breaking news
Tirupati District News
-
వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై దాడి
చంద్రగిరి:వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా చంద్రగిరి మండలంలో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. మహిళా సర్పంచ్ కుటుంబంపైన, ఆతర్వాత దళిత మహిళపై దాడి ఘటనలు మరువక ముందే దళిత నాయకుడు, వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురానికి వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీ సభ్యురాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రవీణ్కుమార్పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలో జాతర నిర్వహణపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రవీణ్, గ్రామంలోని వెంకటరమణకు ఫోన్చేసి జాతర వివరాలను అడిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త అమ్మగుంట శీను, వెంకటరమణ వద్ద నుంచి ఫోన్ లాక్కుని ప్రవీణ్ను నానా దుర్భాషలాడాడు. ‘‘నువ్వు ఇక్కడు రారా.. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. నిన్ను ఇక్కడ చంపకపోతే చూడు రా.. నా...’’ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికి ప్రవీణ్ గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు. వెంటనే అక్కడే ఉన్న కర్రలతో అమ్మగుంట శీను ఒక్కసారిగా ప్రవీణ్పై దాడికి తెగబడ్డాడు. దీంతో ప్రవీణ్ తల పగిలి, తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్థానికులు శీనును నిలువరించి, ప్రవీణ్ను హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన టీడీపీ కార్యకర్త చంద్రగిరిలో క్షీణిస్తున్న శాంతి భద్రతలువైఎస్సార్సీపీలో ఉన్నాననే నాపై దాడి వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తుడడంతోనే తన పై టీడీపీ కార్యకర్త దాడికి తెగబడ్డాడని బాధితుడు ప్రవీణ్ వాపోయారు. టీడీపీ నేతలు తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకే రక్షణ కరువైతే సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు. -
ఏటీఎం కార్డు దొంగ అరెస్ట్
రేణిగుంట : ఏటీఎం సెంటర్ల వద్ద కార్డులు దొంగిలించి డబ్బులను విత్ డ్రా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ మంజునాథరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి జిల్లాలో పలు ఏటీఎంల వద్ద కార్డులను దొంగలించి, వారికి తెలియకుండా డబ్బులు విత్ డ్రా చేసేవాడని తెలిపారు. మే నెల 16వ తేదీ శెట్టిపల్లి ఎస్బీఐ వద్ద ఇదే తరహాలో దొంగతనం చేశాడని అన్నారు. ఎల్లమండ్యం ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడని తెలిపారు. అతడి వద్ద వివిధ రకాల ఏటీఎం కార్డులు ఒక స్వైపింగ్ మిషన్, మొబైల్ ఫోన్, రూ.6000 డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్ నిమిత్తం తిరుపతి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సిబ్బంది మహేంద్ర, మణి తదితరులు పాల్గొన్నారు. -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యా బోధన తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది. తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు. ఎయిడెడ్కు అందించాం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తెరిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది. –కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), తిరుపతి త్వరలోనే అందిస్తాం టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయితే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ కారణంతోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే పాఠ్యపుస్తకాలను అందిస్తాం. –వెంకట సునీల్, టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన 3వ అంతర్జాతీయ సమావేశం -
బీఎస్ఎన్ఎల్ అవగాహన సదస్సు రేపు
తిరుపతి సిటీ: తిరుపతి బిజినెస్ ఏరియా, భారత్ టెలికాం నియంత్ర సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ వెంకోబరావు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ హైజన్, సైబర్ మోసాల నివారణ అనే అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పలు అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వినండహో.. ఇది గ్రామస్తుల హెచ్చరిక – ఇసుక ట్రాక్టర్ వస్తే..రూ.1000 జరిమానా తిరుపతి రూరల్ : ఆ దారిలో ఇసుక ట్రాక్టర్లకు అనుమతి లేదు.. అలా కాదని వస్తే.. రూ.1000 జరిమానా విధించబడును.. అంటూ గ్రామ పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.. బోర్డు పెట్టడమే కాదు.. ఆ గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లు వస్తే అందరూ ఏకమై అడ్డుకుంటున్నారు. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఇరుకు రోడ్లు ఉన్నప్పటికీ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి పిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలన్నా ఇబ్బంది పడేవారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులతో కలసి తమ గ్రామంలోకి ఇసుక ట్రాక్టర్ వస్తే రూ.1000 లు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా సరే రాత్రివేళ ఆ దారిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇసుక ట్రాక్టర్లు వస్తే రూ.1000 కచ్చితంగా వసూలు చేస్తుండటంతో చాలా మంది ఇసుక అక్రమార్కులు ఆ గ్రామం మీదుగా ట్రాక్టర్లు తీసుకురావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
– భర్త, కుటుంబ సభ్యులే చంపారంటూ ఆందోళన తడ : మండలంలోని అక్కంపేటలో గురువారం చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వివాహిత శిల్ప(26) అనుమానాస్పదంగా ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. తమ బిడ్డ మృతికి భర్త, అతని కుటుంబ సభ్యులే చంపి ఉరి వేసినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తొలుత అక్కంపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చెయ్యడంతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం తడ పోలీస్ స్టేషన్కు చేరుకుని శిల్ప ఫొటోలతో ఆందోళన చేశారు. ఎస్ఐ కొండపనాయుడు ఆందోళన చేస్తున్న వారిని సర్దుబాటు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి రెండేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కాలం చెల్లిన ఔషధాల పంపిణీపై ఫిర్యాదు సత్యవేడు : సత్యవేడుకు చెందిన శోభారాణి బుధవారం రాత్రి ఓ క్లినిక్కు వెళ్లగా కాలం చెల్లిన మాత్రలు అంటగట్టారని డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. సత్యవేడులోని ఓ క్లినిక్కు వెళ్లి మెడికల్ షాపులో ఐదు రకాల మాత్రలు ఇచ్చారని, అందులో రెండు మాత్రలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. దీనిపై శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
సర్వ దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధ రాత్రి వరకు 74,510 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
మద్యం మత్తులో కత్తితో దాడి
ఏర్పేడు : మండలంలోని గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీలో గురువారం ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో నరికి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు.. గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సీతారాముడు మద్యం తాగి వీధిలో వెళుతూ, పక్కన కూర్చుని ఉన్న కేశవులు(45)ను మద్యం మత్తులో కత్తితో తలపై నరికాడు. తలపై బలమైన రక్తగాయం కావడంతో కేశవులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత కక్షలేవైనా.. ఉన్నాయా.. మద్యం మత్తులో నరికాడా.. అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. నేడు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తిరుపతి సిటీ : ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూసిన విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం ఇస్తూ 18 వరకు వెబ్ ఆప్షన్లకు ఎంట్రీకి అవకాశం కల్పించనున్నారు. 22న సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయనున్నారు. 23 నుంచి 26వ తేదీ వరకు సీట్లు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగష్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి 27 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్షలు నిర్వహించగా జూన్ 8న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు నెల రోజుల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుండటం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు పొందిన విషయం తెలిసిందే. -
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి. – చంద్రశేఖర్, ప్రగతి సంస్థ మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థలో విద్యార్థుల మరుగుదొడ్లు (ఇన్సెట్) దెబ్బతిన్న బాత్రూమ్ తలుపులు ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’ శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు. పర్యవేక్షణ లోపించి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు కక్కుర్తి చూపుతూ విద్యార్థులను అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది ఆస్పత్రికి చేరారు. తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. వార్డెన్ సస్పెన్షన్ – ఇన్చార్జిగా విజయ శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్చార్జిగా విజయను నియమించారు. వంట మనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
● సుపరిపాలన కార్యక్రమంలో ప్రమాదం నాయుడుపేట టౌన్ : కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి షామియాన వేస్తున్న వ్యక్తి కందుకూరి మునీశ్వర్(45) విద్యుదాఘాతానికి గురై గురువారం మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని మహాలక్ష్మమ్మ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. తుమ్మూరుకు చెందిన మునీశ్వరయ్య అక్కడ హైరర్స్కు చెందిన యజమానికి స్నేహితుడు కావడంతో మహాలక్ష్మమ్మ నగర్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి షామియానా వేసేందుకు కార్మికులతో కలిసి వెళ్లాడు. లేదోటమ్మ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమానికి షామియానా వేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అప్పటికీ స్థానికులు అతడిని ప్రైవేట్ అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మునీశ్వరయ్య మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని మహాలక్ష్మమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహా లక్ష్మమ్మ కాలనీలో విద్యుత్ వైర్లు ఇళ్లపైనే వేళాడుతూ.. చేతికందే ఎత్తులో ఉన్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు పేద కుటుంబానికి చెందిన మునీశ్వర్కు భార్య లలిత, రోహిణి, బిందు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వర్ ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో వారి బోరున విలపించారు. సంఘటన స్థలంతో పాటు వైద్యశాల వద్ద లే.. డాడి అంటూ కుమార్తెలు రోదించిన తీరును చూసి చలించిపోయారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మునీశ్వర్ మృతి చెందడం బాధాకరమని, ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని అంత్యక్రియల కోసం రూ 50 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు. అదే విధంగా మృతుడి ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్ తదితరులు ఉన్నారు. -
మామిడి..
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో..మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని ఐఐటీ డెరెక్టర్ అన్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి వైఎస్సార్సీపీ నరసింగాపురం పంచాయతీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్పై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడిచేశాడు. ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవంశుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025– 8లోతిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మారానని చెప్పి .. ధర పెంచకుండా మారాం చేస్తున్నారు! ఆర్కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, సునీల్కుమార్, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోట రాజేష్, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ నేతలుతపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డెవలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ కుమార్ను 93907 36277 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తిరుపతి ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి ఏరియా బాలాజీనగర్, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఐఐహెచ్టీ స్పాట్ అడ్మిషన్లు వెంకటగిరి రూరల్:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్డీ గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు. తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ఉపాధ్యక్షులు పవన్ జి చందక్, కౌన్సిల్ సభ్యుడు సీఎస్ మోహన్ కుమార్, సీఎస్ వెంకటరమణ, ఐసీఎస్ఐ ఎస్ఐఆర్సి చైర్మన్ సీఎస్ మధుసూధనన్, ప్రీతి కౌశిక్ బెనర్జీ పాల్గొన్నారు. – 8లో– 8లోన్యూస్రీల్నష్టాల్లో మామిడి రైతు మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు ఏ ప్రాంతానికెళ్లినా జన సునామీనే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో మామిడి రైతులు మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామి డి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడి యాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు. ‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వి యా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్సీ వైద్యాధికారిణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
సమ్మెకు తాత్కాలిక బ్రేక్
● రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్ కార్మికులు తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అత్తపై అల్లుడు దాడి ● అత్తకు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు. ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి గూడూరు రూరల్ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూ రు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి : మండలంలోని తొండమనాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన పూజారి శోభన్బాబు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి తిరుపతి వైపు చేపల లోడ్తో వెళుతుండగా తిరుపతి నుంచి విజయవాడకు వెళుతున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభన్బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పచ్చనేతను వదిలేసి.. పక్కనోళ్లపై కేసు చంద్రగిరి : మండలంలోని జరిగిన ఓ దాడి కేసులో అసలు సూత్రధారి అయిన పచ్చనేతను పోలీసులు వదిలేసి, ఆయనతో కలిసి వెళ్లిన వారిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. సోమవారం ఏ.రంగంపేటలో మద్యం దుకాణం వద్ద స్థానిక టీడీపీ నేతకు, నారావారిపల్లెలోని మరో నేతకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన టీడీపీ నేతను ఆయన ఇంటికే వెళ్లి, నారావారిపల్లెకు చెందిన నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పగ పెంచుకున్న రంగంపేట టీడీపీ నేత, కొంత మంది యువకులతో కలసి నారావారిపల్లెలోని టీడీపీ నేత ఇంటికి వెళ్లి దాడికి దిగారు. దీంతో ఆ నేత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గొడవకు ప్రధాన కారణమైన ఏ.రంగంపేట టీడీపీ నేతను ఫిర్యాదులో తప్పించి, ఆయన వెనుక వెళ్లిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారిని వదిలేసి, అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నారు. నేటి నుంచి తిరుపతి ఐఐటీలో అంతర్జాతీయ సదస్సు ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఐఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. నిర్మాణ రంగం మెటీరియల్, టెక్నాలజీ, హెల్త్ మానిటరింగ్, రెట్రోఫిట్టింగ్, స్మార్ట్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించనున్నారు. -
స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు
అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తిరుపతి అర్బన్: స్వర్ణ నారావారిపల్లి–2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి ఇప్పటి వరకు చేపట్టిన అంశాలు, చేయాల్సిన పనులపై ప్రత్యేక అధికారి, డీపీఓ సుశీలాదేవిని ప్రశ్నించారు. ఆమె చేపడుతున్న పనులను వివరించారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రుణాల మంజూరు, వ్యవసాయ రంగానికి సంబంధించి కిచెన్ గార్డెనింగ్, టెరరస్ గార్డెనింగ్పై గుర్తించిన కుటుంబాలకు శిక్షణ ఇవ్వడం, రైతుల పొలాల్లో కిట్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ ఏడీ ప్రసాద్, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్, మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నరేంద్రబాబు, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు. -
బడి కోసం..ఆగని పోరాటం
నాయుడుపేటటౌన్ : పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలు విద్యాభ్యాసం చేసే ప్రాథమిక పాఠశాలలను మోడల్ బడుల్లో విలీనం చేసేందుకు తెగబడుతోందని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలోని బడిలో ఉన్న 3,4,5 తరగతులను చదివే విద్యార్ధులను తుమ్మూరు మోడల్ పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నిరసన తెలిపారు. బడికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయిని ప్రేమలీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మునిరత్నం హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. నచ్చజెప్పి పాఠశాలకు తాళం తీయించారు. ఈ సందర్భంగా స్కూల్కమిటీ చైర్పర్సన్ నిర్మల మాట్లాడుతూ 25 మంది విద్యార్థులను తుమ్మూరులోని పాఠశాలకు పంపడం దారుణమన్నారు. రైలు పట్టాలు దాటుకుని పిల్లలు అంత దూరం వెళ్లలేరని స్పష్టం చేశారు. హైవేపై ధర్నా నారాయణవనం: మా పిల్లలు మా ఊరి బడిలోనే చదవాలంటూ బుధవారం మండలంలోని ఇప్పన్తాంగాళ్ దళితవాడ పాఠశాల పిల్లలు, తల్లులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. 14 మంది విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలోని డీకే పాళ్యం మోడల్ స్కూల్కు పంపడానికి ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీఎస్పీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి ధనుంజయ మాట్లాడుతూ బడుల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. -
కొలువుల కోత
● రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల కుదింపు ● ప్రశ్నార్థకంగా ఉద్యోగుల భవిత ● ప్రభుత్వ వైఖరిపై సిబ్బంది ఆగ్రహం తిరుపతి అర్బన్ : క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, సత్వరమే సేవలు అందించే సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం కక్షగట్టింది. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోని 691 సచివాలయాలను 353కి తగ్గించింది. అదే క్రమంలో 5,625 మంది సిబ్బందికి గాను 3,650 మందికి మాత్రమే ప్రస్తుత బదిలీల్లో పోస్టింగ్ ఇచ్చింది. మిగిలిన 1,975 మంది సచివాలయ సిబ్బంది భవితను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉద్యోగుల తగ్గింపు! సచివాలయాల్లోని ఒక్కో విభాగంలో 30 నుంచి 80 మంది ఉద్యోగులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఒక్కో సచివాలయంలో 30 విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో భారీగా కోత విధించినట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన బదిలీల్లో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే రేషనలైజేషన్ నేపథ్యంలో ఖాళీలు లేవని...ఏదో ఒకచోట సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు వారంతా రిజర్వులోనే ఉండాల్సిన దుస్థితి దాపురించింది. నిబంధనలకు నీళ్లు ఇటీవల చేపట్టిన బదిలీల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందామని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కూటమి నేతల సిఫార్సు ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అలాగే లంచాలు ముట్టజెప్పిన వారికి సైతం ప్రాధాన్యమిచ్చారని మండిపడుతున్నారు. మిగిలిన వారిని పట్టించుకోకుండా రిజర్వులో పెట్టేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేతనం కూడా నిలిపేసే ప్రమాదముందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.డివిజన్ గతంలో ప్రస్తుతం సచివాలయాల సంఖ్య తిరుపతి 245 125 శ్రీకాళహస్తి 154 82 సూళ్లూరుపేట 137 68 గూడూరు 155 78 మొత్తం 691 353జిల్లా సమాచారం -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా
ఓజిలి: నెల్లూరు– చైన్నె జాతీయ రహదారిపై పెదపరియ క్రాస్ సమీపంలో బుధవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి చైన్నెకు గ్యాస్లోడ్తో లారీ వెళుతోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగింది. అయితే గ్యాస్ లీక్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాలువ కట్ట కింద మృతదేహం డక్కిలి : మండల కేంద్రానికి సమీపంలో తెలుగు గంగ కాలువ కట్ట కింద ఓ వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఆలస్యంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో కట్టపై వాకింగ్ చేస్తున్న వారు అక్కడి ముళ్లపొదల్లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివ శంకర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అన్నంరాజుపల్లెకు చెందిన కోండూరు రవీంద్రరాజు (60)గా గుర్తించారు. మృతుడు రెండు రోజులు కిందట దేవునివెల్లంపల్లి స్తంభాలగిరీశ్వరయ్యస్వామి ఆలయంలో అవధూత గురుకల పోలయ్యస్వామి ఆరాధన మహోత్సవానికి వచ్చాడని, అతిగా మద్యం తాగడంతో మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
అక్రమ అరెస్ట్ పై ఆగ్రహం
తిరుపతి రూరల్ : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని, ఆయన కుమారుడు మోహిత్రెడ్డిపై సైతం కక్షగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామాన్ని కాపాడు మహాత్మా అంటూ.. బుధవారం భాకరాపేటలోని పార్టీ కార్యాలయం నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి సీడీసీఎంస్ మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. సహదేవరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, జగనన్న సైనికులను జైలుకు పంపి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సిట్ అధికారులు లిక్కర్ కేసులో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, దీనికి భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఎంపీపీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను బిడ్డల్లా చూసుకున్న చెవిరెడ్డికి కష్టం వస్తే ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యుడికే వచ్చినట్టు బాధపడుతున్నారని తెలిపారు. సింహాల మోహన్ మాట్లాడుతూ చెవిరెడ్డిపై ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టినా, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ యశోద, రామచంద్రాపురం జెడ్పీటీసీ సభ్యులు ఢిల్లీరాణి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, భాకరాపేట సర్పంచ్ భూపాల్, యూత్ అధ్యక్షుడు మునిరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు. ● భాకరాపేటలో భారీ ర్యాలీ.. నిరసన -
నగదు చెల్లించలేదని నిరసన
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం సమీపంలోని రెడ్డిగుంట వద్ద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన దళితుల భూములను తమిళనాడుకు చెందిన కొందరు భూస్వాములు కొనుగోలు చేశారు. సుమారు 60 మంది రైతులు 60 ఎకరాలను ఏడాది క్రితం విక్రయించారు. ఎకరా రూ.17 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూస్వాములు, ఒక్కో రైతుకు రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన రూ.2 లక్షల సొమ్మును చెల్లిస్తామని నమ్మబలికారు. అయితే ఈ ఏడాది గడిచిపోయినా పెండింగ్ నగదు చెల్లించకనే కొనుగోలు చేసిన భూముల్లో ప్రహరీగోడ పనులను చేపట్టారు. బుధవారం ఈమేరకు బాధిత రైతులు అక్కడకు వెళ్లి నిర్మాణ పనులు చేపట్టుకోవాలని పనులు అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయి నగదు చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు అక్కడే నిరసన తెలిపారు. -
వీసీ కోసం వెతుకులాట!
● ఎస్వీయూ వైస్ చాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీలు తిరుపతి సిటీ : ఎస్వీయూ వీసీ నియామకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడాదిగా పూర్తి స్థాయి వైస్ చాన్సలర్ను నియమించేందుకు ఇప్పటికే రెండు సార్లు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సమావేశమైన రెండో సెర్చ్ కమిటీ ఓ మంత్రి తోడల్లుడు సిఫార్సు చేసిన రెండు పేర్లతో పాటు ప్రస్తుత ఇన్చార్జి వీసీ పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై తమ వారిని పక్కన పెట్టారని కూటమిలో భాగమైన ఓ ప్రధాన పార్టీ నేత మండిపడ్డట్టు సమాచారం. ఈక్రమంలో వీసీ నియామక ప్రక్రియ సందిగ్ధంలో పడింది. మొదటి, రెండో సెర్చ్ కమిటీ సమర్పించిన నివేదికలను రద్దు చేసి ప్రస్తుతం మరోసారి మూడో సెర్చ్ కమిటీని నియమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రాంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒత్తిడిలో కమిటీలు ప్రధానంగా ఎస్వీయూ వీసీ నియామకంపై ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలపై రాజకీయ ఒత్తిడి అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే సెర్చ్ కమిటీలో సభ్యులుగా తమను ఎంపిక చేయవద్దని పలువురు ఉన్నత విద్యామండలి అధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. ప్రతిభ, అనుభవం, సామాజిక వర్గ సమీకరణల ప్రాతిపదికన వీసీ నియామకానికి సమర్థులైన ముగ్గురు వ్యక్తులను సెర్చ్ కమిటీ ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఎస్వీయూకు పూర్తి స్థాయి వీసీ నియామకం జరిగేలా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. -
● అక్రమ అరెస్ట్పై ఆగ్రహం
8లో..చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా బుధవారం భాకరాపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయిఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అరణియార్లో చేపల వేటపై నిషేధం
నాగలాపురం : పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టులో ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, ఎఫ్డీఓ మధుసూదన్రావు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో రెండు నెలల పాటు వేటను నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఆదేశాలను అతిక్రమిస్తే మత్స్యకారుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సహకరించాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత శిక్షణ తిరుపతి అర్బన్ : జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన 19–34 ఏళ్ల వారు మాత్రమే అర్హులని వెల్లడించారు.ఆసక్తిగలవారు సదరన్ సర్టిఫికెట్తోపాటు ఆధార్కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో తిరుపతిలోని భవానీ నగర్ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో యూత్ ఫర్ జాబ్స్ కార్యాలయానికి రావాలని కోరారు. ఇతర వివరాలకు 9347411952 నంబర్లో సంప్రదించాలని సూచించారు. హస్త కళాకారులకు అండగా ఉంటాం తిరుపతి అర్బన్ : జిల్లాలోని హస్త కళాకారులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసువులేటి హరిప్రసాద్తో కలిసి డీఆర్డీఏ, డీఐసీ, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్ , హ్యాండ్ లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హస్త కళంకారీకి మార్కెట్ కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం నినాదంతో కళాకారులకు చేయూతనందిస్తామన్నారు. అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల ఏడీ సత్యమూర్తి, చేనేత వస్త్రాల ఏడీలు రమేష్, వెంకట రావు,ి మూర్తి, ఎల్డీఎం రవికుమార్, పర్యాటకశాఖ ఆర్డీ రమణ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఏపీడీ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు. పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు తిరుపతి అర్బన్ : జిల్లాలో డీఎస్సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జూన్ 6 నుంచి మొత్తం 8 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 33,181 మంది అభ్యర్థులకు గాను 30,952 మంది హాజరైనట్లు వెల్లడించారు. 2,229 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేసేందుకు సహకరించివన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారం తిరుమల : తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల ధరలపై సోషల్ మీడియాల్లో సాగుతోందని అసత్య ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పుడు వార్తలను వైరల్ చేసి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించింది. భక్తులకు ఎలాంటి సమాచారం కావల్సి వచిన్నా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, కాల్ సెంటర్ 180042 54141కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించింది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్మోహన్రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యూరియా.. ఏదయా..?
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి సాయంగా అందించాల్సిన అన్నదాతా సుఖీభవ నిధుల సంగతి దేముడెరుగు, కనీసం సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు సంగతి నామమాత్రమేనని చర్చ సాగుతోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు 80వేల ఎకరాల్లో వరి పంట సాగు చేపట్టారు. ఇందుకోసం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 7,500 మెట్రిక్ టన్నుల యూరియాను అందించినట్లు చెబుతున్నారు. రైతులకు 27,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రైవేటు వ్యాపారులు 17,500 మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు తెలుస్తుంది. అయినప్పటికి మరో 10వేల మెట్రిక్ టన్నులు యూరియా అన్నదాతలకు అవసరమవుతోంది. ఈ సీజన్లో పంట చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు వేయాల్సిన యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా యూరియా బస్తా రూ. 266.50కి విక్రయించాల్సి ఉంది. అయితే కొందరు ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి, బస్తా యూరియాను రూ. 285 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
రెచ్చిపోతే సహించం
తిరుపతి మంగళం/ చంద్రగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడుల్లో గాయపడిన పనపాకం, ముంగిలిపట్టు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలను బుధవారం ఆయన పరామర్శించారు. భూమన మాట్లాడుతూ పనపాకంలో దళిత కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేత అజయ్ ఆయన భార్య రోజాతో పాటు వారి సోదరిపై టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేశారన్నారు. బాధితుల దుస్తులు చించివేసి, చెప్పు కాళ్లతో తన్ని విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లేడని, ఇక జైలు నుంచి రాడని, చెవిరెడ్డి మోహిత్రెడ్డి నియోజకవర్గంలో లేడనే ధైర్యంతో పచ్చమూక రెచ్చిపోతోందని, ఇకపై వారిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ నేత సుబ్రమణ్యం నాయకుడు కక్షగట్టి, కళ్లలో కారం కొట్టి అజయ్, ఆయన సతీమణి రోజాపై దుర్మార్గంగా దాడి చేశాడన్నారు. అలాగే ముంగిలిపట్టు సర్పంచ్ భారతి, ఆమె భర్త దామోదర్నాయుడు, కుమారుడు భార్గవ్పై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ తాళిబొట్టు కూడ తెంచేసి కుమారుడు భార్గవ్ చెయ్యి విరిచేశారన్నారు. ఈ క్రమంలో మాకు అధికారం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చూపే తీవ్రత ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమచంద్రకుమార్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి రూరల్ మాజీ ఎంపీపీ చిలమంద మునికృష్ణ, నేతలు పొర్లపల్లె చంద్రశేఖర్రెడ్డి, అగరాల భాస్కర్రెడ్డి, మస్తాన్, దేవారెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్రెడ్డి, ఒంటి శివ, కొత్తపాటి కోటి, బుల్లెట్ చంద్రమౌళిరెడ్డి, ప్రవీణ్, సూరి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటాం టీడీపీ గూండాల దౌర్జన్యాలను అడ్డుకుంటాం దళితులు, మహిళలపై దాడి అమానుషం బాధితులను పరామర్శించిన భూమన -
భార్య పుట్టింటికి.. భర్త ఆత్మహత్మ
చిల్లకూరు : భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు తిప్పగుంటపాళెంలో మిక్సెడ్ కాలనీకి చెందిన తాటిపర్తి ఏడుకొండలు(25)కు ఉషాతో వివాహమైంది. కొంత కాలంగా సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు చోటు చోసుకోవడంతో 8 నెలల క్రితం ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రోజున స్థానికులకు కనిపించిన ఏడుకొండలు తరువాత కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పరిశీలించగా, ఇంటిలోపలి నుంచి గడియ వేసి ఉంది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు తీసి లోపలకు వెళ్లిన పోలీసులు కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 95.89 శాతం పంపిణీ తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ మంగళవారం తొలి రోజు 95.89 శాతం మందికి అందించినట్లు డీఆర్డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. జూలై నెలకు 2,59,732 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా, 2,49,054 మందికి అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి బుధవారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
మేయర్కు దక్కని గౌరవం
● పార్లమెంటు జాతీయ స్థాయి సదస్సుకు మేయర్లు, చైర్ పర్సన్లకు ఆహ్వానం ● తిరుపతిలో మేయర్ పేరును విస్మరించిన కూటమి ప్రభుత్వం ● ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ పేరు ప్రతిపాదన ● కూటమి నేతల తీరుపై విమర్శల వెల్లువ తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాక తొలిసారి మేయర్ ఎన్నికలను 2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించింది. మేయర్ స్థానం ఓసీ మహిళ రిజర్వుడ్ కాగా బీసీ మహిళకు కేటాయించేలా నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, యువ నేత భూమన అభినయ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి విజ్ఞప్తి మేరకు పార్టీ అధిష్టానం తిరుపతి మేయర్ స్థానాన్ని బీసీ మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్సీ పీ తరఫున మేయర్గా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీపడ్డారు. విద్యావంతురాలిని బరిలోకి దింపాలని భూమన తిరుపతిలో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్గా విశేష సేవలు అందిస్తూ, వివాదరహితురాలుగా గుర్తింపు పొందిన డాక్టర్ ఆర్ శిరీషను ఎంపిక చేశారు. ఈమె ఎంపికపై నగరవాసులు, మేధావులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా 49 స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. నగర ప్రథమ పౌరురాలికి దక్కని గౌరవం నాడు బీసీ మహిళకు అగ్రతాంబూలం ఓసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించి వైఎస్సార్ సీపీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, తమ పార్టీకి బీసీలు అంటే బ్యాక్ బోన్ అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేకమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ శిరీషను ఏరికోరి మేయర్ ను చేసి బీసీలకు పట్టం కట్టారు. నేడు కూటమి ప్రభుత్వం అదే మహిళను అవమానించేలా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. బీసీలు సైతం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా యాదవులు తమ వర్గానికి చెందిన మహిళకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు బీసీల పాట పాడే చంద్రబాబు ఎన్నికలయ్యాక బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుంటారని ఓ వర్గం మండపడుతోంది. రెండో డిప్యూటీ మేయర్ పేరు హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా నిర్వహించే జాతీయ సెమినార్కు తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను వెళ్లనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ జాతీయ సెమినార్కు గుంటూరు కార్పొరేషన్ నుంచి మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ని, మరో మున్సిపాలిటీ నుంచి చైర్ పర్సన్తో పాటు వైస్ చైర్మన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం తిరుపతిలో మాత్రం మేయర్ను పూర్తిగా పక్కన పెట్టి రెండవ డిప్యూటీ మేయర్ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా ఇవ్వకుండా వ్యవహరించడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. వివాదరహితురాలైన మేయర్ను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ముఖ్యంగా బీసీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఇలా బీసీ మహిళా మేయర్ పట్ల అవమానించేలా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మేయర్ స్థానంలో రెండవ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణను పంపించడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే పంపించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు నిర్వహిస్తున్న ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ జాతీయ కాన్ఫరెన్స్కు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థల నుంచి మేయర్లు, మున్సిపాలిటీల నుంచి చైర్ పర్సన్లను పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం జాతీయ సదస్సుకు ఎవరెవరిని పంపించాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కక్ష సాధింపుగా, ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత లేకుండా చేసేలా ఉండడంపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా ఎంపిక చేసి ఉన్నత పదవుల్లో ఉన్న మేయర్లకు మొండి చేయి చూపించి, ఆ పదవులకు అవమానం తెచ్చేలా వ్యవహరించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్లమెంటు నిర్వహించే ఈ అత్యున్నత జాతీయ సదస్సుకు వైఎస్సాఆర్సీపీకి చెందిన మేయర్లు, చైర్ పర్సన్లను పంపించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. -
అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష
తిరుపతి సిటీ: ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష పేరుతో చేపట్టిన ఇంటర్వ్యూలు అగ్ని పరీక్షలుగా మారాయి. గత విద్యా సంవత్సరంలో అకడమిక్ కన్సల్టెంట్లు, కో–ఆర్డినేటర్ల పనితీరుపై వీసీ చాంబర్లో మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటర్వ్యూలకు వీసీ, రిజిస్ట్రార్తో పాటు పలు విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. సంబంధిత సబ్జెక్ట్లో కమిటీ సంధించిన ప్రశ్నలకు అకడమిక్ కన్సల్టెంట్లు వైట్బోర్డ్పై డెమో ఇచ్చారు. తొలిరోజు పలు విభాగాల్లో పనిచేస్తున్న 43మంది తాత్కాలిక అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరై పనితీరు పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఎస్వీయూలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో పెద్ద సంఖ్యలో అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించే వ్యూహంలో భాగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూలకు పలు విభాగాల నుంచి మరో 200మంది అకడమిక్ కన్సల్టెంట్లు హాజరుకానున్నారు. -
రీ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేనందున రీ కౌన్సెలింగ్ చేయాలంటూ మహిళా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సంరక్షణ కార్యదర్శులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, తిరుపతి నగర అధ్యక్షుడు విద్యాసాగర్, ఉద్యోగ సంఘం మహిళా నేతలు విజయలక్ష్మి, నజ్మా, జ్ఞానాంబిక, శాంత కుమారి తదితరులు మాట్లాడారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల్లో పారదర్శకత లేదని చెప్పారు. రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు. వార్డు పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క వార్డుకు, మండల పరిధిలో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. ప్రధానంగా పంచాయితీల్లో పనిచేస్తున్న వారిని పక్క మండలానికి కాకుండా 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి బదిలీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తిగా సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని అందించారు. దీంతో ఆయన చిత్తూరు ఎస్పీ మణికంఠకు ఫోన్ చేసి మాట్లాడి, సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఉద్యోగులు దివ్యభారతి, కుమారి, నిహారిక, యోగప్రియ, లక్ష్మీప్రసన్న, లావణ్య, కళ్యాణి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
తిరుపతి క్రైమ్: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీటీడీ విజిలెన్స్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన సతీమణి అమ్ములుకు రూ.5 లక్షల డీడీని ఎస్పీ అందజేశారు. విరమణ పొందిన హోంగార్డుకు సత్కారం జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకటరమణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు వేతనం రావలసిన రూ.5 లక్షలు అందజేశారు. -
ఘనంగా సీజీఎస్టీ వార్షికోత్సవం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): తిరుపతిలోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) కమిషనరేట్ పరిధిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కార్యాలయ ఆవరణలో శ్రీసరళీకృత పన్నులు, పౌరుల సాధికారత్ఙ అనే థీమ్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పన్నుల చెల్లింపులలో అగ్రశ్రేణి సంస్థలుగా గుర్తించిన ఏడింటిలో శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, తిరుపతి సీజీఎస్టీ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.దినకరన్ సమక్షంలో గుంటూరు సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ ఎంపిక చేసిన సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. 30 వరకు జన సురక్ష తిరుపతి అర్బన్: జన సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 774 పంచాయతీల్లోనూ ఈ నెల1 నుంచి 30 వరకు జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరో సమావేశంలో జేసీ శుభం బన్సల్తో కలిసి మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా డిసిప్లినరీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
కాళంగినదిలో మునిగి వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: కాళంగి నదిలో నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు, గ్రామానికి చెందిన బాబురెడ్డి (54) గేదెలను పోషణతో జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కాళంగి నది సమీపంలోని పొలాల వద్దకు గేదెలను తోలుకుని వెళ్లారు. గెదేలు నదిలోకి దిగి రాకపోవటంతో వాటిని బయటకు తీసురావటానికి నీటిలో దిగాడు. అయితే ఈతరాని బాబురెడ్డి నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన అక్కడి రైతులు బాబురెడ్డిని నీళ్ల నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందడంతో వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాబురెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ విశ్వనాథనాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తిరుపతి క్రైం: శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఆరుసార్లు చోరీలకు పాల్పడిన ముగ్గురిని సోమవారం సాయంత్రం శ్రీకాళహస్తి మిట్ట కండ్రిగ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు తమిళనాడు రాష్ట్రం, వందలూరు కండ్రిగకు చెందిన మూతం మని మారన్ అలియాస్ మనీ(27), వెంకటగిరి చెందిన మారి మాణిక్యం(25), శ్రీకాళహస్తికి చెందిన కొట్టం బేటి రాజా(20)గా తేలిందన్నారు. వీరి నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 139 గ్రాముల బంగారు, హీరో స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు, క్రైమ్ పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. 55 మందిపై నిఘా జిల్లా వ్యాప్తంగా 55 మంది చెయిన్ స్నాచర్లపై నిఘా పెట్టమని ఎస్పీ పేర్కొన్నారు. వారిలో ఇప్పటికే 40 మందిని పూర్తిస్థాయిలో గుర్తించామన్నారు. వీరందరిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాడుబడ్డ గృహాల వద్ద ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ డ్రోన్ కెమెరాలకు దొరికారన్నారు. వీరందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి, కేసులు నమోదు చేశామన్నారు. -
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనల హోరు
చంద్రగిరి: ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడంపై నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధినేత వైఎస్ జగన్కు వివరించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు, అక్రమాలపై అధినేతకు వివరించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ సూచించినట్లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విధుల నుంచి ఉపాధ్యాయుడి తొలగింపు బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్ల ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్న హరిబాబును విధుల నుంచి తొలగిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు రమణయ్య మంగళవారం తెలిపారు. హరిబాబు 02.08.2017 నుంచి 26.08.2024 వరకు 7 సంవత్సరాల 25 రోజులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై విచారణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏడాది కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకుంటే ఆయన్ను ప్రభుత్వ సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. 30.06.2025 నుంచి హరిబాబును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. రేపు అన్ఎయిడెడ్ బంద్ తిరుపతి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు గురువారం బంద్ చేపడుతున్నట్లు అపుస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలను నిరసిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నియమాలు సరిగ్గా పరిశీలించకుండా ఎటువంటి నోటీసులు, చర్యలకు ఉపక్రమించకూడదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
పట్టుబడిన చైన్స్నాచర్
సత్యవేడు: వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకుని పారిపోతున్న దుండగుడిని స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు పంచాయతీ పరిధిలోని పాపానాయుడు పేట వీధిలో కే.నాగమ్మ(85) మంగళవారం ఉదయం మార్కెట్కు వెళ్లింది. తిరిగి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఈమె పరిస్థితి గమనించిన తమిళనాడులోని నేమళ్లూరుకు చెందిన ఈ.ప్రదీప్ వెంబడించాడు. పాపానాయుడు వీధి సమీపంలో జనసంచారం తక్కువ ఉండడంతో ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని పరుగు తీశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంబడింయి చాముండేశ్వరి థియేటర్ సమీపంలో పట్టుకొని, ఎస్ఐ రామస్వామికి అప్పగించారు. బాధితురాలికి బంగారు గొలుసును అప్పగించారు. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న యువకుడు జగన్ను పోలీసులు అభినందించారు. -
తరిగిపోతున్న పింఛన్లు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు కూడా కరిగిపోతున్నాయి. గత ఏడాది జూన్లో జిల్లాలో 2,71,183 మందికి సామాజిక పింఛన్లు అందించారు. ఈ ఏడాది జూలైలో 2,59,732 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. కూటమి పాలనలో జిల్లాలో 11,451 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా సుమారుగా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే, పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు. మరోవైపు జిల్లాలో గత ఏడు నెలలుగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.6వేలు పింఛన్లు తీసుకుంటున్న వారిని తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగించేస్తారోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రూ.4వేలు పింఛన్ తీసుకుంటున్న వారిని జూలైలో తనిఖీలు చేస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా జిల్లాలో పింఛన్ల ఏరివేత కొనసాగుతోందన్న విషయం మాత్రం తేలిపోయింది. వితంతు పింఛన్లకు కొత్త మెలిక వితంతు పింఛన్లలో జాప్యం లేకుండా గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు 7వేల మంది ఉన్నట్లు ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. వీరికి పింఛన్లు వస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. -
ఎస్వీ యూ అధికారుల ‘స్టంట్లు’
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు డిగ్రీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ స్టంట్లు చేస్తున్నారు. ఇన్స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టుకున్నారు కానీ వర్సిటీ నిబంధనల ప్రకారం హాల్ టికెట్లు పొందడానికి మాత్రం వారికి అర్హత లేదంటూ ప్రకటించారు. దీంతో మంగళవారం ఎస్వీయూ పరీక్షల విభాగం వద్ద సుమారు వంద మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ 2022–25 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు సంబంధించి 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టించుకుని హాల్టికెట్లు జారీ చేయలేదన్నారు. అడిగితే వర్సిటీ నూతన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సెక్షన్ అధికారులు రిజిస్ట్రార్, వీసీలను సంప్రదించి చర్చలు జరిపారు. ఫలితంగా 2022–25 బ్యాచ్ విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి హాల్టికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకోసం బుధవారం నుంచి జరగనున్న ఇన్స్టంట్ పరీక్షలను వచ్చే జూలై 7 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు. ఏడు పాఠశాలల్లో ఆధార్ నమోదు తిరుపతి ఎడ్యుకేషన్ : ఆధారు కార్డు లేని 1నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల సౌకర్యార్థం తిరుపతి జిల్లాలో 7 పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) డాక్టర్ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా గూడూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, నాయుడుపేట జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, తిరుచానూరు జెడ్పీహెచ్ఎస్, తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం నగరపాలక హైస్కూల్, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జెడ్పీహెచ్ఎస్, పుత్తూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. యూడైస్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో వారికి అందేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో డీవైఈఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తమ పరిధిలో ఆధార్ లేని విద్యార్థులను గుర్తించి సమీప పాఠశాలల్లో ఆధార్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు. ఏపీపీఈసెట్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఆచార్య నాగార్జున వర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 25, 26వ తేదీల్లో నిర్వహించిన ఏపీపీఈసెట్–2025 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. వర్సిటీలోని బీపీఈడీ, డీపీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఎస్వీయూ పరిధిలో 492 మంది పరీక్షకు హాజరుకాగా 463మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 344మంది, మహిళలు 119మంది ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 11మంది విద్యార్థులు టాప్ 50ర్యాంకులల్లో చోటు సంపాదించారు. -
తొలిరోజే తాళాలు
తిరుపతి అర్బన్: కూటమి సర్కార్ మళ్లీ మొదటికే వచ్చింది.. తొలి రోజు తిరుపతి నగరంలో చాలా వరకు రేషన్ షాపులు తెరుచుకోలేదు. కొందరు తెరిచినా సర్కర్ పనిచేయకపోవడంతో తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో సంచులు, కార్డులు క్యూలో పెట్టిన లబ్ధిదారులు ఏం చేయాలో తెలియక కాసేపు ఎదురుచూసి వెళ్లిపోయారు. అతికష్టం మీద నడుచుకుంటూ వచ్చిన వృద్ధులు, సరుకులు ఇవ్వకపోవడంతో ఊత కర్ర పొడుచుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఎగనామం పెట్టారు. కేవలం బియ్యంతోనే సరిపెట్టారు. ఆ తర్వాత మూడు నెలలు బియ్యం, చక్కెర మాత్ర మే అందించారు. ఆ తర్వాత నాలుగు నెలలు కందిపప్పు అరకొరగా అందించారు. రెండు నెలల నుంచి మళ్లీ కందిపప్పు కొందరికే ఇస్తూ వచ్చారు. తాజాగా జూలైలో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెట్టేశారు. జిల్లాలో 1457 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 6 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. అయితే తొలి రోజు సర్వర్ సమస్యలతో పలు దుకాణాల్లో సరుకులు ఇవ్వడం మానేశారు. కొన్ని దుకాణాల్లో గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు క్యూలో ఉండలేక, ఇంటిదారి పట్టారు. మరోవైపు జిల్లాలో 345 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జిలకు అప్పగించారు. వారంతా కాసేపు చూసి.. సర్వర్ పనిచేయకపోవడంతో దుకాణాలు మూసివేశారు. దీంతో కార్డుదారులు బిక్కముఖంతో ఇంటిదారి పట్టారు. -
మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
● తొలుత కిలోకు రూ.12, ఆపై రూ.6 ప్రకటించిన వైనం ● క్షేత్ర స్థాయిలో కిలో రూ.3 కూడా దక్కక రైతుల ఆవేదన ● అయినా సరే కాయ కొనడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు ● అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పంట అమ్మడానికి అగచాట్లు ● నిద్రాహారాల్లేక ఫ్యాక్టరీల ఎదుట ఎదురుచూపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దయనీయ పరిస్థి ఇంటికి పోయే పరిస్థితి లేదు కాణిపాకం నుంచి గుడిపాల సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి కాయలు తెస్తే రూ.5వేలు బాడుగ. ఒక్కరోజు అయినా..రెండు రోజులు..మూడు రోజులు అయినా ఇదే రేటు. ఇక్కడకు కాయలు తెస్తే.. అన్లోడింగ్ అయ్యేందుకు ఐదు రోజులు పడుతోంది. అంతవరకు ఓపికతో ఉండాల్సిందే. ఇంటికి పోను.. రాను అంటే కుదరదు. – రవి, బొమ్మసముద్రం, ఐరాల మండలం టోకెన్లు అమ్ముకుంటున్నారు వారం పది రోజులుగా తిండీనీళ్లు లేకుండా రోడ్లపై అవస్థలు పడుతున్నాం. రాత్రి సమయాల్లో అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మకై ్క దొడ్డి దారిన టోకెన్లు అమ్ముకుని డైరెక్టుగా 10, 20 వాహనాలు లోపలకు పంపించేస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దోమల బెడదతో నిద్రాహారాలు లేకుండా మేము అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. – బాబునాయుడు, జీడీనెల్లూరు కన్న బిడ్డల్లా సాకినాం సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాం. కన్నబిడ్డల్లా గా పండించాం. ఇప్పు డు మామిడి పంట మొత్తం కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉంది. నాలుగైదు రోజుల నిరీక్షణలతో టార్ఫాలిన్పట్ట వేడికి లోలోపలే కుళ్లిపోయి, జ్యూసులా రోడ్లపై కారిపోతోంది. అధికారులు ఫ్యాక్టరీలు ప్రత్యేక చొరవ చూపించాలి. – శ్రీనివాసరెడ్డి, పెనుమూరు మండలం చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడినిచ్చింది. ఇందులో తోతాపురి రకం నుంచి గుజ్జు (పల్ఫ్)ను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఫలితంగా ప్రతీ ఏటా దాదాపు 40 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి రకాన్ని రైతాంగం సాగుచేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలయ్యింది. కానీ మామిడిని కొనడానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ ముందుకు రావడం లేదు. ఒకవేళ కొన్నా కిలోకు సగటున రూ.4 –5 చెల్లిస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభించక అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. చేజేతులా కోల్పోతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఫ్యాక్టరీలు మామిడిని కొనకపోవడంతో రైతు కంట కన్నీళ్లు ఆగడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం కిలోకు రూ.6 చెల్లించాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకునే దిక్కులేదు. ముందుగా ఫ్యాక్టరీ వద్దకు రైతు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ నెంబర్ వస్తే తప్ప మామిడిని లోపలకు తీసుకెళ్లడానికి వీల్లేదు. రెండు రోజులు అలాగే ఉంచేస్తే 40 శాతం పంట పనికిరాదు. చిన్నపాటి వర్షం పడితే వంద శాతం పంట రోడ్డుపై పడేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తోపులాటలు, పోలీసులు–ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదాలు.. ఇవన్నీ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ఉంటే ఇప్పటి వరకు 30 వరకు ఫ్యాక్టరీలు మాత్రమే తెరుచుకున్నాయి. 80 శాతం వరకు ఫ్యాక్టరీలు, కూటమి ప్రభుత్వ అనుకూలురు చేతుల్లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గరిష్టంగా కిలో మామిడి రూ.23కు అమ్ముడం కొసమెరుపు. ‘మద్దతు’లేక..అగచాట్లు పడలేక చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. మామిడి పంటను ఫ్యాక్టరీలకు అమ్ముదామని పంటను తీసుకొచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు చెప్పడంతో, కిలోకు రూ.8 ఫ్యాక్టరీలు చెల్లించాలని, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్నెన్నాయుడు ప్రకటించారు. కానీ ఫ్యాక్టరీలు కూడా ఈ ధరలు పాటించలేదు. కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.3 సైతం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ హామీలన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయాయి. సీజన్ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుకు మద్దతు ధర అంద లేదు. -
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్పల్లిలోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కేవీఎన్.కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన మంగళవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని, పాఠశాల రికార్డులను పరిశీలించారు. హెచ్ఎం, ఇతర ఉపాధ్యాయులు గత ఏడాది కంటే తక్కువగా అడ్మిషన్లు చేయడం, ఒకటో తరగతి విద్యార్థుల వివరాలను యూడైస్లో నమోదు చేయడంలో హెచ్ఎం అలసత్వం వహించడం, తరగతుల వారీగా బోధనకు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. దీంతో వివరణ కోరుతూ ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!
● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం అడుగడుగునా అక్రమాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకటం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపా లన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామిడి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై శ్రీచంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూశ్రీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పథకాలు అడగరా? ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. భయపెడుతున్న మామిడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారి అవస్థలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. -
మోసం.. బాబు నైజం!
తిరుపతి మంగళం : ‘‘చంద్రబాబు అధికారం కోసం ఎంతకై నా దిగజారుతారు..ఎన్ని అబద్ధపు హామీలైనా గుప్పిస్తారు.. నమ్మిన వాళ్లను మోసం చేయడానికి వెనకాడరు.. మోసం, వంచన, ద్రోహం, వెన్నుపోటు అనే పాఠాలను చిన్నప్పటి నుంచి బాగా వంటపట్టించుకున్నారు. ఆయన షూరిటీ ఇచ్చాడంటే అంది గ్యారంటీగా మోసమే’’ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే హామీలు నెరవేర్చేటివి కాదు కాబట్టే నోటికి వచ్చిన అబద్ధాలు గుప్పిస్తారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇద్దామని తామంతా వైఎస్.జగన్మోహన్రెడ్డికి చెబితే అది సాధ్యంకాదని, అలాంటి అబద్ధాలు చెప్పలేనంటూ ఖరాకండిగా చెప్పారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.7వేల కోట్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల కంటే మించి రూ.3 లక్షల కోట్లు విలువ చేసే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. గత ఎన్నికల్లో జగనన్న కంటే రెండింతలు సంక్షేమ పథకాలు అందిస్తానంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న దుర్మార్గుడు అన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిరుపతి నగర మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పి వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లోఏ ఒక్కటైనా నెరవేర్చావా బాబూ? రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళదాం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి -
ఇష్టారాజ్యంగా ఎంఎస్కే బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల (ఎంఎస్కే) బదిలీ కౌన్సెలింగ్లో అదే గందరగోళం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు సోమవారం కూడా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 600 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 6 గంటలకు సగం మందికి మాత్రమే పూర్తయ్యింది. అయితే కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహించడంలేదని, సిఫార్సులు ఉన్న వాళ్లకు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు ఇస్తున్నారంటూ పలువురు ఎంఎస్కేలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటాద్రి, ఇతర అధికారులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు మెజారిటీ ఉద్యోగులు తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాలనే కోరుకోవడం.. అక్కడ ఖాళీలు లేకపోవడం, కుప్పంలో 50కు పైగా పోస్టులు ఖాళీ ఏర్పడడంతో ఎవర్ని నియమించాలో తెలియక అధికారులు సైతం ఒకింత గందరగోళానికి గురయ్యారు. జీవన నైపుణ్యం అవసరం తిరుపతి సిటీ: జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని మహిళా వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రజిని తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి గెస్ట్ హౌస్లో పీఎం ఉష సహకారంతో ‘జీవన నైపుణ్యాలపై’ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. రజిని మాట్లాడుతూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నైపుణ్యాలు అవసరమని చెప్పారు. మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె శేఖర్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి వాణి ప్రసంగించారు. అనంతరం అతిథులను సన్మానించారు. శిక్షకులు డాక్టర్ సంజీవ్ కుమార్, ప్రొఫె సర్ ఉష, డాక్టర్ జి శిరీష, డాక్టర్ వజిహాబానుతోపాటు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి నుంచి గంటపాటు విధుల బహిష్కరణ తిరుపతి సిటీ: స్విమ్స్ కార్మికులు చేపట్టిన ఆందోళన రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు మంగళవారం నుంచి ప్రతిరోజు గంటపాటు విధులను బహిష్కరించి నిరసన తెలపనున్నారు. ఈ మేరకు స్విమ్స్ ఉద్యోగ కార్మిక సంఘాల యూనియన్, సీఐటీయూ సంయుక్తంగా అధికారులను హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు తమ యూనియన్ నేటి నుంచి తలపెట్టిన సమ్మె కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని చెప్పారు. అయితే మంగళవారం నుంచి సమస్యల పరిష్కారానికి కార్మికులు గంట పాటు విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం, కే వేణుగోపాల్, జిల్లా నేతలు టి సుబ్రహ్మణ్యం, మాధవ్, వేణుగోపాల్, బుజ్జితోపాటు యూనియన్ నేతలు పాల్గొన్నారు. తిరుపతి మేయర్కు దక్కని గౌరవం తిరుపతి తుడా: తిరుపతి నగర ప్రథమ పౌరురాలైన మేయర్ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోంది. మేయర్ హోదాకు ఉన్న ప్రాముఖ్యతను విస్మరిస్తోంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ వేదికగా భారత పార్లమెంటు ‘ది రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రంత్నింగ్ కాంట్రట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. జూలై 3, 4 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ఆయా రాష్ట్రాల నుంచి మేయర్లు, చైర్ పర్సన్లను పంపించాలని పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చిన్న పదవుల్లో ఉన్నా వారిని ఎంపిక చేసి, ప్రతిపక్షానికి చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ వారిని దూరం బెట్టింది. తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీషను కాకుండా రెండవ డిప్యూటీ మేయర్ను మాత్రమే పంపించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నగర ప్రధమ పౌరురాలికి కనీస మర్యాదను ఇవ్వకపోవడం గమనార్హం. -
మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర
● ఫ్యాక్టరీ యజమానులతో కూటమి నేతల కుమ్మక్కు ● కడుపు మండి.. రైతుల ఆందోళన ● రైతుల దృష్టిని మరల్చేందుకు పెద్దిరెడ్డిపై నిందలు కూటమి సర్కారు దొంగాట ఆడుతూ మామిడి రైతులను నిండా ముంచేసింది. దొంగచాటుగా అధికార పార్టీ నేతల సిఫార్సులకు టోకెన్లు ఇచ్చి సామాన్య రైతులను పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై మామిడి రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మామిడి చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో మామిడి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నా, కనికరించే నాథుడు కరువయ్యారు. కాయలు అమ్ముకోవడానికి రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా నిరీక్షించిన రైతులు కడుపు మండి ధర్నాకు దిగుతున్నారు. ఈ పరిణామాల నుంచి రైతులు, ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి నేతలు, ఎల్లో మీడియాతో కలిసి వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. రెండు రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం ప్రారంభించారు. గుడిపాల మండలం గొల్ల మడుగు వద్ద.. క్యూ కట్టిన మామిడి కాయల వాహనాలుసాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా మామిడి రైతుల అవస్థలు వర్ణనా తీతంగా ఉన్నాయి. ప్రభుత్వం మొదట్లో మామిడి కిలో రూ.12గా ప్రకటించింది. ఆ తరువాత రూ.8 అని చెప్పింది. ఇంకో రోజు రూ.6 అని, ఆ తరువాత రూ.5 అని ఇష్టానుసారంగా రోజుకొక ధర చెబుతూ రైతులను మభ్యపెడుతూ వస్తోంది. ధర లేకపోతే పోనీ ఏదో ఒక రేటుకు కాయలు విక్రయించేస్తామన్న రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దానికి టీడీపీ నేతల సిఫార్సులు కావాలి. దీంతో పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. మరి కొందరు రైతులు మామిడి కాయల లోడ్లను తీసుకొచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా వరకు కాయలన్నీ ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. తెల్ల కాగితాలపై సంతకాలు రైతులు పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని కాయలు దించుకుని పంపేస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు ధర్నాలకు దిగుతున్నారు. గంగాధరనెల్లూరు వద్ద ఓ ఫ్యాక్టరీ యజమాని, అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క దొంగచాటుగా వారికి అనుకూలంగా ఉన్న వారి కాయలను మాత్రం దించుకోవడాన్ని మామిడి రైతులు గమనించారు. వారి తీరుని నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై వాహనాలతో మెరుపు ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు వారి దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేతలే కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంత దిగజారుడుతనమా? రైతులను ఆదుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా దిగుజారుడు రాజకీయాలకు దిగడం దారుణం. మామిడి దిగుబడులకు మద్దతు ధర కల్పించలేక, రోజుల తరబడి క్యూలో ఉన్న మామిడిని కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ యజమానులు, కూటమి నేతలు కుమ్మకై ్క మామిడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్న మామిడి రైతులు తిరగబడుతున్నారు. దీని నుంచి రైతుల దృష్టిని మరల్చటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి లేదు, ఉండబోదు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు అడుగడుగునా దగా.. ● ఒక ట్రాక్టర్ కాయలు ఫ్యాక్టరీల వద్ద అన్లోడ్ చేయడానికి 3 రోజుల నుంచి వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. అదే కూటమి నేతలు, అధికారులకు తెలిసిన వారి ట్రాక్టర్లు దొంగ చాటుగా ఒక్క రోజులోనే అన్లోడింగ్ చేసి పంపేస్తున్నారు. ● ప్రస్తుతం ఒక్కో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరం మేర మామిడి కాయల ట్రాక్టర్లు క్యూ కట్టి ఉన్నాయి. ● దీని వల్ల ఒక ట్రాక్టర్లో 5 టన్నుల కాయలతో వస్తే అన్లోడ్ చేసే నాటికి దాదాపు 1.5 టన్ను కాయలు పాడైపోతున్నాయి. ● ఫ్యాక్టరీ యాజమాన్యాలు ట్రాక్టర్ల అన్లోడింగ్ కోసం రోజుకు 100 టోకెన్లు ఇస్తామని చెబుతున్నా కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ● అన్లోడింగ్ చేసుకుని ఎన్ని టన్నులు దించుకున్నామంటూ రైతులకు బిల్లులు ఇస్తున్నారు. అయితే ఆ బిల్లులో కిలో మామిడి ధర ఎంతో స్పష్టం చేయలేదు. ● దీనిపై రైతుల నుంచి తిరుగుబాటు రాకుండా అంగీకార పత్రంపై రైతు వద్ద నుంచి సంతకం తీసుకుని పంపుతున్నారు. ● దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తర్వాత ఎంత ధర చెల్లించినా రైతులు ప్రశ్నించే అవకాశం లేదు. ● ఒక ట్రాక్టర్కు లోడ్ చేసే మామిడి కాయలు కోయడానికి రైతుకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. బాడుగ (ఐదు రోజులకు) రూ.7 వేలు. ● ఒకవేళ ఐదు రోజుల్లోపు ఫ్యాక్టరీ యాజమాన్యం కాయాలను దించుకోకుంటే, ఐదో రోజు తర్వాత మళ్లీ అదనంగా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు రైతు అదనంగా బాడుగ చెల్లించాలి. ● టీడీపీ కూటమి నాయకులు సిఫారసు చేసిన రైతుకు చెందిన మామిడి కాయల ట్రాక్టర్లను రాత్రి వేళ ఫ్యాక్టరీలోకి పంపి అన్లోడ్ చేసుకుంటున్నారు. సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి రోడ్లపైన వేచి ఉండలేక కొందరు రోడ్డుపైనే కింద పారబోసి వెళ్లిపోతున్నారు. ● ప్రభుత్వం మామిడి కాయలను రైతు నుంచి ఒక కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు 8 రూపాయల లెక్కన ఎక్కడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం ● ర్యాంపుల వద్ద కిలో మామిడి కేవలం రెండు రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు. చేసేది లేక రైతులు రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి కలిగింది. -
కార్మికుల సమస్యలపై కలిసి పోరాడదాం
● సీపీఎం నేతలకు ఎంపీ డాక్టర్ గురుమూర్తి హామీతిరుపతి కల్చరల్: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ నాయకులతో కలిసి పోరాడతామని సీపీఎం నేతలకు తిరుపతి ఎంపీ గురుమూర్తి హామీ ఇచ్చారు. గంధమనేని శివయ్య భవన్లో సోమవారం జరిగిన ఓ ప్రవేటు కార్యక్రమానికి హాజరైన ఎంపీ డాక్టర్ గురుమూర్తి సీపీఐ జిల్లా కార్యాలయానికి చేరుకుని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నాయకులతో కలిసి ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అంగన్వాడీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు, స్కీం వర్కర్లకు, వర్తించడం లేదని సీపీఎం నేతలు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు పలు అంశాలపై చర్చించారు. మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నేతలు రాధాకృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, రామచంద్రయ్య, అల్లాబాషా పాల్గొన్నారు. -
సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వరకు ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం హనుమంత, బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూలై 3న పార్వేట ఉత్సవం జరగనుంది. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మా పిల్లలను బడికి రావద్దన్నారు
తిరుపతి అర్బన్: మూడు దశాబ్దాల క్రితం 6 లేదా 7 పంచాయతీలకు ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ తర్వాత మారుతున్న కాలానుగుణంగా విద్యను అందరికీ అందించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ప్రతి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. దీంతో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గడంతోపాటు అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ క్లస్టర్ల (విలీనం) పేరుతో 6 లేదా 7 గ్రామాలకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయడంపై రగిలిపోతున్నారు. రాజుగుంట ఎస్సీకాలనీ వాసుల నిరసన శ్రీకాళహస్తి మండలం యార్లపూడి పంచాయతీలో ఉన్న రాజుగుంట ఎస్సీకాలనీలో మూడు దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే క్లస్టర్ పేరుతో మోడల్ స్కూల్ అంటూ మన్నవరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేసేశారు. ఇక నుంచి విద్యార్థులు అక్కడికి వెళ్లాలని ఉపాధ్యాయులు తేల్చి చెప్పేశారు. 3, 4, 5 తరగతుల పిల్లలు ఈ పాఠశాలకు రావద్దని స్పష్టం చేశారు. అటవీ సమీపంలో ఉన్న మన్నవరం పాఠశాలకు చిన్నపిల్లలను ఎలా పంపుతారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలను తమ కాలనీలోనే కొనసాగించాలని సోమవారం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. మా పాఠశాలను మూసివేయొద్దు ఏర్పేడు: మండలంలోని ఎండీ పుత్తూరు పాఠశాలను మూసివేయొద్దని సర్పంచ్ మోహన ప్రియ డీఈవోకు విన్నవించారు. ఆమె గ్రామస్తులతో కలిసి సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఎండీ పుత్తూరు నుంచి పక్క గ్రామ పాఠశాలకు చిన్న పిల్లలు వెళ్లి రావడం కష్టంతో కూడుకున్నదని, మూడు కిలోమీటర్ల మేర పిల్లలు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. పాఠశాల విలీన ప్రక్రియను నిలుపుదల చేసి ఇక్కడి పాఠశాలను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జలజ, గ్రామస్తులు పాల్గొన్నారు. మా పాఠశాలలను కొనసాగించాలి సత్యవేడు: మండలంలోని పేరడం ప్రాథమిక పాఠశాలను యధావిధిగా ఉంచాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ పాఠశాలను మదనం బేడు పాఠశాలలో విలీనం చేయవద్దని కోరారు. సుమారు రెండు కిలోమీటర్లు దూరం పిల్లలు వెళ్లలేరని విన్నవించారు. అముడూరు గ్రామస్తుల ఆందోళన ఏర్పేడు : మండలంలోని అముడూరు గ్రామంలో 1960 నుంచి ఉన్న పాఠశాలను మూసివేయడంతో వారు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. మండలంలోని పాగాలి గ్రామంలోనూ పాఠశాల విలీనం ప్రక్రియపై పిల్లలు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చదువులకు దూరం చేయొద్దని కోరారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 88 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. యువకుడి ఆత్మహత్య సైదాపురం: కువైట్కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుని తల్లి కాకాణి లక్ష్మమ్మ అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఐ క్రాంతి కుమార్ కథనం మేరకు మండకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి ఇద్దరు కుమారుల్లో ఒకరు గతంలో మృతి చెందారు. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లి వారం క్రితమే వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ క్రమంలో వెంకటరమణయ్య ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యభిచారం కేసులో ఇద్దరి అరెస్ట్ తిరుపతి క్రైమ్: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం చేస్తూ ఇద్దరు పట్టుబడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అలిపిరి సీఐ రామ కిషోర్ కథనం మేరకు, ఉపాధ్యాయ నగర్లోని మహేందర్ నివాస్ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలితోపాటు జైచంద్ర అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2000 నగదు, కండోమ్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
11 మంది ఉద్యోగ విరమణ
తిరుపతి క్రైమ్: జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించిన 11 మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అందులో పీసీల నుంచి ఎస్ఐల వరకు అన్ని స్థాయిల వారూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఘనంగా సత్కరించారు. షార్ట్ సర్క్యూట్తో వాహనాలు దగ్ధంతిరుపతి క్రైం: రేణిగుంట రోడ్లోని ఓ బైక్ షోరూమ్లో షార్ట్ సర్క్యూట్తో వాహనాలు దగ్ధమైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి అగ్నిమాపక శాఖ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి కథనం మేరకు, రేణిగుంట – తిరుపతి మార్గంలో ఉన్న జాయ్ ఈ బైక్స్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక బైక్ నుంచి మంటలు వచ్చి, మరో 10 వాహనాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో 11 బైకులు, ఒక ల్యాప్టాప్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. రూ.20 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది అన్నారు. అయితే ఈ షో రూమ్ లో మొత్తం వాహనాలు కాలిపోవడంతో యాజమాని రాజశేఖర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేయగలిగారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట చిల్లకూరు: గూడూరులో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ ప్రేమ జంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గూడూరు రూరల్ పోలీసులను సోమవారం ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు గూడూరు మండలం చెన్నూరుకు చెందిన రామతేజ, శ్రీకాళహస్తికి చెందిన సాయి దీపిక ఒకే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరు కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాలుు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ జంట పోలీసులను ఆశ్రయించడంతో వారు రెండు కుటుంబాల వారిని పిలిపించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి పంపించేశారు. మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలి తిరుపతి సిటీ: తెలుగు విద్యార్థులకున్న విభిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని రచయిత ఆర్సి.కృష్ణస్వామి రాజు సూచించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు సాహితీ సమితి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. తెలుగు కథా సాహిత్యం గ్రామీణ జీవితం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలుగు విద్యను అభ్యసించడానికి ప్రస్తుత తరం వెనకడుగు వేస్తున్నారని, తెలుగు సాహిత్యం చదవాలంటే ఎంతో అదృష్టం ఉండాలని తెలిపారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ కృష్ణస్వామి రాజు తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనల రూపంలో ప్రజలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై సుభాషిణి, సాహితీ సమితి అధ్యక్షులు ఎ ప్రనూష, ఉపాధ్యక్షులు జి వాణి, కార్యదర్శి బి. శిరీష, కోశాధికారి ఎ మోహిత డాక్టర్ లక్ష్మిప్రియ, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
ఓవర్ లోడ్.. ఐదు ఆటోలు సీజ్
తిరుపతి మంగళం : అద్దెలకు కక్కుర్తి పడి ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న 5 ఆటోలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. జిల్లా రవాణా శాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అథికానాజ్, మోహన్కుమార్ అలిపిరి భారతీయ విద్యాభవన్, ఎమ్మార్ పల్లి కూడలి ప్రాంతాల్లో విద్యార్థులను తరలించే ఆటోలను తనిఖీలు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ఐదు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కళాశాలలు, పాఠశాలల బస్సులతో పాటు విద్యార్థులను తరలించే ఆటోలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. అందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తరలించే వాహనాలకు ఎఫ్సీలు లేకపోయినా, ఆర్టీఏ నిబంధనలు పాటించకపోయినా, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, అధిక వేగంతో వెళ్లినా, మద్యం తాగి వాహనాలను నడిపినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారనే ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. వెల్లువెత్తిన ముడుపుల ఆరోపణలు సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలువురికి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వేశాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియారిటీలో అవకతవకలు సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. -
క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో వీసీలు
తిరుపతి సిటీ: విజయవాడ హోటల్ నోవోటెల్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పాల్గొన్నారు. అమరావతిని భారతదేశ క్వాంటమ్ వ్యాలీగా – తదుపరి తరం క్వాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా ఉంచాలనిన్న లక్ష్యంగా క్వాంటం కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్న్స్, గణితం, భౌతిక శాస్త్రం వంటి కీలక డొమైన్లపై సోమవారం జరిగిన వర్క్షాప్లో వీసీలు పాల్గొన్నారు. వీసీలు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్తో సహా ఎంపిక చేసిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల లో క్వాంటం కంప్యూటింగ్ను మైనర్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాపులో ఎస్వీయూ నుంచి ఆచార్య సుబ్బారావు, డాక్టర్ ఉషా రాణి, ఆచార్య జయ సుబ్బారెడ్డి, డాక్టర్ హేమలత, రుద్రమదేవి, ఆచార్య అంజన్ బాబు పాల్గొన్నారు. మూడు టిప్పర్లు సీజ్ సత్యవేడు: మండల కేంద్రంలోని సమీపంలో మూడు టిప్పర్లను మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అధికారులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా చమర్తికండ్రిగలోని సెవన్ హిల్స్ క్వారీ నుంచి తమిళనాడుకు కంకరు తరలిస్తున్న మూడు టిప్పర్లకు బిల్లులు సక్రమంగా లేకపోవడంతో తిరుపతి మైన్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. అక్కడి నుంచి సత్యవేడు ఆర్టీసీ గ్యారేజ్కు తరలించారు. -
కలెక్టర్కు వినతుల వెల్లువ
తిరుపతి అర్బన్: గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం పలుప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అర్జీలు ఇవ్వడానికి జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. మొత్తం 296 అర్జీలు రాగా, అందులో 145 అర్జీలు రెవెన్యూ సమస్యలపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, పలువురు జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. ఈ క్రమంలో రశీదుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. అయితే వీఆర్ఏలు, అటెండర్లు అర్జీలను రాసి అందించారు. గ్రీవెన్స్లో ఉన్న కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు పలువురు జిల్లా అధికారులను సోమవారం కుంభమేళాకు వెళ్లి విచ్చేసిన నాగసాధువులు ఆశీర్వదించారు. రజకుల స్థలానికి రక్షణ కల్పించండి తిరుపతి రూరల్ మండలం పేరూర్ పంచాయతీ యాదవ్కాలనీలో నివాసం ఉంటున్న రజకులకు 2014లో 30 సెంట్లు, ఆ తర్వాత అదే ఏడాది మరో 20 సెంట్లు భూమి కేటాయించాని రజకులు వెల్లడించారు. అయితే ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ పంచాయతీ కార్యదర్శి తమదీ అంటూ కంచె ఏర్పాటు చేశారని చెప్పారు. దీన్ని పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. నాయుడుపేటలో మినా ట్రక్స్, వ్యాన్ డ్రైవర్లకు అంబేడ్కర్ భవనం సమీపంలోని ఆర్అండ్బీ స్థలంలో పార్కింగ్ చేసుకోవడానికి స్థలాన్ని గతంలో కేటాయించారని చెప్పారు. అయితే ఆస్థలాన్ని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు, వ్యాన్ డ్రైవర్లు ఓ.గిరి, మస్తాన్ రెడ్డి. సిహెచ్.హేమంత్, వి.రమణయ్య, అమీర్, చెంచు కృష్ణయ్య, జిలాని, సతీష్, మాధవ్, చంద్ర పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 296 అర్జీలు రెవెన్యూ సమస్యలపై 145 అర్జీలు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు గత ఏడాది డిసెంబర్ వరకు 15,264 అర్జీలు గ్రీవెన్స్లో వస్తే అందులో 15,103 అర్జీలు పరిష్కారం అయినట్లు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. ఆయన కలెక్టరేట్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో గ్రీవెన్స్ ద్వారా వచ్చిన అర్జీల్లో 98.94శాతం పరిష్కారం చేసినట్లు లెక్కలు చూపడం దారుణంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువులో చెరువు ఆక్రమణలు తొలగించాలని గతంలో అర్జీ ఇచ్చినా ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా ఆన్లైన్లో సమస్య పరిష్కారమైనట్లు చూపడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటన్నింటిపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నేతలు జయచంద్ర, కరిముల్లా, బాలాజీ తదితరులు అధికారులకు ఓ వినతిపత్రాన్ని అందించారు. -
కాయలు కోతకోస్తే కన్నీళ్లే
● అమ్మకానికి రోడ్డున్నపడ్డ రైతులు ● రోజుల తరబడి రోడ్డుపైనే తిండీ తిప్పలు ● వెంటాడుతున్న దొంగల భయం ● కునుకు తీయని అన్నదాతలు నిద్రపోయి మూడు రోజులైంది.. నేను 1.50 టన్ను కాయలే తెచ్చాను. దానికి కోసం నాలుగు రోజులుగా ఈడే ఉన్నా. నిద్రపోయి మూడు రోజులు అయింది. తిండి తినాలంటే కి.మీ నడవాలి. హోటల్కు వెళ్లి తింటున్నా. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. దీనికి ప్రతి రోజు రూ.700 వరకు ఖర్చు అవుతోంది. ఈ అడవిలో ఉండలేకపోతున్నాం. గాలి ఒక్క పక్క. మరో పక్క ఎండలు. రాత్రుల్లో దొంగలు వస్తారని భయం. ఏం చేయాలి..అవస్థలు పడుతున్నాం. – గోవిందస్వామినాయుడు, ఏఎల్పురం, గుడిపాల రోడ్డు మీదే అన్నీ నాకు 7 ఎకరాల మామి డి తోట ఉంది. ఇప్పటికి ఒక లోడ్ కాయలను తో లాను. ఇప్పుడు మరో లోడ్ కాయలు తెచ్చాను. మూడు రోజులు అయింది. ఈ రోజుతో నాలుగో రోజు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు మరో రెండు రోజులు పడొచ్చు. అంతా వరకు ఈ కష్టాలు తప్పవు. నీళ్లు పోసుకుని మూడు రోజులు అయింది. ఏదైనా తినాలన్న తమిళనాడు బార్డర్ నుంచి కి.మీన్నర వెళ్లాలి. – లక్ష్మణన్, మాపాక్షి, చిత్తూరు ఫ్యాక్టరీల వద్ద వరుస కట్టి.. ఉమ్మడి జిల్లాలో 43 ఫ్యాక్టరీలుంటే..ఇందులో 31 ఫ్యాక్టరీలు మాత్రమే తోతాపురిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల ఎదుట రైతుల బాధలు వర్ణాతీతంగా మారాయి. గుడిపాల మండలం గొల్లమడుగు ప్రాంతంలోని ఓఫ్యాక్టరీ వద్ద రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 700కు పైగా ట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా ఫ్యాక్టరీ గేటు నుంచి తమిళనాడు సరిహద్దును తాకాయి. జీడీ నెల్లూరులోని ఎట్టేరి వద్ద పరిస్థితి తీవ్రతరమవుతోంది. ట్రాక్టర్లు బారులు తీరడంతో తోతాపురి ట్రాక్టర్లోనే పండవుతోంది. పూతలపట్టు, చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, పెనుమూరు, కార్వేటినగరం వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్లను ఆక్రమించాయి. ఈ రకంగా క్యూ కట్టడంతో రైతులు రోజులు తరబడి రోడ్డుకే పరిమితమయ్యారు. కాయలు అన్లోడింగ్ అయ్యేందుకు 5,6 రోజుల సమయం కావడంతో రైతులు రోడ్డుపైనే బస చేస్తున్నారు. కాణిపాకం : ఉమ్మడి జిల్లాలో మామిడి రైతు సుడిగుండంలో చిక్కుకున్నారు. వీరి సమస్యలు తీరని వెతలుగా మారాయి. కాయలు కోతకొస్తే రైతులకు కన్నీళ్లు ముంచుకొస్తున్నాయి. ఫలం విక్రయానికి రోడ్డున పడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే కునుకు తీస్తున్నారు. గొంతు తడుపుకోవడానికి, తిండికి తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు దొంగల భయం వెంటాడుతోంది. కునుకు వేసేందుకు వణుకుతున్నారు. మామిడి విక్రయాలకు అన్నదాత అగచాట్లు పడుతున్నారు. మామిడి పంటను సాగులోకి తెచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఆస్వాదించ లేకపోతున్నారు. పంట కోతకొచ్చే సరికి పడరానిపాట్లు పడుతున్నారు. నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. కొన్నిరోజులుగా జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి ఇలా తయారైంది. ఇల్లు..వాకిలి వదిలి రోడ్డుపైనే కునుకుతీస్తూ...మామిడి పంటను అమ్ముకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు. గుక్కెడు నీటికి గగనమే జిల్లా నలుమూలల నుంచి రైతులు వారు పండించిన పంటను కోత కోసి ఫ్యాక్టరీలకు అమ్మకానికి పెడుతున్నారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీల వద్ద రైతులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తాగునీటికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గొంతు తడుపుకోవడానికి కి.మీ మేర వెళ్లి తాగునీటిని కొని తెచ్చుకుంటున్నారు. చుట్టూ పక్కల, రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి దుకాణాల్లో లేకపోవడంతో రోడ్లమీద వచ్చే వాహనాలను ఆశ్రయించి నీళ్ల బాటిళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ కాలకృత్యాలకు కూడా వాటర్ బాటిళ్లే దిక్కుగా మారాయి. అలాగే ఆకలితో అలమటిస్తున్నారు. కడుపు నింపుకోవడానికి కూడా చాలా మంది హోటల్ వైపు చూస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్లు పంచి పెడుతున్న భోజనం పట్టక పలువురు హోటల్కు వెళ్తున్నారు. ఇలా రోజూ వారీగా రూ.700 వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. రెప్పవేస్తే ఒట్టు.. బండి క్యూలో పెట్టిన రోజు నుంచి అన్లోడింగ్ అయ్యే వరకు రైతు కంటిపై రెప్పవేయడం లేదు. పగలు అలా కొద్ది సేపు బండి కిందే నిద్రోతున్నారు. రాత్రుల్లో నిద్ర పట్టక అల్లాడిపోతున్నారు. కంటిపై రెప్పవేస్తే ఆ మార్గాల్లో రయ్..రయ్ మంటూ వెళ్లే వాహనాల శబ్ధాలకు ఉలిక్కిపడుతున్నారు. బలమైన గాలులు, వర్షాలకు అవస్థలు పడుతున్నారు. ఎండకు విలవిలలాడిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో కనీస నీడలు లేక ట్రాక్టర్ కింద భాగంలో తలదాచుకుంటున్నారు. -
మహిళా క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం
తిరుపతి ఎడ్యుకేషన్ : క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు రాణిస్తున్నారని, వారిని మరింతగా ప్రోత్సహిస్తామని, తద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ఏసీఏ సౌత్ జోన్ అండర్–15 ఉమెన్స్ వన్డే రాష్ట్ర స్థాయి పోటీలను నెల్లూరులో నిర్వహించారు. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు వరుసగా నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపపై జట్లపై విజయం సాధించి ఫైనల్ విజేతగా నిలిచింది. ఆదివారం ఈ మేరకు జట్టు సభ్యులను సీడీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా క్రీడాకారులకు మరింత సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉమెన్స్ క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళా క్రికెటర్లు ఈ విజయ స్పూర్తితో అన్ని ఫార్మాట్లలో రాణించాలని ఆకాంక్షించారు. -
త్వరలోనే జూనియర్స్ సీపీఎల్–1
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వేదికగా త్వరలోనే జూనియర్స్ చిత్తూరు ప్రీమియర్ లీగ్ (సీపీఎల్–1) పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ హోటల్లో సీపీఎల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో సీపీఎల్–1 విజయవంతంగా నిర్వహించామన్నారు. దీంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏసీఏ)కు తొలిసారిగా 60మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకోవడం గర్వకారణమని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఏపీఎల్, ఐపీఎల్లో ఎక్కువ మంది ఆడాలనే లక్ష్యంతోనే సీపీఎల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇదే స్పూర్తితో చిన్న వయసు నుంచే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల నుంచి 16ఏళ్లలోపు క్రికెటర్లతో జూనియర్స్ సీపీఎల్–1 పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్లు సైతం టీ–20 ఫార్మాట్లోనే ఉంటాయని, ప్రత్యక్ష ప్రసారం సైతం చేయనున్నట్లు తెలిపారు. 8 టీమ్లను ప్రాంచైజీ ద్వారా దక్కించుకోవడానికి ఆసక్తి గలవారు ముందుకు రావాలని కోరారు. పూర్తి వివరాలకు 88861 85559, 90002 14966నంబర్లలో సీడీసీఏ జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, సునీల్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వూకా విజయ్కుమార్, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరిప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు. -
రోజుల తరబడి పడిగాపులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట వ్యాపించి ఉంది. ప్రధానంగా తోతాపురి 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయిందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ దిగుబడులను విక్రయించడానికి ఈ సారి రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కాయ కోతకోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే పడిగావులు కాస్తున్నారు. వందలాది ట్రాక్టర్లు మామిడి కాయలతో క్యూ కడుతున్నాయి. ఈ గందరగోళంలో కాయలను అన్లోడింగ్ చేసేందుకు రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి అన్లోడ్ చేసే సరికే కాయలు కుళ్లిపోతున్నాయి. -
ఇంటర్వ్యూకు రాకుంటే తొలగిస్తాం
తిరుపతి సిటీ : ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్లకు ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో మంగళవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ సందర్బంగా రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్లు ఇంటర్వ్యూకు రాకుంటే వెంటనే విధుల నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తాత్కాలిక అధ్యాపకులకు సమాచారం అందించారు. మంగళవారం 43మందికి, 2వతేదీ 51మందికి, 3న 47మందికి, 4న 51మందికి, 5వ తేదీన 51మంది తాత్కాలిక అధ్యాపకులకు వీసీ ఛాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిదొరవారిసత్రం : స్థానిక రైల్వే స్టేషన్కు సమీపంలో 30ఏళ్ల నుంచి 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి చైన్నెకి వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. స్థానిక రైల్వే సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూళ్లూరుపేట జీఆర్పీ ఎస్ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
రేణిగుంట : తిరుపతి– రేణిగుంట రహదారిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న వైన్ షాప్లో వాచ్మన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి లీలా మహల్ సర్కిల్ వద్ద ఓ అపార్ట్మెంట్కు కాపలాగా ఉంటున్న కృష్ణారెడ్డి(65) రాత్రి వేళ రేణిగుంట సమీపంలోని వైన్ షాపులో వాచ్మన్గా పనిచేసేవాడు. ఆదివారం ఉదయం డ్యూటీ దిగిన తర్వాత గాయాలతో మృతి చెందడంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ మంజునాథరెడ్డి, గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్ట్ తిరుపతి క్రైమ్ : కర్ణాటకలోని చిక్బళ్లాపూర్కు చెందిన కృష్ణప్ప రాజేష్ (23) అనే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు తిరుపతి క్రైమ్ పోలీసులు ఆదివారం తెలిపారు. వివరాలు.. ఈనెల 9వ తేదీన కాటన్ మిల్ సమీపంలో నివసిస్తున్న ఫరూక్ సొంత పనులు నిమిత్తం నెల్లూరుకి వెళ్లడంతో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. పలు వస్తువులతోపాటు ద్విచక్రవాహనం అపహరణకు గురైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని హరేరామ హరే కృష్ణ మందిరంలో సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కృష్ణప్ప రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలు బయపడ్డాయి. నిందితుడిపై ఇదివరకే తిరుపతిలో మూడు కేసులు నమోదయ్యాయని, పలు జిల్లాల్లో దోపిడీలకు సంబంధించి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుడి నుంచి ద్విచక్రవాహనంతోపాటు 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
‘కౌటిల్య’ విద్యార్థులకు ఐఐఎం అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్పల్లె సర్కిల్లోని కౌటిల్య విద్యాసంస్థ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ అడ్మిషన్లు పొందారు. గత ఏడాది నవంబరులో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్ పరీక్ష తుది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఐఐఎంలలో అడ్మిషన్లు సాధించినట్లు కౌటిల్య విద్యాసంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. జి.వెంకట నితీష్ ఐఐఎం రాంచి, కె.హారికారాజు ఐఐఎం సిరమౌర్, భవ్యశ్రీ నిశిత, కె.కార్తీక్ ఐఐఎం నాగపూర్, ఐఐఎం సిర్మార్, పూణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్కు జి.అభినయ్ సుప్రీత పీఎన్.సుదర్శన్ అడ్మిషన్లు సాధించినట్లు వివరించారు. క్యాట్ పరీక్ష, ఐఐఎంలలో అడ్మిషన్లకు సంబంధించి ఉచిత గైడెన్స్కు 96981 23456 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఐఐఎంలలో సీట్లు సాధించిన విద్యార్థులను బోధనా సిబ్బంది ఎన్.హరి, ఎన్ఎస్.రెడ్డి అభినందించారు. -
పరిశోధనకు గణాంక శాస్త్రమే కీలకం
తిరుపతి సిటీ : పరిశోధన రంగంలో గణాంకశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత గణాంకశాస్త్ర పితామహుడు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చిత్రపటానికి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ తిరుపతి ఐఎస్పీఎస్లో డేటా సైన్స్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెంటర్ వర్తమాన గణాంకవేత్తలకు నాలెడ్జ్ హబ్గా మారాలని ఆకాంక్షించారు. ఐఎస్పీఎస్ గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ అనువర్తిత పరిశోధకులకు కన్సల్టెన్సీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గణాంకవేత్త ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి, ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణ, యూబీఐ రీజనల్ హెడ్ ఎల్ఎస్వీఆర్ శర్మ, యూనియన్ బ్యాంక్ తిరుపతి జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్, ఎస్వీయూ మాజీ రెక్టార్ సాంబశివారెడ్డి, ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, డాక్టర్ చంద్రమౌళి, ప్రొఫెసర్ విశ్వనాథన్, ప్రొఫెసర్ పార్థసారధి, డాక్టర్ శివపార్వతి పాల్గొన్నారు. శ్రీశక్తి పీఠంలో టీటీడీ చైర్మన్ రామచంద్రాపురం : రాయలచెరువు సమీపంలో వెలసిన శ్రీశక్తిపీఠాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ఆదివారం సందర్శించారు. వారాహీ నవరాత్రులను పురస్కరించుకుని పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే మరకత శక్తి కాళీదేవి, మరకత సిద్ధేశ్వరస్వామివారిని సేవించుకున్నారు. అనంతరం శ్రీశక్తి పీఠాదేశ్వరీ మాతాజీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మాతాజీని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శక్తిపీఠం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వైదేహీమాలను బహూకరించారు. సిరులతల్లికి వెండి తుంగవాలికలు చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీదేవికి భక్తులు రెండు వెండి తుంగవాలికలను (గొలుసు దీపా లు) విరాళంగా అందజేశారు. ఆదివారం హైదరాబాదుకు చెందిన శ్రీవారి భక్తుడు వీరాంజనేయులు రూ.3.27లక్షల విలువైన సుమారు 3 కిలోల బరువు గల వెండి తుంగవాలికలను కుటుంబ సభ్యులతో కలసి ఆలయ ఏఈఓ దేవరాజులుకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
హామీల అమలులో విఫలం
● వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరి(సైదాపురం) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జేఆర్ భవన్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నేదురుమల్లి మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో సాగిస్తున్న అరాచకపాలనకు ప్రజలే చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే జగనన్న ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జూలై 8వ తేదీన వెంకటగిరిలో రీకాల్ మేనిఫెస్టో చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్బందీగా నవరత్న పథకాలను అర్హులందరికీ అందించారని కొనియాడారు. ప్రస్తుత ంసీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తానని, సూపర్సిక్స్ హామీలను నెరవేరుస్తాని బూటకపు హామీలు గుప్పించి, ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా సర్కారు చేసింది శూన్యమని వెల్లడించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించేందుకు నెల్లూరు వస్తున్న జగనన్నను అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హెలీప్యాడ్ కోసం స్థలం ఇచ్చిన ఓ విద్యాసంస్థ యాజమాన్యంపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.భవిష్యత్ వైఎస్సార్సీపీదే.. రాష్ట్రంలో 2027లోనే జమిలి ఎన్నికలు జరగనున్నట్లు నేదురుమల్లి రామ్కుమారెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం వరిస్తుందని వెల్లడించారు. భవిష్యత్ వైఎస్సార్సీపీదే అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ ప్రసాద్రెడ్డి , వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య, పూజారి లక్ష్మి, రాపూరు, సైదాపురం,బాలాయపల్లి, డక్కిలి మండల కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, మన్నారపు రవికుమార్యాదవ్, వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులురెడ్డి, నేతలు సదారెడ్డి,చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు ఆవిశంకరయ్య, దనియాల రాధ, సుబ్బారావు, సుకన్య, సుభావలీ,అటంబాక శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీనివాసులురాజు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ముగియనున్న బదిలీల ప్రక్రియ
ఉమ్మడి జిల్లా పరిధిలో సాగుతున్న సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. కాళ్లరిగేలా తిరుగుతున్నాం మాది అనంతపురం. 15ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నాం. భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి మా దగ్గర ఉన్న సొమ్ముతో ఇటీవలే పెళ్లి చేశాం. మూడో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో పది చదువుతోంది. రెండో అమ్మాయి మంచి మార్కులతో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. కానీ, పైచదువులకు పంపాలంటే భయమేస్తోంది. అయితే మాలాగా కష్టం చేయకూడదని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలో రూ.లక్షలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవదని చెబుతున్నారు. దీంతో అప్పు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. – శారద, భవన నిర్మాణ కూలీ, తిరుపతి వడ్డీకి తెచ్చాం పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థి తి ఏర్పడింది. మా అమ్మా యి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివింది. పదో తరగతి కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాం. ఏడాదికి హాస్టల్తో పాటు మొత్తం ఫీజు రూ.1.80వేలు కట్టాల్సి వచ్చింది. దాచుకున్న రూ.50వేలకుతోడు మరో రూ.1.30వేలను వడ్డీవ్యాపారుల వద్ద రూ.5లకు వడ్డీకి తెచ్చి కట్టా. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయిని అందుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. నేను చిన్న ఉద్యోగిని. నా భార్య దివ్యాంగురాలు. మా కష్టం పిల్లలకు రాకూడదని అప్పు చేసి చదివిస్తున్నాం. – రామకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి, గూడూరు – 8లో -
బాసరకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు
● జూలై 4 నుంచి తిరుపతి–నాందేడ్కు రాకపోకలు ● నూతన మార్గంలో మొదటి ప్రయాణం ● షిరిడీ సాయి భక్తులకు అనుకూలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తెలంగాణా రాష్ట్రం బాసర క్షేత్రంలోని సరస్వతి దేవి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. తిరుపతి నుంచి బాసరకు జూలై 4వ తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి –నాందేడ్ ఽమధ్యలో ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప, రేణిగుంట నుంచి మొదటిసారిగా తిరుపతికి నడపనున్నారు. జూలై 11, 18, 25 తేదీలలో తిరుపతికి, అదే నెల 6, 19, 20, 27 తేదీలలో నాందేడ్కు ప్రయాణిస్తుంది. షిర్డి వెళ్లాలనుకునే భక్తులు నాందేడ్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి తక్కువ సమయంలో షిర్డి సాయిబాబాను దర్శించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. రైలు రాకపోకల సమయం ఇలా... నాందేడ్లో సాయంత్రం 4.30కి బయలు దేరి బాసర 6 గంటలకు, నిజామాబాద్ 6.25 గంటలకు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్ రాత్రి 8 గంటలకు, చెర్లపల్లి 9.30 గంటలకు, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా పిడుగురాళ్లకు అర్ధరాత్రి 12.30 గంటలకు చేరుకుంటుంది. దొనకొండ, మార్కాపురం రోడు, కంభం, గిద్దలూరు నుంచి నంద్యాలకు వేకువజాము 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా కడపకు 8.30 గంటలకు వస్తుంది. రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రైలు మళ్లీ తిరుగు ప్రయాణం తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి కడపకు 4.15కు చేరుకుని మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి తిరుపతి వరకు ప్రయాణిస్తుంది. -
● అలరించిన బకాసుర వధ
శ్రీకాళహస్తీశ్వర అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న తిరునాళ్లలో భాగంగా మూడో రోజు ఆదివారం బకాసుర వధ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. భీముడి వేషధారి ఎద్దుల బండిలో వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేసి అన్నం సేకరించి ధర్మరాజ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాడు. అనంతరం బకాసుర వధ ఘట్టం ప్రదర్శించారు. ఈ క్రమంలో పట్టణంలో సేకరించిన అన్న ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధర్మరాజు, భీముడు, అర్జున వేషధారులు ఆలయం వద్ద కనువిందు చేశారు. అనంతరం అర్జునుడు మత్స్య యంత్ర ఛేదన ఘట్టం ప్రదర్శించారు. – శ్రీకాళహస్తి -
పిల్లలకు చదువు తప్ప ఇంకేం ఇవ్వగలం.. ఆస్తిపాస్తులు సమకూర్చలేని పరిస్థితుల్లో ఉన్నత విద్యను తప్ప ఇంకేం అందించగలం.. ఇదీ సగటు మధ్యతరగతి మనిషి ఆలోచనా విధానం. ఇదే అలుసుగా పలు విద్యాసంస్థలు కాసులు పోగేసుకుంటున్నాయి. అప్లికేషన్.. అడ్మిషన్.. టర్మ్ ఫీజుల రూపంలో
● పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల ఇక్కట్లు ● ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న స్కూళ్లు.. కాలేజీ యాజమాన్యాలు ● విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తప్పని అప్పులు ● అధిక వడ్డీలతో ఎడతెగని పాట్లు ● పుస్తెలు సైతం తాకట్టు పెడుతున్న మాతృమూర్తులు తిరుపతి సిటీ : జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పాఠశాలల్లో దాదాపు పూర్తికాగా, ఇంటర్, ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ కళాశాలలో ఇప్పుడిప్పుడే ప్రవేశాలు ఊపందుకుంటన్నా యి. తమ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ కావాలనే కోరికలతో తల్లిదండ్రులు జిల్లాలోని పేరొందిన కార్పొరేట్ విద్యాసంస్థల వెంటపడుతున్నారు. దీంతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫీజులను ఆమాంతం పెంచి దండుకుంటున్నాయి. విద్యాసంస్థలు చెప్పింనంత ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులు, కుదువ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారలు రూ.5 నుంచి రూ.10ల వరకు డిమాండ్ చేస్తూ ప్రామిసరీ నోట్లు రాయించుకుని, ఖాళీచెక్కులను తీసుకుని నగదు ఇస్తున్నారు. అలాగే ఫీజుల చెల్లింపులకు పలువురు ఇంటిలోని బంగారం తాకట్టు పెట్టేందుకు కుదువ వ్యాపారులను సంప్రదిస్తున్నారు. దీంతో జిల్లాలోని పాన్ బ్రోకర్ షాపులు సైతం ఈ నెల కళకళలాడుతున్నాయి. వారు కూడా బంగారును తాకట్టు పెట్టుకుని రూ.3లు నుంచి రూ.5 వడ్డీతో నగదు అందిస్తున్నారు. వడ్డీకి సైతం చక్రవడ్డీ వర్తిస్తుందని సంతకాలు తీసుకుంటున్నారు. చదివించాలనే తపన పిల్లలు మాలా కష్టాలు పడకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే తపనతో అప్పులు చేసి ఉన్నతంగా చదివించేందుకు సిద్ధపడ్డాం. నా భర్త, నేను ఇద్దరం సొంతంగా తిరుపతిలో కిరాణా దుకాణం నడుపుతున్నాం. మాకు అబ్బాయి, అమ్మాయి కవల పిల్లలు. ఇద్దరూ ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేశారు. ఒకరి డాక్టర్ చేయాలనే ఆశతో ఇంటర్ ప్రైవేటు కళాశాలలో బైపీసీ చేర్పించాం. ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టాం. అమ్మాయిని తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ చేర్పించాం. ఫీజు ఏడాదికి రూ. 1.50లక్షలు చెప్పారు. ఇందులో రూ. 2లక్షలకు బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టాం. – ద్రాక్షాయిణి, కిరాణా దుకాణం నిర్వాహకులు, రేణిగుంట చదువు కొనాల్సి వస్తోంది విద్య వ్యాపారంగా మారిపోయింది. జూన్ వచ్చిందంటే మాలాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణం. పిల్లల చదువులకు అప్పులకోసం వెతుకులాట తప్పడం లేదు. నేను తిరుపతిలో ఓ విద్యాసంస్థలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. నా భర్త దివ్యాంగుడు. వచ్చే జీతం ఇంటి ఖర్చులు, బాడుగకు సరిపోతుంది. ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. మరో కుమారుడు ఇంటర్ పూర్తి చేసి నీట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చినా కనీసం రూ. 5లక్షలు కావాల్సిన పరిస్థితి. అందుకోసం ఇంట్లో బంగారం తాకట్టు పెట్డడంతో పాటు మరో రూ.2లక్షలు అప్పు చేయాల్సిందే. ఈ కాలంలో చదువును కొనాల్సి వస్తోంది. – శ్రావణ భార్గవి, అధ్యాపకులు, తిరుపతితిప్పలు తప్పడం లేదు నేను తిరుపతిలోని ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నా. నా భార్య సైతం ఓ ప్రైవేటు షాపులో పనిచేస్తోంది. ఇద్దరి జీతం నెలకు రూ.26వేలు వస్తాయి. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓ అమ్మాయి పదో తరగతిని ఈ ఏడాది పూర్తి చేసింది. ప్రైవేటు కళాశాలలో ఎంపీసీలో చేర్పించాం. జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తామని ఏడాదికి రూ.1.50లక్షలు చెప్పారు. ప్రస్తుతం అప్పు చేసి రూ.లక్ష కట్టాం. మరో అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల విడుదల చేసి నీట్ ఫలితాలలో 480మార్కులు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ అమ్మాయి చదువుకోసం విలేజ్లో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాం. – శివశంకర్, డెలివరీ బాయ్, తిరుపతి రూరల్ -
శ్రీసిటీకి పోలీస్ బాస్ ఎవరు?
● ఉద్యోగ విరమణ పొందిన హైటెక్ స్టేషన్ డీఎస్పీ ● నెల నుంచి ఖాళీగా పోస్టు శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే శ్రీసిటీలోని హైటెక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పోస్టు నెల నుంచి ఖాళీగానే ఉంది. మే నెలాఖరున డీఎస్పీ పైడేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు భర్తీ చేయలేదు. నాయుడుపేట డీఎస్పీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎందుకీ నిర్లక్ష్యం శ్రీసిటీలో ఇప్పటికే పలు దేశాలకు చెందిన 250 పరిశ్రమలు ఉన్నాయి. 70వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. పలు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు రోజువారీ పారిశ్రామికవేత్తలు ఇతర ముఖ్యులు పర్యటిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీసిటీ పారిశ్రామికవాడలోని హైటెక్ పోలీస్ స్టేషన్కు నెల నుంచి డీఎస్పీని నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అలాగే ఈ పోలీస్ స్టేషన్కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి సిబ్బందిని కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికై నా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి పారిశ్రామికపరంగా ఎంతో ప్రాధాన్యత గల శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్కు డీఎస్పీని నియమించాలని పలు పరిశ్రమల ప్రతినిధులు, ఉద్యోగులు కోరుతున్నారు. -
● జగన్నాథుడి రథయాత్ర
ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర శనివారం సూళ్లూరుపేట పట్టణానికి చేరుకుంది. నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2.30 గంటలకు పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్ర భక్తజన సందోహం మధ్య నిర్వహించారు. హరేరామ, హరేకృష్ణ నామస్మరణలతో పట్టణం మారుమోగిపోయింది. చెక్క భజనలు, కోలాటాలతో రథయాత్ర ముందు నిర్వహించారు. రథయాత్ర ముగింపు అనంతరం శ్రీనగర్ కాలనీలో స్వామి వారికి నేతి దీపారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు, సూళ్లూరుపేట ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. – సూళ్లూరుపేట -
తిరుపతిలోనే డాక్టర్ల రిజిస్ట్రేషన్ సేవలు
తిరుపతి తుడా: డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియను జిల్లా స్థాయిలో తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ప్రారంభించినట్టు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీ హరిరావుతో కలిసి స్థానిక ఎస్వీ వైద్య కళాశాల సామాజిక విభాగంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని సేవల కోసం డాక్టర్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాలోనే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి శనివారం, ఆదివారం పాత జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం తీసుకున్న నిర్ణయం అభినదనీయమన్నారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం శుభ పరిణామని, సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రెన్యువల్ తదితర సేవలు అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫీజు తగ్గించామని చెప్పారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ టాపర్స్కు ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్స్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, డాక్టర్ ప్రమీల, డాక్టర్ జనార్థన్, డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్ యుగంధర్, వైద్య మండలి సిబ్బంది పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై కేసులు.. స్వేచ్ఛను హరించడమే
చిత్తూరు అర్బన్: పత్రికల్లో వార్తలు రాసినందుకు గాను జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేఎం.అశోక్కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదుల వస్తే వాటిలో వాస్తవాలు విచారించి ఆపై పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓ వార్త రాసినందుకు గాను స్థానిక సాక్షి రిపోర్టర్ నాగరాజు పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం .. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయంపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించారు. జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టొద్దని.. తమను పాత్రికేయులు గానే గుర్తించి.., హక్కులను రక్షించడానికి పోలీసు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పాత్రికేయులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, కలం గౌరవాన్ని కాపాడాలని కోరారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీని సైతం రూపొందిస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారు అనే ఫిర్యాదు పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. విచారణలో సంబంధిత రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రక్షణ కోసం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తాము కచ్చితంగా పాటిస్తామన్నారు. కలెక్టర్తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఎస్పీతో ఏపీయూడబ్ల్యూజే నేతల భేటీ పత్రికా స్వేచ్ఛకు కట్టుబడే ఉంటామని ఎస్పీ -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిలో ఒక మహిళ మృతి చెందగా రామచంద్రాపురం మండలంలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా.. పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సరస్వతి(50) అనే మహిళ మృతి చెందగా, మరో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు విజయనగరం ప్రాంతానికి చెందిన లహరి తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవ దర్శనానికి కారులో వెళుతున్నారు. మార్గం మధ్యలో ఎగువచావలి గ్రామం వద్ద ముందు వెళుతున్న గుర్తు తెలియని లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వెళుతున్న కారు ముందు లారీని ఢీకొంది.ఈ ఘటనలో కారులో వెళుతున్న సరస్వతి, లహరి, మీనా, నవ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. అదే విధంగా నెల్లూరు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు మార్గం మధ్యలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దువ్వూరు శ్రావణ్కుమారెడ్డి, రవీంద్రారెడ్డిలకు గాయాలయ్యాయి. స్థానికులు చికిత్సల నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పరపల్లి వద్ద యువకుడు.. రామచంద్రాపురం : మండల పరిధిలోని పరమాల గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తగీరు చిట్టిబాబు(38) మూడు రోజుల కిందట వ్యక్తిగత పనులపై తన స్నేహితుడితో కలసి తిరుపతి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఉప్పరపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడగా వాహనం వెనుక వైపు కూర్చున్న చిట్టిబాబు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే రుయా హాస్పిటల్కు తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం స్విమ్స్కు తరలించగా శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు చిట్టిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జులై 10న మెగా పేరెంట్–టీచర్ సమావేశం
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,289 అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో జులై 10న మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. దీనికోసం పాఠశాలలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ గ్రాంట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు రూ.లక్ష , 251 నుంచి వెయ్యి మందికి లోపల విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75 వేలు, 100 నుంచి 250 మధ్య విద్యార్థులున్న పాఠశాలలకు రూ.50 వేలు, 31 నుంచి వంద మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.25 వేలు, 30 మందికి లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేలు గ్రాంటును మంజూరు చేయనున్నామని, ఇప్పటికే 50 శాతం గ్రాంటును విడుదల చేయగా అందులో 20శాతం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశ నిర్వహణకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థుల మార్కులు, హాజరు, ఆరోగ్యం, సహ పాఠ్య కార్యకలాపాల్లో చూపిన ప్రతిభ వంటి అంశాలతో కూడిన విద్యార్థుల ప్రగతిని తెలిపేలా ప్రోగ్రెస్ కార్డులు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు
శ్రీసిటీ (సత్యవేడు):శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ‘అన్నమయ్య పదామత వర్షణి’ కార్యక్రమం శనివారం సంగీత ప్రియులను అలరించింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకరరావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. కళాకారులను ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు. నిర్వాహకుల తరపున తిరుపతి శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉప కులపతి కుసుమకుమారి కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి పళ్లేటి బాలాజీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
బాబు బూటకపు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మేనిఫెస్టో బాండ్లను ఇచ్చి మోసగించిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్య క్షులు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి మారుతీనగర్లోని పెద్దిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బొర్ర మాదవిరెడ్డి తదితరులు శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి దుస్సాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించడంలో మహిళా విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అన్నీ చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్న విషయాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి సూచించిన పెద్దిరెడ్డి, భూమన -
మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి
తిరుపతి మంగళం : తిరుపతిలో ‘నేషనల్ మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం,కార్యకలాపాలు నిర్వహించగలదని, అలాగే చిత్తూరు జిల్లాలో శ్రీజాతీయ మామిడి పరిశోధనా కేంద్రం’ చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుంచి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను పొందలేని దుస్థితి అని వివరించారు. కూలీల ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాలతో చిత్తూరు–తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూత పడినట్లు లేఖలో వివరించారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
జగన్నాథుడి రథయాత్ర
జగన్నాథ రథయాత్ర శనివారం సూళ్లూరుపేటకు చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోఇళ్లు, విల్లాలపై పడి దోచుకుంటున్న దొంగలు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు. ఇటీవల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా రైలు ప్రయాణికులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్ క్లాసుల్లోని ప్రయాణికులనే ఎంచుకుని చెలరేగిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞాన్ని చాకచక్యంగా సిగ్నల్ వ్యవస్థను వినియోగించుకొని ట్యాంపరింగ్ చేసి అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను సైతం భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. రైళ్లలో రాత్రివేళ చెలరేగిపోతున్న దొంగలు ● బంగారు నగలే లక్ష్యంగా దోపిడీ ● సిగ్నల్ ట్యాంపరింగ్తో చోరీలు ● రెండు నెలల్లో మూడు ఘటనలు ● దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు ● ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు సిగ్నల్ ట్యాంపరింగ్తో దోపిడీఏసీల కంటే స్లీపర్ క్లాస్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్లో సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగుల లైట్స్కు సంబంధించి బాక్స్లో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ (మిడ్ స్టేషన్) మధ్యలో ఉండే సిగ్నల్ మానిటరింగ్ వ్యవస్థలో రెడ్, గ్రీన్ లైట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రీన్ లైట్ వైర్ను దొంగలు తీసివేస్తున్నారు. ఆ సమయంలో సిగ్నల్ చూపితే రెడ్లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ సిస్టమ్ను కనుక్కొని దొంగల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు ● మే 2న రాత్రి 10.30 గంటలకు ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైంది. రెడ్లైట్ వెలుగుతుండడంతో రైలు ఆగిన తర్వాత కొందరు దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరి ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు తీసుకొని పారిపోయారు. ● మే 14న వేకువజామున 2.30 గంటలకు అదే ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో మళ్లీ హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేశారు. కొందరు రైలు బయట నుంచే బంగారు గొలుసులు దొంగలించారు. ● జూన్ 26 వేకువజామున 2.30 గంటలకు సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ గురవ్వడంతో రైలును ఆపేశారు. కొంతమంది ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని వెళ్లారు. ఈ మూడు దొంగతనాల్లో 10 మంది మహిళల మెడల్లోని దాదాపు 120 గ్రాముల పైగా బంగారాన్ని కాజేశారు. చిత్తూరు కార్పొరేషన్: రైలు ప్రయాణమంటేనే ఉమ్మడి జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలు తలుచుకుని భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం.. కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడంతో దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీల నివారణ కష్టతరమవుతోంది. ఎక్కువగా రాత్రి 10.30 నుంచి వేకువజామున 3 గంటల లోపు దొంగతనాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. కిటీకీల వద్ద నగలు చోరీ చేసి పరారవుతున్నారు. బంగారు నగలే లక్ష్యం రైళ్లలో చిల్లర దొంగతనాలు పాత పద్ధతి. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని చాకచక్యంగా కొట్టేసేందుకు పూనుకుంటున్నారు. ఊర్లకు వెళ్లేటప్పుడు మహిళలు ఆభరణాలు ధరించుకువెళ్లడం అలవాటుగా మారిన నేపథ్యంలో దొంగలు వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా రైలు కిటికీల నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, రోడ్డుకు దగ్గర్లో ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిమిషాల్లో తమ పనికానిచ్చేస్తున్నారు. మహారాష్ట్ర ముఠాగా అనుమానం వరుస దొంగతనాల వెనుక మహారాష్ట్ర (పార్థీ గ్యాంగ్) ముఠాకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్లలో నేరాలకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. వీరు 4–8 మంది దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లె స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలో వేకువజామున 2.30 గంటలకు రైలు ఆగింది. దుండగలు రైలు వెలుపల ఒకరు వెనుక ఒకరు ఉన్నారు. ఒకరి భుజం పై మరొకరు కూర్చొని తెరిచిన కిటికీల్లో టార్చ్ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపారు. ఇలా ఎస్–7, 10 బోగిల్లో నలుగురి వద్ద 60 గ్రాముల వరకు బంగారం దోచుకున్నారు. రైలులో ఉండే బీట్ పోలీసులు విజిల్స్ వేసే లోపల దొంగలు తప్పించుకున్నారు. ఘటన జరిగిన అర గంటలో రైల్వే పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అరకొరగా ఎస్కార్ట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరకొరగా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్ నుంచి ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్లో 3 నుంచి 4 రైళ్లను కవర్చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్ఫీఎఫ్ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను కవర్చేసే విధంగా ఉంటే భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన వారి విధులు బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నా జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్లీపర్క్లాస్లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో కడప రైల్వేస్టేషన్ వరకు ఇద్దరు ఎస్కార్ట్గా వచ్చి కడపలో దిగుతున్నారు. – 8లోగస్తీ ముమ్మరం రైళ్లలో దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వివిధ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమ్తతంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు జరగకుండా ప్రతి రైల్వే స్టేషన్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులు సహకరించాలి. – హర్షిత, రైల్వే డీఎస్పీ, గుంతకల్లురేంజ్ రెండు నెలల్లో మూడు రాబరీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో మూడు రాబరీలు జరిగాయి. ఇందులో రెండు తిరుపతి జిల్లాలోని ముంగలిపట్టు వద్ద కాగా మరొకటి చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె సమీపంలో చోటు చేసుకుంది. చిత్తూరులో ఇటువంటి దోపిడీ జరగడం ఇదే మొదటి సారి. కానీ ఈ దొంగతనాల్లో దాదాపు రూ.15 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఇటీవల చిత్తూరు రూరల్ పరిధిలో జరిగిన రాబరిపై పోలీసులు ప్రత్యేక బృందంగా విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్, యాక్టివ్ క్రిమినల్స్ గురించి ఆరా తీస్తున్నారు. -
వడ్డీ వ్యాపారి నుంచి ఆటో ఇప్పించండి
చంద్రగిరి : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తమకు అందించిన ఆటోను వడ్డీ వ్యాపారీ బలవంతంగా తీసుకున్నాడని, ఆయన ఆగడాల నుంచి రక్షించి, కుటుంబానికి జీవనాధారమైన ఆటోను తమకు ఇప్పించాలంటూ బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వివరాల మేరకు.. మండల పరిధిలోని శేషాపురానికి చెందిన శివ భార్య నందినికి ఎస్సీ కార్పొరేషన్తో పాటు మహిళా సంఘాల ద్వారా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ–ఆటోను పొందారు. అప్పటి నుంచి నందిని భర్త శివ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన పచ్చిపాల చైతన్య గతేడాది రూ.60 వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆపై వడ్డీల రూపంలో సుమారు రూ.1.60 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే కొంత వడ్డీతో పాటు అసలు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు జీవనాధారమైన ఆటోను బలవంతంగా తీసుకున్నట్లుగా బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వారు శుక్రవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. -
యువకుడి అదృశ్యం
కోట : కోటకు చెందిన ముకేష్ కుమార్ అనే యువకుడు మూడు రోజులుగా కనిపించడం లేదని అతని తండ్రి గీసూలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్కు చెందిన గీసూలాల్ కోటలో టీ దుకాణం నడుతున్నాడు. తండ్రి మందలించడంతో 18 ఏళ్ల ముకేష్కుమార్ కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కనిపించకుండా పోయిన ముకేష్ కుమార్ ముంబయిలో ఉన్నట్లు ఆచూకీ లభించిందని రాజస్థాన్ వాసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐకు సమాచారం ఇచ్చామన్నారు. ఆవుల దాడి ఘటనపై ఆందోళన వద్దు తిరుపతి తుడా : తిరుపతిలో ఆవులు దాడి చేసినట్లు అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకున్నది కాదని నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను తిరుపతికి చెందిన కొందరు ముందు జాగ్రత్త కోసం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆందోళన కలిగించే ప్రచారం మంచిది కాదని హితువు పలికారు. నగరంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆమె సూచించినట్లు తెలిపారు. తిరుపతికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న తరుణంలో వ్యక్తిగతంగా పశువులు పెంచుకునే వారు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వదిలి వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవీఎం గోదాములపై నిఘా రేణిగుంట : జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్ర పరిచిన గోడౌన్ వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్ర పరిచిన ఈవీఎంలను శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో ఈవీఎం గోడౌన్ ఇన్చార్జి, ఎస్డీసీ సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రాణహానీ ఉంది.. రక్షణ కల్పించండి.
రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ సైదాపురం : అక్రమ మైనింగ్దారులతో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష యాదవ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు తాము ఫిర్యాదు చేశామన్నారు. దీని దృష్టిలో ఉంచుకోని జిల్లా మైనింగ్ అధికారులతో పాటు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులతో పాటు ప్రాణహాని కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసే వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆమె కోరారు. జిల్లా ఎస్పీకి పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏపీ టూరిజానికి భూ కేటాయింపు ● ఎస్వీపురం పరిధిలో 12.70 ఎకరాలకు ఆమోదం తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలో ఏపీ టూరిజం ఆథారిటీకి ఉచితంగా భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. వడమాలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ పరిధిలో 12.70 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఉచితంగా భూ కేటాయింపు ప్రతిపాదనపై మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీపురం సర్వే నంబరు 428–2లో 30 సెంట్లు అలాగే సర్వే నంబరు 428–3లో 12.40 ఎకరాల చొప్పున ఏపీ టూరిజం అథారిటీకి భూమిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చిన మెస్సర్స్ పావని హోటల్స్ సంస్థకు అవసరమైన రాయితీ ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 5 స్టార్ హోటల్ ఏర్పాటుతో సుమారు 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పర్యాటక రంగ శాఖ అధికార యంత్రాంగం భావిస్తోంది. అదే విధంగా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా పట్టణంలోని చైన్నె రోడ్డులో వెలసిన ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణతో పూజలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. హోమ పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు చేశారు. కాగా ఉదయం ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి పుర ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, శ్రీకాళహస్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులకు శ్రీసిటీ చేయూత
● రూ.18 లక్షలతో వసతుల కల్పన శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమ ఐసాన్ ఆటో పార్ట్స్ ఇండియా సుమారు రూ.18.80 లక్షలతో వివిధ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన వసతులను ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకావే, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విద్యా వసతుల్లో సూళ్లూరుపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో రూ. 6.50 లక్షల ఖర్చుతో అదనపు మరుగుదొడ్లు, వంట గది నిర్మాణం, సత్యవేడు మండలం రామచంద్రపురంలో రూ.12.30 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ భవనం నిర్మించారు. ఈ సందర్భంగా ఐసాన్ మేనేజింగ్ డైరెక్టర్ యసనోరి సకాయి మాట్లాడుతూ.. విద్యా వసతుల కోసం సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టడం ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసాన్ పరిశ్రమ ప్లాంట్ హెడ్ యూచి టొమిట, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ గోపాల్, ప్రొడక్షన్ కోఆర్డినేటర్ తోషిహిరో సనా, మ్యానుఫ్యాక్చరింగ్ డీజీఎం దేవనాథన్, శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం
బుచ్చినాయుడుకండ్రిగ : గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్యదర్శులు పనితీరు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారిణి సుశీలాదేవి హెచ్చరించారు. శుక్రవారం కారణి గ్రామంలో పర్యటించి, ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో దోమల నివారణకు మురుగు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయించి, వీధుల్లో బ్లీచింగ్ చేయించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలను అరికట్టాలని, తాగునీటి సమస్యలు లేకుండా, వీధులలో గుంతలు ఉంటే పూడ్చాలని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టకపోతే ఉపేక్షించేదేలేదన్నారు. ఈక్రమంలో ఈఓపీఆర్డీ రాజశేఖర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నమ్మ, సర్పంచ్ పద్మమ్మ పాల్గొన్నారు. -
పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగాల కల్పనకు కృషి
తిరుపతి అర్బన్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సాంకేతిక అంశాలను జోడించాలని రాష్ట్ర ఎంఎస్ఎం, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో శుక్రవారం ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎస్పీ సోమనాథ్, రాష్ట్ర ఎంఎస్ఎం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ సీఈఓ విశ్వ, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.80 లక్షల మంది ఎంఎస్ఎంఈల రంగంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. -
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పచ్చనేతల దౌర్జన్యం
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు తిరుపతి మంగళం /తిరుపతి అర్బన్ : తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో భూములు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పరంబోకు స్థలాలు కనిపిస్తే పచ్చనేతలు పాగవేసేస్తున్నారు.అందులో భాగంగానే మంగళం తిరుమలనగర్ పంచాయతీ పరిధిలోని తుడా క్వార్టర్స్, బొమ్మల క్వార్టర్స్లోని చెన్నాయగుంట లెక్క దాఖలాలు 195, 226 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కొందరు శుక్రవారం ప్రయత్నించారు. ఏకంగా జేసీబీలతో గాడులు తీసి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. అర్బన్ తహశీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో ప్రసాద్ అక్రమ నిర్మాణాలను అడ్డుకుని జేసీబీలను అక్కడ నుంచి పంపివేశారు. 195, 226 సర్వే నంబర్లలోని స్థలం ప్రభుత్వానికి చెందిందని, అందులో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో టీడీపీ నాయకులు తమకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని చెప్పారని, తమ వద్ద పట్టాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే మీ వద్ద ఉన్న పత్రాలను తహశీల్దార్కు చూపించి అనుమతి తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. అంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించి అక్కడ నుంచి పంపించి వేశారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
● భక్తులకు స్వల్పగాయాలు తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళుతున్న మరో కారును ఢీకొనడంతో భక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తమిళనాడుకు చెందిన భక్తులు ఓ కారులో, తెలంగాణకు చెందిన భక్తులు మరో కారులో తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద తమిళనాడు కారు అదుపు తప్పి ముందు వెళుతున్న తెలంగాణ కారును ఢీకొంది. దీంతో కారు ముందు ఉన్న రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలలోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. తమిళనాడుకు చెందిన భక్తుల కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. -
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత
తిరుపతి సిటీ : వ్యవసాయరంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పరిశోధనలు జరగాలని ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శ్రీవ్యవసాయంలో సవాళ్లు, వాతావరణ అనుకూలత, నూతన ఆవిష్కరణలుశ్రీ అనే అంశాలపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సును ఆమె వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం అతిథులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను కనుగొని రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ పూర్వ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎంఏ శంకర్ మాట్లాడుతూ.. నూతన వంగడాల దిగుబడి సామర్థ్యం పెంపొందించడానికి పంట యాజమాన్య పద్ధతులు కీలకమన్నారు. రాష్ట్ర రైతు సాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ద్వారా గణనీయమైన పురోగతి సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ వీడ్ రీసెర్చ్ జబల్పూర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్, ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ సుమతి, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వైస్ చైర్మన్ డాక్టర్ భరతలక్ష్మి, ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎంవీ రమణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. -
విద్యుత్ బస్సుల కేటాయింపు వరం – ఈడీ
● త్వరలో జిల్లాకు 50 విద్యుత్ బస్సులు తిరుపతి అర్బన్ : తిరుపతికి విద్యుత్ బస్సుల కేటాయింపు ఓ వరంగా భావించాల్సి ఉందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈడీ) తిమ్మాడి చెంగల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలోని డీపీటీవో కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చిన విజ్ఞానజ్యోతి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వారు విద్యుత్ బస్సుల శిక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ.. 2021లో జిల్లాలో 100 విద్యుత్ బస్సులను కేటాయించిన అంశాన్ని గుర్తుచేశారు. విద్యుత్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని. కాలుష్య నియంత్రణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అలాగే జిల్లాకు త్వరలో మరో 50 విద్యుత్ బస్సులు రానున్నాయని చెప్పారు. ఈ కొత్త సర్వీసులను మంగళం డిపో కేంద్రంగా నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో డీపీటీవో జగదీష్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సిద్ధంకండి రానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఈడీ తిమ్మాడి చెంగల్రెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన డీపీటీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమలకు నడుపుతున్న సర్వీసులను ముందుస్తు ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీపీటీవో జగదీష్, డిప్యూటీ చీప్ మెకానిక్ ఇంజనీర్ బాలాజీ, డిప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, అసిస్టెంట్ ఇంజినీర్ మహేంద్ర పాల్గొన్నారు. -
తిరుపతి జిల్లాకు ఆదర్శం కావాలి
● వెబ్ ల్యాండ్, మ్యుటేషన్లు త్వరితగతిన పరిష్కరించండి ● రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి తిరుపతి అర్బన్ : తిరుపతి నగరం జిల్లాకు ఆదర్శం కావాలని రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి వెల్లడించారు. శుక్రవారం ఆమె తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెబ్ల్యాండ్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ సమస్యలతో పాటు రెవెన్యూ పరిధిలోని అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. పుత్తూరు మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల వెబ్ల్యాండ్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇదే తరహాలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. సాంకేతిక అంశాలపై రెవెన్యూ ఉద్యోగులు ముందుగా పట్టుసాధించాలని సూచించారు. తిరుపతి జిల్లా కేంద్రమైన అర్బన్లో రెవెన్యూ సమస్యలు లేకుండా చూడాల్సి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఆదర్శంగా ఉంటే అన్ని మండలాలు అదే బాటలో నడుస్తాయని చెప్పారు. తిరుపతి అర్బన్ తహశీల్దార్ సురేష్బాబు, డిప్యూటీ తహశీల్దార్ కిరణ్, పుత్తూరు మండల తహశీల్దార్ జీసీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్ అశోక్రెడ్డి,పలువురు వీఆర్వోలు ఉన్నారు. -
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై ఆందోళన
● నల్ల జెండాలతో నిరసన ..రోడ్డుపై బైఠాయింపు రామచంద్రాపురం : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం రోడ్డెక్కారు. చెవిరెడ్డి కుటుంబంపై రాజకీయ కక్ష తగదు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రామచంద్రాపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పచ్చికాపల్లం, తిరుపతి రహదారిపై కొంత సేపు బైఠాయించి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా అర్సీపురం మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందారెడ్డి, జడ్పీటీసీ రాణితో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నులిమేస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతూ ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చెవిరెడ్డిని అక్రమ కేసుల నుంచి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతాం చెవిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ నేతలు ముందుకు వచ్చారు. చెవిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. -
ఆర్టీసీ అభివృద్ధికి కృషి
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి డీపీటీవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డీపీటీవోగా పనిచేస్తున్న వెంకట్రావ్ విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో చిత్తూరు డీపీటీవోగా పనిచేస్తున్న జగదీష్ను తిరుపతికి నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లుగా రాబడిలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సుల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 193 మంది హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిసెట్ కౌన్సెలింగ్లో భాగంగా తిరుపతి కేటి.రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం 1,04,001వ ర్యాంకు నుంచి లక్షా 20 వేలు ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ 193 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా చివరి రోజైన శనివారం 1,20,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని కోరారు. కల్కి ట్రస్టు భూమిపూజపై ఫిర్యాదు బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని తలారివెట్టు గ్రామ రెవెన్యూలోని ప్రభుత్వ ఇంటి స్థలాల లే అవుట్లో కల్కి ట్రస్టు దాసాజీలు శుక్రవారం పూజలు చేయడంపై తలారివెట్టు, వేణుగోపాలపురం గ్రామస్తులు తహసీల్దారు శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తలారివెట్టు రెవెన్యూలో ప్రభుత్వం 6 ఎకరాల 50 సెంట్ల భూమి ఇంటి స్థలాలు లేని వారికి ఇవ్వాలని ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ పథకంలో కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వ లే అవుట్లో ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదని, అయితే కల్కి దాసాజీలు లే అవుట్లో ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజలు చేయడం దారుణమని తెలిపారు. లే అవుట్ పక్కన కల్కి ట్రస్టుకు సంబంధించి 200 ఎకరాల భూమి ఉందని, భూమి విలువను పెంచుకోవడానికి దాసాజీలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ లే అవుట్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. తలారివెట్టు, కల్లివెట్టు, వేణుగోపాలపురం, గ్రామాల్లో ఇంటి స్థలాలు లేనివారు 200 మందికి పైగా ఉన్నారని వీరందరికి తలారివెట్టు గ్రామ రెవెన్యూలోని లే అవుట్లో స్థలాలు ఇవ్వాలని కోరారు. దీనిపై తహసీల్దారు శ్రీదేవి మాట్లాడుతూ.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సులువు రీతిలో బోధించాలి బుచ్చినాయుడుకండ్రిగ : విద్యార్థులకు సులువు రీతిలో పాఠాలు బోధించాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ గౌరీశంకర్రావు తెలిపారు. శుక్రవారం బుచ్చినాయుడుకండ్రిగ, నెలవాయి గ్రామాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను పరిశీలించి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు , యూనిఫాం, బ్యాగ్లు అందించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పీఎం శ్రీ పాఠశాలకు సంబంధించిన కెమిస్ట్రీ ల్యాబ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, కిచెన్ గార్డెన్ వేసిన ఫెన్సింగ్ను పరిశీలించారు. బుచ్చినాయుడుకండ్రిగలోని భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎంఈఓలు రవీంద్రనాథ్, మునిసుబ్రమణ్యం, ప్రధానోపాధ్యాయులు రమణయ్య, హరిప్రియ పాల్గొన్నారు. -
మోసగించడం చంద్రబాబు నైజం
ఏడాది కాలంగా వంచనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు, పవన్కళ్యాణ్ మేనిఫెస్టో బాండ్లపై సంతకాలు చేసి మరీ ప్రజలకు ఇచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయక పోగా అనేక ఆంక్షలు విధించి లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. తల్లికి వందనం పేరుతో లక్షల మంది తల్లులకు ఎగనామం పెట్టారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ నిధి లేదు. అబద్దపు హామీలతో ప్రజలను మోసగించడం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపానపోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి వైఎస్సార్సీపీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు చంద్రబాబు, పవన్కళ్యాన్, లోకేష్ పాల్పడుతున్నారు. అయినా తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి వెంట వస్తున్న జన సంద్రాన్ని చూసి కూటమి నాయకుల గుండెల్లో దడ పుడుతోంది. అందుకే జగనన్నను ఎక్కడికక్కడ నిలువరించాలని చూస్తున్నారు. చంద్రబాబు మోసాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి మోసాలను ఎండగడుదాం. అందుకు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నేతలు కంకణబద్ధులు కావాలి. – భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకంటే ఎక్కువే ఇస్తానంటూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పి నమ్మిన వాళ్లను మోసగించడం చంద్రబాబు నైజం. ఎన్నికల్లో ఇచ్చిన శ్రీసూపర్సిక్స్ హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చావా? బాబూ. అధికారలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్నావ్, 50 ఏళ్లకే పెన్షన్ అన్నావ్, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నావ్, మహిళలకు ఉచిత బస్సు అన్నావ్, లక్షల ఉద్యోగాలు అన్నావ్, రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్ శ్రీఇలా చెప్పుకుంటూ పోతే వందల అబద్దపు హామీలు గుప్పి ప్రజలను మోసగించావు. వీటితో పాటు తల్లికి వందనం పేరుతో కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసి లక్షల మంది తల్లులను వంచించావు. ఇలా చెప్పిన అబద్దాన్నే పది సార్లు చెప్పి ప్రజలను మోసగించడం తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి తెలియదన్నారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలంతా గ్రహిస్తున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి నాయకులను నిలదీసేలా చేద్దాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్జగనన్న పాలనలోనే సంక్షేమం కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తాం -
స్టీల్ పరిశ్రమలో గాయపడిన కార్మికుడు మృతి
పెళ్లకూరు : మండలంలోని పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వలస కార్మికుడు జురాల్ యాదవ్(47) గురువారం మృతి చెందినట్లు ఏఎస్ఐ రాఘవయ్య తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు ఈనెల 24న స్టీల్ పరిశ్రమలోని పర్నేజ్ ప్లాంట్ వద్ద ఐరన్ లిక్విడ్ ద్రావణం ఉబికి అక్కడ పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు జురాల్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం చైన్నెకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుడికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాయుడుపేటలో చోరీ – 16 గ్రాముల బంగారు నగలు అపహరణ నాయుడుపేటటౌన్ : పట్టణంలోని రాజగోపాలపురం వీధిలో గురువారం సాయంత్రం ఓ ఇంటిలో చోరీ జరిగింది. బీరువాలో దాచి ఉంచిన 16 గ్రాములు బంగారు నగలు ( 2 సవర్లు) గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. పట్టణంలోని రాజగోపాలపురం వీధిలో సిద్దలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. సిద్దలయ్య ఆర్టీసీ బస్టాండులోని దుకాణంలో పనిచేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం సిద్దలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సొంతపని మీద బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటి వచ్చేసరికి తలుపుల తాళాలు పగలగొట్టి ఉండడం గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలో ప్రవేశించి బీరువా తాళాలు సైతం పెకలించి, రెండు సవర్లు బంగారు నగలు చోరీకి గురైందని బాధితులు గుర్తించారు. బీరువాలో ఉన్న బంగారు తాళిబొట్లు అక్కడే వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ విషయమై బాధితులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ బాబి, ఎస్ఐ ఆదిలక్ష్మి ఐడీ పార్టీ పోలీసులతో చోరీ జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలన చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మత్తుకు యువత బానిస కావొద్దు
తిరుపతి సిటీ : మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాటిని దరిచేరనిస్తే బంగారు భవిష్యత్తుకు ముగింపు పలికినట్టేనని ఎస్పీడబ్ల్యూ ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ పేర్కొన్నారు. పద్మావతి మహిళా డిగ్రీ , పీజీ కళాశాలలో మాదకద్రవ్య నివారణ, ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్య నివారణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత ఉన్నత లక్ష్యం వైపు పయనించాలే తప్ప, జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్, మత్తుకు బానిస కావొద్దన్నారు. మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమావతి శ్రీడ్రగ్ అబ్యూస్ఙ్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువత తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో వివరించారు. అనంతరం కమిటీ కన్వీనర్ డాక్టర్ వసుధ విద్యార్థినులతో మాదకద్రవ్యాల జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ లక్ష్మి సంధ్య, డాక్టర్ వరప్రసూన, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భద్రమణి, ఐఐసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమారాణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు -
బడికి రాకుండా నిరసన
చిల్లకూరు : బడుల విలీనానికి నిరసనగా విద్యార్థులు తరగతులను బహిష్కరించిన సంఘటన గూడూరు రూరల్ ప్రాంతంలోని నెర్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. నెర్నూరులో చదువుతున్న 6,7,8 తరగతులకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులను తిరువెంగళాయపల్లి పాఠశాలకు వెళ్లాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెర్నూరుకు 3 కి.మీ దూరంలో ఉన్న గొల్లపల్లి, పుట్టంరాజుకండ్రిగ గ్రామాలల్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3,4,5 తరగతుల పిల్లలను నెర్నూరుకు వెళ్లాలని అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభించి 15 రోజులు అవుతున్నా విద్యార్థులు బడికి వెళ్లకుండా బహిష్కరించారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను బడికి పంపేది లేదని చెబుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేయాల్సిన విద్యా సామగ్రి గదుల్లో బెంచీల మీదనే ఉంచేశారు. పిల్లలు బడికి రాకపోవడంతో టీచర్లు ప్రతి రోజు బడికి వెళ్లి హాజరు వేసుకుని వస్తున్నారు. దీనిపై పాఠశాల హెచ్ఎం వరలక్ష్మిని వివరణ కోరగా దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపలేమని ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను పంపుతామని తల్లిదండ్రుల చెబుతున్నారని అన్నారు. -
గ్రీవెన్స్కు నోడల్ అధికారులు
● పీజీఆర్ఎస్లో పలు మార్పులకు శ్రీకారం ● రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి సమీక్ష తిరుపతి అర్బన్:పీజీఆర్ఎస్ (ప్రజా సమస్య ల పరిష్కార వేదిక)కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని...అయితే ఆ స్థాయిలో అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికారులు చూడాలని అందుకు మండల స్థాయిలో నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి వెల్లడించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె గురువారం కలెక్టర్ వెంకటేశ్వర్తో కలసి మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ప్రతి సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ గ్రీవెన్స్ నిర్వహించాలని, శని వారం కోర్టు కేసులు పరిష్కారం పనిచేయాలని, మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో మార్పులు చేయనున్నామని రెండు రోజుల్లో స్పష్టంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. మండల స్థాయిలో సోమవారం మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ నిర్వహించాలని.. మధ్యాహ్నం తర్వాత తహసీల్దా ర్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బందితో కూర్చుని ఆ రోజు వచ్చిన అర్జీలు పై వారంలోపు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి సోమవా రం జరిగే సమావేశానికి సంబంధించిన మిని ట్స్ రికార్డ్ చేసుకుని ఉంచుకోవాలని, వాటి వివరాలను ఆర్డీఓకు పంపాలన్నారు. మ్యుటేషన్లకు సంబంధించిన ప్రక్రియ, కుల ధ్రువీకరణ జారీ అంశాల్లో తప్పిదాలకు తావివ్వరాదన్నారు. వెబ్ ల్యాండ్ సంబంధించి ఏ ఎంట్రీ అయినా తహసీల్దార్ పరిశీలించాలన్నారు. ఆగస్టు 15 లోపు పట్టాలు ఇచ్చేలా జిల్లాలోని 34 మండలాల్లో కనీసం 10 నుంచి 16 మండలాల్లో కొన్ని గ్రామాల్లోనైనా ఈ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. పోలీస్శాఖ వారికి 70 శాతం భూ సమస్యలతో వచ్చే వివాదాలతోనే సరిపోతుందని...దాంతో శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాం దీర్ఘకాలంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం జిల్లాలో లేదని తెలిపారు. శాంతి భద్రత సమ స్యలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్ఓ నరసింహులు, తిరుపతి,శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు బి రామమోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాలకు చెందిన సెక్షన్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు,జిల్లాలోని తహసీల్దారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ టాపర్లకు కలెక్టర్ అభినందన
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇటీవల ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు భానుచరణ్రెడ్డి, మణిదీప్రెడ్డి, హిమేష్ రాఘవ, శశాంక్రెడ్డి, యశ్విత, నిఖిల్, నీట్ టాపర్లు జ్ఞానీష, మౌనిక, కీర్తి, విశ్వక్ అగర్వాల్ను కలెక్టర్ అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆ విద్యాసంస్థ డీజీఎం కొండలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయ్య సర్కిల్: అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలు బుధవారం రాత్రి రేణిగుంట – మామండూరు మార్గంలోని ఆంజనేయపురం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అటవీ క్షేత్రాధికారి బి.సుదర్శనరెడ్డి తెలిపారు. పట్రోలింగ్ చేస్తుండగా అతి వేగంగా వస్తున్న కారును ఆపామని తెలిపారు. డ్రైవర్ వేగంగా దూసుకెళ్లాడని, దాన్ని వెంబడించడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడన్నారు. కారులో 294 కిలోల బరువు కలిగిన దుంగలను గుర్తించామన్నారు. వాటి విలువ సుమారు రూ.6.5 లక్షలుగా అంచనా వేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఎస్వో చైతన్య, కరకంబాడి ఎఫ్బివో వెంకటేశ్వరరావు, ప్రొటెక్షన్ వాచర్లు సిసింద్రి, వెంకటేష్, ప్రసాద్, నవీన్, రవి పాల్గొన్నారు. నేడు ఆర్ఏఆర్ఎస్లో జాతీయ సదస్సు తిరుపతి సిటీ : స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ‘వ్యవసాయంలో సవాళ్లు, వాతావరణ అనుకూలత నూతన ఆవిష్కరణలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సదస్సుకు దేశంలోని పలు వర్సిటీల నుంచి అధికారులు, ప్రధాన శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. -
కమీషన్లకు కక్కుర్తిపడి
ఉపాధి నిధులతో అవసరం లేని చోట సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టి ఉపాధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి నిధులపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చేస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రైతులకు తెలియకుండానే వారి పొలాల చుట్టు సరిహద్దు కందకాలు (బౌండరీ స్ట్రెంచ్) తవ్వినట్టు బిల్లులు మంజూరు చేసి డబ్బులు దోచేస్తున్నారని పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. టి.కుమ్మరపల్లి వద్ద చెరువును ఆక్రమించి అందులోనే గోకులం షెడ్డు నిర్మాణం చేసిన ఓ టీడీపీ నేత -
పదవులతో పార్టీని బలోపేతం చేయండి
నగరి: పార్టీ ఇచ్చిన పదవులను బాధ్యతగా భావించి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమితులైన చిరంజీవి పార్టీ నేతలతో మాజీమంత్రి నివాసానికి విచ్చేసి ఆమెను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా వారితో మాట్లాడుతూ పార్టీ గుర్తించి ఇచ్చిన పదవులను ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అండగా నిలబడి వారి తరఫున పోరాడాలన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండ కడుతూ పేదవారికి న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తల్లికి కూటమి పరీక్ష
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ ముహూర్తాన ఈ పథకం అమలు చేసిందో కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లుల్లు సమస్యలతో అల్లాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా మంది అర్హులకు ఈ పథకంలో కోత విధించారు. గతంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంలో అనర్హులుగా గుర్తించారు. అలాగే విద్యుత్ బిల్లులు, కారు, ఐటీ వంటివి వర్తించనప్పటికీ చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సచివాలయాల వద్ద అనర్హుల జాబితాలో ఉన్న తల్లులు అర్జీలను చేతపట్టుకుని క్యూ కట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం తల్లులకు పరీక్ష పెట్టినట్టుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తల్లికి వందనం పథకంలో అనర్హులైన తల్లుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం. పాలసముద్రం సచివాలయంలో తల్లికి వందనం అర్జీలు ఇస్తున్న తల్లిదండ్రులుచిత్తూరు కలెక్టరేట్ : తల్లికి వందనం పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెనన్స్ స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించడంతో వాటి ఆధారంగా తగు పత్రాలను జతచేసి గ్రీవెన్స్కు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జత చేయాల్సిన పత్రాల కోసం రెండు జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తల్లులు చక్కర్లు కొడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏటా పకడ్బందీగా అమలు చేశారు. తల్లులకు ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి, నేరుగా ఖాతాల్లో నగదు జమ చేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసిన మొదటి సారే గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్లకు ఇబ్బందులు చిత్తూరు జిల్లాలో మొత్తం 1,30,382 మందిని, తిరుపతి జిల్లాలో 2,10,407అర్హులుగా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 98748 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు. రెండు జిల్లాల్లో అధిక శాతం మందికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. ఇంకా సగం మందికిపైగా సవరణ/ ఫిర్యాదు దరఖాస్తులు సమర్పించాల్సి ఉందని తెలుస్తోంది. వేలల్లో అనర్హులుంటే కేవలం 12,589 అర్జీలు రావడమే అందుకు ఉదాహ రణ. సచివాలయ సిబ్బందికి తల్లికి వందనం గ్రీవెన్స్పై అవగాహన లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పరిశీలనలో అలసత్వం వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు ‘తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయాలంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా వేల సంఖ్యలో అర్జీలు పోటెత్తుతున్నాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ వేలాది మంది తల్లులు సచివాలయాలకు క్యూకడుతున్నారు. ఎప్పుడో కారు విక్రయించినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు.. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్న్కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,589 మంది తల్లులు అర్జీలు దాఖలు చేశారు. వీరిలో అర్హులుంటే వచ్చేనెల 5వ తేదీన తిరిగి ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. ఈ నేపథ్యంలో అధికారులు మళ్లీ ఈ అర్జీలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న తల్లులకు క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆయా శాఖల అధికారులు పరిశీలనలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కారు సంబంధిత అర్జీ సమస్యను ఆయా జిల్లా రవాణా శాఖకు నేరుగా సచివాలయాలు పంపి ఆరా తీస్తున్నాయి. అయితే ఆ అర్జీల పరిష్కారంలో ముందడుగు పడడం లేదు. ఆదాయ పన్ను అర్జీలను తహసీల్దార్లకు లాగినన్లో పంపుతున్నారు. ఆ అర్జీలను తహసీల్దార్లు అస్సలు పట్టించుకోవడం లేదు. కొంత మంది తహసీల్దార్లు పరిష్కరించి ఆర్డీఓ లాగిన్లకు పంపుతున్నారు. పనిఒత్తిడిలో ఉన్న ఆర్డీఓలు వాటిని పట్టించుకోని దుస్థితి ఉంది. విద్యుత్ బిల్లులకు సంబంధించిన అర్జీలను ఆ శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరికి పథకం వర్తించదని నిర్ధారించి, సచివాలయాల దశలోనే రెండోసారి అనర్హత కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రెండు జిల్లాల్లో ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించని దుస్థితి నెలకుంది. రెండు జిల్లాల్లో 12,589 అర్జీలు చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని సచివాలయాల పరిధిలో 1,327 సచివాలయాల పరిధిలో 12,589 అర్జీలు పోటెత్తాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోని 612 సచివాలయాల పరిధిలో 5,897 వరకు అర్జీలు వచ్చాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేయడం విశేషం. ఒక్క చిత్తూరు జిల్లా ట్రాన్స్కో పరిధిలో సీడింగ్ సమస్య అర్జీలు 1,789 వరకు ఉండగా, తిరుపతి జిల్లాలో 1,815 వరకు ఉన్నాయి. తమ కారు విక్రయించినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదాయం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనేక మంది అర్జీలు దాఖలు చేశారు. -
● సత్యవేడులో చెలరేగిపోతున్న అక్రమార్కులు ● రోజూ వందల లారీలు సరిహద్దు దాటుతున్న వైనం ● చోద్యం చూస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ● టీడీపీ నేతల కనుసన్నల్లో గ్రావెల్ మట్టి వ్యాపారం ● తెలుగుగంగ కాలువను కొల్లగొడుతున్న పచ్చనేతలు
వరదయ్యపాళెం : కూటమి ప్రభుత్వంలో మట్టి మాఫియా అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు కేంద్రంగా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో మాఫియా జోరుగా సాగుతోంది. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి మొదలైన గ్రావెల్ అక్రమ రవాణా మూడు నెలలుగా ఊపందుకుంది. ప్రధానంగా సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాళెం మండలాల కేంద్రంగా గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. రోజువారీగా వందల టిప్పర్లు తమిళనాడు సరిహద్దు దాటిస్తూ సత్యవేడు ప్రాంత సంపదను దోచుకుంటున్నారు. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్, మైన్స్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఆగడాలు ఏకంగా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని రాజులకండ్రిగ వద్ద పెద్ద ఎత్తున మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు. రోజువారీ వందల లారీలు రాజులకండ్రిగ నుంచి తమిళనాడుకు మట్టి తరలిస్తుండడంతో ఈ పరిణామాలను సాక్షాత్తు ఆ మండల టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ జెండాలు పట్టుకుని మరి రాజులకండ్రిగ వద్ద జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా వద్ద తాజాగా 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం గమనార్హం. కూటమి ప్రభుత్వ ఆగడాలకు సొంత టీడీపీ పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయంటే మట్టి మాఫియా ఆగడాలు ఏమాత్రం ఉన్నాయో ఊహించవచ్చు. తమిళనాడులో భలే గిరాకీ సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రమట్టికి తమిళనాడులో మంచి గిరాకీ ఉంది. 70 టన్నులు బరువుతో వెళ్లే టిప్పర్ లారీ రూ.40 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఎక్కడ లేని గిరాకీ ఆంధ్రా మట్టికి నెలకొనడంతో టీడీపీ కీలక నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం తెలుగు గంగ కాలువ గట్లను బహిరంగంగా గ్రావెల్ మాఫియా కొల్లగొడుతున్నప్పటికీ కాలువ పర్యవేక్షణ చేసే అధికారులు పత్తా లేకుండా పోయారు. అధికార టీడీపీ మాయలో పడిన వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారుల అలసత్వానికి భవిష్యత్తులో కాలువల నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.అనుమతి పేరుతో దోపిడీ తమిళనాడులో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆంధ్రా మట్టిని తరలించేందుకు టీడీపీ నేతలు అక్రమ అనుమతులు పొందుతున్నారు. తమిళనాడులోని పొన్నేరి, ఎన్నూరు పోర్టు, ఇతర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు ఆంధ్రా మట్టిని తరలించేందుకు జిల్లాలోని మైన్స్ అధికారులు, కూటమి నేతల ఒత్తిళ్లకు లోనై గుడ్డిగా అనుమతులు ఇస్తుండడం స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఇచ్చేది గోరంతైతే తవ్వకాలు జరిపి తరలించేది కొండంత. దీంతో అక్రమ రవాణాకు అధికారులే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అధికార టీడీపీ నేతలు కుమ్మకై ్క దోచేస్తున్నారు. నన్నాపేదెవడ్రా? శ్రీకాళహస్తి: మండలంలోని చుక్కలనిడిగల్లు గ్రామంలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. స్థానిక టీడీపీ నాయకుడి కనుసన్నల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇతరులు ఎవరైనా ఇసుక, మట్టి ఎత్తితే పోలీసులకు చెప్పించి వారిని పట్టించేయడం రివాజుగా మారుతోంది. ఓ ప్రైవేటు వెంచర్ కోసం చుక్కలనిడిగల్లు చెరువులోని మట్టిని జేసీబీలతో తవ్వి నిరంతరాయంగా తరలిస్తున్నా అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రోజుకు వంద నుంచి 150 ట్రిప్పుల మట్టి తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే తమకు అధికారులు, పెద్ద నాయకుల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. -
యువత సన్మార్గంలో నడవాలి
తిరుపతి అర్బన్ : యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ర్యాలీగా ఎంఆర్పల్లి సర్కిల్ వరకు వెళ్లారు. ఎంఆర్పల్లి సర్కిల్లో మానవహారం చేపట్టారు. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొందరు యువకులు డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ప్రతి పౌరుడు ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు...జీవితమే ముద్దు అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లిదండ్రులు మంచి మార్గంలో ముందుకు సాగడంతోనే భవిష్యత్తు బాగుంటుందని గుర్తుచేశారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ మునిక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంఏ తెలుగు, డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం)లో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారం, అర్హత, కోర్సులు, ఫీజు వంటి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని, స్పాట్ అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0877–2284524, 8121787415ను సంప్రదించాలని సూచించారు. రేపు జాబ్మేళా తిరుపతి అర్బన్ : తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ఉంటుందని చెప్పారు. పలు బహుళజాతి కంపెనీలకు చెందిన వారు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హాజరు కానున్నారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చదువుకున్న యువత అర్హులుగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు ముందుగా తమ పేర్లును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 85559 72657, 99888 53335 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీతిరుమల : టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సదా లక్ష్మీ, అన్న ప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పట్టించుకునేవారే లేరు
తిరుపతి అర్బన్ : జిల్లాలో అంగన్వాడీ పాఠశాలలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. ప్రీ స్కూళ్ల పేరుతో పిల్లలకు మెరుగైన విద్యాబోధనను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే నాణ్యమైన పోషకాహార సరుకులను చిన్నారులతోపాటు బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసింది. దీంతో అంగన్వాడీ బడుల్లో విద్యార్థుల సంఖ్యల గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగవాడీ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పాలకులు పట్టించుకోకపోవడంతోపాటు అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో పూర్తిగా గాడి తప్పింది. విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోగా, నాసిరకం సరుకులను బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్నారు. సివిల్ సప్లయి విభాగం నుంచి పురుగు పట్టిన సరుకులు వస్తున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నించేందుకు ధైర్యం చేయలేని దుస్థితి దాపురించింది. చేసేది లేక వచ్చిన నాణ్యత లేని పోషకాహారాన్నే పంపిణీ చేసి చేతులు దులుపుకోవాల్సి వస్తోంది. ఈ మేరకే రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి బీసీ బాలుర వసతిగృహంలో నాసిరకం సరుకులతో చేసిన అల్పాహారం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేంద్ర పథకం.. విఫలం కేంద్రప్రభుత్వం పోషణ్ వాటిక పథకం కింద ఒక్కో అంగన్వాడీ స్కూల్కు రూ.10 వేలను ఇటీవల మంజూరు చేసింది. ఆ నిధులతో అంగన్వాడీ పాఠశాల ప్రాంగణంలోనే ప్రకృతి సేద్యం ద్వారా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేసి వాటిని వండి పిల్లలకు వడ్డించాల్సి ఉంది. ఈ క్రమంలోనే జిల్లాలోని తొలి విడతలో 475 స్కూళ్లకు రూ.47.50లక్షలు విడుదల చేశారు. అయితే పట్టించుకునేవారు లేక ఈ పథకం పూర్తిగా విఫలమైంది. అధికారుల అలసత్వంతోనే పిల్లలకు చేకూరాల్సిన ప్రయోజనం దూరమైంది. అరకొరగా విదిలిస్తూ.. అంగన్వాడీ పాఠశాలల్లో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న కందిపప్పుకు కూటమి ప్రభుత్వం కోతలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల పాటు కందిపప్పును పూర్తిగా అందించలేదు. దీంతో పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారం ప్రశ్నార్థకంగా మారింది.ఆ తర్వాత సరఫరా చేసిన పప్పు దినుసుల్లో నాణ్యత కరువైంది. పురుగులు పట్టిన పప్పులు ఇవ్వడంతో అంగన్వాడీ సిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే ఎండలో పెట్టి.. ఆరబెట్టి.. తర్వాత వండి పిల్లలకు వడ్డించేయండి అంటూ చేతులు దులిపేసుకున్నట్లు తెలిసింది. ఈ విధమైన నాసిరకం సరుకులను తిని పిల్లలు, బాలింతలు, గర్భిణులు రోగాల బారిన పడుతున్నట్లు పెద్దసంఖ్యలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజీ పడకూడదు అంగన్వాడీ స్కూళ్లలో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ల విషయంలో రాజీ పడకూడదు. న్యాయంగా వారికి అందాల్సిన సరుకులు ఇవ్వాలి. నాణ్యతలేని కోడిగుడ్లు, నాసిరకం కందిపప్పు అందించడం దారుణం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులు సైతం నిరంతరం పర్యవేక్షించాలి. నాణ్యత లేని సరుకులు వస్తే వాటిని తిప్పి పంపాలి. – నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి నాణ్యత ఉండడం లేదు అంగన్వాడీ పరిధిలో నిబందనల మేరకు సరుకుల్లో నాణ్యత ఉండడం లేదు. కోడిగుడ్ల టెండర్ సమయంలో ఓ సైజ్ చెబుతున్నారు.. పంపిణీ చేసే సైజ్ చాలా చిన్నగా ఉంటోంది. కందిపప్పుతోపాటు ఇతర సరుకులు కూడా నాసికరంగా ఉంటునానయి. ఇలాంటివి తింటే చిన్నపిల్లలకు మంచిది కాదు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. – జయచంద్ర, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కక్కుర్తి తగదు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసే సరుకుల విషయంలో కక్కుర్తి తగదు. పురుగు పట్టిన సరుకులు పంపిణీ చేయడం అన్యాయం. భవిష్యత్ సమాజానికి కూడా ఇది మంచిది కాదు. నాణ్యత లేని సరుకులను ఆహారంలో తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. – వేణు, సీపీఎం నగర కార్యదర్శి అలసత్వం వహిస్తే చర్యలు అంగన్వాడీ పాఠశాల పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు క్షేత్రస్థాయిలో నాణ్యమైన సరుకులను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేస్తాం. కందిపప్పుతోపాటు కోడిగుడ్లు, ఇతర సరుకుల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడంతోపాటు ప్రత్యేక నిఘా పెడతాం. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. సివిల్ సప్లయి అధికారులతోనూ మాట్లాడతాం. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేస్తాం. – వసంతబాయి, ఐసీడీఎస్ పీడీ, తిరుపతి గత వైఎస్సార్సీపీ హయాంలో పకడ్బందీగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని పకడ్బందీగా పంపిణీ చేసేవారు. గర్భిణులు, బాలింతలకు 15 రోజులకు ఒకసారి పోషకాహార కిట్లు అందించేవారు. అందులో నెలకు సరిపడా బియ్యం, కందిపప్పు కేజీ, ఆయిల్ అర కేజీ, రాగిపిండి 2 కేజీలు, అటుకులు కేజీ, ఖర్జూరం పావు కేజీ, చిక్కీలు పావుకేజీ, బెల్లం పావుకేజీ, పాలు 5 లీటర్లు, 25 గుడ్లు చొప్పున ఇచ్చేవారు. ఆ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం బాల సంజీవనిగా పేరు మార్చింది. అయితే తూతూమంత్రంగా సరుకులు అందించి సరిపెట్టేస్తోంది. గాడితప్పిన అంగన్వాడీ కేంద్రాలు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న ప్రభుత్వం పూర్తిగా దెబ్బతిన్న దినుసుల పంపిణీ కొరవడిన అధికారుల పర్యవేక్షణ రోగాల బారిన పడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా సరుకులు అంగన్వాడీ కేంద్రాలకు అందడం లేదు. ప్రధానంగా సివిల్ సప్లయి నుంచి ఏం సరుకులు వస్తున్నాయి..? వాటి నాణ్యత ఎలా ఉంది..? నాసిరకం సరుకును పంపిణీ చేస్తే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వాటిల్లే అనర్థాలేంటి..? అనే అంశాలను పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పిన పనులు చేస్తే చాలనుకునే దుస్థితిలో పడిపోయారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలపై ఎవరూ దృష్టి పెట్టడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయాలకే అధికారులు పరిమితమవుతున్నారని, జిల్లా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలోనే నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సాధారణంగా బియ్యం, కందిపప్పు, వంట నూనె, పాలు, కోడిగుడ్లు, బాలామృతం సరఫరా చేయాల్సి ఉంది. అయితే అవన్నీ వస్తున్నాయా..? అందులో నాణ్యత పరిస్థితి ఏంటనే విషయాలను అధికారులు విస్మరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. కుళ్లిన కోడిగుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న కోడిగుడ్లలో నాణ్యత కరువైంది. కాంట్రాక్టర్లు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ప్రతి నెలా 25 గుడ్లు చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు 26లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఈ స్థాయిలో కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యతలేని, ప్రమాణాల స్థాయి లేని గుడ్లు సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించే ధైర్యం లేక అంగన్వాడీ వర్కర్లు సర్దుకుపోతున్నారు. తమ కేంద్రానికి వచ్చిన వాటినే పంపిణీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏర్పేడు మండలం చెన్నంపల్లె అంగన్వాడీ సెంటర్లో కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. -
30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు
చంద్రగిరి:శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేపడతారు. అనంతరం 7 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం ఉంటాయి. జూలై 2వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 7 గంటలకు స్వామి వారి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. చివరిరోజు జూలై 3వ తేదీ ఉదయం పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. వైభవోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
నిరంకుశ పాలనపై నిరసన
కూటమి ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ పాలనపై వైఎస్సార్సీపీ పాకాల నేతలు బుధవారం నిరసన తెలిపారు.జిల్లా సమాచారం అంగన్వాడీ స్కూళ్లు 2,491 గర్భిణులు 12,788 బాలింతలు 11,007 6నెలలు లోపు చిన్నారులు 9627 6నెలల నుంచి 3 ఏళ్ల లోపువారు 65,433 3ఏళ్ల నుంచి 6ఏళ్లలోపు పిల్లలు 47,814– 8లో -
తిరుపతిలో ‘చెప్కో’ బృందం పర్యటన
తిరుపతి తుడా : తిరుపతి నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ (చెప్కో) అడ్వైజరీ కమిటీ బుధవారం నగరంలో పర్యటించింది. కమిటీ సభ్యులు చౌరాసియా, అమిత్ కమిషనర్ మౌర్యతో కలిసి రేణిగుంట రోడ్డులో భూమి కుంగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. అలాగే తూకివాకం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నగరం నుంచి మురుగునీరు వస్తున్న విధానం, శుద్ధి చేయడం, పరీక్షలు చేసిన అనంతరం నీటిని తిరిగి వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని కొంత భాగం ల్యాంకో ఫాక్టరీకి, కొంత నీటిని చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడి పలు విషయాలు ఆరా తీశారు. మురుగునీటి శుద్ధి విధానం బాగుందని ఈ విధానాన్ని డాక్యుమెంట్గా రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్యామ్సుందర్, ఎంఈ గోమతి, డీఈ రమణ, ఏఈ శిల్ప, మస్తాన్ పాల్గొన్నారు. త్రిబుల్ ఐటీకి గురుకుల విద్యార్ధులు సత్యవేడు: జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీకి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన నారాయణవనం తంబూరు గ్రామానికి చెందిన ఉదయ్కుమార్, వరదయ్యపాళానికి చెందిన జస్వంత్, శ్రీకాళహస్తికి చెందిన బెన్హర్బాబు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ట్యాలీపై అవగాహన అవసరం తిరుపతి సిటీ: నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులు ఉపాధి అవకాశాల కోసం ట్యాలీ సాఫ్ట్వేర్పై అవగాహన పెంచుకోవాలని హిపోక్లౌడ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ప్యాకల్టీ రాంబాబు తెలిపారు. మహిళా వర్సిటీ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ట్యాలీ ప్రైమ్ విత్ జీఎస్టీపై వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత్లో అన్ని రంగాల్లోనూ అకౌంటింగ్ పర్పస్ కోసం ట్యాలీ ప్యాకేజ్ను విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. కంప్యూటరైజ్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్వెంటరీ మాస్టర్ను సృష్టించడం, పన్నుల నిర్ధారణ వంటి వాటిలో ట్యాలీ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నాను. ఈ వర్క్షాపులో ప్రొఫెసర్ బి విజయలక్ష్మీ, ఎంబీఏ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పీజీ సెట్లో 88.60 శాతం ఉత్తీర్ణత
తిరుపతి సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా 17 వర్సిటీల్లోని 143 పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 9 నుంచి నాలుగు రోజులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఎస్వీయూలో వీసీ, పీజీ సెట్ చైర్మన్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు సబ్జెక్టుల వారీగా ఫలితాలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ పరీక్షలకు 21,995 మంది హాజరుకాగా 19,488 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. 88.60 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఎస్వీయూ రీజియన్లో 5,764 మంది పరీక్ష రాయగా 5,019 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,422 మంది పరీక్షలకు హాజరుకాగా 1,279 మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. జాగ్రఫీ, జనరల్ టెస్ట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దివ్వేష్రెడ్డి, ఎం.ప్రేమ్కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు వివరించారు. సీట్లు 25 వేలు, ఉత్తీర్ణులైన అభ్యర్థులు 19 వేలు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలో 25 వేలకు పైగా పీజీ సీట్లు ఉన్నాయి. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు 19,488 మంది. ఒక సీటుకు ఒక అభ్యర్థి కూడా పోటీ లేకపోవడం విశేషం. తద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనంటూ మేధావు లు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు విడుదల ఎస్వీయూ రీజియన్లో 87.07 శాతం ఉత్తీర్ణత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 89.94 శాతం జాగ్రఫీ, జనరల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ పీజీ సెట్–2025 ఫలితాల వివరాలు కోర్సులు సెట్కు హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారు కెమికల్ సైన్స్ 5,396 4,719 లైఫ్ సైన్స్ 3,641 3,408 కంప్యూటర్ కోర్సులకు 1,858 1,547 కామర్స్ 1,203 1,009 ఇంగ్లీష్ 721 702 హ్యుమానిటీస్ 736 726 జువాలజీ 1,347 1,177 గణితం 983 821 ఫిజిక్స్ 808 652 బోటనీ 1,146 1,041 ఇతరాలు 4,156 3,686 మొత్తం 21,995 19,488 -
కార్పొరేషన్ నిధులతో ‘స్మార్ట్ సిటీ’
తిరుపతి అర్బన్: తిరుపతి స్మార్ట్ సిటీ పనులకు కార్పొరేషన్ నిధులు వినియోగించుకోవాలని స్మార్ట్ సిటీ చైర్మన్, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కింద పురోగతిలోని 14 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్, సోలార్ ప్రాజెక్టు సత్వరం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్మార్ట్ సిటీ సీఈఓ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ రమ పాల్గొన్నారు. పెండింగ్ అర్జీలపై సమీక్ష కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్పై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. పెండిగ్ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. -
నిరంకుశ పాలనపై నిరసన
● చెవిరెడ్డి అరెస్ట్ అన్యాయం ● రెడ్బుక్ రాజ్యాంగానికి త్వరలోనే కాలం చెల్లుతుంది ● ప్రభుత్వ దారుణాలకు ప్రజలే బుద్ధి చెబుతారు ● వైఎస్సార్సీపీ పాకాల నేతలు పాకాల : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయమని వైఎస్సార్సీపీ పాకాల నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి త్వరలోనే కాలం చెల్లుతుందన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న దారుణాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెవిరెడ్డి ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, సాధ్యమైనంతవరకు అందరికీ మంచే చేశారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి ద్వారా లబ్ధిపొందని కుటుంబమే లేదని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నంగా నరేష్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హరిప్రసాద్రెడ్డి, కపిలేశ్వర్రెడ్డి, రైతు సంఘం నేత భాస్కర్నాయుడు, ఎంపీపీ లోకనాథం, మునీర్, రహీమ్, గుండ్లూరి సురేష్, వినాయక, రమేష్, చంటి, లోకనాథరెడ్డి, బాను, ఇమ్రాన్, గోపి, సద్దాం పాల్గొన్నారు. -
ఎప్పటికీ చెవిరెడ్డి వెంటే..
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి రెడ్బుక్ పేరుతో కక్షసాధింపులకు పాల్పడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా చెవిరెడ్డి ఎవరూ ఏం చేయలేరు. నిత్యం దైవ చింతనలో ఉండే చెవిరెడ్డి తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. – ఎస్.మునీర్, ఏఎంసీ మాజీ చైర్మన్, పాకాల ఎదుర్కోలేకే.. చెవిరెడ్డి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే అధికారం అడ్డు పెట్టుకుని అక్రమంగా అరెస్టు చేయించారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. – గుంగ్లూరి సురేష్, మండల యువజన విభాగం అధ్యక్షుడు, పాకాల దేవుడు చూస్తున్నాడు కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలను దేవుడు చూస్తున్నాడు. అన్యాయంగా చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పాపం ఊరికే పోదు. ప్రజా కంటకులను త్వరలోనే తరిమికొట్టే రోజులు వస్తాయి. కర్మ ఫలితం అనుభవించేందుకు కూటమి నేతలు సిద్ధంగా ఉండాలి. – పి.హసీనా, ఎంపీటీసీ మాజీ సభ్యులు, పాకాల ● -
సర్పంచ్ సుభాషిణికి కన్నీటి వీడ్కోలు
తిరుపతి రూరల్ : మండలలోని చెర్లోపల్లె పంచాయతీని అద్భుతంగా తీర్చిదిద్ది ఉత్తమ సర్పంచ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి శక్తి పంచాయత్ నేత్రి అభియాన్ పురస్కారం పొందిన బొల్లినేని సుభాషిణికి బుధవారం పలు పార్టీల నేతలు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. వివరాలు.. తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మహిళా సర్పంచ్ల శిక్షణలో చురుగ్గా పాల్గొన్న సుభాషిని మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే సృహ తప్పి కిందపడిపోయారు. కుటుంబీకులు వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు ఆమె సహకరించకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సర్పంచ్ సుభాషిణి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె భర్త బొల్లినేని శుభగిరి నాయుడు కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు రాత్రంతా అక్కడే చికిత్స చేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న శుభగిరికి కుటుంబీకులు ధైర్యం చెప్పారు. సుభాషిణి మృత దేహానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, వైస్ ఎంపీపీలు యశోద, మాధవరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు చెర్లోపల్లె శ్మశాన వాటికలో సుభాషిణి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎంబీయూలో ముగిసిన ఎన్సీసీ శిక్షణ
చంద్రగిరి : మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)లో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 550 మంది విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. బుధవారం దాసరి ఆడిటోరియంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ అంజు దమియా, కల్నల్ సంజయ్ సింగ్, ట్రైనింగ్ అధికారి కల్నల్ సందీప్ మాట్లాడుతూ క్రమశిక్షణ, ఐక్యత, ఏకాగ్రతపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఫైరింగ్, డ్రిల్ నైపుణ్యాలతోపాటు సాంస్కృతిక, క్రీడా పోటీలను చేపట్టినట్లు వివరించారు. విద్యార్థి దశ నుంచి దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంబీయూ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆపదలో ఉన్నవారి రక్షణకు చేపటాల్సిన చర్యలపై విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. కర్ణాటక మద్యం పట్టవేత తిరుపతి క్రైమ్ : తిరుపతిలో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఈస్ట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చంద్రగిరి మండలం ఐతేపల్లెకు చెందిన బెల్లంకొండ షేక్ హస్మత్ ఉల్లా బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఉండగా అనుమానంతో ఈస్ట్ పోలీసులు తనిఖీ చేశారు. నిందితుడి వద్ద కర్ణాటకకు చెందిన 10 టెట్రా మద్యం ప్యాకెట్లు ఉన్నాయి. బహిరంగంగా విక్రయించేందుకు మద్యం ప్యాకెట్లు తన వద్ద ఉంచుకున్నట్టు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్జీ హేమాద్రి తెలిపారు. కామాంధుడికి దేహశుద్ధి సత్యవేడు: మండలంలోని చెన్నేరి గ్రామంలో ఓ బాలిక (11)పై అదే గ్రామానికి చెందిన ఆర్.నాగరాజు(38) బుధవారం సాయంత్రం లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేడయడంతో స్థానికులు గుర్తించి కామాంధుడికి దేహశుద్ధి చేశారు. తల్లిదండ్రులు ఊత్తుకోటకు వెళ్లడంతో సమయం చూసి నిందితుడు ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక తల్లిదండ్రులు సత్యవేడు పోలీసులను ఆశ్రయించగా డీఎస్పీ రవికుమార్ సూచనల మేరకు సీఐ మురళీ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేశారు. అయితే నిందితుడికి మతిస్థిమితం లేదని, ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విద్యార్థుల అరెస్టు తిరుపతి క్రైమ్: ఇతరుల పేరుతో పరీక్షలు రాయడానికి తిరుపతికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అరెస్టు చేసింది. నగరంలోని సాయినగర్ సమీపంలోని ఓ హోటల్లో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించింది. వారు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని, వేరే వారి పేరుతో ఆన్లైన్ పోటీ పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులు, సెల్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేస్తోంది. -
నవోదయ ఫలితాల్లో ‘విశ్వం’ ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటించిన రెండో విడత ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యార్థులు ప్రతిభ చాటారు. బి.సాత్విక, ఎన్.ఝాన్సీరెడ్డి అర్హత సాధించినట్లు విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు మొత్తం 57మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులనుఅకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు. 2026 నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. పకడ్బందీగా ‘టీబీ ముక్త్ భారత్’తిరుపతి తుడా: జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభి యాన్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజ తెలిపారు. న్నమయ్య జిల్లా నుంచి తిరుపతి ఆడిషనల్ డీఎంహెచ్ఓగా ఆమె బదీలపై వచ్చారు. బుధవారం ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ జిల్లాలో టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ నివారణకు కృషి చేస్తానని చెప్పారు. అన్ని ఇండికేటర్లలో నిర్దేశించిన లక్ష్యాలను అందరి సహకారంతో 100 శాతం సాధించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్షయ బాధితులను వేగంగా గుర్తించడం, మరణాలను తగ్గించడం వంటి అంశాలే అజెండాగా పనిచేయనున్నట్లు వివరించారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగ,మద్యం తాగేవారు, టీబీ నుంచి ఉపశమనం పొందిన వారు, హెచ్ఐ వీ పాజిటీవ్, బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్న వారు, గర్భిణులు, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారని వెల్లడించారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వారికి ఆరు నెలల చికిత్స ఉచితంగా అందిస్తామన్నారు. ఆ సమయంలో పౌష్టికాహారం తీసుకోవ డంకోసం రోగి ఖాతాలో రూ.1000లు జమ చేస్తా మని తెలిపారు. కార్యక్రమంలో క్షయ నివారణ ఉద్యోగులు లోకేష్, మురళి,మొహిద్దీన్, దేవరాజు లు, సుకన్య , సౌజన్య , మహేశ్వ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు శ్రీకారం
● రాష్ట్ర సాంకేతిక విద్య డైరెక్టర్ గణేష్కుమార్తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రస్తుత పారిశ్రామిక రంగానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్కుమార్ వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై బుధవారం తిరుపతిలోని ఓ హోటల్లోరాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్బీటీఈటీ) ప్రాంతీయ వర్క్షాపు నిర్వహించింది. ముఖ్య అతిథిగా గణేష్కుమార్ ఆన్లైన్లో హాజరై మాట్లాడారు. డిప్లొమో కోర్సుల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వీరిని చేరికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అయితే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కరికులంలో మార్పులు అవసరమని గుర్తించామని, వర్క్షాపులో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లతో చర్చించి కరికులం మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. సాంకేతిక విద్య ఆర్జేడి ఎ.నిర్మల్కుమార్ ప్రియ మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికతకు కాలానుగుణంగా నైపుణ్యాల పెంపు, అలాగే ఆన్లైన్ మూల్యాంకనాన్ని ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్య కార్యదర్శి జీవి.రామచంద్ర, సంయుక్త కార్యదర్శి జీవి.సత్యనారాయణమూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, నాస్కామ్ ప్రతినిధి డాక్టర్ చింతల సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
‘కెనాల్’ కట్టలపై చెట్ల నరికివేత
వాకాడు : మండలంలోని పంబలి లాకుల వద్ద బకింగ్హామ్ కెనాల్ కరకట్టలపై చెట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నరికేస్తున్నారు. కట్టెలను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కెనాల్ వద్ద విధులు నిర్వర్తించే లస్కర్ సైతం అక్రమార్కులతో కుమ్మకై ్క విలువైన వృక్ష సంపదను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కట్టెల తరలింపునకు అనువుగా వాహనాలు రాకపోకలు సాగించేందుకు కెనాల్ కరకట్టలను ధ్వంసం చేసి రహదారిని సైతం నిర్మించడం గమనార్హం. బకింగ్హామ్ కెనాల్ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేందుకు యత్నిస్తున్న అక్రమార్కులపై కొందరు స్థానికులు మండిపడుతున్నారు. వారికి సహకరిస్తున్న లస్కర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాకు పంబలి వాసులు అడ్డుపడకుండా లస్కర్ మధ్యవర్తిత్వం నడిపి గ్రామానికి కొంత నగదు సైతం ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారు. కరకట్టలపై చెట్లను ఆధునిక యంత్రాల సాయంతో నరికి లారీల ద్వారా చైన్నె, గుమ్మిడిపూండి తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బకింగ్హామ్ కెనాల్ను పరిరక్షించాల్సిన అవసరముంది. -
‘ఉపాధి’ అక్రమాలపై వేటు
● ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ ● రూ.3,51,585 రికవరీకి ఆదేశాలు రేణిగుంట : గత సంవత్సర కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి జరిపిన సామాజిక తనిఖీల్లో ఉపాధి అక్రమాలు బయటపడ్డాయి. డ్వామా పీడీ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసి, రూ.3,51,585 రికవరీకి ఆదేశాలు ఇచ్చారు. రేణిగుంట మండలంలోని 19 పంచాయతీల్లో గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుత సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు జరిగిన ఉపాధిహామీ పనులపై 15 రోజులుగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ రావు అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. పంచాయతీ వారిగా తనిఖీ బృందం నివేదికలను సభ దృష్టికి తీసుకొని వచ్చారు. సామాజిక తనిఖీ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.1,37,500 రికవరీ, రూ. 2,14,085 జరిమానా విధించారు. అక్రమాలకు పాల్పడిన టెక్నికల్ అసిస్టెంట్, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ టి ఎమ్ లోకేశ్వర్ రెడ్డి, ఏపీడి వరప్రసాద్,ఇన్చార్జ్ ఎంపీడీవో ప్రభురావు, గత ఎంపీడీవో విష్ణు చిరంజీవి, అసిస్టెంట్ విజిలెనన్స్ ఆఫీసర్ గణేష్ కుమార్, ఏపీఓ దీప, గత ఏపీవో జ్యోతి శ్రీ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
పిల్లలను చదువుకు దూరం చేయొద్దు
చిట్టమూరు : మండల పరిధిలోని ఈశ్వరవాక పంచాయతీ కోతలగుంట గ్రామస్తులు తమ పిల్లలను చదువుకు దూరం చేయొద్దని మంగళవారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను మోడల్ స్కూల్కు వెళ్లి చదువుకోవాలని చెబుతున్నారని, అక్కడికి 7 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఈ మార్గంలో బస్సు సౌకర్యంగాని, ఆటోలు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి గ్రామంలోని బడి మార్పు చేస్తే తమ పిల్లలు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. -
నవధాన్యాల సాగుతో సారవంతం
తడ : భూమిని సారవంతంగా మార్చేందుకు వివిధ రకాల నవధాన్యాలు సాగు చేసి, పూత దశలో భూమిలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని, తద్వారా భూమిలో సేంద్రియ కర్భన శాతం పెరగడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి స్వామి కొండయ్య రైతులకు సూచించారు. వెండ్లూరుపాడు గ్రామంలో పర్వతరెడ్డి కిషోర్రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయ రైతు తన ఇంటి వద్దే ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్ను కొండయ్య మంగళవారం ప్రారంభించారు. ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ఉండాలని కోరారు. బియ్యం, చిరుధాన్యాలు వంటివి వివిధ రకాల ఉత్పత్తులను వినియోగదారులకు బయో రిసోర్స్ సెంటర్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి బయో రిసోర్స్ యంటీ సత్యనారాయణ, యూనిట్ ఇన్ చార్జులు రమణ, శ్రీనివాసులు, మారెయ్య, నిర్మల, సంజీవయ్య పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!
బారులు తీరిన ట్రాక్టర్లు గుడిపాల సరిహద్దులోని ఓ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడులోని కాట్పాడి కింగ్స్టన్ కాలేజీ వరకు మామిడి కాయల ట్రాక్టర్లు క్యూకట్టాయి. గత మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రతరమవుతోంది. అన్లోడింగ్కు రైతులు రోడ్డుపైనే కాపు కాస్తున్నారు. తిండీలేక తిప్పలు పడుతున్నారు. గుడిపాలలోని కొత్తపల్లి వద్ద ఇదే పరిస్థితి ఎదరవుతోంది. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి వద్ద ఉన్న ఫ్యాక్టరీ వద్ద కూడా మూడు కి.మీ మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఇక్కడ కాయలు అన్లోడింగ్కు ఐదు రోజులకుపైనే పడుతోంది. దీని దెబ్బకు ఆయా ఫ్యాక్టరీల నిర్వాహకులు కాయలు కొనలేమని చేతులెత్తేశారు. చిత్తూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ సైతం మామిడి కొనుగోలు చేయలేమని బోర్డు పెట్టేస్తున్నాయి. పూతలపట్టు, బంగారుపాళ్యం, తవణంపల్లి, కార్వేటినగరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఫ్యాక్టరీలు రైతులను వేధిస్తున్నాయి. జిల్లాలో పళ్ల గుజ్జు పరిశ్రమదారులు సిండికేట్ అయ్యారు. మామిడి రేటును చెప్పకుండా నాన్చుతున్నారు. ఇన్నాళ్లూ రూ.8 నుంచి రూ.5 వరకు పాటపాడారు. తీరా కూటమి ప్రభుత్వం పరువుపోతోందని నోటిమాటగా అమలవుతున్న మద్దతు ధరకు తాళం వేసేశారు. దీని దెబ్బకు రెండు రోజులుగా మామిడిరేట్లు మూగబోయాయి. రైతులకు ఇస్తున్న బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ధర వివరాలను ప్రస్తావించకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కాణిపాకం/తిరుపతి రూరల్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇందులో 31 ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఇవీ ఈనెల 6 నుంచి తోతాపురి కొనుగోలును ప్రారంభించాయి. ఫ్యాక్టరీలు తోతాపురి కేజీ రూ.8కి కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున కేజీకి రూ.4 చొప్పన రైతులకు ప్రోత్సాహక నిధి ఇస్తామని పాట పాడింది. ఫ్యాక్టరీలు టోకన్లు జారీచేసి కాయలు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈటోకన్ల జారీ గందర గోళంగా మారడంతో ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. మధ్యలో పోలీసులు, అధికారులు కల్పించుకుని రైతులందరికీ టోకెన్లు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. కొనేవారేరీ? టోకన్ల గోల ముదరడంతో అధికారులు కొత్తపల్లవిని అందుకున్నారు. ఇకపై టోకన్లు అవసరం లేదని ప్రకటించారు. కాయలు కోత కోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని బోర్డులు పెట్టేస్తున్నాయి. కాయలు కోసి తెచ్చిన వారిని తిప్పి పంపిచేస్తున్నాయి. లేకుంటే ఐదు రోజుల తర్వాత వరస నంబరు వేసి రైతు ఫలాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. సిఫార్సులుంటే అప్పటికప్పుడే దింపుకుంటున్నాయి. మామిడి విపత్తును అదునుగా తీసుకుని ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యాయి. మామిడి రైతులను దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ధర ఎంత? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది రైతుల వరకు సుమారు 1.5 లక్ష టన్నుల మామిడి కాయలు ఫ్యాక్టరీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో తొలుత వచ్చిన రైతులకు ఫ్యాక్టరీ నిర్వాహకులు తోతాపురి కేజీ ధర రూ.8ని రుచిచూపించారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు కేజీ ధర రూ.6ని తీసుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు రూ.5ని చెప్పి ముఖం చాటేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రైతులకు పెద్ద షాక్ ఇస్తున్నా యి. తోతాపురి ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో చెప్పడం లేదు. గుండె గు‘బిల్లు’ ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఏ ఒక్కరైతుకు కూడా బిల్లులో ఫ్యాక్టరీలు ధరల విషయాన్ని ప్రస్తావించ లేదు. కేవలం కాయలు, ట్రాక్టర్ లోడింగ్తో సహా ఎంత బరువు ఉంది.. ఖాళీ ట్రక్కుతో ఎంత బరువు ఉంది.. అని మాత్రమే బిల్లుల్లో ప్రస్తావిస్తున్నారు. ధర విషయాన్ని ఖాళీగా చూపుతున్నారు. ధరలు చెప్పకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.ధరల బోర్డు పెట్టాలి కదా..? ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. మా కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. విధిలేని పరిస్థితుల్లో కాయలు దింపుకుంటే చాలనుకుంటున్నాము. దీన్ని అదునుగా చేసుకుని ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎంతకు కొంటున్నాయో కూడా చెప్పడం లేదు. బయట మాత్రం కాయలు కొనలేం.. టోకన్లు ఇవ్వలే మని బోర్డులు పెడుతున్నారు. ధరలపై కూడా బోర్డు పెట్టాలి కదా. దీనిపై అధికారులు కూడా నోరు విప్పడం లేదు. –గోవర్థన్, పెనుమూరు మండలం జిల్లాలో మ్యాంగో ఫ్యాక్టరీలు సిండికేట్ ఇన్నాళ్లు తోతాపురి కిలో రూ. 8, రూ.6, రూ.5 అంటూ ప్రచారం ప్రస్తుతం ధరలు చెప్పని వైనం అయోమయంలో రైతులు -
సన్నాహాక రథయాత్ర
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 28న నిర్వహించబోయే పూరి జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లలో భాగంగా మంగళవారం రథయాత్ర ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరుకు ఇస్కాన్ అధ్యక్షుడు సుఖదేవ్ మహారాజ్ పర్యవేక్షణలో షార్ బస్టాండ్ నుంచి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలోని శ్రీనగర్ కాలనీ వరకు రథయాత్రను నిర్వహించారు. ట్రయల్ రన్లో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొని హరేరామ హరేకృష్ణ నామ స్మరణలతో నిర్వహించారు. పశుగణాభివృద్ధిపై అవగాహన కలువాయి(సైదాపురం) : పశుగణాభివృద్ధిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారి శ్రీనివాసులు కోరారు. మండల కేంద్రమైన కలువాయిలోని పశువైద్యశాలలో మంగళవారం పలు పథకాలపై రైతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎల్డీఏ ద్వారా పాడి రైతులకు వివిధ పథకాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్జీఎం ద్వారా మారుమూల ప్రాంతాల్లో 20 వేలకుపైగా దున్నపోతులను పాడి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది గురు జయంతి, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. వేధింపులపై కేసు నమోదు కోట : మండలంలోని చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన రజినీ అనే వివాహిత తన భర్త దిలీప్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నట్లు మంగళవారం ఎస్ఐ పవన్కుమార్కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రౌడీషీటర్ దారుణహత్య
చిల్లకూరు : చిల్లకూరు వడ్డిపాళెంకు చెందిన ప్రవీణ్కుమార్, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు పాత నేరస్థుల మధ్య నెలకొన్న కుటుంబ వివాదాల కారణంగా ప్రవీణ్కుమార్ను గొంతు కోసి హత్య చేసిన ఘటన చిల్లకూరులోని మేదర కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. చిల్లకూరు వడ్డిపాళెంకు చెందిన ప్రవీణ్కుమార్ (25) పాల ఆటో నడుపుతున్నాడు. మద్యానికి బానిసై చిల్లర పనులు చేస్తూ ఇటీవల నాంచారమ్మపేటలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా తేలాడు. రౌడీ షీటర్గా పోలీస్ రికార్డులో నమోదై ఉన్నాడు. వడ్డిపాళెం ప్రాంతానికే చెందిన సుబ్రహ్మణ్యం కూడా గతంలో నేరాలకు పాల్పడి గ్రామం వదలి శ్రీకాళహస్తి సమీపంలో ఉండే పాపానాయుడుపేటలో ఉంటున్నాడు. కొంత కాలం క్రితం సుబ్రహ్మణ్యం మేనమామ కుమార్తెను ప్రవీణ్కుమార్ ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు మరొకరితో వివాహం జరిపించారు. ప్రవీణ్కుమార్ ఆమె వివాహానంతరం కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో సుబ్రహ్మణ్యం పది రోజుల క్రితం వడ్డిపాళెంకు వచ్చి ప్రవీణ్కుమార్తో వివాదానికి దిగాడు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు జ్యోకం చేసుకుని అతనిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం మంగళవారం మరోసారి నేరుగా వడ్డిపాళెంకు చేరుకుని ప్రవీణ్కుమార్తో గొడవకు దిగాడు. సుబ్రహ్మణ్యం మేనమామ అతనిని అక్కడి నుంచి పంపించేశారు. అతను చిల్లకూరులో మద్యం తాగి తిరిగి వస్తున్న క్రమంలో ప్రవీణ్కుమార్ ఎదురు రావడంతో అతడిపై దాడి చేశాడు. ఆపై మేదర కాలనీలోకి తీసుకొచ్చి అక్కడ కత్తితో గొంతు కోశాడు. ప్రవీణ్కుమార్ కొంత దూరం వెళ్లి అక్కడే మృతి చెందాడు. నిందితుడు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. గూడూరు రూరల్ సీఐ కిషోర్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో పాటుగా మృతుడి తల్లి పుష్పమ్మ నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
తుస్సు.. విద్యుత్ బస్సు
అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో తిరుపతిలో కాలుష్య నియంత్రణలో భాగంగా జిల్లాకు మొట్టమొదటిగా 100 విద్యుత్ బస్సులను మంజూరు చేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మరమ్మతుకు గురైతే ఆ సర్వీస్ను పట్టించుకోవడం లేదు. 10 శాతానికి పైగా సర్వీసులు మూలకు పడ్డాయని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడ పడితో అక్కడ ఆగిపోతున్నాయి. మంగళవారం తిరుమల బైపాస్ రోడ్డులోని శ్రీనివాసం సమీపంలో ఓ విద్యుత్ సర్వీస్ నడిరోడ్డుపై ఆగిపోయింది.దీంతో బస్సులోని ప్రయాణికులు దిగి బస్సును తోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. –సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
బైక్ను ఢీకొట్టిన కారు
● యువకుడి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు నారాయనవనం : మండలంలోని జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో కేవీబీపురం మండలానికి చెందిన గుణశేఖర్(21) మృతి చెందగా శశికుమార్(19) తీవ్ర గాయాలతో తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేవీబీపురం పాతపాళ్యంకు చెందిన గుణశేఖర్, శశికుమార్ బైక్పై పుత్తూరు వెళ్లడానికి పాలమంగళం మీదుగా మండలంలోని 716–ఎ జాతీయ రహదారిపై ఐఆర్ కండ్రిగ క్రాస్ను దాటారు. అదే సమయంలో తిరుపతి నుంచి చైన్నెకి వెలుతున్న కారు బైక్ను ఢీకొట్టింది. కారు వేగానికి బైక్ 10 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న గుణశేఖర్కు కాళ్లు, చేయి విరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బైక్ వెనుక కూర్చున్న శశికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాధితులను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న గుణశేఖర్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలైన శశికుమార్కు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి బైక్పై పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
పైపులైన్ పనులపై వివాదం
– కేవలం బిల్లులు చేసుకునేందుకే పనులు ! పాకాల : పైపులైను ఏర్పాటు చేయడంపై మండలంలోని దామలచెరువులో వివాదం చోటు చేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల మేరకు మసీదు వీధి, జనపవీధి, సందు వీధులలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తున్నారు. గతంలో ఉన్న పైపులైన్లో నీరు బాగా వస్తుందని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన పైపులైనులో నీరు సరిగ్గా రాదని చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా పైపులైను ఏర్పాటు చేశారని ఆవేదన చెందారు. పైపులైను ఏర్పాటు చేయడంలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు నీరు రాకుండా చేయడానికి కక్ష సాధింపు చర్యలలో భాగంగానే పైపులైను ఏర్పాటు చేశారని స్థానిక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయంపై ప్రజలకు న్యాయం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎఈ నవీన్ని స్థానిక మహిళలు వేడుకున్నా టీడీపీ నాయకులతో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. టీడీపీ నేతల దౌర్జన్యం దామలచెరువులో పైపులైను సమస్యపై బయట గ్రామాల నుంచి నాయకులను పిలిపించుకుని స్థానిక మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. నేండ్రగుంటకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజ నాయుడు మహిళలపైకి దూసుకొచ్చి దౌర్జన్యానికి దిగాడని ఆరోపించారు. ముస్లిం మహిళలు అని కూడా చూడకుండా వీరంగం సృష్టించాడని స్థానిక మహిళలు తెలిపారు. కేకలు వేస్తూ సుమారు 100 మంది అల్లరి మూకలతో గొడవ చేసి మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని వాపోయారు. బయట నుంచి అల్లరి మూకలు ఎందుకు వచ్చారని స్థానిక మహిళలు, మాజీ ఎంపీటీసీ పి.హసీనా ప్రశ్నించారు. ప్రేక్షకపాత్రలో పోలీసులు దామలచెరువులో నీటి పైపులైను సమస్యపై బయట నుంచి వచ్చిన అల్లరి మూకలు, రౌడీలు, నాయకుల దౌర్జన్యానికి పాల్పడుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా ప్రేక్షకపాత్ర వహించారని స్థానిక మహిళలు ఆరోపించారు. -
అల్పాహారం తిని ప్రాణాపాయం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో మంగళవారం ఉదయం కలుషిత ఆహారం తిని 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే హాస్టల్ వార్డెన్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని బీసీ హాస్టల్ను శ్రీకాళహస్తికి తరలించారు. అయితే నాలుగురోజుల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా రేణిగుంట హాస్టల్ వార్డెన్ వెంకటేవ్వర్లుకు ఈ వసతిగృహం బాధ్యతలు అప్పగించారు. ఆయన మంగళవారం ఉదయం హాస్టల్కు వచ్చి విద్యార్థులతో పాటు అల్పాహారం భుజించారు. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో చికిత్సలందించడంతో పిల్లలు కోలుకున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. వెంటనే చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని, లేకుంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేదని తెలిపారు. దీనిపై విద్యార్థులు మాట్లాడుతూ మూడు రోజుల కిందట చేసిన పిండితో ఈరోజు ఇడ్లీలు తయారు చేశారని ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆందోళన బీసీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పలు విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్ ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. వార్డెన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం మూడు రోజుల క్రితమే ఈ హాస్టల్ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. రెండు రోజులుగా రేణిగుంట హాస్టల్లో అడ్మిషన్లు ఉండడంతో ఇక్కడకి రాలేకపోయానని చెప్పారు. గతంలో వార్డెన్గా పనిచేసిన రామయ్య ఇప్పటికీ పూర్తి చార్జ్ అప్పగించలేదన్నారు. అప్పటికీ పిల్లలు అస్వస్థతకు గురి కాగానే వెంటనే ఆస్పత్రికి తరలించామని వివరించారు. పిల్లలకు పరామర్శ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థులను సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోగిల మునిచందు, జిల్లా విద్యార్థి సంఘం నేత కత్తి రవి తదితరులు పరామర్శించారు. వార్డెన్, వంటవాళ్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు ప్రాణాపాయంలో పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని, రెగ్యులర్ వార్డెన్ పోస్టును తక్షణమే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం 16 మంది విద్యార్థులకు అస్వస్థత -
ఆదేశాలు బేఖాతరు
విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆనన్లైన్ ద్వారా సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్టే. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. స్కూల్ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు/ కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే రెండు జిల్లాల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదంటూ తిరిగి పంపించేస్తున్నారు. ఇదేమిటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరెందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే....తమకు ఆర్టీఈ అడ్మిషన్ల జాబితానే ఇవ్వలేదంటూ పాఠశాలల నిర్వాహకులు సమాధానమిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3978 సీట్లు కేటాయిస్తే అందులో 10 శాతం సీట్లను సైతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలు చేసుకోని దుస్థితి నెలకొంది. వివరాలు గోప్యం? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతున్నా.. వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఈ ద్వారా కల్పించిన వివరాలు విద్యాశాఖ బయట పెట్టలేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.విద్యాశాఖ అధికారులకే స్పష్టత కరువు ఉచితమైనా లాగేస్తున్నారు.. జిల్లాలో మొక్కుబడిగా ఆర్టీఈ అడ్మిషన్లు పర్యవేక్షించే నాథుడే కరువు చిత్తూరు, తిరుపతి జిల్లాలో 3978 సీట్లు కేటాయింపు ఆమోదించిన సీట్లు 10శాతం లోపే చట్టం ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యాలు వైఎస్సార్సీపీ పాలనలో పక్కాగా ఆర్టీఈ అమలు ఆర్టీఈ అడ్మిషన్ల ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులకే స్పష్టత లేని దుస్థితి. ఈ చట్టం ద్వారా ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారనే విషయంపై అధికారులు స్పష్టత లేదు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఆర్టీఈ అడ్మిషన్ల విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్టీఈ ప్రవేశాలు పొందినప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది ఒకటో తరగతిలో జాయిన్ చేసుకున్న చిత్తూరు నగరంలోని ఓ ప్రముఖ కిడ్స్ పాఠశాల.. ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ స్కూల్లో ఒకటి, రెండు తరగతులు నిలిపివేశామని సెలవిచ్చింది. దీంతో ఆన్లైనన్లో కేటాయింపు జరిగిన 18 మంది పిల్లల అడ్మిషన్లు అయోమయంలో పడ్డాయి. రెండు జిల్లాల్లో ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఈ ప్రవేశాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆర్టీఈ అడ్మిషన్లు ఖరారు అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా నిత్యం తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు తప్ప న్యాయం మాత్రం జరగడం లేదు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ఆర్టీఈ ప్రవేశాలను పకడ్బందీగా అమలు చేయాలి. – ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకూ ఆ వెసులుబాటు ఉంటుంది. ఇవాళ ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో చూస్తే ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషనన్ ఫీజులో మాత్రమే ఉచితం కాదుగానీ రాయితీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
విద్యుత్ బస్సుల నిర్వహణపై అవగాహన
తిరుపతి అర్బన్ : విద్యుత్ బస్సుల నిర్వహణపై అన్ని డిపోలకు చెందిన మేనేజర్లకు పూర్తి అవగాహన ఉండాలని ఆర్టీసీ కేంద్ర కార్యాలయ ముఖ్య అధికారి గద్దె నాగేశ్వరరావు తెలిపారు. తిరుపతి డీపీటీవో కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని డీఎంలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వీఎన్ఆర్ విజ్ఙానజ్యోతి ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థకు చెందిన వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం వంద విద్యుత్ బస్సులను అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. కొత్తగా 50 విద్యుత్ బస్సులు జిల్లాకు రానున్నాయని...వాటిని మంగళం డిపో నుంచి నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీపీటీవో వెంకట్రావ్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ, డిప్యూటీ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ, అలిపిరి డీఎం హరిబాబు పాల్గొన్నారు. 26,28,29 తేదీల్లో చైన్నె మెమో రైలు రద్దు నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరు వెళ్లే మెమో రైలు ఈనెల 26, 28, 29 తేదీల్లో రాకపోకలు రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ చిరంజీవి మంగళవారం తెలిపారు. పోన్నేరి తదితర ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా మెమో రైలు రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించినట్లు స్టేషన్ మేనేజర్ వెల్లడించారు. ఈ అసౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులు తెలుసుకోవాలన్నారు. నేడు డిప్లొమో కరికులంపై ప్రాంతీయ వర్క్షాప్ తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై తిరుపతిలోని గోల్డెన్ తులీప్ హోటల్లో బుధవారం ప్రాంతీయ వర్క్షాపు నిర్వహించనున్నట్టు స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ద్వారకనాధరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్షాప్కు సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్కుమార్, ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీవీఎస్.మూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, డెప్యూటీ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మీపతి హాజరవుతారని, ఈ వర్క్షాప్లో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొని పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులకు అవసరమైన సిలబస్ తయారీపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వీయూను సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్ తిరుపతి సిటీ: యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం ఎస్వీ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక రంగాలతో యూకే బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అంకితభావంతో ఉందన్నారు. ఉమ్మడి పరిశోధన, విద్యామార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తన సందర్శన లక్ష్యమని చెప్పారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహాయ సహకారాలకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, లక్ష్మి, శ్రీనివాస్, శశికుమార్, డాక్టర్ వివేక్ తదతరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలకు 30 వరకు గడువు తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడుపు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసిందని, విద్యార్ధుల సౌకర్యార్థం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఆర్గానిక్, సీడ్ టెక్నాలిజీ, అగ్రి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్ధులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులకు అస్వస్థత
ఎంపీ గురుమూర్తి ఆగ్రహం తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 16 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించిన విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న ఎంపీ ఫోన్ ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడిన ఎంపీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్య ధోరణి సహించారానిదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. -
జాబ్మేళా పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ స్టూడెంట్స్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో జూలై 6న ఎంఆర్ఎఫ్ సంస్థ నిర్వహించనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను మంగళవారం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఆవిష్కరించారు. డిప్లొమో, ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీధర్, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఎంఆర్ఎఫ్ ప్రతినిధి వెంకటరామన్ పాల్గొన్నారు. ఏపీపీజీఈసెట్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్–2025 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో 13 పీజీ సబ్జెక్టుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీపీజీసెట్కు ఎస్వీయూ రీజియన్ నుంచి 3,946 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రవేశ పరీక్షకు 3,434మంది హాజరయ్యారు. వీరిలో 3,208 మంది ఉత్తీర్ణత సాధించారు. జీఈఓ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫోమ్యాటిక్స్ విభాగంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టి. సుధాకర్రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన విజయ్వర్మ 5వ ర్యాంకు సాధించాడు. -
మృత్యంజయస్వామికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన చేశారు. అనంతరం స్వామివారిని చందనం, నారికేళం, పసుపు, కుంకుమ, విభూదితో అభిషేకించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేపే పీజీ సెట్ ఫలితాలు తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 9వ నుంచి 12వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాలలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్–2025 ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25,688 మంది విద్యార్థులు పలు కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా 22 వేలమంది పీజీ సెట్కు హాజరయ్యారు. విద్యార్థినికి అభినందన తిరుపతి సిటీ : పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్న్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎ.ప్రవళ్లిక లాసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 279వ ర్యాంకు సాధించింది. సోమవారం ఈ మేరకు విద్యార్థినిని ప్రిన్సిపల్ నారాయణమ్మ అభినందించారు. ప్రవళ్లిక మాట్లాడుతూ గ్రూప్–1 అధికారిగా రాణించడమే లక్ష్యమని తెలిపింది. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి సాయి కుమారి, అధ్యాపకులు భారతి, విజయ కుమారి పాల్గొన్నారు. ఎస్వీయూ ‘సింపోసియా’ ప్రారంభం తిరుపతి సిటీ :ఎస్వీయూ గణాంకశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘‘గణాంకాలు , డేటా సైన్స్లో స్థిరమైన అభివృద్ధి’’ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహించనున్న సింపోసియా సెమినార్ సోమవారం ప్రారంభమైంది. రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఐఐటీ విజిటింగ్ ప్రొఫెసర్ వీవీరావు ముఖ్యఅతిథులుగా హాజరై సెమినార్ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తోందని తెలిపారు. డేటాసైన్స్లో గణాంకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సైన్స్ కళాశాల పిన్సిపల్ ఆచార్య పద్మావతి, గణాంకశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సరోజమ్మ, ఆచార్య వెంకటరమణ రెడ్డి, ఆచార్య జయసుబ్బారెడ్డి, ఆచార్య భారతి, ఆచార్య సుగుణమ్మ, రిటైర్డ్ ఆచార్యులు బాలసిద్ధముని, వెంకటరమణయ్య, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా ఒలింపిక్ రన్ తిరుపతి కల్చరల్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతిలో ఘనంగా ఒలింపిక్ క్రీడా రన్ చేపట్టారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి మహతి ఆడిటోరియం వరకు రన్ సాగింది. ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖాధికారి బాలాజీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలమంచిలి ప్రవీణ్ , ప్రత్యేక ఆహ్వానితుడిగా డీఎస్డీఓ ఎన్.శశిధర్ హాజరై ఒలింపిక్ జ్యోతి వెలిగించి పరుగును ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి సాయికుమార్, ఉపాధ్యక్షుడు విజయ్కుమార్, ఫుట్బాల్ సంఘం నేతలు రెడ్డెప్ప, మునెయ్య, కరాటే సంఘం రత్నాకర్, రెజ్లింగ్ కార్యదర్శి ఉదయ్, జన అకాడమీ కిరణ్, బాడీ బిల్డింగ్ సంఘం ప్రతినిధి బద్రి, డీఎస్సీ కోచ్లు గోపి, వినోద్, ఇందూజ, ఆది, ప్రేమ్నాథ్, సాయి, సుమతి, హరి పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టి
తిరుపతిలో కదంతొక్కిన యువత ● వైఎస్సార్సీపీ యువజన.. విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ● ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం.. కలెక్టరేట్ వద్ద ఆందోళన ● ఉద్యోగాల కల్పన.. నిరుద్యోగ భృతిపై గళమెత్తి నిరసన ● హామీలను తుంగలో తొక్కడంపై మండిపాటు అధికారం కోసం వంచించారు ఎన్నికల సమయంలో ఎలా గైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు అబద్ధపు హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత యువతను వంచించారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని దగా చేశారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇద్దరూ దోషులే. యువత తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుంటే సహించే ప్రసక్తే లేదు. లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టడంలో చూపిన శ్రద్ధలో పావు వంతు యువత భవిష్యత్పై చూపితే లక్షలాది మందికి మేలు చేయవచ్చు. కానీ, చంద్రబాబుకు అధికారమే పరమావధి. ప్రజా సంక్షేమం ఇసుమంత కూడా పట్టదు. – ఉదయ్వంశీ, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడునగరంలో భారీ ర్యాలీ యువత పోరులో భాగంగా తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, నగర అధ్యక్షుడు దినేష్రాయల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అయితే అడుగడుగునా పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారు. యువతను చెదరగొట్టేందుకు లాఠీలను ఝళిపించారు. తిరుచానూరుకు వెళ్లే మార్గంలోని ప్లైఓవర్ కిందే భైక్లు పెట్టేసి నడిచివెళ్లాలంటూ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ యువత కదంతొక్కింది. భారీ సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు చేరుకుని యువతపోరును విజయవంతం చేసింది. తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం నోటికి వచ్చిన అబద్ధపు హామీలు గుప్పించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో ‘యువతపోరు’ పేరుతో కదంతొక్కింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, తిరుపతి నగర అధ్యక్షుడు దినేష్రాయల్, విద్యార్థి విభాగం నేతలు ఓబుల్రెడ్డి, చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువతీయువకులు, విద్యార్థులు తరలివచ్చి యువతపోరులో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ హామీలు అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం వెన్నుపోటు పొడుస్తారా అంటూ మండిపడ్డారు. ఇచ్చిన మాట నెరవేర్చకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద సుమారు రెండు గంటల పాటు శాంతియుతంగా నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్లోకి వెళ్లి డీఆర్ఓ నరసింహులకు వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఓబుల్రెడ్డి, ఇమ్రాన్బాషా, అనిల్రెడ్డి, కార్పొరేటర్ ఆరణి సంధ్య, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు గీతాయాదవ్, గ్రీవెన్స్ సెల్ నగర అధ్యక్షుడు మద్దాలి శేఖర్, నగర బూత్ కమిటీ ఇన్చార్జి సాయికుమారి, మల్లం రవికుమార్రెడ్డి, సురేష్, చెంగల్రెడ్డి మాట్లాడుతూ యువతకు, విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.జీవితాలతో చెలగాటం ఉన్నత విద్యను అభ్యసించి బంగారు భవిత కోసం తపించే విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించకుండా జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. కళాశాలలకు సకాలంలో ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల్లోకి రానివ్వడం లేదు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం యువతను బలిపెడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం. – ఓబుల్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నేత -
లింగ నిర్ధారణపై కొరడా
● సాయి సర్జికల్ ఆస్పత్రి సీజ్ తిరుపతి తుడా : తిరుపతి త్యాగరాజ్ నగర్ పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్లోని శ్రీ సాయి సర్జికల్ మెటర్నిటీ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి ఇమ్యునైజేషన్ అధికారి ఛత్ర ప్రకాష్ రెడ్డి, డెమో అధికారులు బాబు నెహ్రూరెడ్డి, కిరణ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ప్రైవేటు ప్రాక్టీషనర్స్ ద్వారా సాయి సర్జికల్ ఆస్పత్రికి చిత్తూరు, తమిళ నాడు తదితర ప్రాంతాల నుంచి లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులను రెఫర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులు మాట్టాడుతూ స్కాన్ సెంటర్ తనిఖీ చేసేందుకు వచ్చిన తమను ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిరణ్కుమార్ అడ్డుకున్నారని, తలుపులు మూసివేసి మేనేజ్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించని క్లారా అనే ప్రైవేట్ ప్రాక్టీషనర్తో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై క్లారాను ప్రశ్నించగా తనపై ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని, కుటుంబ అవసరాల కోసం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అంగీకరించారని తెలిపారు. దీంతో ఆస్పత్రిని సీజ్ చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. -
ప్రాణదాన ట్రస్టుకు రూ.40 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు రూ.40 లక్షల విరాళం అందజేశారు. ఇందులో రాజస్థాన్కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు రూ.10,59,000లు, బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 లక్షలు, కోనసీమ జిల్లాకు చెందిన దండుమేను శశాంక్ కృష్ణ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. వారు డీడీలను తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది స్వామిని దర్శించుకున్నారు. ారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఈక్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లితే అనుమతించమని స్పష్టం చేసింది. -
● బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు ఎక్కడ ? ● యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం ● మాజీ మంత్రి ఆర్కేరోజా
నగరి : ఉద్యోగాలు కల్పిస్తాం, డీఎస్సీ నిర్వహిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, రూ.10 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి యువతను మోసం చేసిందని, జాబ్ గ్యారెంటీ అనుకున్న వారికి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఽవిమర్శించారు. సోమవారం నగరి నియోజకవర్గం నుంచి తిరుపతి కలెక్టరేట్కు బయలుదేరిన బైక్ ర్యాలీని వడమాటపేట వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రోజా మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో యువత ఆగ్రహావేశాలకు లోనయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది నిరుద్యోగులకు 10 లక్షల స్వయం ఉపాధి రుణాలిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు సీఎం పోస్టు, పవన్కళ్యాణ్కు డిప్యూటీ సీఎం, లోకేష్కు మంత్రి, నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టులు వచ్చాయని ఎద్దేవా చేశారు. బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టారు ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు నేడు ఎక్కడికెళ్లారని ఆర్కే రోజా ప్రశ్నించారు. పవర్ స్టార్ పవర్ వచ్చాక ఫ్లవర్లా మారిపోయారన్నారు. గబ్బర్ సింగ్లాగా డైలాగు లు చెప్పిన ఆయన రబ్బర్లాగా మెలికలు తిరుగుతున్నాడన్నారు. నేడు నిరుద్యోగులు తమకు ఉ ద్యోగం రాలేదు న్యాయం చెయ్యండని అడగడాని కి వెళితే ఆయన సినిమాల్లో బిగాగా ఉన్నాడన్న సమాధానం వస్తోందన్నారు. డిప్యూటీ సీఎం కనబడటం లేదని ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబుకు, పవన్కు, లోకేష్కు స్పెషల్ ఫ్లై ట్లు, స్పెషల్ హెలికాప్టర్లుకు ఉన్న డబ్బు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు. ని రుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, 13 నెల ల భృతి ఇచ్చేంతవరకు వారికి అండగా నిల బడి పోరాడుతామన్నారు. నియోజవర్గ యువత విభా గం నాయకులు, పార్టీ నాయకులు, కమిటీ లు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్
– రూ.5 లక్షల ఆస్తి నష్టం రేణిగుంట : కడప–రేణిగుంట రహదారిలోని కరకంబాడి సమీపంలో రోడ్డు పక్కన ఇరానీ కేఫ్లోకి సోమవారం మధ్యాహ్నం ఇసుక లోడ్తో వెళుతున్న టిప్పర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో కేఫ్లో జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. రాజంపేట నుంచి తిరుపతి పరిసర ప్రాంతానికి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ అదుపుతప్పి కట్ట పుట్టలమ్మ దేవాలయం ఎదురుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇరానీ కేఫ్లోకి దూసుకెళ్లింది. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష
తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మ్యూజియం చీఫ్ ఆఫీసర్ (ఇన్చార్జి) సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అదనపు ఈవో మాట్లాడుతూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని సూచించారు. భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు తదితరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్ బ్యాక్ కియోస్క్ను ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియం తెరిచే సమయం, టికెట్ ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై ఆరా తీశారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మనోహర్, ఎలక్ట్రికల్ డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, మ్యూజియం క్యూరేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఒలింపిక్ డే ర్యాలీ
తిరుపతి సిటీ : ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్రెడ్డి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏటా జూన్ 23న ఒలింపిక్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. విద్యార్థు లు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరావు, పీడీ డాక్టర్ ముస్తాక్ అహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నలుగురు ఎర్రదొంగల అరెస్ట్
చంద్రగిరి : శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ బాలిరెడ్డి సోమవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ బృందం ఆదివారం రాత్రి భాకరాపేట రేంజ్లోని నాగపట్ల అటవీ పరిధిలోని శ్రీవారిమెట్టు నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. దుంగలతో సహా నిందితులను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు దాడి శ్రీకాళహస్తి: ర్యాష్ డ్రైవింగ్ వద్దని కారును మెల్లగా నడపమన్నందుకు తండ్రీకొడుకులపై మెటాలియన్ అలాయ్స్ పరిశ్రమ ప్లాంట్ ఇన్చార్జి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వివరాలు.. ఆదివారం రాత్రి శ్రీకాళహస్తి మండలం వెలంపాడుకు చెందిన శివకుమార్ అనే ఫొటోగ్రాఫర్ వెంకటగిరిలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంలో తండ్రితో కలిసి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ప్లాంట్ ఇన్చార్జి జితేంద్ర అత్యంత వేగంగా కారులో దూసుకెళ్లాడు. దీంతో కింద పడబోయిన శివకుమార్, తండ్రి పరమేశ్వరయ్య అంత వేగంగా ఎందుకు కాస్త నెమ్మదిగా కారు నడపవచ్చుగా అని సూచించారు. దీంతో ఆగ్రహించిన జితేంద్ర దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ శివకుమార్ను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితులే సెక్యూరిటీ పాయింట్ వద్ద అద్దాలు ధ్వంసం చేశారంటూ పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా దళితులపై దాడి చసిన జితేంద్ర అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్,పరమేశ్వరయ్యను సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, గంధం మణి వెంకటేష్ పరామర్శించారు. -
‘కియోస్క్’తో శ్రీవారి లడ్డూలు
తిరుమల : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయానికి టీటీడీ కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నగదు లేకుండా యూపీఐ చెల్లింపుల వెసులుబాటు కల్పించింది. దీంతో భక్తులకు త్వరితగతిన లడ్డూలు కొనుగోలు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ప్రక్రియ ఇలా.. ● లడ్డూ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్లాలి. ● దర్శన టికెట్ ఉన్నవారు, దర్శన టికెట్ లేనివారు. అనే రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి. ● టికెట్ వివరాలను యంత్రం ధ్రువీకరిస్తుంది. టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూలకు అనుమతిస్తుంది. ● దర్శన టికెట్ లేనివారు ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఇందులో ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుంచి విశేష స్పందన లభిస్తోంది. -
బరితెగించిన మట్టి మాఫియా
రామచంద్రాపురం: మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూటమి నేతల అండతో యథేచ్చగా సహజ సంపదను కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి, గ్రావెల్ను తరలిస్తున్నారని, అక్రమంగా మైనింగ్ చేస్తున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు మండిపడ్డారు. వారు సోమవారం రామచంద్రాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు. మండలంలోని కొత్తకండ్రిగ, మిట్టకండ్రిగ, ఎల్వీ పురం, గణేషపురం, రాయలచెరువు, గుండోడు కణం ప్రాంతాల్లో కూటమి నేతలు, మట్టి మాఫియా కలిసి కొండలు, గుట్టలను స్వాహా చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఎం నాయకులు వందవాసి నాగరాజు, జయచంద్ర జిల్లా కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారు మాట్లాడుతూ భారీగా గుంతలను చూసి ఓబుళాపురం మైనింగ్ను తలపించేలా ఇక్కడ మట్టి మాఫియా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో కొండలు, గుట్టలను తొలిచి ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రామచంద్రాపురంలో రెచ్చిపోతున్న అక్రమార్కులు వాల్టాకు తూట్లు పొడుస్తున్న వైనం నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ పట్టించుకోని రెవెన్యూ అధికారులు సీపీఎం నాయకుల క్షేత్ర స్థాయి పరిశీలన రియల్ ఎస్టేట్, వెంచర్లకు తరలింపు కొండలు, గుట్టలను తవ్వి తీస్తున్న మట్టిని ఇటుక బట్టీలు, ప్రైవేటు వెంచర్లకు, విక్రయిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా కనిపించడం లేదా అని మండిపడ్డారు. భారీగా ముడుపులు తీసుకుంటున్నందువల్లే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మాజీ మావోయిస్టు లింగప్రసాద్ మృతి
తిరుపతి కల్చరల్ : రాయలసీమ రాడికల్ విద్యార్థి రాజకీయాలను ప్రభావితం చేసిన మాజీ మావోయిస్టు నేత కొణిదల లింగప్రసాద్(ఎల్పీ)(63) సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన ఆస్పత్రిలో చేరారు. రామచంద్రాపురం మండలం ,రావిళ్ల వారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన లింగప్రసాద్కు భార్య సరోజ(52), కుమారుడు కల్యాణ్ శ్రీనివాస్(28) ఉన్నారు. మావోయిస్టు ఉద్యమం ఊపిరి పోసుకున్న 1980 దశకం తొలి తరం రాడికల్ నాయకులలో ఎల్పీగా ఆయన ప్రజాభిమానం చూరగొన్నారు. అనేక పోలీసు కేసులను ఎదుర్కొని జైలు జీవితం గడిపారు. తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చదువుతూ నాటి పీపుల్స్ వార్ విప్లవ ఉద్యమంలో అడుగు పెట్టారు. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రజలు ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ సైతం చేపట్టారు. కుప్పం ప్రాంతంలో కిషోర్ పేరుతో అటవీభూముల పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 1990లో పార్టీ సైద్ధాంతిక విభేదాలతో ఆయన రహస్య జీవితం నుంచి బయటకి వచ్చి మాజీ మంత్రి పరిటాల రవికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు కన్నుమూసిన లింగప్రసాద్ భౌతిక కాయానికి ఎర్రజెండా కప్పారు. వామపక్ష, మాజీ మవోయిస్టు నేతలు నివాళులు అర్పించారు. ఆనంతరం తిరుపతి మంగళం రోడ్లోని వైకుంఠ ధామంలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మావోయిస్టులు చంద్రశేఖర్రెడ్డి, అమ్మ గుంట శంకర్, సురేష్, తక్కిలిపాటి ప్రభాకర్, మదన్ శేఖర్, శ్రీరాములు, కిషోర్, పాదం శివన్న, కేశవులు, ప్రసూన, మేర్లపాక చంద్ర, విజయ, సాహితీ వేత్త, ఫిలిం డైరెక్టర్ సౌదా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, చిన్నం కాళయ్య, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాపూరు:పెంచలకోన రహదారిలో సోమవారం వేకువజామున గుర్తుతెలియని వాహన ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. రాపూరుకు చెందిన నగిరి వేణు(48) మోటార్సైకిల్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని గోనుపల్లె నుంచి రాపూరుకు బైక్పై వస్తుండగా పెనుబర్తి, ఓబులాయిపల్లె మధ్య ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరచ్రందనం కేసులో ఐదుగురికి జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం చెట్లు నరికి తరలించేందుకు యత్నించిన కేసులో ఐదుగురు నిందితులకు ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.6లక్షల వంతున జరిమానా విధిస్తూ తిరుపతిలోని రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ కోర్టు జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు..వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జి.భాస్కర్ నాయుడు, గువ్వ వెంకటయ్య, , గంగరాజు వెంకట్రామరాజు, షేక్ హఫీజుల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన కుర్ర పాటి సురేందర్ నాయుడు 2020 నవంబర్ 14వ తేదీ రాత్రి ఎర్రకొండ అటవీప్రాంతం నుంచి ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డారు. ఐదుగరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 1న డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ? తిరుపతి సిటీ: రెండు నెలలుగా ఎదురు చూస్తున్న డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జూలై 1న విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తునట్లు సమాచారం. దీంతో జిల్లాలోని సుమారు 35వేల మంది విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్లైంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై సుమారు 3 నెలలు కావస్తున్నా డబుల్ మేజర్ సబ్జెక్ట్ల విధానం పేరుతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. -
పోలీస్స్టేషన్కు బారికేడ్ల వితరణ
శ్రీకాళహస్తి: వన్టౌన్ పోలీస్స్టేషన్కు భారతి సిమెంట్ కంపెనీ వారు సోమవారం 30 బారికేడ్లను వితరణగా అందించారు. భారతి సిమెంటు కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ పి.రాజు, లోకల్ డీలర్ శ్రీబాలాజీ ఎంటర్ప్రైజస్ అధినేత ఎం.నరసింహారెడ్డి చేతులమీదుగా సీఐ గోపీకి బారికేడ్లు అప్పగించారు. రాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా భారతి సిమెంట్ తరఫున ఏటా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముక్కంటి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు అందించినట్లు వివరించారు. సూళ్లూరుపేటలో.. సూళ్లూరుపేట : పట్టణంలో ట్రాపిక్ నియంత్రణకు 6 బారికేడ్లను భారతీ సిమెంట్ కంపెనీ వారు సోమవారం వితరణగా అందించారు. కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జున్రెడ్డి, స్థానిక డీలర్ బద్దెపూడి ధనంజయరెడ్డి చేతులమీదుగా ఎస్ఐ బ్రహ్మనాయుడుకు అప్పగించారు. -
విషమంగా బాలుడి ఆరోగ్యం
చంద్రగిరి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు గిరిసాయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం చంద్రగిరి సమీపంలోని తూర్పుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా పిల్లలు గిరిసాయి, గాయత్రిలు గాయపడ్డారు. గిరిసాయికి తొలుత రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్సకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు హుటాహుటిన స్విమ్స్కు తరలించారు. ఆదివారం నుంచి అత్యవసర విభాగంలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గిరిసాయికి వెంటిలేటర్పై చికిత్సను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులు తెలిపారు. సోమవారం ఈ క్రమంలోనే ప్రమాదంలో మృతి చెందిన గిరిసాయి తల్లిదండ్రులు సిద్ధయ్య, జ్యోతిలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. వారు స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలను పూర్తి చేశారు. -
టీటీడీకి ఏసీ బస్సు విరాళం
తిరుమల:ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ,అశోక్ లేలాండ్ తిరుమల–తిరుపతి దేవస్థానానికి ఒక 41–సీటర్ ఏసీ బస్సును ఆదివారం విరాళంగా అందజేసింది. సుమారు రూ.35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ ఎంఅండ్హెచ్సీవీ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు అందజేశారు. సాధారణంగా ప్రతి ఏటా ఈ కంపెనీ యాజమాన్యం టీటీడీకి ఒక వాహనాన్ని విరాళంగా ఇవ్వడం పరిపాటి. ఈ కార్యక్ర మంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, తిరుమల డిపో డీఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య రేణిగుంట: భర్తతో గొడవపడి మనస్థాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జీపాల్యం హరిజనవాడలో భాస్కర్ తేజోవతి దంపతులు కాపురం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భర్తతో జరిగిన చిన్నపాటి గొడవ వల్ల మనస్థాపానికి గురైన తేజోవతి (37) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. స్థానికులు గమనించి హస్పిటల్కు తరలించగా పరీక్షిచిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. గాజులమండ్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతకు తీరని ద్రోహం
● ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు ● కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహంతిరుపతి మంగళం: అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తామంటూ మాయమాటలు చెప్పి యువతకు మొండిచెయ్యి చూపించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం విద్యార్థులకు అందించలేదని విమర్శించారు. దీంతో కళాశాలల యాజమాన్యాల వేధింపులతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సైతం అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ డం మినహా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలహీనపరచి అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కక్ష సాధింపులపై పెడుతున్న శ్రద్ధలో పావు వంతు కూడా యువత, ప్రజాసంక్షేమంపై చూపడం లేదని మండిపడ్డారు. ఇది ఉద్యమ సమయం కూటమి ప్రభు త్వం చేసిన మోసం, ద్రోహంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యువత పోరుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలిరావాలని కోరారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అందరితో సమన్వయం చేసుకుంటూ తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ల వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని సూచించారు. అనంత రం యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో యువత తరలిరావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. -
● రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో రూ.60 కోట్ల భూమి కబ్జా ● భారీ యంత్రాలతో చదును చేసేందుకు యత్నం ● స్థానికుల ఆగ్రహంతో అడ్డుకున్న రెవెన్యూ యంత్రాంగం ● ఇదే కోవలో ఎర్రమరెడ్డిపాళెం చెరువులో టీడీపీ నేతల ఆక్రమణ ● ట్రెంచ్ తవ్వి అడ్డుపడిన రైతు సంఘం
కనిపించని హెచ్చరిక బోర్డు ప్రభుత్వ భూమి పరిరక్షణకు రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు నెల నుంచి ఈ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రధాన నేతల అండదండలతోనే కబ్జాదారులు చెలరేగిపోతున్నట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రేణిగుంట విమానాశ్రయం రహదారిలో ప్రభుత్వ భూమి భూమిలో జెసిబి లు హల్ చల్రేణిగుంట: మండలంలోని కొత్తపాళెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 99లో ఉన్న 5.33 ఎకరాల ప్రభుత్వ భూమిని తమదే అంటూ కొందరు అధికార పార్టీ నేతలు సుమారు నెల రోజులుగా నానా యాగీ చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని ఆదివారం ఉదయం 9 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో చదును చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకుని తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఇది ప్రభు త్వ భూమి అని మరోసారి ఆక్రమణకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగంలోకి బినామీ కబ్జా యత్నం వికటించే సరికి టీడీపీ నేతలు వెంటనే బినామీని రంగ ప్రవేశం చేయించారు. కొత్తపాళెం దళితవాడుకు చెందిన మరియమ్మతో సదరు 5.33 ఎకరాలకు లీజు పట్టా ఉందని అధికారులకు చెప్పించారు. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించామని, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని హడావుడి చేశారు. అయితే మరియమ్మ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని, రూ.కోట్ల విలువైన భూమిని కాసేందుకు దళితురాలిని ముందుపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఎంతో కొంత ముట్టజెపుతామని ఆశపెట్టి బినామీగా మార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు. మీడియాపై దౌర్జన్యం ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకుని, జేసీబీలు, ట్రాక్టర్లను పంపించే దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. మా భూమిలోకి వచ్చి ఫొటోలు ఎలా తీస్తారంటూ వాగ్వాదానికి దిగారు. ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు కదా అని ప్రశ్నించిన వారిపై దాడికి సైతం యత్నించారు. టీడీపీ నేతల అండతోనే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిగా చెరువుల ఆక్రమణ పెరిగిపోయింది. టీడీపీ నేతల అండతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఎర్రమరెడ్డి పాళెం చెరువులో దేవాలయం, కల్యాణమండపం నిర్మిస్తున్నామంటూ టీడీపీ లక్ష్మీపురం ఇన్చార్జి రమేష్, సీఆర్ఎస్లో పనిచేసే అంకయ్య కబ్జాకు యత్నించారు. స్థానికుల రైతులతో కలిసి ఆక్రమణను అడ్డుకున్నాం. – హేమలత, ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం కబ్జాలపై కఠిన చర్యలు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్తపాళెంలోని 5.33 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఇది కలెక్టర్ సైతం నిర్ధారించారు. ఇందులోకి ఎవరు ప్రవేశించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే చెరువుల ఆక్రమణలను సహించే ప్ర సక్తే లేదు.– చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్, రేణిగుంటదేవాలయం పేరుతో చెరువు స్వాహా తూకివాకం పంచాయతీలోని ఎర్రమరెడ్డిపాళెం చెరువును సైతం స్వాహా చేసేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. ఇప్పటికే చెరువులో కొంత భాగం చదును చేయించేశారు. ఆ స్థలంలో దేవాలయం నిర్మిస్తామని స్థానికులను మభ్య పెట్టేందుకు యత్నించారు. అయితే రైతు సంఘం నేత హేమలత ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు ఈ ఆక్రమణకు అడ్డుపడ్డారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ఐ జయకృష్ణ పర్యవేక్షణలో చెరువులో టీడీపీ నేతలు వేయించిన ఫెన్సింగ్ను తొలగించారు. మరెవరు ఆ స్థలంలోకి ప్రవేశించకుండా ట్రెంచ్ తవ్వించారు. అయితే ఆక్రమణకు గురైన ప్రాంతం తిరుపతి రూరల్ మండలానికి చెందినగా రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఈ మేరకు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించారు. ఈ స్థలంలో రెండు మండలాల సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయిస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు.