Tirupati District News
-
వర్షాలతో అప్రమత్తం
తిరుపతి అర్బన్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందస్తుగా వచ్చిన నేపథ్యంలో వర్షాల విషయంలో అధికారులు అప్రత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎన్ఓపీ) ప్రకారం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డీపీఓ సుశీలాదేవి, ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ తదితరులు పాల్గొన్నారు. బదిలీల టెన్షన్ తిరుపతి అర్బన్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల అంశం హాట్ టాపిక్గా మారింది. బదిలీల ప్రక్రియ పూర్తి చేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యేల లెటర్లతో విజయవాడకు క్యూకడుతున్నట్లు చర్చసాగుతోంది. బదిలీల నేపథ్యంలో వారం రోజులుగా పలు విభాగాల్లో పాలన కూడా స్తంభించింది. వచ్చే సోమవారం సాయంత్రానికి బదిలీల జాబితా విడుదలవుతుందని ఉద్యోగులు అంటున్నారు. ఏ స్థానంలో ఎవరు ఉంటారో ఏ స్థానం నుంచి ఎవరు బదిలీ అవుతారో తెలియడం లేదు. ఇదిలావుండగా కలెక్టరేట్లోని ఓ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్న మహిళా అధికారి తిరుపతి అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె గతంలో చంద్రగిరి తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన ఓ అధికారి కూడా తిరుపతికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కండలేరు ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు డివిజన్ 2లో ఈఈగా పనిచేస్తూ కండలేరుకు ఇన్చార్జి ఈఈగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఈ విజయకుమార్రెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ చిత్తూరు జిల్లా గాలేరు–నగిరి సుజల స్రవంతికి బదిలీ చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 69,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలగుతున్నారు. -
బాబు పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు విద్యను అమ్మేసేందుకు సిద్ధమైంది. 2024 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సుమారు లక్ష మంది విద్యార్థులకు రూ.235 కోట్ల మేర ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మొండిచెయ్యి చూపుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు మధ్యలోనే విద్యనాపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అమ్మఒడి, వసతి దీవెన, విదేశీ విద్య పథకాలకు మంగళం పాడేసింది. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు నగదు అందిస్తామని చెప్పి ఇంతవరకు పైసా అందించకుండా వేధిస్తోంది. జిల్లాలోని 5.65 లక్షల మంది విద్యార్థులకు 2024 విద్యాసంవత్సరంలో రూ.847,50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా నిర్మించ తలపెట్టిన సుమారు 47పాఠశాలల భవనాలను పూర్తి చేయకుండా మొండికేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా మార్చేసింది. పౌష్టికాహారానికి మంగళం పాడేసి నాసిరకం ఆహారాన్ని అందిస్తోంది. సీబీఎస్ఈ సిలబస్ను నిర్వీర్యయం చేసే ప్రయత్నం చేస్తూ, ఐబీ సిలబస్ను ఎత్తివేసే కుట్రకు తెరలేపింది. -
పోలీసుల తీరుపై ఆర్డీఓ అసహనం
కలువాయి(సైదాపురం): కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో రెవెన్యూ సమస్యలపై వినతిపత్రాలు అందించేందుకు అర్జీదారులు పోటెత్తారు. అయితే అర్జీదారులను నియంత్రించడానికి ఒక్క పోలీసు మాత్రమే వచ్చారు. ఆయన అర్జీదారులను కట్టడి చేయలేకపోవడంతో ఆర్డీఓ పావని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు లెటర్ పెట్టాం కదా ?’ అని పోలీసులను అడగ్గా.. సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానం చెప్పారు. అయితే కొందరు అర్జీదారుల మధ్య పొలం, దారి సమస్యలపై గొడవలు జరగడం.. వారిని పోలీసులు నిలువరించలేకపోవడంతో ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు అవగాహన కల్పించండి తిరుపతి అర్బన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా గిరిజనుల సాధికారత, ఆర్థిక, సామాజికాభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. -
డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత ప్రచారం
తిరుపతి అర్బన్: అవగాహనతోనే డ్రగ్స్ను నిర్మూలించొచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలపై ఎస్పీ హర్షవర్ధన్రాజు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలను యువతకు వివరించాలని సూచించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్లు, డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల్లోగా డీ అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి, వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్పై సరైన ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం మాదక ద్రావ్యాల నిషేధంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డీఈవో కేవీఎన్ కుమార్, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, ఆర్టీవో మురళీమోహన్, ఆర్టీసీ ఏటీఎం డీఆర్ నాయుడు, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాసుదేవచౌదరి, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, డ్రగ్స్ అధికారులు పాల్గొన్నారు -
జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యకు అందలం
పేదరికం చదువులకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. జిల్లాలో ప్రతి ఏటా 2.57లక్షల మందికి అమ్మఒడి ద్వారా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏడాదికి రూ.14వేలు చొప్పున నగదు జమచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుని సుమారు 1.13 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఐబీ (ఇంటర్నేషనల్ బేసిక్ కరికులమ్) సిలబస్తో అంతర్జాతీయ స్థాయి విద్యనందించారు. ప్రపంచంతో పోటీ పడేలా సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నాడు–నేడు పథకం ద్వారా జిల్లాలోని 1,021 ప్రభుత్వ పాఠశాలలను రూ.574కోట్లతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ప్రతి ఏడాదీ పది, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఘనంగా సత్కరించి ప్రోత్సాహకాలను అందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విదేశీ పర్యటన పేరుతో అమెరికా వైట్హౌజ్, ఐక్యరాజ్య సమతి సభలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు. పేద విద్యార్థులు ఇంటర్తోనే చదువు ఆపేయకుండా డిగ్రీ వైపు ప్రొత్సహించి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో యూజీ చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికీ విద్యాదీవెన పేరుతో ప్రతి ఏడాదీ ఫీజురీయింబర్స్మెంట్ అందించారు. గతంలో చంద్రబాబు సర్కార్ బకాయిలు పెట్టిన సుమారు రూ.245 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ను సైతం 2019లో అధికారం చేపట్టిన మూడు నెలలకే చెల్లించారు. దీంతో పాటు అర్హులైన ప్రతి యూజీ విద్యార్థికి వసతి దీవెన కింద రూ.648కోట్ల మేర అందించారు. విద్యారుణాలు జిల్లాలో 1,870 మందికి రూ.56 కోట్లకుపైగా అందించారు. విదేశీ విద్యను ప్రొత్సహించారు. ఇందు కోసం రూ.252.27 కోట్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్దు పేరుతో రుచికరమైన పోషకాహారం అందిస్తూ విద్యార్థులను ఆకట్టుకున్నారు. -
చిరుతల సంచారంపై మరోసారి అధ్యయనం
● గతంలో తీసుకున్న నిర్ణయాలే ఆధారం ● తిరుమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్న సైంటిస్ట్ రమేష్ తిరుమల: చిరుతల సంచారంపై టీటీడీ మరోసారి అధ్యయనం చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత టీటీడీ అధికారులు తిరిగి అమలు చేయనున్నారు. గతంలో ఘాట్ రోడ్లో, నడక మార్గంలో వన్యమృగాలను కట్టడి చేసేందుకు అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సైంటిస్ట్ రమేష్ కమిటీని పిలిపించి అధ్యయనం చేయించారు. ప్రభుత్వం మారడంతో ఆ కమిటీ అధ్యయనం మూలన పడింది. అయితే తిరిగి చిరుతల సంచారం పెరగడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించనుంది. ఎట్టకేలకు నిద్ర లేచింది నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ అటవీశాఖ దృష్టి సారించింది. డెహ్రడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ సూచనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కాకపోతే ఇది కూడా తమ హయాంలోనే జరిగిందని కలరింగ్ ఇచ్చుకోవడానికి రమేష్ను మరోసారి వర్క్షాప్ నిర్వహించి నివేదికను టీటీడీకి అందజేసేందుకు పథకం వేసింది. గతంలోనే పకడ్బందీ చర్యలు అలిపిరి నడక మార్గంలో 2023 జూన్ 24న ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయగా అదే ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన నరసింహస్వామి ఆలయం వద్ద ఆరేళ్ల బాలికపై దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై దృష్టి సారించిన అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకరరెడ్డి సూచనలతో అటవీశాఖ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించకుండా నిలిపివేయడం, సాయంత్రం ఆరు నుంచి ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతా సిబ్బంది గస్తీ మధ్య భక్తులను గుంపులుగా అనుమతించడం వంటి చర్యలు చేపట్టారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో 250 ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆరు చిరుతలను గుర్తించారు. వన్యప్రాణుల సంచారం పై నిఘా ఉంచడానికి ఏడో మైలు వద్ద అటవీశాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. అటువైపు ఉన్న జింకలను ఇతర ప్రాంతాలకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. నడకదారి భక్తులకు మనోధైర్యం కల్పించేందుకు ఊతకర్రలను అందించారు. డెహ్రాడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ రమేష్ నేతృత్వంలో చిరుతల సంచారానికి గల కారణాలపై చర్చించారు. వారి నివేదిక సమర్పించే సమయానికి ప్రభుత్వం మారింది. మరోవైపు అప్పటి అధికారులు తీసుకున్న చర్యలతో చిరుతల సంచారం కూడా తగ్గి పోవడంతో సైంటిస్ట్ నివేదికను టీటీడీ లైట్ తీసుకుంది. మళ్లీ కలకలం ఈనెల 25వ తేదీన అలిపిరి నడక మార్గంలో 350 మెట్టు వద్ద చిరుత సంచరించడం, అనంతరం మరుటి రోజు మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద వాహనదారులకు సమీపం నుంచి చిరుత వెళ్లడంతో టీటీడీ ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో చిరుత సంచారం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించింది. గతంలో సైంటిస్ట్ రమేష్ ఇచ్చిన నివేదికను మరోసారి టీటీడీకి అందజేయించేందుకు ఆయనతో వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఆయన తిరుమలకు చేరుకుని జూన్ 1, 2 తేదీలలో వర్క్షాప్ నిర్వహించి టీటీడీకి నివేదికను సమర్పించేలా అధికారులు ప్లాన్ చేశారు. భద్రతా ఏర్పాట్లను తిరిగి పునఃప్రారంభించేలా టీటీడీ చర్యలు తీసుకుంది. -
చైన్నెలో వలస కార్మికుడి మృతి
రేణిగుంట: పొట్టకూటి కోసం చైన్నెకి వలసవెళ్లి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న సమయంలో పిట్స్ రావడంతో తోటి కార్మికులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. గతంలో రేణిగుంటలో పనిచేసినట్లు తెలపడంతో గత వారం రోజులుగా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో సహచర కూలీలు మృతుడి ఫొటో పట్టుకొని వెతుకుతున్నారు. రేణిగుంటలో శుక్రవారం మేస్త్రి నారయ్య మాట్లాడుతూ తనతోపాటు కొంతమంది కార్మికులను చైన్నెకి పనికి తీసుకొని వెళ్లే వాడినన్నారు. ఆ క్రమంలో రేణిగుంటలో యేసు అనే కార్మికుడు 20 రోజుల క్రితం పని కోసం తమతోపాటు చైన్నెకి వచ్చాడని, పది రోజులు పనిచేసి కూలీ డబ్బులు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అతనికి పిట్స్ వచ్చాయని తెలిపారు. సమీపంలోని ప్రభుత్వ కేఎంసీ హాస్పిటల్కు తరలించకగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు వస్తేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ వారు తెలిపారని, ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే 9550349981, 7989245532 నంబర్లలో సంప్రదించాలని మేస్త్రీ కోరుతున్నారు. -
సేవాసదన్ సమీపంలో పాము
తిరుమల : తిరుమల సేవాసదన్ సమీపంలోని పార్కులో శుక్రవారం 7 అడుగుల జెర్రిపోతు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అభివృద్ధిపై టీటీడీ ఈఓ సమీక్ష తిరుమల : తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం, సీఆర్ఓ కార్యాలయం వద్ద అభివద్ధి పనులపై టీటీడీ ఈఓ జె.శ్యామలరావు శుక్రవారం అన్నమయ్య భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను వివరించారు. ఈఓ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల మేరకు అభివృద్ధి చేయాలని సూచించారు. సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులకు ఆధునిక వసతులు కల్పించాలని కోరారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీఈ సత్యనారాయణ, డిజైనింగ్ నిపుణుడు రాముడు పాల్గొన్నారు. బస్సును ఢీకొన్న కారు చంద్రగిరి : తిరుపతి– మదనపల్లె జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శుక్రవారం బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, డ్రైవర్ సుదర్శన్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును క్రేన్ సాయంతో తొలగించారు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతి ఎంపీ ‘వెలుగులు’
● 22 గ్రామ పంచాయతీలకు రూ.21.20 లక్షలతో వీధిలైట్లు వరదయ్యపాళెం: మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తన నిధుల ద్వారా వీధిలైట్ల పంపిణీకి చొరవ చూపారు. ఆ మేరకు మండలంలోని 22 పంచాయతీలకు సంబంధించి రాచర్ల, కంచరపాళెం, అరుదూరు, యానాదివెట్టు, కడూరు, తొండంబట్టు, పులివల్లం, మత్తేరిమిట్ట, వరదయ్యపాళెం, కాంబాకం, కురింజల్లం, ముస్లింపాళెం, ఇందిరానగర్, సీఎల్ఎన్పల్లి, కళత్తూరు, అంబూరు, సంతవేలూరు, నెల్లటూరు, గూడలవారిపాళెం, అయ్యవారిపాళెం, మావిళ్లపాడు, వరదయ్యపాళెం గ్రామ పంచాయతీలకు రూ. 21.2 లక్షలతో వీధిలైట్లను పంపిణీ చేశారు. ఆ మేరకు శుక్రవారం వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నాయుడుదయాకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, రాష్ట్ర చేనేత కార్మిక విభాగం సభ్యులు బొప్పన తిలక్బాబు చేతుల మీదుగా కాంట్రాక్టర్ రమణయ్య సర్పంచులకు వీధిలైట్లను అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో విద్యుత్ దీపాల పంపిణీకి చొరవ చూపిన ఎంపీ గురుమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ దుడ్డు వేణు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ వినోద్యాదవ్, మండల సేవాదళ్ కన్వీనర్ నానిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సునీల్, నాయకులు రమేష్, మురళీరెడ్డి, రిపువర్థన్ పాల్గొన్నారు. భర్తపై కేసు కేవీబీపురం: భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కాళంగి పంచాయతీ హనుమయ్య కండ్రిగ గ్రామానికి చెందిన ఎం.సుబ్రమణ్యం, స్వాతి భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుబ్రమణ్యం తాగుడుకు బానిసై కొంతకాలంగా భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈనెల 28వ తేదీన తాగి వచ్చి భార్య స్వాతిని తీవ్రంగా కొట్టి మెడమీద కాలుపెట్టి తొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెను హుటహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి శుక్రవారం ఫిర్యాదు చేయడంతో భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
● గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతున్న వితంతువులు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభత్వుం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లకు మంగళం పాడేసింది. గత ఏడాది జూన్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు జిల్లాలో 2,71,183 మందికి అందించగా.. ఈ ఏడాది జూన్లో 2,60,379 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారు. కూటమి ఏడాది పాలనలో జిల్లాలో 10,804 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే...పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. నేడు, రేపు పింఛన్ల తనిఖీల జాబితా విడుదల కూటమి ఏడాది పాలనలో 10,804 మందికి పింఛన్లు తగ్గించారు. మరోవైపు జిల్లాలో గత ఆరు నెలలుగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు రూ.4 వేలు ఫించన్ తీసుకుంటున్న వారిని జూన్ రెండో వారం నుంచి తనిఖీలు చేయనున్నారు. స్పౌజ్ పింఛన్లకు కొత్త మెలిక స్పౌజ్ కేటగిరిలో వితంతువులకు పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటున్న భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ మేరకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మృతి చెందిన పింఛన్దారుల భార్యలకు 3,940 పింఛన్లు మంజూరు చేశారు. వాటిని వెరిఫికేషన్ చేస్తున్నారు. అందులో 1,500 పింఛన్లు సర్వర్ సమస్యలతో గుర్తించలేకపోతున్నామని చెబుతున్నారు. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వితంతువులై పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు 6,500 మందికి పైగా ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడా? జిల్లాలో ప్రస్తుతం జూన్లో 2,60,379 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ ఉసేలేదు. 50 ఏళ్లు పైబడి పింఛన్లకు అర్హులైన వారు జిల్లాలో 70 వేల మందికి పైగానే ఉన్నారు. మరోవైపు 60 ఏళ్లు దాటి పింఛన్లకు అర్హులైన వారు, వితంతువులు, కళాకారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ వ్యాధిగ్రస్తులు మరో 30 వేల మంది వరకు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వితంతు పింఛన్ కోసం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అభాగ్యులు (ఫైల్) ఈ తగ్గించిన ఏడాది పింఛన్లు జనవరి 641 పిభ్రవరి 804 మార్చి 730 ఏప్రిల్ 620 మే 611 జూన్ 851పింఛన్లు తొలగించలేదు ఏడాది కాలంలో పింఛన్లు మేము తొలగించలేదు. అందులో చాలా మంది మృతి చెందారు. పలువురు వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోలేదు. దీంతోనే ఆ పింఛన్లు తగ్గాయి. మే నెలకు సంబంధించి పింఛన్లు 2,60,379 మందికి ఈ నెల 31 నుంచి అందిస్తాం. –టీఎన్ శోభన్బాబు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
భార్యపై కక్ష పెంచుకుని హత్య
నాయుడుపేట టౌన్: భార్యపై కక్షతోనే భర్త రాయితో కొట్టి గొంతు నూలిమి హత్య చేసినట్లు సీఐ బాబి వెల్లడించారు. హత్య కేసులో నిందితుడైన మానికల శ్రీనివాసులును శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిందితుడిని హాజరుపరిచి సీఐ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శ్రీనివాసులు, భార్య వీణమ్మ(28), ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారని తెలిపారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్య అనుమానంతో నిత్యం వేధించేది. దీంతో శ్రీనివాసులు భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీ రాత్రి భార్య, భర్తలిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వీరి మధ్య వివాదం రేగింది. శ్రీనివాసులు ఇదే అదనుగా అక్కడే ఉన్న రాయితో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐతో పాటు ఎస్ఐ ఆదిలక్ష్మి, పోలీసులు అన్ను దయాకర్, పోలయ్య, వెంకీలను డీఎస్పీ చెంచుబాబు అభినందించినట్లు తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
డక్కిలి: మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బోనుబోయిన వెంకటసుబ్బయ్య (55) గురువారం పూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో గడ్డి మందు సేవించాడు. బంధువులు గూడూరులోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శుక్రవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్ఐ శశిశంకర్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్ఎస్యూ డీఈ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ దూర విద్యాకేంద్రం ఆధ్వర్యంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.రంగనాథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సంస్కృతంలో ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సు, ఏడాది వ్యవధి డిప్లొమో, రెండు సంవత్సరాల వ్యవధి పాక్శాస్త్రి కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కోర్సులకు ఆసక్తిగల వారు వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440626562 నంబర్ను సంప్రదించాలని సూచించారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన గాజులపల్లి శంకర్రావు, ధర్మపత్ని శ్రీదేవి రూ.లక్ష విరాళంగా అందించినట్లు ఆలయ ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దాతకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు. టమాట లారీ బోల్తా నాయుడుపేట టౌన్ : పట్టణ పరిఽధిలోని గోమతి సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిపై టమాట లోడ్డుతో వెళుతున్న మీనీ లారీ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి నుంచి నెల్లూరుకు మినీ లారీలో టమాటాలు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని అదిగమించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కగా పొలాల్లోకి వెళ్లి లారీ బోల్తా పడింది. క్షతగాత్రులను శ్రీకాళహస్తికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. దళిత బాలికపై అత్యాచార యత్నం నిందితుడిపై పోక్సో కేసు రేణిగుంట: దళిత బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన కామాంధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు. రేణిగుంట మండలం, కరకంబాడికి చెందిన ప్రసన్నకుమార్(38) అదే ప్రాంతంలో ఓ హోటల్ వద్ద ఉన్న దళిత బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సోతోపాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు
కలువాయి(సైదాపురం): మండలంలోని తెలుగురాయపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పబ్బు వెంకటసుబ్బయ్య పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు వెంకటసుబ్బయ్య ఇంటి వద్ద గాడి తవ్వించారు. బాధితుడు మాట్లాడుతూ తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గాడి తవ్వించి రాకపోకలకు అంతరాయం కలిగించినట్టు తెలిపారు. రెవెన్యూ, ఎంపీడీ అధికారుల సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు గాడి తీయించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వాపోయారు. అందుబాటులోకి హైవే తిరుపతి అర్బన్: నాయుడుపేట–చిత్తూరు హైవే, తిరుపతి–చైన్నె హైవే రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. నాయుడుపేట–చిత్తూరు హైవే మార్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేశారు. మరోవైపు రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● నాయుడుపేట లాడ్జీలో వివాహితులైన ఇద్దరు ఆత్మహత్య నాయుడుపేట టౌన్: వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన గురువారం నాయుడుపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెంది జమ్మల సుబ్రహ్మణ్యం అలియాస్ మణి(38) అదే గ్రామంలో నివాసం ఉంటున్న దేవత శీరిష(35) మధ్య కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. మణికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాదాల కారణంగా భార్య కొన్ని నెలల కిందటే పిల్లలను తీసుకుని రేణిగుంటలోని పుట్టింటికి వెళ్లింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరుకు చెందిన శీరిష కుప్పారెడ్డిపాళెం గ్రామంలోని తాత ఇంట్లో పుట్టి పెరిగి అదే గ్రామంలో నివాసముంటోంది. ఆమెకు వివాహం కాగా.. భర్త ఆమెను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. కొన్ని నెలలుగా మణి, శీరిష మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం సాయంత్రం మణి, శీరిష నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో బసచేశారు. గురువారం ఉదయం లాడ్జీ నిర్వహకులు గదిని ఖాళీ చేయాలని కోరగా.. శిరీష అక్కడి సిబ్బందితో గొడవపడ్డారు. సాయంత్రం వరకు గదిని ఖాళీ చేయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా గదిలో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి లాడ్జీ వద్దకు చేరుకుని తలుపులు పగులగొట్టి గదిలో పరిశీలించగా.. మణి గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడం, శీరిష ఉరేసుకుని ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా వివాదాలు చోటు చేసుకుని శీరిష మణి గొంతు కోసి ఆపై ఆమె చున్నీతో ఉరేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన క్లూస్ టీమ్ క్షణ్ణంగా పరిశీలించింది. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరు కుటుంబాలను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చెత్త కాల్చినందుకు రూ.50 వేల జరిమానా
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారు నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ వ్యర్థాలను రోడ్డు పక్కన వేసి కాల్చడాన్ని కలెక్టరు వెంకటేశ్వర్ గురువారం ఉదయం గమనించారు. ఆ పరిశ్రమ యజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలార్పించి, జరిమానాకు పంచాయతీ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం కింద సెక్షన్లు 84, 94 మేరకు చెత్త కాల్చిన రిలాక్స్ వెల్ మాట్రెసెస్ వారికి రూ.50వేల జరిమానా విఽధిస్తూ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి నోటీసులు జారీ చేశారు. భార్యపై కత్తితో దాడి రేణిగుంట: భార్యపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సూరప్పకశం పంచాయతీ, అల్లికేశం గ్రామానికి చెందిన మల్లికార్జున (61), ముని లక్ష్మి (58) భార్యాభర్తలు. గురువారం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో భార్య మునిలక్ష్మి మెడపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. గాజులమండ్యం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి వస్తువులను శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మునికృష్ణారెడ్డి, ప్రధాన అర్చకుడు ఏపీ శ్రీనివాస దీక్షతులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు తిరుపతి అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో కార్డుల కాలపరిమితిని జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు సంబంధిత మీడియా యాజమాన్యం వారు వారి సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారికి సమర్పించాలని కోరారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. మండల పరిధిలోని బందార్లపల్లి దళితవాడకు చెందిన లోకేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి బందార్లపల్లికి పయనమయ్యాడు. ఈ క్రమంలో పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున లోకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెర్లోపల్లిలో శతాధిక వృద్ధుడి మృతి
● 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన వైనం ● నివాళులర్పించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన విప్పర్ల రెడ్డెప్ప నాయుడు (103) బుధవారం మృతి చెందారు. 1922లో జన్మించిన ఆయన 103 ఏళ్లు జీవనం సాగించారు. అది కూడా సాదాసీదా జీవితం కాదు.. ప్రజా జీవితం గడిపారు. చెర్లోపల్లి పంచాయతీకి 43 ఏళ్లు సర్పంచ్గా సేవలందించిన ఘనత ఆయనది. కొంతకాలం ఆంజినేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా కూడా సేవలందించారు. రెడ్డెప్పనాయుడు మరణవార్త తెలుసుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రెడ్డెప్ప నాయుడు కుమారుడు వాసుదేవనాయుడు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్
కేవీబీపురం: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. గురువారం కేవీబీపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్టీల్ అండ్ సిమెంట్ అధినేత వెంకటరత్నం ఆధ్వర్యంలో తాపీ మేస్త్రిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంటుకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటు తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోట అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందించారు. -
జూన్ 4న వెన్నుపోటు దినం
తిరుపతి మంగళం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికి వచ్చిన అబద్దపు హామీలు గుప్పించి మోసపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినానికి సంబంధించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చంద్రబాబు, పవన్కల్యాణ్ వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందించని ద్రోహిహి చంద్రబాబు అన్నారు. అందుకే జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నామకరణం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. భూమన కరుణాకరరెడ్డి -
మళ్లీ రేషన్ కష్టాలు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ జరిగేది. సాఫీగా సాగుతున్న ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కడుపు కొట్టడమే కాకుండా కార్డుదారులు రేషన్ సరుకుల కోసం అవస్థలు పడేలా చేసింది. – ిపీ.సుబ్రమణ్యం, వెంకటగిరి, ఎండీయూ వాహన ఆపరేటర్ మానసికంగా వేధిస్తున్నారు మా ఆస్తిలో ఉన్న చింత చెట్టు కోసం ఎనిమిది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. చివరికి ఆ చింత చెట్టు నరికేశారు. ఉమ్మడి ఆస్తికి చెందిన సర్వే నం.1276లో భూమిలోని చెట్టును ఎలా నరికేస్తారని నిలదీస్తే అక్రమ కేసుల్లో ఇరికించారు. రికార్డులు తారుమారు చేసి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. – పురుషోత్తంరెడ్డి, మారసానివారిపల్లి, చిన్నగొట్టిగల్లు మండలం అర్హత ఉన్నా పింఛన్ లేదు భర్త మృతి చెంది ఏడాది దాటినా పింఛన్రాలేదు. ఒకవైపు వృద్ధాప్య పింఛను అందుకునే వయ సు వచ్చినప్పటికీ ప్రభు త్వం స్పందించ లేదు. దరఖాస్తు చేసుకునేందుకు కూడా వీలు లేదంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛను లేకపోవడంతో జీవనం దుర్భరంగా ఉంది. – నీలం లక్ష్మమ్మ, రామలింగాపురం, గూడూరు మండలంనా భర్తకు పింఛన్ ఇప్పించండయ్యా నా భర్త పేరు శ్రీనివాసు లు. వయసు మీదపడి నా పింఛన్ ఇవ్వలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. గతంలో వలంటీర్లే అన్నీ చూసేవారు. మా వీధిలోకి వచ్చి అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించారు. ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ అవస్థలే. – శ్యామలమ్మ, తిరుపతి గ్రామ స్థాయిలో వైద్యం దూరం గత ప్రభుత్వంలో 104 వాహనం ద్వారా గ్రామ స్థాయిలోనే వైద్యమందేది. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి అవసరమైన మందులను అందజేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటన్నింటికీ స్వస్తి పలికింది. –మురళి, వరదయ్యపాళెం మండలం ● -
ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సినీనటి శ్రియ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి, స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు పాల్గొన్నారు. రక్షణ సిబ్బంది అంటే అపార గౌరవం రేణిగుంట: రేణిగుంట మండలం, కుర్రకాల్వ సమీపంలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో డీజీఆర్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ వీడ్కోలు సమావేశంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఆయన డీజీఆర్ శిక్షణార్థులనుద్దేశించి మాట్లాడుతూ మాజీ సైనికుని కొడుకుగా రక్షణ సిబ్బంది పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. అనంతరం ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో ఆయన అన్ని వంటశాలలు, ప్రయోగశాలలను సందర్శించి, క్యాంపస్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. ఇన్స్టిట్యూట్ అకడమిక్ హెడ్ డాక్టర్ ఎం.త్రిలోక్ చందర్ తాము అందించే కోర్సులు, హాస్పిటాలిటీ, టూరిజం పరిశ్రమలో విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ సిబ్బంది డాక్టర్ లోమ్టే దౌలత్రావు, చల్లేశ్వర్ రావు, విష్ణు ప్రియాదేవి, నిర్మల్శర్మ, మధుసూదన రాజు, బాబు పాల్గొన్నారు. పలు కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు తిరుపతి సిటీ: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని పలు కోర్సులకు న్యూఢిల్లీలోని మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్’ సంస్థ గుర్తింపును అందించింది. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలను మే 7, 8, 9 తేదీలలో ఎన్బీఏ బృందం పరిశీలించింది. విశ్వవిద్యాలయం నిర్వహించే సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలను సందర్శించింది. ఈ ఐదు శాఖలకు 2025 నుంచి 2028 వరకు మూడేళ్లు ఎన్బీఏ గుర్తింపు పొందినట్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
కూటమి పాలనలో తప్పని తిప్పలు
ప‘రేషన్’ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 5.9 లక్షల రేషన్ కార్డుదారులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో వారందరికీ ఇంటి వద్దకే రేషన్ అందించే వారు. దీని కోసం 369 మొబైల్ రేషన్ డెలివరీ (ఎండీయూ) వాహనాలను సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. కార్డుదారులు గ్రామాలు విడిచి పక్క గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది. దూరమైన ఆరోగ్య సేవలు కూటమి ప్రభుత్వంలో పల్లె ఆరోగ్యం పడకేసింది. విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యులను తొలగించి నర్సులకు బాధ్యతలు అప్పగించింది. మొబైల్ క్లినిక్ల ఊసే లేకుండా చేసింది. దీంతో దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం మందుల కోసం గ్రామాలను విడిచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వలంటీర్ వ్యవస్థ రద్దు కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటరీ వ్యవస్థకు మంగళం పాడేసింది. వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవడమే కాకుండా వేతనాలు కూడా పెంచుతామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక వారిని అడ్డగోలుగా తొలగించింది. ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులను నింపిన సేవకులను దూరం చేసింది. -
హస్తకళ బొమ్మలు లేపాక్షిలో విక్రయం
● చర్యలు చేపడుతామన్న కలెక్టర్ ● మాధవమాల కొయ్యబొమ్మల తయారీ యూనిట్ పరిశీలనఏర్పేడు: కొయ్య బొమ్మల తయారీ కళాకారులు సమిష్టిగా ఉండి మాధవమాలను ఒక బ్రాండ్గా తయారు చేయాలని, అందుకు హస్తకళ, కలంకారి కళాకారులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ప్రో త్సాహం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఏర్పేడు మండ లం, మాధవమాలలోని కొయ్యబొమ్మల తయా రీ బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ సొసైటీ యూనిట్ను ఆయన గురువారం సందర్శించారు. కలంకారీ వస్త్రాల తయారీ యూనిట్ను ఆయన పరిశీలించారు. టూల్ కిట్స్ అందజేస్తాం ప్రస్తుతం చేతి వృత్తి చేస్తున్న వారికి టూల్ కిట్స్ అందజేస్తామన్నారు. వారికి గుర్తింపు కార్డులు, లేపాక్షి వారితో మాట్లాడి విక్రయా లకు చర్యలు తీసుకుంటామన్నా రు. తిరుపతి విమానాశ్రయంలో నామ మాత్రపు ధరతో స్టాల్ ఏర్పాటునకు ఎయి ర్ పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. తిరుమలలో షాపులు ఏర్పాటునకు, టీటీడీ కల్యాణ మండపాలలో నామినల్ రేటుకి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు టీటీడీ ఈవోతో మాట్లాడుతానన్నారు. కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఇళ్లు లేని కళాకారులను గుర్తించి వారికి మూడు సెంట్లు స్థలాన్ని అందించాలని తహసీల్దార్ భార్గవిని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ ప్రభావతి, జిల్లా జీవనోపాదుల అధికారి టీ.ధనంజయరెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్ వనజాక్షి, ఎస్వీఈపీ ఏపీ ఎం దూర్వాసులునాయుడు. ఏపీఎం కోమల, హస్తకళల సెక్రటరీ దశరదాచారి, శ్రీబాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూ చువల్ ఎయిర్ కో–ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు లోకనాథ ఆచారి, సెక్రటరీ రాజాచారి పాల్గొన్నారు. -
జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం
వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారు జామునే ఇంటి తలుపు తట్టి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రేషన్ కార్డుదారుల ఇంటి గుమ్మం ముందే రేషన్ అందించేందుకు ఎండీ యూ వ్యవస్థకు పురుడుపోశారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడకుండా ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్లను మెరుగుపరిచారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మహిళాభ్యున్నతికి రాయితీ రుణాలు అందించారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించారు. అమ్మ ఒడి, వసతిదీవెన, విద్యాదీవెన పథకాలను పకడ్బందీగా అమలు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మండల కేంద్రాల్లో మెగా జాబ్ మేళాలను ఏర్పాటు చేశారు. ఒక్కటేమిటి గ్రామ స్థాయిలో ఏ అవసరం వచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా వ్యవస్థలను తీర్చిదిద్దారు. -
సముద్రంలో మునిగి బాలిక మృతి
కోట : మండలంలోని శ్రీనివాససత్రం బీచ్లో బుధవారం సముద్రంలో మునిగి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.. స్థానిక మత్య్సకారుడు అక్కయ్యగారి లక్ష్మయ్య, సోమియా దంపతుల కుమార్తె పల్లవి(13) తిరుపతిలో చదువుకుంటూ వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. బంధువులతో కలిసి సముద్రస్నానానికి వెళ్లింది. అలల ఉధృతికి మునిగిపోయింది. సమీపంలోని మత్స్యకారులు వెంటనే బాలికను బయటకు లాగేశారు. అపస్మారకస్థితికి చేరడంతో హుటాహుటిన చింతవరం వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. -
తుడాను సందర్శించిన ‘కాగ్’
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను బుధవారం కాగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వీసీ మౌర్య తుడా చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న అకౌంటింగ్ విధానాలను కాగ్ బృందానికి వివరించారు. డిజిటలైజేషన్కు తక్షణం చర్యలు చేపట్టాని కాగ్ కమిటీ అధికారులకు సూచించింది. సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కాగ్ రీవూ ప్రకాష్, కాగ్ డైరెక్టర్ జనరల్ రష్మీ అగర్వాల్, డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఎన్వీ నిఖిత, సీనియర్ డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఆర్.శ్యామ్, తుడా కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు. -
ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబు
తిరుపతి సిటీ: ఎస్వీయూ లైబ్రరీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కె.సురేంద్రబాబును వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్గా నియమిస్తూ వీసీ అప్పారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేంద్రబాబు వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో డీన్గా ఉన్న ప్రొఫెసర్ ఎస్ కిషోర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ గెనుంగుట్లపల్లెలో విద్యుదాఘాతంతో ఓ వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. వివరాలు.. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఆన్ చేశారు. అదే సమయంలో ఇంటి గేటును పట్టుకుని ఉన్న కాంతమ్మ(74)కు షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలికి గాయాలు పాకాల : మండలంలోని ఇరుగురురంగయ్యగారిపల్లె వద్ద బుధవారం రోడ్డు దాటున్న మరియమ్మ అనే వృద్ధురాలిని 104 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ కుడి కాలు విరిగింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
● 11 నెలల పాలనలో ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి నేతలు ● అనధికారికంగా పలు ఆలయాలకు కమిటీల నియామకం ● ఆలయంలోకి అడుగిడగానే నిధులపై కన్ను ● ఆలయ నిధులతో ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ● చూసీచూడనంట్లు పోండయ్యా అంటూ అధికారులకు ప్రజాప్రతినిధుల సలహా ● అన్
చిల్లకూరు: జిల్లాలో ఆదాయం వచ్చే ఆలయాలపై కూటమి నేతల కన్ను పడింది. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అనధికారికంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. కొందరు ఈఓలు వారి పెత్తనాన్ని తట్టుకోలేకపోతుంటే.. మరికొందరు మాత్రం దొరికిందే అవకాశం అన్నట్లు ఆలయ నిధులను అనవసర కార్యక్రమాలు నిర్వహించి చేతివాటం చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఆదాయం రూ.5 లక్షలకు మించి వచ్చే ప్రతి ఆలయాలకు ప్రభుత్వం పాలకమండలి కమిటీలను నియమిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వీటి గురించి పట్టించుకోలేదు. అయితే కొందరు నేతలు మాత్రం తమ ప్రాంత పరిధిలోని ఆలయాలకు తామే కాబోయే కమిటీ అధ్యక్షుడిని అంటూ ఈఓలపై అప్పుడే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో కొందరు ఈఓలు కూటమి నేతల పెత్తనాన్ని తట్టుకోలేక చేష్టలుడిగి చూస్తున్నారు. కొంతమంది ఈఓలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అనధికారిక కమిటీలతో కలసి చేతివాటం చూపిస్తున్నారు. అనవసర ఖర్చులు చేయిస్తూ దేవుడి నిధులను స్వాహా చేస్తున్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన తరువాతే.. ఆలయ కమిటీల మెంబర్లమని చెప్పుకుంటున్న నేతలు ఆడిటర్లకు వాటాలు పంచుతూ కార్యక్రమాల్లో ఆధ్యాత్మికతను పక్కన పెట్టి రికార్డింగ్ డ్యాన్సు(ఈవెంట్)లు చేయించి ఇష్టారీతిలో భారీగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలో గత నెలలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు ఆరు లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. తద్వారా ఆలయానికి సుమారు రూ.కోటి వరకు ఆదాయం వచ్చింది. ఇదే మండలంలోని తమ్మినపట్నంలో కోదండరామస్వామి ఆలయానికి కూడా రూ.కోట్ల నిధులు ఉన్నాయి. మరి ఈ ఆలయంలో నవమి వేడుకలను నిర్వహించేందుకు దేవదాయశాఖ ఎన్ని రూ.లక్షల నిధులు విడుదల చేసిందనే విషయం తెలియదు. కానీ అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ ఆ నిధులతో పాట కచేరీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆలయానికి కొత్తగా వచ్చిన ఈఓ కూడా నిధుల వినియోగంలో ఉన్నతాధికారులను ఏమార్చి భారీస్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేస్తే అడ్డుకునే పోలీసులు ఈ కార్యక్రమాలను దగ్గర ఉండి ప్రోత్సహించడం కొసమెరుపు. దీన్ని బట్టి దేవదాయశాఖ నిధులు ఎంత దుబారా చేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. జీఓ విడుదల చేయలేదు.. ఆలయాల్లో పాలక మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీఓ విడుదల చేయలేదు. కనీసం ఉత్సవ కమిటీలను కూడా నియమించేలా ఆదేశాలు అందలేదు. పలు ఆలయాల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఆయా ఆలయాల ఈఓలతో మాట్లాడి చర్యలు చేపడతాం. తమ్మినపట్నం కోదండరామస్వామి ఆలయంలో అనుమతులు లేకుండానే నవమి ఉత్సవాలకు భారీగా ఖర్చు చేసిన విషయాలు ఆర్జేసీ ఆజాద్ చూశారు. నాకు ఆ విషయం తెలియదు. – రామకృష్ణారెడ్డి, దేవదాయశాఖ కమిషనర్, తిరుపతి గూడూరు డివిజన్లో 23 ఆలయాలకు.. గూడూరు డివిజన్ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో సుమారు 23 ఆలయాల్లో గత ప్రభుత్వం పాలకమండళ్లు ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేయడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక కూటమి నేతలు ఆలయాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు, పండుగలు నడిపించేందుకు పట్టుబడుతున్నారు. వారికి సపోర్టుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు పోండయ్యా అని దేవదాయశాఖ అధికారులతో చెప్పడంతో ఆలయ ఈఓలు మాకు ఏంటి ఈ ఖర్మ అనుకుంటూ వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. -
గత ప్రభుత్వంలో పండుగ
గత ప్రభుత్వంలో పండుగలా వ్యవసాయం ● అన్నదాతకు ఎల్లప్పుడూ అభయం ● రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ● ఆర్బీకేల ద్వారా పూర్తి సహకారం ● ఏడాదిలో సాగును దండగాలా మార్చిన కూటమి ప్రభుత్వం ● నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ● అమలు కాని అన్నదాతా సుఖీభవ ● అప్పుల పాలవుతున్న అన్నదాతలు ● ఇతడి పేరు చెంచురామయ్య. వరదయ్యపాళెం మండలం. ఆయనకు రెండు ఎకరాల భూమి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంలో భాగంగా నగదు ఐదేళ్లపాటు అందింది. ఈ సొమ్ము పొలం దుక్కులు, విత్తనాలకు ఉపయోగపడేది. సాగుకు ముందే అప్పులు చేయాల్సిన ముప్పు తప్పేది. అలాగే ఆర్బీకేల ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్లు సకాలంలో సలహాలు అందించేవారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినా బీమా వచ్చేంది. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది సాగు చేసిన వరి పంట దెబ్బతింది. రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. అయితే బీమా మాటే లేదు. అన్నదాతా సుఖీభవ కింద చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇప్పుడు సాగు చేయడం కంటే కూడా పొలం బీడు పెట్టుకోవడమే మేలనుకునే దుస్థితి దాపురించింది. జిల్లా సమాచారం సాధారణ సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాలు రైతులు 2,76,000 కౌలుదారులు 14,000 రైతు సేవా కేంద్రాలు 442 సీహెచ్సీలు 338 అగ్రి ల్యాబ్లు 6 జలసిరి కింద వేసిన ఉచిత బోర్లు 506ఉత్తుత్తి మాటలే గత ప్రభుత్వ హయాంలో సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతింటే ఒక్కరోజులోనే పరిశీలించేవారు. వెంటనే నష్ట పరిహారం అంచనాలు వేసి ఆర్థికసాయం అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఉత్తుత్తి మాటలే చెబున్నారు. గత ఏడాది అక్టోబరఱ్లో 7 ఎకరాలో వరి నాటేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకుంటే వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కనీసం విత్తనాలు కూడా రాయితీపై ఇవ్వలేదు. ఇలాగే ప్రభుత్వ వైఖరి ఉంటే వ్యవసాయం పూర్తిగా వదిలేయాల్సిందే. – తలారి ముత్యాలయ్య, చిట్టమూరు మండలం ఉచిత బోరు ఊసే లేద గత ప్రభుత్వంలో వైఎస్సార్ జలసిరి పేరుతో అర్హత కలిగిన ప్రతి రైతు కు ఉచితంగా బోరు వేసి ఆదుకునేవారు.ఇందులో నే మేమంతా లబ్ధిపొందాం. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉచిత బోర్లు అనే పథకం ఊసే లేకుండా పోయింది.గతంలో నియోజక వర్గానికి రెండు బోరు మిషన్లును కేటాయించి ప్రతిగ్రామంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగా బోర్లు వేశారు.ఇప్పుడు ఆపథకం ఉందా?లేదా అనే ది కూడా చెప్పేవారే లేరు. – ఏకోలు వెంకటయ్య రైతు, కమ్మవారిపల్లె, వెంకటగిరి మండలం నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని సేవలను గడప వద్దకే అందజేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా పచ్చరొట్ట విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, సవిత్తనాలు, పరికరాలు అందించారు. పంటల బీమా సైతం నమోదు చేసేవారు. ప్రస్తుతం రైతు సేవాకేంద్రాలుగా మార్చినా వాటిని తెరవడం లేదు. గత ప్రభుత్వంలో ధాన్యం బస్తా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ఉండేది. ఇప్పుడు రూ.1,500 మాత్రమే పలుకుతోంది. – శేఖర్, డేగావారి కండ్రిగ, సూళ్లూరుపేట మండలంకూటమి ప్రభుత్వం అన్నదాతలను ఆమడదూరంలో పెట్టింది. వ్యవసాయానికి కనీస మాత్రం సహకారం కూడా అందించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఆరుగాలం కష్టించే రైతులను దగా చేస్తోంది. ఈ క్రమంలో ముందుగా విశిష్ట సేవలందించే ఆర్బీకేలను నిర్వీర్యం చేసేసింది. రైతు సేవా కేంద్రాలు పేరు మార్చి ఒక్క సేవ కూడా అందని దుస్థితికి తీసుకువచ్చింది. అన్నదాతా సుఖీభవ కింద పెట్టుబడి సాయంగా రైతులకు రూ.20వేల చొప్పున అందిస్తామని బీరాలు పలికి.. ఇప్పుడు ముఖం చాటేస్తోంది. ఇప్పటికే రబీ సీజన్లో ఎలాంటి సాయం అందించలేదు. ఇప్పుడు ఖరీఫ్ మొదలైనా ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తోంది. ఈ క్రమంలోనే భూసార పరీక్షలను గాలికి వదిలేసింది. అగ్రిల్యాబ్లను నిర్ధాక్షిణ్యంగా మూసేసింది. విత్తనాలు, ఎరువుల సంగతే మరచిపోయే పరిస్థితులు తీసుకువచ్చింది. దీంతో రైతులు మళ్లీ దూరాభారం వెళ్లి విత్తనాలు, ఎరువులును కొనుగోలు చేసుకునే రోజులను పునరావృతం చేసింది. ఉచిత పంటల బీమాను తుంగలో తొక్కేసింది. నష్ట పరిహారం ఊసే లేకుండా చేసేసింది. రాయితీపై అందించే వ్యవసాయం పరికరాలను తీసుకోవాలంటేనే రైతులు భయపడే పరిస్థితి కల్పించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ఆపేసింది. పంట ఉత్పత్తులను దళారుల పాలు చేసేసింది. ఇక కౌలు రైతులనైతే పూర్తిగా విస్మరించింది. మొత్తం మీద కేవలం ఒక్క ఏడాదిలోనే వ్యవసాయం దండగ అని అన్నదాతలే అనుకునే దుస్థితిని తీసుకువచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికే పెద్దపీట వేసేవారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నాటి పాలకులు విశ్వసించేవారు. ఇదే లక్ష్యంతో వినూత్నమైన పథకాలు, విధానాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సులువుగా అందించేందుకు ఆర్బీకేలను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే సర్వం అందజేసేవారు. అలాగే సీజన్ ఆరంభానికి ముందే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించేవారు. భూసార పరీక్షలు చేయించి, ఎలాంటి పంటలు సాగు చేయాలో అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలోనే పలు చోట్ల అగ్రిల్యాబ్లను ప్రారంభించారు. పంటలకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించేవారు. ఒక వేళ పంట నష్టపోతే వెంటనే పరిహారం చెల్లించేవారు. సకాలంలో బ్యాంకుల ద్వారా సున్నావడ్డీ రుణాలు మంజూరు చేయించేవారు. ఇదే విధానాలను కౌలురైతులకు సైతం వర్తింపజేసేవారు. వైఎస్సార్ జలసిరి కింద ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయించేవారు. రైతులు పండించే ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టేవారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాత ఆర్థికంగా బలపడేందుకు పూర్తి సహకారం అందించేవారు. పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేవారు. సీజన్ మొదలయ్యే సరికే విత్తనాల పంపిణీ చేపట్టేవారు. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అందుబాటులో ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకునేవారు.డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్)మత్తేరి మిట్టలో నిరుపయోగం రైతు భరోసా కేంద్రం నిలువునా మోసం చేశారు గతంలో చంద్రబాబు రుణమాఫీ అంటూ రైతులను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు ఇస్తామని గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. రైతులకు పైసా కూడా విదల్చలేదు. సాయం కోసం ఎదురుచూపులు తప్పని దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా రూ.13.500 నేరుగా ఖాతాలోనే జమ చేసేవారు. ఈ సీజన్లో సాగు చేద్దామంటే అప్పులు చేయాల్సి వస్తోంది. – దామోదర్రాజు, రాజుల ఎరుగుంటపాళెం, సైదాపురం మండలం సంబరంగా సాగు చేశాం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంబరంగా సాగు చేశాం. వ్యవసాయంలో నాలుగు రాళ్లు సంపాదించాం. అప్పట్లో పెట్టుబడి సాయంగా ఏటా రైతు భరోసా కింద నగదు అందించేవారు. ఆర్బీకేల ద్వారా ఇంటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వచ్చేవి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేవారు. పుష్కలంగా సాగునీరు సరఫరా చేసేవారు. దీంతో మా కుటుంబాలు హాయిగా జీవనం సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయం అంటేనే భయపడాల్సిన దుస్థితి దాపురించింది. – పాకాల ఏడుకొండలు, తిప్పిరెడ్డిపల్లె, సైదాపురం మండలం అన్ని విధాలుగా దగా కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలు గా దగా చేస్తోంది. నాకు ఒకటిన్నర ఎకరా ఉంది. గత సర్కారు హయాంలో సీజన్కు ముందుగానే రైతు భరోసా సొమ్ము అందించారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు రాయితీపై పంపిణీ చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టుబడి సాయం లేదు. రైతు సేవా కేంద్రాలు అన్నారు.. వాటిని ఎప్పుడూ మూసే ఉంటున్నారు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేశారు. – ఎన్.రమణారెడ్డి, నరసారెడ్డి కండ్రిగ, నాయుడుపేట -
పరేషన్పై మహిళల నిరసన
వెంకటగిరి రూరల్ : రేషన్ సరుకులను ఇంటి ముంగిటకే చేర్చే ఎండీయూ వాహనాలను రద్దు చేయడంపై మహిళలు మండిపడ్డారు. చౌక దుకాణాల్లోనే బారులు తీరి సరుకులు తీసుకోవాలని ఆదేశించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు పట్టణంలోని వల్లివేడు క్రాస్ వద్ద నిరసనకు దిగారు. మహిళలు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. దుకాణాల వద్ద పడిగాపులు కాయలేమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, గతంలో మా వద్దకే వచ్చి సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు పట్టణంలోని మనులాలాపేటలోని దుకాణానికి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. అలాగే ఏఎంసీ గోడౌన్, పరశురామ్ కాలనీ వాసుల కూడా 5 కిలోమీటర్ల దూరంలోని మనులాలాపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. చివరకు 5 కేజీల బియ్యం తెచ్చుకునేందుకు సైతం ఆటో చార్జీకి రూ.40 వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. సరుకుల తీసుకోకుంటే కార్డు రద్దు చేస్తారని రేషన్షాపు నిర్వాహకులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటి వద్దకే సరుకులు తీసుకువచ్చే ఎండీయూ వాహనాలను పునరుద్ధరించాలని కోరారు. -
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోయినా..
ఆలయాల కమిటీలను దేవదాయశాఖ ఏర్పాటు చేయకపోయినా కూటమికి చెందిన నాయకులు అనధికారికంగా ఆలయ కమిటీల అధ్యక్షులతో పాటు సభ్యుల పేరిట ఫ్లెక్సీలు, కరపత్రాలు, వాల్పోస్టర్లు, క్యాలెండర్లు వేయించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. దేవదాయశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో నియామకాలు చేయించుకుని ఆలయాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. సిఫార్సు లేఖతో ఎంపిక చేసిన చైర్మన్ పేరిట ఆహ్వాన పత్రిక విడుదల చేస్తున్న ప్రజాప్రతినిధి -
ప్రయాణికులకు ‘మహా’ కష్టాలు
● బస్సులు లేక ప్రజల ఇక్కట్లు ● మహానాడుకు వెళ్లిన 365 సర్వీసులు తిరుపతి అర్బన్ : ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం పార్టీ సేవలకు వాడేస్తోంది. కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు జిల్లా నుంచి 365 బస్సులను తరలించేసింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. 11 డిపోల నుంచి తరలింపు జిల్లాలో మొత్తం 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. దాదాపు అన్ని డిపోల నుంచి మహానాడుకు సర్వీసులు కేటాయించారు. అయితే ఒక్క వెంకటగిరి నుంచే 50 బస్సులను పంపించడం వివాదాస్పదంగా మారింది. ఈ డిపోలో ఉండేది వంద బస్సులైతే అందులో సగం తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టీడీపీ సమావేశానికి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పడిగాపులు జిల్లాలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. పార్టీ మీటింగ్ల పేరుతో సామాన్య ప్రజలను అవస్థలకు గురిచేయడంపై ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు ఇటీవల అమరావతికి ప్రధానమంత్రి వస్తున్నారని ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో పంపించారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ మహానాడు అంటూ వందలాది బస్సులను పంపేశారు. ఇక్కడ ప్రయాణికులు బస్టాండ్లలో అవస్థలు పడుతున్నారు. పార్టీ మీటింగ్లకు ప్రైవేట్ బస్సులు తీసుకుకోవాలి. అంతే కానీ, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. – శేఖర్, తిరుపతి -
మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యం
తిరుపతి తుడా : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యంగా నగరపాలక సంస్ధ అధికారులు, సిబ్బంది పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మౌర్య, ఆర్డీ విశ్వనాథ్తో కలసి వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో అన్ని విభాగాల పనితీరును అభినందించారు. మరింత మెరుగ్గా పలితాలు వచ్చేలా పనిచేయాలని సూచించారు.ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. పన్నుల వసూలులో మరింత వేగం పెంచాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగం పక్కా ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్ఈ శ్యామ్సుందర్, ఎంఈలు తులసి కుమార్, గోమతి పాల్గొన్నారు. ‘బర్డ్’ అభివృద్ధికి కృషి తిరుపతి తుడా : బర్డ్ ఆస్పత్రి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని డాక్టర్ జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జగదీష్ మాట్లాడుతూ బర్డ్లో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించిన అనుభవం ఉందన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఆస్పత్రి గుర్తింపు ఇనుమడించేలా సేవలు విస్తరిస్తామని వెల్లడించారు. అనంతరం పలువురు వైద్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. భవన నిర్మాణాల పరిశీలన తిరుపతి తుడా : స్విమ్స్ ప్రాంగణంలో నిర్మిస్తున్న భవనాలను టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని గదులు, భోజనశాల, మరుగుదొడ్లను తనిఖీ చేశారు. సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మిస్తున్న భవనాన్ని సందర్శించారు. సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్, స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ , స్టాఫ్ క్వార్టర్స్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. మౌలిక వసతులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీవీ సత్యనారాయణ, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం పాల్గొన్నారు. -
జ్యూస్ ఫ్యాక్టరీలకు సహకారం
తిరుపతి అర్బన్ : జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు సహకారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి బ్యాంక్ అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ యజమానులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ వారు సైతం మామిడి కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు.టెంపో ఢీకొని వ్యక్తి దుర్మరణంపాకాల : మండలంలోని దామలచెరువు వద్ద జాతీయ రహదారిపై టెంపో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. కల్లూరుకు చెందిన సాధిక్బాషా(40) స్కూటీలో వస్తుండగా అక్కగార్ల ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న టెంపో వేగంగా ఢీకొంది. దీంతో సాధిక్బాషా అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తగ్గిస్తారా.. తప్పు ఒప్పుకుంటారా?
నినాదాలు చేస్తున్న అభినయ్, వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి దూకుడుకు కూటమి ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఎన్నికల హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారును నిత్యం ఇరుకున పెడుతుండడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది. మొన్నటికి మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వినూత్న రీతిలో తెలిపిన నిరసనగా సమాధానం చెప్పుకోలేక సతమతమైంది. తర్వాత సూపర్ సిక్స్ హామీలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడంతో కూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. ఈ క్రమంలోనే యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నాటకీయంగా చూపించిన పెట్రో ధరల విషయాలను గుర్తుచేస్తూ ఇరుకున పెట్టడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాజకీయాల్లో విశ్వనీయత ఉండాలంటే నేతలు మాట ఇస్తే దాని మీది నిలబడాలని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో యువగళం సందర్భంగా నారా లోకేష్ కర్ణాటక, ఆంధ్రలో పెట్రో ధరల మధ్య తేడాను చూపుతూ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రో ధరలు తగ్గిస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ సదరు హామీ అమలు కాకపోవడంతో భూమన అభినయ్ మండిపడ్డారు. బుధవారం వేకువజామున కర్ణాటకలో లోకేష్ వెళ్లిన పెట్రోల్ బంక్కే వెళ్లి పెట్రోల్ పట్టించుకున్నారు. ధర ఎంత ఉందో బహిరంగంగా ప్రదర్శించారు. వెంటనే కుప్పంలో లోకేష్ వెళ్లిన బంక్లోనే పెట్రోల్ తీసుకుని ధరను చూపించారు. కర్ణాటక కంటే కుప్పంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు వెంటనే పెట్రో ధరలు తగ్గించాలని కోరారు. లేకుంటే తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువగళం హామీ హామీ అమలు చేయాలి పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి నారా లోకేష్కు భూమన అభినయ్ డిమాండ్ -
భూసేకరణ పనులు వేగవంతం
తిరుపతి అర్బన్: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. జాతీయ రహదారులతోపాటు రైల్వే ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్భరత్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మధుసూదన్రావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు, నేషనల్ హైవే పీడీలు చైన్నె, నెల్లూరు, తిరుపతి వరుసగా రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, వెంకట చలపతి, తహసీల్దార్లు పాల్గొన్నారు. పారదర్శకంగా రేషన్ పంపిణీ చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పారదర్శకంగా ప్రజలకు పంపిణీ చేయాలని డీఎసీఓ శేషాచలరాజు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి, డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అధికారులు మంగళవారం మండల పరిధిలోని ఎఫ్పీ దుకాణాలను తనిఖీ చేశారు. డీఎస్ఓతో పాటు ఇతర అధికారులు తనిఖీలు చేపట్టి, నిల్వ ఉన్న బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు. అనంతరం వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎఫ్పీ దుకాణాల్లో ఆకస్మిక తనఖీలుంటాయని పేర్కొన్నారు. అరకొరగా పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందింతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సీఎస్ డీటీ గంగయ్య, పలువురు డీలర్లు పాల్గొన్నారు. మోటార్ల చోరీ నియంత్రణ ఏర్పేడు: మండలంలో తరచూ వ్యవసాయ పొలాల్లో రైతులకు చెందిన విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు చోరీ జరుగుతుంటే వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎస్పీ హర్షవర్ధన్రాజు సీఐ శ్రీకాంత్రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఏర్పేడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పోలీసు స్టేషన్లోని వివిధ కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకుని ఎప్పటి నుంచో శిథిలావస్థకు చేరుకున్న వాహనాలను కోర్టు అనుమతి తీసుకుని వాటిని వాహనదారులకు తిరిగి ఇచ్చేయడమో.. వేలం వేయడమో చేయాలన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 16 అంశాలతో కూడిన బోర్డును పరిశీలించారు. గ్రామాల్లో పల్లె నిద్ర నిర్వహించాలని ఆదేశించారు. -
కష్టాలు తప్పడం లేదు
గతంలో వ్యక్తిగత, గ్రామ సమస్యలను పరిష్కరించునేందుకు సచివాలయాలకు వెళ్లేవాళ్లం. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సచివాలయంలో సిబ్బంది, వలంటీర్లు ఉండడం లేదు. అదేమని అడిగితే సర్వేలకు వెళ్లారని చెబుతున్నారు. – తుపాకుల ప్రసాద్, మన్నారుపోలూరు మీ సేవకు వెళ్లాం మా అబ్బాయి ఓ ప్రయివేటు కళాశాలలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. వాడికి ఓబీసీ సర్టిఫికెట్ కావాలని అడిగారు. అన్ని వివరాలను తీసుకుని సచివాలయానికి వెళితే అక్కడ సిబ్బంది లేరు. కనీసం సమాచారం చెప్పే వారు కూడా లేరు. చివరకు ఓ వ్యక్తి మీ సేవకు వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో సచివాలయంలోనే సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.రమేష్, సూళ్లూరుపేట చేనేతలను ఆదుకునేవారు లేరు గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా ఒక్కో కార్మికునికి రూ.24000 వచ్చేది. చేనేత క్లస్టర్ యూని ట్స్కు సబ్సిడీతో విద్యుత్ అందించేవారు. కూటమి సర్కార్ చేనేతలను ఆదుకునే దిశగా ఒక్క పథకమూ అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. –శ్రీనివాసులు, చేనేత కార్మికుడు, వెంకటగిరి వైద్యం అందడం లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని నిర్వీర్యం చేసింది. అందులో పనిచేస్తున్న సీహెచ్ఓలకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తోంది. నెల రోజులకు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్లు మూతపడ్డాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. –ఓడూరు ఉజ్వల్ రెడ్డి, బత్తలవల్లం, వరదయ్యపాళెం మండలం ● -
గతంలో పల్లెవించిన ప్రగతి
నాడు రైతుకు భరోసా ఉండేది నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. జగనన్న ప్రభు త్వంలో ఏటా రూ.13,500 వచ్చేది. ఈ డబ్బులు పెట్టుబడికి సరిపోయేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా ఇవ్వలేదు. ఎన్నికల హామీలో ఇస్తామన్న రూ.20 వేలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తోంది. –మునిశేఖర్ యాదవ్, రైతు, గాజులమండ్యం, రేణిగుంట మండలం కళకళలాడుతున్న సచివాలయంసుదీర్ఘ పాద యాత్ర అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే పెల్లె రూపురేఖలు మార్చేశారు. ప్రతి చిన్న పనికీ మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలను నిర్మించారు. ప్రతి 50 కుటుంబాలకు ఇంటివద్దకే పథకాలను, ప్రభుత్వ సంక్షేమాన్ని అందించేందుకు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. రైతులకు గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు. పంట కొనుగోళ్లను చేపట్టి రైతుకు గిట్టుబాటు ధర కల్పించారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి నిధి కింద ఏడాదికి రూ.13,500 అందించారు. రుణాలు, బీమాను పక్కాగా అమలు చేశారు. ప్రతి కుటుంబానికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కూతవేటు దూరంలోనే విలేజ్హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. పేదలు, వృద్ధులకు ఉచిత మందులతో పాటు ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.25 లక్షల వరకు శస్త్ర చికిత్సలకు అవకాశం కల్పించారు. అమ్మఒడి పథకం కింద జిల్లాలో 3.4 లక్షల మందికి ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున అందించారు. మహిళా సంఘాలకు వడ్డీ రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఫీజురీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేతోడు వంటి పథకాలను అందించి ఆదుకున్నారు. నాడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి నాడు–నేడు పథకం కింద గత ప్రభుత్వంలో పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. మా ఊరులో ఉన్న ప్రాథమిక పాఠశాల అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంది. గత ప్రభుత్వంలో అదనపు తరగతి గదులు కట్టించారు. కూటమి ప్రభుత్వం మా పాఠశాలను మూసివేసి కిలోమీటరు దూరంలోని హరిపురం కాలనీకి బదిలీ చేయాలని చూస్తోంది. – మేర్లపాకు శివప్రసాద్, పేరూరు, తిరుపతి రూరల్ సొంతింటి కల నెరవేరింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాకాడు మండలం, సిద్ధిగుంటపాళెం గ్రామం వద్ద జగనన్న లేఔట్లో స్థలంతో పాటు కాలనీ ఇల్లు నిర్మించి ఇచ్చారు. అద్దె ఇంట్లో నుంచి మా సొంత ఇంట్లోకి వచ్చాం. ఎంతో సంతోషంగా ఉంది. – రాయుపు రాజేష్, సుజన దంపతులు, వాకాడు మండలం నెలబల్లిలో ప్రభుత్వ భవనాల సముదాయంతనపల్లిలో ఒకేచోట ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కార్యాలయాలు -
కనిపించని అభివృద్ధి పనులు
● వెలవెలబోతున్న సచివాలయాలు ● ఊసే లేని సంక్షేమ పథకాలు ● నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రాలు ● ఖాళీగా విలేజ్ వెల్త్ క్లినిక్లు ● అసంపూర్తిగా నాడు–నేడు పనులు ● కూటమి పాలనలో ప్రజలకు తప్పని ఆపసోపాలు తిరుపతి అర్బన్/తిరుపతి సిటీ : మళ్లీ పాతరోజులొచ్చాయి. ఇంటి ముంగిటే అందుతున్న సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. వలంటీర్ వ్యవస్థకు ఫుల్స్టాప్ పెట్టేసింది. చిన్నిచిన్న సేవలకు కూడా పట్నానికి పరుగులు తీయాల్సి వస్తోంది. వ్యయప్రయాసాలకోర్చి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను గాలికొదిలేశారు. పేదలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సూపర్సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టేసింది. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడిచింది. నాడు–నేడుతో రూపుదిద్దుకున్న పాఠశాలలను పట్టించుకోకుండా పోయింది. సచివాలయాల్లో కానరాని సేవలు గత ప్రభుత్వంలో జిల్లాలో 691 సచివాలయాల ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సేవలందించేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి రేషన్ కార్డులు, ఆధార్తో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దే అందించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సచివాలయాల్లో సిబ్బందికి 32కు పైగా సర్వేలు అంటగట్టారు. దీంతో ఏ ఒక్కరూ సచివాలయం ముఖం చూడడం లేదు. ప్రజలు సచివాలయాలకు వెళ్లడం మానేసి గతంలో లాగే మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రు. సచివాలయాలు బోసిపోతున్నాయి. 442 రైతు భరోసా కేంద్రాలను 50 శాతం తగ్గించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించే నాథుడే లేకుండా పోయారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ అంటూ ఊదర గొట్టింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1,500, తల్లికి వందనం పేరుతో కుటుబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు, ఉచిత బుస్సు, అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి ప్రతి రైతుకూ రూ.20 వేలు, ఏడాదికి 25 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధికింది నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీటి కొళాయి, పేదల ఆదాయం రెట్టింపు అంటూ ప్రగల్భాలు పలికారు. గత ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నా ఏ ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు గత ప్రభుత్వం నిర్మించిన ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ భవనాలు, మల్టీపర్పస్ గోదాములు, రైతు సేవా కేంద్రాలు, సచివాలయ భవనాలు, పాఠశాలల మరమ్మత్తులు, నూతన భవనాలు, పశువైద్యశాలలు, విద్యార్థుల వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తిరుపతి రూరల్ పరిధిలోని ఓ గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. తర్వాత ఒక్కొక్కరుగా సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఆ గ్రామానికి చెందిన ఒకరు రేషన్ కార్డు దరఖాస్తు కోసం రాగా.. సర్వర్ సహరించకపోవడంతో వెనుదిరిగాడు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలెవ్వరూ కనరాలేదు. మధ్యాహ్నం 2 గంటకు తర్వాత సచివాలయ సిబ్బంది కొందరు మండల కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా సచివాలయంలో ప్రజల తాకిడి లేదు. పథకాలు లేకపోవడం, గ్రామ సచివాలయంలో సేవలు స్తంభించడంతో ప్రజలు రావడం మానేశారు. ఇదే సచివాలయానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోజూ 50 నుంచి వంద మంది వరకు వచ్చేవారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే వివిధ సేవలు పొందేవారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. హామీలు గాలికొదిలేసి ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తోంది. -
బాబుకు వెన్నతో పెట్టిన విద్య
వెన్నుపోటు రాజకీయాలు ● ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా మోసం ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణించుకుందాం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● భూమన పిలుపు పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు తిరుపతి మంగళం : నమ్మిన వాళ్లను నట్టేటముంచి వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్న వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం చంద్రబాబు నైజమన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగపెట్టిందేమీలేదన్నారు. గత ఎన్నికల్లో జగనన్న కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలను మరోసారి వంచించి అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించడం జరిగిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడారు. చంద్రబాబుకు అధికారం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్టదన్నారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో టౌన్బ్యాంక్ చైర్మన్ కేత జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్లు పుల్లూరు అమరనాఽథ్రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, కోటూరు ఆంజినేయులు, అనీష్రాయల్, ఆరణి సంధ్య, కోటేశ్వరమ్మ, పుణీత, ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం
– నేడు ఆర్టీఓ కార్యాలయంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్పై శిక్షణ తిరుపతి మంగళం : వాహనదారులంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా మంగళంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ఙ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాన్ని అమర ఆసుపత్రి సౌజన్యంతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రతిస్పందన నైపుణ్యాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. శిక్షణలో పాల్గొనే వైద్య నిపుణుల గురించి తెలియజేశారు. ఈవీఎం గోడౌన్ల తనిఖీ రేణిగుంట: రేణిగుంట పాత విమానాశ్రయం రహదారిలో ఉన్న ఈవీఎంస్, వీవీప్యాట్లను భద్రపరిచిన గోడౌన్లను సోమవారం డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా షట్టర్లకు వేసిన సీళ్లను, సీసీ కెమెరాలను పరిశీలించి, భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జీఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్, నోడల్ అధికారి సుధారాణి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎన్నికల సూపరింటిండెంట్ ప్రసాద్, రేణిగుంట తహసీల్దార్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినా భయపడే ప్రసక్తేలేదు. గోవర్ధన్రెడ్డిని ఎలాగైనా హింసలకు గురిచేయాలనే కూటమి ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును బనాయించింది. మైనింగ్ వ్యవహరంలో ఎలాంటి పాత్ర లేని ఆయనపై వివిధ సెక్షన్లపై కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రజలపక్షాన నిరంతరం పోరాడే మాజీ మంత్రిపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగానికి తెరదీసి అక్రమ కేసులు ఎలా పెట్టాలో నేర్పి స్తున్నారు. జిల్లా ప్రజలు అంతా కాకాణి వెంటే ఉన్నారు. ఆయనకు మద్దతుగా న్యాయపోరాటం కొనసాగిస్తాం. –అనిల్కుమార్ యాదవ్, మాజీ మంత్రి -
హామీల అమలు కోసం వైఎస్సార్సీపీ కార్యాచరణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎన్నికల ముందు సూపర్సిక్స్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై కలసికట్టుగా పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ నేతలు సంకల్పించారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. సోమవారం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, చావా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్రెడ్డి, భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ, భరత్కృష్ణ, రాష్ట్ర అధికారప్రతినిధి శివశంకరరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిరసనగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం పాటించాలని, ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.వెన్నుపోటు దినం.. విజయవంతం చేద్దాం‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నేతలు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే నిరసనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు,, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజా వ్యతిరేకత దశదిశగా ప్రతిధ్వనించేలా కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువత, విధ్యార్థులను పథకాల పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశౠరు. దగా పడిన జనానికి అండగా నిలిచి పోరాడాల్సిన భాద్యత తమ మీద ఉందని వెల్లడించారు. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని, సామాన్య ప్రజలను సైతం భాగస్వాములు చేయాలని సూచించారు. -
పరాకాష్టకు ‘కూటమి’ కుయుక్తులు
మైనింగ్ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి బెయిల్ వస్తే ఏ–4 మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని దురుద్దేశపూర్వకంగా జైలుకు పంపారు. ఆయనపై నమోదు చేసిన కేసులో బలం లేకపోవడంతో కక్షపూరిత ధోరణితో ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. దీంతోపాటు మైనింగ్లో బ్లాస్టింగ్ చేశారని కేసులు నమోదు చేయడం ఆశ్చర్యమేస్తోంది. సైదాపురం మండలంలో ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్, అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న విషయాలను రాత్ర పూర్వకంగా కలెక్టర్, ఎస్పీ, ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. కానీ వారిపై చర్యలు తీసుకోక పోగా ఎలాంటి సంబంధం లేనివారిపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారు. సమంజసం కాదు. – నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ● -
కుట్రపూరితంగా కాకాణిపై కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఎలాంటి సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్ కేసు నమోదు చేయడం దారుణం. అదే మైనింగ్ వ్యవహారంలో 2023లో విచారణ జరగాక ఎలాంటి అక్రమాలు లేవని అధికారులు ధ్రువీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదే అధికారి చేత అక్రమాలు జరిగాయంటూ ఇచ్చిన వివరాలతో కాకాణిపై ఏ–4గా కేసు నమోదు చేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వ తీరుపై జూన్ 4న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించనున్నాం. కూటమి దౌర్జన్యాలు, అరాచకాలు, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, దుర్మార్గాలు ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ● -
ఆర్టీసీ ఆదాయం పెంచండి
సత్యవేడు: సమయానికి బస్సులు నడుపుతూ, డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలన పాటిస్తూ, ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపుతూ ఆర్టీసీకి ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు పిలుపునిచ్చారు. సోమవారం సత్యవేడు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వేసవిలో ఆర్టీసీ బస్టాప్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు డిపో నుంచి విజయవాడ సర్వీసు, ఊత్తుకోట మీదుగా చైన్నె సర్వీసు, సత్యవేడు–చిత్తూరు సర్వీసు, సూళ్లూరుపేట– ఊత్తుకోట సర్వీసులు నడపాలని కోరారు. నాగలాపురం ఆర్టీసీ బస్టాడును ఆధునీకరించాలన్నారు. ఉత్తమ డ్రైవర్లకు సన్మానం ఉత్తమ డ్రైవర్లను ఎండీ ఘనంగా సత్కరించారు. ఇందులో ఆయిల్ సేవ్ అవార్డులను డ్రైవర్లు ఎం.మధు, వీరయ్యకు అందజేశారు. బెంగళూరు సర్వీసులో అధిక ఆదాయం తీసుకొచ్చిన డ్రైవర్ సురేష్కు క్యాష్ అవార్డులు అందజేశారు. ఈడీ చెంగల్రెడ్డి, ఆర్ఎం వెంకటరమణ, డీఎం వెంకటరత్నం, ఆర్టీసీ యూనియన్ నాయకులు చెంచులయ్య, బాబు, గోవిందయ్య, మురళీ(చికెన్ చిన్నా), వికేఎన్ పరమశిం(బాషా), బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి..కొల్లగొట్టి
తిరుపతి రూరల్ పరిధిలోని దళవాయి చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. టిప్పర్లతో మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కుట్రలపై న్యాయపోరాటం మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమం. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే. కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపింది. ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్రెడ్డి పై అక్రమ కేసులు నమోదు బనాయించింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. న్యాయస్థానాల ద్వారానే ఈ క్రుటలపై న్యాయ పోరాటం చేస్తాం. – డాక్టర్ గురుమూర్తి, తిరుపతి ఎంపీ అండగా ఉంటాం కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కడం బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ లేవు. కాకాణి గోవర్ధన్రెడ్డికి మేమంతా అండగా ఉంటాం. న్యాయం గెలిచేవరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాం. – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ అప్రజాస్వామికం ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికం. ఆయనకు మేమంతా అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే, సూళ్లూరుపేట డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం. – కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి – 8లో -
ప్రజాస్వామ్యానికి
కాకాణి అరెస్ట్ ● వెంకటగిరిలో ఉద్రిక్తత ● భారీగా తరలివచ్చిన అభిమానులు ● 144 సెక్షన్ అమలు ● అక్రమ అరెస్ట్ను ఖండించిన వైఎస్సార్సీపీ శ్రేణులుకాలకేయ కూటమి రెడ్బుక్ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. హామీలు గాలికొదిలి అక్రమ అరెస్ట్ల పర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. ఏదో ఒక కేసులో ఇరికించి వైఎస్సార్సీపీలోని కీలక నేతలను జైలుకు పంపడం రివాజుగా మారుతోంది. ఇలాంటిదే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మైనింగ్ వ్యవహారంలో రెండు నెలలుగా టార్గెట్ చేసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని అరెస్ట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అభిమాన కెరటం ఎగసిపడింది. ప్రజాప్రతినిధులు, అభిమానులతో వెంకటగిరి పట్టణం కిక్కిరిసింది. 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాకాణి అరెస్టుతో జనసంద్రమైన వెంకటగిరికొండంత అభిమానం కాకాణి అక్రమ అరెస్టుతో వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ అభిమానులే దర్శనమిచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గూడూరు డీఏస్పీ గీతాకుమారి నేతృత్వంలో వెంకటగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటగిరి (సైదాపురం): ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. అనవసరమైన కేసుల్లో ఇరికించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని జైలుకు పంపారు. సోమవా రం ఆయన్ను వెంకటగిరి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి సోమవారం తెల్లవారు జామునే తన నివాసానికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి చేరుకుని కాకాణి అక్రమ రెస్టును ఖండించారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలు వెంకటగిరి కోర్టుకు బయల్దేరారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, కోర్టు ప్రాంగణంలోకి వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై కొందరు ముఖ్య నేతలను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. తర్వా త మాజీ మంత్రి అనీల్కుమార్యాదవ్, నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ ఆనం విజయకుమార్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మె ల్యే సంజీవయ్యతోపాటు పలువురు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రముఖులు కోర్టు వద్దకు చేరుకున్నారు. కిక్కిరిసిన కోర్టు ప్రాంగణం భారీ బందోబస్తు నడుమ నెల్లూరు నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని మధ్యాహ్నం 12.11 గంటలకు వెంకటగిరి కోర్టు ఆవరణానికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన్ను న్యాయమూర్తి విష్మువర్మ ఎదుట హాజరు పరిచారు. సుమారు 3 గంటల పాటు వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది. చివరకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్ జైల్కు తరలించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు కోర్టు భవనం నుంచి కిందకు వచ్చిన కాకాణి గోవర్ధన్రెడ్డి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడే ఉన్న వందలాది మంది అభిమానులు జై జగన్... జై గోవర్ధనన్న అంటూ నినాదాలు మిన్నంటించారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలివెళ్లారు. -
చెరువు మట్టి..కొల్లగొట్టి
దళవాయి చెరువులో చెలరేగుతున్న మట్టి మాఫియా ● హైవే విస్తరణ పనుల ముసుగులో దోపిడీ ● ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి ● అధికారమే అండగా బరితెగించిన ఓ బడా నాయకుడు ● ఆందోళనలకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి సమీపంలోని దళవాయి చెరువులో నుంచి రెండు నెలలుగా మట్టిని తరలిస్తున్నారు. రోజుకు పది టిప్పర్ల చొప్పున ఒక్కో టిప్పర్ పది ట్రిప్పుల వంతున వంద ట్రిప్పుల మట్టిని కొల్లగొడుతున్నారు. హైవే రోడ్డు విస్తరణ పనుల ముసుగులో ఎర్రమట్టిని గుట్టుగా తరలించి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. టిప్పరు ఎర్రమట్టి రూ.10 వేలు చెరువులో మట్టి ఇటుకల తయారీకి అనుకూలంగా ఉంటోంది. చుటు పక్కల ప్రాంతాలలో తయారుచేసే ఇటుక బట్టీలకు చెరువులోని మట్టిని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో ట్రిప్పు మట్టి విలువ సుమారు రూ.10 వేలు.. ఆ లెక్కన రోజూ 100 ట్రిప్పుల మట్టి విలువ దాదాపు రూ.10 లక్షలు. అంటే రోజుకు రూ.10లక్షలు లెక్కన నెలకు రూ.3 కోట్ల పైచిలుకు మట్టి వ్యాపారం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ రెండు నెలల కాలంలో మట్టి అక్రమార్కులు దాదాపు రూ.6 కోట్ల విలువైన మట్టిని తవ్వేసినట్టు సమాచారం. బరితెంగించిన బడా నాయకుడు హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఓ రాజకీయ పార్టీలో నియోజకవర్గ స్థాయి నాయకునిగా చెలామని అవుతున్నారు. ఆ బడా నాయకుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సమీప గ్రామాల ప్రజల విన్నపాలను లెక్క చేయకుండా అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వేస్తున్నట్టు సమాచారం. హైవే అథారిటీ నుంచి నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖ అధికారులకు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలన్న రిక్వెస్ట్ లెటర్ చేతబట్టుకుని అడ్డగోలు గా తవ్వకాలు సాగించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీలో ఉన్న ఆ నాయకుని జోలి కి వెళ్లడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఇదే అదునుగా దళవాయి చెరువును రాత్రి, పగలు తేడా లేకుండా కొల్లగొడుతున్నారు. ఇలాగే మట్టి రవాణా చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆ చెరువు ఆయకట్టుదారులు, సమీప గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలకు చెరువులో భారీ యంత్రాలుమామూళ్ల మత్తులో అధికారులు హైవే విస్తరణ పనులకు చెరువులలో మట్టి తరలింపు చేయాలంటే ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి. మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత నీటి పారుదల శాఖ నుంచి నిరభ్యంతర లేఖను తీసుకుని, ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించుకుని సదరు కాంట్రాక్టర్కు నిర్దేశించిన ప్రదేశంలో నిర్ణయించిన లోతు మేరకు మట్టిని తవ్వుకునే అనుమతులు పొందాల్సి. కానీ దళవాయి చెరువులో ఇవేవీ అమలు కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేకపోగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణాకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మైనింగ్ అధికారులు సైతం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయకట్టు దారులు ఆరోపిస్తున్నారు. మట్టి వ్యాపారులు అందించే మామూళ్లకు కక్కుర్తి పడి అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళవాయి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను స్థానికంగా నివాసముంటున్న ఓ అధికారి దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లగా ‘మట్టి అక్రమ రవాణాను తాను కూడా గమనిస్తున్నానని, అయినా ఏమీ చేయలేక పోతున్నాం’ అంటూ చేతులెత్తేయడం గమనార్హం. ఇరిగేషన్ ఏఈఈ రవిశంఖర్ను వివరణ కోరగా అక్కడ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, మట్టి తరలింపును నిలిపివేశామని చెప్పారు. గత రెండు నెలలుగా 30 అడుగుల లోతు తవ్వేసినందుకు వారిపై ఏరకమైన చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆ అధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. -
ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్
తిరుపతి అర్బన్: వివిధ సమస్యలపై తిరుపతి కలెక్టరేట్ ధర్నాలలో హోరెత్తింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని పలు ప్రాంతాల అర్జీదారుల నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్, సుధారాణి, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 268 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలపై 150 ఉండటం గమనార్హం! అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చంద్రగిరిలో మట్టి దోపిడీ చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని, దీనికి చెక్ పెట్టాలని సీపీఎం, సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ప్రధానంగా చంద్రగిరి ప్రభుత్వ బాలుర హాస్టల్ వద్ద మట్టిని తవ్వి వందల ట్రిప్పులు తరలిస్తున్నారని, అలాగే రామచంద్రాపురం మండలంలో రామాపురం నుంచి పచ్చికాపల్లం రోడ్డు మార్గంలో కొండలన్నీ తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారని, ఒక్కో ఎర్రమట్టి ట్రిప్పు రూ.30వేలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఆటోడ్రైవర్ భాగ్యశ్రీకి పింఛను మంజూరు చేయాలి మంగళం అంబేడ్కర్ కాలనీకి చెందిన ఒంటరి మహిళ, ఆటో డ్రైవరైన భాగ్యశ్రీపై గత నెల 27న ఓ వర్గానికి చెందిన కొందరు దాడులు చేయడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారని...ఆమెకు పింఛను మంజూరు చేసి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి కోరారు. ● గ్రీవెన్స్కు సమస్యల వెల్లువ విశాఖ ఉక్కును రక్షించుకుందాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి సమష్టిగా కృషి చేద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజా, ఐఎఫ్టీయూ కార్యదర్శి లోకేష్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నాలో వారు మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న వారిలో 4వేల మందిని తొలగించడం తగదని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఆ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు సైతం రాజీనామా చేశారని తెలియజేశారు. ఇంతటి చరిత్ర కలిగిన ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్కు ఓ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు హరినాథ్రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు వెంకటరత్నం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ వర్గీకరణ కోసం పోరుబాట ఎస్సీ వర్గీకరణ తరహాలో ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య యానాది డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పోరుబాట పేరిట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 10లక్షల మంది యానాదాలు ఉన్నారని, గిరిజనుల్లో జనాభా ప్రకారం మొదటి స్థానంలో యానాదులు ఉన్నప్పటికీ అన్నింటా తమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని, ఎస్టీ వర్గీకరణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యానాది సంఘం నేతలు చేవూరు సుబ్బారావు, బాపట్ల బ్రహ్మయ్య, తలపల మల్లికార్జున, యల్లంపాటి వెంకటరమణ, అత్తూరు చెంగల్ రాయులు, శ్రీమంతుల రామయ్య, రేవతి, రాములమ్మ, చెంబేటీ ఉష తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు
వడమాలపేట (విజయపురం) : వడమాలపేట మండల అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ జరిపించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులు విశిష్ట వాహనాల్లో విహరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీ నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన దంపతులు రూ.500లు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. పోలీస్ గ్రీవెన్స్కు 74 అర్జీలు తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 74 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు,ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదే వీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,538 మంది స్వామివారిని దర్శించుకోగా 37,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుపతికి ప్రత్యేక రైళ్లు తిరుపతి అన్నమయ్య సర్కిల్: భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయినట్లు చెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు. తాత్కాలికంగా నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా, భక్తులు సులభంగా రైలు టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఏం చేయాలబ్బా! ● మినీ మహానాడుకు నియోజకవర్గం నుంచి యాభై వాహనాలు ● తలలు పట్టుకుంటున్న రవాణాశాఖ అధికారులు తిరుపతి మంగళం: టీడీపీ మినీ మహానాడు రవాణాశాఖకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వాహనాలను మినీ మహానాడు సభలకు పంపించాలంటూ కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు రవాణాశాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రుల కాన్వాయ్లకు ఏర్పాటు చేసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీ మినీ మహానాడు సభలకు వాహనాలను పెట్టమని యజమానులను అడిగేందుకు రవాణాశాఖ జంకుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక రవాణాశాఖ అధికారులు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. రుణాలకు తొలి ప్రాధాన్యం తిరుపతి అర్బన్: రైతులతోపాటు పేదలందరికీ బ్యాంక్ రుణాల విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాసకుమార్, తిరుపతి రీజనల్ మేనేజర్ సోమంచి శర్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలెక్టర్తోపాటు జేసీ శుభం బన్సల్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎక్కువ మందికి బ్యాంక్ రుణాలు ఇప్పించేలా కృషి చేయాలని సూచించారు. -
టీటీడీ అటానమస్ కళాశాలల డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అటానమస్ కళాశాలలో డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలను సోమవారం ఎస్పీడబ్లూ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్రెడ్డి విడుదల చేశారు. వారు మాట్లాడుతూ, గత నెల 28 నుంచి మే 7వ తేదీ వరకు అటానమస్ హోదాలో నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను 20రోజులలోపే విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు కళాశాలల అధికారిక వెబ్సైట్లో, కళాశాల నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్వీ ఆర్ట్స్, ఎస్పీడబ్ల్యూ కళాశాలల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో ఫలితాలను మరో నాలుగు రోజులలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
వృత్తి తెలుసుకోవాలి
మా అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి పాస్ అయ్యాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేర్పిస్తున్నాం. మాది లాండ్రీ షాపు. నేటి పిల్లలు తమ తల్లిదండ్రులు ఎలా సంపాదించి వారిని చదివిస్తున్నారో అర్థం చేసుకోవడం లేదు. కనీసంకులవృత్తిపైనా అవగాహన ఉండడం లేదు. అందుకే వేసవి సెలవులు కాబట్టి మా అబ్బాయిని షాపు దగ్గరకు తీసుకువస్తున్నా. మా వృత్తిపై అవగాహన కల్పిస్తున్నా. కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల పిల్లలు మరింత కసితో ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగం సాధించేందుకు అవకాశముంటుంది. – విద్యార్థి కార్తీక్తో తండ్రి నరసింహులు, లాండ్రీ షాపు, తిరుపతి -
● వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న తల్లిదండ్రులు ● డబ్బు విలువ తెలిసేలా జాగ్రత్తలు ● కుల వృత్తులపై అవగాహన కల్పించేలా చర్యలు ● కష్టం తెలుసుకుని ఉన్నతంగా ఎదిగితే చాలంటున్న పేరెంట్స్
పిల్లలకు తెలియాలి మాది చిత్తూరు జిల్లా పూతలపట్టు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. రోజూ తిరుపతికి వచ్చి తాటిముంజెలు అమ్ముతుంటా. మా అబ్బాయి 8వ తరగతి పూర్తి చేసుకుని 9లోకి వెళుతున్నాడు. వచ్చేనెల పాఠశాల ప్రారంభం అవుతుంది. ఫీజు కట్టాలి.. పుస్తకాలు.. దుస్తులు కొనాలి. ఇందుకోసం నేను ఏం చేస్తున్నానో నా బిడ్డకు తెలియాలి. డబ్బు ఎలా వస్తుంది..అనే విషయం పిల్లలకు తప్పకుండా తెలియాలి. వేసవి సెలవులలో ఇంటి దగ్గర వదిలేస్తే విచ్చలవిడిగా తిరుగుతుంటారు. అందుకే ప్రతి రోజూ నాతోపాటు తీసుకువస్తున్నా. తాటి ముంజెలు అమ్మడంలో నా కష్టాన్ని నేరుగా చూస్తున్నాడు. భవిష్యత్లో మానాన్న లాగా కష్టపడకూడదు అనుకోవాలి.. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలనే కోరిక కలగాలి. – విద్యార్థి జీవన్ కుమార్తో తండ్రి మధు, తాటి ముంజెల వ్యాపారి -
ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, శ్రీపద్మావతి కళాశాల్లోని పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్, జిల్లా ప్రతేక అధికారి కోన శశిధర్, జాయింట్ సెక్రటరీ ఎస్జీ అజ్మీరా, డీఆర్ఓ నర సింహులుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లా డుతూ మొత్తం ఉదయం నిర్వహించిన పరీక్షకు 5,261 మందికి గాను 2,941 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 2,320 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,261 మందికి గాను 2,929 మంది హజరైనట్లు తెలిపారు. 2,332 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అభ్యర్థులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. ముగిసిన లాసెట్ దరఖాస్తుల గడువు తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాసెట్–2025 ప్రవేశ పరీక్షకు అపరాధ రుసుముతో దరఖాస్తుల గుడువు ఆదివారంతో ముగిసింది. వచ్చే నెల 5వ తేదీన జరగనున్న లాసెట్ పరీక్షకు 27,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్న్లైన్లో హాల్టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు భయపెడుతున్న బయో వేస్ట్ తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన బయో మెడికల్ వేస్ట్ భయపెడుతోంది. ఐడీహెచ్ వార్డు వెనుక టన్నుల కొద్దీ బయో మెడికల్ వేస్ట్ను డంపింగ్ చేశారు. ప్రతిరోజూ తరలించాల్సిన వేస్ట్ను ఆరు నెలలుగా తొలగించలేదు. దీనికితోడు చెత్తాచెదారాలను సైతం అందులోనే పడేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాలకు తడిచిన వ్యర్థాల నుంచి విషపూరిత రసాయనాలు భూమిలోకి ఇంకుతున్నాయి. ఈ క్రమంలో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదముంది. దీనిపై నిపుణులు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారులు స్పందించి బయోవేస్ట్ను వెంటనే తొలగించాల్సిన అవసరముంది. -
కుంకీలతో భీ‘కరి’ కట్టడి
తిరుపతి మంగళం : అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వస్తున్న మద గజాలను కుంకీ ఏనుగులతో కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని ఎలిఫెంట్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పలమనేరులోని క్యాంపుతో పాటు జూ పార్కును కూడా కుంకి ఏనుగుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గజ దాడులలో ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా, పంట పొలాలు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే జూ పార్క్ లోని వన్యప్రాణుల స్థావరంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. అనంతరం జంతువుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జూలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంవలో తిరుపతి సీఎఫ్ సెల్వం, అనంతపురం సీఎఫ్ యశోదాబాయి పాల్గొన్నారు. -
కష్టం తెలుసుకోవాలనే..
మా అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి. నేను పండ్ల వ్యాపారం చేస్తుంటా. వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబ పోషణతోపాటు పిల్లలను చదివిస్తున్నా. నేను రూపాయిని ఎలా సంపాదిస్తున్నానో, ఫీజు ఎలా కడుతున్నానో, చేతిఖర్చులకు డబ్బు ఎలా ఇస్తున్నానో పిల్లలకు తెలియాలి. అందుకే ప్రతిరోజు మా అబ్బాయిని వెంట తీసుకుని వస్తున్నా. వేసవి సెలవులలో ఇంటి దగ్గర ఉంటూ సెల్ఫోన్ పట్టుకోవడం, స్నేహితులతో తిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. దీనికి అడ్డుకట్టవేసి తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారు కొంతమేర అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. మా కష్టాన్ని చూసి బాగా చదువుకుంటాడనే మా ఆశ. – విద్యార్థి చైతన్యతో తండ్రి టి.భానుప్రకాష్, పండ్ల వ్యాపారి, తిరుపతి -
● మట్టి.. కొల్లగొట్టి
రావిగుంట చెరువులో యంత్రాలతో తవ్వకాలు భారీ టిప్పర్లతో రవాణాచిట్టమూరు మండలంలోని రావిగుంట చెరువును కూటమి నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేసి.. టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాకపోకలకు తెలుగుగంగ 7వ బ్రాంచ్ కెనాల్ను సైతం ధ్వసం చేసి రోడ్డు వేసేసుకున్నారు. దీనిపై తహసీల్దార్ను ప్రశ్నిస్తే.. తాము ఎవరికీ అనుమతుల ఇవ్వలేదని తేల్చేస్తున్నారు. – నాయుడుపేట టౌన్/ చిట్టమూరు -
● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్ పేరుతో నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
తిరుపతి అర్బన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విశేష సేవలందించాయి. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే)గా మార్చేసింది. అయితే సేవలను మాత్రం రైతులకు పూర్తిగా దూరం చేసేసింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిందనే కారణంతోనే ఆయా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయితీ విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయకుండా వేధిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 442 రైతు సేవాకేంద్రాల్లో కేవలం 340 మంది మాత్రమే అగ్రికల్చర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని వాపోతున్నారు. దీంతో భూసార పరీక్షలు సక్రమంగా చేసే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. అలాగే సాగులో వినూత్న విధానాలపై సలహాలు అందించేవారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు 55శాతం ఆర్బీకేలకు సొంత భవనాలు నిర్మించారని, అయితే కూటమి పాలనలో మాత్రం పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయంగా రూ.20వేల చొప్పున అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రైతు సేవాకేంద్రాలను సైతం తమకు దూరం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. క్లస్టర్ల కింద రేషనలైజేషన్ పేరుతో ఆర్ఎస్కేలను తగ్గించి సేవలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాజకీయాలు మానుకోవాలి
రైతు సేవా కేంద్రాల నిర్వహణపై కూటమి ప్రభుత్వం రాజకీయాలు మానుకోవాలి. రైతులకు ప్రయోజనం చేకూర్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. క్లస్టర్ల కింద వాటిని మరింత తగ్గించాలని యత్నించడం అన్యాయం. వెంటనే ఇలాంటి నిర్ణయాలను ఉపసంహరించుకుంటే మంచిది. – వెంకటేష్, రైతు మంచిది కాదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కారించాలనే ఉద్దేశంతో ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని కుదించాలనుకోవడం మంచిది కాదు. గతంలో మాదిరిగానే ఆర్ఎస్కేల నుంచి విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను అందించాలి. లేకుంటే రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శేఖర్, రైతు ఇబ్బందులు తప్పవు రైతు సేవా కేంద్రాలు ఉపయోగకరం. గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రతి గ్రామంలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకవచ్చింది.తాజాగా కూటమి ప్రభు త్వం క్లస్టర్ల పేరుతో నాలుగు నుంచి ఐదుకేంద్రాలను ఒక్కటిగా చేయడం సరికాదు. దాంతో ఐదు గ్రామాల వారు ఒకే చోటుకు వెళ్లాల్సివస్తుంది. దీంతో ఇబ్బందులు తప్పవు. – నరేంద్రయాదవ్, రైతు -
తల్లిదండ్రులను అభినందించాలి
చిన్ననాటి నుంచి పిల్లలకు కష్టం విలువ తెలియజేయాలి. కొందరు ఎంత డబ్బులు అడిగితే అంత చేతికి అందించి పెడదోవ పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రూపాయిని ఎలా సంపాదిస్తున్నారనే విషయాన్ని చిన్ననాటి నుంచే పిల్లలకు ప్రత్యక్షంగా తెలియజేస్తే మంచిది. కొందరు తల్లిదండ్రులు సెలవులలో వారి బిడ్డలను వెంట తీసుకుని బతుకు విలువ నేర్పిస్తున్నారు. వారిని తప్పనిసరిగా అభినందించాలి. వారి పిల్లల జీవితాలను మార్చేందుకు ఇదే తొలిమెట్టుగా చెప్పవచ్చు. – లక్ష్మీదేవమ్మ, విశ్రాంత ఉపాధ్యాయిని, తిరుపతి బాధ్యత తప్పనిసరి ఆధునికత పేరుతో చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లు, బెట్టింగ్ గేమ్స్, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పేరెంట్స్పై తిరగబడుతున్నారు. చదువును పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి యువతను గట్టెక్కించాలంటే ముందుగా తల్లిదండ్రులకు బాధ్యత తప్పనిసరి. చిన్ననాటి నుంచే కుటుంబ పరిస్థితితోపాటు కష్టం విలువ తెలియజేయాలి. గొప్పలకు పోకుండా బిడ్డలకు పైసా రాకపోకలపై అవగాహన కల్పించాలి. – మునిరామయ్య, విశ్రాంత ప్రభుత్వోద్యోగి, తిరుపతి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని గరుడ వారధిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన నాగేంద్ర(30) బైక్పై తిరుచానూరు నుంచి తిరుపతికి గరుడ వారధిపై వెళుతూ అదుపుతప్పి రైలింగ్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఇద్దరికి గాయాలు తిరుపతి రూరల్ : పూతలపుట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లె చెక్ పోస్టు సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట నుంచి తిరుపతికి టమాటాలు తీసుకుని వస్తున్న లగేజీ ఆటోను వెనుక నుంచి వచ్చిన టయోటా వాహనం ఢీకొంది. దీంతో టమాటా వాహనం రహదారి పక్కన గోతిలో పడింది. డ్రైవర్ రాజు, వెనుక కూర్చున్న కూలీ అంబికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ప్రమాదానికి కారణమైన టయోటా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబిక తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు తిరుపతి రూరల్ ఎస్ఐ షేక్షావలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన అంబిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ఎస్వీయూలో వసతులు లేక వెతలు!
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నామని వర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనిపపై వర్సిటీ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం మరోసారి వర్సిటీ ఇంజినీర్ను మౌలిక వసతుల కల్పనపై నిలదీయనున్నట్లు సమాచారం. పరిపాలన భవనంలో సదుపాయాలపై వీసీ, రిజిస్ట్రార్తో చర్చించినా అడుగు ముందుకు పడటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం ఫర్నిచర్తో ఇక్కట్లు పరిపాలన భవనంలోని ప్రధాన సెక్షన్లలో బెంచీలు, కుర్చీలు,, బీరువాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎగ్జామినేషన్ సెక్షన్లో పరిస్థితి దారుణంగా తయారైందని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ విభాగంలో నూతన ఫర్నిచర్ను అమర్చేందుకు తీసుకువచ్చిన సామగ్రి పూర్తిగా నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో వర్సిటీకి తెచ్చిన ఫర్నిచర్పై రెండు ఫైళ్లు పెట్టగానే వంగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. తాగునీరు కూడా లేదు ఎస్వీయూ పరిపాలన భవనంలో తాగునీరు కూడా అందుబాటులో లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్ఓ ప్లాంట్ వద్ద అపరిశుభ్రంగా ఉంటోందని వెల్లడిస్తున్నారు. దీంతో ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలియజేస్తున్నారు. వర్సిటీలో టాయిలెట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని వివరిస్తున్నారు. నిలదీయనున్న ఉద్యోగులు పరిపాలనా భవనంలో నాసిరకం ఫర్నిచర్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై వర్సిటీ ఇంజినీర్ను నిలదీయాలని ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. -
పేదల సేవకే ప్రాధాన్యం
తిరుపతి అర్బన్ : పేదల సేవకే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. రుయా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్, ఎక్విప్మెంట్పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన వస్తువులు, పరికరాలను తీసుకురావడంతో బాధ్యత తీరిపోయినట్లు కాదని, వాటిని పేదల కోసం సక్రమంగా వినియోగించినప్పుడే విజయవంతమైనట్లు భావించాలని సూచించారు. రుయా ఆస్పత్రికి ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. సిటీ డయాగ్నొస్టిర్ సెంటర్లో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నిత్యం వచ్చే రోగులకు అవసరం అయిన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రుయా సూపరింటెండెంట్ రాధ, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రవి ప్రభు పాల్గొన్నారు. యోగాంధ్ర నిర్వహణకు పటిష్ట చర్యలు తిరుపతి అర్బన్: యోగాంధ్ర నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే థీమ్ స్ఫూర్తితో జూన్ 21 వరకు యోగ మాసంగా పరిగణించాలన్నారు. ఆ మేరకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. -
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్థన్రాజు, యూపీఎస్సీ అబ్జర్వర్ హన్సవదన, సంయుక్త కార్యదర్శి ఎన్జీ అజ్మీరతో కలసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 12 ప్రభుత్వ కళాశాలలు, ఒక ప్రైవేటు కళాశాలను సెంటర్గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మొత్తం 5261 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకారనున్నట్లు వివరించారు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ను ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశౠరు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఇంటర్నెట్, జిరాక్స్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వాచ్లు, పరికరాలను తీసుకెళ్లకూడదని కోరారు. అభ్యర్థుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే పరీక్షలకు సంబంధించి భద్రతా అంశాలపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ చరణ్ తేజ్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డ్వామా ిపీడీ శ్రీనివాస రావు, డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, విద్యుత్శాఖ అధికారి సురేంద్ర నాయుడు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారిరి లక్ష్మి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకట్రావ్ పాల్గొన్నారు. -
కాపునాడు ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా రాధ
తిరుపతి కల్చరల్ : కాపునాడు సే వా సమితి ఉమ్మడి చిత్తూరు జి ల్లా మహిళా విభాగం అధ్యక్షు లుగా దామా రాధా నియమితు లయ్యారు. శుక్రవారం ఈమేర కు సమితి జిల్లా అధ్యక్షుడు మధురాయల్ ఆధ్వర్యంలో పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. హరిప్రసాద్ మట్లాడుతూ 200 మంది మహిళలతో కాపునాడు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధికార ప్రతినిధి తుపాకుల మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ జ్ఞాన చంద్ర, పగడాల సునీల్ రాయల్ పాల్గొన్నారు. కోదండరామునికి ‘కియోస్క్’ బహూకరణ తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. ఈ క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియా బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించారు. కియోస్క్ మిషన్లను తిరుమల అన్నదానం, పద్మావతి గెస్ట్ హౌస్, సీఆర్ఓ ఆఫీస్, దేవుని కడప, శ్రీగోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటి మిట్ట, పద్మావతీదేవి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడలో టీటీడీ వినియోగిస్తోంది. బ్యాంక్ ప్రతినిధులు ఏవీ నిరంజన్, ఆర్.వెంకటరావు, డి.అశోక్ వర్ధన్, ఆలయ డిప్యూటీ ఈఓ బి.నాగరత్న, ఐటీ డీజీఎం బి.వెంకటేశ్వర్లు ,ఏఈఓ బి.రవి, సూపరింటెండెంట్ డి.మునిశంకర్ పాల్గొన్నారు. వైన్షాపులపై నిరంతరం నిఘా తిరుపతి క్రైమ్ : జిల్లాలోని వైన్షాపులపై నిరంతరం నిఘా ఉంటుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 11 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 250 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది బృందాలు ఏర్పడి కేటాయించిన ప్రాంతాల్లోని వైన్షాపులపై నిఘా పెడతారని వెల్లడించారు. దుకాణాలు తెరిచే సమయం, మూసే వేళలను గమనిస్తారని చెప్పారు. అలాగే వైన్షాపుల పక్కన అనధికా పర్మిట్రూమ్లను అరికట్టేందుకు కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాల యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
తిరుమలలో టీటీడీ ఈఓ తనిఖీలు
తిరుమల : తిరుమలలోని పలు ప్రాంతాలను టీటీడీ ఈఓ శ్యామలారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిలా తోరణం, చక్ర తీర్థంలో చక్రత్తాళ్వార్, నరసింహస్వామి, ఆంజనేయస్వామి ప్రతిమలతోపాటు ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత, పార్కింగ్ను పరిశీలించారు. పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. అదనపు ఈఓ పరిశీలన తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున క్యూలను తనిఖీ చేశారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదం. పాలు, తాగునీరు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ ఈఓ (హెల్త్) సోమన్ నారాయణ పాల్గొన్నారు. -
తిరుచ్చిపై సిరులతల్లి విహారం
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి శ్రీకృష్ణ ముఖమండపం వద్ద స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అలంకార మండపంలో విద్యుత్కాంతుల నడుమ ఊంజల్ సేవ చేశారు. సర్వాలంకార భూషితురాలైన పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చి వాహనంపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్కు రూ.17 లక్షల విరాళం తిరుమల : శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ రూ.17 లక్షల విరాళం శుక్రవారం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీ డీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి డీ డీని అందజేశారు. ఈ నగదును మాతృశ్రీ తరి గొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకు ఒక పూట మధ్యాహ్నం భోజనం వ డ్డించేందుకు వినియోగించాలని దాత కోరారు. 28న ఎస్వీయూ క్యాంటీన్కు టెండర్ నోటిఫికేషన్ తిరుపతి సిటీ : ఎస్వీయూ క్యాంటీన్కు ఈనెల 28వ తేదీన టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాంటిన్ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు వీసీ ఆధ్వర్యంలో సమావేశమైన క్యాంటిన్ కమిటీ గతంలో ఇచ్చిన టెండర్ను రద్దు చేసింది. ప్రస్తుతం క్యాంటీన్ను నిర్వహిస్తున్న జయచంద్రనాయుడు అత్యల్పంగా టెండర్ కోట్ చేయడంతో ఆయనను వచ్చే టెండర్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా అనర్హుడిగా ప్రకటించింది. క్యాంటిన్ నిర్వహణపై ఆసక్తిగలవారు 28 నుంచి 15 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 31 నుంచి పోస్టల్ ఖాతాలకు ప్రత్యేక శిబిరాలు తిరుపతి సిటీ : పోస్టాఫీసులో సేవింగ్ ఖాతాలు తెరుచుకునేందుకు ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ బి.నరసప్ప తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల్లో పోస్ట్ సేవింగ్ ఖాతాలను తెరవడం, ఇప్పటికే ఉన్న ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న 11,599 ఖాతాలను 465 పోస్టాఫీసుల ద్వారా పునరుద్ధరణ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా ఈ ఖాతాలు ఉపయోగపడతాయని చెప్పారు. సాధారణ రోజులలో సైతం పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాలు తెరుచుకోవచ్చని తెలిపారు. 18ఏళ్లు నిండిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్వీయూలో ఫారెస్ట్ అధికారుల తనిఖీ తిరుపతి సిటీ: ఎస్వీయూలో రోడ్డు పక్కన ఉన్న శ్రీగంధం వృక్షం ఇటీవల అపహరణకు గురికావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని సుమోటాగా తీసుకుని శుక్రవారం వర్సిటీలోని శ్రీవారి ఆలయం ఎదుట దుండగులు నరికివేసి అపహరించిన శ్రీగంధం మొదలును పరిశీలించారు. అలాగే వర్సిటీలో శ్రీగంధం, ఎర్రచందనం చెట్ల వివరాలను సేకరించారు. అపహరణకు గురైన మొక్కల వివరాల నివేధికను సంబంధిత ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో వర్సిటీలో సుమారు పది రకాల చెట్లు మాయమైనట్టు వర్సిటీలో చర్చ సాగుతోంది. -
పడకేసిన పారిశుద్ధ్యం
రుయా ఆస్పత్రిలో ఉన్నవే రెండు ఆర్ఓ ప్లాంట్లు. వాటి పరిసరాలను చూస్తే దాహం తీర్చుకోవాలనే ఆలోచనే విరమించుకోవాల్సి వస్తోంది. ఆ ప్లాంట్ల వద్ద పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. అసలు ప్లాంట్లను శుభ్రం చేస్తారో.. లేదో తెలియదు కానీ, అక్కడి వాతావరణం చూస్తే మాత్రం దారుణంగా ఉంటుంది. కొన్ని కొళాయిలు విరిగిపోయాయి. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. నీరు పట్టుకునే ప్రాంతంలో పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాంట్ చుట్టుపక్కల చెత్తాచెదారం పేరుకుపోయింది. పేరుకేమో పరిశుద్ధ జలం.. పరిసరాలు మాత్రం అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాంటి నీటిని తాగితే రోగాలను నయం చేసుకునేందకు వచ్చిన వారు సైతం సరికొత్త వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. దీంతో పలువురు బయట నుంచి వాటర్ బ్యాటిళ్లను కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. -
ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదన
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళం డిపోకు చెందిన ఈయూ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ, అరియర్స్, డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 10వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని...అయినా వాటిని భర్తీ చేయడం లేదన్నారు. దీంతో ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని వెల్లడించారు. అద్దె బస్సులను తీసుకోవడంతోనే కాలయాపన చేస్తున్నారని, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఈయూ నేతలు రెడ్డెప్ప, వీఆర్ కుమార్, అర్జున్, సతీష్నాయుడు, మురగమ్మ, మస్తాన్, సత్యనారాయణ, గురున్నాథం, సుభ్రమణ్యం, రఘు, మధు, శేషాద్రి పాల్గొన్నారు. నూతన కమిటీ ఏర్పాటు మంగళం డిపో ఈయూ కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బి.శేషాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేఎస్ వాసు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్లుగా ఎంఎస్ రెడ్డి, ఎం.మోహన్ నాయుడు, డిపో సెక్రటరీ టీవీ బాబు, జాయింట్ సెక్రటరీ చిరంజీవి, ప్రచార కార్యదర్శి బి.బాలాజీ, ట్రెజర్ విశ్వనాధ్, అసిస్టెంట్ సెక్రటరీగా రేఖా మరో ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ముగ్గురు అసిస్టెంట్ సెక్రటరీలతో కమిటీని ఎంపిక చేశారు. -
బదిలీలు.. బెదిరింపులు!
తిరుపతి అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు బ దిలీల గుబులు పట్టుకుంది. ట్రాన్స్ఫర్ కోసం దరఖా స్తు చేసుకోవాలని కూటమి నేతలు బెదిరిస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. బదిలీ కోరకుంటే సస్పెండ్ చేయిస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నట్లు పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో చేసేదిలేక ప్రధానంగా రెవెన్యూ, అగ్రిక ల్చర్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కొందరు బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో 15 విభాగాల చెందిన వారికి మాత్రమే బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అన్ని విభాగాల్లోనూ ట్రాన్స్ఫర్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలకమైన అన్ని పోస్టుల్లో ను ఒకే సామాజిక వర్గానికి చెందినవారినే కూర్చోబెట్టనున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మనోడై ఉండాల్సిందే! మన ప్రాంతానికి వచ్చే రెవెన్యూ అధికారి మనోడై ఉండాల్సిందే అని జిల్లాలోని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే చెప్పిన మాట వినే వారికే కీలక పోస్టులు ఇప్పించాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతితోపాటు శ్రీకాళహస్తి, చంద్రగిరి, వెంకటగిరి,సూళ్లూరుపేట, గూడూరులోని ప్రజా ప్రతినిధులు తమ వారిని తెచ్చుకునేందుకు గట్టిగానే పనిచేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో తూర్పు మండలాల్లో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అయితే కూటమి నేతలకు రూ.కోట్ల ముడపులు చెల్లించి తిరుపతిలో కీలకమైన రెవెన్యూ పోస్టును సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సదరు అధికారులు సైతం ‘‘అవును తిరుపతికి వచ్చేస్తున్నాం. కేవలం వారం రోజులు ఆగండి...ఆ తర్వాత అంతా కలసి చేసుకుందాం. ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రజా ప్రతినిధులకు ఇచ్చుకోవాల్సి వచ్చింది. దానికి రెండు మూడు రెట్లు సంపాదించుకుందాం’’ అంటూ పలువురు సిబ్బందితో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు ‘‘ఔను...బదిలీల ప్రచారం వాస్తవమే నేను కూడా వెళ్లిపోతున్నా.. కూటమి నేతలు చెప్పిందల్లా నేను చేయలేను...బదిలీనే మేలని భావిస్తున్నా.. అసలే ప్రమోషన్ జాబితాలో ఉన్నాం.. వాళ్ల అవినీతికి వంతపాడితే ఇరుక్కుంటా’’ అని తమ వద్దకు వచ్చే వారితో చెబుతున్నట్లు తెలిసింది. అదనపు మార్గదర్శకాలు బదిలీలకు సంబందించి తాజాగా పంచాయతీరాజ్శాఖకు అదనపు మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. ప్రధానంగా కార్యదర్శలు 50శాతం కంటే తక్కువ పన్నులు వసూలు చేసి ఉంటే వారిని నాన్ ఫోకల్ పంచాయతీలకు (ఆదాయవనరులు తక్కువ ఉండేవి)బదిలీ చేయాలని పేర్కొన్నారు., ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసినవారితోపాటు డిప్యూటీలో సర్వీస్ ఉన్నప్పటికీ ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించారు. కింది స్థాయి ఉద్యోగులు సొంత మండలం, డివిజన్ స్థాయివారు సొంత డివిజన్లోను , జిల్లా స్థాయి ఉద్యోగులు సొంత జిల్లాలోను పనిచేయకూడదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే విజిలెన్స్ కేసులు, తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్న పంచాయతీ కార్యదర్శలను అదే గ్రేడ్లోని నాన్ ఫోకల్ గ్రామ పంచాయితీకి బదిలీ చేయాలని ఆదేశించారు. ఆందోళనలో ఉద్యోగులు ట్రాన్స్ఫర్కు దరఖాస్తు చేసుకోవాలని పలువురిపై ఒత్తిడి చక్రం తిప్పుతున్న కూటమి నేతలు మాట వినే వారికే కీలక పోస్టులు సిఫార్సుల జోరు కీలకమైన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ము డుపులు చెల్లించుకుని బదిలీలకు సన్నద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. అయితే కింది స్థాయికి చెందిన ఉ ద్యోగులు మాత్రం కూటమి నేతల నుంచి సిఫార్సు లెటర్లు తెస్తున్నట్లు సమాచారం, చిరుద్యోగుల నుంచి సీనియర్ అసిస్టెంట్ల వరకు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే బదిలీలు చేపడుతున్నారు. గెజిటెడ్ స్థాయి నుంచి డివిజన్, జిల్లా స్థాయి అధికారులను జోన్– 4 పరిధిలో ట్రాన్స్ఫర్ చేయనున్నారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వై ఎస్సార్ కడప జిల్లాలు వస్తాయి. ఈ క్రమంలో అధికారులు వారికి అనుకూలమైన జిల్లాను ఎంపిక చే సుకుంటున్నారు. మొత్తంగా బదిలీల జాబితాలోని ఉద్యోగులకు జూన్ 2 వరకు టెన్షన్ తప్పేలా లేదు. అర్హుతే ప్రామాణికంగా తీసుకుని బదిలీ చేస్తారా.. లేదా కూటమి నేతల లేఖలకే ప్రాధాన్యత ఇస్తారా వేచి చూడాల్సిందే. వ్యవసాయశాఖలోనూ అదే పరిస్థితి ప్రస్తుతం వ్యవసాయశాఖతోపాటు వాటి అనుబంధశాఖల్లో బదిలీలు చేపట్టనున్నారు. ప్రధానంగా బదిలీ చేయడానికి ఐదేళ్లు సర్వీస్ పూర్తయ్యి ఉండాలి. లేదా వారే వెళ్లిపోవాలంటే కనీసం రెండేళ్లు సర్వీస్ ఉంటేనే బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఉద్యోగ విరమణ ఉంటే వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మూడు అంశాలను బదిలీల సమయంలో పాటించాలి. అయితే కూటమి నేతలు తెలివిగా రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని బలవంతంగా బదిలీ పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది . లేదంటే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో అధికారులు సస్పెండ్ కావడం కన్నా బదిలీపై వెళ్లడమే ఉత్తమంగా భావిస్తున్నారు. -
రుయాలో కోవిడ్ వార్డు
తిరుపతి తుడా : కరోన మహమ్మారి మరోసారి విస్తరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పొరుగు దేశాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉండడంతో సర్కారు మార్గదర్శకాలను విడుదల చే సింది. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ ఏర్పాటు చేయా లని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ శుక్రవారం వి భాగాధిపతులతో సమావేశమయ్యారు. కోవిడ్ నిర్ధార ణ పరీక్షలకు రాపిడ్ కిట్లు కొనుగోలు చేయాలని అలానే ఐసోలేషన్ వార్డుకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కేటాయింపులపై ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా 20 పడకలు కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రుయా ఆస్పత్రిలో 20 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. 20 పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తగు జాగ్రత్తలతో కూడిన కౌంటర్ సిద్ధం చేస్తున్నారు. శనివారం నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంటాయని రుయా సూపరింటెండెంట్ రాధ తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు అధికంగా ఉన్న వారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.మార్గదర్శకాలు పాటించాలి కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
నడి రోడ్డుపై మందుబాబు హల్చల్
– సిట్టింగ్ రూములు లేవని నిరసన శ్రీకాళహస్తి: మందు తాగడానికి సరైన సిట్టింగ్ రూము లు లేవంటూ ఓ మందుబాబు నడిరోడ్డుపై మద్యం సే విస్తూ హల్చల్ చేసిన ఘటన శ్రీకాళహస్తి ఆర్టీసీ బ స్టాండ్ సర్కిల్లో శుక్రవారం చోటు చేసుకుంది. కూట మి ప్రభుత్వం వచ్చాక మద్యం షాపుల యజమానులు కుమ్మకై ్క పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి, తినుబండారాలు, ఇతర వస్తువుల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని, వీటన్నింటినీ కట్టడి చేయకుంటే మళ్లీ పుల్ బాటిల్తో స్థానికంగానే తాగుతూ నిరసన వ్యక్తం చేస్తానని సదరు మందుబాబు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అటువైపు వెళ్లే ప్రయాణికులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. దీనిపై రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా అతనిపై కేసు నమోదు చేశామని, మత్తులో ఉండడం వల్ల అతనిపై పబ్లిక్ న్యూసెన్స్, ఓపెన్ బూజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. మత్తు దిగిన తరువాత కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
ఐపీఎల్ తరహాలో సీపీఎల్
● జాతీయ స్థాయిలో ఆడేందుకు పునాది కావాలి ● పోటీలను ప్రారంభించిన కమిషనర్ మౌర్య తిరుపతి ఎడ్యుకేషన్ : ఐపీఎల్ తరహాలో చిత్తూరు ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వహించడం అభినందనీయమని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహిస్తున్న సీపీఎల్ సీజన్–1 క్రికెట్ పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడేందుకు సీపీఎల్ పునాది కావాలని కోరారు. ఏపీఎల్, ఐపీఎల్లో ఆడేందుకు సీపీఎల్ చక్కని వేదికని, ఆ మేరకు క్రికెటర్లు లక్ష్యం నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. సీడీసీఏ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ తగినంత అవకాశాలు, ప్రోత్సాహం లేకపోవడంతో యువత క్రికెట్లో రాణించలేకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సీపీఎల్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అండర్–16 మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, కాంట్రాక్టర్ హేమంత్కుమార్రెడ్డి, ఎడిఫై డైరెక్టర్ ప్రణీత్, మారుతీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మారుతీ కృష్ణ, సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, శ్రీనివాసమూర్తి, మురళీ యాదవ్, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్ పాల్గొన్నారు. ఆదిత్య, పాయ్ వైస్రాయ్ జట్లు విజయం సీపీఎల్ సీజన్–1 క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. తొలిరోజు ఆదిత్య, పాయ్ వైస్రాయ్ జట్లు విజయం సాధించాయి. ముందుగా ఆదిత్య జట్టు, హైపీరియన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆదిత్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. రంజీ ప్లేయర్ అభిషేక్ రెడ్డి 50 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. బౌలింగ్లో డానియల్ దాస్ 3 వికెట్లు సాధించాడు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైపీరియన్ జట్టు 16.4ఓవర్లలో 132 పరుగులకు అలౌట్ కావడంతో ఆదిత్య జట్టు 41పరుగుల తేడాతో గెలుపొందింది. ఆదిత్య జట్టు బౌలర్ అనిల్కుమార్ 3 వికెట్లు సాధించాడు. 80 పరుగులు చేసిన అభిషేక్రెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మధ్యాహ్నం పాయ్ వైస్రాయ్, రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాయ్ వైస్రాయ్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. వాహీద్ బాషా 20 బంతుల్లో 40 పరుగులు, ధరణికుమార్ 22 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు. బౌలింగ్లో ప్రవీణ్రాజ్, దీపక్ సాయి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్టు 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 116 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాయ్ వైస్రాయ్ జట్టు 40పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన సూర్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద పాయ్ వైస్రాయ్ హోటల్ మదన్మోహన్ రూ.2,500 నగదు బహుమతి అందించారు. నేడు తలపడే జట్లు సీపీఎల్ సీజన్–1 పోటీల్లో భాగంగా శనివారం ఉదయం ఆదిత్య లెవెన్స్, రాయల్ చాలెంజ్ తిరుచానూరు జట్లు తలపడనున్నాయి.అలాగే మధ్యాహ్నం హైపీరియన్, స్పార్టన్ వారియర్స్ జట్లు బరిలో దిగనున్నాయి. -
రాజీనామా చేసి పోటీ పడదాం
● మరోసారి గెలిచి చూపిస్తాం ● ఎమ్మెల్యే నానికి తిరుపతి రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీల సవాల్ తిరుపతి రూరల్ : ‘‘అయ్యా.. నానీగారు మా పదవులకు మేం రాజీనామా చేస్తాం.. మీరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి.. నిజాయితీపరులైన మా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో మేం ఎంపీపీగా, వైస్ ఎంపీపీలుగా గెలిచాం.. మీ దయతో కాదు.. మీరు గేట్లు తెరవండి.. మరోసారి మేమే గెలిచి చూపిస్తాం.. రాజీనామా తర్వాత ఎన్నికలకు పోదాం.. మీరు అన్నట్టు మీ పార్టీ వారు గెలిస్తే కీలకమైన మూడు పదవులు మీకు వస్తాయి.. మేమే గెలిచామా..? మీరు మీ ఎమ్మెల్యే పదవిని వదిలేయాలి.. మా సవాల్ను మీరు స్వీకరిస్తే తిరుపతి ప్రెస్క్లబ్ వేదికగా అందరం రాజీనామాలు చేద్దాం’’ అంటూ తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు వేముల యశోద, విడుదల మాధవరెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మాట్లాడుతూ తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నికల్లో మేం గేట్లు తెరచుంటే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులందరూ మా దగ్గరకు వచ్చేవారని వ్యాఖ్యానించడంపై ఎంపీపీ, వైస్ ఎంపీపీలు మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ తాము నిజాయతీగా తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో విజయం సాధించామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే, ఎమ్మెల్యే పులివర్తి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి పనులకు పది రూపాయలు కూడా ఇవ్వలేదని, అయితే ఎమ్మెల్యే నాని మాత్రం చెవిరెడ్డి చేసిన అభివృద్ధి కనిపించకుండా రంగులు పూసి హంగామా చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి తీసుకువచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులనే ఇప్పుడు నాని ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. మండల పరిషత్ కమిటీ దయతో జరిగే అభివృద్ధిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గ్రామాల్లోకి వెళుతున్నారని స్పష్టం చేశారు. మ సవాల్ను ఎమ్మెల్యే నాని స్వీకరించి రాజీనామాకు ముందుకు వస్తే తిరుపతి ప్రెస్క్లబ్ వేదికగా తమ పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నియాదవ్, పేరూరు సర్పంచ్ దామినేటి కేశవులు పాల్గొన్నారు. -
లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని తీర్మానం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : మంత్రి నారా లోకేష్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని తిరుపతిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మినీ మహానాడులో తీర్మానం చేశారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ అద్యక్షతన తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సునీల్ కుమార్, రామకృష్ణ, బొజ్జల సుధీర్రెడ్డి, నెలవల విజయశ్రీ తమ నియోజవర్గాల్లో చేసిన తీర్మానాల అంశాలను వివరించారు. తీర్మాణాల అంశాలను వేదిక దృష్టికి తెచ్చారు. టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య, శాప్ చైర్మన్ రవినాయుడు, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు. -
నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్
తిరుపతి రూరల్ : వినియోగదారుల నమ్మకానికి, గోడల దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంటు నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లెలోని శ్రీసాయితేజ స్టీల్ అండ్ సిమెంట్ అధినేత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాయాపతి మాట్లాడుతూ జర్మన్ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. ట్యాంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం కూడా ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. అనంతరం భారతి సిమెంట్కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంటు తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతిచోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
నాయుడుపేటటౌన్ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఆర్ముగం నగర్కు చెందిన వృద్ధుడు రవికుమార్(65) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతనికి కళ్లు సరిగా కనిపించవు. ఈక్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తి బైపాసు రోడ్డు సమీపంలో కార్తికేయ హోటల్ దగ్గరలో రోడ్డు పక్కన వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు మృతుడి కుమారుడు మేఘవర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రైవేటు బస్సు చోరీ తిరుపతి క్రైమ్: నగరంలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సును దొంగిలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంటకు చెందిన ముస్తఫా గత ఒకటిన్నర నెల నుంచి యూనివర్సల్ బస్సు ట్రాన్స్పోర్టు కార్యాలయంలో మేనేజర్గా పని చేస్తున్నాడు. టీఎన్02బీయూ 1030 నంబరు గల బస్సును ట్రిప్ నుంచి వచ్చాక చింతలచేను రోడ్డులో పార్కింగ్ చేసేవారు. రోజువారీలాగానే డ్రైవర్ శ్రీధర్, క్లీనర్ విజయ్ బస్సును పార్కిగ్ స్థలంలో ఆపి వెళ్లారు. బుధవారం రాత్రి పార్కింగ్ యజమాని ట్రావెల్స్ మేనేజర్ మునిరాజాకు ఫోన్ చేసి మీ బస్సును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పాడు. దీంతో తనతో పాటు సాయిఈశ్వర్ ట్రావెల్స్ యజమాని మునిప్రసాద్, సెల్వకుమార్ చుట్టుపక్కల అంతా వెతికారు. బస్సు కనిపించకపోవడంతో యజమాని రవీంద్రకు తెలియజేశారు. అనంతరం గురువారం ఈస్ట్ స్టేషన్లో బస్సు యజమాని ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, టికెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రేషన్ బియ్యం పక్కదారి పడితే చర్యలు
● జిలా కలెక్టర్ వెంకటేశ్వర్వాకాడు: పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన వాకాడులోని సివిల్ సప్లై గోడౌన్(ఎంఎల్ఎస్ పాయింటు)ను తనిఖీ చేశారు. అనంతరం బియ్యం నాణ్యత, బియ్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బియ్యం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్లోని పలు రికార్డులు పరిశీలించారు. తాను ఇక్కడికి వస్తున్నానని తెలుసుకుని ఎప్పటి నుంచో రాయాల్సిన రికార్డులు రాయకుండా ఇప్పటికిప్పుడు హడావుడిగా ఒకే రకం పెన్తో రికార్డుల్లో రాశారని తెలిపారు. ఈ గోడౌన్పై అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారని.. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగం ఊడుతుందని గోడౌన్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లును హెచ్చరించారు. గత రెండున్నరేళ్లుగా ప్రజలకు అందాల్సిన 7.5 టన్నుల కందిపప్పు అందజేయకుండా ఎందుకు గోడౌన్లో నిల్వ ఉంచారని మందలించారు. ప్రైవేట్ వాహనాల్లో బియ్యం తరలిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకపై ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ దీప, తదితరులు ఉన్నారు. కలెక్టర్కు మొర పెట్టుకున్న రైతులు దొరవారిసత్రం : మండలంలోని లింగంపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం కింద ఆరు ఎరకాల్లో సాగవుతున్న వివిధ రకాల పంటలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం వ్యవసాయధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా పలు గ్రామాల రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా డ్రై యంత్రాలు లేనందున దళారుల చేతుల్లో మోసపోతున్నామని, మండలస్థాయిలో డ్రై యంత్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. నెర్రికాలువ నుంచి లింగంపాడు గ్రామంలోని చెరువులోకి సాగు నీళ్లు సరఫరా చేసే సప్లయ్ చానల్ లాక్లు దెబ్బతినడం, కాలువ పూడిపోవడంతో చెరువులోకి నీళ్లు రావడం లేదన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో నెర్రికాలువ పొరంబోకు భూమి ఆక్రమణకు గురైందని లింగంపాడు, తల్లంపాడు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన నెర్రికాలువపై ఉన్న లాక్ల మరమ్మతులకు, కాలువలో పూడిక తీతకు ఎఫ్డీఆర్ కింద నిధుల కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా సంబంధిత ఇరిగేషన్ ఏఈ రమేష్కు ఆదేశించారు. అంతేకాకుండా నెర్రికాలువ పొరంబోకు భూమి ఆక్రమణలను సైతం తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. లింగంపాడు గ్రామంలో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయం గురించి ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం షణ్ముగం, ఏడీఏ అనిత వివరించారు. ఆయన వెంట ఏఓ జ్యోతిర్మయి, ఏఈలు ఉమామహేశ్వరి, హరికృష్ణ, ఉషారాణి, మోహన్రావు, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్వం విద్యార్థుల ప్రభంజనం
తిరుపతి కల్చరల్: జాతీయ స్థాయిలో గత నెల ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ 9వ తరగతి విభాగంలో 400 మార్కుల కు 370 మార్కులు సాధించి వి.మోక్షిత్ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కై వశం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అలాగే 6వ తరగతి విభాగంలో 300 మార్కుల కు 281 మార్కులతో హృతిక్ రాయల్, 275 మార్కుతో వి.నిహార్, 270 మార్కులతో సోహిని అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. వీరితో పాటు రస జ్ఞ, జీవన్ సాయిరెడ్డి, ఆర్యన్రెడ్డి, భువనేష్, లోహిత్, మహిదర్, అశ్విన్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. అలాగే గణితంలో 50/50 మార్కులు విశ్వం విద్యాసంస్థల విద్యార్థులు సాధించడం గర్వకారణమన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ విశ్వంచందన్రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
సిఫార్సులకే కార్పొరేషన్ రుణాలా!
● ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై నీలినీడలు ● దరఖాస్తుల ప్రక్రియ నుంచే అక్రమాలకు తెరలేపిన కూటమి ప్రభుత్వం ● రెండు రోజుల పాటు పనిచేయని సర్వర్లు ● 1,267 యూనిట్లకు 5,600 దరఖాస్తులు ● అంతటా గోప్యత పాటిస్తున్న అధికారులు తిరుపతి అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై గంపెడాశలు పెట్టుకున్న లబ్ధిదారులకు అధికారులు మొండి చేయి చూపేలా ఉన్నారు. మూడు రోజుల పాటు సర్వర్లు పని చేయకపోవడంతో పలువురు అర్హత ఉన్నా.. దరఖాస్తులు చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో దరఖాస్తులకు గడువు పెంచుతారని అంతా భావించగా.. ఆ ఊసేలేదు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. ఈ నెల 9, 10 తేదీల్లో సర్వర్లు పని చేయకపోవడంతో పలువురు నిరాశ చెందారు. ఆ రెండు రోజులకు బదులు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు ఎప్పుడిస్తారో..! జిల్లాలో 1267 యూనిట్లుకు 5,600 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ నాటికి దరఖాస్తులకు గడువు ముగిసింది. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీకల్లా రుణాలు మంజూరు చేయాలని ఈడీ చెన్నయ్యకు ఆదేశాలు ఇచ్చారు. అయితే కార్పొరేషన్ అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చ సాగుతోంది. కూటమి నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలతో పనిలేకుండా పార్టీ నేతల సిఫార్సులకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులే బాహాటంగా చెప్పేస్తున్నారు. అర్హతలతో పని లేకుండా నేతలు చెప్పినవారికే ఇచ్చేటప్పుడు తమకు ఆశలు కల్పించడం ఎందుకని పలువురు దరఖాస్తుదారులు విమర్శిస్తున్నారు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయి రాష్ట్రస్థాయి అధికారుల ఉత్తర్వుల మేరకు ఎంపిక చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఈ నెల 10 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల సర్వర్లు పనిచేయలేదు. అంతేకాకుండా టెక్నికల్ సమస్యలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల 20వ తేదీకి పూర్తి చేయమని చెప్పారు. అయితే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే ప్రక్రియను ప్రారంభిస్తాం. సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యత ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారికే రుణాలు అందిస్తాం. – చెన్నయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, తిరుపతి జిల్లాఅంతా గోప్యంగా.. కార్పొరేషన్ అధికారులు రాయితీ రుణాలకు సంబంధించి అన్ని అంశాలను గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి దరఖాస్తులకు గడువు ముగియగా.. ఆ తర్వాత ఎన్ని దరఖాస్తులు వచ్చాయో మీడియాకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. అంతేకాదు ఎప్పటి నుంచి ఇంటర్వ్యూలు మొదలు కానున్నాయో అనే సమాచారాన్ని చెప్పడం లేదు. అసలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా ? లేదా ? నేతల సిఫార్సులు లేఖలు ఉన్నవారికే నేరుగా ఇచ్చేస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. -
బాలుడి మృతి కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడులో బాలుడు వెంకటేష్ మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.– 10లోమాకు అన్యాయం గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సుమారు 10 వేల ఎండీయూ వాహనాలను రాయితీలతో పేదలకు అప్పగించారు. తిరు పతి జిల్లాకు సైతం 369 మందికి వాహనాలు వచ్చాయి. క్రమం తప్పకుండా బియ్యం పంపిణీ చేస్తున్నాం. అయితే కూటమి సర్కారు వాటిని రద్దు చేయడంతో మేమంతా వీధినపడాల్సి వస్తుంది. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మాకు ప్రత్యామ్నాయం కల్పించాల్సిందే. – కే.కిషోర్కుమార్, ఎండీయూ వాహనాల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరదల సమయంలో విజయవాడకు వెళ్లాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో భారీ వరదలు వచ్చినప్పుడు రాష్ట్రంలోని అన్ని ఎండీయూ వాహనాలను పిలిచారు. మేమంతా వెళ్లాం. కొందరు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని అందించాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మా సేవలు గుర్తుకురాలేదు. ఎంతో బాధగా ఉంది. ప్రభుత్వాలు పది మందికి ఉపయోగపడేలా చట్టాలు చేయాలి. అంతేతప్ప పది మందికి నష్టాలు చేయడానికి చట్టాలు చేయడం సరికాదు. – కే.మొహిద్దీన్,ఎండీయూ ఆపరేటర్, చిల్లకూరు మండలం -
రేషన్ బండి..
● ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం ● వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లోనే సరుకులు తీసుకోవాలి ● వలంటీర్లను తీసివేయడంతో ఇప్పటికే నిలిచిన ఇంటింటా సేవలు ● రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులే ! ● న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్న ఎండీయూ ఆపరేటర్లు ●పోరాటాలు చేస్తాం.. మాకు న్యాయం జరిగేవరకు పోరాటాలు చేస్తాం. బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎండీయూ వాహనాలు తెచ్చుకున్నాం. ప్రతి నెలా ఈఎంఐ కట్టాల్సి ఉంది. ఆ నగదు ఎలా కట్టాలి ? ఒక్కసారిగా మమ్మల్ని రోడ్డున పడేయడం ఈ ప్రభుత్వానికి న్యాయమేనా ? మాకు భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఉంటారనే ఆలోచన లేకుండా వదిలేస్తే ఎలా? సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఎండీయూ వాహనాల రద్దు విషయంలో పునరాలోచన చేయాలి. – డి.హరికృష్ణ, ఎండీయూ ఆపరేటర్, వాకాడు మండలం తిరుపతి అర్బన్ : ఇన్నాళ్లూ ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించిన బండి వచ్చే నెల నుంచి ఆగిపోనుంది. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించే విధానాన్ని చాలా రాష్ట్రాలు అభినందించడమే కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే కుంటిసాకులు చెబుతూ వాహనాలను రద్దు చేస్తూ వచ్చే నెల నుంచి ప్రజలు తమ పరిధిలోని డీలర్ల దుకాణాల వద్దకే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎండీయూ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. న్యాయం కోసం పోరాటాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు కార్డుదారులు మళ్లీ రేషన్ దుకాణం వద్ద క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు తప్పవా అంటూ నిట్టూరుస్తున్నారు. జిల్లాలో పని చేస్తున్న 369 ఎండీయూ వాహనాలను నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ రేషన్ సరుకుల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు కూడా అరకొర ఇస్తున్నారే తప్ప అందరికీ అందడం లేదు. సరుకులే సక్రమంగా ఇవ్వలేని కూటమి ప్రభుత్వం ఇక ప్రజలకు ఏమి మంచి చేస్తుందని మండిపడుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. మాకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాం. ఏ తప్పు చేశామని మమ్మల్ని తొలగించారు ? అప్పటి ప్రభుత్వం ఏం చెబితే అదే చేశాం. కూటమి ప్రభుత్వంలోనూ ఏం చెబితే అదే చేశాం. విజయవాడ వరదల సమయంలో అక్కడకు వెళ్లాలని చెబితే ఆ మేరకు తిరుపతి జిల్లా నుంచి వెళ్లాం. ఎంతో మందికి ఇంటింటికీ వెళ్లి బియ్యం అందించాం. సీఎం చంద్రబాబునాయుడుకు మా సేవలు గుర్తుకు రావడం లేదు. – గిరికుమార్, ఎండీయూ వాహన ఆపరేటర్ రాజకీయ రంగు వద్దు.. రెక్కాడితేగానీ డొక్కనిండని బతుకులు మావి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేస్తామంటే వెళ్లాం. సబ్సిడీపై ఎండీయూ వాహనాలు ఇప్పించారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయం చేస్తామంటే వెళ్తాం. అంతే తప్ప అప్పటి ముఖ్యమంత్రి ఎవరికి సాయం చేశారో వారిపై కక్ష సాధిస్తామంటే న్యాయమా సార్ ? మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక కక్ష సాధించమని చెప్పినట్లుగా ఉంది ఈ ప్రభుత్వం తీరు. – అస్త్రాష్, ఎండీయూ వాహనం ఆపరేటర్ సామాన్య ప్రజలపై కక్ష సరికాదు.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి పెను ప్రమాదం తప్పదని భావిస్తున్నాం. 2029 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే మళ్లీ ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి! ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేసిన వాటిని వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే ? ఈ వి షయాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాల్సి ఉంది. నేతలపై కోపాన్ని సా మాన్య పేద ప్రజలపై చూపడం సరికాదు. మాకు న్యాయం చేయండి. – పార్థసారథి, ఎండీయూ ఆపరేటర్, తిరుపతి అర్బన్ ఆలోచన చేయాలి కదా.. కూటమి ప్రభుత్వం మంచి చెడులను ఆలోచన చేయాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి కల్పిస్తామంటే వెళ్లాం. ఆయన ఎండీయూ వాహనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మాలాంటి వాళ్లందరికీ ఉపాధి కల్పించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబునాయుడు మాపై కక్ష్య సాధించడం ఏ మాత్రం న్యాయం కాదు. – కుమార్, ఎండీయూ ఆపరేటర్, బీఎన్ కండ్రిగ మండలం -
ఆధ్యాత్మిక నగరంలో కూటమి నేతల దందాలు
● ఒక్కో వీధివ్యాపారి నుంచి రోజూ రూ.వెయ్యి వసూళ్లు ● కొన్ని దుకాణాల నుంచి నెలకు రూ.10 వేలు ● అటవీ అధికారులకూ నెలకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే ● పండ్లు, కూరగాయలు కొని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్న వైనం ● గట్టిగా అడిగినందుకే వీధి వ్యాపారులపై కూటమి నేతల జులుం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రసిద్ధిగాంచిన తిరునగరికి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. నగర ప్రజల అవసరాలు, పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంలో చిరువ్యాపారులు తోపుడుబండ్లపై తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూటమి నేతలు వారి నుంచి మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఆ మరుక్షణం చిరువ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఆక్రమణ అంటూ కార్పొరేషన్ అధికారులను అడ్డు పెట్టుకుని తొలగిస్తున్నారు. మూడు రోజుల క్రితం నగరంలోని బొంతాలమ్మ ఆలయం వద్ద చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. తిరుపతి నగరంలో మార్కెట్లను టెండర్ ద్వారా దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పి చిరు వ్యాపారుల నుంచి ప్రతి రోజూ రూ.1000 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ గతంలో అధికారిక ప్రకటన చేశారు. నగరంలో తోపుడుబండ్లు, పండ్లు, పూలు విక్రయించే వారి నుంచి వసూళ్లు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పి రోజూ వసూళ్లు చేస్తున్నట్లు చిరువ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారం చేసుకోవాలంటే అడిగినంత ఇవ్వు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోని కొందరు నాయకులు తమ అనుచరులను చిరువ్యాపారులకు వద్దకు పంపించి ప్రతి రోజూ రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ బస్టాండ్, రైల్యేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, కపిలతీర్థం, గ్రూప్ థియేటర్స్, తాతయ్యగుంట గంగమ్మ, కూరగాయల మార్కెట్ పరిసరాలు, రద్దీ ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారులు మాత్రం కూటమి నేతలు అడిగినట్లు రోజూ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. పారెస్టు అధికారులకూ మామూళ్లు .. తిరుపతి–కరకంబాడి మార్గంలోని బొంతాలమ్మ ఆలయం వద్ద ఉన్న వ్యాపారులు ఒక్కొక్కరు అటవీ అధికారులకు ప్రతి నెలా రూ.10వేలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగని అధికారులు కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసి సగం డబ్బులు మాత్రమే ఇచ్చి వెళ్లిపోతున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రూ.వెయ్యికి కొనుగోలు చేస్తే రూ.100 లేదా రూ.200 చేతిలో పెట్టి పోతున్నారని వాపోతున్నారు. మరో వైపు ఆ ప్రాంతానికి చెందిన ఓ జనసేన నాయకురాలు కూడా వారంలో రెండు, మూడు రోజులు కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసి తక్కువ మొత్తంలో చేతిలో పెట్టి వెళ్లిపోతున్నట్లు పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వీరిని గట్టిగా అడిగినందుకే తమపై పోలీసులను ఉసిగొల్పి ప్రతాపం చూపించారని వీధివ్యాపారులు మండిపడుతున్నారు. అదే విధంగా ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లోని చిరువ్యాపారులపైనా కూటమి నేతలు జులుం ప్రదర్శించినట్లు తెలిసింది. -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చంద్రగిరి: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగయ్యగారిపల్లి సమీపంలోని స్వర్ణముఖినదిలో కొంతమంది అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతల ట్రాక్టర్లు పగలూ రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోరు కానీ.. తమలాంటి సామాన్యులు సొంత అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్తే ఇలా కేసులు పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుల్లో నాగయ్యగారిపల్లి స్వర్ణముఖినదిలో జేసీబీలతో ఇసుకను తరలిస్తున్నారని, పోలీసులు మాత్రం వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారంటూ మండిపడుతున్నారు. -
రోడ్డు ఆక్రమణకు యత్నం
– అడ్డుకున్న ఆర్అండ్బీ అధికారులు రేణిగుంట: మండల పరిధిలోని పాపానాయుడుపేట–రేణిగుంట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎల్లమండ్యం రెవెన్యూ లెక్కదాఖలాలో సర్వేనంబర్ 263/9సి/ 1లో గల భూమికి సంబంధించి పత్రాలు ఉన్నాయని కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం చేపడుతుండడంపై స్థానికులు ఆర్అండ్బీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ మురుగయ్యనాయుడు గురువా రం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రహరీ గోడ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గతంలో పిల్లర్లు వేసినప్పుడు కూడా నిలుపుదల చేశామని..అయినా కూడా రోడ్డుపై రాయి నాటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏ, రెవెన్యూ సర్వేయర్లు వచ్చి సర్వే చేశాకే పనులు చేసుకోవాలని లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి లీగల్గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ స్టేషన్
సూళ్లూరుపేట : అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువగా, శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామికవాడలకు అత్యంత దగ్గరగా, నేలపట్టు పక్షుల పర్యాటక కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసారి చంద్రశేఖర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.14.50 కోట్లతో ఆధునీకరించిన సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి దూరదృష్టితో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 1300 పైగా రైల్వేస్టేషన్లను ఆధునీకరించారని, అందులో భాగంగా గురువారం 130 రైల్వేస్టేషన్లను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, చైన్నె డివిజనల్ రైల్వే మేనేజర్ విశ్వనాథ ఈర్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్, ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ ముందుచూపుతోనే స్టేషన్ల అభివృద్ధి కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని -
నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు
చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు.నవోదయంలో చీకట్లునాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు.వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్కు తరలించాలంటే తన రవాణాకు కిలోకు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతుల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.బెల్లం తయారీలో రైతులు‘ఈ చిత్రంలో భార్య, బిడ్డలతో తన చెరకు తోట, ట్రాక్టర్తో కలిసి ఉన్న రైతు పేరు పెరుమాల్. గతేడాది ఆయుధపూజ నేపథ్యంలో చెరకు పంట ఓ మోస్తరుగా వస్తుండడంతో ఇలా ఫొటో తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుమాల్ చిత్తూరు జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.. కారణం.. పెరుమాల్ రైతు కావడం, తన వద్ద నల్లబెల్లం కొన్న వ్యక్తులు సారా తయారు చేశారంట.’సారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదుసారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరుగిట్టుబాటు ధర ఎక్కడ ?ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.అరెస్టులపై ఉద్యమిస్తాంఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు.– నాగరాజన్, సీపీఐ, చిత్తూరు జిల్లా కార్యదర్శిప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలివైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
దుకాణాల కూల్చివేతపై ధర్నా
తిరుపతి తుడా : పేదలపై కార్పొరేషన్ అధికారులు ప్రతాపం చూపించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. బొంతాలమ్మగుడి వద్ద చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించినందుకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణతో కలసి మురళి మాట్లాడుతూ ప్రత్నామ్నాయ స్థలం చూపించకుండా వీధి వ్యాపారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. నగరంలో కూటమి నేతలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా మామూళ్ల వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రధానంగా జనసేన నేతల దందాలు పెరిగిపోయాయని విమర్శించారు. అన్నీ తెలిసినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ప్లానింగ్ అధికారులు బాలాజీ, మూర్తి కుట్రపూరితంగా వీధి వ్యాపారుల షాపులు తొలగించారని, ఇప్పుడు అదే స్థంలో జనసేన నేతల ఆధ్వర్యంలో దుకాణాలు పెట్టించారని మండిపడ్డారు. నేతలు సుబ్రమణ్యం, బుజ్జి, వేణు గోపాల్, కేవై రాజా, ఎమ్డీ రవి, సీహెచ్ శివకుమార్, మణి, ఎన్.శివ, వెంకటేష్, సురేష్, మహేంద్ర, రైల్వే బాల, ప్రమీల, శ్రీనివాసులు, బాలాజీ, సుధాకర్, రమేష్, దీపక్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
చంద్రగిరి : మండలంలోని ముండ్లపూడి వద్ద బుధవారం ఉదయం ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచారూరు పోలీస్స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కుమార్రాజా అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 1వ తేదీన చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన నాగరాజ అలియాస్ వాసును అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవం వెల్లడైంది. నిందితుడి నుంచి 168.55 గ్రాముల బంగారు, 192.5 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలోని పలు పోలీస్స్టేషన్లలో దోపిడీ, చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించిన సీఐ సునీల్కుమార్, ఎస్ఐలు అరుణ, సాయినాథ్ చౌదరి, జగన్నాఽథరెడ్డి, సిబ్బంది ప్రసాద్, ప్రభాకర్ను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం తిరుపతి సిటీ : దైనందిన జీవితంలో యోగాను భాగంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యోగా మాసోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలసి ఆయన యోగాసనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా కర్టన్ రైజర్ యోగాంధ్రా–2025కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి జూన్ 21వ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోజుకు కనీసం గంటపాటు యోగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాడేలో ప్రజలు భాగస్వాములై విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సామూహిక యోగాలో పెద్దసంఖ్యలో జనం పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, డీఆర్ఓ నరసింహులు , ఆర్డీఓ రామ్మోహన్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ట్రస్ట్ ఏర్పాటుపై పరిశీలించాలి
తిరుపతి తుడా: శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం చిన్నపిల్లల హృదయాలయాన్ని పరిశీలించారు. చిన్న పిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డు, ఓపి బ్లాక్ లోని పిల్లలకు అందుతున్న వైద్యసేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం ఉందని తెలిపారు. దీని కింద దాత రూ.లక్ష విరాళం ఇస్తే నిరాదరణకు గురైన పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందన్నారు. టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్టుల తరహాలో నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పసి బిడ్డలకు చక్కటి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన నూతన భవన నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ భరత్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం పాల్గొన్నారు. -
● టీచర్ల ట్రాన్స్ఫర్లకు ఉత్తర్వులు ● కసరత్తు వేగవంతం చేసిన జిల్లా విద్యాశాఖ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రక్రియ ● ఎస్జీటీలకు మాన్యువల్గా చేపట్టనున్న వైనం ● ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఈనెల 21న డీఈఓలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వెబెక్స్లో జిల్లా నుంచి డీఈఓ వరలక్ష్మి, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన చేపట్టే ఈ బదిలీలకు బుధవారం ట్రానన్స్ఫర్ పోర్టల్ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ జూన్ 5 నాటికి పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఏలకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనుండగా, ఎస్జీటీలకు మాన్యువల్గా బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో.. టీచర్ల బదిలీల కసరత్తు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధి లో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4916 పాఠశాలలున్నాయి. వీటిలో 3766 ప్రాథమిక, 445 ప్రాథమికోన్నత, 705 ఉన్నత పాఠశాలలు.17,372 మంది టీచర్లకు గాను 15,454 పనిచేస్తున్నారు. 37 విభాగాల్లో 1918 పోస్టులను క్లియర్ వేకెన్సీలుగా చూపించగా, మరో 5082 ఖాళీలుగా చూపించారు. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పూర్తి చేసిన హెచ్ఎంలు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్న నేపథ్యంలో 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్ల ఖాళీలు 3 వేలు చూపగా, మిగులు కింద 500, స్కూల్ కొత్త పోస్టు లు (రీఅపోర్షన్), ఒక యాజమాన్య పాఠశాల నుంచి మరో యాజమాన్య పాఠశాలల్లో నెలకొన్న(షిఫ్టెడ్) ఖాళీలు 1582 చూపుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీల వివరాలు యాజమాన్యం ఖాళీలు ప్రభుత్వ 125 ఎంపీపీ/జెడ్పీ 1583 మున్సిపల్ కార్పొరేషన్ 135 మున్సిపల్ 75 5/8 ఏళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లు 3000 మిగులు పోస్టులు 500 రీ అపోర్షన్/ షిఫ్టెడ్ 1582 మొత్తం 7000 హడావుడిగా దరఖాస్తు చేసుకోవాలని.. బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యాయో లేదో అప్పుడే హడావుడిగా పలు కేడర్ల టీచర్లు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు కేడర్ల టీచర్ల గందరగోళానికి లోనయ్యారు. కూటమి సర్కారు చేపడుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు 5 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన హెచ్ఎంలు గురువారం సాయంత్రం 5గంటల్లోపు బదిలీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరిలోని టీచర్లు మెడికల్ బోర్డు వెరిఫికేషన్కు బుధవారంతో గడువు పూర్తి కానుంది. బదిలీల్లోని సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. ప్రక్రియ హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ బదిలీలకు దరఖాస్తులు ఈనెల 21, 22 ఈనెల 21 నుంచి 24 ఈ నెల 21 నుంచి 27 పరిశీలన ఈనెల 21,22 ఈ నెల 21 నుంచి 25 ఈనెల 21 నుంచి 28 ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా 24 26,27 31 గ్రీవెన్సెస్ 25 28 28 నుంచి జూన్ 1 గ్రీవెన్సెస్ పరిష్కారం 26 28, 29 28 నుంచి జూన్ 2 తుది సీనియారిటీ జాబితా 27 31 జూన్ 6 వెబ్ ఆప్షన్స్ 28 జూన్ 1, 2 జూన్ 7 నుంచి 10 బదిలీ ఉత్తర్వులు 30 జూన్ 4 జూన్ 11 ఉద్యోగోన్నతులు మే 30 (ఎస్ఏ నుంచి హెచ్ఎం) జూన్ 5 (ఎస్జీటీ నుంచి ఎస్ఏ) ఉద్యోగోన్నతులు ఉత్తర్వులు మే 31 జూన్ 6 పకడ్బందీగా చేపడతాం బదిలీల కసరత్తు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. బదిలీలు నిబంధనల మేరకు చేపడుతాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదు. టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల విషయంలో దళారుల మాటలు నమ్మకూడదు. ఎవరైనా మోసాలకు పాల్పడితే శాఖాపరంగా చర్యలు కఠినంగా ఉంటాయి. – కేవీఎన్ కుమార్, డీఈఓ -
ప్రభుత్వ భూమి కబ్జా
ఏర్పేడు : మండలంలోని పెనుమల్లం సమీపంలో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ స్థానిక నేతలు కబ్జా చేసేశారు. వివరాలు.. గ్రామంలోని ఇరగలప్పచలం ఆలయానికి వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 183లో 3.92 ఎకరాలు, సర్వే నంబర్ 182–1లో 4.40 ఎకరాల చిట్టేటి గుంట పోరంబోకు భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన బొజ్జ శంకరయ్య, పెరుమాళ్ అనే వ్యక్తులు సదరు భూమిని ఆక్రమించేశారు. బొజ్జా శంకరయ్య ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. మిగిలిన స్థలాన్ని జేసీబీతో చదును చేయించేశాడు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.50 లక్షలు వరకు ధర పలుకుతోంది. ఆక్రమణపై స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాలమంగళం విద్యార్థికి అవార్డు నారాయణవనం: పాలమంగళం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఆశిష్కు షైనింగ్ స్టార్ అవార్డు దక్కింది. విభిన్న ప్రతిభావంతుడైన ఆశిష్ 500 మార్కులకు గాను 481 సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, జిల్లా టాపర్గా నిలిచాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. బుధవారం ఈ మేరకు పాఠశాల హెచ్ఎం మనోహరి మాట్లాడుతూ ఆశిష్ మనోధైర్యంతో అంగ వైకల్యం జయించాడని ప్రశంసించారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి తిరుమల: తిరుమలలోని రింగ్ రోడ్డులో ప్రమాద వశాత్తు జింక మృతి చెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తిరుమలలోని గ్యాస్ గోడౌన్ సమీపం రింగ్ రోడ్లో రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో జింక అక్కడికక్కడే మృతిచెందింది. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని తిరుపతిలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. మసూర బియ్యం పేరుతో టోకరా రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం దళితవాడలో బుధవారం ఇద్దరు వ్యక్తులు మసూర బియ్యం పేరుతో స్థానికులకు టోకరా పెట్టారు. ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి స్కూటర్లపై బియ్యం బస్తాలను వేసుకొచ్చారు. ఒక్కో బస్తా రూ.వెయ్యి చొప్పున విక్రయించి వెళ్లారు. తీరా మూట విప్పి చూస్తే అవి రేషన్ బియ్యం కావడంతో స్థానికులు అవాక్కయ్యారు. రెండు నెలల క్రితం కూడా వెంకటాపురం పంచాయతీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే దీనిపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశం
వరదయ్యపాళెం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ బుధవారం తాడేపల్లె కేంద్ర కార్యాలయంలో కలిశారు. కూటమి నేతల ఆగడాలపై రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఆదేశించారు. కూటమి నేతల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్ర వర్మ, సత్యవేడు మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నేతలు చంద్రశేఖర్ రెడ్డి, బెల్టు రమేష్, ఎంపీపీలు దివాకర్ రెడ్డి, ప్రతిమారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆన్కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు తిరుపతి అర్బన్ : మంగళం ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎం కేసీడీ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొంది 18 నెలలు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. ఆసక్తిగలవారు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంగళం డిపోలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్రతి రోజూ డ్యూటీ దిగిన తర్వాత వేతనం చెల్లించేస్తామని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 9177150347 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పద్మావతి ఆస్పత్రిలో ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ తిరుపతి తుడా : స్విమ్స్ పరిధిలోని పద్మావతి ఆస్పత్రిలో ప్రతి గురువారం ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ప్రత్యేక ఓపీ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గర్భిణుల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర సమస్యలు ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్యం అందించేందుకు ఈ ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నామని వివరించారు. పద్మావతి ఆస్పత్రిలో మధ్యాహ్నం 12గంటలకు రూమ్ నంబర్ 22లో ఓబెస్ట్రిక్స్ మెడిసిన్ ఓపీ ఉంటుందని తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ కేంద్రం పరిశీలన తిరుపతి సిటీ : ఏపీ ఈఏపీ సెట్ నిర్వహిస్తున్న తిరుపతి జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఎస్వీయూ వీసీ అప్పారావు బుధవారం పరిశీలించారు. వీసీ మాట్లాడుతూ ప్రశాంతవాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు పక్కాగా మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. దశాబ్దాలుగా సీమవాసుల కల.. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల ఆకాంక్ష.. ఏళ్ల తరబడి నిరీక్షణ.. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాయలసీమ వాసుల్లో ఆశలు చిగురించాయి. ప్రత్యేక డివిజన్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిపుణుల నుంచి సైతం సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
తిరుపతి అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి రహదారి భద్రతా కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హైవేపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే డ్రైవింగ్ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర సమాచారం కోసం ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇప్పటి వరకు100 బ్లాక్స్పాట్లు గుర్తించినట్లు తెలిసిందని, దీనినై అధికారులు స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్డులోకి ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే అనుమతించాలన్నారు. అఆగే ఘాట్రోడ్డును నాన్స్టాప్ జోన్గా గుర్తించాలని ఆదేశించారు. మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేసి రూ.2వేల జరిమానా విధించాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే 1033 టోల్ ఫ్రీ నంబర్కు ప్రజలు కాల్ చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. హిట్ అండ్ రన్పై స్పష్టమైన నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు ఇన్సూరెన్స్ పొందే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళుతున్న ద్విచక్రవాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేయాలన్నారు. ప్రస్కూల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కచ్చితంగా రూల్స్ పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధికారి మురళీమోహన్, ఆర్అండ్బీ ఎస్ఐ మధుసూదన్, తిరుపతి, నెల్లూరు, చైన్నె జాతీయ రహదారుల పీడీలు వెంకటేశ్వర్లు, ఎంకే చౌదరి, విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, తుడా ఏఈ రవీంద్ర పాల్గొన్నారు. -
జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలు
తిరుపతి సిటీ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర–2025 ప్రచారానికి మద్దతుగా ఎస్వీయూలో గురువారం నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. వారు బుధవారం ప్రత్యేక ప్రచార బ్రోచర్ను విడుదల చేశారు. వారు మట్లాడుతూ యోగా వల్ల మనిషిలో అంతర్గత సమతుల్యత, మానసిక దృఢత్వం, సమగ్ర శ్రేయస్సుకు కలుగుతాయన్నారు. ఆరోగ్యకరమైన, మేధోసమాజాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ మానసిక, శారీరక ఆరోగ్యం అవసరమని, సమాజంలో ఇటువంటి పద్ధతులను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే యోగా మాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఉదయం 8:20 నుంచి 9 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట యోగా సెషన్లు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రూసా సీఈవో వంశీ రాయల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య టి.దామోదరం, పరీక్షల డీన్ ఆచార్య ఎస్.కిషోర్, అసిస్టెంట్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరికృష్ణ యాదవ్, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.వివేక్ పాల్గొన్నారు. ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్ యోగాంధ్ర–2025 ప్రచార బ్రోచర్ ఆవిష్కరణ -
● కలగానే బాలాజీ రైల్వే డివిజన్ ● ఏళ్ల తరబడి ప్రజల నిరీక్షణ ● కార్యరూపం దాల్చని ప్రతిపాదన
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతున్నా మరోవైపు బాలాజీ డివిజన్ అంశం తెరపైకి వచ్చింది. సీమ ప్రజాప్రతినిధుల నుంచి నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు సైతం వెళ్లాయి. అధికారులు సానుకూలమే.. గుంతకల్ డివిజన్ కేంద్రానికి తరచూ సమావేశాలకు వెళ్లి రావాలంటే రైల్వే అధికారులు, కార్మికులకు ప్రయాణం కష్టతంగా మారింది. ఈ క్రమంలో గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్లో కలిపితే సౌకర్యంగా ఉంటుందని రైల్వే నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ దిశగా ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ వాసులు సైతం కోరుతున్నారు. డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ), పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాలను ఇదివరకే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102కిమీ)లైను గుంటూరు డివిజన్లోకి విలీనం చేయాలని సూచించారు. అలాగే జిల్లా మీదుగా వెలుగొండ అడవుల నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్లోకి వెళ్లింది. కొత్త డివిజన్ ఏర్పడితే తిరుపతి రైల్వే కేంద్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలోని రేణిగుంట జంక్షన్కు ప్రాముఖ్యత ఉంది. విశాఖ జోన్ ఏర్పడుతున్న నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా వరకు బాలాజీ డివిజన్గా ఏర్పాటుచేసే ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని నిపుణులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పాటు క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలల్లో పరిశ్రమల స్థాపనకు మార్గం మరింత సుగమం అవుతుందని వివరిస్తున్నారు. -
సనాతన ధర్మ ప్రచారానికి ప్రాధాన్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : యువతను భక్తిమార్గం దిశగా నడిపించేందుకు సనాతన ధర్మ ప్రచారానికి ఎస్వీబీసీలో ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాస సాహిత్యం, భక్తులకు అందిస్తున్న సేవలు, హైందవ ధర్మ మూలాలను పిల్లలక సైతం తెలియజేయాలన్నారు. భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సృజనాత్మక కార్యక్రమాలను ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. వర్చువల్గా అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి పాల్గొన్నారు. -
రెండో విడతలో అందని గ్యాస్ సబ్సిడీ
● ఆందోళనలో దీపం–2 పథకం లబ్ధిదారులు ● సిలిండర్కు చెల్లించిన నగదు రీఫండ్ కాకపోవడంతో ఆగ్రహం ● రోజుకో మాట చెబుతున్న అధికారులు 20 రోజులు గడిచాయి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ అని లెక్కవేశారు. అప్పటి వరకు ఒక్క సిలిండర్ సరిపోదు. సరే ఏదో ఇస్తామని చెప్పారు. సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటే నగదు వేశారు. రెండో సిలిండర్కి ఇవ్వలేదు. 20 రోజులు గడుస్తోంది. మా డీలర్ను అడిగితే పడుతుందిలే అంటున్నారు. ఎప్పుడు పడుతుందో ఏమో తెలియడం లేదు. – రత్నమ్మ, శ్రీకాళహస్తి మండలం చేసింది ఒక్కటే.. అదీ ఇలా.. సూరప్సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒక్కటే. అదీ ఇలా సక్రమంగా ఇవ్వకుంటే ఏం చేయాలి. తల్లికివందనం లేదు...అన్నదాత సుఖీభవ లేదు...నిరుద్యోగభృతి లేదు. ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్మాలి. గ్యాస్ సిలిండర్ తీసుకుని 18 రోజులు గడుస్తోంది. అయినా రాయితీ జమ కాలేదు. – రాణెమ్మ, తిరుపతి తిరుపతి అర్బన్ :జిల్లాలో దీపం– 2 పథకం అప్పుడే కొడిగట్టుతోంది. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని కూటమి ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో విడత సిలెండర్ బుక్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. మొదటి విడతలో 4.92 లక్షలకు కాను 2.40లక్షలకు మాత్రమే నగదు రీఫండ్ చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. సగం మందికి సొమ్ము చెల్లించలేదని విమర్శిస్తున్నారు. అయితే 50 శాతం మంది మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారని, వారికి మాత్రమే నగదు జమ చేశామని అధికారులు వివరిస్తున్నారు. రెండో విడత విషయంలో 90శాతం మందికి రీఫండ్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులేమో సర్వర్, ఆధార్ లింకేజీ సమస్యల కారణంగా ఉచిత గ్యాస్ నగదు జమ కావడంలేదని చేతులు దులిపేసుకుంటున్నారు. తొలి ఏడాదే రెండో విడతకే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే కాలంలో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల్లో నగదు జమ చేస్తాం దీపం–2 పథకం ద్వారా రెండో సిలిండర్ బుకింగ్ చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ అంశంపై మీటింగ్ నిర్వహించారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి అధికారులతోను మాట్లాడారు. అయితే నాలుగు రోజుల్లో వేస్తామని చెప్పారు. ఈ విషయంలో లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదు. – శేషాచలం రాజు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారిడబ్బులు జమ కాలేదు ఉచిత గ్యాస్ పథకం కింద సిలిండర్ బుక్ చేసుకున్నాం. సిలిండర్ ఇంటికి వచ్చింది. నగదు చెల్లించాం. అయితే మేము కట్టిన డబ్బులు మాత్రం మా బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. మొదటి సారి వచ్చింది. ఈసారి ఎందుకు రాలేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే రెండు వారాలవుతోంది. – లక్ష్మి, ఏర్పేడు మండలం● -
దుకాణాల కూల్చివేతపై ధర్నా
బొంతాలమ్మ గుడి వద్ద వీధి వ్యాపారుల షాపుల7 కూల్చివేతపై బుధవారం ఏఐటీయూసీ నేతలు ధర్నాకు దిగారు.‘అమృత్’ స్టేషన్.. అభినందనీయం సూళ్లూరుపేట : అమృత్ స్టేషన్ పథకం కింద సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం అభినందనీయమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అద్భుతంగా తీర్చిదిద్దిన రైల్వేస్టేషన్ను గురువారం రాత్రి వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు. షార్తోపాటు శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారని, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని కోరినట్లు వివరించారు. తమ విన్నపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అమృత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశానికి వెళేఓల ఎక్స్ప్రెస్ రైళ్లకు సైతం సూళ్లూరుపేటలో స్టాపింగ్ ఇవ్వాలని ఎంపీ గురుమూర్తి కోరారు. – 8లో -
రెచ్చిపోతున్న ఇసుకాసురులు
వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా పెన్నా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో సై‘ఖతం’ చేసేస్తున్నారు. వందలాది వాహనాల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అక్రమార్కులను నిలువరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం ముడుపులు తీసుకుని అక్రమ రీచ్లను ప్రోత్సహిస్తున్నారు. రాత్రింబవళ్లు ఇసుకను దోచేస్తున్నప్పటికీ కాసుల కోసం పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్నారు.వాటా ఇచ్చి తరలింపురాజాపాళెం, తెలుగురాయపురంలోని అక్రమ రీచ్ల నుంచి ఇసుక తరలించేందుకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి యూనిట్కు రూ.వెయ్యి చొప్పున వాటాను ఇసుకాసురులు ముట్టజెపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటు న వంద వాహనాల్లో ఇసుక తరలిపోతున్నట్లు సమాచారం. ప్రతి వాహనానికి రూ. 8 యూనిట్లు లెక్కన నిత్యం 800 యూనిట్ల ఇసుకను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అండతో ఇసుక మాఫియా బరితెగించి రాత్రి పగలు తేడాలేకుండా తవ్వకాలు సాగిస్తోంది. భారీ వాహనాల్లో ఇసుక వెళ్లిపోతోంది. ఆయా మార్గాల్లో నివసించేవారికి ఈ వాహనాల రణగొని ధ్వనులతో నిద్ర కరువవుతోంది. ఇళ్లు దుమ్మకొట్టుకుపోతున్నాయి. రహదారులు సైతం ఛిద్రమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమర్జనలో భాగస్వాములైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సరికొత్త దారిలో..ఇసుక మాఫియా రోజుకో మార్గం ఎంచుకుని అక్రమ రవాణా సాగిస్తోంది. రాజుపాళెం, తెలుగురాయపురం మీదుగా కాకుండా ఇప్పుడు తాజాగా వెంకటరెడ్డిపల్లె వంతెన సమీపంలోని అటవీ ప్రాంతం గుండా ఇసుకను రవాణా చేస్తోంది. ఇందుకోసం స్థానిక రైతుకు కొంత నగదు ఇచ్చి ఆయన పొలంలో బాట వేసుకుంది. ఈకొత్త రూట్ ద్వారా రాత్రి పూటహైవే మీదుగా భారీ వాహనాల్లో ఇసుకను తరలించేస్తోంది.సాక్షి టాస్క్ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక తోడేళ్లు పేట్రేగిపోతున్నాయి. టీడీపీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో దందా సాగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.కోట్ల విలువైన ఇసుకను యథేచ్ఛగా దోచుకున్నాయి. కలువాయి మండలం రాజుపాళెం, తెలుగురాయపురం సమీపంలోని పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఉండాలి. అయితే ఎన్జీటీ అనుమతి లేకుండానే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇసుక రేవుల్లో పడి దోచేస్తున్నారు.స్పందించని అధికార యంత్రాంగంపర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు దారి వేసుకున్నారు. నదీ గర్భంలోకి రోడ్డు వేసినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇటీవల దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రహదారిని మూసివేసినట్లుగా హడావుడిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులుదులిపేసుకున్నారు. అయితే గంటల వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీల వించివేసి ఇసుకాసురులు వాహనాల రాకపోకలను ప్రారంభించేశారు. టీడీపీ నేతల సహకారంతో అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఐసెట్లో తిరుపతి విద్యార్థుల హవా
● టాప్ టెన్లో 7, 10 ర్యాంకులు కై వసం ● 2,759 మంది పరీక్షకు హాజరుకాగా 2,627మంది ఉత్తీర్ణత తిరుపతి సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్కు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,759 మంది విద్యార్థులు హాజరుకాగా 2,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 1296 మంది, 1331 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది జిల్లాలో మహిళలదేపైచేయిగా నిలిచింది. 7, 10 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు ఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్టెన్లో 7వ, 10వ ర్యాంకులను తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ఇందులో తిరుపతి నగరం సమీపంలోని వేదాంతపురానికి చెందిన వి అజయ్కుమార్ 7వ ర్యాంకు సాధించారు. ఈయన శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అజయ్కుమార్ తండ్రి వి మదనమోహన్ గాజులమండ్యం పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సూళ్లూరు పేట, మన్నూర్పోలూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మీ కుమారుడు మహేంద్ర సాయి 10వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. -
కారాగారాలు.. కదలని పనులు
పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా జిల్లా కారాగారంతో పాటు మొత్తం 10 జైళ్లు ఉండేవి. ప్రస్తుతం అవి ఆరుకే పరిమితమయ్యాయి. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురంలోని జైళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని శిలాఫలకాలు వేసిన పాలకులు నిర్మాణ పనులను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 10 జైళ్లు ఉండగా ఇందులో తిరుపతి, మదనపల్లె, పీలేరులోని సబ్జైళ్లు మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మించినవి. మిగిలినవన్నీ బ్రిటీష్ కాలంలో నిర్మించినవే. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుతుండడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని భావించిన జైళ్లశాఖ అధికారులు పుత్తూరు, పలమనేరు, వాల్మీకిపురం, చంద్రగిరి సబ్జైళ్లను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జైళ్ల సంఖ్య ఆరుకే పరిమితమయ్యాయి. మూసివేసిన పుత్తూరులో సబ్జైల్ స్థానంలో నూతన భవన నిర్మాణానికి నందిమంగళం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 242/22లో 2 ఎకరాల భూమిని రాష్ట్ర జైళ్ల శాఖకు స్థానిక రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ మేరకు 2010 జూన్ 18న అప్పటి జైళ్ల శాఖ ఐజీ గోపీనాఽథ్రెడ్డి నూతన జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పలమనేరులోని జైలును సైతం మూసివేసిన అధికారులు ఆ స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వాల్మీకిపురంలోని జైలును మూసివేసి తిరుపతి–మదనపల్లె మార్గంలో రూ.4 కోట్ల అంచనాతో జైలు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ భవన నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో కొత్త భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. అలాగే చంద్రగిరిలోని కారాగారం శిథిలావస్థకు చేరడంతో దానినీ మూసివేశారు. ఇలా ఉన్న జైళ్లను తొలగించడంతో పుత్తూరు సబ్కోర్టు ద్వారా శిక్షలు పడిన ఖైదీలను 70 కిలోమీటర్ల దూరంలోని సత్యవేడు సబ్జైలుకు, అలాగే పలమనేరు, వాల్మీకిపురం కోర్టుల్లో శిక్షలు పడిన ఖైదీలను పీలేరులోని సబ్జైలుకు తరలిస్తున్నారు. ఇది పోలీసులతో పాటు ఖైదీలకు, వారి కుటుంబీకులకు వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. అలాగే జైళ్లలోని గదులు చాలక ఖైదీలను ఎక్కువ మందిని ఒకే సెల్లో నిర్బంధించాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి 15 ఏళ్లుగా ఉంటున్నా పాలకులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖైదీలకు మెరుగైన సేవలు ఖైదీలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా జైలు అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉన్న జైళ్లలో 306 మంది ఖైదీలున్నారనీ, చిత్తూరు జిల్లా కారాగారంలోనే 130 మంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ ఓపెన్ స్కూల్ నడుపుతున్నామనీ, గత ఏడాది 11 మంది, ఈ ఏడాది ఐదుగురు పదో తరగతి పరీక్షలు రాసి ఫస్ట్క్లాస్లో పాసయ్యారని చెప్పారు. అన్ని జైళ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ద్వారా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. వారు జైలు నుంచి విడుదలయ్యాక బ్యాంకు రుణాలు పొంది కొత్త జీవితం ప్రారంభించవచ్చని చెప్పారు. ఖైదీలతో యోగా, వ్యాయా మం చేయిస్తున్నారని, మహిళా ఖైదీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు వివరించారు. వాల్మీకిపురంలో నూతన జైలు భవనం దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జైళ్ల కేంద్రాలు చిత్తూరు (జిల్లా కారాగారం) తిరుపతి మదనపల్లె పీలేరు శ్రీకాళహస్తి సత్యవేడు మూసివేసిన కేంద్రాలు పుత్తూరు పలమనేరు చంద్రగిరి వాల్మీకిపురం పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురం జైళ్లు మూసివేత దశాబ్దాలు గడుస్తున్నా ఊసేలేని కొత్త కారాగారాల నిర్మాణం పట్టించుకోని ప్రభుత్వంప్రతిపాదనలు పంపించాం వాల్మీకిపురంలో జైలు నిర్మాణానికి 2012లో రూ.4 కోట్లు మంజూరైంది. తొలిదశలో రూ.2 కోట్లు విడుదల కాగా అంతవరకు పనులు జరిగి ఆగిపోయాయి. ఇటీవలే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. పలమనేరులో జైలును 15 ఏళ్ల క్రితమే మూసివేశారు. 40 సెంట్లు మాత్రమే ఉన్న ఆ స్థలంలో నూతన జైలు నిర్మాణానికి అవకాశం లేదు. ఇక్కడ స్థలాన్ని ఐఓసీ పెట్రోల్ బంకుకు కేటాయించాం. పలమనేరులో మరోచోట జైలు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కావాలని జిల్లా కలెక్టర్ను నివేదిక సమర్పించాం. అది పరిశీలనలో ఉంది. పుత్తూరులో జైలు నిర్మాణానికి నిధులు మంజూరు కావల్సి ఉంది. – ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా జైలు అధికారి, చిత్తూరు -
పకడ్బందీ వసతికి ప్రత్యేక శ్రద్ధ
తిరుపతి అర్బన్ : జిల్లాలోని హాస్టళ్లలో పకడ్బందీగా వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వసతిగృహాల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ హాస్టళ్ల అధికారి విక్రమకుమార్రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్రనాథ్రెడ్డి, అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల డీసీఓ గీత, ఇంజినీరింగ్ అధికారి బాలసుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. గ్రీవెన్స్ అర్జీలకు ప్రాధాన్యం గ్రీవెన్స్లో వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్, డీఆర్ఓ నరసింహులతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం వచ్చే అర్జీలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ ఓపెన్కు ఆస్కారం లేకుండా వినతులను పరిష్కరించాలన్నారు. మండల, డివిజన్ స్థాయిలోను తప్పకుండా ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దీపం పథకం ద్వారా అందిస్తున్న గ్యాస్ సిలిండర్లకు గడువులోపు రాయితీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సరుకులను కార్డుదారులకు పంపిణీ చేయాలని కోరారు. బియ్యంతోపాటు అన్ని రకాల సరుకులు అందించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లను మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. పంచాయతీల్లో ప్రతి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా డోర్ టూ డోర్ సేకరించాలని తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్ పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్కు స్లాట్ తప్పనిసరి
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ అరుణ్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టారు. అరుణ్కుమార్ మాట్లాడుతూ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 మధ్యలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ఆ మేరకు నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక సబ్ రిజిస్టార్ ఉన్న కార్యాలయంలో గరిష్టంగా 39 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నచోట గరిష్టంగా 78 స్లాట్లను రోజూ కేటాయిస్తామని వివరించారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్లోని స్టాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్లాట్ పొందవచ్చని తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న తనిఖీలు
తిరుమల : తిరుమలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ సీవీఎస్ఓ హర్షవర్ధన్రాజు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మూడోరోజు మంగళవారం సైతం పోలీసులు, విజిలెన్స్, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్శాఖల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుమలలోని పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలు, భవన నిర్మాణాలను పరిశీలించారు. ఆయా చోట్ల కూలీలను ఆరా తీశారు. అనంతరం ఫొటో స్టూడియోలు, దుకాణాలను తనిఖీ చేశారు. అనధికార వ్యక్తులు కొండ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.టీటీడీ సీవీఎస్ఓగా మురళీకృష్ణతిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్ఓ)గా కేవీ మురళీకష్ణను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం, 16వ బెటాలియన్ కమాండెంట్గా మురళీకృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు.గతంలో ఆయన తిరుపతిలోని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, అదనపు ఎస్పీగా, తిరుమల అదనపు ఎస్పీగా అనంతరం అనంతపురం ఎస్పీగా, అనకాపల్లె ఎస్పీగా పనిచేయడం గమనార్హం.అగ్ని ప్రమాదంలో దంపతులకు గాయాలురేణిగుంట : మండలంలోని వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరా లు.. కాలనీలో నివసిస్తున్న సుబ్బయ్య భార్య రాణి ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు వేయడంతో కాపాడేందుకు సుబయ్య యత్నించగా ఆయనకు సైతం మంటలు తగిలాయి. ఈ ప్రమాదంలో రాణికి 60శాతం, సుబ్బయ్యకు 20శాతం శరీరం కాలిపోయింది. బాధితులను వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్సైదాపురం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పంచాయతీ కార్యదర్శి యజ్దానీబాషాను సస్పెండ్ చేస్తూ పీఆర్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యజ్దానీబాషా గతంలో సైదాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేప్పుడు రూ.20,33,646 ఉపాధి నిధులను నేరుగా విత్డ్రా చేసినందుకు సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాడు–నేడు పథకం కింద సచివాలయ భవనాల నిర్మాణం కోసం వెచ్చించిన ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
బుచ్చినాయుడుకండ్రిగ : కార్లను అద్దెకు తీసుకుని నగదు చెల్లించకుండా, వాహనాలను తిరిగి అప్పగించకుండా మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన జావీద్, శివ వద్ద ఐదు కార్లను నెల బాడుగకు సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామానికి చెందిన చెంగయ్య అలియాస్ ప్రవీణ్ తీసుకున్నాడు. ఒక్కో కారుకు రూ.45వేల చొప్పున అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక్క నెల మాత్రం బాడుగ సొమ్ము చెల్లించాడు. తర్వాత అద్దె నగదు ఇవ్వకుండా, కార్లను సైతం అప్పగించకుండా మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు చెంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. -
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన పరీక్షల నిర్వహణపై డీఆర్వోతో కలసి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జిల్లాలో 13 కేంద్రాల్లో 5,261 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోను విద్యుత్ అంతరాయం ఉండరాదని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా తాగునీరు వసతి, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీవో రామమోహన్, తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గౌరవమూ లేదు.. వేతనమూ రాదు
● ఎంపీటీసీలకు రెండేళ్లుగా అందని గౌరవ వేతనాలు ● ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పక్కన పెట్టేశారు ● టీడీపీ మద్దతుదారులకే ప్రాధాన్యం ● తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వరదయ్యపాళెం: కూటమి ప్రభుత్వం అధికారులోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు గౌరవంతోపాటు వేతనాలు లేకుండా పోయాయి. ఎంపీటీసీ సభ్యునికి నెలకు రూ.3వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఎంపీటీసీలకు వేతనాలు చెల్లించలేకపోయింది. జూన్ 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతకుముందు పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు దాదాపు రెండేళ్లకు పైగా వేతనాలు రావాల్సి ఉంది. కానీ నేటికీ తమకు రావాల్సిన వేతనాలపై దృష్టి సారించడంలేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రజలచేత ఎన్నికై న ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేం, అభివృద్ధి పథకాల్లో టీడీపీ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు అధికారులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. సర్వసభ్య సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడమే తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తమను ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. నిధులు మంజూరుపైనా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. ఇలా తమను వివక్షతకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. -
● అన్నదాత సుఖీభవకు పంగనామాలు ● ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు అందని వైనం ● సవాలక్ష ఆంక్షలతో రైతులు సతమతం ● అర్హుల జాబితాలో మళ్లీ జల్లెడ పడుతున్న యంత్రాంగం
పెట్టుబడి సాయం లేదు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడి సాయం ఊసెత్త లేదు. సాగు ఖర్చులకు అప్పుల చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఖరీప్ సీజన్ మొదలైంది. ఈ సీజన్కు అయినా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారో.. లేదోమరి. –జనార్దన్రెడ్డి, రైతు సీజన్లు ముగిసినా..! అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది ఖరీప్, రబీ సీజన్లు ముగిశాయి. తాజాగా మళ్లీ ఖరీఫ్ వచ్చింది. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ అందించాలి. –నరేంద్ర యాదవ్, రైతు గతంలో రైతుకు ప్రాధాన్యం ఖరీప్ సీజన్ మొదలైంది. జోరుగా వరినాట్లు వేస్తున్నారు. పెట్టుబడికి అవసరమైన మేరకు డబ్బులు అందక అప్పులు చేయాల్సి వస్తోంది. పేద రైతులను ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అన్నదాత సుభీభవ పథకం ద్వారా చిన్న సాయం చేసినా రైతులకు అదే పెద్ద వరంగా మారుతుంది. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతు సుభిక్షంగా.. సంతోషంగా ఉండేవాడు. – రాజశేఖర్, రైతుకూటమి ప్రభుత్వంలో రైతులు నట్టేట మునిగిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా అలవిగాని హామీలు గుప్పించిన కూటమి నాయకులు వాటిని అమలు చేయకపోవడంతో గందరగోళానికి లోనవుతున్నారు. ప్రతి పంటకూ అప్పులు చేసి.. వడ్డీలు కడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ఖరీఫ్లోనైనా అన్నదాత సుఖీభవ డబ్బులు అందుతాయో లేదోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. నారు పెరుకుతున్న కూలీలుగత ప్రభుత్వంలో రైతు భరోసా లబ్ధి ఇలా.. సంవత్సరం రైతులు నగదు (రూ.కోట్లలో) 2019–20 1,55,207 119.97 2020–21 1,79,030 134.81 2021–22 1,81,7100 136.55 2022–23 1,76,435 134.73 2023–24 1,80,763 137.01తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో పంట సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ ఊసేలేదు. రైతులు వెయ్యి కళ్లతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు విడుదల చేయకపోగా.. సర్వేల పేరుతో సవాలక్ష ఆంక్షలు విధించడంపై రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకూ క్రమం తప్పకుండా రైతు భరోసా అందించిందని గుర్తుచేస్తున్నారు. అర్హులను తగ్గించే కుట్ర ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పదికి పైగా సర్వేలు చేపట్టారు. అందులో ఇన్కం ట్యాక్స్ కట్టేవారు.. అద్దె తీసుకునేవారు, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నవారు, వెబ్ల్యాండ్లో పేర్లు లేనివారు, పేర్లుతోపాటు వివరాలు తప్పులు తడకగా ఉన్నవారు అంటూ వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అర్హుల జాబితా నుంచి తమను తొలగిస్తారేమోనని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదోఒక విధంగా అర్హుత జాబితాను తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని చర్చించుకుంటున్నారు. పరిశీలిస్తూ..సహనాన్ని పరీక్షిస్తూ! జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 442 ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారు. 442 రైతు సేవా కేంద్రాల్లో 310 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు అగ్రికల్చర్ అసిసెంట్లకు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు వారు అన్నదాత సుఖీభవకు అర్హులు ఎవరో తేల్చడానికి జోరుగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2.8 లక్షల మంది రైతులు జిల్లాలో 2.8 లక్షల మంది రైతులు ఉన్నారు. భూములు ఉన్న ధనవంతులు లక్ష మంది దాకా ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా లక్ష మంది ధనికులు మినహా మిగిలిన 1.8 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించింది. గత ఏడాదిగా కుటుంబాల విభజన నేపథ్యంలో భూములున్న రైతులు ప్రస్తుతం 3.2 వేల మంది ఉన్నారు. అన్నదాత సుభీభవ పథకానికి 2.2 లక్షల మంది దాకా అర్హులు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి. అయితే ఇటీవల సచివాలయ ఉద్యోగులు చేపట్టిన సర్వేల ఆధారంగా వాటి సంఖ్యను మరింత తగ్గించనున్న ట్టు చర్చసాగుతోంది. పథకం అమలయ్యే నాటికి ఎంతమంది తగ్గిపోతారో వేచి చూడాల్సిందే.గతంలో ప్రతి రైతుకూ రూ.13,500 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా కింద ప్రతి రైతుకూ రూ.13,500 ఇచ్చేవారు. ఏడాదిలో మూడు సార్లుగా కేంద్రం రూ.6,500, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చొప్పున మంజూరు చేసేవారు. కులం, మతం, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా అర్హుతే ప్రామాణికంగా పథకాన్ని అమలు చేశారు. పరిశీలిస్తున్నాం అన్నదాత సుఖీవన పథకానికి అర్హులు ఎవరు.. అనర్హులు ఎవరు..? అనే అంశాలపై జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు జోరుగా పరిశీలిస్తున్నారు. మరో పది రోజుల్లో పరిశీలన పూర్తి చేయనున్నారు. కుటుంబాల విభజన నేపథ్యంలో రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భూము లన్న రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుది జాబితాను సిద్ధం చేస్తున్నాం. అర్హులందరికీ అందిస్తాం. –ప్రసాద్రావు, డీఏఓ -
పోలీస్ గ్రీవెన్స్కు 67 వినతులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్దన్రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పది సప్లిమెంటరీకి 466 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,647 మంది హాజరుకావాల్సి ఉండగా వారిలో 466 మంది గైర్హాజరవ్వడంతో 1,181 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 167 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 25 మంది గైర్హాజరవ్వడంతో 142 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈఓ పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వెంకటగిరి రూరల్ : పట్టణంలోని ఎస్పీకేఎం ఐఐహెచ్టీ (శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)లో డిప్లొమా కోర్సులు చేయడానికి ఈనెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఓఎస్డీ ఎస్.గిరిధర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిహెచ్టీటీ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కోర్సులో మొత్తం 53 సీట్లు ఉన్నాయని, తమిళనాడులోని సేలం 12, కర్ణాటకలోని గడక్లో 4 సీట్లుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పదోవ తరగతి ఉత్తీర్హులైన వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. లేదా ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, ఒకేషనల్ (టెక్స్టైల్స్, ఐటీఐ రెండేళ్లు) కోర్సులు పూర్తిచేసుకున్న వారు నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందచ్చని తెలిపారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా చేనేత, జౌళిశాఖలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఆసక్తిగల వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఐఐహెచ్టీవీజీఆర్.కమ్, 9866169908, 9010243054 నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు. మృత్యుంజయుడికి విశేష పూజలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్లం, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. -
మీ కోసమే ‘స్విమ్స్ సేవ’
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ‘స్విమ్స్ సేవ’ను ప్రారంభించినట్లు డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. రోగుల సౌకర్యర్థం స్విమ్స్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులను ఒక బ్యాచ్కు 20 మందిని నియమించి సోమవారం నుంచి స్విమ్స్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్లో కూడా స్విమ్స్ సేవ ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ సూచించినట్టు పేర్కొన్నారు. ఆస్పత్రిలో దాదాపు 42 విభాగలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుంచి రోజుకు దాదా పు 1,500 మంది రోగులు వస్తున్నారని, వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏయే వైద్య సేవలందుతున్నాయో తెలియడం లేదన్నారు. అందుకోసం వారిని స్విమ్స్ ఓపీడీ బ్లాక్, శ్రీ పద్మావతి ఏపీడీ బ్లాక్ వద్ద రోగులు ఏపీ రిజిస్ట్రేషన్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం ఈ సేవను ప్రారంభించినట్టు తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కాలేజ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, చీఫ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ వివేకానంద్, మురళి, శిరీషా పాల్గొన్నారు -
ఉద్యానం.. అధ్వాన్నం!
ఈ ఫొటోలోని రైతు పేరు వరప్రసాద్రాజు, సైదాపురం మండలం, లింగసముద్రం గ్రామం. పదెకరాల్లో సుమారు 1,100 నిమ్మచెట్లు సాగు చేశాడు. ప్రతి ఏటా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గిట్టుబాటయ్యేది. కానీ ఈ యేడు కనీసం పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్నాడు. సీజన్లోనూ నిమ్మకాలు అడిగే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పెట్టబడి సాయం అందించి ఉంటే కొంతవరకై నా అప్పులు తీరేవని చెబుతున్నాడు. ఈ ఫొటోలోని రైతు పేరు కుంచం సుబ్బయ్య. ఊరు సైదాపురం. గ్రామంలో ఐదెకరాల వరకు కౌలుకు తీసుకుని ప్రతి ఏటా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాడు. ఈ ఐదెకరాల్లో ఈ ఏడాది 20 పుట్ల ధాన్యాన్ని పండించాడు. సరైన గిట్టుబాటు ధరలేక.. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగి సౌకర్యం లేక రోడ్డుపైనే పోసి నిరీక్షించాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో పుట్టి రూ.17 వేలకు తెగనమ్ముకున్నాడు. అదే పుట్టి గత ఏడాది రూ.24 వేల వరకు విక్రయించినట్టు పేర్కొంటున్నాడు. ఈ యేడు పెట్టుబడి ఎక్కువ.. గిట్టుబాటు తక్కువని లబోదిబోమంటున్నాడు. .. జిల్లాలో ఈ ఇద్దరి రైతుల పరిస్థితే కాదు.. ప్రతి రైతుదీ ఇదే దుస్థితి. సరైన దిగుబడి లేక.. పెట్టిన పెట్టుబడి చేతికందక.. ప్రభుత్వం ఆదుకోక అప్పుల పాలవ్వాల్సి వచ్చింది. -
మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం!
● ఎంపీ నిధులతో ఆదరంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం ● ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేష్ కేవీబీపురం: ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వ ఆగడాలు మీతిమీరుతున్నాయి. వీటన్నింటినీ వైఎస్సార్సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తాం’ అని ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. మండలంలోని ఆదరం గ్రామంలో ఎంపీ నిధులు రూ.11.64 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను సోమవారం వారు ప్రారంభించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక గ్రామస్తులు తాగునీటి ఇబ్బంది గురించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తన నిధుల ద్వారా సమస్యను పరిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తెలుగుగంగ నీటిని కాళంగి రిజర్వాయర్కు రప్పిస్తే 17వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధుల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు వీధిలైట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిలక్ష్మీ నందకుమార్, జెడ్పీటీసీ మూర్తి మునెమ్మ, మండల పార్టీ కన్వీనర్ గవర్లకృష్ణయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు ధనంజయులురెడ్డి, పార్టీ కార్యదర్శి లాల్బాబుయాదవ్, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు శాస్త్రిరాజు, వైస్ ఎంపీపీ శ్రీనివాసయాదవ్, నాయకులు దశరథరామిరెడ్డి, మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
● గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● పట్టించుకోని కూటమి నేతలు
సైదాపురం: జిల్లాలో ద్యానపంటలు సుమారు 30 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో మామిడి 24 హెక్టార్లు, నిమ్మ 4 వేల హెక్టార్లు, రెండు వేల హెక్టార్లలో అరటి, పూలు, జామ తదితర పంటలు సాగుచేస్తున్నారు. అలాగే వరి దాదాపు లక్ష ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా నిమ్మ, మామిడి రైతుకు ఈ ఏడాది నష్టాలు తప్పలేదు. వేసవిలోనూ కిలో నిమ్మ కాయలు రూ.50 నుంచి రూ.70 లోపే పకాయి. అదే కిలో నిమ్మకాయలు గత ఏడాది రూ.150కి పైగా పలికాయి. మిరప, టమాట, చినీ, అరటి రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అన్నదాత సుఖీభవ ఏదీ? గత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తవుతున్నా నేటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లభించ లేదు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వం రైతు భరోసా అందించి ఆదుకుంది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడిస్తుందో తెలియడం లేదు. – శ్రీనివాసులురాజు, రైతు -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో 5, పుత్తూరులో 2, గూడూరులో 4, మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. రెండు సెషన్స్లో కలిపి 2,458 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 181 మంది గైర్హాజరవ్వడంతో 2,277 (92.64 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటీలో కార్యశిబిరం ప్రారంభం ఏర్పేడు: పరిశోధన పద్ధతులు– మల్టీ వేరియేట్ డేటా విశ్లేషణపై సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఐదు రోజల పాటు జరగనున్న కార్యశిబిరం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీలోని హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ బహినిపతి సారథ్యంలో డీన్ ప్రొఫెసర్ ముత్తుకుమార్ పళనిస్వామి పరిశోధన పద్ధతులపై ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పీహెచ్డీ పరిశోధన విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు యాభై మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్, నిర్వహణ, లైఫ్ సైన్సెస్, హ్యుమానిటీస్తో సహా విభిన్న నేపథ్యాలకు చెందిన వారు హాజరు కావటంతో వారికి వివిధ సెషన్లలో విభాగ అధ్యాపక సభ్యులు డాక్టర్ వనీత్ కశ్యప్, డాక్టర్ విష్ణు, సీ.రాజన్ పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించారు. కాగా ఈ నెల 23వ తేదీ వరకు ఈ వర్క్షాపు జరగనుంది. ఒత్తిడి చేయొద్దు తిరుపతి అర్బన్: ‘మ్యాంగో పల్స్(జ్యూస్) ప్రాసెసింగ్ సంస్థల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయి. వాటిని విక్రయించడానికి సమయం పడుతుంది. అప్పుడు వరకు వడ్డీలు కట్టలేరు. బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేయొద్దు’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సోమవారం ఉద్యానశాఖ, బ్యాంక్ అధికారులతో వర్చువల్ పద్ధతిలో సమీక్షించారు. ఇటీవల మామిడి ఫ్యాక్టరీ యజమానుల పల్స్ పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నట్లు వెల్లడించిన అంశాలను గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులు ఆరు నెలలు తర్వాత ఫ్యాక్టరీ యజమానులు వడ్డీలు చెల్లించడానికి అంగీకరం తెలపాలని సూచించారు. ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు. మృతుడు తిరుపతి వాసి చిత్తూరు అర్బన్: చిత్తూరులో గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు తిరుపతికి చెందిన మహాలింగం (63) అని తేలింది. అతు చిత్తూరులో రోడ్డు దాటుతుండగా ఓ స్కూటరిస్టు ఢీ కొన్నాడు. చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహాలింగం మృతి చెందాడు. తొలుత ఇతని వివరాలు తెలియలేదు. పోలీసుల విచారణలో మృతుడు తిరుపతిలోని శ్రీనివాసనగర్కు చెందిన వాడని గుర్తించారు. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీర్ బాటిల్తో దాడి
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో మద్యం తాగిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన హరికి మద్యం తాగే అలవాటు ఉంది. గత మూడు రోజులుగా తిరుపతిలో కొత్తగా పరిచయమైన వ్యక్తితో కలసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఆదివారం హరికి పరిచయమైన వ్యక్తితో ఆదివారం మాటామాటా పెరిగి గొడవ కావడంతో హరి చేయి చేసుకున్నాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో ఒంటరిగా ఉన్న హరిపై సదరు గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గట్టిగా అరవడంతో దాడి చేసిన వ్యక్తి పరారవగా రక్తగాయాలతో పడి ఉన్న హరిని రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు ఆస్పత్రిలో బాధితున్ని కలసి గొడవకు గల కారణాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
అనధికార వ్యక్తులు తిరుమల ఖాళీ చేయాల్సిందే
తిరుమల : తిరుమల భద్రతలో భాగంగా టీటీడీ సీవీఎస్వో వీ.హర్షవర్ధన్రాజు ఆదేశాలతో పోలీసులతోపాటు విజిలెన్స్, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శ్రీవారి మెట్టు, ఆదిశేషు అతిథిగృహం, ఎంబీసీ–34 ప్రాంతంతోపాటు ఎస్ఎంసీ, ఏటీటీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు కూలి పనులపై వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు. అదేవిధంగా తిరుమలలో అనధికారికంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించి వారిని అక్కడి నుంచి పంపిచేశారు. తిరుమలలో నిర్మాణాలను పరిశీలించి ఆయా ప్రాంతాలను బాంబ్, డాగ్స్వ్కాడ్తో తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని ఫొటోగ్రాఫర్స్, పండ్ల దుకాణాలు, బడ్డీ కొట్టులను పరిశీలించారు. అనధికార వ్యక్తులు వెంటనే తిరుమల ఖాళీ చేయాలని హెచ్చరించారు. -
నా కుమారుడిది సహజ మరణం కాదు
● అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి నాయుడుపేట టౌన్: ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
ఉపాధ్యాయ బదిలీ నిబంధనలు సవరించాలి
● రేపు చిత్తూరు డీఈఓ కార్యాలయం ముట్టడి ● జయప్రదం చేయాలని పిలుపు ● ఒక్కటైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తిరుపతి ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి చేసిన చట్టంలోని అసంబద్ధ నియమాలు, పాఠశాల పునర్వ్యవస్థకు సంబంధించిన వాటిని తక్షణమే సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాలరెడ్డి, జగన్నాథం, సాంబిరెడ్డి మాట్లాడుతూ 117జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పైగా 117జీఓ రద్దు పేరుతో గతంలో ఆరు రకాలుగా ఉన్న పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పాఠశాల స్థాయిలో ఉన్న భౌతిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడం, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా వచ్చాయని విమర్శించారు. దీంతో పాటుగా 3, 4, 5 తరగతులను మోడల్ స్కూల్ పేరుతో తరలించడం వల్ల అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోవడంతో పాటు చిన్న పిల్లలు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లడం భారంగా ఉంటుందన్నారు. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారని విమర్శించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న చేపట్టే చిత్తూరు డీఈఓ కార్యాలయ ముట్టడిని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు సురేష్, దండు రామచంద్రయ్య, బండి మధుసూదనరెడ్డి, వయ్యాల మధు, సుభాష్ చంద్రదాస్, వెంకటరమణ, రెడ్డిశేఖర్, మోహన్రెడ్డి, మహేష్ పాల్గొన్నారు. -
అర్జీదారుల కోసం ఎదురు చూపు!
తిరుపతి అర్బన్: అర్జీదారుల కోసం అధికారులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు లేక కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. మొత్తం 257 వినతులు రాగా అందులో 155 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ దేవేంద్రరెడ్డి, రోస్మాండ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. -
మహిళా రక్షణకు మిషన్శక్తి వన్ స్టాప్ సెంటర్
తిరుపతి అర్బన్: మిషన్శక్తి వన్స్టాప్ సెంటర్ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, గృహ హింస, బాల్య వివాహాలు, కిడ్నాపింగ్, సైబర్ నేరాలు తదితర అంశాల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి మిషన్ శక్తి వన్స్టాప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉచిత న్యాయ రక్షణ, వైద్యం, కౌన్సెలింగ్, వసతి సాయం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181పై అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, డీఎంహెచ్వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు జాబ్మేళా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని డీఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించనున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు సమాచారం కోసం 918639835953 ,9700561225, 9988853335లో సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ఉపాధికల్పనాధికారి వెంకటరమణ, డీఎల్డీఓ నారాయణరెడ్డి, గణేష్ పాల్గొన్నారు. వాట్సాప్ మనమిత్ర సేవలు ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ మనమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి వాట్సాప్ మనమిత్రను ఆవిష్కరించారు. జిల్లా సచివాలయ అధికారి నారాయణరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 933 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 11,196 మందికిగాను 840 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 10,356 మంది పరీక్ష రాశారు.అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 1,473 మందికిగాను 93మంది గైర్హాజరవ్వడంతో 1,380 మంది పరీక్షను రాశారు. సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం, మధ్యాహ్నం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బీపీసీ విద్యార్థులకు) పరీక్షను నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ జీవి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
రోజుకు రూ.8 కోట్లపైనే వ్యాపారం
జిల్లా సమాచారం ప్రైవేటు ఆసుపత్రులు 1245 మెడికల్ షాపులు 2089 ప్రభుత్వాసుపత్రుల్లో రోజుకు మందుల ఖర్చు రూ.4 కోట్లు ప్రైవేటు మెడికల్ షాపుల్లో రోజుకు జరుగుతున్న వ్యాపారం రూ.8 కోట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోనూ ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రజల అనారోగ్య పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అనుమతి లేని కంపెనీలకు చెందిన మందులు, మాత్రలను విక్రయిస్తూ రోజుకు సుమారు రూ. 8 కోట్లకు పైగా దండుకుంటున్నారు. మెడికల్ షాపులో పనిచేసే ఫార్మసీ ఉద్యోగులే డాక్టర్లుగా పలానా జబ్బుకు ఈ మందులు వాడితే సరిపోతుందంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ను సంప్రదించే శక్తిలేక మందులషాపుల వారు ఇచ్చే మాత్రలు విచ్చలవిడిగా తీసుకుంటూ అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. -
● 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం ● 40 ఎకరాల మేర మేత బీడు, వంక భూముల ఆక్రమణ ● బినామీ పేర్లతో కాజేసిన కూటమి నేత ● బాస్ వెనకున్నారని బరితెగింపు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సాక్షిటాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం, అనుపల్లి నుంచి బండపల్లి, 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లి ప్రాంతం మీదుగా తచ్చూరు నేషనల్ హైవే రోడ్డు ఉంది. దీనిపక్కనే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఇదే అదునుగా భూకుబేరులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ముడుపులకు ఆశపడిన కొందరు సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయోనని గాలించారు. మేత బీడు, వంక భూములు, డీకేటీ భూములు, అటవీశాఖ భూములను వరుసగా దోచుకునేందుకు పక్కా స్కెచ్చేశారు. సర్వేయర్తో స్కెచ్ గీయించుకుని వీర్వోలను బుట్టలో వేసుకున్నారు. భూకుబేరుల కుటుంబీకులు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీగా మలుచుకున్నారు. వాళ్లకే తెలియకుండా 25 నుంచి 30 మంది వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల మేర పలు సర్వే నంబర్లలో భూములు కేటాయించారు. ఎగువమాసాపల్లి వద్ద ఏం చేశారంటే.. 194. వెంకటాపురానికి చెందిన కూటమి నేత, భూకుబేరుడు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దూరపు బంధువులు కూడా. ఈ నేపథ్యంలో 194 వెంకటాపురం వద్ద ఎందుకు భూ సమస్య అంటూ వదలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రూట్ మార్చుకుని ఎగువమాసాపల్లి ప్రాంతంలో 20 ఎకరాల భూములున్నాయని తెలుసుకున్నారు. అక్కడి అటవీశాఖ, డీకేటీ భూములను ఆక్రమించే పనిలో పడ్డారు. అనుచరులను రంగంలోకి దింపి జేసీబీలతో చదును చేయించారు. మూడో రోజు ముచ్చటగా ఎగువమాసాపల్లికి చెందిన కూటమి నేత, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అఽధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే అది అటవీ భూమి అని తేలింది. బాస్ ఉన్నారనే.. అధికారం ఉంది.. బాస్(తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే) అండ ఉంది.. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భూకుబేరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆక్రమిత భూముల జోలికి ఎవరు అడ్డొచ్చినా బాస్ పేరుతో బెదిరిస్తున్నారు. ‘భూములు నావి కావు.. మా బాస్వే... మీ వల్లయ్యింది చేసుకోండి’ అంటూ భూకుబేరులు బహిరంగంగా చెబుతున్నారు. మేమంతా బినామీలే.. .. టచ్ చేస్తే ఎలికాప్టర్లోనే దిగుతారని భయపెడుతున్నారు. కాగా ఈ భూమి పక్కాగా చేతుల్లోకి వస్తే బినామీలు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా డీల్ సెట్ చేశారని సమాచారం. అందుకే ఆ బినామీలు కూడా భూ కుబేరుల వెనుక బ్రహ్మస్తంలా పనిచేస్తున్నారు. సర్వేలో అటవీ భూమిగానే గుర్తించాం ఎగువమాసాపల్లిలో ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించాం. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. జేసీబీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వారు ఇచ్చిన సమాచారం మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నాం. వీటిని సోమవారం డీఎఫ్కు అందిస్తాం. ఆక్రమణదారులపై తదిపరి చర్యలు ఉంటాయి. రెవెన్యూ అధికారులతో సర్వే చేయగా ఆక్రమిత భూమి అటవీ భూములని తేలింది. –థామస్, ఎఫ్ఆర్ఓ, చిత్తూరు ఈస్ట్ కబ్జా చేశారనేది వాస్తవం భూ ఆక్రమణపై ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడు చదును చేసిన భూమి అటవీశాఖ భూమి అని తేలింది. రెవెన్యూ భూముల విషయానికి సంబంధించి తహసీల్దార్ కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు అని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, చిత్తూరుఆక్రమణలపై చర్యలేవి? ఇక అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు పెట్టేందుకు జంకుతున్నారు. కూటమి నేతల ఒత్తిడి ఉండడంతో అటవీశాఖ అధికారులు నోరువిప్పలేక పోతున్నారు. భూ ఆక్రమణదారులు పరారీలో ఉన్నారని సాకుచూపుతున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల కనుసన్నల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే భూ ఆక్రమణల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవ్వాలి
నాయుడుపేటటౌన్ : స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం నాయుడు పేట పట్టణంలో కలెక్టర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, , ఆర్డీఓ కిరణ్మయి, మున్సిపల్ చైర్పర్సన్ దీపికతో కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గోమతి సెంటర్ వద్ద కలెక్టర్ మొక్కలు నాటారు. అక్కడ నుంచి పట్టణంలోని గాంధీపార్కు వద్దకు చేరుకొని పార్కులోని చెట్ల వద్ద వేసవి కాలంలో పక్షులకు ఆహార ధాన్యాలు, మంచి నీటి వసతిని కల్పించేలా మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పడమటి వీధి తదితర చోట్ల చలువ పందిళ్లను కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన వారికి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం పలు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దారు రాజేంద్ర, కమిషనర్ షేక్ ఫజులుల్లా, ఎంపీడీఓ సురేష్బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు రాజేష్, గంగా ప్రసాద్, చెంగయ్య, ధనుంజయ పాల్గొన్నారు. -
ముక్కంటి సేవలో రక్షణశాఖ మంత్రి సలహాదారుడు
శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శనివారం భారత రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బాపిరెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీలకు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : బయోలాజికల్ డైవర్సిటీ–2025 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలకు జిల్లాలోని పలు జెడ్పీ హైస్కూల్, ఎస్పీడబ్య్లూ డీఫార్మసీ విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ , పెయింటింగ్ పోటీలకు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని కె.తేజస్విని ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.పద్మావతమ్మ, బయోడైవర్సిటీ బోర్డు రాష్ట్ర సమన్వయకర్త నీలకంఠయ్య అభినందించారు. విష్ణు నివాసంలో స్కానర్ తిరుపతి క్రైమ్ : విష్ణు వివాసంలో దొంగలను అరికట్టేందుకు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు శనివా రం ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ను ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం కొచ్చే భక్తులను మోసగించే దొంగలను గుర్తించేందుకు ఇది ఎంతగానో దోహపడుతుందన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారిని పిలిపించి ఫింగర్ ప్రింట్ సేకరించడం ద్వారా వారికి నేర చరిత్ర ఉంటే బయట పడుతుందన్నారు. -
మార్కెట్లోకి ‘కియా కారెన్స్’
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూమ్లో శనివారం కియా కారెన్స్ నూతన కారును ఆవిష్కరించారు. ఎండీ సి.జగన్నాథరెడ్డి, డైరెక్టర్ చెరకు నిరంజన్, సి.భారతి, సి.హోషిమారెడ్డితోపాటు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఎండీ మాట్లాడుతూ.. కియా నుంచి విడుదలైన కియా క్లావిస్ కారులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నట్లు వెల్లడించారు. రోబస్ట్ 18 హై సేఫ్టీ స్టాండర్డ్, బెస్ట్ ఇన్సెగ్మెంట్ 26.62 ఇంచస్ డ్యూయల్ పానోరమిక్ డిస్ప్లే పానెల్, డ్యూయల్ పానె పానోరమిక్ సన్రూఫ్, బాస్ ప్రీమియం సౌండ్ సిస్టెహవిత్ 8 స్పీకర్ అడాస్ లెవల్ 2 విత్ 20 ఆటానమస్ ప్యూచర్ ఉన్నట్లు వివరించారు. 8 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉందన్నారు. కారు బుకింగ్ కోసం 86888 29739 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షోరూమ్ సీనియర్ మేనేజర్ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ భవనమా!
నాగలాపురం: ప్రభుత్వ కార్యాలయాన్ని.. పార్టీ ఆఫీసుగా మార్చేశారు స్థానిక తెలుగు తమ్ముళ్లు.. నాగలాపురం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి పసుపు రంగు పులిమేశారు. ప్రభుత్వ కార్యాలయానికి టీడీపీ రంగు వేయడంపై ఇది పభ్రుత్వ కార్యాలయమా? పార్టీ ఆఫీసా అని విమర్శలు గుప్పిస్తున్నారు. రంగులు మార్చడానికి చేసే ఖర్చుతో అభివృద్ధి పనులు చేస్తే బాగుండేదని ప్రజలు హితవు పలుకుతున్నారు. అధిక రక్తపోటుపై అవగాహన తిరుపతి తుడా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ ర్యాలీ ప్రారంభించి ప్రసంగిస్తూ ఏటా సుమా రు 10 లక్షల మరణాలకు అధిక రక్తపోటు కారణం అవుతోందన్నారు. ప్రధానంగా జీవన శైలి గాడి తప్పడమే దీనికి ప్రధాన కారణమన్నారు. శారీరక వ్యాయామం, మంచి పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో కారం, ఉప్పు తగ్గించి తీసుకోవడం చేయాలని సూచించారు. అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు వైద్య నిపుణలతో సదస్సులు నిర్వహించడం ద్వారా నియంత్రించ వచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటి డీఎమ్హెచ్ఓ డాక్టర్ మురళి కృష్ణ, డిఐఓ ఇంచార్జ్ డాక్టర్ ఛత్ర ప్రకాష్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ రూప్ కుమార్, కిరణ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వీయూలోని హాస్టళ్ల తనిఖీ తిరుపతి సిటీ: ఎస్వీయూలో విద్యార్థుల హాస్టల్ గదులు, బ్లాక్లను శనివారం రాత్రి వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, వార్డెన్లు, ప్రిన్సిపాల్ తనిఖీ చేశారు. వర్సిటీ హాస్టళ్లలో కొంతమంది అనధికారికంగా తిష్టవేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గత వారం సాక్షి దినపత్రికలో శ్రీఅనధికార వసతిశ్రీ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా అనధికారికంగా, విశ్వవిద్యాలయానికి డబ్బు చెల్లించకుండా విద్యార్థులు వుంటున్న గదులకు తాళం వేశారు. బయట వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా చెలామణి అవుతున్న వారు ఐ బ్లాక్, ఎఫ్ బ్లాక్లో కొన్నేళ్లుగా వుంటున్నారు. వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆ రెండు బ్లాక్లను తాత్కాలికంగా మూసివేయాలని వార్డెన్లను ఆదేశించారు. 31 వరకు బీఆర్ఏఓయూ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఆ వర్సిటీ అధ్యయన కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి గడువులోపు ఫీజు చెల్లించాలని కోరారు. -
● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతోనే అనారోగ్య సమస్యలు ● అతి ప్రమాదమంటున్న వైద్య నిపుణులు ● జోరుగా ఫార్మసీల వ్యాపారం.. రోజుకు కోట్లలో ఆదాయం
తిరుపతి తుడా : కడుపు మంట.. కీళ్ల నొప్పులు.. జ్వరం వచ్చినా మెడికల్ షాపును ఆశ్రయించడం అలవాటుగా మారింది. జిల్లాలో సుమారు 80 శాతం మంది ప్రజలు ప్రతి రోజూ చేస్తున్న పని ఇదే. వాట్సాప్ గ్రూప్లలోనూ ప్రసార మాధ్యమాలలో సెకన్లలో రోగాన్ని నయం చేసే మాత్రలు ఇవే అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకు ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు వెలిశాయి. ఇష్టానుసారంగా వైద్యుడి సలహాలు లేకుండా మార్కెట్లోని మెడికల్ షాపులలో విక్రయిస్తున్న మాత్రలను వినియోగిస్తే ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే మింగేస్తున్నారు. పొద్దున లేవగానే బ్రష్ చేయడం ఆలస్యం వైద్యులు సలహా లేకుండా మెడికల్ షాపు వారు ఇచ్చే మాత్రలను ప్రజలు మింగేస్తున్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అల్సర్, గ్యాస్ట్రిక్, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలు, గుండె జబ్బులు, తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి ప్రధాన సమస్యలతో బాధపడే రోగులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నారు. దీంతో జిల్లాలో వృద్ధులు, సాధారణ మధ్యవయస్కులు ప్రతి రోజు ఉదయం రెండు నుంచి ఐదు మాత్రలను తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రులలో ప్రధాన జబ్బులకు రోజుకు రూ. 4 కోట్లకు పైగా మందుల కోసం వెచ్చిస్తున్నా, ప్రైవేటు మందుల షాపులలో రెండు రెట్లు అధికంగా వ్యాపారం జరుగుతోంది. యాంటీ బయాటిక్స్తో పొంచి ఉన్న ప్రమాదం నొప్పి త్వరగా తగ్గాలని తపనతో పెయిన్క్లిలర్స్, యాంటి బయాటిక్స్ను ప్రైవేటు మెడికల్ షాపు సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో మెడికల్ షాపు సిబ్బంది చెప్పిన ప్రకారం నొప్పి నుంచి శీఘ్ర ఉపశమనం కోసం అధిక మోతాదులో యాంటిబయాటిక్, పెయిన్కిల్లర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ మాత్రల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగిపోతోంది. వాడిన మందులనే మళ్లీ వాడడం ప్రమాదం జ్వరం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ తదితర సమస్యలకు 90 శాతం మంది సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. గతంలో అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఇచ్చిన మందులను మరోసారి వైద్యులతో సంబంధం లేకుండా అదే మందులను వాడుతున్నారు. ఎక్కువ శాతం మంది చేస్తున్న పొరపాటు ఇదే. అలా వాడడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. – డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ఆర్ఎంవో, రుయా, తిరుపతి రిసిప్ట్ లేకుండా మందులు విక్రయించే వారిపై చర్యలు వైద్యులు సిఫార్సు లేకుండా ఎవరైనా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు. మందులు విక్రయించాలంటే తప్పనిసరిగా వైద్యుల నుంచి రిసిప్ట్ ఉండి తీరాల్సిందే. అలా నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయించే వారిపై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యకు బాధ్యులవుతారు. ముఖ్యంగా అనస్తీసియా సంబంధిత మత్తు కలిగించే మందులు, సిరప్లు అమ్మే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. – సీహెచ్ హరిప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ కేంద్రం, తిరుపతి జిల్లా సొంత వైద్యంతో సైడ్ ఎఫెక్ట్ వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యంతో ఇష్టానుసారం మందులను వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎదుర్కోక తప్పదు. మందులను అధికంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లివర్, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు కొనుగోలు చేయడం , అమ్మడం నేరం. ప్రైవేటు మందుల దుకాణాలలో వైద్యుల సలహా లేకుండా మందులు కొనుగోలు చేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. స్వతహాగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే మందులు వాడితే ఉపయోగం ఉండకపోగా ఇతర సమస్యలు తప్పవు. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి జిల్లా -
చిత్తూరు కమిషనర్కు ప్రమాదం
● టైర్ పంక్చర్ కావడంతో పల్టీలు కొట్టిన కారు ● తీవ్రంగా గాయపడ్డ కమిషనర్ నరసింహ ప్రసాద్, సీసీ అమర్నాథ్రెడ్డిపాకాల:ప్రయాణిస్తున్న కారు వెనుకటైరు పంక్చర్ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కారు పల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్తో పాటు సీసీ అమర్నాథ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో కారు పల్టీలు కొట్టి మెయిన్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు కారు చేరుకుంది. అదే మార్గంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దరిని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
వ్యక్తి దారుణ హత్య
రాపూరు : రాపూరు పట్టణానికి చెందిన వ్యక్తి మండలంలోని తాతిపల్లి వద్ద దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. రాపూరుకు చెందిన షషీ (52) స్థానిక మూడు రోడ్ల కూడలిలో కూల్ డ్రింక్ షాపు నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో షాపు మూసి వేసి ఇంటికి బయలుదేరాడు. కానీ ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం రాపూరు మండలం తాతిపల్లి సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు కండలేరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గురైన వ్యక్తి షషీగా నిర్ధారించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్ , సీఐ సత్యనారాయణ , కండలేరు ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్టీంను రప్పించి పరిశీలించారు. షషీ ముఖం, మెడపైన కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొని..
● తమిళనాడు యువకుడు మృతిచంద్రగిరి : సర్వీసు రోడ్డుపై ఆగి ఉన్న లారీను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి రాయలపురం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడులోని కాడ్పాడికి చెందిన ప్రసన్న(26) వ్యక్తిగత పనుల నిమిత్తం తన బుల్లెట్ వాహనంపై తిరుపతికి పయనమయ్యాడు. రాయలపురం సమీపంలో వస్తున్న క్రమంలో దాబా వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసన్న మృత్యువాత పడ్డాడు. వెంటనే తేరుకున్న లారీ డ్రైవరు లారీతో సహా అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల నిర్లక్ష్యంగానే ప్రమాదాలుజాతీయ రహదారిపై ఉన్న దాబాల వద్ద అనధికారికంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వలనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను నిలువరించేందుక సరైన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ దాబాల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను ఢీకొనడం ద్వారా ఇద్దరు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న దాబాల యజమానులు ప్రతి నెలా పోలీసు శాఖలోని కొంత మందికి మామూళ్లు అందించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పట్టుబట్టారు.. సాధించారు
ఏపీ ఈసెట్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల పంట పండించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన విద్యార్థులు వారి మోములో చిరునవ్వులు చూడాలని కష్టాలకు ఎదురీది అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులతో సాక్షి ముచ్చటించింది.. వారి అభిప్రాయాలు ఇలా.. – తిరుపతి ఎడ్యుకేషన్ వ్యవసాయం చేసి చదివించారు.. డ్రగ్ ఇన్స్పెక్టర్ కావడమే తన ముందున్న లక్ష్యం. ఏపీఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించా. మాది కడప సమీపంలోని ఖాజీపేట. మానాన్న శ్రీనివాసు వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించారు. నేను తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో ఇన్ ఫార్మసీ చదివా. – వీవీఎస్ఎస్ తరుణ్, రాష్ట్ర స్థాయి 6వ ర్యాంకు, ఫార్మసీ విభాగంసివిల్స్ సాధించడమే లక్ష్యం మా నాన్న నారాయణ తిరుపతిలో ఆటో డ్రైవరు. ఇంటర్ తరువాత ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల ఫార్మసీ ఇన్ డిప్లొమో కోర్సును పూర్తి చేశా. ఏపీఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించా. నాలుగేళ్ల కోర్సు అయిన బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందనుండడం ఆనందంగా ఉంది. బీఫార్మసీ తరువాత సివిల్స్ సాధిస్తా. – ఎ.కీర్తి, రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు, ఫార్మసీ విభాగం డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలని.. ఏపీఈసెట్ ఫలితాల్లో 7వ ర్యాంకు సాధించా. మానాన్న రమేష్బాబు చిన్న కిరాణం నడిపిస్తూ చదివిస్తున్నారు. ఇంటర్ తరువాత పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో ఇన్ ఫార్మసీ పూర్తి చేశా. ఈసెట్ ఫలితాల్లో బీఫార్మసీకి అర్హత సాధించా. బీఫార్మసీ అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టరుగా రాణించడమే తన లక్ష్యం. – ఎస్.సుప్రజ, 7వ ర్యాంకు, ఫార్మసీ విభాగంసాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని.. ఏపీఈసెట్ సిరామిక్ టెక్నాలజీ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించా.మాది శ్రీకాళహస్తి మండలం, ఎనగలూరు. మానాన్న వెంకటసుబ్బయ్య వ్యవసాయం కుటుంబం. గూడూరులోని సిరామిక్ టెక్నాలజీ కళాశాలలో డిప్లొమో పూర్తి చేశా. బీటెక్ సీఎస్సీ విభాగంలో సీటు సాధించి సాఫ్ట్వేర్గా రాణించాలన్నదే తన ఆశయం. – ముచ్చేలి కార్తిక్, స్టేట్ ఫస్ట్, సిరామిక్ టెక్నాలజీ సివిల్ ఇంజినీర్గా ఏపీఈసెట్లో 4వ ర్యాంకు సాధించా. మానాన్న కృష్ణమూర్తి తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో చెఫ్గా పనిచేస్తూ చదివించారు. తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ బ్రాంచ్ను సాధించా. బీటెక్లో చేరి మంచి సివిల్ ఇంజినీరుగా రాణించడమే తన లక్ష్యం. –ఎ. శ్రీవెంకట్, 4వ ర్యాంకు, సివిల్ విభాగం -
అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు
తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఆవరణంలోని శ్రీహరి బస్టాండ్లో 17 సీసీ కెమెరాలు, శ్రీనివాస బస్టాండ్లో 11 సీసీ కెమెరాలు, ఏడుకొండల బస్టాండ్లో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 33 సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో 50 శాతం మేరకు పనిచేయడం లేదని, పలు సీసీ కెమెరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అధికారులు దాతల వద్దకు పది రోజులుగా తిరుగుతున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట కార్గో పార్శిల్ విభాగానికి కడప నుంచి రూ.2 లక్షల విలువ చేసే పట్టుచీరలు వచ్చాయి. వాటిని చోరీ చేశారు. వెంటనే సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నారు. ఎంతో కీలకమైన సీసీ కెమెరాలను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం నుంచి 30 కిలోల గంజాయిని తిరుపతి బస్టాండ్ నుంచి తమిళనాడుకు తరలించే క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి బస్టాండ్ ఆధారంగా గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని పోలీసులు కట్టడి చేయాల్సి ఉంది. -
చంద్రబాబువి కక్ష రాజకీయాలు
● ఈ అరెస్టులు అప్రజాస్వామికం ● హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ● తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజం తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేవన్నీ కక్ష రాజకీయాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అరెస్టులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందన్నారు. విపక్ష పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. కూటి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. -
డెంగ్యూపై అవగాహన
తిరుపతి తుడా : జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి స్విమ్స్ ఆసుపత్రి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగ్యూ కేసులు జిల్లాలో నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ డెంగ్యూ దినంను ఏటా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమలో జిల్లా అధికారులు డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, డీపీఎంఓ శ్రీనివాసులు, డాక్టర్ మురళీ కృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 760 గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 10,281 మందికి 658 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 9,623 మంది పరీక్షను రాశారు. అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 24 పరీక్షా కేంద్రా ల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 1,570 మందికి 102 మంది గైర్హాజరవ్వడంతో 1,468 మంది విద్యార్థులు పరీక్షను రాసి నట్లు ఆర్ఐఓ జీవి ప్రభాకర్రెడ్డి తెలిపారు. టీడీపీ గుండాలపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి తిరుపతి మంగళం : తిరుపతి 50వ డివిజన్కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోకం అనిల్కుమార్పై దాడి చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాని బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజును వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కలిసి ఫిర్యాదు చేశారు. తమ కార్పొరేటర్ అనిల్ను చంపడానికి ప్రయత్నించారని, అందుకు తగిన విధంగా 307 కేసు నమోదు చేయాలని పార్టీ నాయకులు ఎస్పీని కోరారు. మరోసారి ఇలా జరగకుండా అనిల్కు రక్షణ కల్పించాలని పార్టీ నాయకులు కోరారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, పార్టీ నాయకులు మద్దాలి శేఖర్, అనిల్రెడ్డి, కుప్పయ్య, న్యాయవాది చంద్ర, కార్పొరేటర్ అనిల్కుమార్ తల్లి కుప్పమ్మ, అక్క కాటమ్మ ఉన్నారు. ముగిసిన వీసీఐ బృందం పర్యటన తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. మూడు రోజులుగా వీసీఐ బృందం కళాశాలలోని పలు విభాగాలు, క్లినిక్లను, ల్యాబ్లను, కళాశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించింది. సమస్యలు, వసతుల కల్పనపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. బృందం పరిశీలించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. -
ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
తిరుపతి ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారింది. ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. రాత్రిపూట ప్రయాణికులు బస్టాండులో ఉన్నంత సేపు భయ భయంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఎటు వైపు నుంచి దొంగలు వచ్చి మీద పడతారో.. ఏ వైపు నుంచి గంజాయి మత్తులో ఏం చేస్తారోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే ఇక నరకానికి పోయినంత పని అవుతోంది.. ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్లే.. తిరుపతి బస్టాండుల్లో సమస్యలు తాండవిస్తుండంతోప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం.తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక నగరంలోని ఆర్టీసీ బస్టాండుల్లో భద్రత కొరవడింది. రాత్రీ పగలు తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఏడుకొండల బస్టాండ్తో పాటు శ్రీహరి, శ్రీనివాస, పల్లెవెలుగు బస్టాండ్లలలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరు మీరు ఎందుకు బస్టాండుల్లో ఉన్నారు..ఏ ఊరికి వెళ్లాలి అని ప్రశ్నించడానికి ఆర్టీసీ కంట్రోలర్స్కు ధైర్యం చాలడం లేదు. దీంతో ప్రయాణికులు తమ బస్సు వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు బిచ్చగాళ్ల వలే ఉంటూ ఒక్కసారిగా ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. బస్టాండ్లోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో చోరీల సమాచారం పోలీసులకు తెలియజేసినా ప్రయోజనం ఉండడం లేదు.కంపుకొడుతున్న మరుగుదొడ్లుతిరుపతి బస్టాండ్లో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఓ వైపు పలు మరుగుదొడ్లు మూతవేశారు. ఉన్న మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి సమస్యలు తప్పడం లేదు. పలు కొళాయిలు పనిచేయడం లేదు. పలు ఫ్యాన్లు తిరగడం లేదు. కుర్చీలు అంతంతమాత్రమే ఏర్పాటు చేశారు. మరోవైపు శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ సమస్యలు చాలదంటూ చోరీలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ తమ బస్సు వచ్చే వరకు భయభయంగా ఉంటున్నారు.ప్రయాణికులకు భద్రత కల్పించాలిప్రధానంగా తిరుపతి బస్టాండ్లో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సి ఉంది. గంజాయి తాగి పలువురు వ్యక్తులు బస్టాండల్లో ఉంటున్నారు. ప్రధానంగా రాత్రి సమయంలో భయం భయంగా బస్టాండ్లులో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి భద్రత కల్పించాలని కోరుతున్నాం.–మణి, ప్రయాణికుడు, తిరుపతిఆందోళనతో గడుపుతున్నాంజిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు సరైన భద్రత లేదు. దీంతో ఆందోళన తప్పడం లేదు. ప్రధానంగా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రతి ప్లాట్ఫాం వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.– రెడ్డప్ప, ప్రయాణికుడు, తిరుపతికనీస వసతులు లేవుతిరుపతి బస్టాండ్లో దుకాణదారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి వస్తువులను విక్రయిస్తున్నారు. వాటిని అదుపు చేయడం లేదు. తమకు కేటాయించిన స్థలంలో కాకుండా అదనపు స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి కొళాయిలు సక్రమంగా లేవు.– వినోద్, ప్రయాణికుడు, తిరుపతి -
అనిల్పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలి
తిరుపతి మంగళం : లోకేష్ రెడ్బుక్ పాలనలో కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలే చరమగీతం పాడుతారని, కార్పొరేటర్ బోకం అనిల్కుమార్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి–కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్కుమార్ను శుక్రవారం భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబానికి మీకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పోలీస్ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం, నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే కార్పొరేటర్ అనిల్పై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని భూమన అన్నారు. న్యాయం జరగకపోతే ఉద్యమమే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన భూమన -
మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
తిరుపతి అర్బన్ : మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్తో పాటు అధికారులు, వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న మామిడి దిగుబడిని ఒక్కసారిగా కోతలు చేయకుండా దశల వారీగా చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డిని ఆదేశించారు. ఓ వైపు రైతులు, మరోవైపు వ్యాపారులు ఇంకో వైపు ఫ్యాక్టరీలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు. ఆ మేరకు ఓ నివేదిక తయారు చేసి తమకు సమర్పించాలని ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాపారులు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి విరివిగా జిల్లాకు మామిడి పండ్లు వస్తున్నాయని చెప్పారు. దాంతో తాము నష్టపోతున్నామని, వాటిని రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులతో పాటు మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ పాల్గొన్నారు. -
జులై 9న అంగన్వాడీల సమ్మె
తిరుపతి కల్చరల్ : రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జులై 9వ తేదీన ఒక రోజు సమ్మె చేపడుతున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీల రాష్ట్ర శిక్షణ తరగతులను శుక్రవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వేతనాల పెంపుపై ఏడాది పాటు పెద్ద ఎత్తున సమ్మె చేసినా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల పెంపుపై ఇప్పటి వరకు జీఓ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జులై 9వతేదీ లోపు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కేఎన్ఎన్.ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.బాలసుబ్రమణ్యం ‘యుద్ధం తదనంతర పరిణామాలు, శాసీ్త్రయ ఆలోచనా విధానం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతలు లక్ష్మీదేవమ్మ, రాజేశ్వరి, ఇంద్రాణి, హైమావతి, సౌజన్య, రేవతి, నాగరాజమ్మ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
డీఎస్సీకి 26,501 మంది దరఖాస్తు
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26,501 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 16వ తేదీతో దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ముగిసింది. జిల్లాలో 1,478 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26,501 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మహిళలే అత్యధికం జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో మహిళలే అత్యధికంగా ఉండడం విశేషం. 26,501 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మహిళలు 16,348 మంది, పురుషులు 10,153 మంది ఉన్నారు. అయితే కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పలు సబ్జెక్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ విధంగా జిల్లాలో 45,221 దరఖాస్తులు నమోదయ్యాయి. ఒక్క పోస్టుకు 31 మంది వరకు పోటీ అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 31 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ డీఎస్సీకి అత్యధికంగా పోటీ ఉండడంతో అభ్యర్థులు పుస్తకాలకు అతుక్కుపోయారు. కొందరు కోచింగ్ సెంటర్లలో, మరికొందరు ఇళ్లల్లో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మెలికలతో పలువురికి నష్టం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లో ఊహించని విధంగా మెలికలు విధించింది. ఈ మెలికల వల్ల జిల్లాలో దాదాపు 6 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి, టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. అయితే, ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సీటీఈ గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కులాల వారీగా దరఖాస్తులు ఇలా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో కులాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ గ్రేడ్–3 అభ్యర్థులు అత్యధికంగా 7,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓసీలో 2,856, బీసీ–ఏలో 4 వేలు, బీసీ–బీలో 3,790, బీసీ–సీలో 101, బీసీ–డీలో 2,570, బీసీ–ఈలో 1,661, ఎస్సీ గ్రేడ్–1లో 4, ఎస్సీ గ్రేడ్–2లో 1,872, ఎస్సీ గ్రేడ్–3లో 7,997, ఎస్టీలో 1,650, ఈడబ్ల్యూఎస్లో 1,664, పీహెచ్ పరిధిలో వీహెచ్ 134, హెచ్హెచ్ 57, ఓహెచ్ 595, ఎంఐ 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
సైనికులకు సంఘీభావం
తిరుపతి, అన్నమయ్య సర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్లో గురువారం రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వేపోలీసు (జీఆర్పీ), ఇతర అధికారులు, రైల్వే మిత్ర బృందంతో కలసి సైనికులకు సంఘీభావంగా జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సందీప్కుమార్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఆశీర్వాదం, జీఆర్పీ ఎస్ఐలు రాంబాబు, రామకృష్ణ, రత్నమాల, స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు చంద్రగిరి : బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆపై బాలికను హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజే ష్నాయక్ తన భార్య, ఆరేళ్ల పాపతో కలసి మండల పరిధిలోని ఎం.కొంగరవారిపల్లి వద్ద ఉన్న ఓ ఇటుక బట్టీ వద్ద దినసరి కూలీగా పనిచేస్తుండగా, సమీప గ్రామానికి చెందిన నిందితుడు బాల కిషోర్ అక్కడే కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది జనవరి 3వ తేదిన బాలిక కనిపించకపోవడంతో రాజేష్ నాయక్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు బాలిక శవమై కనిపించడంతో పోస్టుమార్టం నిర్వహించారు. బాలికపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసినట్లుగా రిపోర్టు రావడంతో పోలీసులు పోక్సో కేసుగా మార్చారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న నిందితుడు బాల కిషోర్ పోలీసుల కళ్లు కప్పి పారిపోవడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఐ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిందితుడిని తిరుపతిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో బాలికకు తినుబండారాల ఆశ చూపి, ఇటుక బట్టీ నుంచి కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపారన్నారు. ఈ మేరకు నిందితుడి వాంగ్మూలం రికార్డు చేసి, రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించినందుకు చురుగ్గా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు నగదు ప్రోత్సాహ బహుమతిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
విదేశీ యూనివర్శిటీతో ఎంబీయూ ఒప్పందం
– అమెరికా యూనివర్శిటీతో ఎంఓయూ చంద్రగిరి : దేశంలోనే మొట్ట మొదటి సారిగా విద్యార్థుల సౌలభ్యం కోసం విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎంబీయూ ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. గురువారం ఎంబీ యూనివర్శిటీలోని దాసరి ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఈ మేరకు అమెరికాకు చెందిన పెన్ స్టేట్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ డేవిడ్ ఎం కాల్లెజో, వీసీ డాక్టర్ వాహిద్ మోటేపల్లిలతో ఎంబీయూ చాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఎంఓఏ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రొ ఛాన్సలర్ మంచు విష్ణు అమెరికాకు చెందిన యూనివర్శిటీ చాన్సలర్, వీసీలతో కలసి ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం చారిత్రకమన్నారు. ఇదొక నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుందని, విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు కోర్సులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. కోర్సును బట్టి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఇక్కడ విద్యనభ్యసించి, మిగిలిన విద్యను అమెరికాకు చెందిన పెన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల్లోని యూనివర్శిటీల్లో ఒకటే సిలబస్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉత్తమ విద్యను అభ్యసించే వారికి స్కాలర్షిప్లను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ప్రో వోస్ట్ నాగరాజ రామారావ్, వీసీ కరుణాకరన్ ఇతర అధికారులు, అధ్యాపకుల బృందం పాల్గొన్నారు. -
విష్ణు నివాసంలో చోరీ
తిరుపతి క్రైమ్ : తిరుమల దర్శనానికి వచ్చిన భక్తుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన విజయ్ భాస్కర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలో గురువారం విష్ణు నివాసానికి చేరుకుని సేద తీరుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతని బ్యాగులోని వస్తువులను దొంగతనానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా 32 గ్రాములు విలువ చేసే నల్లపూసల దండ, రూ.1,20,000 నగదు, 40 వేల రూపాయలు విలువచేసే మొబైల్ ఫోను చోరీకి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాధిని ప్రాథమిక హక్కుగా ఉద్యమించండి
తిరుపతి కల్చరల్: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్న నరేంద్రమోదీని సాగనంపేందుకు యువత, విద్యార్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలు గురువారం సాయంత్రం తిరుపతి ఇందిరామైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా డి.రాజా పాల్గొని ప్రసంగించారు. మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని అమలుచేసి ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇచ్చి ఉండాలని, అధికారంలోకి రాగానే హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అలవంబిస్తున్న మోదీని సాగనంపేందుకు యువత నడు బిగించాలని కోరారు. సేవ్ ప్రభుత్వం రంగ స్థలను మోదీ, ఆదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థగా నడవాలని, రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. నాడు ఇంద్రగుప్త అధ్యక్షతన నియమించిన కమిటీ ఎన్నికల సంస్కరణలను సిఫార్సుచేసిందని అయితే ఆ కమిటీ సిఫార్సులను పాలకులు తుంగలో తొక్కారన్నారు. భారత్ పాక్ మధ్య చెలరేగుతున్న వివాదంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిరంతర సంక్షోభాన్ని సృష్టించారని పేర్కొన్నారు. మతాల మధ్య ఘర్షణలు సృష్టించి, మతోన్మాద ఉద్వేషాన్ని రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ? మోదీని సాగనంపేందుకు యువత నడుం బిగించాలి సీపీఐ జాతీయ నేత డి.రాజా పిలుపు -
మార్కెట్లోకి ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కారు
తిరుపతి కల్చరల్: కెశ్విన్ ఆటో మోటార్స్ షోరూం వారి ఆధ్వర్యంలో గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజీ కంపెనీ వారి సరికొత్త విండ్సర్ ఎలక్ట్రికల్ ప్రో కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎంజీ సౌత్ ఇండియా జోనల్ సేల్స్ మేనేజర్ సౌరవ్ ప్రకాష్, ఏఎస్ఎం అన్ని విల్సన్, కెశ్విన్ ఆటో మోటార్స్ అధినేత ఉదయ్కుమార్రెడ్డి ఎంజీ విండర్ ఈవీ ప్రో కారు ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ విండర్ ఈవీ వాహనం 52.9 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ సౌలభ్యం కలిగి ఒకసారి చార్జింగ్ చేస్తే 449 కిలోమీటర్లు ప్రయాణం చేసే సౌకర్యం ఉందన్నారు. రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో తమ షోరూముల్లో విండ్సర్ ఈవీ ప్రో కారు లభింస్తుదన్నారు. యువకుడిపై కత్తితో దాడి తిరుపతి క్రైమ్ : జాతర రోజు అర్ధరాత్రి ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు పాత కక్షలతో దాడి చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలో నివాసం ఉంటున్న చందు (22) 13వ తేదీ జాతరలోని అన్నదానంలో పాల్గొని రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో సంకల్ప హాస్పిటల్ వద్ద కొంత మంది గొడవ పడుతుండగా చూస్తూ నిలబడ్డాడు. ఈ క్రమంలో చందు ప్రత్యర్థి సురేష్ అనే వ్యక్తి చందును గమనించాడు. సురేష్ కత్తి ఇచ్చి చందుపై దాడి చేయమని చెప్పాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడవగా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేరుకే తిరుపతి జిల్లా..
తిరుపతి అర్బన్ : పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన 2022 ఏప్రిల్ 4న చేపట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు, నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలను విభజించి 34 మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అనేక కార్యాలయాలు చిత్తూరు కేంద్రంగానే నడిపిస్తున్నారు. పలు కార్యాలయాలకు కలెక్టరేట్లో చాంబర్లు కేటాయింపు చేశారు. కానీ ఉద్యోగులను కేటాయించలేదు. దీంతో పలు కార్యాలయాల చాంబర్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న కార్యాలయాలు ఎస్సీ కార్పొరేషన్ అధికారం ఈడీ చెన్నయ్య చేతుల్లో ఉంది. అయితే ఆయన చిత్తూరు ప్రధాన కార్యాలయంలోనే ఉంటున్నారు. తిరుపతి జిల్లాకు కలెక్టరేట్లో ఓ చాంబర్ను అయితే కేటాయింపు చేశారు. అయితే అక్కడ ఎవరూ ఉండడం లేదు. అలాగే ఇటీవల బీసీ కార్పొరేషన్ , మైనారిటీలకు సంబంధించి రాయితీ రుణాలు మంజూరు చేశారు. వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారు పలువురు కలెక్టరేట్కు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చిత్తూరు వెళ్లక తప్పని పరిస్థితి దాపురిస్తోంది. పరిష్కారం కాని విభజన సమస్యలు ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు చిత్తూరుకే పరిమితం మూడేళ్లు దాటిన జిల్లా పునర్విభజన ఖాళీగా కలెక్టరేట్లో కార్పొరేషన్ చాంబర్లు కూటమి సర్కార్లో పట్టించుకోని కార్పొరేషన్ల విభజన ఎస్సీ కార్పొరేషన్ తిరుపతి నుంచే చేపట్టాలి ఎస్సీ కార్పొరేషన్ కార్యకలాపాలు తిరుపతి నుంచే చేపట్టాలి. తిరుపతిలో కార్యాలయం ఉంటే పదే పదే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే చిత్తూరులోనే రెండు జిల్లాలకు చెందిన ఈడీ కార్యాలయం ఉండడంతో అక్కడికి ప్రతిసారి వెళ్లలేకపోతున్నాం. తిరుపతి జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్కు ప్రత్యేక ఈడీని నియమించాలి. – అజయ్కుమార్, ఎస్సీ నేత తిరుపతి బీసీ కార్పొరేషన్ ఈడీని నియమించాలి బీసీ కార్పొరేషన్కు సంబంధించి తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా ఈడీని నియమించాలి. ఈడీ కార్యాలయం రెండు జిల్లాలకు చిత్తూరులో ఉండడంతో పలువురికి అన్యాయం జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి 3 ఏళ్లు గడుస్తున్నా బీసీ కార్పొరేషన్ తిరుపతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడం సరికాదు. – కట్టా గోపి యాదవ్, బీసీ నేత తిరుపతి వృథాగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం విభిన్న ప్రతిభావంతులు జిల్లాలో ఎందరో ఉన్నా రు. కలెక్టరేట్లో ప్రత్యేక చాంబర్ ఉన్నప్పటికీ చిత్తూరులోనే ప్రధాన కా ర్యాలయం ఉందని చెబుతున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యాలయాన్ని తిరుపతికి మార్పు చేయాలి. – దుడ్డు వేణు, ఎస్సీ సెల్ నేత, సత్యవేడు అన్ని కార్యాలయాలు తిరుపతిలోనే పెట్టాలి జిల్లాల పునర్విభజనకు మూడేళ్లు పూర్తయింది. అయినా చిత్తూరు నుంచి పలు విభాగాలను పూర్తిగా తిరుపతి జిల్లాకు మార్పు చేయకపోవడం సరికాదు. చిత్తూరు నుంచే అధికారులు రెండు జిల్లాలను పరిపాలించడం ద్వారా తిరుపతి జిల్లా వాసులకు అన్యాయం జరుగుతోంది. కూటమి నేతలు స్పందించి చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, బీసీ నేత పలు విభాగాల పరిస్థితి అంతే.. ఎస్సీ, బీసీ, మెనారిటీ కార్పొరేషన్ల అధికారం చిత్తూరులో కొనసాగుతోంది. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి సంబంధించి రెండు జిల్లాల అధికారి చిత్తూరులోనే ఉంటున్నారు. కలెక్టరేట్లో నామమాత్రంగా ఓ చాంబర్ను కేటాయింపు చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్ అధికారి (డీసీవో) చిత్తూరులోనే ప్రధాన కార్యాలయం ఉంది. కలెక్టరేట్లో నామమాత్రంగా ఓ చాంబర్ను కేటాయింపు చేశారు. సివిల్ సప్లయ్కు సంబంధించి రేషన్ డీలర్లుకు ఇటీవల పెద్ద మొత్తంలో తమకు రావాల్సిన కమిషన్లు జారీ ప్రక్రియ మొత్తం చిత్తూరులోని సివిల్ సప్లయ్ అధికారి వద్దకే తిరుగుతున్నారు. రెవెన్యూ విభాగంలోనూ బదిలీలు, పదోన్నతులు చిత్తూరు కలెక్టర్ తిరుపతి జిల్లాకు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ వారి మండలాల వారీగా కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా పరిషత్ అధికారం ఇప్పటికీ చిత్తూరు నుంచే కొనసాగుతోంది. తిరుపతి జిల్లాకు ఏ ఒక్క అధికారి లేరు. ఉన్నతాధికారులు అంతా చిత్తూరులోనే ఉంటున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా వాటి జోలికి వెళ్లకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. -
వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా జిల్లాలోని సగం ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం విద్యార్థి సంఘం నేతలు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్న వేసవి తరగతులతో పాటు వసతులు లేని కళాశాలల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు భగత్ రవి, వినోద్, తేజ, శివ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ వర్సిటీ వీసీతో ఎస్వీ ప్రిన్సిపల్ బేటి
తిరుపతి తుడా : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్తో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతికి విచ్చేసిన ఆయనను గురువారం ఓ అతిథి గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. జులైలో రుయా, వైద్య కళాశాలల్లో పర్యటిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు ప్రిన్సిపల్ రవిప్రభు తెలిపారు. కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, పీఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు. గరుడ వారధిపై తాత్కాలికంగా రాకపోకలు నిషేధం తిరుపతి తుడా: తిరుపతి నగరంలో నిర్మించిన గరుడ వారధిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నగరపాలక కమిషనర్ మౌర్య తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఏటా పనుల తనిఖీల్లో భాగంగా స్పాన్ లోడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రామాను జ సర్కిల్ నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వాహనదారులు, ఆర్టీసీ అధికారులు, నగర ప్రజలు మున్సిపల్ అధికారు లు, ట్రాఫిక్ పోలీసులకు సహరించాలని కోరారు. వ్యక్తిపై హత్యాయత్నం : అయిదుగురు అరెస్టు కేవీబీపురం:ఒక వ్యక్తిపై అయిదుగురు కలిసి హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు రంగ ప్రవే శం చేసి అరెస్టు చేసిన ఘటన కేవీబీపురం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ సమాచారం మేరకు ఎంఎ రాజుల కండ్రిగ ఎస్సీ కా లనీలో గ్రామ కంఠం భూమి విషయంలో వచ్చిన తగాదా కారణంతో మునయ్య అనే వ్యక్తిపై అదే కాలనీకిచెందిన బోసు,గిరి, దొరైరాజు, సెల్వ, గోపి అయిదుగురు కలిసి మారణాయుధాలతో దాడి చేయడంతో గాయపడ్డారన్నారు. ఈ మేరకు బాధితుడు శ్రీకాళహస్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ అయిదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం తిరుపతి కల్చరల్ : తిరుమల గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీ ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి గురువారం కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం చెక్కును విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి చేతులు మీదుగా అందించారు. కార్యక్రమంలో గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీలు చెక్కా నాగకుమార్, ఆర్.శ్రీరి, దారా సంతోష్కుమార్ పాల్గొన్నారు.