు ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. తిరుపతి తుడా: మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా యు శారదాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టిడ్కో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆమెను తిరుపతి కార్పొరేషన్ కు అదనపు కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న చరణ్ తేజ రెడ్డిని రెండు నెలల క్రితం మదర్ డిపార్ట్మెంట్ కు పంపిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక అప్పటి నుంచి అదనపు కమిషన్ గా ఎవరిని నియమించకపోవడంతో డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభుత్వం అదనపు కమిషనర్ నియమించింది. చిల్లకూరు: గూడూరు వరదానగర్లో రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో శుక్రవారం ఓ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒకటో పట్టణ ఎస్ఐ మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్ఐ కథనం మేరకు.. వరదానగర్ ప్రాంతంలో సుబ్రహ్మణ్యం(34) అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని టైల్స్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతను కొంత కాలంగా అనారోగ్యం బారిన పడి ఉన్నాడు. ఈ క్రమంలో అతను ఉదయం రోడ్డుపైకి నడిచి వస్తుండగా చుట్టు పక్కల వారు గమనించారు. అయితే అతను నడిచి వెళుతూ పక్కకు ఒరిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృత దేహం వద్ద ఉన్న ఆధారాలు మేరకు అతను చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
చిట్టమూరు: మండలంలోని మల్లాం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శు క్రవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మల్లాం గ్రామా నికి చెందిన జయం సుందరమ్మ (85) భర్త వెంకయ్య కు ఉద యం భోజనం పెట్టి బయటకు వెళ్లి వస్తా నని చెప్పి వెళ్లిందన్నారు. అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మనసు కలత చెందిన సుందరమ్మ గ్రామంలోని చెరువులో దిగి మృతి చెందిన ట్లు పేర్కొన్నారు. చెరువు వైపు వెళుతున్న వారు మృతదేహం నీటిపై తేలాడుతూ ఉండడాన్ని గమనించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమా చారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీటిపై తేలాడుతున్న మృత దేహాన్ని బయటకు తీయించడంతో గ్రామానికి చెందిన సుందరమ్మగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని తెలంగాణ వాసి మృతి రేణిగుంట:మండలంలో ని ఆర్ మల్లవరం సమీపంలోని జాతీయ రహ దారిపై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వా హనం ఢీకొనడంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన మధుసూదన్ (70) ట్రావెల్ బస్సు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఆ క్రమంలో యాత్రి కులను తీసుకుని తి రుమలకు వస్తుండగా ఆర్.మల్లవరం సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి రోడ్డుకి అటు వైపు ఉన్న ప్రైవేట్ లాడ్జిలో రూమ్ల కోసం విచారించి, తిరిగి బస్సు వద్దకు వచ్చే ప్రయత్నంలో రోడ్డు దాటు తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహ నం అతన్ని ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై శుక్రవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. -
విజ్ఞాన సమ్మేళనాన్ని తప్పక వీక్షించాలి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని విద్యార్థులు తప్పక వీక్షించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో ప్రారంభభమైన కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మేళనంలో ఎగ్జిబిషన్ స్టాళ్లు, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, ఇవి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృష్టిని మరింత పెంపొందించేలా ఉన్నా యని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల నుంచి ప్రతిరోజు 3 వేల మంది విద్యార్థులు, వారితోపాటు ఉపాధ్యాయులు, సందర్శించడానికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ ప్రదర్శనను వీక్షించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. -
సమన్వయంతో అభివృద్ధి చేద్దాం
తిరుపతి అర్బన్: అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన స్వర్ణనారావారిపల్లి...అభివృద్ధి అనే అంశంపై ట్రైనీ కలెక్టర్ రఘువాన్సీతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, రంగంపేట స్కూలు నిర్మాణం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చెందిన పనులు సంక్రాంతిలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సుశీలాదేవి, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీఈఓ కేవీఎన్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, డీఏఓ ప్రసాద్రావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి తదితరులు పాల్గొన్నారు. ఒకేరోజు 4 ఇళ్లల్లో చోరీ – 66.5 సవర్ల బంగారం, రూ. 5 లక్షల నగదు అపహరణ వెంకటగిరి రూరల్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగలు వెంకటగిరి చెలరేగిపోతున్నారు. ఒకే రోజు పట్టణంలోని వేర్వేరు చోట్ల 4 ఇళ్లల్లో చొరబడి 66.5 సవర్ల బంగారం, పలు విలువైన వస్తువులు, రూ. 5 లక్షల వరకు నగదు అపహరించుకుపోయిన ఘటనలు ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని హనుమాన్నగర్లోని బెటాలియన్ విశ్రాంత ఎస్ఐ బాలకృష్ణ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి తాళం పగులగొట్టి ఇంట్లోని 1.5 సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. అదే వీధిలోని బ్యాంకు ఉద్యోగి ఉమ అనే మహిళ ఇంట్లో ప్రవేశించి 2.5 సవర్ల బంగారు నగలు, రూ.20వేలు నగదు అపహరించుకుపోయారు. చాకలివీధిలో ఉంటున్న ఉపాధ్యాయులు రమేష్, సంధ్యారాణి వ్యక్తిగత పనులు నిమిత్తం నెల్లూరుకు వెళ్లి వచ్చే లోపే ఇంటి తాళలు పగులకొట్టి 2 సవర్ల బంగారు నగలు, రూ.35 వేల నగదు చోరీ గురైనట్లు బాధితులు వాపోయారు. అలాగే తోలిమిట్ట ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణయ్య నివాసంలో 63 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు చోరీకి గురైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నాలుగు ఇళ్లల్లో 24వ తేదీ రాత్రి చోరీ జరిగి శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సీఐ ఏవీ రమణ తెలిపారు. -
తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్
తిరుపతి అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ) జగదీష్ ఆర్టీసీ డ్రైవర్లను ఆదేశించారు. తిరుపతిలోని డీపీ టీఓ కార్యాలయంలో ఆర్టీసీ డ్రైవర్లు, అన్కాల్ డ్రైవర్లు, హైయర్ బస్సు డ్రైవర్లకు శు క్రవారం ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు 1,450 మంది. అన్కాల్ డ్రైవర్లు(కాంట్రాక్) 260 మంది, హైయర్ బస్సు డ్రైవర్లు 440 మంది(అద్దె బస్సు డ్రైవ ర్లు)కు ప్రమాదాల నివారణపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డ్రైవర్లకు టార్గెట్ ఇవ్వడంతోనే దూకుడుగా డ్రైవింగ్ చేస్తున్నారని, టార్గెట్ తొలగిస్తే దూకుడు తగ్గించి ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తారని ఈ సందర్భంగా కొందరు డ్రైవర్లు తెలిపారు. అమ్మవారి సేవలో తమిళనాడు గవర్నర్ చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావ తి అమ్మవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ డిప్యూ టీ ఈఓ హరీంద్రనాథ్ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్కు తిరుచానూరు పత్రిక విలేకరులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన్ను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఏపీ ఎన్జీఓ ఎన్నికలు ఏకగ్రీవం తిరుపతి అర్బన్: నగరంలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో శుక్రవారం నూతన అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల అధికారిగా ఎన్జీఓ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి శ్రీనివాసన్, రాష్ట్ర పరిశీలకులుగా జగదీష్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్బాబు, సహా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, చలపతి నాయక్, గిరిబాబు, నాగరాజు కుమార్, హేమగిరి, మహిళ ఉపాధ్యక్షురాలిగా ప్రేమలత, జిల్లా కార్యదర్శిగా రఘు, కార్య నిర్వహక కార్యదర్శిగా రమణయ్య, సంయుక్త కార్యదర్శులుగా శ్రీరాములు, శ్రీధర్, లోకనాథ్ బాబు, చెన్నకేశవులు, మైథిలి, సంయుక్త కార్యదర్శి పద్మజ, జిల్లా కోశాధికారిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. -
బాబు రాజ్యం కాదు.. ఎమ్మెల్యేల రాజ్యం
– సీపీఐ జాతీయ నేత నారాయణ ఏర్పేడు: రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యం నడవడం లేదని, ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తోందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏర్పేడు మండలం వికృతమాల ప్రభుత్వ గృహ సముదాయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తోందని, వారు నియోజకవర్గాల నుంచి ముడుపుల మూటలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేరవేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పేదల బాగోగులను గురించి ఆలోచించే తీరిక లేదని, ఆయన కార్పొరేట్ బడాబాబులతో బిజీబిజీగా గడుపుతున్నారని ఆరోపంచారు. వికృతమాల సమీపంలో తిరుపతి పట్టణానికి చెందిన ప్రజలకు తుడా ఆధ్వర్యంలో 75 బ్లాకులతో 1,800 మంది పేదలకు ఇళ్లు ఇచ్చారన్నారు. అయితే అక్కడ మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు మళ్లీ తిరుపతికి వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే ఇల్లు ఇక్కడ, రేషన్ కార్డు తిరుపతిలో ఉండడంతో మిమ్మల్ని రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, మీరంతా తిరుపతి నుంచి వికృతమాల పంచాయతీకి రేషన్కార్డు, ఓటరు కార్డులను మార్చుకుంటే ప్రభుత్వంతో పోరాడేందుకు సంపూర్ణ హక్కులు కలుగుతాయన్నారు. వికృతమాల పంచాయతీలోని గృహ సముదాయాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి కార్యదర్శి జనమాల గురవయ్య, వికృతమాల ప్రభుత్వ గృహాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సీహెచ్ శివకుమార్, కమిటీ సభ్యులు గోవర్ధన్, నారాయణ, శ్రీనివాసులురెడ్డి, వరప్రసాద్, గీత, రాధమ్మ, దీప తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్
తిరుపతి సిటీ: ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిగా నిలిచి ప్రశంసలు పొందుతోందని వక్తలు కొనియాడారు. జాతీ య సంస్కృత యూనివర్సిటీలో శుక్ర వారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ గొప్పతనం, సాంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానాన్ని, లక్ష్యాలను, ప్రగతిని చాటి చెప్పేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరుసార్లు భారతీయ విజ్ఞాన సమ్మేళం నిర్వహించామని, తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత తొలి సారి సమ్మేళనం నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ సందర్భంగా సమ్మేళానికి హాజరైన సీఎం, ఆర్ఎస్ ఎస్ చీఫ్, అతిథులను వర్సిటీ అధికారు లు ఘనంగా సన్మానించారు. తరువాత సమ్మేళనంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించి అభినందించా రు. సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావంతో ఎన్ఎస్యూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనానికి కేంద్రపాలి త ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,250 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఔనత్యాన్ని చాటిచెప్పేలా పలు అంశాలపై వారు ఈ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సమ్మేళనం ప్రారంభం అనంతరం వర్సిటీలోని చెలికాని అన్నారావు భవన్లో ఎన్ఎస్ఏబీ సభ్యులు, మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ విజ్ఞాన్ సమ్మేళనంపై ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రిక కౌషిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ స్టాళ్లు సంస్కృత యూనివర్సిటీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లు ఆకట్టుకున్నా యి. ఇందులో భాగంగా పలు విభాగాలకు చెందిన సుమారు 70 స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఓ, హస్తకళ ప్రదర్శనలు, కలంకారీ, ఐకేఎస్ సిస్టమ్, లేపాక్షి హస్తకళావస్తు ప్రదర్శన, ఎన్ఎస్యూ, కేఎల్ యూనివర్సిటీ పబ్లికేషన్స్, ఉడ్ కవరింగ్ స్టాళ్లు, విజ్ఞాన భారతి పబ్లికేషన్స్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ నమూనా, బీవీఎస్ ప్రయోగ దిక్సూచి ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను వీక్షకులను ఆకట్టుకున్నాయి. -
వేడుకగా గొబ్బిదేవత పురఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవా రం వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం వేడుకగా జరిపారు. తొలుత ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతకు పలు అభిషేకాలు, విశేషాలంకరణ చేశారు. అనంతరం పుర ఉత్స వం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,255 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు త లనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికె ట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భ క్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూ లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారి ని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. కల్కి ట్రస్టు ఆక్రమిత భూములపై విచారణకు ఆదేశం వరదయ్యపాళెం: కల్కిట్రస్టు పరిధిలో ఆక్రమిత అటవీ, ప్రభుత్వ డీకేటీ భూముల వివరాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ బీఎన్కండ్రిగ, వరదయ్యపాళెం మండల తహసీల్దార్లకు ఉత్తర్వులు పంపారు. ఇటీవల కల్కి ట్రస్టు భూము ల ఆక్రమణపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకటసుబ్బయ్య, అటవీ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మేరకు అంజూరు అటవీ ప్రాంతంలో 21 ఎకరాలు, అలాగే వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణ గురించి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పెల్లేటి కోట: రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పె ల్లేటి రాజేష్కుమార్ ను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజా గా ఉత్తర్వులు జారీ చే సింది. రాజేష్కుమార్ కోటకు చెందిన సీనియ ర్ న్యాయవాది పెల్లేటి గోపాల్రెడ్డి కుమారు డు. రాజేష్కుమార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సేవల ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించినట్లు ఆయన తండ్రి గోపాల్రెడ్డి తెలిపారు. -
వేదాంతపురంలో బండిబాట కబ్జా
వేదాంతపురం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 220/4లోని 0.76 సెంట్లు బండి బాటను కొందరు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించి, మరీ అక్రమ కట్టడాలు కడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆ భూమిలో చిన్నపాటి షెడ్లు వేసుకుని నిరుపేదలు నివాసముండగా ఆ షెడ్లను ధ్వంసం చేసి, దర్జాగా కమర్షియల్ గోడౌన్ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆరోపిస్తున్నారు. అంతేకాక 224లో 0.97 ఎకరాల కాలువ భూమిని సైతం పాత కాలం నాటి అడంగల్ రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకుని రూ.కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు పక్కాగా స్కెచ్ వేశా రని స్థానికులు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. విలువైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఆ బాధ్యతలను విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
కొంకా చెన్నాయగుంట రెవెన్యూలో..
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ, మఠం భూములు, లే అవు ట్ ఓపెన్ ప్లాట్లు, కాలువలు, కుంటలు ఆక్రమణలు జరుగుతున్నాయి. పలు చోట్ల వ్యవసాయం కోసం ప్రభుత్వం ఇచ్చిన రైతువారీ పట్టాలను చూపి, అక్రమంగా కట్టడాలు కడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కళ్ల ముందు రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయమవుతున్నా మండల స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు సరికదా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళితే వెనుదిరిగి రావా లని ఆదేశిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన తహసీల్దార్లే తమ సిబ్బంది కాళ్లకు కళ్లెం వేస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని, కట్టడి చేయకుంటే ప్రమాదమని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు హెచ్చరించినా జిల్లా అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం ఆదేశాలు భేఖాతర్.. విజయవాడలో ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తిరుపతి చుట్టు పక్కల భూ కబ్జాలు అధికమవుతున్నాయని, వాటిని ఇప్పుడే కట్టడి చేయకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుందని కలెక్టర్లను హెచ్చరించినా.. జిల్లా అధికారులు చలించడం లేదన్న ఆరోపణలు కొందరు కూటమి నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. కాలువలో మట్టి తోలి పూడ్చి వేసిన ఆక్రమణదారులు వేదాంతపురంలో గోడౌన్ నిర్మాణానికి అక్రమార్కులు కూల్చివేసిన షెడ్లు తిరుపతిలో బరి తెగిస్తున్న అక్రమార్కులు తిరుపతి అర్బన్ మండలం కొంకా చెన్నాయగుంట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 222/5 లో 1.10 ఎకరాల కాలువ పోరంబోకు భూమిని మూడు రోజులుగా కబ్జాదారులు కాజేస్తున్నారని స్థాని కులు చెబుతున్నారు. సుమారు రూ.25 కోట్ల విలువైన ఆ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. ఆ కాలువ భూములపై అధికార పార్టీకి చెందిన స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కన్నుపడిందని, ఆయన తన అనుచరుల ద్వారా ఆ భూములను కాజేస్తున్నారన్న విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఆక్రమణలకు అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి రావడంతో వారు వెనుదిరిగివెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. -
మన్నిక, నాణ్యతలకు ప్రతీకగా భారతి సిమెంట్
నాయుడుపేట టౌన్: మన్నిక, నాణ్యతలకు ప్రతీక భారతి సిమెంట్ అని, ఇది అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోందని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి పాస్టర్ ఆదర్ష్ ప్రీతం కొనియాడారు. నాయుడుపేటలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వద్ద ఆ సంఘం పెద్దలు యువతతో కలిసి పాస్టర్ కేక్ కట్ చేసి భారతి సిమెంట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ వేడకలను భారతి సి మెంట్స్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపా రు. అనంతరం భారతి సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. భారతి సిమెంట్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిప్యూటీ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చైర్మన్ కారల్ మధు, కేఎంవీ కళాచంద్ర, సండే స్కూల్ సూపరిండిండెంట్ ప్రేమ్చంద్, భారతి సిమెంట్స్ డీలర్లు కామిరెడ్డి అమరేంద్రరెడ్డి, కరీంబాయి, చెంచయ్య మొదలియార్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ నేతలు బెన్హర్, కాళహస్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రైలు టికెట్ల ధర పెంపు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: భారతీయ రైల్వేశాఖ సవరించిన ప్రయాణికుల టికెట్ ధరలను శుక్రవారం నుంచి అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చులను సమతుల్యం చేస్తూనే, మరిన్ని సేవలను విస్తరించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం లోకల్, స్వల్ప దూర ప్రయాణాలకు ఎలాంటి ధరల పెంపు లేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్లలోపు దూరానికి పాత ధరలే కొనసాగుతాయి. అయితే 215 కిలోమీటర్లకు మించిన ఆర్డినరీ క్లాస్ ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ధర పెంచారు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్–ఏసీ, ఏసీ క్లాస్లకు కిలోమీటర్కు 2 పైసలు చొప్పున అదనపు ఛార్జీలు విధించారు. ఉదాహరణకు నాన్–ఏసీ రైలులో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గత ధరలతో పోలిస్తే ఈ పెంపు చాలా స్వల్పమైనది. గతంలో ఆర్డినరీ క్లాస్లో కిలోమీటర్కు సగటున 30 నుంచి 50 పైసల ధర ఉండగా, ఇప్పుడు ఒక పైసా మాత్రమే అదనం. మెయిల్, ఎక్స్ప్రెస్ నాన్ ఏసీలో గత రేటు కిలోమీటర్కు సుమారు 50నుంచి 60 పైసలుండగా, 2 పైసల పెంపుతో మొత్తం ధర స్వల్పంగా పెరగనుంది. ఏసీ క్లాస్లో కూడా ఇదే విధానం అమలవుతుంది. ఈ సవరణలు ముందుగా జూన్ 2025లో ప్రకటించిన ఫేర్ రేషనలైజేషన్కు అనుబంధంగా ఉండనుంది. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి. మిశ్రమ స్పందన ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ధరల పెంపును అర్థం చేసుకుంటూ సేవల మెరుగుదలకు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికే పెరిగిన ఇంధన ఖర్చుల మధ్య ఈ పెంపు అనవసరమని వాదన వినిపిస్తున్నారు. దూర ప్రయాణికులపై పడనున్న భారం ప్రజలపై పడే భారం స్వల్పమైనదే అయినప్పటికీ, ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు, రెగ్యులర్ ట్రావెలర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సగటున 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరాని రూ.10నుంచి రూ.20 అదనం పడనుంది. అధికారికంగా ఉత్తర్వులు రాలేదు.. కాగా తిరుపతికి రోజుకు సుమారు 100 రైళ్లు వివిధ రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ఎక్స్ప్రెస్ రైళ్లు 60, వీక్లీ రైళ్లు 20, ప్యాసింజర్ రైళ్లు 20 ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు దాదాపు 50 వేల మంది వరకు ప్రయాణికులు వస్తుంటారు. అయితే ఇప్పటివరకు రైలు టికెట్ ధరల పెంపు సవరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తమకు రాలేదని తిరుపతి రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. తాము కూడా పత్రికల్లో వచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. -
సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండండి
తిరుపతి తుడా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొననున్న సంస్కృత వర్సిటీ, జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఏర్పాట్లలో ముఖ్యమంత్రి వెళ్లే మార్గాల్లో పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చాలని, డివెడర్లకు రంగులు వేయాలని తెలిపారు. డివెడర్ల మధ్యలో మొక్కలు ఏర్పాటు చేయాలని, రోడ్లపైన మట్టి లేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా, బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, డీఈలు, శానిటరీ సూపర్ వైజర్లు ఉన్నారు. -
ఇన్చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..
మితిమీరిన రాజకీయ జోక్యం..ఏక పక్షంగా వ్యవహరించాలన్న ఒత్తిళ్లతో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. అధికారులు లేక ఆ పోస్టులన్నీ ఇన్చార్జిలకు అప్పగించడంతో పర్యవేక్షణ కొరవడి అభివృద్ధి కుంటుపడుతోంది. చంద్రగిరి నియోజవర్గంలోని ఆరు మండలాల్లో పలు పోస్టుల్లో ఇన్చార్జిల పాలనే కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరికి రెండు, మూడు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిళ్లతో సెలవులో వెళుతున్నారు. ఫలితంగా మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. తుమ్మలగుంటలో మురుగు కాలువ పైకప్పు పనులు అర్ధంతరంగా ఆపివేయడంతో తుప్పుపడుతున్న కమ్మీ సాక్షి, టాస్క్ఫోర్స్: మండల స్థాయిలో కీలకంగా పనిచేసి అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాల్సిన స్థానాలన్నీ ఇన్చార్జిల చేతుల్లోకి వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడే గప్చుప్ అన్నట్టుగా సాగుతున్నాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు పోటీలు పడుతుంటారు. ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో పోస్టింగ్లు వేయించుకోవాలి. అయితే ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గంలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా మారిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండడం, ఆ పోస్టులన్నీ ఇన్చార్జులతో నెట్టుకొస్తుండడంతో సకాలంలో పనులు జరగడం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉద్యోగుల బదిలీల్లో స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధితోపాటు వారి కుటుంబ సభ్యుల జోక్యంతో చాలా మంది మండల స్థాయి అధికారులు చంద్రగిరి నియోజకవర్గానికి రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అవినీతికి అలవాటుపడి అన్నింటికీ సిద్ధమైన కొందరు అధికారులు మాత్రం చంద్రగిరిలో పోస్టింగ్ వేసుకుని, రాజకీయాలు చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో పరిపాలనను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది అధికారులు ఇవేమీ తెలియకుండా విధుల్లో చేరి ఆ తరువాత అధికార పార్టీ నేతల నుంచి అధికంగా ఒత్తిళ్లు వస్తుండడంతో ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనని దీర్ఘ కాలిక సెలవులో వెళుతున్నట్టుగా సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చినా.. చంద్రగిరి నియోజకవర్గంలో విధులు నిర్వహించడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన అధికారులెవరూ మొగ్గు చూపకపోవడంతో పక్క జిల్లాల నుంచి బలవంతంగా పోస్టింగ్ ఇచ్చి, తీసుకువస్తున్నట్టు సమాచారం. అయితే అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన అధికారులు తమకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉడతా భక్తిగా విధులు నిర్వహించి వెళుతున్నారే తప్ప, ప్రజలకు జవాబు దారీగా పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు మండలాల్లోనూ ఇన్చార్జిల పాలనపాకాల మండల తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ స్థానానికి ఎవరూ రాక పోవడంతో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్సాయికి ఇన్చార్జి తహసీల్దార్గా అవకాశం కల్పించారు. అలాగే సీఐగా పనిచేస్తున్న సుదర్శన్ప్రసాద్కు కూడా ఇన్చార్జిగానే అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలాగే రామచంద్రాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్ స్థానం ఖాళీగా ఉండడంతో కుప్పంబాదూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ధనశేఖర్కు ఏఈగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే అధికారం ఆయనకు పూర్తి స్థాయిలో లేనందున బిల్లు ఆలస్యమవుతున్నట్టు సమాచారం. అనుప్పల్లి, నెత్తకుప్పం వీఆర్వోలుగా ఇన్చార్జిలు పనిచేస్తున్నందున రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నగొట్టిగల్లు మండల గృహ నిర్మాణశాఖ ఏఈ పోస్టు ఖాళీగానే ఉండడంతో ఇంజినీరింగ్ అసిస్టెంట్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అతనికి బిల్లులు పెట్టే అధికారం లేకపోవడంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు పడలేదని బాధితులు చెబుతున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగానే ఉండడం, దేవరకొండ వీఆర్వో పోస్టు ఇన్చార్జులకు అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడంలేదు. ఎర్రావారిపాళెం మండలంలో తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ స్థానానికి డిప్యూటీ తహసీల్దార్ వాసుదేవ కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చంద్రగిరి మండలంలో చంద్రగిరి –1, చంద్రగిరి–3, కల్రోడ్డుపల్లి, ముంగిలిపుట్టు, దోర్నకంబాల వీఆర్వోలుగా ఎవరూ రాకపోవడంతో ఆ స్థానాలకు ఇన్చార్జి వీఆర్వోలు సేవలు అందిస్తున్నారు. ఇలా వరుసగా ఇన్చార్జిల పాలన సాగుతుండడంతో సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద మండలంలోనూ అదే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో 34 గ్రామ పంచాయతీలు కలిగిన అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్ మండలంలోని కీలక పోస్టులన్నీ ఇన్చార్జిల పాలన కొనసాగుతుండడంతో పరిపాలనపై పట్టు తప్పుతోందని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు నెలలుగా డిప్యూటీ ఎంపీడీఓకు ఇన్చార్జి ఇచ్చి, తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఆయనకే మరో పంచాయతీకి కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో మూడు ఉద్యోగాలు ఒక్కరే ఎలా చేస్తారని పలువురు ఎంపీటీసీ సభ్యులు మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అత్యధికంగా ఇన్చార్జిలతో పరిపాలన సాగిస్తున్నట్టు సమాచారం. మండల స్థాయిలో అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాల్సిన సీట్లు ఖాళీగా ఉండడం, ఆ సీట్లలోకి అర్హత లేని అధికారులను ఇన్చార్జిలుగా నియమిస్తుండడంతో వారికి అధికారం లేక అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు సైతం లేకపోవడంతో రెండు, మూడు పంచాయతీలకు ఒకరు ఇన్చార్జిగా పనిచేయాల్సి వస్తోంది. దీంతో పని ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నట్టు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జిల పాలన ఇంకెంత కాలమని, ఇన్చార్జి ఎంపీడీఓ దయాసాగర్ను ప్రశ్నిస్తున్న ఎంపీపీ (ఫైల్)మితిమీరిన రాజకీయ జోక్యం -
కోడి పందేల స్థావరాలపై దాడులు
సైదాపురం: మండలంలోని పెరుమాళ్లపాడు శివారులో గురువారం కోడి పందేల స్థావరాలపై ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3320 నగదుతోపాటు ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారిపై కేసును నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నా భార్యను కిడ్నాప్ చేశారు!సైదాపురం: తాను ప్రేమించి వివాహం చేసుకున్న తన భార్యను ఆమె బంధువులు తనపై నిర్థాక్షిణ్యంగా దాడి చేసి, కిడ్నాప్ చేశారని సైదాపురం మండలంలోని కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం మేరకు.. మండలంలోని కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కందుకూరు మండలానికి చెందిన మైత్రి అనే యువతి బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోనే ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న సమయంలో ఇరువురు ప్రేమించుకున్నారు. ఈనెల 15వ తేదీ హైదరాబాద్లోనే వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇద్దరం కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ విషయమై పోలీసుస్టేషన్కు పిలిచి ఇరువురి పెద్దల సమక్షంలో రాజీ చేసి పంపేశారు. అయితే గురువారం సెలవు దినం కావడంతో శివశంకర్ తన భార్య మైత్రితో కలిసి స్వగ్రామం నుంచి బైక్పై గూడూరుకు వస్తుండగా తమ భార్య బంధువులు కర్రలతో దాడి చేసి, తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకునిపోయారని భాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. 60 సవర్ల బంగారం, రూ1.50 లక్షల నగదు చోరీ వెంకటగిరి రూరల్: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక ఎస్ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముట్టెంబాకలో వ్యవసాయ మోటార్ల చోరీ వాకాడు: మండలంలో ని ముట్టెంబాక గ్రామంలో మూడు రోజులుగా పలువురు రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు వరుస చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు విక్రమ్, శ్రావణ్, నారాయణ గురువారం వాకాడు పోలీస్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వ్యవసాయ మోటార్లను కోట క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి ఆటోలో దించుతుండగా బాధిత రైతు ఒకరు గమనించి కోట పోలీసులకు సమాచారం అందిచాడు. వెంటనే స్పందించిన కోట ఎస్ఐ పవన్కుమార్ అక్కడకి చేరుకుని మోటార్తోపాటు ఆటో, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరుసగా మూడు రోజులు 3 మోటార్లు చోరీకి గురి కావడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళన చెందుతున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దేశవ్యాప్తంగా గురువారం సెలవు దినం, వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల కొండంతా భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచే భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. అలిపిరి మెట్టు మార్గాల్లో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక క్యూ శిలాతోరణం వరకు ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎస్ఎస్డీ టైం స్లాట్ దర్శనాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. తలనీలాలు సమర్పించుకునే భక్తులతో కళ్యాణకట్టలు కిక్కిరిసిపోయాయి. అన్నప్రసాద భవనాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి నిరంతరంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. భద్రతా పరంగా అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్వే విధానాన్ని అమలు చేస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు, హోటళ్లు, వసతి గృహాలు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ముందస్తు బుకింగ్ లేకుండా రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు సహనం పాటిస్తూ, టీటీడీ సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. ప్రభుత్వ కుంట ఆక్రమణ చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రభుత్వ కుంటను స్థానిక టీడీపీ నేత ఆక్రమించుకుంటున్నాడు. ఆరేపల్లి లెక్క దాఖల సర్వే నంబర్ 142/6లో 30 సెంట్ల కుంట ఉంది. ఇక్కడ గతంలో పురాతన కోనేరు ఉండేది. కాలక్రమేణ కోనేరు పూడిపోవడం, రెవెన్యూ రికార్డుల్లో కుంట భూమిగా నమోదైంది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆ భూమిపై కన్నేశాడు. రెండు రోజులుగా నిరంతరం మట్టిని తరలించి, కుంటను చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. విలువైన భూములు ఇలా అన్యాక్రాంతం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రగిరిలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే, నామమాత్రంగా పనులను అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
దేవుడు కనిపించాడు!
దివ్యదర్శన టోకెన్ల క్యూలలో తోపులాట ఆ నగుమోమును చూడాలని.. నిలువెత్తు మూర్తిని దర్శించుకోవాలని.. ఆ అమృతమూర్తిని కనులారా వీక్షించాలని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరునగరికి చేరుకున్నారు. అయితే వారికి ఏడుకొండల వాడి పాదాల చెంతన ఉన్న అలిపిరిలోనే ఆ దేవదేవుడు కనిపించాడు. తోపులాటలో చిన్నా, పెద్దా, వయోవృద్ధులు వర్ణించనలవికానీ అగచాట్లు పడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తండ్రీ నిను చూడాలని వచ్చిన మాకు ఇన్ని ఇక్కట్లా అని ఆవేదన చెందారు. పండుగ సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు భక్తులు అత్యధిక సంఖ్యలో చేరుకున్న దర్శన టోకెన్ల కోసం అష్టకష్టాలు పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం కంటే మించి రెండింతల మేరకు భక్త జనం చేరుకోవడంతో క్యూలన్నీ కిక్కిరిసి పోయాయి. దివ్యదర్శన టోకెన్ జారీ కౌంటర్ వద్ద భక్తులు పోటెత్తడంతో నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది చర్యలు ఏమాత్రం ఫలించలేదు. భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాటలు చోటుచేసుకుని అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కంచెలను దాటే ప్రయత్నంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ ఏ మాత్రం దగ్గలేదు. నిర్దేశించిన మేరకు టోకెన్ల జారీ పూర్తి అయిందనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహంగా ఊసురోమంటూ వెనుదిరిగారు. కాగా ఈ ఘటన చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్ కెమెరాను ఏవీఎస్ఓ లాక్కున్నారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్ -
యూరియా..లేదయ?
రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా కావాల్సినంత యూరియా దొరికేది. సకాలంలో పంటలకు వేసుకునేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే అరకొర యూరియా ఎక్కడికీ చాలడం లేదు. ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ఎస్కేలు.. ఫర్టిలైజర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ.. అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరులోని రైతు సమాఖ్య సెంటర్, గ్రోమార్ దుకాణాల వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులు (ఫైల్) బ్లాక్లో బస్తా యూరియా రూ.500 పైమాటే స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకలో యూరియాను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆటో డ్రైవర్లకు ఇది బాగా కలిసి వస్తోంది. నిత్యం బోర్డర్కు వెళ్లడం.. పది బస్తాలను ఆటోలో తెచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. కర్ణాటకలో బస్తా యూరియా ధర రూ.270 కాగా అది బ్లాక్లో రూ.500 దాటుతోంది. ఎరువుల దుకాణాల్లో నోస్టాక్ జిల్లాలోని ఎరువుల దుకాల్లో యూరియా స్టాకు లేదు. వీరికి హోల్సేల్గా సరఫరాచేసే ఏజెన్సీలు యూరియా కావాలంటే కాంప్లెక్స్ తీసుకోవాలంటూ మెలిక పెట్టాయి. దీంతోపాటు ఇక్కడ ఎమ్మార్పీ రూ.275కి విక్రయించాల్సి ఉండగా..ట్రాన్స్ఫోర్ట్ చార్జీలు అదనంగా ఉంటున్నాయి. దీంతో బస్తా రూ.300పైగా విక్రయించాలి. లేని సమస్యలకెందుకని ఫర్టిలైజర్స్ యూరియాను అసలు కొనడం లేదు. దీనికితోడు ప్రభుత్వం సైతం ఆర్ఎస్కేలు, రైతు సమాఖ్య, గ్రోమార్ సెంటర్లకు మాత్రమే యూరియాను పంపుతోంది. పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతు న్న కష్టాలు అన్నీఇన్నీకావు. మొన్నటి దాకా కాంప్లెక్స్ లేదా ఫర్టిలైజర్స్ కొంటేనే యూరియా అమ్మిన ఎరువుల దుకాణదారులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్గా అందే జిల్లాలోని గ్రామోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకా ణాలకు వందలాది మంది రైతులు క్యూకడుతున్నారు. వారిని నియంత్రించేందకు పోలీసు బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారుమళ్లకు సైతం యూరియా దొరకడం లేదు. ఏపీ రైతుల దెబ్బ కు పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం స్టాకు లేకుండా పోయింది. ఉన్న స్టాకును కొందరు బ్లాక్ మార్కెట్లోకి తరలించి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల్లో కావాల్సినంత యూరియా దొరగ్గా కూటమి పాలనలో మాత్రం ఎందుకు యూరియాకు డిమాండ్ వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడా యూరియా లేదు జిల్లాలో యూరియా దొరక్క రైతులు పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. భారీగా పెరిగిన వరి సాగు జిల్లాలో గత ఖరీఫ్లోనూ వరిసాగు పెరిగింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దీంతో సాధారణ వరిసాగు ఈ రబీలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నారుమళ్ల సీజన్ నడుస్తోంది. దీంతోపాటు మొక్కజొన్న, పశుగ్రాసం, మల్బరీ పంటలకు సైతం రైతులు యూరియాను వాడుతున్నారు. జిల్లాలో డిమాండ్ మేరకు యూరియా అలాట్మెంట్ మాత్రం పెరగడం లేదు. గంటల్లో ఖాళీ ఇటీవల జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో ఒక్కో పంచాయతీకి రూ.250 బస్తాల యూరియా వచ్చింది. ఇది కేవలం గంటల్లో ఖాళీ అయిపోయింది. ఇందులో సింహభాగం కూటమి నేతలకే చేరిపోయింది. ఫలితంగా అవరసమైన రైతులు బ్లాక్లో కర్ణాటక నుంచి అధిక ధరతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లా సమాచారం జిల్లాలో యూరియా నో స్టాక్ దొరకలేదు ఓ బస్తా యూరియా కోసం వారం రోజులుగా పలమనేరు లోని దుకాణాల వద్దకు తిరు గుతున్నా. కానీ ఫలితం లేదు. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అన్నా ఇప్పుడు యూరియా దొరకడం లేదు. మా బంధువుల ద్వారా కర్ణాటకలోని వడ్డిపల్లికెళ్లి బస్తా యూరియా తెచ్చుకున్నా. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
స్మార్ట్ మీటర్లను లోకేష్ పగలగొట్టమన్నారు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు అమర్చితే వాటిని పగలగొట్టమని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు అమర్చడం ఎంత వరకు న్యాయం. అధికారంలో ఉంటే ఒక మాట.. అధికారం లేకుంటే మరో మాట చెప్పడం సరికాదు. మాకు స్మార్ట్ మీటర్లు వద్దు. పాత మీటర్లు మాత్రమే కావాలి. –కోమల, మారుతి నగర్, తిరుపతి స్మార్ట్ మీటర్ల అమరిక ఆపివేయండి ప్రజలపై తీవ్రమైన భారాన్ని మోపి...బడా వ్యాపారి ఆదానీకి లాభాలు చేకూర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా స్మార్ట్ మీటర్లు అమర్చితే ప్రతిఘటన తప్పదు. కార్పొరేట్ లాభాల కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం సరికాదు. స్మార్ట్ మీటర్ల అమర్చడాన్ని తక్షణమే ఆపివేయాలి. – వేణుగోపాల్, సీపీఎం తిరుపతి నగర కార్యదర్శి -
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. ముఖ్యప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎ లక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసిన ట్లు చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు న కిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమ తి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నా రు. -
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్ 3, యూఏఈ 2, దిర్హమ్లు. ఇంగ్లాండ్ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు. బ్రహ్మర్షి ఆశ్రమంలో మారిషష్ మంత్రి రామచంద్రాపురం: మండలంలోని సి.రామాపు రం సమీపంలో శ్రీబ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని బుధవారం మారిషస్ విద్యాశాఖ మంత్రి గంగా ప్రసాద్మొహద్ సందర్శించారు. ఆశ్రమంలో జ రుగుతున్న శ్రీఅష్టలక్ష్మి మహాయజ్ఞంలో పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మర్షి గురూజీ గురువాయనంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశ్రమ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి బ్రహ్మశ్రీ గురుజీ పుస్తకాన్ని అందజేశారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.33.25 లక్షల నష్టం
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రా మం, శ్రీరామనిలయం, టవర్ స్ట్రీట్, రామకృష్ణ మిషన్ సమీపంలో నివాసం ఉంటున్న బీటెక్ పూర్తి చేసిన వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. 42 ఏళ్ల వ్యక్తికి గత నెల 23న ఒక గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ నుంచి లింక్ పంపించి, ఆన్లైన్ ఇన్స్టిట్యూషనల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేయించి, ఇన్స్టిట్యూషనల్ షేర్లు, ప్రీ–ఐపీఓ ట్రేడింగ్ పేరుతో వివిధ బ్యాంక్ ఖాతాలకు కొంత నగదు బదిలీ చేయించారు. ఆ తరువాత నవంబరు 24వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు వివిద దశల్లో 33.25లక్షలు యాప్ ద్వారా బదిలీ చేయించారు. ఆ యాప్లో లాభాలు వచ్చినట్లు చూపించి, మొత్తం ఉపసంహరణ కోరిన సమ యంలో లాభంపై 20 శాతం కమిషన్, అనంతరం ప్రీ–ఐపీఓ పేరుతో అదనపు భారీ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుకు అనుమానం కలిగి, సైబర్ క్రైమ్ పోలీసు అధికారులను సంప్రదించారు. అది నకిలీ యాప్ అని నిర్ధారించుకున్న తరువాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు సంబంధిత బ్యాంక్ ఖాతాలు, యాప్ లింకులు, ఫోన్ నంబర్లు, డిజిటల్ ట్రాన్ట్రాక్షన్లపై సైబర్ నిపుణుల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. రాష ్ట్రస్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు ప్రథమ స్థానం తిరుపతి కల్చరల్: జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవ పోటీల్లో జిల్లా కళాకారులు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నట్లు సెట్విన్ కార్యనిర్వాహణాధికారి డాక్టర్ పి.యశ్వంత్ తెలిపారు. రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ఎం.చంద్రశేఖర్(జానపద గీతం గ్రూపు), బి.హర్షితారెడ్డి(స్టోరీ రైటింగ్) రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వీరు 2026 జనవరి 12న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం తరఫున అర్హత పొందారని తెలిపారు. వీరిని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్తో పాటు సెట్విన్ మేనేజర్ మోహన్కుమార్ అభినందించారు. లారీని ఢీకొన్న కారు నాయుడుపేటటౌన్: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన వారు చైన్నె వైద్యశాలలో ఉన్న వ్యక్తిని తీసుకుని కారులో బయలు దేరారు. కారు బిరదవాడ గ్రామానికి వచ్చే సరికి జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరోగ్యం సరిగాలేని వ్యక్తితో పాటు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరు మరో కారులో నెల్లూరుకు తరలి వెళ్లారు. కారు ముందు భాగం దెబ్బతింది. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం స్వాధీనం.. ముగ్గురి అరెస్టు భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం అక్రమ ర వాణా చేస్తున్న ముగ్గు రు కూలీలను అటవీ అ ధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దుంగలు, వాహనం విలువను సుమారు రూ.9 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. కొందరు ఎర్రచందనం దొంగలు పరారైనట్లు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురు ఎర్రకూలీలు తమిళనాడుకు చెందినవారన్నారు. పట్టుకున్న వారి వివరాలు తంజియప్పన్, కార్తి చిన్నసామి, కుమార్ అని తెలిపారు. వారిని రిమాండ్కు తరలించారు. -
ఎట్టకేలకు తొలగిన విద్యుత్ తీగలు
చిల్లకూరు: ఎట్టకేలకు విద్యుత్ శాఖాధికారులు స్పందించి తీగలు తొలగించారు. గూడూరు పట్టణానికి సమీపంలో కాశీ లే అవుట్లో ఓ భవనం నిర్మాణ పనులకు విద్యుత్ స్తంభం నుంచి నేరుగా విద్యుత్ లైన్లకు వైర్లు తగిలించి, విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న అంశంపై సాక్షి దినపత్రికలో ఆదివారం ‘దర్జాగా విద్యుత్ చౌర్యం’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, చౌర్యానికి పాల్పడుతున్న విషయం గుర్తించి స్తంభానికి తగించి ఉన్న వైర్లను తొలగించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని అధికారులు వారిని హెచ్చరించినట్లు తెలిసింది. -
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం జరిగిందని, ఈ డిసెంబర్ 31వ తేదీలోగా మరో 5 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరుతో 50 వేల సర్వీసుల మార్కును చేరుకోవాలని జిల్లా స్థాయి విద్యుత్ అధికారులకు సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్పై అవగాహన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంపై వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించాలని సీఎండీ సూచించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఇతర గృహ వినియోగదారులను కూడా సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ’కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమం జరిగిన తీరుపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కే.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పీహెచ్ జానకీరామ్, ఎం.మురళీకుమార్, పి. సురేంద్రనాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, విజయన్, రామచంద్రరావు, చక్రపాణి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖరరావు, రాఘవేంద్రరావు, రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ
తిరుపతి సిటీ: దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ అధికారులకు అందజేశారు. ఈ సీడీసీ డీన్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, కల్చరల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ కేఎం భాను, కళ్యాణ్ పాల్గొన్నారు. -
ఇసుక ఉచితం.. దోపిడీ నిజం
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌకనాయుడుపేటటౌన్: ఇసుక ఉచితం పేరుతో అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. స్వర్ణముఖి నదిని ఇసుకాసురులు ధ్వంసం చేస్తున్నారు. నదిలో అక్రమంగా ఇసుక తరలించకూడదని, ఇందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇసుకస్మగర్లు ఆ ఆదేశాలను బేఖాతార్ చేస్తున్నారు. మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం వద్ద ఉన్న స్వర్ణముఖి నది నుంచి రోజు తమిళనాడుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో రహస్య ప్రదేశాల్లో ఇసుక డంపింగ్ చేసుకుని, దర్జాగా టిప్పర్లలో తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. అంతే కాకుండా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఏల్ఏ సాగరం, బీడీ కాలనీ, మర్లపల్లి, అన్నమేడు, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం, భీమవరం తదితర గ్రామాల్లో చాలాచోట్ల ట్రాక్టర్లు, టిప్పర్లు రాకపోకలు సాగించేలా స్వర్ణముఖి నది పొర్లు కట్టలను సైతం ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమంగా తరలింపు యథేచ్ఛగా సాగిస్తున్నారు. నదిలో నీరు ప్రవహిస్తున్నా ఇసుకను తరలిస్తున్నారు. ఇంటి అవపసరాల పేరుతో అధికంగా పరిశ్రమలతోపాటు కాంక్రీట్ మిక్చర్ ప్లాంట్లు, డంపింగ్ యార్డులకు ఇసుకను తరలించి, అధిక ధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని చిగురుపాడు, మర్లపల్లి, అయ్యప్పరెడ్డిపాళెం తదితర గ్రామాల్లో ఇదెక్కడి అన్యాయమని అడుగుతున్న గ్రామస్తులపై అక్రమార్కులు దౌర్జ్యనానికి దిగుతున్నారు. నది పొర్లుకట్టలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో వారి తీరుపై ప్రజలు బాహటంగా విమర్శిస్తున్నారు. చిగురుపాడు సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నది వద్ద అడ్డుకట్టలు వేసినా వాటిని తొలగించి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని పండ్లూరు పలు ప్రాంతాల్లో ఇసుకను డంపింగ్ చేసుకుని రాత్రి సమయాల్లో టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్లకే కాకుండా తడ ప్రాంతానికి చెందిన కొంత మంది ఇసుక స్మగర్లు నాయుడుపేటకు వచ్చి ట్రాక్టర్లలో తమిళనాడు సరిహద్దు వరకు ఇసుకను తరలిస్తున్నారు.నాయుడుపేట నుంచి తమిళనాడు ఇసుక తరలిస్తున్న టిప్పర్లు అయ్యప్పరెడ్డిపాళెం సమీపంలో ఇసుక అక్రమ తరలింపు ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలితిరుపతి అన్నమయ్యసర్కిల్: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయా లని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.నాయుడుపేటలోని స్వర్ణముఖి ఇసుక వ్యాపారులకు వరంగా మారింది. సామాన్యుల ఇళ్ల అవసరాలకు ఉచితంగా ఇసుక తరలించుకోవచ్చన్న ప్రభుత్వ నిబంధనను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిత్యం అధిక సంఖ్యలో టిప్పర్లలో తమిళనాడుకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. అయ్యప్పరెడ్డిపాళెం టూ తమిళనాడు -
తిరుపతిలో స్మార్ట్రగడ
‘ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. అవి సామాన్యులకు పెనుభారం. వాటిని పగులగొట్టేయండి.’ ఇదీ నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట. గద్దెనెక్కిన అనంతరం చల్లగా స్మార్ట్ మీటర్ల అమరిక.. జనం నాడు లోకేష్ చెప్పిన మాటలు మర్చిపోలేదు. మాకొద్దు స్మార్ట్ మీటర్లు.. పాతమీటర్లే ముద్దు అని.. గొడవ చేశారు. చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.. ఈ ఘటన బుధవారం తిరుపతి మారుతీనగర్లో చోటు చేసుకుంది. తిరుపతి అర్బన్: నగరంలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై మారుతీనగర్లో బుధవారం రగడ చోటుచేసుకుంది. ప్రైవేటు వ్యక్తులు ఆదానీ పేరు చెప్పి.. మా అనుమతి లేకుండా పాత మీటర్లు తొలగించి.. స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తారంటూ తిరుపతిలోని మారుతీనగర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ స్మార్ట్ మీటర్ల పెడితే వాటిని పగలగొట్టాలని ఆదేశాలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు పెట్టించడం ఎంత వరకు న్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వద్దు.. పాత మీటర్లు ముద్దు అంటూ బిగించేవారని అడ్డుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎలా వస్తారంటూ మండిపడ్డారు. అయితే వారు తాము ఎస్పీడీసీఎల్ వాళ్లమని చెప్పకొచ్చారు. ఈ క్రమంలో స్థానికులకు మీటర్లు బిగిస్తున్న వారికి పెద్ద ఎత్తున వాగ్వావాదం చోటుచేసుకుంది. ఎస్పీడీసీఎల్ అధికారులతో తాము మాట్లాడుకుంటామని, మీటర్లు అమర్చకుండా వెళ్లిపోవాలని అభ్యతరం చెప్పడంతో వాళ్లు మీటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. ముందే కరెంట్ చార్జీలను భరించలేక నానా తిప్పులు పడుతున్నామని..స్మార్ట్ మీటర్లు అమర్చితే రీచార్జిబుల్ మీటర్లుగా మారుతాయని.. తాము రీచార్జి చేసుకోలేమని తేల్చిచెప్పేశారు. -
రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఆరుగురి ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : కేవీబీపురం మండలం, రాగిగుంట జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మంగళవారం తిరుపతి జిల్లాస్థాయి మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతి అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరచిన ఆరుగురు ఉపాధ్యాయినులు డి.జ్యోతి (ప్రధానోపాధ్యాయిని, ఎస్పీజేఎన్ఎం హైస్కూల్), డి.హేమలత(సంస్కృత ఉపాధ్యాయిని, ఎస్పీజేఎన్ఎం హైస్కూల్), డి.నాగవేణి (ఫిజిక్స్ ఉపాధ్యాయిని, ఆర్ఎస్ మాడవీధి నగరపాలక హైస్కూల్), బి.మహేశ్వరి (బయాలజీ ఉపాధ్యాయిని, మాలవ్యాజి నగరపాలక హైస్కూల్), పి.సరోజిని (ఎస్జీటీ, దొడ్డాపురం నగరపాలక ప్రాథమిక పాఠశాల), వి.సునీత (ఎస్జీటీ, పెద్దకాపు వీధి నగరపాలక ప్రాథమిక పాఠశాల) జనవరిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ఉపాధ్యాయినులను తిరుపతి అర్బన్ ఎంఈఓలు కె.బాలాజీ, బి.భాస్కర్నాయక్, అలాగే యూటీఎఫ్ నాయకులు బండి మధుసూదన్రెడ్డి, ఎన్.మోహన్, ఎస్.ఖాదర్బాషా, ప్రభుకుమార్, ఎస్టీయూ నాయకులు మునికృష్ణనాయుడు, రేణుకాదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. -
స్టార్టర్లు, మోటార్లు చోరీ
తిరుపతి రూరల్: మండలంలోని కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని పొలాల్లో మంగళవారం రాత్రి 5 చోట్ల స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, మోటార్లు చోరీ చేశారు. చోరీకి గురైన స్టార్టర్లు, మోటార్లు, వైర్లు సుమారు రూ.1.50 లక్షల చేస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చోరీకి సిమెంటు బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తి సమీపంలోని భాగ్యనగరం ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు తిరుపతి రూరల్: మండలంలోని ఓటేరు పంచాయతీ రామకృష్ణనగర్లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కథనం మేరకు.. రామకృష్ణనగర్కు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఇంటి నుంచి బయటకు వెళ్లి, 2.40 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి తలుపు గడియ విరిచి లోపల దాచిన రూ. 1.38 లక్షల నగదు, 8.50 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకువెళ్లారు. ఈ మేరకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతిలోని సంజయగాంధీ కాలనీకి చెందిన బద్దనల హరి గా గుర్తించి, బుధవారం తనపల్లి కూడలిలో అరె స్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగ దు ఖర్చు చేసేయడం, బంగారు ఆభరణాలను ఓ మహిళకు ఇచ్చినట్టుగా నిందితుడు పోలీసులకు తెలిపారు. నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్కు తరలించినట్టు సీఐ చిన్న గోవిందు తెలిపారు. కేసు చేధించిన ఎస్ఐ, ఐడీపార్టీ సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్, సీఐ చిన్న గోవిందు అభినందించారు. ఆకట్టుకున్న బాలఏసుతో మరియమ్మ సైకత శిల్పం చిల్లకూరు: తీర ప్రాంతంలోని ఏరూరు గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సైకత శిల్పి మంచాల సనత్కుమార్ తనదైన శైలిలో బుధవారం సెయింట్ జాన్స్ లూథరన్ చర్చి ఆవరణలో బాలఏసుతో ఉన్న మరియమ్మ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఏసు క్రీస్తు ప్రభువు జన్మ స్థలం ఒక పశువుల పాకగా ఉండడంతో దానిని ఆధారం చేసుకుని సైకతశిల్పి పొత్తిగుడ్డలో ఉన్న బాల ఏసును తల్లి మరియమ్మ ఎత్తుకుని తన్మయత్వంతో ఉన్నట్లు సైకత శిల్పాన్ని రూపొందించడంతో పలువురిని ఆకట్టుకుంది. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మేనిపాడు విద్యార్థుల ప్రతిభ ఓజిలి: బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో ఆర్మేనిపాడు విద్యార్థులు ప్రదర్శించిన ఎకో ఫ్రెండ్లీ ఫ్లోర్క్లీనర్ జాతీయ స్థాయికి ఎంపికై నట్లు హెచ్ఎం ఎం నరేంద్ర, సైన్స్ ఉపాధ్యాయుడు సురేంద్రరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేంద్రరెడ్డి మండలస్థా యి విద్యవైజ్ఞానిక మేళాలో ఆర్మేనిపాడు ఉన్నత పాఠశాల ఆరో తరగతి చదువుతున్న అవంతిక, వసిదాలు తయారు చేసిన ప్రదర్శన జిల్లా పోటీలకు ఎంపికై ంది. జిల్లా స్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రదర్శన ఉత్తమ ప్రతిభ కనబరడంతో జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం ఈ నెల 23, 24న విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మేళాలో గ్రూప్ 1 విభాగంలో అత్యంత ఉత్తమ ప్రతిభను కనబరచడంతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి విద్య,వైజ్ఞానిక ఎంపికై ందని సైన్స్ ఉపాధ్యాయుడు సురేంద్రరెడ్డి తెలిపారు. -
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి
తిరుపతి సిటీ: విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో జరిగిన జిల్లాస్థాయి కేరీర్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విద్యార్థులు తాము రూపొందించిన ప్రయోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నైపుణ్యాల ప్రదర్శనలను అధికారులు, వీక్షకులను ఆకట్టుకున్నాయి. జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు, అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్రావు, స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్ర పరిశీలకులు చాయేంద్ర, స్కిల్ డెవలప్ మెంట్ జిల్లా అధికారి లోకనాథం, జీసీడీఓ పుష్ప, పాల్గొన్నారు. -
ఆదానీ, అంబానీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు
ఆదానీ, అంబానీకి చెందిన ప్రైవేటు స్మార్ట్ మీటర్లు మాకొద్దు. 400 విలువ చేసే స్మార్ట్ మీటర్లకు 90 నెలల వ్యవధిలో ఒక్కో మీటర్ నుంచి రూ.8 వేలు వసూలు చేస్తారు. సామాన్యులు మీటర్లకు రీచార్జి చేయించుకోవడం సులభం కాదు. ఇప్పటికే కొన్ని స్మార్ట్ మీటర్లు అమర్చారు. వాటిని సైతం తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. –రాజు, సీపీఎం కార్యదర్శి, మారుతీనగర్, తిరుపతి అభ్యంతరాలు వస్తున్నాయి! మారుతీనగర్లో స్మార్ట్ మీటర్లపై అభ్యంతరాలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బందితో వాగ్వావాదా లు జరుగుతున్నాయి. భవిష్యత్లో స్మార్ట్ మీటర్లతో పలు ఇబ్బందులు వస్తాయని తెలుస్తోంది. ఏమీ చెప్పకుండా ఇలా స్మార్ట్ మీటర్లు అమర్చడం న్యాయం కాదు. ఈ అంశంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాం. – తంబాల గోవింద్, టీడీపీ తిరుపతి నగర అధికార ప్రతినిధి -
రైతు పొలాన్ని ఆక్రమించిన సొసైటీ సీఈఓ
డక్కిలి:మండలంలోని పాతనాలపాడులో ఘట్టమనేని శ్రీనివాసులు అనే రైతు పొలాన్ని అదే గ్రామానికి గొల్ల పల్లి సొసైటీ సీఈఓ శ్రీనివాసుల అక్రమించి తమపై దౌర్జన్యం చేసి, వరి నాట్లు వేశారని బాధితుడు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి కథనం కథనం మేరకు.. పాతనాలపాడు సర్వే నంబర్ 5లో ఐదు సెంట్లు భూమి తనకు వారసత్వంగా వచ్చిందని, ఆ భూమికి సంబంధించి అడంగళ్, వన్బీ మూడు దశాబ్దాలు పైగా తమ పూర్వికుల పేరుతో ఉందన్నారు. అయితే తన భూమిని గొల్లపల్లి సొసైటీ సీఈఓ శ్రీనివాసులు అక్రమించారని తెలిపారు. తాను ఈ అక్రమణ వ్యవహరంపై రెవెన్యూశాఖ అధికారుల కు విన్నవించుకోగా ఈఏడాది జూన్ 5వ తేదీన తమ పొలాన్ని సర్వే చేసి, హద్దులను ఏర్పాటు చేశారన్నా రు. అయితే ఇటీవల ఈహద్దులను శ్రీనివాసులు దౌర్జ న్యంగా తొలగించారని బాధితుడు ఆరోపించాడు. ప్ర స్తుతం తన పొలంలో వరినాట్లు వేసి అడిగితే దౌర్జ న్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల ఫిర్యాదు చేసినా సొసైటీ సీఈఓపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అక్రమణదారుడి నుంచి తమకు సంబంధించిన పొలాన్ని ఇప్పించాలని కోరారు. -
ఆర్సీపురంలో ఛత్తీస్గఢ్ ఈజీఎస్ బృందం
రామచంద్రాపురం: ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఉపాధి హామీ ఈజీఎస్ బృందం మంగళవారం రామచంద్రాపురం మండలంలోని పలు పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఈ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అమలువుతున్న ఉపాధి హామీ పనులు, కన్వర్జెన్స్ పనుల తీరును ఆ బృందం సభ్యులు పరిశీలించారు. మిట్టకండ్రిగలోని రైతు చంద్రశేఖర్ పొలంలో ఫారంపాండ్, మునిరత్నం నాయుడు పొలంలో నాటిన మామిడి తోటలను వారు పరిశీలించారు. అనంతరం కందకాల ట్రెంచ్ పనిని, భారతమిట్ట వద్ద పశువుల నీటి తొట్టి నిర్మాణాలను పరిశీలించారు. కుప్పం బాదూరులో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్ పనితీరును బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గంగిరెడ్డిపల్లె గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. కమ్మకండ్రిగలో కన్వర్జెన్స్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, చంద్రగిరి ఏపీడీ రెడ్డెప్ప, జీఐఎస్ నిపుణులు గుణశేఖర్, ఎంపీడీఓ పులిరాంసింగ్, ఏపీఓ చంద్రశేఖర్ రాజు, ఈసి భాగ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ గోపి తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● కన్నప్ప వంతెనపై విరిగిన రైలింగ్ బీమ్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయం సమీపంలోని కన్నప్ప వంతెన వద్ద మంగళవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. అయ్యప్ప భక్తులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్ బీమ్లను ఢీకొని ఆగిపోయింది. అయితే బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొందరు భక్తులు ఒంగోలు నుంచి అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తికి వస్తుండగా బస్సు కన్నప్ప వంతెనపైకి చేరుకున్న సమయంలో బస్సుకు బ్రేక్లు పడకపోవడంతో డ్రైవర్ బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫుట్పాత్ను తాకిన బస్సు అదుపు తప్పి నేరుగా వంతెన రైలింగ్ను ఢీకొని ఆగింది. బస్సు ఇంకొంత ముందుకు వెళ్లి ఉండి ఉంటే, స్వర్ణముఖి నదిలోకి పడిపోయే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో దంపతులపై దాడి కలువాయి(సైదాపురం): మద్యం మ త్తు లో ముగ్గురు యువకులు దంపతులపై దాడి చేసిన సంఘట న ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కలువాయి మండలం ఎర్రబల్లికి చెందిన గుంటి లక్ష్మి అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు పిల్లలు రాపూరు గురుకులంలో చదువుతున్నారు. వారిని చూసి వచ్చే క్రమంలో ఉయ్యాలపల్లి దర్గా వద్ద రాత్రి 9 గంటలకు బస్సు దిగింది. ఆమెను ఇంటికి తీసుకువెళ్లడానికి భర్త ప్రసాద్ బస్టాండ్ వద్దకు వచ్చి ఆ మెతో బయలుదేరాడు. అక్కడే అదే గ్రామానికి చెందిన యు వకులు చరణ్, చైతన్య, నరసింహులను ఉండగా వారిని ప్ర సాద్ టైమ్ అడిగారు. మద్యం మత్తులో ఉన్న యువకులు వా రిని దుర్భాషలాడారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, యువకులు భార్యాభర్తలపై దాడి చేసి గాయపరిచారు. గుంటి లక్ష్మి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు. -
సింహాచలకండ్రిగలో మళ్లీ రాజుకున్న భూవివాదం
ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం మన్నవరం సమీపంలోని సింహాచలకండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న రిజర్వ్ఫారెస్ట్ భూమిలో స్థానిక రైతులు రెండు రోజులుగా నిమ్మ చెట్లు నాటడంతో అటవీశాఖ అధికారులు విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సింహాచలకండ్రిగ వద్ద సుమారు 170 ఎకరాలు రిజర్వ్పారెస్ట్ భూములున్నాయి. అయితే ఈ భూముల్లో 1993లో సింహాచలకండ్రిగకు చెందిన భూముల్లేని నిరుపేదలకు రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. అయితే ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనివి కావడంతో అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ముఖ్య అనుచరుడొకరు ఈ భూములపై కన్నేసి అటవీశాఖ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చిన పరిస్థితులు కొన్ని నెలల కిందట వెలుగులోకి వచ్చాయి. ఈ భూముల్లో సుమారు 130 ఎకరాల్లో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం, మద్ది మొక్కలను నాటారు. దీనిపై స్థానిక రైతులు కోర్టుకు వెళ్లడంతో గత నెలలో హైకోర్టు ఈ భూముపై స్టే విధించింది. అయితే సోమ, మంగళవారాల్లో కొందరు స్థానికులు ఈ భూముల్లో నిమ్మచెట్ల నాటి కంచె ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి అటవీశాఖాధికారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
రేణిగుంట: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఆవరణలో మంగళవారం తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ 10 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులు ఉన్నాయని ఏడాదికి సుమారు 1500 రోడ్డు ప్రమాదాలు జరిగి, దాదాపుగా 500 మంది కి పైగా మృతి చెందారన్నారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి చాలా దూరం నుంచి రావడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడంతోపాటు, పలువురు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రాష్ట్రంలో మూడు దశల్లో ప్రణాళికా బద్ధంగా పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సేఫ్టీ వెహికల్స్, బ్రీత్ ఎనలైజర్ పరికరాలను పోలీసులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐ లు జయచంద్ర, మంజునాథరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
రేణిగుంట: ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఈనెల 25, 26 తేదీల్లో తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఈఎస్లో 75వ ర్యాంక్ సాధించిన ఇందుమతికి సత్కారం తిరుపతి సిటీ: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్ )పరీక్షలో ఆల్ ఇండియా 75వ ర్యాంక్ సాధించిన తిరుపతికి చెందిన దాసరి ఇందుమతి ని విశ్వ స్కూల్ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ్రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లా డుతూ ఇందుమతి నేటి యవతరానికి స్ఫూర్తి దా యకమన్నారు. డిప్లొమో విద్య ఇలాంటి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. శ్రీ కపిలేశ్వరస్వామి హైస్కూల్ హెడ్మాస్టర్ కృష్ణమూర్తి, విశ్వం స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి, టీటీడీ ఉద్యోగి శ్రీ కుమారస్వామి పాల్గొన్నారు. -
జవాబుదారీతనం
‘కరెంటోళ్ల జనబాట’తోతిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో మంగళవారం ప్రారంభమైంది. సీఎండీ శివశంకర్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పుట్టావాండ్లపల్లిలో పర్యటించి అక్కడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. వినియోగదారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడంతో గ్రామస్తులు ఆయన్ని అభినందించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆ కరెంటోళ్ల జనబాటను నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది నిర్దేశిత గ్రామాల్లో పర్యటించగా 11 కేవీ, ఎల్టీ, వ్యవసాయ విద్యుత్ లైన్లను పరిశీలించడం, విద్యుత్ లైనుకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించడం, వాలిపోయిన స్తంభాలను సరి చేయడం, కిందకి వేలాడే విద్యుత్ లైనులను సరి చేయడం, ట్రాన్సఫార్మర్ దిమ్మెల ఎత్తును పెంచడం లేదా కంచెను ఏర్పాటు చేయడం తదితర సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమం మొదటి రోజున డిస్కం పరిధిలోని 9 జిల్లాల్లో మొత్తం 28,672 సమస్యలు అధికారుల దృష్టికి రాగా వాటిలో 507 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు తెలిపారు. మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థపై వినియోగదారులకు నమ్మకం కలిగించడంతో పాటు సమస్యల సత్వర పరిష్కారానికి, విద్యుత్ వినియోగదారులకు అధికారుల నుంచి జవాబుదారీతనం లభిస్తుందని సీఎండీ శివశంకర్ వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన ’కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం ద్వారా పీఎం సూ ర్యఘర్ పథకం కింద గృహ వినియోగదారులు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు వీలు గా అవగాహన పెంపొందించాలని సూచించారు. తమ గ్రామాలకు విచ్చేసే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి, పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. -
యువజనోత్సవాల్లో మహిళా వర్సిటీ విద్యార్థుల సత్తా
తిరుపతి రూరల్: చైన్నెలోని హిందూస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సంయుక్తంగా నిర్వహించిన 39వ ఇంటర్ యూనివర్సిటీ యువజనోత్సవాల్లో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు సత్తా చాటారు. ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన సౌత్ దక్షిణ జోన్ యువజనోత్సవం – 2025లో మహిళా వర్సిటీకి చెందిన విద్యార్థినులు వివిధ సాంస్కృతిక, నాటక, లలిత కళా విభాగాల్లో మొత్తం 9 బహుమతులు సాధించి విశ్వవిద్యాలయానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని వర్సిటీ అధికారులు తెలిపారు. విశ్వ విద్యాలయ సాంస్కృతిక సమన్వయకర్త ఆచార్య ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి కృషి, విద్యార్థుల ప్రతిభను వీసీ ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య రజని అభినందించారు. -
తమిళనాడు పెట్రోలే వినియోగిస్తాం
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో ఉన్న మాకు కూతవేటు దూరంలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ఉంది. సమీపంలోని మాదరపాకం వద్ద ఓ ప్రైవేటు పరిశ్రమలో నేను ఉద్యోగం చేస్తాను. రోజూ ఉద్యోగ రీత్యా తమిళనాడుకు వెళ్లాలి. అక్కడ లీటరు పెట్రోలు రూ.101.12 రేటు ఉంది. ఆంధ్రలో రూ.112కు విక్రయిస్తున్నారు. దీంతో లీటరుకు రూ.10 వరకు ఆంధ్రలో అదనం. దీని కారణంగా తమిళనాడు పెట్రోల్నే వినియోగిస్తాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ ఆంధ్రలో సైతం పెట్రోలు ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. – మారెయ్య, ప్రైవేటు ఉద్యోగి, సత్యవేడు -
లీటరుకు రూ.8 ఆదా
మన రాష్ట్రం కంటే తమిళనాడులో పెట్రోల్ ధర లీ టర్కు 8 తక్కువ. మా ప్రాంతం రాష్ట్ర సరిహద్దు లో ఉండడంతో అక్కడికి వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుని వచ్చేస్తాం. నగరి నుంచి 14 కి.మీ వెళితే తమిళనాడుకు చెందిన పెట్రోల్ బంక్ ఉంది. అక్కడకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయిస్తే రూ.120 దాకా ఆదా అవుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కానీ ఇంతవరకు తగ్గించలేదు. ఆయన మారరు అంతే. – ప్రకాష్, ముడి పల్లి గ్రామం నగరి మండలం● -
అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు, చిన బాబు ● గుడుపల్లె సభలో చంద్రబాబు హామీ ● యువగళంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలతో నారా లోకేష్ హల్చల్ ● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా అమలుకాని హామీ ● రెండు జిల్లాల్లో రోజుకు రూ.5.4 కోట్ల
పలమనేరు: ‘పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ జగన్మోహన్రెడ్డి పెట్రోల్ ధరలు పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయారు. పె ట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. దీనికారణంగా జిల్లాలో రోజుకు వాహనదారులపై రూ.5.4 కోట్లకుపైనే అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.167.4కోట్లు, ఏడాదికి రూ.2,008.8 కోట్లుదాకా ప్రజలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.4,017.6 కోట్లు దాకా ప్రజలపై భారం పడింది. పెట్రో ధర తగ్గిస్తామని బాబు కర్రుకాల్చి వాత పెట్టారని పలువురు వాపోతున్నారు. ఆంధ్రలో వెలవెల..కర్ణాటకలో కళకళ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి ఆనుకొని గండ్రాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. మండల కేంద్రమైన వీకోట టౌన్కు ఆనుకొనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కొనసాగుతోంది. అలాగే తిరుపతి జిల్లాలో ఇటు నగరి, పిచ్చాటూరు, సత్యవేడు నుంచి తమిళనాడు సరిహద్దు వెళ్తుంది. అటు నాయుడుపేట నుంచి తమినాడు బోర్డర్ ఉంది. ఆయా సరిహద్దుల్లోని ఆంధ్ర పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. అదే కర్ణాటక, తమిళనాడు పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. కారణం.. ధరల్లో వ్యత్యాసాలు ఉండడమే. ఒక్క పలమనేరు నియోజకవర్గంలోనే దాదాపు 20 పెట్రోల్ బంకుల దాకా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
విద్యార్థుల ఆరోగ్యం, భవితలో నర్సుల పాత్ర కీలకం
శ్రీకాళహస్తి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ నిర్మాణంలో నర్సుల పాత్ర కీలకమని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఓఎస్డీ రామోహన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తెలుగుగంగ కాలనీ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బాలికల విభాగంలో మంగళవారం నర్సులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు శిక్షణ తరగతులు పూర్తయ్యాయని, ఇది ఏడవ శిక్షణ కార్యక్రమమన్నారు. గురుకులాల విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే వారి భవిష్యత్తును నిర్మించుకోగలరని, ఆ దిశగా ఆరోగ్యంపై నర్సులు శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రెడ్డి రూపేష్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నర్సులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. లలిత మాట్లాడారు. గిరిజన విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గురుకుల నర్సుల పాత్ర అమూల్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రెడ్డి, నాగేశ్వర్రావు, రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ రజని, టీచర్లు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, సత్యసాయి జిల్లాల్లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు పాల్గొన్నారు. -
కూటమిలో కులచిచ్చు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమిలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేనలో ఒకే సామాజిక వర్గం వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారని, మి గిలిన బడుగు, బలహీన వర్గ నేతలను కరివేపాకులా వాడుకుంటున్నారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వా రు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో రెడ్డి సామాజిక వర్గం నేతలంటేనే చాలా చులకనగా చూస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ సామాజిక వర్గం నేతలు ముఖ్యులు.. అదే సామాజిక వర్గంలోని వారికి పదవులు రాకుండా.. అడ్డుకుంటు న్నారంటూ మండిపడుతున్నారు. ఆ రెండు పార్టీల్లో తాము తప్ప మరొకరు ఎదగడానికి వీల్లేకుండా కుట్ర లు చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తాజా పరిణామాలే నిదర్శనం. టీడీపీ అధిష్టానం తిరుపతి, చి త్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించిన వి షయం తెలిసిందే. ఈ పదవులు కట్టబెట్టడంలోనూ కొంత మంది ప్రమేయంతో అధినాయకులు తమకు ఇవ్వకుండా..తమ సామాజిక వర్గం నేతలే అడ్డుకున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు కమ్మసామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీఆర్ రా జన్ బీసీ కావడంతో అతన్ని కొనసాగించలేదని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఎంతటి వారినైనా సీ ఆర్ రాజన్ గట్టిగా మాట్లాడడం, ప్రశ్నించడం వంటి చేస్తున్నారనే కారణంతోనే అతన్ని కొనసాగించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అ ుుతే సీఆర్ రాజన్ని తొలగించి వేరొకరికి ఇస్తే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, షణ్ముగరెడ్డి అయితే నోరెత్తడనే ఉద్దేశంతోనే అతనికి అధ్యక్ష పదవిని ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో తిరు పతి నుంచి జెండా పట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ రాజుకు పేరుంది. నాటి నుంచి నేటి వరకు నందమూరి, నారా వారి కుటుంబాన్నే నమ్ముకుని టీడీపీ జెండా మోస్తూనే ఉన్నారు. ఈసారైనా ఆ కుటుంబంలోని శ్రీధర్వర్మకు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశించారు. అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీలోని బలమైన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జనసేనలో మాకు స్థానం లేదా? జనసేనలో పవన్ కళ్యాణ్పై అభిమానంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వకుండా.. పదవులకు దూరంగా ఉంచుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఒకే సామాజిక వర్గం వారు మాత్రమే పెత్తనం చెలాయించాలని, వేరొకరు పార్టీలో కీలకంగా మారడానికి వీల్లేకుండా పథకం ప్రకారం దూరం పెడుతున్నారనే ప్రచా రం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఎంఆర్పల్లి పరిధిలో ఓ నాయకుడి నివాసంలో జరిగిన పుట్టిన రోజు విందు వేడుకల్లో జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనలో తమకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి) పదవులు లేవు, గుర్తింపు లేకుండా చేస్తున్నారని మండిపడినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. జనసేనలో ప్రధాన సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గం నేతల మధ్య రచ్చ జరగడంతో ఇద్దరు నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పి పంపివేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేనలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరడంతో కొందరు ఈ సమాచారాన్ని అమరావతికి చేరివేసినట్లు బోగట్టా. -
9 మంది అరెస్టు
సింగనాలత్తూరు సమీపంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేసి, తొమ్మిది మందిని అరెస్టు చేశారు.2023 జనవరి 30న యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పలమనేరు సమీపాన కర్ణాటక పరిధిలో ఉన్న పంతాన్హల్లికి చేరుకున్నారు. అక్కడి పెట్రోలు బంకుకు చేరుకుని కర్ణాటక రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను మీడియాకు చూపారు. సెల్ఫీ తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం కంటే కర్ణాటకలో పెట్రోలు ధరలు తక్కువ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటకలో ఉన్న ధరలే ఏపీలో కూడా ఉంటాయన్నారు. -
అర్హత ఉన్నా... తొలగించారు!
తిరుపతి సిటీ: బెంగళూరు వేదికగా ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్న సౌత్జోన్ టెన్నిస్ క్రీడలకు తాను అర్హత సాధించినా అధికారులు తనను ఎంపిక చేయకపోవడం దారుణమని ఎస్వీయూ విద్యార్థిని గీత ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నా అధికారులు తనను ఎంపిక చేయకపోవడం దారుణమన్నారు. ఎంఏ ఎకనామిక్స్ రెండో సంవత్సరం చదువుతున్న తాను పలుసార్లు టెన్నిస్లో సత్తా చాటానని తెలిపారు. అధికారులు నిర్వహించిన పలు పరీక్షల్లో నెగ్గానని కాని అధికారులు పక్షపాత ధోరణి తో తనను ఎంపిక చేయకపోవడం బాధకలించే అంశమన్నారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 60,764 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,077 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. ఆర్టీసీ దుకాణాలకు టెండర్లు తిరుపతి అర్బన్: జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల పరిధిలో ఖాళీగా ఉన్న 60 దుకాణాలు అద్దెకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ జగదీష్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం నుంచి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదే రోజు ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసిన దరఖాస్తులను డీపీటీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలని స్పష్టం చేశారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేసి దుకాణాలు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. ఎస్వీ వెటర్నరీలో ఘనంగా కిసాన్ దివస్ చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో మంగళవారం కిసాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ డాక్టర్ జేవీ.రమణ మాట్లాడుతూ భారతదేశ ఐదో ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది కిసాన్ దివస్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వ్యవసాయ దాని అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, ఆహార భద్రతను మరింతగా ప్రోత్సహించారన్నారు. పశు ఉత్పత్తుల ద్వా రా పేత రైతులకు జీవనోపాధి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు. అనంతరం పశుపోషణ, పాల ఉత్పత్తిలో విశేష ప్రతిభను కనబరిచిన ఇద్దరు మహిళా పాడి రైతులను వీసీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, పశువైద్య శాస్త్ర డీన్ డాక్టర్ సురేష్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలత, డీన్ ఆఫ్ స్టూడెంట్ డాక్టర్ వైకుంఠరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆదిలక్ష్మమ్మ, డెయిరీ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు, పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనల్లో మెలకువలు అవసరం
తిరుపతి రూరల్ : యూనివర్సిటీలో జరిగే పరిశోధనా రచనల్లో మెలకువలు ఎంతో అవసరమని యూఎస్ఏలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ రిసో ర్స్ పర్సన్ ఏంజెలా సూసన్ బకులా సూచించా రు. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంగ్లీష్ విభాగం తరపున సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్పై రెండు రోజుల వర్క్షాప్ను మంగళవారం ప్రారంభించారు. ఈ వర్క్షాప్నకు ముఖ్యఅతిథిగా అమెరికా నుంచి వచ్చిన ఆమె మాట్లాడుతూ పీహెచ్డీ విద్యార్థులు పరిశోధనా పత్రాన్ని రాయడంలో నియమాలు పాటించాల న్నారు. కన్వీనర్ ప్రొఫెసర్ పి. హరిపద్మ రాణి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల తో పరిశోధక ప త్రాలను తయారు చేయడానికి ఇలాంటి వర్క్షాప్ ఉపయోగమన్నారు. ఫార్మసీ, హోమ్సైన్స్, బయో సైన్సెస్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, ఉమెన్స్ స్టడీస్, కమ్యూనికేషన్ జర్నలిజం విభాగాల పరిశోధకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమాచారం
పెట్రోల్ బంకులు 140 బోర్డర్లోని కర్ణాటక పెట్రోల్ బంకులు 40 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 110.27 డీజిల్ రూ.99కర్ణాటకలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 102.78 డీజిల్ 90.87 -
పరుగులు పెట్టిన తమిళ తమ్ముళ్లు
విజయపురం : మండలంలోని మహారాజపురం కొండపై అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న తమిళ తమ్ముళ్లు ప రుగులు తీశారు. ‘మహారాజపురంలో అనకొండలు’ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి తమిళ తమ్ముళ్లు కొండపై తమకు సంబంధించిన టిప్పర్లు కనిపించకుండా సరిహద్దు దాటించినట్లు స్థానిక ప్రజలు చెప్పారు. జిల్లా అధికారులు వస్తే అక్రమ గ్రావెల్ వ్యాపారం బయటపడుతుందని తెలుసుకున్న అక్రమ వ్యాపారులు తమిళనాడు నుంచి టిప్పర్లు రాకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు సోమవారం జిల్లా అధికారులు రావడంతో వాహనాలను దాచిపెట్టినట్లు తెలిసింది. సైబర్ మోసం.. రూ. 92 లక్షలు మాయం తిరుపతి క్రైం: నగరంలోని కెనడీ నగర్లో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల మాయ మాటలు విని, రూ.92 లక్షల పోగొట్టు కున్న సంఘటన సోమవారం జరిగింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిరుపతి కెనడీనగర్లో నివాసముంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే మంచి డబ్బులు వస్తాయని ఒక యాప్ను తెలిపా డు. ఆ వ్యక్తి మాటలు గుడ్డిగా నమ్మిన ప్రభుత్వ ఉద్యోగి ఆ యాప్ ద్వారా రూ.92 లక్షలు జమ చే శాడు. ఆ నగదును విత్డ్రా చేసుకోవాలని చూస్తే రాకపోవడంతో మోసపోయామని తెలుసుకుని ఈస్ట్ పోలీసులు సంప్రదించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీఎస్పీడీసీఎల్లో కారుణ్య నియామకాలు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో కారుణ్య నియామకాల కింద 250 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కే.గురవయ్య, పి.అయూబ్ ఖాన్, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, పీహెచ్ జానకీరామ్, కె. ఆదిశేషయ్య, పి.సురేంద్ర నాయుడు, ఆర్డీఓ రామ్మోహన్, తిరుపతి ఎస్ఈ వి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పాకాల మండలం కృష్ణాపురంలో కరెంటోళ్ల జనబాటను మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత మొగరాల సబ్ స్టేషన్ను ప్రారంభించారు. -
పరిశోధన, వ్యవసాయ రంగంలో అంతరాలను తగ్గించాలి
తిరుపతి రూరల్: పరిశోధన, బోధన, వ్యవసాయ రంగాల మధ్య అంతరాలను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని ప్రభుత్వ సెరికల్చర్, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ బయోసైన్సెస్ అండ్ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో ‘స్థిరమైన సెరికల్చర్ కోసం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్షాప్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అలాగే పెస్ట్ రెసిస్టెన్స్, కై ్లమేట్ రెసిలియన్స్పై దృష్టి పెట్టాలని సూచించారు. శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ నేటి సమాజంలో ఏఐ, నానో టెక్నాలజీలు కీలకంగా మారాయని పేర్కొన్నారు. యూహెచ్ఎస్ బాగల్కోట్ మాజీ డైరెక్టర్ ఎస్బి దండిన్, సెరికల్చర్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్. విజయకుమారి, బెంగళూరు నుంచి వచ్చిన సెంట్రల్ సిల్క్బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.మంతిరమూర్తి , మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని మాట్లాడారు. ఉత్తమ సెరికల్చర్ రైతులకు డాక్టర్ ఎస్బీ దండిన్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. -
భక్తులకు ఎస్వీబీసీలో హెచ్డీ క్వాలిటీతో ప్రసారాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కై ంకర్యాలను హెచ్డీ చానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ చానల్ ద్వారా ప్రసారాలను అందించాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్వీబీసీ హెచ్డీ చానల్ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్ విడ్త్ కేటాయింపునకు దరఖాస్తులు చేయాలని సూచించారు. ఎస్వీబీసీ చానల్లో ఇప్పటివరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్లు 12 సెకన్లను 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్లో సాధారణ వైద్యచికిత్సలు, అరవింద్ ఐ ఆస్పత్రిలో కంటి వైద్యచికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఎం డీ ఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ఇతర అన్యమతస్తులుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించవద్దని సూచించారు. ఎస్వీబీసీ బోర్డు సభ్యులు ఆనందసాయి, ఎంఎస్ రాజులు వర్చువల్గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇన్చార్జి సీఈఓ డి.ఫణికుమార్ నాయుడు పాల్గొన్నారు. -
గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఐడీఈపై బూట్ క్యాంప్
తిరుపతి రూరల్: మండలంలోని సి.గొల్లపల్లిలో ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంటర్ ప్రినర్ షిప్ (ఐడీఈఇ)పై మూడు రోజుల బూట్ క్యాంప్ను సోమవారం ప్రా రంభించారు. ఈ క్యాంపునకు తిరుపతి, చిత్తూ రు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన పీఎం శ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, ఉపాధ్యా యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేష న్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్ మాట్లాడుతూ పీఎంశ్రీ స్కూళ్లలో సాంకేతికతను మెరుగుపరచ డానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగమన్నారు. అలాగే ఏఐసీటీఈ నోడల్ సెంటర్ హెడ్ యోగేష్ వదవన్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశేఖర్ డాక్టర్ సాధిష్ ప్రభు, డాక్టర్ నాగేంద్ర యామల ప్రసంగించారు. ఈ శిక్షణ తరగతులకు 170 మంది ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు హాజరుకాగా వారందరికీ కళాశాల చైర్మన్ వై.కొండారెడ్డి, వైస్ చైర్మన్ వై.ఆనందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీఓసీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.నారాయణబాబు పాల్గొన్నారు. -
హాకీ క్రీడాకారులకు ఎస్పీ అభినందనలు
– పోలీసులకు గుర్తింపు రివార్డు ప్రకటన తిరుపతి క్రైమ్: జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో ప్రతిభ చూపిన తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ సిటీలో నిర్వహించిన 74వ ఆల్ ఇండియా పోలీస్ హాకీ చాంపియన్షిప్ –2025–26 పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది టీఎస్ అమృత్ కుమార్ (పీసీ–873), ఈస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే ఎం. వరముని (పీసీ–1037), బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ప్రతిభ కనబరిచారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాష్ట్రానికి, జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం పోలీస్ శాఖలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో వారి సేవలకు గుర్తింపుగా రివార్డు ప్రకటించారు. తిరుపతి ఖ్యాతిని చాటాలి ఏర్పేడు: తిరుపతి ఐసర్ ఖ్యాతి చాటేలా క్రీడల్లో ప్రతిభ చూపాలని వారందరిని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య సూచించారు. భువనేశ్వర్ ఐసర్ వేదికగా ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న స్పోర్ట్స్ మీట్కు తిరుపతి ఐసర్ నుంచి 149 మంది విద్యార్థులు బయలుదేరి వెళ్లారు. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, స్పోర్ట్స్ కమిటీ చైర్పర్సన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాస్ఫూర్తిని చాటేలా తోటి క్రీడాకారులతో ఎంతో క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు సోమవారం వేచి ఉన్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
యూటీఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవం
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) తిరుపతి జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు రాష్ట్ర కార్యదర్శులు ఎస్ఎస్ నాయు డు, ఎన్నికల అధికారి నవకోటేశ్వరరావు సోమవా రం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా జీజే రాజశేఖర్(దొరవారి సత్రం), ప్రధాన కార్యదర్శిగా కె ముత్యాలరెడ్డి(రేణిగుంట), గౌరవాధ్యక్షుడిగా డి రామచంద్ర య్య, సహా అధ్యక్షులుగా కుమారస్వామి, గీతమ్మ, కోశాధికారిగా మోహన్ బాబు ఎన్నికయ్యారన్నారు. అలాగే జిల్లా కార్యదర్శులుగా బండి మధుసూదన్ రెడ్డి, శేఖర్, ప్రభాకర్ మస్తానయ్య, సుధీర్, సురేష్, వెంకటకృష్ణ, పద్మజ, ఆదినారాయణ, గోవర్ధన రెడ్డి, హేమాంబధర రావు, విజయశ్రీ , మోహన్ రెడ్డి, శివప్రసాద్ , రాష్ట్ర కౌన్సిలర్లుగా దేవరాల నిర్మల, పత్తిపాటి రమేష్ నాయుడు, వాసుదేవరావు, నాగరాజు, కోటేశ్వరరావు, దాసరి మునెయ్య, వయ్యాల మధు, ప్రభావతి, ఆడిట్ కమిటీ కన్వీనర్గా నేలపల్లి మోహన్ ఎన్నికయ్యారని చెప్పారు. సభ్యులుగా శివకుమార్, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, దీపిక, రవికుమార్, సురేష్, గురువారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా సూర్యప్రకాష్, శ్రీనివాసులు, రామమూర్తి రాజు, రామమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు ప్రకటించారు. -
28న రామానుజన్ గణిత ప్రతిభా పరీక్ష
తిరుపతి సిటీ: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని విశ్వం సైనిక్ – నవోదయ పోటీ పరీక్షల కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ‘శ్రీ శ్రీనివాస రామానుజన్ మాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్’ నిర్వహించనున్నట్లు అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈ గణిత ప్రతిభా పరీక్షకు సంబంధించిన సమాచార పత్రికను స్థానిక వరదరాజనగర్లోని విశ్వం స్కూల్లో సోమవారం అపుస్మా నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణిత ప్రతిభా పరీక్షను వరదరాజనగర్లోని విశ్వం టాలెంట్ స్కూల్లోనూ. జీవకోనలోని విశ్వం హైస్కూల్లోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తరగతి వారీగా ప్రథమ బహుమతి రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతయ బహుమతి రూ.5 వేలుతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 8688888802, 9177726256 నంబర్లకు వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపుస్మా నాయకులు రవీంద్రారెడ్డి, రఘునారాయణరావు, బాషా, టీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ధనుర్మాసం.. పుణ్యమార్గం
మాసానాం మార్గశిర్షోహం..మార్గశిరం తనకు ఇష్టమైనదని శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు. శ్రీమహావిష్ణువుకు ఈ మాసమంటే అంత్యంత ప్రీతి. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించే వరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసంగా పిలుస్తారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమై ఆయన్ని చేరుకోవడానికి మార్గం చూపించేదే ఈ మాసం. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుమల: సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించే మహత్తర ఘట్టమే ధనుర్మాసం. ఈ హేమంత సమయాన అందరిలోనూ భక్తిభావం తొణికిసలాడుతుంది. ఈ నెలంతా వైష్ణవాలయాల్లో భక్తులు భక్తిభావంతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసం విశిష్టమైది. శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించేది ధనుర్మాసం. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ఈ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణాన్ని నివేదిస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై సేవ కొనసాగనుంది. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కై ంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆండాళ్ తిరుప్పావై పారాయణం ప్రాశస్త్యం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని సాన్నిథ్యం పొందాలని ఆకాంక్షించే సాధకులకు గోదాదేవి అనుభవ పూర్వకంగా రచించిన తిరుప్పావై లోకానికే దివ్య సందేశం. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఏకాంతంగా తోమాల, అర్చన, అర్జిత సేవలు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా జనవరి 14వ తేదీ వరకు తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించరు. ఈ సేవలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు డిసెంబర్ 29 నుంచి జనవరి 1వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులను అనుమతించరు. -
క్రీడలతో ఉపాధ్యాయులకు ఉత్సాహం
శ్రీకాళహస్తి: ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. సోమవారం జరిగిన క్రికెట్ ఫైనల్లో గూడూరు డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాళహస్తి డివిజన్ జట్టు రన్నరప్గా నిలిచింది. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దీనికి డీఈఓ కేవీఎన్. కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతగా నిలిచిన గూడూరు డివిజన్ జట్టుకు, రన్నరప్గా నిలిచిన శ్రీకాళహస్తి డివిజన్ జట్టుకు బహుమతులు అందజేశారు. సమగ్ర శిక్ష సి. ఎం.ఓ సురేష్, ఐటీ సెల్ అధికారి ధనుంజయ నాయుడు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కిశోర్ పాల్గొన్నారు. -
9 టన్నుల నిమ్మ ఎగుమతి
చిల్లకూరు: గూడూరు నిమ్మ మా ర్కెట్ను ఎట్టకేలకు స్థానిక ఏఎంసీ అధికారులు పరిశీలించి 9 ట న్నుల నిమ్మ కాయలను వైజాగ్, చిత్తూరు ప్రాంతాలకు ఎగుమతి చేశారు. గూడూరు నిమ్మ మార్కెట్లో కొంత కాలంగా కిలో నిమ్మ రూ 10కి మించి విక్రయించలేని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 19న శుక్రవారం ’’నిమ్మళ మేది ’’అనే శీర్షికన సాక్షి దినపత్రికలో కథనం ప్ర చురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మార్కెట్ కమిటీ అధికారులను పరిశీలించి, రైతులకు అండగా నిలవాలన్నారు. దీంతో గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం గూడూరు నిమ్మ మార్కెట్ను పరిశీలించి, కాయలు పరిశీలించారు. అనంతరం నిమ్మ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధారెడ్డితో మార్కెట్ పరిస్థితి ఎగుమతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు విశాఖపట్టణం, చిత్తూరు మార్కెట్లకు కిలో నిమ్మ రూ.15 వంతున మాట్లాడి ఎగుమతులు చేయించారు. ప్రభుత్వం ద్వారా రూ.5 ఎంసీ అందిస్తుందని తెలిపారు. -
చట్టాలపై సరైన అవగాహన అవసరం
చంద్రగిరి: రాజ్యాంగంలోని చట్టాలపై సరైన అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ఐజీ రవిప్రకాష్ అన్నారు. మండలంలోని కల్యాణీ డ్యాం సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)లో నూతనంగా ఎంపికై న సివిల్ కానిస్టేబుళ్లకు సోమవారం శిక్షణ తరగతులను ప్రిన్సిపల్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐజీ రవి ప్రకాష్ హాజరై, ఫైరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. తొలుత పీటీసీలో శిక్షణార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కళాశాలలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 9 నెలల కాలం పాటు పీటీసీలో శిక్షణ పొందడం జరుగుతుందన్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు విమల్ బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విమల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ లెవెన్ అండర్–14 వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. అందులో ఉత్తమ ప్రతిభ కనబరచిన విమల్ హిమచల్ ప్రదేశ్లో జనవరి 5న నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విమల్ను సోమవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తానయ్య, హరిబాబు అభినందించారు. -
సమాజ సేవే కర్తవ్యంగా భావించాలి
వెంకటగిరి రూరల్: సమాజ సేవే పోలీసుల కర్తవ్యంగా భావించి, విధి నిర్వహణలో రాణించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్లో నూతనంగా ఎంపికై 233 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ మెలగాలని అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతాయని తెలిపారు. అనంతరం ట్రైనీ కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్న బ్యారెక్స్ ఏరియాను ఎస్పీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విజయానంద్, అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్కన్నా, అసిస్టెంట్ కమాండెంట్ రామకృష్ణ, ఆర్ఐ లక్ష్మయ్య, సుబ్బరావు, సత్యనారాయణ, వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రేణిగుంట – రైల్వేకోడూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్గా ఉపయోగిస్తున్న బైక్ను సీజ్ చేశారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ ఎప్బీఓ పి.చెంగలరాయుడుతో కలసి శనివారం తెల్లవారుజాము నుంచి రైల్వే కోడూరు రోడ్డులోని ఆంజనేయపురం ఫారెస్ట్ చెక్ పోస్టు వద్దకు చేరుకుని వాహన తనిఖీలు చేపట్టారు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక బైక్లో ఒక వ్యక్తి వచ్చి, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకోగా, వెనకే వస్తున్న కారు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కారును చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, డ్రైవర్ కారును తప్పించబోయి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీ కొన్నాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. కొందరు వ్యక్తులు దిగి పారిపోతుండగా టాస్క్ఫోర్సు పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులోని ఎర్రచందనం దుంగలు, వాహనాలుసహా ముగ్గురు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిలో ఒకరు రేణిగుంటకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. -
సాంకేతికతకు అధిక ప్రాధాన్యం
నాయుడుపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల్లో సాంకేతికతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. నాయుడుపేట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానికి ప్రదర్శనను అట్టహాసంగా ప్రారంభించినట్లు తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మె ల్యే నెలవల విజయశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రదర్శనను ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ నాయుడుపేటలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓలతో పాటు పలువురు ప్రత్యేక అధికారులు ఎంతో సహకరించారన్నారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 126 గ్రూపుల విద్యార్థులు, వ్యక్తిగత విభాగం నుంచి 65 మంది విద్యార్థులు, టీచర్ల ప్రోత్సాహంతో జరిగిన 34 సైన్స్ నమూనాలను ప్రదర్శించారన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కె భానుప్రసాద్, గూడూరు డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్కుమార్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మంజుల, ఎంఈఓలు మాధవీలత, బాణాల మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన పాఠశాలల వివరాలివీ.. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో వ్యక్తిగత విభాగంలో జిల్లా స్థాయిలో చెన్నూరు ఉన్నత పాఠశాలకు చెందిన కే సురేష్రెడ్డి, పాకాల మండలం ఓబులవారిపల్లి పాఠశాలకు చెందిన కే రాజశేఖర్ విజేతలుగా నిలిచారు. టీచర్స్ విభాగంలో శ్రీకాళహస్తి మండలం మాచువోలు ఉన్నత పాఠశాలకు చెందిన డాక్టర్ ఎన్ సుబ్రమణ్యశర్మ, చిల్లకూరు గురుకుల పాఠశాలకు చెందిన వైవీ సురేష్బాబులు జిల్లా స్థాయిలో గెలుపొందారు. గ్రూపు విభాగంలో జిల్లాలోని 14 ఉన్నత పాఠశాలలు ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచినట్లు డీఈఓ వెల్లడించారు. -
నేటితో ముగియనున్న స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగియనుంది. ఇక్కడ చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. చెస్: చెస్ ఈవెంట్లో ఆరు గ్రిప్పింగ్ రౌండ్ల తర్వాత, ఐఐటీ బాంబే ప్రస్తుతం 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 15.5 పాయింట్లతో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 14పాయింట్లతో ఐఐటీ పాట్నా, ఐఐటీ వారణాసి కూడా పోటీలో ఉన్నాయి. ఆదివారం జరగనున్న చివరి రౌండ్తో విజేత ఎవరన్నది తేలనుంది. టెన్నిస్ (మహిళలు) టెన్నిస్ మహిళల విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఐఐటీ పాట్నా మూడో స్థానంలో నిలిచింది. టెన్నిస్ (పురుషులు) పురుషుల టెన్నిస్ పోటీ సెమీఫైనల్ దశకు చేరుకుంది, ఇందులో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జట్లు సె మీఫైనల్కు చేరాయి. కాగా ఆదివారం ముగింపు ఉత్సవాలు, షీల్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డీన్ ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. -
దర్జాగా విద్యుత్ చౌర్యం
సాక్షి టాస్క్ ఫోర్సు: ఓ భవన నిర్మాణ పనుల్లో కళ్ల ఎదుటే నేరుగా విద్యుత్ స్తంభం నుంచి వైరు లాగి భవన నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్, నీటి మోటర్, తదితర పరికరాలకు విద్యుత్ వినియోగించుకుంటున్నా విద్యుత్ శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళితే.. గూడూరు జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఏర్పాటైన కాశీ లేఅవుట్లో ప్రభుత్వ పెద్దలు ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్ తీసుకుని మీటరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అందులో నుంచి విద్యుత్ను భవన నిర్మాణ పనులకు వినియోగించుకుంటే అధికంగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భావించిన భవన యజమాని తన భవన నిర్మాణానికి సమీపంలోనే ఉన్న విద్యుత్ స్తంభానికి నేరుగా విద్యుత్ వైర్ను వేసి విద్యుత్ చౌర్యం పాల్పడుతున్నారు. అయితే అధికారులు అటు వైపు కన్నెతి కూడా చూడక పోవడం విశేషం. భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని ఆ శాఖ డీఈఈ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా టౌన్ ఏఈని పంపి పరిశీలిస్తామని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ఓసీ పల్లి హైస్కూల్ విద్యార్థి
పాకాల:జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఓసీ పల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం సి.కుమార్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వడమాలపేట జెడ్పీ హైస్కూల్(బాలుర) పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఓసీపల్లి జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి కె.రాజశేఖర్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయు లు విద్యార్థి రాజశేఖర్కి అభినందనలు తెలిపారు. -
సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
తిరుపతి రూరల్: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్న్స్ ఎగ్జిబిషన్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సీఎండీ శివశంకర్ శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో 50కి పైగా నమూనాలను ఏర్పాటు చేశారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా సంస్థ పరిధిలో నిర్వహించిన క్విజ్, వక్తృత్వపు పోటీలు, సైనన్స్ ఎగ్జిబిషన్లో స్టాళ్ల ఏర్పాటు తదితర పోటీల్లో విజేతలకు ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, పీహెచ్. జానకిరామ్, ఎం.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో ముందస్తుగా జగన్ జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో వైభవంగా ని ర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మ ధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభి మానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. పట్టణమంతా వైఎస్సార్ సీపీ జెండాలు, నినాదాలతో ఉత్సాహభరితంగా మారింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేతలు గజమాల వేశారు. అనంతరం జగనన్నకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యకర్తలు, అభిమానులకు అన్నదానం చేశారు. వాహనచోదకుల భద్రత కోసం జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.అలాగే సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డప్పు కళాకారులకు డప్పులు అందజేశారు. -
మా ఇంటి దీపం వెలిగించాడు!
శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం -
మా ఊరు రూపు మార్చిన మహర్షి జగన్
తిరుపతి రూరల్: ‘‘మా ఊరు ఏర్పడినప్పటి నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. ఇలా మా ఊరు మారుతుందని కలలో కూడా ఊహించలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి నగరానికి వెళ్లాల్సి వచ్చేది. కనీసం పిల్లలకు అవసరమైన చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సరే పదిసార్లు టౌన్కు వెళ్లే వాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే మా గ్రామంలోనే అన్నీ ఉన్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కారం చేయడానికి గ్రామ సచివాలయంలో ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో ఆరోగ్యం బాగలేకుంటే ఒక నర్సు వచ్చి రెండు మందు బిళ్లలు ఇచ్చి వెళ్లేది. ఇప్పడు అత్యవసర వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్ మా ఊర్లోకే వచ్చింది. అనుకోని మహమ్మారి రోగాలు వస్తే తప్ప సాధారణ జబ్బులు అన్నింటికీ ఇక్కడే వైద్యం అందుతోంది. వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, సలహాలన్నీ కూడా ఊరులోనే అందుతున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న ఆ ఊరుకి గ్రామ సచివాలయం, రైతు భరోసాకేంద్రం, మహిళాభవనం, విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలోని పాడుబడిన భవనంలో నడిచిన ప్రాథమిక పాఠశాల రూపు రేఖలు మార్చి కార్పొరేట్ తరహాలో భవనాలు నిర్మించి, సకల మౌలిక వసతులు కల్పించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కనిపించని ఆ ఊరులో నేడు 15 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విద్య నుంచి విత్తనాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంత చేయగలిగిన శక్తి, సామర్థ్యం ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది.. మా ఊరు మారడమే కాదు.. మా బతుకులు కూడా మారాయి.. జగనన్నే మా నమ్మకం. మహర్షిలా మా ఊరును మార్చిన జగనన్నకు మా ఊరి ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. – విజయసింహారెడ్డి, గ్రామపెద్ద, తనపల్లి, తిరుపతి రూరల్ మండలం -
నేడు పల్స్ పోలియో
తిరుపతి తుడా: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఎంపిక చే సిన పలు కేంద్రాల్లోనూ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా క్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆయన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో లక్ష్యం సాధన మేరకు 5 ఏళ్లలోపు పిల్లలు 2,59,843 మంది కాగా, వీరందరికీ పోలియో చుక్కలు అందించడానికి 1,868 పోలియా బూత్లను ఏర్పాటు చేశామన్నారు. 84 మొబైల్ బూత్లను, 59 ట్రాన్సిస్టర్ బూత్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. మహిళా వర్సిటీలో ‘ఇన్స్పైరింగ్ మైండ్స్’పై సదస్సు తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ‘ఇన్స్పైరింగ్ మైండ్స్’పై సదస్సు నిర్వహించారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ టి.సుధ, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్, పీఎం ఉషా, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.వాణి, గణాంక శాస్త్ర విభాగం ఇన్చార్జి హెచ్ఓడీ డాక్టర్ ఎం.శివపార్వతి సదస్సులో పాలు పంచుకున్నారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ జూలు ల్యాండ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ శ్యామల కృష్ణనాయర్, డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో మొదటగా మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎం.ఆర్. సింధుమోల్ ‘స్టాటిస్టిక్స్ మైండ్‘ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం, ప్రొఫెసర్ శ్యామల కృష్ణనాయర్ పరిశ్రమల్లో మల్టీస్కేల్ ప్రాసెస్ మానిటరింగ్, సింగులర్ స్పెక్ట్రమ్ డీకంపోజిషన్ వంటి అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించారు. 23, 24 తేదీల్లో మార్కెటింగ్పై అవగాహన తిరుపతి అర్బన్: ఎంఎస్ఎంఈ యజమాన్యానికి ఈ నెల 23, 24 తేదీల్లో కలెక్టరేట్ సమీపంలోని లెమన్ట్రీ హోటల్లో వ్యాపార విస్తరణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సమాచారశాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వ్యాపారులు హజరుకావడానికి ఈ నెల 22వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం 9885429054, 9989094777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,729 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,162 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవం
తిరుపతి సిటీ:‘‘మాది తిరుపతి. నగరంలోని వైఎస్సార్ మార్గ్లోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాలల్లో మేము పదో తరగతి చదువుతున్నాం. నగరంలోని మా పాఠశాలను జగనన్న సీఎం అయిన తర్వాత నాడు–నేడు నిధులతో మూడు అంతస్తుల భవనం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల గదులు, ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రాక్టికల్గా డిజిటల్ స్రీన్పై పాఠాలను బోధిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధిస్తుంటే ప్రతి అంశాన్ని నేరుగా చూస్తూ, సులువుగా అర్థం చేసుకుంటున్నాం. గతంలో పాఠశాలలో వాష్ రూమ్లు ఉండేవి కాదు. ఆరు బయటకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తు తం బాలబాలికలకు ఆధునాతనమైన బాత్ రూమ్లు, తరగతి గదుల్లో ఆకట్టుకునేలా డెస్క్లు ఏర్పాటు చేశారు. గతంలో జగనన్న గోరు ముద్ద ద్వారా 16 రకాల పదార్థాలతో ప్రత్యేక మెనూను రూపొందించి నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించారు. గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. జగన్ సార్ సీఎం అయిన తర్వాతనే మా స్కూల్లో పూర్తి స్థాయి ఇంగ్లీషు మీడియంగా మారింది. అమ్మఒడి ఏటా క్రమం తప్పకుండా మా అమ్మ ఖాతాలో జమచేయడంతో మా చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగేది. జగనన్న విద్యా కానుక ఎంతో నాణ్యతతో అందించారు. అప్పటి బూట్లు, బ్యాగులు ఇప్పటికీ మేము వాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలని కోరుకుంటున్నాం. జగన్ మామయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – వెంకటేష్, జగదీష్, పదో తరగతి విద్యార్థులు, డాక్టర్ ఎస్ఆర్కే మున్సిపల్ స్కూల్, తిరుపతి -
బిడ్డ శవాన్ని మంత్రగాళ్లు ఎత్తుకెళతారని..
తిరుపతి: అనారోగ్యంతో వారం రోజుల కిందట ఓ బాలుడు(6) మృతి చెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే తన బిడ్డ మృతదేహాన్ని మంత్రగాళ్లు ఎక్కడా తీసుకెళ్లిపోతారోనని, ఆ తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో వారం కిందట మృతి చెందాడు. అనంతరం బాలుడి శవానికి గ్రామ పొలిమేరలోని శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే బాలుడు తమకు మొదటి సంతానం కావడంతో క్షుద్రపూజల కోసం మంత్రగాళ్లు మృతదేహాన్ని తీసుకెళతారని తండ్రికి అనుమానం వచ్చి కొద్దిరోజుల పాటు రోజుకు రూ.1500 చొప్పున డబ్బు ఇచ్చి నిఘా పెట్టాడు. ఆపై ఆర్థిక భారం అధికం కావడంతో తానే కాపలాగా ఉంటూ వచ్చాడు. చివరకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిత్యం సెల్ఫోన్ ద్వారా తన కుమారుడి సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. తన బిడ్డపై ఉన్న మమకారంతో తండ్రి చూపిస్తున్న ప్రేమకు గ్రామస్తులు సైతం కంట తడిపెట్టారు. -
పట్టా భూమిగా మార్చి.. ఏమార్చి!
● దర్జాగా కబ్జా ఏర్పేడు: ‘అది ప్రభుత్వ భూమి... అయితే దాన్ని ఆక్రమించుకున్న ఓ వ్యక్తి రెవెన్యూ అధికారుల అండదండలతో సెటిల్మెంట్ భూమిగా వేరొక సర్వే నంబర్తో మార్చుకుని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఏర్పేడు–వెంకటగిరి మార్గం చింతలపాళెం రెవెన్యూ పరిధిలో రోడ్డు పక్కన సర్వే నంబర్ 46–14లో 39 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమిని కాజేసిన వ్యక్తి కొన్నేళ్ల కిందట దీనిని స్వానుభవం సెటిల్మెంట్ పట్టా భూమిగా మార్చారు. రెవెన్యూ అధికారులు ఏకంగా సర్వే నంబర్ను 46–20 పేరుతో కొత్త నంబర్ సృష్టించి 73 ఖాతా నంబర్తో ఆన్లైన్లో సొంత భూమిగా నమోదు చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించి సాగుచేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏర్పేడు తహసీల్దార్ ఎం.భార్గవిని వివరణ కోరగా విచారించి, ప్రభుత్వ భూమి అని తేలితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద ఉన్న చిన్న గది నుంచి శుక్రవారం కుళ్లిన వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉండడాన్ని చూసిన స్థానికులు ఈ నెల 16వ తేదీన పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురు స్కూటర్ వద్ద దొరికిన ఆధార్కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్గా పని చేసేవాడు. ఈ నెల 15వ తేదీ రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. మృతుడు ఫూటుగా మద్యం తాగి స్కూటర్పై పడిపోవడంతో దెబ్బలు తగిలి 50 అడుగుల దూరంలో ఉన్న ట్యాంకు గదిలోకి వెళ్లి ఉండవచ్చని, అక్కడే అతను మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమంజుల తెలిపారు. -
ఎర్రచందనం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న కేసులో నలుగురికి ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, కోర్టు కానిస్టేబుల్ నరసింహులు కథనం మేరకు.. 2017 ఆగస్టు ఏడో తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భాకరాపేట స్టేషన్ పోలీసులకు అందిన సమాచారంతో వారు చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట, దేవరకొండ రోడ్డు, విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరిగెత్తడానికి ప్రయత్నించారు. పోలీసులు కలికిరి మండలం, గుట్ట పాళెం సమీపంలోని అచ్చర్ల గొల్లపల్లికి చెందిన ఎన్.రెడ్డెప్ప, పి నాగరాజ అలియాస్ గోవింద్, ఎర్రావారిపాళెం మండలం, బుగ్గలవారిపల్లి హరిజనవాడకు చెందిన ముడిమి చెంగయ్య, అదే మండలం, గొల్లపల్లికి చెందిన బి.వెంకటాద్రి అలియాస్ చిన్నను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉన్న సమీపంలోని పొదల్లో దాచిన 44 కిలోల నాలుగు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నలుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు. మరో కేసులో ఇద్దరికీ మూడేళ్లు.. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరికీ మూడేళ్లు చొప్పున జైలుశిక్ష , ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. 2009 ఆగస్టు ఒకటో తేదీ కడప ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది బద్వేలు రేంజ్ పరిధిలోని సోమిరెడ్డిపల్లి వ్యవసాయ భూముల్లో తనిఖీలు చేసి 201 కిలోల బరువున్న ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, బి మఠం మండలం, లింగాల దిన్నిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కత్తి గురుమూర్తి, అదే మండలం, సోమశెట్టిపల్లికి చెందిన డేరింగ్ ల సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
ప్రభుత్వ భూములు.. ప్రైవేటు ఆసాములు
అడిగేవారు.. అడ్డుకునే వారులేరని..ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించేశారు. ఆపై వాటికి ఫెన్సింగ్ వేసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, తమ సొంతం చేసుకున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు సైతం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడంతో సర్కారు స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. రామచంద్రాపురం: మండలంలోని రాయలచెరువు పరిసరాల్లో ప్రభుత్వ భూములపై రాబందులు పడి అందినకాడికి ఆక్రమించేసుకుంటున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ రాక్షసుల్లా వ్యవహరిస్తుండం మండలంలో చర్చనీయాంశమైంది. రామచంద్రాపురం మండలానికి చెందిన మండల మాజీ నాయకుడొకరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి కూటమి నేతలు ఆందోళనకు దిగారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, హద్దు రాళ్లను పడగొట్టారు. రాయలచెరువు లెక్కల దాఖలాలో సర్వే నంబర్లు 410/1, 410/6, 409/1 పరిధిలో నాలుగు ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఏకంగా 30 ఎకరాల అటవీ భూమిని చదును చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలను గుర్తించిన అధికారులు మండలంలోని ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేయడంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టాలను పరిశీలించిన అధికారులు ఇవి పూర్తిగా బోగస్ పట్టాలని నిర్ధారించి, పనులను అడ్డుకున్నారు. ప్ర స్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో రాబందుల్లా ప్రభుత్వ భూములపై వాలిపోయారు. మంత్రి అనుమతి ఉందంటూ బెదిరింపు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న ఆ పార్టీ నేత తమకు మంత్రి అండదండలు ఉన్నాయంటూ అధికారులు, ప్రజలను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణకు అండగా 70 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని, ఆక్రమణదారుడు వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు కలిసి పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
భార్య హత్య కేసులో భర్తకు 20 ఏళ్లు జైలు
సూళ్లూరుపేట: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విఽధిస్తూ నెల్లూరు ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎం సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి పంచాయతీ జంగాలగుంటలో 2017 ఫిబ్రవరి 28న రాత్రి పులి మునస్వామి పూటుగా మద్యం సేవించి, భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నెల్లూరు నారాయణ ఆ స్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మార్చి 4న మృతి చెందింది. ఈ కేసును అప్పటి సీఐ విజయకృష్ణ విచారించి, నిందితు డిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం చిల్లకూరు: గూడూరు పట్టణంలోని తిలక్నగర్లోని సుజాతమ్మకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయ్యింది. స్థానికుల కథనం మేరకు.. గూడూరు తిలక్ నగర్లో సు జాతమ్మ నివాసం ఉంది. ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్టోని వారంతా బయటకు పరుగులు తీసి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపుకాకపోవడంతో స్థానికులు అగ్నిమాక శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపకశాఖ వచ్చి మంటలను అదుపు చేసే సరికే ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుజాతమ్మ కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు. జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శన నేడు నాయుడుపేట టౌన్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జరగనున్న జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ ప్రదర్శన నిర్వహణ జిల్లాధికారి కే భానుప్రసాద్ తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలిసి ప్రారంభిస్తారన్నారు. ఏర్పాట్లను జిల్లాధికారి, డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్ కుమార్ పరిశీలించారు. రేపు జాబ్ మేళా తిరుపతి సిటీ: తిరుపతి నగరంలోని శ్రీనివాసపురంలో వున్న హెచ్కేఎస్ జాబ్ సర్వీసెస్ సెంటర్లో ఆదివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధినేత కేశవప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు 8978133574, 8522031850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నారావారిపల్లి శివారులో చిరుత సంచారం చంద్రగిరి: మండలంలోని నారావారిపల్లి శివారులో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలోని బండరాయిపై చిరుత పులి కదలికలను స్థానికులు గుర్తించారు. మరికొంత మంది చిరుత పులి వెళుతున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. గతంలో ఎన్నడూ చిరుత సంచారం జరిగిన దాఖలాలు లేవని, అయితే నారావారిపల్లి గ్రామానికి సమీపంలో చిరుత పులి సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మహిళ దుర్మరణం మండ్య(కర్ణాటక): కారు గోడను ఢీకొని మహిళ మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈఘటన మండ్య నగర సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన దివ్య (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. తన కుటుంబంతో కలిసి శుక్రవారం బెంగళూరు నుంచి మైసూరుకు కారులో వెళుతుండగా మండ్య నగర శివార్లలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో దివ్య మృతి చెందగా గాయపడిన దినేష్, తేజు, ప్రియాంక, డ్రైవర్ సిద్ధిక్ను మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తరువాత, వారిని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మండ్య రూరల్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ జగన్ దృష్టికి కళత్తూరు సమస్యలు
వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో ఇటీవల రాయలచెరువు తెగి ముంపునకు గురైన కళత్తూరు గ్రామ సమస్యలను తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తితో కలసి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముంపు సమయంలో జరిగిన నష్ట పరిస్థితులను తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటా జరిగిన నష్టం, పంట నష్టం, కోతకు గురైన పొలాలను గురించి వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు వివరాల గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వరద బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా నిలబడాలని, తప్పకుండా న్యాయం చేసే వరకు వారి పక్షాన పోరాడాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తిని, సమన్వయకర్త రాజేష్కు సూచించినట్లు సమాచారం. నిధులు వృథా చేస్తే చర్యలు తిరుపతి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసి, వృథా చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) సుశీలాదేవి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని తమ చాంబర్ నుంచి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు 2025–26కు సంబంధించి మొదటి విడతలో రూ. 32,24,48,796 మంజూరు చేశారన్నారు. అయితే జిల్లాలో 774 పంచాయతీలు ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగిన 744 పంచాయతీలకు మాత్రమే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. ఈ నిధులను తాగునీటి అవసరాలు, చేతిపంపులు, నీటి ట్యాంకులు, మోటార్ల నిర్వహణకు, పారిశుద్ధ్యానికి వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నేటితో ముగియనున్నపది పరీక్షల ఫీజు గడువు తిరుపతి సిటీ: జిల్లాలో ఇప్పటి వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు రూ.500ల అపరాధ రుసుముతో శనివారంలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిందని, ఇదే చివరి అవకాశమని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తక్షణం ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు, రేపు సైన్స్ ఎగ్జిబిషన్ తిరుపతి రూరల్ : ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్పీ డీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. తిరుపతి పాత తిరుచానూరు రోడ్డు లోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎగ్జిబిషన్ను ఏ ర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదు వుతున్న విద్యార్థులకు స్టాల్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. స్టాల్స్ విజేతలతోపాటు సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవం నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. తిరుమల పెద్దజీయర్స్వామి, తిరుమల చిన్న జీయర్స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు. -
ఇండియన్ బ్యాంక్ నుంచి టీటీడీకి విరాళం
తిరుమల: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేశ్కుమార్ రూ. 37,97,508 విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కలసి విరాళం డీడీని అందజేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలిపిరి చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం విరాళం అందజేసినట్లు తెలిపారు. టీటీడీకి రూ.20 లక్షలు విరాళం హైదరాబాద్ కు చెందిన హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే ఫ్లాష్లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు వారి ప్రతినిధి కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలో అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. -
అన్నదాతకు రాయితీ దూరం
ప్రభుత్వం రైతులకు ఏదైనా మేలు చేస్తుందంటే అది రాయితీ విత్తనాల పంపిణీ మాత్రమే. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని కర్షకులకు ఏటా రబీలో ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేసేది. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నాయని, బాబు సర్కారు రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియను ఆపివేసింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు విత్తన కాయలకు అధిక ధరలు వెచ్చించలేక ఆ పంటకు దూరం అయ్యారు. తిరుపతి అర్బన్: వేరుశనగ పంటకు తిరుపతి జిల్లా పెట్టిన పేరు. దూర ప్రాంతాల నుంచి సైతం వేరుశనగ కాయలు కావాలంటే తిరుపతి జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబద్దాలుగా ఏటా రబీ సీజన్లో 55 నుంచి 60 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇచ్చేవారు. అయితే ఈ రబీ సీజన్లో విత్తనాలు రేట్లు అధికంగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీ విత్తనాలు ఇవ్వాలేమని వ్యవసాయాధికారులకు సందేశం చేరవేసినట్లు తెలుస్తోంది. వేరుశనగ పంట దూరం... జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, మామిడి, చెరుకు అధికంగా సాగు చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు పాలనలోనే చెరుకు బకాయిలు ఇవ్వకుండా కొందరు ఫ్యాక్టరీలు యజమానులు రైతులను ఇబ్బందులు పెట్టడంతో జిల్లాలో చెరుకు సాగు పూర్తిగా కనుమరుగైంది. మరోవైపు బాబు పాలనలోనే ఈ ఏడాది మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో మామిడి పంట సాగు సైతం తరిగిపోతోంది. తాజాగా ఆయన పాలనలోనే రాయితీతో రైతులకు ఇవ్వాల్సిన వేరుశనగ విత్తనాలు ఎగనామం పెట్టడంతో ఈ పంట సైతం జిల్లాలో దూరం అవుతుంది. రాయితీ విత్తనాల పంపిణీ ఆపి వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మిగిలిన పంట కేవలం వరి మాత్రమే. అయితే యూరియా ఇబ్బందులతో ఆ పంట సైతం చంద్రబాబు పాలనలో దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. గత ఏడాది రాయితీ వేరుశనగ కాయలను టీడీపీ నేతలు పెద్ద మొత్తంలో తీసుకుని జిల్లాలో తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతోనే ఈ సీజన్లో ఆపివేశారని కొందరు, ధరలు పెరుగుదలతోనే రాయితీ ఇవ్వలేక ఆపివేసినట్టు మరి కొందరు చర్చించుకుంటున్నారు.అనంతపురం కదిరి ప్రాంతంలో టాగ్ 24 రకం, కే6, జేఎల్ 26 రకాల వేరుశనగ కాయల బస్తా(50కిలోలు) రూ.5500 నుంచి రూ.6 వేలకు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ 55 నుంచి 60 శాతంతో ఇచ్చి ఉంటే బస్తా రూ.2300 నుంచి రూ.2500కు వచ్చేది. చంద్రబాబు సర్కార్ వేరుశనగ పంపిణీ ఎగనామం పెట్టడంతో ఈ పంట జిల్లాలో సాగుకు దూరమైంది.కాగా వేరుశనగ రాయితీ విత్తనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గత నెల నవంబర్ 15 నుంచి ఈ నెల 15 వరకు వేరుశనగ పంట సాగు చేసిన రైతులు ఎకరం పంటకు బీమా ప్రీమియం రూ.450 చెల్లించాలని తెలపడం విడ్డూరంగా ఉంది. -
ఇద్దరు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
4 కిలోల గంజాయి స్వాధీనం రేణిగుంట: అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో విక్రయించే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఈ వివరాలను వెల్లడించారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు రేణిగుంట సంత వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద నల్ల కవర్లో నాలుగు కిలోల గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుమల బాలాజీ నగర్కు చెందిన మేలపాటి యశ్వంత్, తిరుపతి బీటీఆర్ కాలనీకి చెందిన మల్లెల సూర్యగా గుర్తించామని డీఎస్పీ అన్నారు. అరకు ప్రాంతానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకువచ్చి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వారు విచారణలో తెలిపారన్నారు. నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగల పరిశీలన
కలువాయి(సైదాపురం): ప్రభుత్వ అనుమతితో నరికి, విక్రయించేందుకు ఓ ప్రైవేట్ సంస్థలో ఉంచిన ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖాధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి శుక్రవారం పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ మొత్తం ఐదు ఎర్రచందనం చెట్లు నరకగా వచ్చిన నాలుగు టన్నుల బరువున్న 39 దుంగలు, నాలుగు వేర్లు 970 కిలోలు ఉన్నట్లు తెలిపారు. వీటి కొలతలు, బరువు పరిశీలించిన అనంతరం సంబంధిత వారికి పర్మిట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు స్క్వాడ్ రేంజర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్కు పొంచిఉన్న ముప్పు ● అడవిని తలపిస్తున్న కట్ట
రాపూరు/సైదాపురం: మండలంలో తెలుగుగంగ పథకంలో భాగంగా నిర్మించిన కండలేరు జలాశయంపై పర్యవేక్షణ లోపించడంతో శిథిలావస్థకు చేరుతోంది. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడడంతో ప్రాజెక్ట్కు మనుగడకు ముప్పువాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయం హెడ్ రెగ్యులేటర్ల షట్టర్లు పాడైపోవడంతో హుటాహుటిన నిపుణుల కమిటీ పర్యవేక్షించింది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గితేనే మరమ్మతు చేసేందుకు వీలుంటుందని నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీంతో నిండుకుండలా ఉన్న కండలేరు జలాశయంపైనే సాగు చేసే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే జలాశయం మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. కాలువలకు నీరు విడుదల కండలేరు జలాశయం నుంచి సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజక వర్గాల్లోని చెరువులకు ఏటా కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం కండలేరులో 60 టీఎంసీలు నీరు నిల్వ చేస్తారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,160 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 20 క్యూసెక్కులు, హైలెవల్ కాలువకు 100, లోలెవల్ కాలువకు 50 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కెనాల్కు 75 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కండలేరు నుంచి చెరువులకు సాగునీరు వస్తుంది. ప్రస్తుతం కండలేరు జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్పైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అవసరం ఇలా.. కండలేరు జలాశయం పరిధిలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం రబీ సీజన్లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. మట్టికట్టపై అడవిని తలపిస్తున్న కర్ర తుమ్మ కండలేరు జలాశయం మట్టికట్టపై రెండేళ్లుగా చెట్లును తొలగించకపోవడంతో అడవిలా తయారైంది. ఇటీవల కురిసిన మెంథా, దిత్వా తుపాన్లతో కురిసిన భారీ వర్షాలకు జలాశయంలోకి పూర్తిగా నీరు చేరడంతో అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఏటా మట్టికట్టపై ఉన్న కర్ర తుమ్మ చెట్లను తొలగించి, కట్టను బాగు చేస్తుండేవారు. అయితే రెండేళ్ల నుంచి అలాంటి జాడ లేకపోవడంతో కట్టకు కూడా పెను ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్లూయిజ్ వద్ద కూడా కంప పెరిగిపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల కమిటీ పరిశీలన కండలేరు జలాశయాన్ని గత రెండేళ్ల క్రితం నిపుణుల కమిటీ పరిశీలించింది. కండలేరు జలాశయం నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు పూర్తి కావస్తుందని, మట్టికట్టను వెడల్పు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ నివేదిక కార్యరూపం దాల్చలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కండలేరు జలాశయాన్ని డిసెంబర్ 17వ తేదీన నిపుణుల కమిటీ పరిశీలించింది. లీకేజీ సమస్య, గేట్లు ఎత్తే సమయంలో గేట్లు పైకి లేవడంలేదని అక్కడి సిబ్బంది కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉండడంతో లీకేజీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కష్టమని తెలిపారు. నీరు తగ్గిన తరువాత వచ్చి మరోసారి పరిశీలించి లీకేజీ సమస్య పరిశీలించగలని నిపుణుల బృందం తేల్చి చెప్పింది. దేశ చరిత్రలోనే ఖ్యాతి.. కండలేరు జలాశయం దేశంలో ఎక్కడ లేని విధంగా 10.758 కి.మీ. పొడవున మట్టికట్టను నిర్మించారు. ఇంత పెద్ద మట్టికట్ట ఆసియా ఖండంలో మరొకటి లేకపోవడం విశేషం. జలాశయంలో భాగంగా కండలేరు అతిథిగృహం, కండలేరు హెడ్రెగ్యులేటర్, పవర్స్లూయిస్, అప్రోచ్ చానల్స్ నిర్మించారు. 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ జలాశయంలో 68 టీఎంసీల నీరు నిల్వ ఉంచి చైన్నె, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందిచేందుకు ఈప్రాజెక్టు నిర్మించారు. 10.758 కిలోమీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో మట్టికట్ట నిర్మించారు. 1984లో ప్రారంభమైన ఈ పనులు 1996 వరకు కొనసాగాయి, 22 గ్రామాలు జలాశయంలో ముంపునకు గురయ్యాయి, 2021 లో 61.03 టీఎంసీల నీరు నిల్వ చేశారు. దెబ్బతిన్న హెడ్ రెగ్యులేటర్ గేట్లు కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు పలుసార్లు మరమ్మతులు చేశారు. కానీ హెడ్ రెగ్యులేటర్ వద్ద కొన్నేళ్లుగా లీకేజీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో పలుసార్లు నిపుణుల కమిటీ పరిశీలించింది. అయినా లీకేజీని అరికట్టలేకపోయింది. అలాగే సకాలంలో గేట్లు ఎత్తడంతో సిబ్బంది కొంతమేర కష్టపడుతుంటారు. జలాశయం నుంచి నీరు విడుదల చేసే సమయంలో గేట్లు పైకి ఎత్తడం కష్టంగా మారుతుంది. ప్రైజర్ ద్వారా గేట్లు ఎత్తుతుంటారు. కండలేరు జలాశయంలోని హెడ్ రెగ్యులేటర్కు 2014–15 సంవత్సరంలో రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో రోప్, బేరింగ్ తదితర పరికరాల మరమ్మతుకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2024–25 సంవత్సరంలో కండలేరు గేట్లకు రూ.67 లక్షలు నిధులు మంజూరు చేయడంతో గేట్లు మరమ్మతులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవాహవేగంతోనే జలాశయం 391 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నప్పటికీ దీని పరిధిలో వచ్చే వర్షపు నీరు 3 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీరు కృష్ణా, పెన్నా నదుల నుంచి జలాశయానికి తరలిస్తారు. కండలేరు జలాశయం హెడ్రెగ్యులేటర్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి (చైన్నె) జలాశయానికి ప్రతి సంవత్సరం 12 టీఎంసీల తాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ జిల్లాల ప్రజలకు తాగునీరు అందిస్తారు. నీరు తగ్గిన తరువాత మరమ్మతులు చేస్తాం కండలేరు జలాశయం హెడ్రెగ్యులేటర్ వద్ద గేట్లు గత 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రతిసారి నీళ్లు వదిలే సమయంలో గేట్లు ఎత్తుతూ దించుతూ ఉండడంతో కొంతమేర దెబ్బతిని ఉండవచ్చు. అలాగే కాంక్రీట్ వాల్ కూడా దెబ్బతిని ఉంటుందని నిపుణుల కమిటీ సూచించింది. నీళ్లు తగ్గిన తరువాత నిపుణుల కమిటీ, ఉన్నతాధికారుల సూచన మేరకు మరమ్మతులు చేపడతాం. –అనిల్కుమార్, ఏఈ, తెలుగుగంగ -
మరో మైలురాయిని అధిగమించిన శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీలోని క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ అగ్రగామి సంస్థ యూఎస్ఏ చార్ట్ ఇండస్ట్రీస్కు చెందిన వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అత్యాధునిక క్రయోజెనిక్ సాంకేతికతతో తయారైన భారీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్ను ఈజిప్ట్లోని ప్రముఖ సంస్థ ఎయిర్ లిక్విడ్కు ఎగుమతి చేయడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది. 531 కిలో లీటర్ల సామర్థ్యం, 168 టన్నుల బరువు, సుమారు 39 మీటర్ల పొడవు, 5.45 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ట్యాంక్ క్రయోజెనిక్ ఇంజినీరింగ్లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ భారీ నిర్మాణాన్ని చైన్నె పోర్ట్కు తరలించేందుకు ప్రత్యేక మల్టీ–యాక్సిల్ లాజిస్టిక్స్ను వినియోగించారు. ఈ ఎగుమతిని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గొప్ప విజయంగా అభివర్ణించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్రపంచ స్థాయి క్రయోజెనిక్ ఇంజినీరింగ్లో వీఆర్వీ ప్రతిభను ఇది మరింత బలపరుస్తుందని అన్నారు. -
విషమ పరీక్ష
డిసెంబర్ వచ్చినా సగం సిలబస్ కూడా పూర్తి కాక.. మార్చినెట్టా గట్టేక్కేది అంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు నూతన పరీక్షల విధానం వీరిని మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. కొత్త విధానంపై అవగాహన లేకపోవడంతో పరీక్షల భయం వెంటాడుతోంది. తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ విద్యామండలి వ్యవహార శైలితో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొకోక తప్పడం లేదు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఇంటర్మీడియల్లో మొదటి సంవత్సరం సిలబస్ను పూర్తిగా మార్చేశారు. నూతన సిలబస్తో పరీక్షా విధానంలోనూ పెనుమార్పులు తీసుకొచ్చారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం అడ్మిషన్లు అక్టోబర్ వరకు కొనసాగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో నూతన సిలబస్పై పట్టు సాధించడం అసాధ్యమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్షల విధానం, నూతన సిలబస్పై జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 80శాతం మంది విద్యార్థులు అవగాహన లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో పరీక్షలు.. పూర్తి కానీ సిలబస్! ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. కానీ జిల్లాలోని సుమారు 60 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన సిలబస్ ఇప్పటివరకు అధ్యాపకులు పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో 40 రోజుల పనిదినాలు మాత్రమే పరీక్షలకు గడువు ఉన్నా అధికారులు చెల్లించకపోవడం ఆశ్చర్యమేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా జేఈఈ, నీట్, ఎమ్సెట్ వంటి ప్రధాన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నూతన పరీక్షా విధానం ఇలా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు అన్ని గ్రూపులకు సంబంధించి సబ్జెక్టుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. ఇందులో ఇంగ్లీషును తప్పనిసరి చేసి, సెకండ్ లాంగ్వేజ్ను ఐచ్ఛికం చేశారు. అలాగే సిలబస్ మార్పుతో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఏ, బీ పేపర్లును రద్దు చేశారు. కేవలం ఒకే మ్యాథ్స్ పేపరు మాత్రమే ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సెబ్జెక్టులను కలిపి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా 100 మార్కులు ఉన్న సబ్జెక్టుల్లో 35 మార్కులు ఉత్తీర్ణతగాను, 85 మార్కులు రాత పరీక్ష ఉండే సైన్స్ సబ్జెక్టుల్లో 29 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించారు. సైన్స్ సబ్జెక్ట్ల ప్రాక్టికల్స్కు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కలిపి 30 మార్కులుగా నిర్ణయించారు. అంటే ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులు ఉండనున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రశ్నపత్రాల్లో అర్థ, ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఎనిమిది, 16 మార్కుల ప్రశ్నలు సందించనున్నారు.నూతన సిలబస్తో.. సరికొత్త పరీక్షల విధానంజిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 30,275 మంది హాజరు కానున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మ్యాథ్మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో నూతన సిలబస్తో సమూల మార్పులు చేశారు. కొత్త సిలబస్పై అటు అధ్యాపకులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో ఈ ఏడాది గత ఏడాది కంటే ఫలితాలు మెరుగు పడే అవకాశం లేదని సాక్షాత్తు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం యథావిధిగా పాత సిలబస్, పాత పరీక్షా విధానంలో పరీక్షలు జరగనున్నాయి. -
మోహిత్ రెడ్డిని అభినందించిన అధినేత
– చంద్రగిరిలో లక్షా 16 వేల సంతకాల సేకరణపై ప్రశంసలు తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం చంద్రగిరిలో చరిత్ర సృష్టించిందని, సీఎం చంద్రబాబు పుట్టి, పెరిగిన నియోజక వర్గంలోనే లక్షా 16 వేల మంది సంతకం పెట్టినట్టు తెలుసుకున్న ఆయన శభాష్ అంటూ ప్రశంసించారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలసిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీసిన జగన్ ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతానన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
తడ : కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై మూడు బైకులను ఢీకొట్టిన ఘటనలో నలుగురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గురువారం కాదలూరు గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బూదూరు నుంచి మాంబట్టు సెజ్లోని పరిశ్రమకు కార్మికులను తీసుకొస్తున్న బసు ప్రమాద స్థలం వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు ఆగి ఉన్న మూడు బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరవారిసత్రం మండలానికి చెందిన రమేష్, యమున, సంపూర్ణతో పాటు మరో మహిళ గాయపడ్డారు. వీరంతా కూడా అపాచీ పరిశ్రమలో పని చేస్తూ విధులకు హాజరయ్యేందుకు బైక్లపై వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రులు సూళ్లూరుపేటలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా కొట్టే ప్రమాదం నుంచి తృటిలో తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ కీలక సమావేశంలో జిల్లా నేతలు
తాడేపల్లెలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమాశంలో పాల్గొన్న జిల్లా నేతలు భూమన కరుణాకర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, భూమన అభినయ్ రెడ్డి. – విజయవాడ నారాయణవనంలో నేత కార్మికులు నేసిన పార్టీ శాలువా గురించి వివరిస్తున్న ఎంపీ గురుమూర్తి, నూకతోటి రాజేష్ అధినేతను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి -
‘బాబు నీ బుద్ధి మారదా?’
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వామపక్షనేతలు తిరుపతి అర్బన్ : సీఎం చంద్రబాబు బుద్ధిలో ఏ మాత్రం మార్పు రాలేదని.. ఆయనది ఎప్పుడూ కార్పొరేట్ ఆలోచనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. సీపీఐతోపాటు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేటు నుంచి లోనికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పి. మురళి మాట్లాడుతూ.. 17 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం తీసుకొస్తే...చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటుగా ఉందని మండిపడ్డారు.55 శాతం సీట్లు.. ఒక్కో సీటు కోటికి అమ్ముకోవడం... 45శాతం సీట్లు కన్వీనర్ కోటలో ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ 100 శాతం సీట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు అందిస్తామని చెప్పి.. ప్రస్తుతం మాట తప్పినందుకు తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
19 నుంచి అధ్యాపకులకు శిక్షణ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల విధానం ఈ ఏడాది నుంచి మారింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు, అధ్యాపకులకు పూర్తి స్థాయిలో ఇప్పటికే అవగాహన కల్పించారు. ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని కళాశాలల్లో ప్రతి సబ్జెక్టులో సిలబస్ పూర్తి చేశాం. రివిజన్ చేస్తున్నాం. నూతన పరీక్షల విధానంపై తుది విడతగా మరో మారు అధ్యాపకులకు ఈనెల 19వ తేదీన తిరుపతి చైతన్య కళాశాల వేదికగా శిక్షణ ఇవ్వనున్నాం. పరీక్షల విధానంపై ఎటువంటి తికమక లేదు. –రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీకాళహస్తి మండలం ఆదవరం అటవీ పరిధిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లరును టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తీర్ధాలపాల కోన వద్ద కొంత మంది వ్యక్తులు గుమికూడి కనిపించగా వారిని పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా పారిపోతున్న క్రమంలో ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన స్మగ్లరు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ పరిసరాల్లోని ఆరు ఎర్రచందనం దుంగలు, ఉపయోగించిన ద్విచక్ర వాహనం సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఐడియాథాన్–2025 నారాయణవనం : తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టిఐహెచ్) సహకారంతో సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఐడియాథాన్ –2025ను నిర్వహించారు. 90 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు పాల్గొని, తమ వినూత్న ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు సిల్వియా, వినోద్ కుమార్, వీరేంద్ర సాయి, శ్రీనివాస్ విద్యార్థుల ఆలోచనలను పరిశీలించి సూచనలు అందించారు. ప్రాజెక్టులు, ఆలోచనలపై మార్గదర్శకాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్వోడీలు, కంప్యూటర్ సైన్ విద్యార్థులు పాల్గొన్నారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి నాయుడుపేట టౌన్ : మండలంలోని చలివేంద్రం గ్రామ సమీపంలో బైక్ ఢీకొని గాయపడిన కల్లుగీత కార్మికుడు కన్నడి వెంకటయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన వెంకటయ్య గురువారం సాయంత్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కగా నడిచి వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెంకటయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల స్థలాలను దోచేస్తారా ?
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో 1.09 ఎకరాల మఠం భూమిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. సీపీఎం మండల కన్వీనర్ వేణు మాట్లాడుతూ.. గాంధీపురానికి చెందిన 32 రజక కుటుంబాల వారు ఇంటి నిర్మాణాల కోసం కొనుగోలు చేస్తే ఆ భూములు దోచేసి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి పేదల జాగాల్లో పాగా వేసేందుకు ప్రయత్నించే రామసుబ్బారెడ్డితో పాటు అతనికి అండగా నిలబడ్డ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మఠం భూముల్లో 144 సెక్షన్ అమలు చేయాలి భూ ఆక్రమణ దారుల ఆగడాలతో మఠం భూమిలో అల్లర్లు చెలరేగుతున్నాయని, గంజాయి మత్తులో యువత భయబ్రాంతులకు గురిచేస్తున్నందున అక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మఠం భూములను పరిరక్షించడంతో పాటు ఆ మఠం భూమి తమదేనని అమాయకులను మోసం చేసి డబ్బులకు విక్రయించిన వ్యక్తులపై కేసు పెట్టాలని, లేని పక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహన్ను కలిసి వినతి పత్రం అందించి బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు వేణు, సుబ్రమణ్యంలతో పాటు 32 బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. కేసు నమోదు చేయాలి మఠం భూములను అడ్డంగా అమ్మేస్తున్న భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై భూ ఆక్రమణ నిరోదక చట్టం కింద కేసు నమోదు చేయాలి. స్థానికులపై దాడులకు తెగబడుతున్న కడప జిల్లా వాసులను అక్కడి నుంచి తరిమివేయాలి. డబ్బులు పెట్టి స్థలం కొనుగోలు చేసిన బాధితులు అందరికీ న్యాయం చేయాలి. – మహేష్, రజకసంఘం నాయకుడు, గాంధీపురం -
లారీ డ్రైవర్ కుమార్తెకు ఐఈఎస్
తిరుపతి సిటీ: తిరుపతి సింగాలకుంటకు చెందిన లారీ డ్రైవర్ కృష్ణమూర్తి కుమార్తె దాసరి ఇందుమతి అరుదైన లక్ష్యాన్ని సాధించారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్లో దేశంలోనే అత్యుత్తమ పరీక్షగా పేరుగాంచిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో 75వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. తొలి ప్రయత్నంలోనే ఆమె ఈస్థాయికి చేరుకోవడంపై జిల్లా వ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్న లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారని ఆయన కష్టాలను గమనించి ఎలాగైనా ఐఈఎస్ సాఽధించాలని పట్టుదలతో పరీక్షకు సన్నద్ధం అయ్యానని తెలిపారు. 21న తిరుమలలో పల్స్ పోలియో తిరుమల:తిరుమలలో 21వ తేదీ పల్స్ పోలియో సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సీఆర్ఓ, పీఏసీ 1, 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1,2 ఏటీసీ, ఎంబీసీ–34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల , వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు. నేడు ఇంటర్ పరీక్షలపై అవగాహన తిరుపతి సిటీ : నూతన సిలబస్, సరికొత్త పరీక్షా విధానంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు అవగాహన కల్పించనున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తిరుచానూరులో శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పరీక్షా సెంటర్ల ఇంచార్జిలు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో కడప ఆర్జేడి సురేష్బాబు, ఇంటర్మీడియట్ విద్యామండలి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణిక్యుడు పాల్గొంటారని తెలియజేశారు. మెగా జాబ్ మేళాకు స్పందన తిరుపతి తుడా : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతంలోని తిరుపతి కార్పొరేషన్, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి , సూళ్లురుపేట , వెంకటగిరి మున్సిపాలిటీల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జాల ఎఫ్రాయిమ్ తెలిపారు. గరువారం తిరుపతి తుడా కార్యాలయంలో జరిగిన జాబ్ మేళాలో మహిళా సంఘాల, సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేళా నిర్వహించామన్నారు. ఇందులో సుమారు 454 మంది హాజరు కాగా అందులో 117 మందికి ఉద్యోగాలు పొందారన్నారు. కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి లోకనాథం, మెప్మా అధికారులు పాల్గొన్నారు. శాస్త్రాలపై పట్టు సాధించాలి తిరుపతి సిటీ : విద్యార్థి దశ నుంచే శాస్త్ర సంరక్షణ, శాస్త్రలపై పట్టు సాధించాలని స్వర్ణవల్లీ మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీగంగాధరేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీమదానంద బోధేంద్ర సరస్వతీ స్వాములు సూచించారు. గురువారం జాతీయ సంస్కృత వర్సిటీలో పరమాచార్య గురుకుల కేంద్రం, పలు వాక్యార్థ సభలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రాల పఠనంతో విశేష జ్ఞానం సొంతమవుతుందన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. శాస్త్ర విషయాలు, సంస్కృతిని సంరక్షించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరమాచార్య గురుకుల కేంద్ర డైరెక్టర్, అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు గణపతి భట్, డీన్ రజనీకాంత్ శుక్ల, ఐక్యూఏసీ డైరెక్టర్ సతీష్, గోవింద వాక్యార్థ సభ కో ఆర్డినేటర్లు శ్రీహరి దాయగుడే, మనోజ్ షిండే, కులపతి వాక్యార్థసభ కోఆర్డినేటర్లు శంకర నారాయణ, భరత భూషణ్ త్ , పలు విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వక్తృత్వ పోటీ విజేత తిరుపతి
తిరుపతి రూరల్ :ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో కడప జిల్లా విద్యార్థులు, వక్తృత్వ పోటీల్లో తిరుపతి విద్యార్థి విజేతలుగా నిలిచారని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తిరుపతి,చిత్తూరు, నెల్లూ రు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంధన పరిరక్షణ అంశంపై జిల్లా స్థాయిల్లో క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. జిల్లాల పరిధిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయా జిల్లా కార్యాలయాల ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి బుధవారం సాయంత్రం ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహించారు. వక్తృత్వపు పోటీల్లో .. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వపు పోటీల్లో తిరుపతి జిల్లా గూడూరులోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జె. అద్రిజారావు మొదటి స్థానంలో నిలువగా, చిత్తూరు జిల్లా పైపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే. మనీషా ద్వితీయ స్థానం, అనంతపురం జిల్లాలోని లక్ష్మి సినర్జీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న టి. యశస్విని తృతీయ స్థానంలో నిలిచారు. సంస్థ డైరెక్టర్ (టెక్నికల్ – హెచ్ఆర్ డి) కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆది శేషయ్య, పి.హెచ్. జానకిరామ్, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 20, 21న రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందించనున్నట్టు సీఎండీ తెలిపారు. -
ఐఐటీలో ఉత్కంఠగా పోటీలు
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చెస్, టెన్నీస్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. చెస్ 4వ రౌండ్ ఫలితాలివే చెస్ పోటీలలో నాల్గవ రౌండ్ ముగిసే సరికి ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థులు 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాలలో 11 పాయింట్లతో బాంబే ఐఐటీ, 10 పాయింట్లతో ఇండోర్, కాన్పూర్ ఐఐటీలు, 9.5 పాయింట్లతో వారణాసి, మద్రాస్, గౌహతి ఐఐటీలు, 9 పాయింట్లతో పాట్నా ఐఐటీ, 8.5 పాయింట్లతో హైదరాబాద్, బిలాయ్, భువనేశ్వర్ ఐఐటీలు కొనసాగుతున్నాయి. టెన్నీస్ మహిళలు, పురుషుల విభాగాలలో క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. -
తహసీల్దార్, వీఆర్వోల సస్పెన్షన్
తిరుపతి అర్బన్ : పీజీఆర్ఎస్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) పిటీషన్లకు సంబంధించి తప్పుదోవ పట్టించారనే నేపథ్యంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని, వీర్లగుణపాడు వీఆర్వో డిల్లెయ్యను సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓజిలి మండలంలోని వీర్లగుణపాడులోని సర్వే నంబర్ 74లో ధనంజయ, వెంకటరమణయ్య అనే రైతులు తమ భూములను అన్లైన్లో నమోదు చేయాలని పీజీఆర్ఎస్లో అధికారులకు పిటీషన్ ఇచ్చారు. అయితే ఆ భూములకు సంబంధించి వాస్తవాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకుండా పిటీషన్ను తిరస్కరించకుండా తహసీల్దార్ ఎండార్స్మెంట్ చేయడంతో సమస్య నెలకొంది. దీంతో అధికారులు ఈ అంశంపై సీరియస్ అయ్యారు. ఈ అంశానికి తోడుగా వీర్లగుణపాడు వీఆర్వో డిల్లయ్య సదరు సర్వే నంబర్లో అక్రమంగా నమోదైందని, బోగస్ అంటూ జనవరిలో ఓ నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత జూన్లో ఆ భూమి వారి స్వాధీనంలో ఉందని మరో నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్లో ఎంట్రీలు అక్రమంగా ఉన్నాయని, పిటీషనర్ల స్వాఽధీనంలో కాకుండా భూమి ఖాళీగా ఉందంటూ మరో నివేదిక ఇచ్చారు. ఇలా మూడు సార్లు ఇచ్చిన నివేదికల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా చూపించారు. ఈ అంశాన్ని గుర్తించిన సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని సస్పెన్షన్ విధించినట్లు ఆమె బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు. మరోవైపు వీఆర్వో డిల్ల్య్యెను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. -
తుపాను దెబ్బతీసింది
ఈ చిత్రంలో ఉన్న రైతు చిల్లకూరు వేమయ్య, తనకు ఉన్న మూడెకరాలలో ఒక ఎకరం నిమ్మ సాగు చేపట్టాడు. సీజన్లో నిమ్మ కాయలు కోసి విక్రయించుకుంటే ఇంటి ఖర్చులు పోను రెండెకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు సాగుకు అవసరమైన ఖర్చులకు సరిపోయేవి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నిమ్మ కాయలు బాగా కాస్తున్నప్పటికీ ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాగుకు అవసరమైన మందులు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు తుపాను సమయంలో నిమ్మ పూత రాలి పోవడంతో వేసవిలో కాయలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. -
సైట్ ఓపెన్ కావడం లేదట
చిట్టమూరు:నాకు పదేళ్లుగా వినికిడి లోపం ఉంది. ఎదుటివారి మాటలు పూర్తిగా వినిపించవు. దీంతో కూలి పనులకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో సదరన్ క్యాంపునకు వెళ్లి వైద్యుల వద్ద చూపించుకున్నాను. అయితే సర్టిఫికెట్ రాకపోవడంతో పింఛన్ రాలేదు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంప్లో చూపించుకునేందుకు గ్రామ సచివాలయానికి స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లాను. అయితే ఎప్పుడు వెళ్లినా సదరన్ క్యాంప్ సైట్ ఓపెన్ కావడంలేదు. – మారుబోయిన మస్తాన్, ఆరూరు, చిట్టమూరు మండలం -
ముత్తుకూరు నుంచి గూడూరుకు
చిల్లకూరు:నేను వృత్తి రీత్యా మత్స్యకారుడిని. సముద్రంపైకి పడవలో వెళ్లి చేపల వేట ద్వారా జీవనం చేస్తుండేవాడిని. నాలుగేళ్ల కిందట ప్రమా దం జరగడంతో కుడికా లు, కుడి చేయి సరిగా పని చేయకుండా మాట కూడ పూర్తిగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాను. గత ప్రభుత్వంలో నాకు ది వ్యాంగుల పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం చంద్రన్న సర్కార్ సదరన్ సర్టిఫి కెట్ ఇస్తేనే పింఛన్ అని చెప్పింది. దీంతో ముత్తకూరులోని సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకుంటూ దగ్గరలో ఉండే నెల్లూర్లులోని సర్వ జన ఆస్ప త్రికి కాకుండా గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం తీసుకు రావాలని చెప్పడంతో అష్ట కష్టాలు పడ్డాడు. – వి పోలయ్య, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
పీజీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను అధికారులు ఎట్టకేలకు బుధవారం విడుదల చేశారు. రెగ్యులర్ పీజీ కోర్సులకు సంబంధించి ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎకనా మిక్స్, హిందీ, టూరిజం, తెలుగు, ఎమ్మెస్సీ ఆ క్వాకల్చర్, బయోటెక్నాలజీ, ఎంకామ్తో పాటు ఎల్ఎల్ఎమ్ నాలుగో సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. 20న ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీని వాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, పలు ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోనే పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు సుమారు 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు శనివారం 10 గంటలకు వర్సిటీలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయానికి తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో చేరుకోవాలన్నారు. మలేషియాలో ఉద్యోగావకాశాలు తిరుపతి సిటీ: మలేషియాలో ఉన్నతవిద్యతోపాటు ఉద్యోగ అవకాశాలున్నాయని ఆ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ చి యాంగ్ కౌన్యున్ పేర్కొన్నారు. కొన్ని రోజులు గా ఎస్వీ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ల్యాబ్ మెటీరియల్పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ చియాంగ్ కౌన్యున్ పరిశీలించారు. మెటీరియల్ సైన్స్పై ప్రామాణి కత కలిగిన పరిశోధనలు సాగాలని ఆకాంక్షించారు. పరిశోధనలకు కేంద్రంగా ఉండే గొప్ప ప్రయోగశాలల్లో పరికరాల పనితీరు మెరుగుపరచుకోవడం అవసరమని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీతో తాము అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ట్టు వెల్లడించారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తాను చీఫ్ ఎడిటర్గా ఉన్న మెటీరియల్ సైన్స్ ఇన్ సెమీ కండక్టర్ ప్రపోజల్స్ జర్నల్కు యూనివర్సిటీ నుంచి పరిశోధకులు శాస్త్రవేత్తలు పరిశోధన వ్యా సాలు పంపాలని కోరారు. అనంతరం ప్రొఫె సర్ చియాంగ్ కౌన్యున్ను శిక్షణ కార్యక్రమం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు శా లువ, పుష్పగుచ్చం, జ్ఞాపికతో సత్కరించారు. శ్రీవారి సేవలో ఉడిపి మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
అధ్యాపక పోస్టులు తక్షణం భర్తీ చేయాలి
తిరుపతి సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామన్ ఎంట్రెనన్స్ పీజీ సెట్ విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. ఎస్వీయూ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించకపోవతే యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీ నాయకులు చిన్న, నగర అధ్యక్ష ,కార్యదర్శులు హరికృష్ణ, వినయ్ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్, నాయకులు వెంకటేష్, అశోక్, నాని, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. -
మాకు కడుపు కోత మిగిల్చారు
నాయుడుపేటటౌన్: పట్టణంలోని మూకాంబికా వీధిలో నివాసం ఉన్న దివ్యాంగుడు తుమ్మూరు శ్రీనివాసులు. అతని భార్యపేరు విజయ. 2017 కంటే ముందు బ్రెయిన్ స్ట్రోక్తో శ్రీనివాసుల పరిస్థితి విషమంగా మారి రెండు కాళ్లు, చేతులు పని చేయక మంచానికి పరిమితమయ్యారు. వంద శాతం వైకల్యం ఉన్న శ్రీనివాసులుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం మంచానికే పరిమితమై రెండు కాళ్లు, చేతులు పనిచేయని శ్రీనివాసులుకు 40 శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు జారీ చేసి పింఛన్ను రద్దు చేశారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నోటీసులు ఇచ్చారు. దీంతో నడవలేనిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు నానా ఇబ్బందులు పడి తిరుపతి వైద్యశాలకు తీసుకెళ్లారు. అయినా సదరన్ సర్టిఫికెట్ అందలేదు. పింఛన్ రద్దు చేసి మాకు కడుపు కోత మిగిల్చారని ఆవేదన చెందుతున్నారు. -
రెండు నెలులగా తిరుగుతున్నా..
వాకాడు: నాకు చెవులు రెండు పూర్తిగా వినిపించవు. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సదరం క్యాంపునకు దరఖాస్తు చేసుకున్నాను. అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ఇచ్చే రశీదు కోసం గత రెండు నెలలుగా సచివాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నాను. అయినా ఏ ఆస్పత్రిలో వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలనే విషయం తెలియడం లేదు. సచివాలయం సిబ్బందిని అడిగితే మాకు ఏమి తెలియదు అని చెబుతున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. – ఉమ్మడి రమణమ్మ, గొల్లపాళెం, వాకాడు మండలం -
ప్రైవేటీకరణపై విద్యార్థి రణం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ కలాలు గళాలుగా మార్చి విద్యార్థిలోకం రణం మొదలు పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు తమదైన పాత్ర పోషించి, సంతకాలతో తమ గళం వినిపించారు. జిల్లాలోని విద్యార్థులు లక్షలాది మంది తమ సంతకం చేసి, నిరసన తెలిపారు. తిరుపతి సిటీ: జిల్లా యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిపై గళమెత్తారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులే సుమారు 4 లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కార్పై యువత ఎంత ఆగ్రహంగా ఉందో తెటతెల్లమవుతోంది. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు సర్కార్ వైద్యవిద్యను గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర పన్నుతోందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తిరుగుబాటు జిల్లాలో సంతకాల వివరాలు నియోజకవర్గం మొత్తం సంతకాల సేకరణ విద్యార్థులు చేసిన సంతకాలు తిరుపతి 60, 432 24,221 చంద్రగిరి 1, 16,017 61,327 శ్రీకాళహస్తి 75,776 21,658 వెంకటగిరి 72,487 19,423 సూళ్లూరుపేట 69,544 17,557 గూడూరు 70,551- 18,674 సత్యవేడు 51,508 16,700 -
వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతకు పలు అభిషేకాలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం పుర ఉత్సవం నిర్వహించారు. స్కిల్ ఇండియా స్టేట్ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ తిరుపతి సిటీ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీడబ్ల్యూ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన స్కిల్ ఇండియా కాంపిటేషన్ పోటీల్లో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 85 మంది విద్యార్థులు పోటీ పడగా ఇందిలో 9 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణించారు. విజయవాడ కేంద్రంగా ఈనెల 19వ తేదీన జరగనున్న స్టేట్ లెవల్ కాంపిటేషన్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ స్టేట్ లెవల్ కాంపిటేషన్కు ఎంపికై న 9 మంది విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆ కాంక్షించారు. స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ దీప పాల్గొన్నారు. నైలెట్తో కలసి నూతన కోర్సులు తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ)తో కలిసి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగా నూతన కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్వీ ఆ ర్ట్స్ కళాశాల్లో విద్యార్థుల కోసం నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యవృద్ధి కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైలెట్ అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రతి సంవత్సరం పరిశ్రమ ల అవసరాలకు అనుగుణమైన నూతన కోర్సు లను ప్రవేశపెట్టేందుకు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నైలెట్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రధానంగా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణకు ప్రాఽ దాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగాధిపతి మల్లికార్జున రావు, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి రత్నరావు, అధ్యాపకులు చక్రవర్తి పాల్గొన్నారు. మహిళా హాస్టళ్లలో సెల్ ఫోన్ల చోరీ తిరుపతి క్రైం : నగరంలోని మహిళా హాస్టళ్లలో సెల్ఫోన్లు చోరీకి పాల్పడిన సంఘటన బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు కథనం మేరకు.. భవానీనగర్ సమీపంలోని ఫ్రెండ్స్, మహిత్ ఉమెన్స్ హాస్టల్లోకి బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ము సుగు దొంగ చొరబడి ఆరు సెల్ ఫోన్లను చోరీ చేశాడు. దీనిపై మహిళా హాస్టళ్లలోని విద్యా ర్థులు ఈస్ట్ పోలీసులు సంప్రదించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముంపు బాధితులకు ఫ్యాన్ల వితరణ వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో రాయలచెరువు వరద ప్రవాహానికి ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ముంపు బాధితులకు ఫ్యాన్ల వితరణ కార్యక్రమం కొనసాగుతోంది. మొదటగా కళత్తూరు పంచాయతీలో 500 కుటుంబాలకు ఫ్యాన్ల వితరణ చేశారు. అయితే ముంపు బాధిత గ్రామాలు పాతపాళెం, దళితవాడ, అరుంధతివాడలో కూడా నీటి ప్ర వాహం సంభవించి నష్టం వాటిల్లడంతో ఆ రెండు గ్రామాలకు చెందిన 75 కుటుంబాలకు బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సూచనల మేరకు ఫ్యాన్లను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గవర్ల కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ సుకన్య, నేతలు హరిబాబు, ప్రవీణ్కుమార్, శివప్రసాద్ వర్మ, వెంకటరమణ, మోహన్రాజు, జయరాం, వెంకటేష్ పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల పరిష్కారంపై అవగాహన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, పరిష్కారం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ వర్సిటీలో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల భద్రత కోసం కృషి చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తిరుపతి ఉమెన్ ఇనిషియేటివ్ పర్సన్ మీరా రాఘవేంద్ర, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, ఐసీసీ సభ్యురాలు డాక్టర్ శ్వేత, ఉమెన్ సెల్ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, డాక్టర్ జి నాగలక్ష్మి పాల్గొన్నారు. సీనియర్ సిటిజెన్ని బెదిరించిన సైబర్ నేరగాళ్లు తిరుపతి క్రైం:నగరంలో నివాసం ఉంటున్న ఓ సీనియర్ సిటిజెన్ను సైబర్ నేరగాళ్లు బెదిరించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ యూని వర్సిటీ పోలీసుల కథనం మేరకు.. నగరంలో నివాసం ఉంటున్న 66 సంవత్సరాల వృద్ధుడికి సీబీఐ అధికారులంటూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. మీరు మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీపై బెంగళూరులో కేసు నమోదైందని తెలిపాడు. అనంతరం వీడియో కాల్ చేసి, ఇంట్లో ఎవరికీ తెలపొద్దని గదిలో కెళ్లి మాట్లాడాలని సూచించాడు. ఆ వృద్ధుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అతని అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నింటిని తెలుసుకున్నారు. వెంటనే ఆ వృద్ధుడు ఆర్టీజీఎస్ ద్వారా రూ.40 లక్షలను వీరికి పంపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆర్టీజీఎస్ పంపించేందుకు ఇస్కాన్ బ్రాంచ్లోని ఎస్బీఐ సిబ్బందిని సంప్రదించాడు. వారు ఎందుకు పంపించాలని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తెలిపారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనేనని, దీనిపై మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు సంప్రదించాలన్నారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తతతో సైబర్ మోసం తప్పింది. బ్యాంకు సిబ్బందిని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు స్టేషన్ కు పిలిపించి వారిని ఘనంగా సత్కరించారు. -
రాష్ట్ర గవర్నర్ కు సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన గవర్నర్ అబ్దుల్ నజీర్కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రవికుమార్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గాలి శ్రీనివాసులు తిరుపతి లీగల్: తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయ వాది గాలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం బు ధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు న్యాయవా ది గాలి శ్రీనివాసులు తెలిపారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. ఆయన తిరుపతిలో 25 ఏళ్ల పైగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ న్యాయవాది దొరైరాజ్ వద్ద ఆయన జూనియర్ న్యాయవాదిగా విధులు ప్రా రంభించాడు. ఆయన నియామకంపై రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు జి.సుదర్శన్ రావు, న్యాయవాదు లు దేశిరెడ్డి భాస్కర్ రెడ్డి, దేవరాజులు, తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రాపూరు: మల్లమ్మగుంట సమీపంలోని కొండేరువాగు వద్ద బుధవారం మృతదే హం ఉన్నట్లు స్థానికులు పో లీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకటేశ్వరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. ఏఎస్ఐ కథనం మేరకు.. గూడూరు మండలం తిరుపతిగారిపల్లి గ్రామానికి చెందిన సుందరయ్య(79) ఈనెల 14వ తేదీ ఇంటి సమస్యలతో ఇల్లు వదిలి వెళ్లాడు. మల్లమ్మగుంట వద్ద ఉన్న వాగు సమీపంలో మృతి చెందాడు. మృతదేహం పక్కన పురుగుల మందు ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్న ట్లు తెలిపారు. మృతిని ఫొటోను చూసి, వారి బంధువులు ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమం
తిరుపతి కల్చరల్: సర్వేల పేరుతో పా టు కుంటి సాకులు చూపి, దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తథ్యమని దివ్యాంగుల సేవా సంఘం జేఏసీ రాష్ట్ర నేత కొణతం చంద్రశేఖర్, దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మురళీ గౌడ్ స్పష్టం చేశారు. దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గిరిజన భవన్లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ గౌడ్, మురళీతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, సీపీఎం నేత నాగరాజు, రాస్ సంస్థ అధికారి యువరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేసినప్పుడే నిజమైన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ నోటీసులు అందజేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపై నిరసనలు చేయడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. పింఛన్ల జోలికొస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సేవా సంఘం నిర్వాహకులు ఆశాజ్యోతి, దివ్యాంగుల పేద ప్రజల సేవా సంస్థ, హరిత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సోమశేఖర్, శివకుమారి, హరినాథరెడ్డి, వసంత్కుమార్, రాజేష్, మాధవన్ పాల్గొన్నారు. -
అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ అభివృద్ధి
తిరుపతి తుడా: దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం స్విమ్స్ ఆస్పత్రిలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు గదులను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తులలో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అలాగే రూ.4.40 కోట్ల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలుగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ పాల్గొన్నారు క్రెడిట్ చోర్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరిధిలోని ఆస్పత్రులను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించింది. స్విమ్స్ లో రూ.10.65 కోట్లతో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగి సహాయకుల విశ్రాంతి భవనం రూ. 4.40 కోట్లతో పనులను ప్రారంభించింది. 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. ఏడాదిన్నర కాలంలో 10 శాతం పనులు పూర్తి చేసి రంగులు వేసి, తామే అభివృద్ధి చేశామనేలా కలరింగ్ ఇస్తూ ఈ భవనాలను ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ప్రభు త్వం చేసిందంటూ క్రెడిట్ చోర్కి పాల్పడ్డారు. -
ఏడాదిన్నరగా తిరుగుతున్నా
చంద్రగిరి: నేను చంద్రగిరి కొత్తపేటలో నివాసం ఉంటున్నాను. వృద్ధాప్యంతోపాటు గతంలో జరిగిన ప్రమాదంలో నడుము వెన్నుపూసతోపాటు ఎడమకాలు విరిగిపోయింది. దీంతో అప్పట్లో రాడ్లు పెట్టి శస్త్రచికిత్స చేశాడు. ఏడాదిన్నర క్రితం రాడ్లు విరిగిపోవడంతో పరిస్థితి తీవ్రతరం అయ్యింది. ప్రస్తుతం నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే వికలాంగుడి సర్టిఫికెట్ కోసం ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా నాకు సరిఫికెట్ రాలేదు. – రాఘవరెడ్డి, కొత్తపేట, చంద్రగిరి -
కండలేరు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ!
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయాన్ని బుధవారం నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. కండలేరు జలాశయంలోని ప్రస్తుత మున్న నీటి నిల్వలు, నీటి విడుదల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో 60 టీఎంసీ నీరు నిల్వ ఉండడంతో ఎటువంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందన్న అంశంపై ఇంజినీరింగ్ బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయంలోని హైలెవల్, లోలెవల్ స్లూయీస్ను, హెడ్రెగ్యులేటర్ను బృందం పరిశీలించింది. హెడ్రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు చాలా కాలంగా ప్రజర్ ఇస్తేనే గేట్లు పైకి లేస్తున్నట్లు సిబ్బంది తెలిపినట్లు నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం గేట్లు పరిస్థితిని పరిశీలించామని, నీరు ఎక్కువగా వస్తుండడంతో గేట్లు పరిస్థితి తెలియడంలేదని, నీరు తగ్గిన తరువాత మరోసారి పరిశీలించి గేట్లు ఎందుకు స్ట్రక్ అవుతున్నాయన్న విషయం తెలుసుకుంటామని అప్పుడు గేట్లు మార్చాలా? లేదా ఏదైనా మరమ్మతులు చేపట్టాలా, లేదా కొత్త గేట్లు పెట్టాలని చెప్పగలమన్నారు. ఈ నిపుణుల కమిటీ బృందంలో తిరుపతి క్యాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శారద, నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు సుబ్రమణేశ్వరావు, ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ నాగేంద్రబాబు, ఏఈ అనిల్ ఉన్నారు. -
ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో నాలుగో రోజు బుధ వారం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్కంఠగా సాగా యి. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా ఐఐటీ రూర్కీ నిలిచింది. దీంతో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. కాగా చెస్, టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్గా ఐఐటీ రూర్కి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 60 కిలోల విభాగంలో మౌన్సోలిన్ నౌలక్ 189 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మొత్తం ఐదుగురు ఐఐటీ రూర్కీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అలాగే 65 కిలోల విభా గంలో ఆరుగురు, 71 కిలోల విభాగంలో ఐదుగురు, 79 కిలోల విభాగంలో ఒక్కరు, 79 ప్లస్ కిలోల విభాగంలో ఐదుగురు మొత్తం 22 మంది ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఐటీ రోపర్ 9 మందితో రెండోస్థానం, ఐఐటీ కాన్పూర్ 8మందితో మూడో స్థానంలో నిలిచాయి. వారణాసి, బాంబే ఐఐటీల నుంచి ఐదుగురు చొప్పున, గౌహతి, ఖరగ్పూర్ ఐఐటీల నుంచి ఇద్దరు చొప్పున, మద్రాస్, గాంధీనగర్ ఐఐటీలు ఒక్కరు చొప్పున వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభను చూపారు. అలాగే 65కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి అభిషేక్కుమార్, 79 కిలోల విభాగంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థి దృవ్శెట్టి, 71 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి దాస్ అ నుప్కుమార్, 60 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి మౌన్సోలిన్ నౌలక్ మొదటిస్థానాల్లో నిలిచారు. చెస్లో ఐఐటీ ఖరగ్పూర్ మొదటి స్థానం చెస్ పోటీల్లో ఐఐటీ ఖరగ్పూర్ అద్భుతంగా ఆడి, 9.5 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలి చింది. ఐఐటీ కాన్పూర్ 9 పాయింట్లతో, ఐఐటీ బాంబే, వారణాసి 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో చే రువలోనే నువ్వానేనా? అంటూ పోటీ పడుతున్నా యి. 7.5 పాయింట్లతో మద్రాస్, ఇండోర్, గౌహతి కూడా పోటీలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మ ద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. -
గవర్నర్కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల ప ర్యటనలో భాగంగా మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి పయనమయ్యారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 70,251 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,862 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ. 4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వా మివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. 18న మెగా జాబ్మేళా తిరుపతి తుడా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో తిరుపతిలోని కచపి ఆడిటోరియం వేదికగా ఈనెల 18వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు మెప్మా డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 18 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హా జరవుతారని, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీతో పాటు పలు పార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. జనవరి 10, 11తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ తిరుపతి అర్బన్: కొత్త ఏడాది జనవరి 10, 11తేదీల్లో సూళ్లూరుపేట పరిధిలోని పులికాట్ సరస్సుతోపాటు సమీప ప్రాంతాల వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సెల్వం, ప ర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్తో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫ్లె మింగో ఫెస్టివల్కు ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు. పులికాట్–నేలపట్టు, బీవీ పాళెం, అటకానితిప్ప, ఇరక్కంఐలాండ్, ఉబ్బలమడుగు, పెరియపాళెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చే యడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయాలన్నారు. వీటికి సంబంధించి పోస్టర్, లోగో, పబ్లిసిటీ, బ్యానర్లు, డిజిటల్ బోర్డు ద్వారా ప్రచారం చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి ఎం.జనార్దన్రెడ్డి, ఏపీ టీడీసీ ఈఈ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
చంద్రగిరి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ హెచ్చరించారు. మండలంలోని తొండవాడలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన ఘటనలో నిందుతుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పిచ్చినాయుడుపల్లి దళితవాడకు చెందిన రేణిగుంట గౌతం(పెప్సీ) అనే యువకుడు ఆదివారం రాత్రి తొండవాడలోని సంధ్య, ఆమె భర్త మహేంద్రరెడ్డిపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిని మందలించి పంపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సంధ్య ఇంటి ఆవరణలో ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గౌతంను విచారించగా, ద్విచక్ర వాహనాలను తగలబెట్టినట్లు అంగీకరించారని చెప్పారు. గౌతంపై ఇప్పటికే చంద్రగిరి, తిరుపతి రూరల్, గూడూరు పోలీసు స్టేషన్లలో చోరీలు, గొడవలకు సబంధించి కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణాచలం, సిబ్బంది నాగమణి, మణి, వినాయక, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
పెళ్లకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, ఒక్కమాట కూడా నిజం ఉండదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.21లక్షల వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామంటూ బహిరంగ వేదికల్లో భీకరాలు పలకడం అమానుషమన్నారు. తెచ్చిన పెట్టుబడులను ఎక్కడ పెట్టారు, ఏమి చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసం ఉందన్నారు. పచ్చరోత పత్రికల్లో లేని జీడీపీని చూపించి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కేంద్రం నుంచి వచ్చే రూ.10 వేల కోట్ల నిధులు రాకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రోజుకు రూ.475 కోట్లు చొప్పున 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లు అప్పు తెచ్చిన హీనచరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో మంజూరైన 17మెడికల్ కాలేజ్లను పూర్తి చేస్తే జగన్మోహన్రెడ్డిని పేరు వస్తుందనే నెపంతో పీపీపీ విధానం అంటూ రూ.100కు బినామీలకు దోచి పెడుతున్నాడని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్లను అమ్మి ముడుపులను కరకట్టకు పంపడమేనా? అని ఎద్దెవా చేశారు. ఆయన వెంట నాయకులు వెంకటాచలం, శంకరయ్య, బత్తెయ్య, సునీల్ ఉన్నారు. -
రూ.కోట్లు వృథా..అంతా వ్యధ
తొట్టంబేడు: కార్యాలయాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలవద్దకే పాలన తెచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. ఇందులో భాగంగానే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయా పంచాయతీల పరిధిలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల నాటికి ఇందులో చాలా వరకు భవనాలు పూర్తి కాగా.. ఆ తర్వాత కొన్ని చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇలాంటిదే తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. రూ.కోటి వ్యయంతో మేజర్ పంచాయతీలైన తంగేళ్లపాళెం, సాంబయ్యపాళెం పంచాయతీల పరిధిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. దాదాపు భవనాలు పూర్తయ్యాయి. రూ.15 లక్షలు వెచ్చిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవస్థలే..అవస్థలు తొట్టంబేడు పంచాయతీ తంగేళ్లపాళెంలో 2,500 మంది, సాంబయ్యపాళెం పంచాయతీలో 1800 మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో చాలా మంది రైతులే. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఎరువులు, విత్తనాలతోపాటు ఆరోగ్య అవసరాల నిమిత్తం సుమారు పది కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తికి వెళ్లాల్సి వస్తోంది. వీరి అవసరార్థం గత ప్రభుత్వంలో రూ.కోటి వెచ్చించి రైతు భరోసా, విలేజ్ హెల్త్క్లినిక్, సచివాలయం ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు పూర్తికావచ్చాయి. ఫ్లోరింగ్ వేస్తే సరిపోతుంది. వీటికి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. కానీ వీటిని అందుబాటులోకి తెస్తే గత ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందేమోనని కూటమి నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అత్యవసరమైనా.. ఎరువులు అవసరమైనా శ్రీకాళహస్తికి పోవాల్సి వస్తుంది. ఈ భవనాలు అందుబాటులో ఉంటే తమకు ఏ దిగులూ ఉండదని స్థానికులు చెబుతున్నారు. -
వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం
శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం మనోన్మణి(గొబ్బెమ్మ)కు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ యోగా పోటీల్లో బీవీబీ విద్యార్థి ప్రతిభ తిరుపతి సిటీ: మహారాష్ట్ర వేదికగా ఈనెల 30వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు భారతీయ విద్యాభవన్ విద్యార్థి టి సుయశ్వంత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థి జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని డైరెక్టర్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ పద్మజ కొనియాడారు. రాస్ కృషి విజ్ఞాన కేంరద్రం సందర్శన రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం హైదరాబాద్కు చెందిన ఐసీఏఆర్–అటారీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ ప్రసాద్ సందర్శించారు. ముందుగా ఆయన కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశమై దత్తత గ్రామాల్లో రాస్ చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతి, 2025–2026 సంవత్సరానికి నిర్దేశించిన కార్యక్రమాల ప్రణాళిక అమలు గురించి చర్చించారు. కేవీకే శాస్త్రవేత్తల పనితీరు, కార్యక్రమాల ప్రగతిని ప్రశంసించారు. రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచే సాంకేతికతలో భాగంగా సమగ్ర సస్యరక్షణ, జీవన ఎరువుల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం, ప్రకృతి వ్యవసాయ విధానం, ప్రకృతి వ్యవసాయంలో వాడే కషాయాలు, ఘన, ద్రవ జీవామతం వంటి ముడి పదార్థాల తయారీపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.శ్రీనివాసులు, కె.వి.కె శాస్త్రవేత్తలు సుధాకర్, దివ్య, రాము కుమార్, అనూష, దివ్య సుధ, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృ వర్సిటీలో రెండు రోజులగా జరిగిన రాష్ట్రస్థాయి సంస్కృత వక్తృత్వ, సాహిత్య పోటీలు మంగళవారంతో ముగిశాయి. వాగ్వర్థిని పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సంస్కృత పోటీల్లో భాగంగా 36 విభాగాల్లో పోటీలను నిర్వహించామన్నారు. ఇందులో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, డీన్ రజినీకాంత్ శుక్లా, వాగ్వర్థిని కోఆర్డినేటర్లు డాక్టర్ భరత్ భూషణ్ రథ్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయన హెగ్డే పాల్గొన్నారు. -
ఆపి ఉన్న కారులో మంటలు
నాయుడుపేటటౌన్: ఆగి ఉన్న కారులో ఒకసారిగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన మండలంలోని నరసారెడ్డికండ్రిగ రహ దారి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని అరవపెరిమిడి గ్రామానికి చెందిన పాలెల హరిబాబు తన కారులో సొంతపని నిమిత్తం నరసారెడ్డి కండ్రిగ రహదారి వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కగా ఆపి, వెళ్లాడు. కొద్ది సేపటికే కారులో మంటలు వస్తుండాన్ని స్థానికులు గుర్తించారు. హరిబాబు కూడ అక్కడ చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరు కుని కారు లోంచి వస్తున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాల వరకు దగ్ధమైంది. కారు బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. ఘాట్ రోడ్డులో వ్యక్తి ఆత్మహత్య తిరుమల: భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన సుమన్(39) కొంతకాలంగా తిరుపతిలోని గాజుల వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను సెలూన్ లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతడు దీపిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్య దీపికతో గొడవలు పడుతున్నట్లు తిరుపతిలోని వారి ఇంటి యజమాని భువనేశ్వరి సమాచారం మేరకు తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడు ఫోన్ పరిశీలించగా ఈ నెల 10వ తేదీన ఆఖరి ఫోన్ వెళ్లినట్లుగా గుర్తించామన్నారు. అయితే ఆ రోజే మృతుడి తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని తొమ్మిదో మలుపు వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనను మంగళవారం 9 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరగా వాహనాన్ని పక్కకు పెడుతున్న సమయంలో ఆటో మెకానిక్ మనోహర్ రెడ్డి గుర్తించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పోక్సో కేసులో రాపిడో డ్రైవర్ అరెస్టు తిరుపతి క్రైమ్: నగరంలో ఈనెల 3వ తేదీన బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాపిడో ఆటో డ్రైవర్ను మంగళవారం అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీన నగరంలోని ఓ హాస్టల్లో చదువుతున్న బాలిక మరో హాస్టల్లో మారేందుకు, సామాన్లు తీసుకుని వెళ్లేందుకు రాపిడోను బుక్ చేసుకుంది. ఆ బాలికను భయపెట్టి, బెదిరించి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సత్యసాయి జిల్లాకు చెందిన సాయి కుమార్గా గుర్తించి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఎస్వీయూ హెల్త్సెంటర్కు ఈసీజీ యంత్రం వితరణ తిరుపతి సిటీ: ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు వర్సిటీలోని ఆరోగ్య కేంద్రానికి తన వ్యక్తిగత నిధులతో ఈసీజీ యంత్రాన్ని బహుకరించారు. ఈ మేరకు తన చాంబర్లో మంగళవారం రూ. 27వేలు విలువ గల పోర్టబుల్ ఈసీజీ యంత్రాన్ని ల్యాబ్ టెక్నీషియన్ ముత్తువేలుకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు, సిబ్బంది, క్యాంపస్ నివాసితులకు సకాలంలో పరీక్షలు చేయడానికి యూనివర్సిటీ హెల్త్ సెంటర్ సౌకర్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తనవంతు సహాయ సహకారం అందించామన్నారు. మద్యం దుకాణంలో చోరీ తిరుపతి క్రైమ్: నగరంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని ఎస్వీఎస్ వైన్షాప్లో గుర్తుతెలియని దుండగులు ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి అనంతరం వైన్షాప్ గోడ పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న కౌంటర్లో 2.45 లక్షలు దోచుకెళ్లినట్లుగా షాపు సిబ్బంది మని ప్రసాద్ తెలిపారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
కోట ఎంపీపీ అంజమ్మ మృతి
కోట: స్థానిక ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకురాలు దాసరి అంజమ్మ(60) మంగళవారం మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమె పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డికి ముఖ్య అనుచరులుగా గుర్తింపు పొందారు. ఊనుగుంటపాళెం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆమె అనంతరం కోట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఊనుగుంటపాళెంలో ఆమె మృతదేహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డి, సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్ రెడ్డి, తహసీల్దార్ జయజయరావు, ఎంపీడీఓ దిలీప్కుమార్లు నివాళులర్పించారు. జనసందోహం మధ్య ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. -
ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో మూడో రోజు మంగళవారం చెస్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ క్రీడా సంబరం డిసెంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. క్రీడల పోటీలలో నువ్వా..నేనా..? చెస్ పోటీలో ఐఐటీ కాన్పూర్ అద్భుతంగా ఆడి, 8 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ ఖరగ్పూర్ 7.5 పాయింట్లతో కాన్పూర్కు దగ్గరగా ఉంది. ఐఐటీ బీహెచ్యూ వారణాసి, ఐఐటీ హైదరాబాద్ చెరో 6 పాయింట్లతో మూడో స్థానంలో సమానంగా ఉన్నాయి. టెన్సిస్లోనూ వివిధ జట్లు నాక్అవుట్కు చేరుకోవటానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రూర్కీ , కాన్పూర్, బీహెచ్యూ వారణాసి జట్లు లీగ్ మ్యాచ్ల్లో సత్తా చాటి ముందంజలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది.


