breaking news
Tirupati District News
-
రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి
రైల్వేకోడూరు అర్బన్: కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన రైల్వేకోడూరులో ఆకస్మికంగా పర్యటించారు. కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు, రైతులు పండించే పంటలను పరిశీలించారు. అలాగే శెట్టిగుంట ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి రోగులను సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణ పనుల పూర్తి చేసి, రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడుతూ వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పంట సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంఆలలో ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ అమర్నాథ్ పాల్గొన్నారు. ఎస్వీయూలో నూతన కలెక్టర్ బంగ్లా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంబీఏ కళాశాల సమీపంలో కలెక్టర్ బంగ్లా కోసం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భవననిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిర్మాణ పనులను ఇప్పటికే కలెక్టర్ సైతం పరిశీలించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిర్మిస్తున్న భవనం గత ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ మేయర్ బంగ్లా కోసం కేటాయించారు. కానీ నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్ బంగ్లా కోసం భవనాన్ని అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో మళ్లీ మాస్టర్ ప్లాన్ రోడ్డుల వ్యవహరం తెరపైకి రావడం, గత ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదననే ప్రస్తుతం అమలు చేయాలనే దిశగా నగరపాలక సంస్థ అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు వర్సిటీ అధికారులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు. -
ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి
చంద్రగిరి:ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని, సమష్టి వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో నిర్వహించిన కిసాన్ మేళా–సమగ్ర వ్యవసాయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వ్య వసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కిసాన్ మేళా – సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో రైతులు విత్తనం వేయడం నుంచి కోత వరకు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), రైతు సంఘాలు ద్వారా సమష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ఎన్టీ రంగ వర్సిటీ వీసీ శార దాజయలక్ష్మి, శాస్త్రవేత్తలు సి.రమణ, గిరిజారాణి, కే. జాన్, విజయ శంకర్ బాబు, యూనివర్సిటీ హెడ్ ము రళీకృష్ణ, మంజుల, కదిరి మోహన్ పాల్గొన్నారు. -
పాస్పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం
తిరుపతి అర్బన్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 20 నెలలపాటు మౌనంగా ఉన్న చంద్రబాబు సర్కార్ ఎట్టకేలకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎన్ని పాస్ పుస్తకాలు కరెక్టగా ఉంటే అన్నింటిని పంపిణీ చేస్తే సరిపోతుంది. అయితే తప్పులు లేకుండా ఒక గ్రామంలో 70 శాతం పాస్పుస్తకాలు ఉంటే ఆ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఒక్కో మండలం నుంచి ఒక్కో నెలలో(ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు) 70 శాతానికి పైగా తప్పులు లేని ఒక్క గ్రామంలో పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఆర్సీపురం, తొట్టంబేడు, వరదయ్యపాళెం తదితర పెద్ద మండలాల్లో 50 గ్రామాలకు పైగా ఉంటే 50 నెలలు పంపిణీ చేస్తే...రైతుల పరిస్థితులు ఏమిటో అర్థం కావడం లేదు. ముందే సర్వే పూర్తి అయిన గ్రామాల్లోని రైతులు పాస్పుస్తకాలు లేకపోవడంతో పంట రుణాలు తీసుకోవడానికి వీలులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. 70శాతం పైన పాస్పుస్తకాలు తప్పులు లేకుండా ఉంటేనే ఆ గ్రామానికి ఇస్తామనే నిబంధనలు పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎన్ని పాస్ పుస్తకాలు కరెక్ట్గా ఉంటే అన్నింటినీ రైతులకు ఇస్తామనే రూల్స్ను పాటించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉదాహణకు ఒక గ్రామంలో 600 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే..అందులో 150 పాస్పుస్తకాలు తప్పులు లేకుండా ఉన్నా వాటిని పంపిణీ చేయడం లేదు. 70శాతం పైనా అంటే 420 పాస్పుస్తకాలు కరెక్టర్గా ఉంటే ఆ తర్వాత ఇస్తామని చెప్పడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక గ్రామంలో ఎన్ని పాస్పుస్తకాలు కరెక్ట్గా ఉంటే వాటిని ఇవ్వడం...ఆ తర్వాత తప్పులను సవరిస్తున్న దశల వారీగా ఆయా గ్రామాల్లో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
అపూర్వ ఆదరణ
ఆధ్యాత్మిక మహాపాదయాత్రకుతిరుపతి రూరల్: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం పాతికేళ్లుగా వస్తు న్న ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందలాది మంది భక్తుల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. తుమ్మలగుంటలోని కల్యాణ వెంకన్న ఆలయం నుంచి గురువారం ఉద యం 6 గంటలకు బయలుదేరిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, కాలూరు క్రాస్ మీదుగా శ్రీనివాసమంగాపురం వరకు మధ్యా హ్నం 1.30 గంటలకు చేరుకుంది. చెవిరెడ్డి చేపట్టిన ఆధ్యాత్మిక మహాపాదయాత్రలో స్వామివారికి మేల్చా ట్ వస్త్రంతోపాటు, శేషమాలలను పల్లెల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతి పల్లెలో శ్రీవారికి సమర్పించే సారెను గ్రామస్తులతో మోయిస్తూ వారిలో భక్తిత త్వాన్ని పెంచుతూ ముందుకు సాగారు. భక్తుల గోవింద నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, భజన బృందాలు, మహిళల మంగళ హారతుల నడుమ ఆధ్యాత్మిక మహా పాదయాత్ర కనులపండువగా సాగింది. చెవిరెడ్డితోపాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మహాపాదయాత్రకు వచ్చిన భక్తులు అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఆలయాధికారులకు అందజేత తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి చెవిరెడ్డి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను శ్రీనివాసమంగాపురంలోని ఆలయాధికారులు స్వీకరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికిన అధికారులు ఆలయ ముఖమండపంలో పట్టువస్త్రాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు, వేద మంత్రాల నడుమ అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. అనంతరం చెవిరెడ్డి నుంచి స్వీకరించిన పట్టువస్త్రాలను స్వామివారికి వినియోగించే వస్త్రాల దాతల రిజిస్టర్లో వారి పేరును నమోదు చేశారు. -
నిబంధనలకు మట్టి
●కోడూరు నియోజకవర్గంలో మట్టి బంగారమైంది. అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో నిబంధనలకు మట్టిగొట్టి, యథేచ్ఛగా తరలిస్తున్నారు. పచ్చనేతల సిఫార్సులున్నవారు.. అడిగినంత రొక్కం చెల్లించిన వారికి నిబంధనలు అతిక్రమించి అనుమతులిచ్చేస్తున్నారు.. అడిగేవారులేరని వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పుల్లంపేట: మండలంలోని చెరువుల్లో మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి తరలింపునకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సివుంది. రైతులు తమ పొలాల్లో పంటలు పండించేందుకు మట్టి మార్పిడి చర్యలు చేపడుతుంటారు. ఇందుకు చెరువు మట్టి శ్రేష్టమని దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇరిగేషన్ అధికారులు రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పైగా మట్టి తరలింపు కోసం లంచం పుచ్చుకుని అనుమతులు మంజూరు చేసిన అధికారికి రైతులు తీసుకెళుతున్న మట్టిపై నిఘా లేకపోవడంతో మంజూరు చేసిన క్యూబిక్ మీటర్ల కంటే అధికంగా మట్టిని తరలించి, చెరువులను చెరిపేస్తున్నారు. దేవసముద్రం చెరువులో మట్టి తోలకానికి అనుమతులు మంజూరు చేయకూడదని రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులకు నివేదికలు ఇచ్చినా తహసీల్దార్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇరిగేషన్ అధికారులు ఆదాయమే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మండలంలోని దేవసముద్రం చెరువులో గతేడాది ఆగస్టు 4వ తేదీన నిహాన్రెడ్డి, ఈశ్వర్రెడ్డి అనే రైతులు తమ పొలానికి మట్టి తోలుకోవడానికి మండల ఇరిగేషన్ ఏఈకి దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం ఆ శాఖ ఈఈకి నివేదించారు. కాగా సంబంధిత రైతులు కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులు కావడంతో అనుమతులు తిరస్కరించారు. వీరు దరఖాస్తులు చేసుకోవడానికి పదిరోజుల ముందు.. జూలై 19వ తేదీన పుల్లారెడ్డిపల్లెకు చెందిన రైతు రమాదేవికి అనుమతులు మంజూరు చేయడం విశేషం. పొలాలకు మట్టి తరలింపులో సైతం అధికారులు రాజకీయాలు చేయడం విచిత్రంగా ఉంది. దీనికితోడు దేవసముద్రం గ్రామానికి చెందిన సుధీర్రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి అనే రైతులు మట్టి కోసం అనుమతులు కోరగా రూ.50వేలు డిమాండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. రెండు విడతలుగా రూ.5 వేలు చొప్పున ఫోన్పే ద్వారా ఇరిగేషన్ ఏఈ నాగేంద్రకు డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రైతుల ఫిర్యాదు మేరకు చాలాకాలం తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఏఈని వివరణ కోరగా ‘మీరెవరండి.. నేను మీకు సమాధానం చెప్పాలా, మీరేమి నా పైఅధికారులా..’ అని బెదిరింపులకు దిగారు. మీకేమైనా సమాధానం కావాలంటే రాతపూర్వకంగా వినతిపత్రం అందిస్తే మీరు కోరిన సమాచారం ఇస్తానని చెప్పారు. తాను డబ్బులు డిమాండ్ చేయలేదని, చెరువు గండ్లు పడతాయనే ఉద్దేశంతో అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమని.. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమనే ఏకై క కారణంతో మట్టి తోలకానికి ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. జూలై, సెప్టెంబర్ నెలల్లో అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఆగస్టులో అనుమతులు మంజూరు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. – సుధీర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, వైఎస్సార్ సీపీ యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు అడిగినంత డబ్బులివ్వలేదని.. ఇరిగేషన్ ఏఈ నాగేంద్రనాయక్ అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కారణంగా మట్టి తోలకానికి అనుమతులు తిరష్కరించారు. అప్పటికీ నా శక్తి కొలది రెండు సార్లు రూ.5 వేలు చొప్పున ఫోన్పే చేశాను. – వెంకటసుబ్బారెడ్డి, దేవసముద్రం -
నారాయణ కాలేజ్ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులను దారుణంగా కొట్టిన ఘటనపై విద్యార్థి సంఘాలు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువు పేరుతో విద్యార్థులను వేధిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, స్టడీ అవర్స్లో కొట్టారని బాధిత విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు తెలిపారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాల నేతలు ఈ చర్యలను నిరసిస్తూ ధర్నా చేశాయి. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు మన్నం ప్రేమ్కుమార్, ఏఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, రాయలసీమ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్, ఓబీసీ విద్యార్థి సంఘం రాయలసీమ అధ్యక్షుడు ఉత్తరాది విజయ్, విద్యార్థి నాయకులు దినేష్, సునీల్, హరి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బుచ్చినాయుడుకండ్రిగ:మద్యం మత్తు లో ద్విచక్రవాహనంపై వెళుతూ వరత్తూరు కాలువపై ఉన్న వంతెనకు ఓ వైపు దిమ్మెను ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెస్టువరత్తూర వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మూడు నెలల గర్భిణి కావడంతో పుట్టిల్లు అయిన శ్రీకాళహస్తి మండలం కనపర్తి గ్రామంలో ఇద్దరు కుమార్తెలతో కలసి ఉంటుంది. రామ్మూర్తి కూలీ పనులు ముగించుకుని, భార్య వద్దకు వెళ్లడానికి బుధవా రం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి, ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలోని వెస్టువరత్తూరు గ్రామం వద్ద కాలువపై ఉన్న దిమ్మెను ఢీ కొన్నాడు. దీంతో రామ్మూరి తీవ్రగాయాలతో కాలువలోని నీటిలో పడి మునిగి చనిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయ గా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
జర్నలిస్టుపై పార్కింగ్ సిబ్బంది దాడి
చంద్రగిరి: తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన సీనియర్ జర్నలిస్టు, అమ్మవారి భక్తుడు మునిరామిరెడ్డిపై గురువారం పోలీసులు, పంచాయతీ అధికారుల ఎదుటనే దాడి జరిగింది. వివరాల్లోకెళితే.. తిరుచానూరు పార్కింగ్ సిబ్బంది గత కొంత కాలంగా కూటమి నేతల అండతో విచ్చలవిడిగా భక్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాహనాల పార్కింగ్కు అధిక రుసుము వసూలు చేస్తున్న విషయంపై ప్రశ్నించి భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే జర్నలిస్టు మునిరామిరెడ్డి గురువారం అధిక రుసుము వసూలును ప్రశ్నించిన భక్తులపై పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని పార్కింగ్ సిబ్బంది ఆగడాలను చిత్రీకరించాడు. ఈ క్రమంలో ప్రైవేటు పార్కింగ్కు చెందిన సిబ్బందితోపాటు టీడీపీ గుండాలు మునిరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో దాడి జరిగిన వారు చోద్యం చూస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా బాధితుడు మునిరామిరెడ్డి, బీజేపీ మహిళా మోర్చా మండల నాయకురాలు పుష్పారెడ్డితో కలసి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
చంద్రగిరి: కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించి న గరుడ వాహన సేవకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుంచి ఆలయ పేష్కర్ రామకృష్ణ, లక్ష్మీహారాన్ని తిరుపతి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీహారానికి ప్రత్యేక పూజలు చేశారు. అ క్కడి నుంచి ఊరేగింపుగా లక్ష్మీహారం శోభాయాత్ర గు రువారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకుంది. అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కల్యా ణ వేంకటేశ్వర స్వామివారి గరుడసేవ రోజున లక్ష్మీహారాన్ని ఆలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఇందులో భాగంగా గరుడసేవ సందర్భంగా కల్యా ణ వేంకటేశ్వరస్వామి వారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రాత్రి హారాన్ని స్వామివారికి అలంకరించారు. -
నమో..భూతనాథ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భూతవాహనంపై ముక్కంటీశుడు, శుకవాహనం జ్ఞానప్రసూనాంబ ఊరేగారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు సర్వాలంకార శోభితుడై విహరిస్తుండగా మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తన్నప్ప చప్పరాలపై స్వామి అమ్మవార్ల వెంట అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భజన బృందాలు, భక్తులు శంఖం ఊదుతూ వెళుతుండా స్వామిఅమ్మవార్ల పురవిహారం చేశారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్, కొట్టేసాయి, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఇస్తున్నారు వలంటీర్లు చేస్తున్న పనులతోపాటు పదుల సంఖ్య లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల అంశంలో పదే పదే టార్గెట్లు ఇస్తున్నారు. ప్రతి స ర్వేకు ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. అయితే పలు కుటుంబాలకు చెందిన వారు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. దీంతో టార్గెట్ లు పూర్తి చేయలేకపోతు న్నాం. ఈ క్రమంలో నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఆందోళన తప్పడం లేదు. – శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగి, శ్రీకాళహస్తి సర్వేలతో సతమతం ఉదయం 7.30 నుంచే సర్వేలతో ఆందోళన తప్పడం లేదు. రాత్రి 10 గంటల వరకు సర్వేలతోనే సతమ తం అవుతున్నాం. మాకు పండుగలు లేవు.. కుటుంబం లేదు.. ఇదే పనిలో ఉంటున్నాం. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. మండలస్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు సమస్యలపై మొరపెట్టుకున్నాం. అయినా ఒత్తిడిని ఎవరూ తగ్గించడం లేదు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. – వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగి, తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు(ఫైల్) తిరుపతి అర్బన్: బాబు సర్కారులో సచివాలయాలు సర్వే కేంద్రాలుగా మారాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా కార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 691 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5,625 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 2,450 మందికి చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఓ వైపు సచివాలయాల కుదించారు. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు. ఇంకోవైపు పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించారు. గతంలో వలంటీర్లు చేస్తున్న అన్ని పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. పనిభారం తగ్గించాలని 20 నెలలుగా మొత్తకుంటున్నా చంద్రబాబు సర్కార్ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో పని ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారకమునుపే నిరసనలు చేపట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు. మృతి చెందినవారికి శాంతి కలగాలంటూ నేడు, రేపో కొవ్వుత్తుల ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు. చీటికిమాటికి నోటీసులు చిన్న చిన్న విషయాలకు సైతం సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. దీంతో వారందరికీ ఆందోళన తప్పడం లేదు. గత ఏడాది ఆగస్టులో హర్ఘర్ తిరంగా ర్యాలీకి రాలేదంటూ ఏకంగా 281 మందికి మెమోలు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారంతా వలంటీర్ల చేస్తున్న అన్ని పనులు తమ చేత చేయించడం సరికాదంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. న్యాయమైన కోర్కెలను నెరవేర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన తాము ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేయాల్సి రావడంతో పలువురు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదంటున్నారు. పదే పదే సర్వేల టార్గెట్తో మానసికంగా బాధపెడుతున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రయోజనం ఉండకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో తిరునాళ్లు: గాంధర్వ రాత్రి (మాఘ బహుళ ఏకాదశి) వాహన సేవలు ఉదయం 9గంటలకు: హంస–యాళి వాహనసేవ ఉభయదాతలు: కీ.శే. చిట్టాప్రగడ సీతారామంజనేయుడు, గుడివాడ, కృష్ణాజిల్లా రాత్రి 8గంటలకు రావణుడు – మయూర వాహనసేవ ఉభయదాతలు : జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి శ్రీకాళహస్తి సచివాలయ ఉద్యోగుల జిల్లా సమాచారంగత ప్రభుత్వంలో సచివాలయాలు 691 గతంలో ఉద్యోగులు 5,625 మంది కూటమి సర్కారులో సచివాలయాలు 353కి కుదింపు నేడు ఉద్యోగులు 3,650 మిగిలిన 1,975 మందిని వివిధ విభాగాల్లో కేటాయింపు సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితం బాబు సర్కారు సచివాలయాలను సర్వేలాలయాలుగా మార్చేసింది. పండుగలు.. పబ్బాలు.. సెలవులు లేకుండా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు సర్వేలపై సర్వేలు చేయిస్తుండడంతో సచివాలయ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. పనిఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా సచివాలయ ఉద్యోగులు సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితమై కార్యాలయాల్లో కనిపించడం లేదు. -
దోపిడీ నిజం
ఇసుక ఉచితం..ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేస్తున్న హిటాచీనాగలాపురం: మండలంలోని అరుణానదిలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో తెలుగు తమ్ముళ్లు అనధికారిక దోపిడీకి తెగబడుతున్నారు. బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద నుంచి రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అది కుడా కూతవేటు దూరంలోని సరిహద్దు దాటిస్తేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నాగలాపురం మండలానికి తమిళనాడు సరిహద్దు ప్రాంతం అతి తక్కువ దూరంలో ఉండడంతో ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నాయకులు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మండలాన్ని ఎంచుకుని ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తమిళనాడులో ఇసుకకు గిరాకీ ఉండడంతో భారీగా తరలిస్తుస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక తోడుతున్న జేసీబీలుఇసుక తవ్వడంతో ఏర్పడిన గోతులుఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లుతిరుపతి జిల్లాలో ఉచిత ఇసుక వ్యాపారుల దోపిడీకి వారధిగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు లేనప్పటికీ ఇక్కడి పచ్చ నేతలు ఇసుకను కూతవేటు దూరంలోని తమిళనాడుకు తరలించి కాసుల పంట పండిస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఇసుక రీచ్లు మూతపడడం, అక్రమ తరలింపుతో సామాన్యుడికి ఇసుక కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఖజనాకు వచ్చే ఆదాయాన్ని వదులకుని పేదలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని టీడీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. -
జేఈఈ ఫలితాలు 16కు వాయిదా
తిరుపతి సిటీ: ఎన్టీఏ ఆధ్వర్యంలో గత నెల 21 నుంచి 29వ తేదీవరకు జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్–1 ఫలితాలు ఈనెల 16వ తేదీ వెలువడనున్నట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ సెషన్–1 ఫలితాలను గురువారం విడుదల చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేసింది. ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించండి తిరుపతి అర్బన్: ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో క్రమశిక్షణ కమిటీ నిర్వహణ నేపథ్యంలో వైద్యబృందంతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు. అలాగే పీఎంజేవై ద్వారా అర్హత ఉన్నవారితోపాటు హెల్త్కార్డులు లేని వారికి ఉచితంగా వైద్యం అందించాలని తెలిపారు. మరోవైపు రోగులకు నాణ్యమైన భోజన వసతి కల్పించడంతోపాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్రెడ్డి, జిల్లా మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ శాల ట్రస్టుకు గురువారం రూ.10,00,116 విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు కుప్పాల నిలేష్ కుమార్ ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుపతిలోని ఆయన నివాసంలో అందజేశారు. గోసంరక్షణ సేవా కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
తిరుపతి కల్చరల్: దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం తిరుపతిలో కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. సమ్మె సందర్భంగా ఉదయం సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు వేలాది మంది కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నగర వీధుల్లో ఎర్రజెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రకాష్బాబు, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడారు. నేతలు కందారపు మురళి, ఆర్.హరికృష్ణ, కె.రాధాకృష్ణ, కత్తి నరసింహారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు. -
● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్కు రూ.6కోట్ల ఆస్తులు ● సస్పెన్షన్ చేసినా లెక్కలేదు ● కాసులు ఇస్తేనే..దస్త్రం కదిలేది
తిరుపతి అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులకు అడిగింది ఇస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు.. ఇవ్వకపోతే డాక్యుమెంట్స్లో అన్నీ త ప్పులున్నాయంటూ రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తారు. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రయవిక్రయదారులు మళ్లీ రాలేమంటూ వాళ్లు అడిగింది ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటున్న వారు 99 శాతం మంది ఉన్నారు. జిల్లాలోని 16 సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇదే తంతు కొనసాగుతుంది. ఏసీబీ దాడులు చేసినా లెక్కచేయడం లేదు. సస్పెన్షన్ చేసినా భయపడడం లేదు. 20 నెలల వ్యవధిలో జిల్లాలో 10 మందికిపైగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. అయితే దాదాపుగా అంతా మళ్లీ ఉద్యోగాల్లో చేరడం విశేషం. సస్పెన్షన్ అయితే ఏముంది.. ఏసీబీ వాళ్లు పట్టుకుంటే ఏమవుతుంది.. అని పలువురు అంటున్నారు. విజయవాడ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఉద్యోగంలో చేరామని చెబుతున్నారు. అన్ని తెలిసీ చేసేదేమీ లేక జిల్లాస్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు రావాల్సిన వాటా ఇస్తే సర్దుకుపోవడమే నేర్చుకున్నారు. ప్రైవేటు ఏజెన్సీ వాతావరణం కొత్త వాళు్ల్ సబ్రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే ప్రభుత్వ ఆఫీస్లా కాకుండా ఓ ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లిన వాతావరణం కనిపిస్తుంది. ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత కార్యాలయంలా వ్యవహరిస్తున్నారు. ప్రతి అఫీస్లో శాశ్వత ఉద్యోగు లు ఎంత మంది ఉన్నారో.. అందుకు రెట్టింపుగా ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన క్రమంలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆయన ఆదేశాలను అమలు చేయలేదు. జిల్లాలో రేణిగుంట, తిరుపతి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కీలకం. అత్యధికంగా ఈ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ప్రతి కార్యాలయంలో రోజుకు 40 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యాలయాల్లోనే ప్రైవేటు సిబ్బంది ఎక్కువగా పనిచేస్తున్నారు. రూ.50 చలానా రూ.500 మార్కెట్ విలువకు సంబంధించి వాల్యువేషన్ సర్టిఫికెట్కు యాజర్ చలాన రూ.50 కట్టాలి. గంటలో అందించాలి. అయితే మూడు రోజుల తర్వాత రూ.200 తీసుకుని ఇస్తున్నారు. అదే రోజే కావాలంటే రూ.500 లాక్కుంటున్నారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్కు రూ.500 చలానాను ఆన్లైన్లో చెల్లిస్తే అప్రూవల్ చేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కో సర్టిఫికెట్కు రూ.1500 నుంచి రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిమయం సమాజంలో అవినీతి పెచ్చుమీరుతోంది.. ప్రజలకు సేవలందించాల్సిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అవినీతి కాలుష్యం ఆవహించి, జనానికి హాని కరంగా మారింది. ప్రతి ఒక్కరికీ డబ్బులివ్వందే దస్త్రం కదలడం లేదు. అధికారాన్ని అవకాశంగా చేసుకుని ప్రతి పనికీ లంచం డిమాండ్ చేయడం తో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి కి అడ్డాగా మారిపోయాయి. ఏసీబీ దూకుడు పెంచి దాడులు చేసినా, సస్పెన్షన్ గురైనా అక్రమార్కులు భయపడడం లేదు.. ఏది జరిగినా ఇటు వెళ్లి.. అటు వచ్చేస్తున్నారు. ఇదీ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల అవినీతి భాగోతం. రేణిగుంటలో పనిచేస్తూ సస్పెన్షన్లో ఉన్న ఓ అటెండర్ ఇంట్లో ఇటీవల ఏసీబీ చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అటెండర్ ఇంట్లోనే ఆ స్థాయిలో ఆస్తులు కూడగట్టారంటే...ఇక పెద్ద ఆఫీసర్లు లెక్కలు ఎంత ఉంటుందో ఊహకు అందడం లేదు. దొంగ స్టాంపులు సృష్టిస్తున్నారనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ–స్టాంపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాంపుల్లో తేదీ, టైమ్, ఏ పనికి అనే కారణం, పార్టీ పేరు తదితర పూర్తి వివరాలు వస్తాయి. దీంతో మోసాలకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో రూ.10 నుంచి రూ.10 వేల వరకు ఈ–స్టాంపులు తీసుకునే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు పాలనలో రూ.10, రూ.20 స్టాంపులు ఇవ్వడం లేదు. రూ.100 స్టాంపులను రూ.150కి విక్రయిస్తున్నారు. ఈ స్టాంపులను ఆఫీస్లో విక్రయించడానికి అనుమతులు లేవు. కేవలం వెండర్లు మాత్రమే అమ్మాల్సి ఉంది. ఇదే అదునుగా వారు చెప్పేందే వేదంగా మారింది. అలాగే నాన్ జుడీ షియల స్టాంపులను సబ్రిజిస్టార్ ఆఫీస్ల్లో విక్రయిస్తున్నారు. అయితే క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ సందర్భంగా వాటిని తమ వద్దే కొనుగోలు చేయాలనే వంక పెట్టడంతో అక్కడే తీసుకుంటున్నారు. అయితే వారు రూ.100 స్టాంపును రూ.200, రూ.50 స్టాంపులను రూ.100కు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ ఇష్టారాజ్యంగా దోచేసుకుంటున్నారు. డబ్బులివ్వకుంటే డాక్యుమెంట్లు కావాలి తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కు వెళ్లిన వారు డబ్బులివ్వకుంటే అనవసరం డాక్యుమెంట్లు అడుగుతున్నారు. డబ్బులిస్తే అవసరం అయిన డాక్యుమెంట్లు లేకున్న రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ముందే చెప్పేస్తున్నారు. పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో చెక్ స్లిప్, ఫొటోలు, తంబ్, ఐరీష్, డాక్యుమెంట్స్ స్కానింగ్ తదితర కీలకమైన పనులు ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తులే చేసేస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూలపత్రాలు(ఫస్ట్ డాక్యుమెంట్) తప్పనిసరి. ఒక వేళ మూలపత్రాలు లేకుంటే సర్వే రిపో ర్ట్, సైట్ లేదా ఇంటి ఫొటో, క్రమవిక్రయదారుల ఆధార్కార్డు, ఫాన్కార్డు(పాన్కార్డు లేకుంటే ఫామ్ 60, ఫామ్ 61 పూర్తి చేసి ఇవ్వాలి), రూట్ మ్యాప్, ఇంటిపన్ను(ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే) ప్లాట్ అయితే సమీపంలో నివాసం ఉంటున్న వారి డోర్ నంబర్ ఇవ్వాలనే రూల్స్ ఉన్నాయి. డబ్బులు ఇస్తే ఇవేమీ అవసరం లేదు. -
నేడు కిసాన్ మేళా
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ శారద జయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ గురువారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే కిసాన్ మేళాకు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ అనుబంధ సంఘాలు, అధికారులు రానున్నారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు వైద్య కళాశాల ఉద్యోగి తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కే శశిభూషణరావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంప్లాయీస్ బ్యాడ్మింట్ టోర్నమెంట్లో ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఈనెల 15వ తేదీన గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, బోధన బోధనేతర సిబ్బంది, వైధ్యాధికారులు ఆయనను అభినందించారు. వ్యక్తి ఆత్మహత్య బుచ్చినాయుడుకండ్రిగ: మద్యానికి బానిస అయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలవాయిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నెలవాయి గ్రామానికి చెందిన దొడ్డగ రాధయ్య (65) వ్యవసాయం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాధయ్య కొంతకాలంగా మద్యానికి బానికావడంతో కుటుంబం సభ్యులతో తరచు గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మద్యం తాగవద్దని, మందలించడంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగడంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
లారీ ఢీకొని విద్యార్థి మృతి
తడ: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థి సెల్వం అలియాస్ లారెన్స్ (16) మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ కొండపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు పరిధిలోని ఆరంబాకం పాఠశాలలో ప్లస్వన్ చదువుతున్న రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులు కిషోర్, ఆరుస్వామి రోజులానే పాఠశాలకు వెళ్లి సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనం అయ్యారు. వీరితోపాటు రామాపురం ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతి చదివి ఫెయిల్ అయిన సెల్వం ట్యూషన్కి వెళ్లి వీరితోపాటు బైక్పై కూర్చున్నాడు. జాతీయరహదారిపై ఆరంబాకం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ లారీ వేగం వచ్చి ద్విచక్ర వాహనం వెనుక ఢీకొంది. ప్రమాదంలో సెల్వం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లడ్డూకు మేకప్ ఘనత బాబుదే!
కార్వేటినగరం/శ్రీరంగరాజపురం: రాజకీయంగా మాజీ సీఎం జగన్ను ఎదుర్కోలేక తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. శ్రీరంగరాజపురం మండలం, 49 కొత్తపల్లె మిట్ట లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం వైఎ స్సార్సీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీకి హిందువుల ఓట్లను దూరం చేయాలన్న దురాలోచనతో వ్యవహరిస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు లడ్డూ లో ఆవు కొవ్వు కలిసిందని మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సనాతన ముసుగులో లడ్డూ ల్లో చేప నూనె, పంది, ఆవు కొవ్వు కలిసిందని ఒక డ్రామా ఆడడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు. బోలేబాబాకు బాబే అనుమతి కుల రాజకీయీలకు ఆజ్యం పోసిన చంద్రబాబు ఇ ప్పుడు కొత్తగా మత రాజకీయాలకు తెరలేపినట్లు చెప్పారు. బోలే బాబాకు అనుమతిచ్చింది చంద్రబా బే కదా..? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ చేసిన సిట్ వైఎస్సార్సీపీ నేతలకు సంబంధం లేదని తేల్చినా మళ్లీ కుతంత్రాలకు ప్రయ త్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సౌరబ్బోరా, మై హోమ్ అధినేత రామేశ్వర్ ఇద్దరి చేతితో చిలికిన 4,060 కిలోల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి, ఆ నెయ్యితోనే అయోధ్య రామ మందిరానికి లడ్డూలు తయారుచేసి పంపినట్టు తెలిపారు. అయితే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లు పవన్కల్యాణ్ ఆరోపించారని చెప్పారు. సువాసన కోసం.. 28 ఫిబ్రవరి 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పరాక్ ప్రోడక్ట్ నుంచి 87,500 కేజీల నెయ్యిని కేజీ రూ.300 చొప్పున కొనుగోలు చేసేందుకు టీటీడీ తీర్మానం చేసినట్లుఽ ఆధారాలు ఉ న్నాయన్నారు. అయితే లడ్డూ నాణ్యత లోపించడంతో సువాసన కోసం లడ్డూకు మేకప్ వేసినట్లు ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మా జీ సీఎం వైఎస్ జగన్ను ఎలాగైనా హిందువులకు దూరం చేయాలన్న కుతంత్రంతోనే దేవాలయాల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాల యాలను రాజకీయ వేదికగా మార్చుకుని అపచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నేతలు పాల్గొన్నారు. మా -
భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో?
పుల్లంపేట: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరినప్పటి నుంచి మండలంలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మండలంలో ప్రధానంగా కొమ్మనవారిపల్లె, డొండ్లోపల్లె, తిప్పా యపల్లె, అనంతసముద్రం రెవెన్యూ గ్రామాల్లో కూటమి నాయకులు అత్యధికంగా భూఆక్రమణలకు తెరలేపారు. ఇప్పటి వరకూ రికార్డుల ప్రకారం మండలంలో దాదాపు 2 వేల ఎకరాలకు పైగా కబ్జారాయుళ్ల చెరలో ప్రభుత్వ భూములు ఉన్నా యని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖాళీ జాగాలనే కాకుండా గ్రామంలో లేని వ్యక్తుల భూములు సైతం ఆక్రమించేస్తున్నారు. యువనాయకులు కొందరు అత్యుత్సాహంగా ఆక్రమణలకు పాల్పడితే దొండ్లోపల్లెకు చెందిన ఓ సీనియర్ నాయకుడు సరికొత పద్ధతిలో కబ్జాకు నాంది పలికాడు. దొండ్లోపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్ 223లో వంక, కుంటను ఆనుకుని ఉన్న భూమిని తనదిగా పేర్కొంటూ నిరక్ష్యరాస్యులైన దళితులను నమ్మించి అమ్మకానికి పెట్టి అందినకాడికి దండుకున్నాడు. ఆ భూములకు సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోగా తనదేనని నమ్మపలికి అమ్మేశాడు. అంతటితో ఆగక భూమి పక్కనే ఉన్న కుంటను, కాలువ పొరంబోకును సైతం జేసీబీలతో చదును చేయించి, అమ్మివేశాడు. అనంతరం కొనుగోలు చేసిన నిరుపేద దళిత రైతులు మంగళవారం సాయంత్రం సంబంధిత భూమిలోకి వెళ్లి భూమిని చదును చేసి హద్దుల కోసం బండలను నాటే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హెచ్చరికలు జారీ చేసి, ఇది ప్రభుత్వభూమి ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవని సంబంధిత భూముల నుంచి వైదొలగాలని ఆదేశించారు. కానీ తెల్లారేసరికి కబ్జారాయుడు కబ్జాస్థలంలో దాదాపు రెండువందల స్తంభాలను నాటించి భద్రపరచాడు. ఉదయం రెవెన్యూ అధికారులు కూలీలను తీసుకెళ్లి తొలగించే ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో జేసీబీలను ఆశ్రయించాల్సివచ్చింది. అప్పటికే పక్క గ్రామం కొమ్మనవారిపల్లెకు చెందిన మరో కబ్జారాయుడు కూటమి చోటా నాయకుడితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జేసీబీలను ఆక్రమిత స్థలంలోకి వెళ్లనీయకుండా సర్దుబాటు చేసుకున్నారు. బుధవారం ఆక్రమితభూమిలోకి వెళ్లి పరిశీలించగా రెవెన్యూ అధికారులు నివ్వెరపోవడం వారివంతైంది. రాత్రికి రాత్రి రెండు వందల స్తంభాలను నాటడంపై ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఏఓలతో కలిసి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో జేసీబీ యజమానులకు ఫోన్లు చేసి ఘటనాస్థలికి రమ్మని కోరగా ఎవరూ అందుబాటులో లేకపోవడం స్థానికులు సైతం స్థానిక కూటమి నాయకులకు బెదిరి, రెవెన్యూ అధికారులకు సహకరించలేకపోయారు. దీంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ రాజశేఖర్, వీఆర్ఓ రాఘవ, సర్వేయర్ శ్రీలేఖలు గురువారం జేసీబీలతో వచ్చి హద్దురాళ్లను తొలగించి, సూచికబోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఆదర్శ సౌమ్యం!
పుత్తూరు: సంప్రదాయల పేరుతో మహిళలకు పరిమితులు విధిస్తున్న సమాజంలో ఈ సంఘటన నూతన సందేశాన్ని ఇస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే కాదు పుత్రిక సైతం ఆ బాధ్యతను నెరవేర్చగలదు అంటూ ఓ కుమార్తె తన తండ్రికి అంతిమ సంస్కరణలు నిర్వహించిన ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ఘటన బుధవారం వడమాలపేటలో చోటుచేసుకొంది. వడమాలపేటకు చెందిన ఎస్.మునిశేఖర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య సంధ్యాలక్ష్మి, సౌమ్య, హిమజ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం మునిశేఖర్ మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరివి పెట్టాల్సింది కుమారుడు. అయితే కుమారుడు లేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో పెద్ద కుమార్తె సౌమ్య తన తండ్రికి తలకొరివి పెడతానంటూ ముందుకొచ్చింది. అంతిమ యాత్రలో అన్నీ తానై వ్యవహరిస్తూ తండ్రిని అశ్రునయనాలతో సాగనంపింది. సౌమ్య సాహసోపేత నిర్ణయానం బంధు మిత్రులకు సైతం కంటతడి పెట్టించింది. నేటి మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వంలో మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలను సైతం ముందుండి నడిపించగలరని సౌమ్య నిరూపించింది. -
ఎవరినైనా కొడితో నాకు కిక్కొస్తుంది!
చంద్రగిరి: ‘మత్తులో ఉన్నప్పుడు నాకు ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవరు కనిపించినా వారిని కొడతా..అలా కొడితే నాకు మంచి కిక్కు వస్తుంది. మత్తులో దాడులు, దౌర్జన్యాలు చేస్తాను’ ఇది పోలీసులకు పట్టుపడిన రౌడీ షీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ పోలీసులకు చెప్పిన మాటలు. అతను మాటలు విన్న పోలీసులు సైతం ఇదెక్కడి పిచ్చిరా..బాబూ? అని నోరెళ్లబెట్టడం వారి వంతైంది. గత నెల 21వ తేదిన మండలంలోని ఎగువరెడ్డివారిపల్లిలో మౌనిక అనే వివాహిత ఇంటిపై సన్నీతో పాటు మరికొంత మంది అర్ధరాత్రి దాడులకు తెగబడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చంద్రగిరిలో రౌడీషీటర్ శ్రీవాత్సవ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్టు చేశారు. -
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
తిరుపతి క్రైం: ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.1.50 లక్షలు దోచుకున్న కేటుగాడిని తిరుపతి అలిపిరి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామ్కిషోర్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతి ఆటోనగర్, విశాలాంధ్ర వీధికి చెందిన చింతా వెంకటేశ్వరరావు (30) ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయాల్లో రాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాపిడో ద్వారా కే.సురేష్కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఢిల్లీలోని ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అని, తాజాగా పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీ అయ్యానని చెప్పి వెంకటేశ్వర్లును నమ్మించాడు. ప్రస్తుతం తిరుపతిలో సెలవులో తన పిన్ని ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు. తన పరిచయాలు, ప్రభావాన్ని ఉపయోగించి హైదరాబాద్ ఆదాయపన్ను కార్యాలయంలో డివిజనల్ అడ్వైజర్ పోస్టును ‘రీప్లేస్మెంట్ కోటా’లో ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఉద్యోగం ఆశతో అతడి మాటలను నమ్మిన వెంకటేశ్వరరావు, విడతల వారీగా పేటీఎం, ఫోన్ పే ద్వారా మొత్తం రూ.1.50 లక్షల నగదును బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న తర్వాత నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. గట్టిగా అడిగితే ‘‘చేయగలిగింది చేసుకో’’ అంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: నగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం కలిగించింది. ఈ ఘటనపై భర్త వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, అలిపిరి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు తిరుపతి ఆటోనగర్, అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న సి. మౌలిక (26) ఈ నెల 10వ తేదీ ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే రుయాస్పత్రికి తరలించారు. ఉదయం 9.13 గంటలకు ఆమెను పరీక్షించగా వైద్యులు ‘బ్రైన్ డెడ్’గా ప్రకటించారు. మమృతురాలి తల్లి సి.లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2020లో సి. మౌలికను పి.ఉదయ్కి వివాహం జరిపించారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు ఆటోనగర్లో నివసిస్తున్నారు. అయితే వివాహానంతరం భర్త ఉపాధి లేకుండా తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి మౌలికను శారీరక, మానసిక వేధింపులకు పాల్పడేవాడని మృతురాలి పుట్టింటివారు ఆరోపించారు. సౌమ్య అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ‘మౌలిక చనిపోతే ఆమెను వివాహం చేసుకుంటాన’ని బెదిరించే వాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మౌలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఓవరాల్ చాంపియన్స్గా ఎన్ఎస్యూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులగా జరిగిన నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ కల్చరల్ ఫెస్ట్–2026 ఘనంగా ముగిసింది. బుధవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ అప్పారావు విచ్చేసి మాట్లాడుతూ కళలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే సాధనాలని, ప్రతి విద్యార్థి తనలో టాలెంట్ గుర్తించి దాన్ని అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అతిథులతో కలసి యూత్ ఫెస్ట్లో ఓవరాల్ చాంపియన్స్గా నిలిచిన తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులకు ట్రోఫీ, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లీనా చంద్ర, డాక్టర్ ధర్మదాసన్ సితార పాల్గొన్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి డక్కిలి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తెలిపారు. డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్సీకి రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సిబ్బంది హాజరు ఎఫ్ఆర్ఎస్ యాప్లోనే మూడు సార్లు తప్పకుండా వేయాలన్నారు. రోగులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వైద్యులు బిందు ప్రియాంక, శ్రీహరి పాల్గొన్నారు. ఎంబీయూలో ప్లేస్మెంట్స్లో విద్యార్థుల ప్రతిభ చంద్రగిరి: మోహన్బాబు విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్లేస్మెంట్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. బుధవారం ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్, ఎల్టీఐ–మైండ్ ట్రీ సంస్థలు ప్లేస్మెంట్ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 415 మంది విద్యార్థులు గరిష్టంగా ఏడాదికి రూ.21లక్షల వేతనాలతో కొలువు సాధించినట్లు తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్లో ముఖ్యమైన మైలురాయిని సాధించినట్లు ఎంబీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 415 మంది విద్యార్థులు బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, ఎల్టీఐ–మైండ్ ట్రీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు రావడం ఆనందంగా ఉందని ఆ వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎంబీయూ చాన్సలర్ మోహన్బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణు అభినందనలు తెలిపారు. -
భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..?
సాక్షి, టాస్క్ఫోర్స్: అడవి బిడ్డలపై అటవీ అధికారుల అక్కసు కొనసాగుతోంది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై దాడులు తెగబడడం గిరిజన కాలనీ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల పరిధిలోని భాకరాపేట అడవుల్లో అసలు ఏంజరుగుతోందన్న అనుమానాలు అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అటువైపుగా రాత్రి వేళ వెళ్లే వాహనచోదకులపై అటవీ అధికారులు చూపే ప్రతాపం, గిరిజన గ్రామాల్లో అటవీ అధికారుల ఆగడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం, అడవి జంతువులను కాపాడేందుకు ఏర్పాటైన ఫారెస్టు అధికారులు ఆ పనులను పక్కపెట్టి అక్రమ సంపాదనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఫారెస్టు బీట్ ఆఫీసర్లు సైతం అడవులకు ఆనుకుని ఉన్న గిరిజన కాలనీల్లో కొందరు యువకులను ఎంపిక చేసుకుని భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు ఇన్ఫార్మర్లుగా పెట్టుకున్నట్టు సమాచారం. ఆ ఇన్ఫార్మర్లు ఇచ్చే సమాచారాన్ని తమ పైఅధికారులకు చేరవేసి, బీటు ఆఫీసర్లు చేతులు దులుపుకుంటుండగా ఒక్కోసారి ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో దాడులు నిర్వహించే అధికారులు అక్కడ ఏమీ లేకుండా పోతే వారిపై బూతు పురాణం చదువుతున్నట్టు గిరిజనులు మదన పడుతున్నారు. అంతేకాక ఇన్ఫార్మర్గా ఉన్న వారిపైనే ఒక్కోసారి కేసుపెట్టి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసినట్టు జైలుకు పంపించేస్తున్నారని, అదేమని అడిగితే అప్పటి వరకు తన వద్ద తీసుకున్న సమాచారం మొత్తం కోర్టుకు అందజేసి జీవితాంతం బయటకు రాకుండా చేస్తామని అటవీ అధికారులు బెదిరిస్తున్నట్టుగా బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు జరిమానాలతో సరి అటవీ పరిసరాల్లో జంతువులను వేటాడడం, కలపను దోచుకోవడం వంటి కేసుల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరైనా పట్టుబడితే వారికి జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అడవి జంతువుల మాంసంతో పట్టుబడిన అమాయక గిరిజనులను మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులను తప్పుదోవ పట్టించేలా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా అటవీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బాధిత వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసిన వెంటనే కోర్టుకు అప్పగించకుండా అడవుల్లో తిప్పుతూ చితక్కొట్టడం, ఆపై గాయాలు కాస్త తగ్గిన తరువాత కోర్టుకు అప్పగించేలా చేస్తుండడం గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, సదుం మండలానికి చెందిన మరో ఇద్దరు గిరిజన యువకులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని ఆరు రోజులుగా ఆచూకీ చెప్పకుండా వారి కుటుంబసభ్యులకు నరకం చూపారు. తమ బిడ్డలు ఏమయ్యారోనని తిరుపతి స్పెషల్ కోర్టు పరిసరాల్లో రోడ్డు పక్కన కూర్చుని పడిగాపులు కాశారు. చివరకు ఆ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో అటవీ అధికారులు గుట్టుగా ఒక్క రోజు ముందు వారిని అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్ చూపించి, ఆ ఐదుగురుని కోర్టులో ప్రవేశపెట్టి తప్పుదోవ పట్టించారు. అయితే బాధితుల తరఫున న్యాయవాది అటవీ అధికారులు కొట్టారని నిందితుల శరీరంపై ఉన్న గాయాలు చూపడంతో అటవీ అధికారులు అక్కడ కూడా తమకు సంబంధం లేదన్నట్టు బుకాయించారు. దీంతో ఆ దెబ్బలు దేనివల్లా కలి గాయో చెప్పాలని న్యాయాధికారి వైద్య పరీక్షలకు ఆదేశించారు. ఇలా అటవీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అమాయకులైన అడవిబిడ్డలపై తమ ప్రతాపం చూపుతుండటంతో గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీనిపై చామల రేంజి అధికారి వెంకటరమణను వివరణ కోరగా తాము ఎవరినీ కొట్టలేదని, అరెస్టు చేసిన తరువాత ఆలస్యం చేయకుండా కోర్టుకు తీసుకువచ్చామని, అక్రమ కేసులు ఎవరిపైనా పెట్టలేదని, ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన వారిపై కేసులు పెడుతున్నట్టు చెప్పారు. -
దుబాయ్ సదస్సుకు పేటశ్రీ
తిరుపతి కల్చరల్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఈనెల 15,16వ తేదీల్లో ఎస్పీజే స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ వారు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్ డిసిప్లైనరీ రీసెర్చ్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్(ఐసీఐఆర్జీడీ–2026) సదస్సు జరుగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి పాల్గొని ‘ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ తిరుమల బ్రహ్మోత్సవమ్స్– ఏపీ, ఇండియా’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తారు. పేటశ్రీ తిరుపతి గంగజాతర, తిరుమల, తిరుపతి కథలు, కోనేటి రాయని కథలు వంటి తిరుపతికి సంబంఽధించిన పుస్తకాలను ప్రచురించారు. ఈయన గతంలో ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, వియత్నం, శ్రీలంక, భూటాన్, థాయ్ల్యాండ్ వంటి దేశాల్లోని సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలను సమ ర్పించారు. సెక్టోరియల్ ఇంటర్వ్యూలు తిరుపతి అర్బన్: సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్ పోస్టులకు బుధవారం కలెక్టరేట్లో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి 39 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ 31 మంది మాత్రమే హాజరయ్యారు. డీఆర్వో నరసింహాలుతోపాటు డీఈఓ కేవీఎన్ కుమార్, సమగ్రశిక్ష అధికారి గౌరీశంకర్, డైట్ ప్రిన్సిపల్ శ్యామలాదేవి నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిపారు. మెరిట్ ప్రకారం రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నామని సమగ్రశిక్ష జిల్లా అధికారి గౌరీశంకర్ స్పష్టం చేశారు. -
నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర
తిరుపతి రూరల్: తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడవాహన సేవను పురస్కరించుకుని పట్టువస్త్రాలు సమర్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక మహా పాదయాత్రను నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 12వ తేదీన గురువారం తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు సాగే ఈ ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు వందలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆధ్యాత్మిక పాదయాత్రలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి పాల్గొంటారు. చదువుకోండి.. వ్యాపారజీవనం సాగించండి తిరుపతి అర్బన్: చదువుకునే వ యస్సు ఉన్నవా రు చదువుకోండి..ఉద్యోగాలు చేయండి.. అలా గే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవనం సాగించండని ట్రాన్స్జెండర్లకు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. జిల్లాలోని ఏడుగురు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులతోపాటు ధ్రువీకరణపత్రాల ను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్ అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు, హి జ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజా వినోద్ గుర్తింపు కార్డుల జారీకి దర ఖాస్తుల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ దరఖాస్తులు చేసుకున్న అందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. దీంతో దరఖాస్తులు చేసుకున్న జి.జాహ్న వి, వి.లక్ష్మి, ఎస్.ఆయేషా, కే.రోహిణి, పి.హర్షి, బి.ప్రణతి, బి.మన్వితకి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్జెండర్లకు అందాల్సిన అన్నింటిని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తలకోనకు ప్రత్యేక బస్సు సర్వీసులు తిరుపతి అన్నమయ్యసర్కిల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తలకోనకు తి రుపతి, రైల్వేకోడూరు నుంచి ప్రత్యేక బస్సు స ర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ సురేంద్రకుమార్ తెలిపారు. బుధవారం డిపోలోని అ న్ని అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక కో– ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. తలకోన శైవక్షేత్రానికి గత ఏడాది నడిపిన ప్రత్యేక సర్వీసులు, ఈ ఏడాది నడపాల్సిన ప్రత్యేక సర్వీసుల గురించి చర్చించారు. భక్తులు, ప్రయా ణికుల సౌకర్యార్థం నిరంతరాయంగా బస్సులు నడపడంపై కార్యాచరణ రూపొందించాలన్నా రు. కాగా గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి నుంచి తలకోనకు 70 సర్వీసులు, రైల్వే కోడూరు నుంచి 40 సర్వీసులు న డిపారు. అయితే ఈ సంవత్సరం సీ్త్రశక్తి పథకం అమల్లో ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని, తి రుపతి నుంచి తలకోనకు 80 ప్రత్యేక సర్వీసులు, రైల్వేకోడూరు నుంచి తలకోనకు 50 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు. -
డైకిన్–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో డైకిన్ –రెచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. జపాన్కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తైవాన్కు చెందిన రెచీ ప్రెసిషన్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న డైకినీ–రెచీ కంపెనీలో ఏసీల విడిభాగాలు (రోటరీ కంప్రెసర్లు) ఉత్పత్తి చేస్తారు. నూతన ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో డైకిన్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్ జీత్ జావా, డైకిన్–రెచీ ఇండియా డైరెక్టర్ సెకిదా నయోటో సహా పలువురు పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ ప్రధాని ‘మేక్ ఇచ్ ఇండియా ఫర్ వరల్డ్’ లక్ష్యానికి అనుగుణంగా డైకిన్లో కలైజేషన్ ప్రయాణంలో ఇదిఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ సదుపాయం హెచ్వీఏసీ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, దేశీయ గ్లోబల్ మార్కెట్లకు సేవలందిస్తుందన్నారు. ప్లాంట్ ఏర్పాటును స్వాగతించిన డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో సులభతర, వేగవంతమైన వ్యాపార వ్యవస్థపై ప్రభుత్వం నిబద్ధతను చాటుతుందన్నారు. 33.10 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టు మూడు దశల్లో అభివృద్ధి చేస్తారన్నారు. -
కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం
తిరుపతి తుడా: గ్రేటర్ తిరుపతిగా తీర్మానిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ప్రకటన చేయాలని నగర మేయర్ డాక్టర్ ఆర్ శిరీష విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేషన్ 2026 –27 వార్షిక ఏడాది రూ. 350 కోట్లతో రూపొందించిన బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలానే 44 అంశాలతో కూడిన పరిపాలన, అభివృద్ధి అజెండాలకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు. మేయర్ శిరీష మాట్లాడుతూ వరుసగా ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్కి మేయర్గా ఉండే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి తొలి మేయర్గా సేవలందించే అరుదైన గౌరవం లభించిందన్నారు. గత కౌన్సిల్లో తిరుపతిని మహానగరంగా విస్తరించాలని ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాన్ని ప్రభుత్వం గౌరవించి, వెంటనే గ్రేటర్ తిరుపతిని ప్రకటించాలని ఆమె కోరారు. తిరుపతి ప్రజలు అభిప్రాయం, కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తదుపరి ఎన్నికలు గ్రేటర్ తిరుపతికే జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ బడ్జెట్ను ఖర్చులను తగ్గించుకుని, పొదుపును పెంచుకునేలా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదాయ వ్యయాల సమతుల్యత అవసరమని సూచించారు. మనం ఆమోదించబోయే బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తిరుపతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పెరిగిన రాబడికి అభివృద్ధే మూలం భవన అనుమతులు, పన్నులు వంటి రూపంలో కార్పొరేషన్కు రూ. 20 కోట్లకు మేర రాబడి పెరగడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి మూలమని కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. 22 మాస్టర్ ప్లాన్ అభివృద్ధితో నగర విస్తరణ శరవేగంగా జరుగుతోందన్నారు. తద్వారా కార్పొరేషన్కు భవన అనుమతులు ఆస్తి పన్నులు రూపంలో ఆదాయం విస్తారంగా పెరిగిందన్నారు. రాబోవు రోజుల్లో నగర తూర్పు ప్రాంతం ఆదాయ వనరుగా మారుతుందన్నారు. తిరుపతి అభివృద్ధిలో భూమన అభినయ్ చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఈట్ స్ట్రీట్ ప్రతిపాదన తమ ప్రభుత్వానిదేనని, అయితే ఇందుకోసం మాస్టర్ పాన్ రోడ్లలో శాశ్వత నిర్మాణం చేపట్టడం సరైనది కాదన్నారు. గ్రేటర్ తిరుపతి తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ 44 అజెండాలకు ఆమోదం కౌన్సిల్ సాధారణ సమావేశంలో 44 అజెండాలకు ఆమోదం లభించింది. ఇందులో పరిపాలన అంశాలతోపాటు ఉద్యోగుల పదోన్నతులు, అభివృద్ధికి సంబంధించిన పలు అజెండాలు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశానికి వచ్చే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు తనిఖీల పేరుతో అడుగడుగున అవమానం చేశారని కోఆప్షన్ సభ్యులు ఇమామ్ సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను కాలా రాసేలా తనిఖీలు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. కార్పొరేటర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరమని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తారని ఆయన గుర్తు చేశారు. అయితే కౌన్సిల్లోకి వెళ్లేందుకు కార్పొరేటర్లకు పోలీసులు తనిఖీల పేరుతో చుక్కలు చూపించడం సరైంది కాదన్నారు. అంతకుముందు కార్పొరేటర్లను మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు -
యమలోకాలు
కలాశాలలు కాదు●యమలోకంలా ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు విద్యార్థులకు యమలోకాన్ని తలపిస్తున్నాయి. నిత్యం విద్యార్థులకు ఏదో రకంగా వేధిస్తూ నరకం చూపించి ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. విద్యను వ్యాపారం చేసిన ప్రభుత్వాలు కార్పొరేటు సంస్థల పక్షానే నిలబడడంతో అమాయక తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. –అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వర్సిటీల కోర్డినేటర్, తిరుపతి ఆత్మహత్యలకు అడుకట్ట వేయరా? ప్రైవేటు విద్యాసంస్థల్లో వరుస ఆ త్మహత్యలు భయబ్రాంతులకు గు రిచేస్తున్నాయి. విద్యార్థులను ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న సంస్థలపై చర్యలు శూ న్యం. బేరసారాలతో తల్లిదండ్రులను మభ్యపెట్టి తమ పనికానిచేస్తున్నారు. ప్రశ్నించి విద్యార్థి సంఘాలపై దారుణంగా దాడులు చేయడం, బెదిరించడం, కేసులు బనాయించడం చేస్తున్నారు. – చిన్న, ఏఐఎస్ఎఫ్ ఎస్వీయూ ఇన్చార్జి, తిరుపతి నిద్రావస్థలో బాబు సర్కారు కళాశాలల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో, అధికారులతో బేరసారాలకు దిగి తప్పులను కప్పిపుచ్చుకుంటూ సర్దుబాటు చేసుకుని, యథావిధిగా కార్యక్రమాలను కొనసాగిస్తూ రెచ్చిపోతున్నారు. అధికారులను తమదైనశైలిలో లొంగదీసుకుంటూ తమ పనికానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న, ఆత్మహత్యలు జరిగిన కళాశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాబు ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యహరిస్తూ నిద్రావస్థలో మునిగిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సిటీ: తమ బిడ్డ తమలా కష్టపడకూడదు..డాక్టరో..ఇంజినీరో కావాలి..ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు ఆత్రుత పడుతుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు తిరుపతిలో పుట్టగొడులుల్లా పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఒకే కళాశాల పేరుతో ఐదు నుంచి ఏడేనిమిది బ్రాంచ్లను నెలకొల్పి, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతోపాటు ఐఐటీ, మెడికల్ క్యాంపస్ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని, విద్యార్థులకు బట్టి చదువులను నేర్పుతూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక మానసిక రోగులుగా మారుతుండగా, మరికొందరు కళాశాలలో లైంగిక వేధింపులకు, ఫీజు చెల్లించాలనే ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీరు మారని ప్రైవేటు యాజమాన్యం ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలల తీరు మారలేదు. విద్యార్థులు కళాశాలల్లో చేరినంతవరకు తల్లిదండ్రుల కాళ్ల వేళ్లపడే యాజమాన్యాలు జుట్టు తమ చేతికి చిక్కిన తర్వాత తమ ప్రతాపం చూపుతున్నారు. తమ విద్యార్థిని చూసి పలుకరించేందుకు నెలకొకసారి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చినా తమ పిల్లలను కలవనీయకుండా వారిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బట్టి చదువులను విద్యార్థులపై రుద్దుతూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు వాపోతున్నారు. మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీతో విద్యనందిస్తాం.. అన్ని సౌకర్యాలున్నాయి.. మంచి భవిష్యత్ ఉంటుంది.. రారారమ్మని పిలిచే కళాశాలలు విద్యార్థులు చేరిన తరువాత ఫీజు రాయితీలు ఎగ్గొట్టుతున్నాయి..జైళ్లను తలపించే హాస్టల్ గదుల్లో పడేస్తున్నాయి... మొత్తం ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తున్నాయి. దీనికితో లైంగిక వేధింపులు, ఒత్తిడితో కూడి బట్టీ చదువులు నెత్తిన మోపుతున్నాయి. ఫలితంగా పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపర్వం -
ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘోరాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకోకపోవడం దారుణం. అమాయక విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు శూన్యం. ఈ ఏడాది కేవలం రెండు నెలలు గడవ ముందే తిరుపతిలోని పలు విద్యాసంస్థల్లో సుమారు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం. బాధిత కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. –ప్రేమ్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఎస్వీయూ వేధింపులతోనే ఆత్మహత్యలు సంస్థ పేరుప్రతిష్టల కోసం ర్యాంకుల పేరుతో బట్టీ చదువులతో ఒత్తిడి చేయడం. విద్యార్థినులను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు మేలుకోవాలి. చదువుతో పాటు విద్యార్థి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత నిచ్చే సంస్థల్లోనే చేర్పించాలి. విద్యను వ్యాపారం చేసే విద్యాసంస్థలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలి. –శ్రవంతి, పీడీఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు, తిరుపతి కడుపుకోతకు కారకులెవరు? ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. విద్యార్థులకు సరైన భోజన వసతి సౌర్యాలను కల్పించకుండా మానసిక రోగులను చేస్తున్నాయి. మార్కులే ప్రామాణికంగా వేధిస్తూ తల్లిదండ్రులను సైతం కలవనీయకుండా, సెలవులు ఇవ్వకుండా, కనీసం తమ సమస్యలను కన్న తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు ఫోన్ సౌకర్యం కల్పించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒంటరితనానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి -
యూఎఫ్ఎస్ సర్వే తప్పులు లేకుండా చేయండి
తిరుపతి అర్బన్: తప్పులు లేకుండా యూఎఫ్ఎస్(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ యూఎఫ్ఎస్ సర్వేలు ఇచ్చిన అన్ని అంశాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే పీ3 అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరోవైపు పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఓ నారాయణరెడ్డి, డీఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ జగదీష్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచితం ముసుగులో ఇసుక దోపిడీకి సిద్ధం
నాగలాపురం: మండలంలోని అరుణానదిలో ఇసుక దోపిడీకి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో అనధికారిక దోపిడీకి స్థానిక టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ దిశగా బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద మంగళవారం దాదా పు 30 ట్రాక్టర్లకు పైగా వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకోగా హిటాచ్చి యంత్రాలతో లోడింగ్ చేసుకుని అక్రమంగా బయటకు తరలించేందుకు సిద్ధమయ్యా రు. దీంతో మలిమేలకండ్రిగ వాసులు ట్రాక్టర్లను అడ్డగించారు. గ్రామస్తులతో ట్రాక్టర్లు డ్రైవర్లుకు వాగ్వాదానికి దిగారు. గొడవ జరగడంతో ట్రాక్టర్ యాజమానులు ఇసుకను నదిలోనే వదలి వెళ్లి పోయారు. అయితే ఈ విషయమై గ్రామస్తుల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తిరుపతి రూరల్: తిరు పతి నుంచి ఉప్పరపల్లి మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన చేసుకుంది. తిరుపతి రూరల్ పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన చంద్రబాబు కుమారుడు విక్రమ్ (19)కు చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో తన అక్క గీతాంజలితో కలసి తండ్రితో కలిసి ఉంటున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న విక్రమ్ ఆ తరువాత చదువు ఆపేసి బతుకు దెరువుకు కూరగాయల వ్యాపారం సాగిస్తున్నాడు. తన స్నేహితుడు రాజ్కుమార్తో కలసి సోమవారం రాత్రి ఉప్పరపల్లి నుంచి తిరుపతిలోకి తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా రామానుజపల్లి జంక్షన్ నుంచి తిరుపతి నగరంలోకి వెళ్లే మారుతీ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్లే ఇద్దరికీ బలమైన గాయాలుకాగా అదే సమయంలో అటుగా వచ్చి న విక్రమ్ సమీప బంధువులు క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతున్న విక్రమ్ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని అక్క గీతాంజలి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అరెస్టు పుల్లంపేట: హెడ్కానిస్టేబుల్ను గాయపరిచిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నిందితునికి నందలూరు జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని కోనయ్యగారిపల్లెకు చెందిన చలమల మల్లికార్జునరెడ్డి ఆదివారం రాత్రి పుల్లంపేటలోని తన మేనత్త భర్త నాగా తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ చేయగా లేదని తెలపడంతో గొడవపడ్డాడు. దీంతో తిమ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణకు వచ్చిన హెడ్కానిస్టేబుల్ సుబ్బరాజును ఉంగరపు వేలు, మధ్య వేలును కొరికి గాయపరచడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కాగా మంగళవారం నందలూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునివ్వడంతో రాజంపేట జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి రేణిగుంట: పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మంగళవారం ఉదయం స్థానికులు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. రైల్వేట్రాక్ పక్కన 50 నుంచి 55 ఏళ్ల గుర్తు తెలియని పురుషుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనారోగ్య కారణం గానీ, లేదా ఫిట్స్ రావడంతో గానీ మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతుడు పసుపు రంగు షర్టు, తెలుపు రంగు పంచె ధరించి ఉండగా, అతని చర్మ తెలుపు రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించి సమాచారం అందించాలని కోరారు. పక్కా గృహాల అప్పగింతకు చర్యలు నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లాలో 18,943 పైగా వివిధ దశలో నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను లబ్ధిదారులకు ఉగాది నాటికి అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో నిర్మిస్తున్న పక్కాగృహాలను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ గృహాల నిర్మాణ పనులను గుర్తించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి అన్నం శ్రీనివాసరావు, సూళ్లూరుపేట డీఈ దశయ్య, ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తిరుపతి అర్బన్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కడప ఆర్జేడీ శామ్యూల్ వెల్లడించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన ఆయన, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలసి తిరుచానూరు హైస్కూలు, చెర్లోపల్లిలోని వసతి గృహాన్ని సందర్శించారు. అనంతరం వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో హాజరు శాతం తక్కువగా ఉన్న పదోతరగతి విద్యార్థులు, అలాగే పాఠశాలల్లో జరుగుతున్న సాధారణ పరీక్షల్లో తక్కువ శాతం మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు 36 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఆయా పాఠశాలల సమీపంలోని హాస్టళ్లకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చంద్రగిరి: అక్రమంగా పాల వ్యానులో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం జరిగింది. సీఐ సురేష్ కుమార్ కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కిషోర్ నుంచి ముల్బాగిల్కు చెందిన లక్ష్మీపతి రేషన్ బియ్యం కొనుగోలు చేసి, ముల్బాగిల్కు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో మండలంలోని తొండవాడ సమీపంలో రెవెన్యూ అధికారులతో కలసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వస్తున్న పాలవ్యానును తనిఖీ చేయగా వాహనంలో 6.5 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించామని సీఐ సురేష్ కుమార్ తెలిపారు. -
కల్తీ పాల తయారీ ఇలా..
సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పా‘పాల’ పుట్టకు ప్రతిరూపంగా మారింది. ఇక్కడి కూటమి నేతలు కెమికల్ డాన్లుగా మారిపోయారు. అధికార మదంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు తాగే పాలలో రసాయనాలు కలిపి ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారు. పాలకూట విషాన్ని అధికార పలుకుబడితో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. కల్తీ రాయుళ్ల ఆటకట్టించడంలో ఇక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలం చెల్లిన పాల పౌడర్, పామాయిల్, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి మిక్సీ పడతారు. తద్వారా చిక్కటి క్రీం తయారవుతున్నట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇలా తయారైన లీటరు క్రీంలో నాలుగు లీటర్ల పాలు, 20 లీటర్ల నీటిని కలిపి మొత్తంగా 25 లీటర్ల పాలను తయారుచేస్తున్నారు. ఈ పాలను వివిధ డెయిరీలకు విక్రయించి వినియోగదారులపైకి వదులుతున్నారు. తమ బండారం బయట పడకుండా ప్రైవేటు డెయిరీల్లోని ఉద్యోగులను కల్తీపాల మాఫియా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. తమ అక్రమార్జనలో వా టాలు ఇస్తూ, మాట వినని వారిని బెదిరింపులతో నె ట్టుకొస్తున్నారు. కృత్రిమంగా తయారు చేస్తున్న పాల లో ఏయే రసాయనాలను ఏ మోతాదులో కలిపారో నిర్ధారించేందుకు పొరుగు రాష్ట్ర పోలీసులు పాల నమూనాలను పరీక్షలకు పంపారు. ఇవేం పాపాలుకర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పాల తయారీకి కావాల్సిన రసాయనాలు, వస్తువులను సేకరించి తమకు అనుకూలంగా ఉన్న డెయిరీల ఏజెంట్లకు అందిస్తున్నారని తెలిసింది. ఓ మహిళా నాయకురాలి భర్త కనుసన్నల్లోనే కుప్పంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు పాల తయారీ రసాయనాలు రవాణా అవుతున్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్లోని ఫుడ్ సేప్టీ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలా గడంతో కుప్పంలో డొంక కదులుతోంది. సాక్షి, టాస్క్ఫోర్స్ : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఊకదంచుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం నేతి బీరకాయను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తూ కుప్పం ప్రాంతానికి చెందిన కూటమి నాయకులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు కల్తీ పాల దందా కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అందరికీ అవసరమైన పాలను విషంగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పట్టని పాలకులు కల్తీ పాల తయారీకి కుప్పం అడ్డాగా మారిందని పొరుగు రాష్ట్రాల పోలీసులు చర్యలకు ఉపక్రమించినా స్థానిక అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడడం లేదు. నెలవారీగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు పొరుగు రాష్ట్ర విచారణ సంస్థలకు కూడా సహకరించడం లేదనే అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. కల్తీ పాల ముడి సరుకులను అందిస్తున్న కీలకమైన వ్యక్తిని పట్టుకునేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన కర్ణాటక పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకుని బలవంతంగా వెళ్లగొట్టినట్టు సమాచారం. కర్ణాటకలోని రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడి పోలీసులను కట్టడి చేసేందుకు అధికార పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కలెక్టర్, ఎస్పీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డొంక కదులుతోంది ఆమె భర్తే కల్తీ డాన్ రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ పాలు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించిన అక్కడి పోలీసులు గత నెలలో కోలారు జిల్లా కేజీఎఫ్ ఎస్పీ పరిధిలోని ఆండర్సన్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కుప్పానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుప్పానికి చెందిన ఓ మహిళా నాయకురాలి భర్త కల్తీ పాల తయారీ రాకెట్కు సూత్రధారిగా ఉన్నాడని అక్కడి పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కుప్పం నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ పాలు -
సెక్టోరియల్ పోస్టుల భర్తీకి నేడు ఇంటర్వ్యూలు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లోని సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్ పోస్టులను భర్తీ చేయడానికి బుధవారం ఇంటర్వ్యూలకు హజరుకావాలని దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆరు నెలల క్రితం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ముడుపులకేనా మీనమేషాలు అనే శీర్షికతో సాక్షిదినపత్రికలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఇంటర్వ్యూలు నిర్వహించి..పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. సెక్టోరియల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో 8 చిత్తూరు జిల్లా ఉపాధ్యాయులవి ఉండడంతో స్థానిక జిల్లా రూల్స్ నేపథ్యంలో వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించలేదు. ఈ క్రమంలో ఐదు పోస్టులకు 39 మందిని ఇంటర్వ్యూలు జరిపి, మెరిట్ ప్రకారం భర్తీ చేయనున్నారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం రైతులకు శాపం
రైల్వేకోడూరు అర్బన్: నాడు, నేడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర రైతులపై అశ్రద్ధ చూపి, రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ఎత్తు పెంచుతూ ఇక్కడి ఆయకట్టు రైతులకు నీరు రాయనీకుండా ఆపుతోందని తెలిపారు. ప్రస్తుతం 129 టీఎంసీల నిల్వ సామర్థం ఉండగా రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని, కర్ణాటక ప్రతిపాదనల మేరకు 279 టీఎంసీల నీరు నిల్వ సామర్థానికి పెంచితే రాష్ట్రంలో లక్ష ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లినా ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదన్నారు. అల్మట్టి ఎత్తుపెంచుతున్నా చూస్తూ రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. దీనికితోడు రాష్ట్ర ప్రజల జీవ నాడి పోలవరం పూర్తి చేయలేదన్నారు. మాజీ సతెం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా రైతల కోసం ముందుండి పోరాటాలు చేశారని తెలిపారు. 2009లో కర్ణాటక అల్మట్టి ఎత్తుపెంచుతుంటే పోరాడి, పనులు ఆగిపోయేలా చేశారని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రాజెక్టులకు కర్నూలులో మహాధర్నా చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టాక రైతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు కట్టి పూర్తి చేశారని పేర్కొన్నారు. అప్పుడు తమ ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప, రైతులకు చేసిందేమీలేదన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి పేరు చెప్పి దోచుకుంటూ రాష్ట్రాన్ని మరో సూడాన్, శ్రీలంక చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందా బాల, వెంకటరెడ్డి, నాయిని యానాదిరెడ్డి, దామర్ల గణేష్, డీవీ రమణ, రాజశేఖర్ పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో విస్తృత స్థాయి భద్రతా ఏర్పాట్లు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీవశ్వరాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలో్ల్ భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, సౌకర్యాల నిర్వహణపై ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్ర త్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చే పట్టాలన్నారు. ఏఎస్పీలు రవిమనోహరఆచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తునికి కొండపై స్థానం కల్పించి, కింద కొలువైన పరమేశ్వరుడు తొలి పూజను భక్తునికే చెందేలా వరమిచ్చాడు. దీంతో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి పూజలు చేశారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొండపై వెలసిన కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువుదీర్చి శాస్త్రోక్తంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మండప ఆరాధన, ధ్వజపూజ నిర్వహించారు. అనంతరం దర్బ, మామిడాకులతో కట్టిన దవళపతాకం, పూలహారాన్ని ధ్వజ స్థంభంపైకి ఎగురవేశారు. తరువాత శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. బో యలు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ సందర్భంగా వస్త్రం, నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత గ్రామోత్సవం ప్రారంభంమైంది. రాజగోపురం నుంచి చతుర్మాడవీధీల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ధ్వజస్తంభానికి అభిషేకం చేస్తున్న వేదపండితులు తిరుపతి గ్రేటర్ కావాల్సిందే.. అందుకు మున్సిపల్ తీర్మానాన్ని సర్కారు ఆమోదించి తీరాల్సిందే.. వచ్చే ఎన్నికలు గ్రేటర్ తిరుపతిగానే జరుగుతాయని ఆశిస్తున్నాం.. మహానగర ప్రతిపాదనతోనే తిరుపతికి అరుదైన గౌరవం అని నగర కార్పొరేషన్ మేయర్ శిరీష, కార్పొరేటర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని అమోదించారు. దీన్ని చంద్రబాబు సర్కారు ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిల్ నిర్వహిస్తున్న మేయర్ డాక్టర్ శిరీష గ్రేటర్ తిరుపతి..శాస్త్రోక్తంగా వాస్తు శాంతిపూజలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి వాస్తు శాంతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామోత్సవం ముగిసిన తరువాత ఆలయంలో వేదపండితులు గణపతి హోమం, పూజ చేశారు. అలాగే ఆలయానికి వాస్తు శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, పాలకమండలి చైర్మన్కొట్టే సాయిప రసాద ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సు డ్రైవర్కు గుండెపోటు
బుచ్చినాయుడుకండ్రిగ: శ్రీకాళహస్తి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరిగిలకండ్రిగ వద్ద వెళుతుండగా డ్రైవర్కు విధినిర్వహణలోనే ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. స్పందించిన ప్రయాణికులు, కండెక్టర్ బీఎన్ కండ్రిగ పీహెచ్సీకి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరువళ్లూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అరిగిలకండ్రిగ గ్రామం వద్ద కేటీరోడ్డుపై బస్సు నడుపుతుండగా డ్రైవర్ అమ్ముల్రాజ్ అకస్మాత్తుగా చాతినొప్పి రావడంతో అస్వస్తతతకు గురి అయ్యాడు. డ్రైవర్ గుండెనొప్పిగా ఉందని కండక్టర్కు చెప్పారు. దీంతో కండక్టర్ హూటహూటిన బస్సును నడుపుకుంటూ బుచ్చినాయుడుకండ్రిగ పీహెచ్సీకి తీసుకువచ్చారు. పీహెచ్సీలోని వైద్యులు మురళీరెడ్డి, ఉదయ్లు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ అమ్ముల్రాజ్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం చంద్రగిరి: ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన వేదాంతపురంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రేణిగుంట భగత్సింగ్ కాలనీకు చెందిన వీరేష్(35), వేదాతంపురంలోని ఓ భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న మట్టిగుట్ట ఒక్కసారిగా కుప్పకూలి వీరేష్పై పడింది. ఈ ప్రమాదంలో వీరేష్ మట్టిగుట్టలో కూరుకుపోయాడు. తోటి కార్మికులు కేకలు వేయడంతో, జేసీబీ సాయంతో వీరేష్ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న కార్మిక సంఘం నేతలు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి భవన నిర్మాణ కాంట్రాక్టర్ రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగిసిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ –2026 పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికలను ఉదయం 8 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వైద్యుల సంఘం ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వైద్యులు (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం సుమారు 85 వేల మంది ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో 4 ప్యానెళ్ల పోటీ చేశాయి. 84 మంది వైద్యులు ఎన్ని కల్లో పోటీకి దిగారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు వైద్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. గుండెపోటుతో ప్రయాణికుడి మృతి చంద్రగిరి:గుండె పోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సోమవారం ఐతేపల్లి సమీపంలో చో టు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూ రు సమీపంలోని హసన్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(48) విశాఖప ట్నంలోని ఓ హోటల్లో వంట కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయల్దేరాడు. ఐతేపల్లి వద్ద వెళుతున్న సమయంలో చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తోటి ప్రయాణికులు చంద్రశేఖర్ను వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసుల కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చే రుకున్న ఎస్ఐ ప్రవళిక మృతదేహాన్ని పరిశీలించి, చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మఠం భూముల్లో ఆక్రమణలపై సీఎంకు లేఖ
తిరుపతి రూరల్: గాంధీపురం పంచాయతీలోని మఠం భూముల్లో జరిగే భూ ఆక్రమణలను అరికట్టాలని, భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబుకు సీపీఎం నేతలు లేఖలు రాశారు. సోమవారం సీపీఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి రాసిన లేఖలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత జయచంద్ర మాట్లాడుతూ పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడాలని కోరారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లో 1.09 ఎకరాల భూమిని 32 మంది రజకులు 2014లో కొనుగోలు చేశారని, ఆ భూమిని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి దౌర్జన్యంగా ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్లిన పేదలపై రౌడీలతో పేదలపై దాడి చేయిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కార్యాలయం స్పందించి ఆ భూమిని కాపాడాలని, పేదలకు న్యాయం చేయాలని కోరుతూ లేఖలు రాసినట్టు తెలిపారు. లేఖల ప్రదర్శన కార్యక్రమంలో మహేష్, రమేష్, ఏలుమలై, పుష్ప, శంకర, చంద్ర, చంద్రారెడ్డి సతీష్, నరసింహ, శేఖర్, కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. -
రాగన రామాపురం వాసికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు
సైదాపురం: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించినందుకు సైదాపురం మండలం రాగన రామాపురం గ్రామానికి చెందిన కూరాకు గోపికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని ఎీల్వీ ప్రసాద్ ల్యాబ్లో ఆదివారం సాయంత్రం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రత్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్–19, హుద్ హుద్ తుపాన్ వంటి విపత్కర పరిస్థిలోనే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, చెట్లు, నాటడం, చలివేంద్రాలు తదితర సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందించారు. ఈ సందర్భంగా కురాకు గోపి తనని అవార్డుకు ఎంపిక చేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నెల్లూరు తిరుపతి జిల్లాలో కో–ఆర్డినేటర్ మోపూరు భాస్కర్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. -
గుండె మంటలు.. ఆకలి కేకలు!
తిరుపతి జిల్లా, కపిలతీర్థం సమీపంలోని శివజ్యోతి నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంధుల శరణాయంలోని బధిరులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్కు విచ్చేసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీకి సమస్యలు మొరపెట్టుకున్నారు. చూపు లేదు.. కానీ గుండె నిండా ఆవేదన ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ అంధుల శరణాలయంలో నిలువ నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ వేధింపులు భరించలేక పోతున్నామని వాపోయారు. అంధుల శరణాలయం నుంచి విచ్చేసిన మర్రిపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘అయ్యా మాకు చూపు లేదు.. ఏడీ వినోద్కుమార్కు మేమంటే ఇంత అలుసా..?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే దిక్కెవరు అని ప్రశ్నించారు. ఏడీ తమపై అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, శరణాలయంలో సమయానికి భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఏమి అడిగినా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ప్రశ్నిస్తే మానసిక వేధింపులు, బెదిరింపులే సమాధానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే న్యాయం చేయాలంటూ కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు అందులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సమస్యను విన్నవించేందుకు వెళుతున్న అంధులు ఏడీ వేధింపుల నుంచి కాపాడాలని కన్నీరు మున్నీరవుతున్న అంధులు -
ప్రభుత్వ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సీఎండీ శివశంకర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మరింత మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు స్మార్ట్ మీటర్లను ఆమర్చడం జరుగుతోందన్నారు. సంస్థ పరిధిలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 16,802 తిరుపతి జిల్లాలో 19,460, చిత్తూరు జిల్లాలో 13,871, అన్నమయ్య జిల్లాలో 13,311, కడప జిల్లాలో 16,829, అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717, కర్నూలు జిల్లాలో 10,457, నంద్యాల జిల్లాలో 9,836 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు తెలిపారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, ప్రీ–పెయిడ్ మీటర్లకు రీచార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, తదనుగుణంగా విద్యుత్ను ఆదా చేయడంతో బిల్లును కూడా తగ్గించుకోచ్చన్నారు. అలాగే విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ సీఎండీకి 39 వినతులు అందాయని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సంస్థ డైరెక్టర్లు గురవయ్య, పి.అయూబ్ ఖాన్, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఆర్ పద్మ, జే రమణాదేవి, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్, ఎం.కృష్ణారెడ్డి, కే సంపత్ కుమార్, సీహెచ్ రామచంద్ర రావు, జనరల్ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్, చక్రపాణి, లత తదితరులు పాల్గొన్నారు. -
స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారికి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలంకరించేందుకు చైన్నెకు చెందిన దొరై నాగరాజన్ అనే వ్యాపారవేత్త సోమవారం పట్టువస్త్రాలను అందజేశారు. వీటిని ఆలయ ఈఓ బా పిరెడ్డి స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చే శారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వా మి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీసిటీని సందర్శించిన ఎస్పీఎంజీ బృందం శ్రీసిటీ (వరదయ్యపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (ఎస్పీఎంజీ) అధికారుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించి, కీలక పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించింది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య ప్రాజెక్టుల సమయానుకూల అమలును పర్యవేక్షించడం, వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ గ్రూప్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎస్పీఎంజీ బృంద సభ్యుడు హర్షద్ పోలాకి నేతృత్వంలో శ్రీసిటీలో పర్యటించి, ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీసిటీలోని అక్సెలెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సమీపంలోని అపోలో టైర్స్ పరిశ్రమల నిర్మాణాల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఎస్పీఎంజీ చేపడుతున్న ఈ తరహా సమీక్షలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. -
బాబువి దుర్మార్గపు ఆలోచనలు
నాయుడుపేట టౌన్: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దుష్ప్రాచారం చేస్తున్న చంద్రబాబు తన దుర్మార్గపు ఆలోచనలను ఇంకా విడిచి పెట్టలేదని, రాజకీయాలకు కలియుగ వేంకటేశ్వరస్వామిని వాడుకుంటూ నీచంగా వ్యవహరిస్తున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేట ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎలాంటి కొవ్వు లేదని అత్యున్నత న్యాయస్థానం క్లీన్చిట్ ఇచ్చిందన్నారు. దీంతో అసత్యప్రచారం చేస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, కోట్లాదిమంది భక్తులు ఛీదరించుకుంటున్నారన్నారు. చంద్రబాబు నిజాలు అంగీకరించి, వెంకన్న భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, దర్యాప్తు జరిపిన సంస్థలతోపాటు దీనిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేస్తూ ఇళ్లను తగులబెడుతూ గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్యాదవ్, పాదర్తి హరినాథ్రెడ్డి మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కటకం జయరామయ్య, బైనా మల్లిఖార్జునరెడ్డి, వేణుంబాక మునస్వామినాయుడు, రత్నశ్రీ, గంధవల్లి సిద్దయ్య, తేజారెడ్డి, షేక్ షబ్బీర్, మెస్ భాస్కర్రెడ్డి, ఆకుతోట సుబ్బారెడ్డి, నిడిగింటి చిట్టిబాబు, తన్నమాల రమణయ్య, కావేరిపాకం అశోక్కుమార్, కాలగంద సునీల్, పేట చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సోమవారం ప్రజా సేవలు బంద్
తిరుపతిఅర్బన్: సీఎం చంద్రబాబు 2047 విజన్ స మీక్ష అంటూ జిల్లాలోని ఉద్యోగులందరూ వర్చువల్ పద్ధతిలో హాజరుకావడంతో సోమవారం ప్రజా సేవ లు బంద్ అయ్యాయి. సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అన్ని విభాగాలకు చెందిన హెచ్ఓడీలు హాజరయ్యారు. అలాగే ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆ యా రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొ న్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు సమీక్షలో ఉన్నారు. గ్రామ సచివాలయ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమీక్షలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా సీఎం స మీక్షతోనే డ్యూటీలను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
చౌకదుకాణాల్లో నూనె ఊసేలేదు
పేదోడి సూపర్మార్కెట్గా పిలుస్తున్న చౌకదుకాణాల్లో నూనె విక్రయాల ఊసేలేకుండా పోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా బియ్యంతోపాటు నూనె, కందిపప్పు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా కేవలం బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. అరకొర చక్కర ఇస్తున్నారు. కందిపప్పు, నూనె ధరలు పెరుగుతున్నాయని, రాయితీతో ఇవ్వలేమంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో పేదలు నూనె, కందిపప్పును అధిక ధరలు చెల్లించి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. – నీలా, గృహిణి, తిరుపతి నెలనెలా వేరుశనగ నూనె ధర పెరిగిపోతుంది వేరుశనగ నూనె దశాబద్దాలుగా వాడుతున్నాం. అయితే ప్రతి వారం వేరుశనగ పప్పులు, నూనె ధరలు పెంచేస్తున్నారు. ఎందుకంటూ ప్రశ్నిస్తే జిల్లాలో వేరుశనగ పంట సాగుచేయడం లేదని, దాంతో ఉత్పత్తులు లేవంటున్నారు. మరోవైపు వేరుశనగ దిగుమతులు తగ్గాయంటున్నారు. వాటితో పేదోడికి ఎమీటీ సంబంధం. మాకు రూపాయి తగ్గిస్తే సంతోషపడతాం. రూపాయి పెంచితే బాధపడుతాం. ఈ ప్రభుత్వంలో పేదోడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. – మొగిలి ధనలక్ష్మి, గృహిణి చిట్టమూరు -
ఆర్థిక అక్షరాస్యత కీలకం
తిరుపతి అర్బన్: ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావుతో కలసి భారతీయ రిజర్వ్ బ్యాంక్కి చెందిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడానికి ప్రజల్లో అవగాహన పెంచాల ని తెలిపారు. బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రవికుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు, మధుసూదన్ పాల్గొన్నారు. తిరుపతి ఐసర్తో మెల్బోర్న్ వర్సిటీ ఎంఓయూ ఏర్పేడు: ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ యూనివర్సిటీతో తిరుపతి ఐసర్ విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, మెల్బోర్న్ గ్లోబల్ సెంటర్ ఢిల్లీ డైరెక్టర్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ డిప్యూటీ ప్రో వైస్చాన్సలర్ (ఇంటర్నేషనల్) ప్రొఫెసర్ ముత్తు పాండియన్ అశోక్కుమార్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో చురుకై న పరిశోధన, విద్యా సహకారానికి మద్దతు ఇవ్వడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మెల్బోర్న్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమీ కింద తిరుపతి ఐసర్, మెల్బోర్న్ యూనివర్సిటీ జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నాయన్నారు. -
చూతము రారండి..
శ్రీకాళహస్తి: పంచలింగాల్లో వాయులింగ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మూగజీవులు ముక్తి పొందిన దివ్యక్షేత్రంగా.. భక్తుల పాలిట భూకై లాసంగా.. శ్రీకాళహస్తి విరాజిల్లుతోంది. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ విశేషోత్సవాలు మంగళవారం భక్త కన్నప్ప ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం కానున్నాయి. ఈశ్వరునిపై అచంచల భక్తి,విశ్వాసాలు చాటిన భక్త కన్నప్పకు తొలి పూజ నిర్వహించిన తరువాతే ఈ దివ్యోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాత్రిగా పరిగణిస్తూ ఉత్సవాలను జరపడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వర్ణముఖి నది వంతెనపై నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం రాత్రి శోభాయమానంగా దర్శనమిచ్చింది. నేటి నుంచి మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ, 11న శ్రీకాళహస్తిశ్వరస్వామి ధ్వజారోహణం, వెండి అంబారి వాహనసేవ, 12న ఉదయం స్వామివారు సూర్యప్రభ అమ్మవారికి చప్పర వాహనసేవ, 13న ఉదయం హంస, యాళి వాహనసేవ, రాత్రి రావణ మయూర వాహనసేవ 14న ఉదయం హంస, శుక వాహనసేవ, రాత్రి శేష, యాళి వాహనసేవ, 15న మహాశివరాత్రి, ఉదయం ఇంద్ర విమానం, చప్పర సేవ, రాత్రి నంది సేవ, సింహ వాహనసేవ, 16న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరగనుంది. 17న ఉదయం అధికార నంది, కామధేనువు, రాత్రి గజ, సింహవాహనసేవ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం, 18న ఉదయం రుద్రాక్ష , అంబారి సేవ, రాత్రి సభావతి కల్యాణం, 19న అంబారి వాహనసేవ, రాత్రి ఆశ్వం, సింహ వాహన సేవ, 20న ధ్వజావరోహణం, 21న వల్లకీ సేవ, 22న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ (మాఘ బహుళ అష్టమి) మధ్యాహ్నం 2.55గంటల నుంచి ప్రారంభం ఉభయదాతలు శ్రీబోయ కులస్తుల వారి సంఘం, శ్రీకాళహస్తి. -
రూ.50 వేలు చందాకు హిజ్రాల డిమాండ్
నాగలాపురం: మండలంలోని వజ్జావారి కండ్రిగ గ్రావెల్ క్వారీ వద్ద సోమవారం కొందరు హిజ్రాలు ఓం శక్తి మాల ధరించి మలయనూర్ అమ్మవారి గుడికి వెళుతున్నామని రూ.50 వేలు చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆ గ్రావెల్ క్వారీ యజమాని రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. హిజ్రాలు తమకు రూ.5 వేలు వద్దు..రూ.50 వేలు కావాలని మొండి పడి డిమాండ్ చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు క్వారీ వద్దకు చేరుకుని హిజ్రాలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఇంకెప్పుడు ఇలా డబ్బులు డిమాండ్ చేయమని హిజ్రాలు పోలీసులను బతిమలాడడంతో పోలీసులు వారి పేర్లు, వివరాలు తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. -
రీసర్వేలో న్యాయం జరగలేదు
ఈ రైతు పేరు ఫాల్గుణరెడ్డి. తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేట గ్రామానికి చెందిన రైతుకు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. దీనికి కారణం ఆ భూమి ఇనాం భూములుగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. రీసర్వే పూర్తి చేసిన తరువాత పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆ రైతు ఎంతో ఆశపడ్డాడు. రీసర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. పట్టాదారు పాసుపుస్తకం రాకపోవడానికి ప్రధాన కారణం రీసర్వే ప్రక్రియ ద్వారా ఆన్లైన్ కరెక్షన్ చేయడానికి వెబ్ ల్యాండ్లో అవకాశం లేకపోవడమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ రైతు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం కోసం ఎదురు చూస్తూనే ఉ న్నాడు. సమస్యలకు లేదు పరిష్కారం వరదయ్యపాళెం: ఇతని పేరు అత్తిపట్టు రాంబాబు. వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. తొలివిడతలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తండ్రి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమి పూర్తిస్థాయిలో ఇతని పేరిట ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఆయన తల్లి పేరిట ఒకటిన్నర ఎకరానికి గత ఏడాది ఈ–పాస్బుక్ వచ్చింది. అయితే ప్రస్తుత నూతన పాసుపుస్తకాల్లో ఆమె పేరు లేదు. కేవలం అతని పేరిట 55 సెంట్లకు మాత్రమే పాసుపుస్తకం వచ్చింది. ప్రస్తుతం రీసర్వే కార్యక్రమంలో తన పేరిట మార్చుకునేందుకు ఆన్లైన్లో ఆప్షన్ విడుదల చేయలేదు. తప్పుల తడకగా రీ సర్వే ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు చంద్రశేఖర్. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట సమీపంలోని వడ్డిపల్లి. ఇతనికి భాకరాపేట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 180/బిలో 2.18సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఆ విస్తీర్ణం 2.05 ఎకరాలకు కుదించారు. తన భూమి ఎందుకు తగ్గిందని ఆ రైతు అడిగితే అదంతేనని చెప్పి సర్వేయర్లు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం రీసర్వే ప్రక్రియలో యంత్రాలు పెట్టి డ్రోన్ల సాయంతో కొలతలు వేయడం, సరిహద్దులు సరిగా గుర్తించక పోవడంతోనే విస్తీర్ణం తగ్గిపోయిందని ఆ రైతు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్కు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఆయనకు జవాబు చెప్పే వారు లేరు. -
మహా శివరాత్రికి సర్వం సిద్ధం
శ్రీకాళహస్తి: మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తిలో సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నుంచి 14రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆదివారం నాటికి మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ధూర్జటి కళాప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభంశ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు 10న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది. 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కల్యాణం, 19నన గిరిప్రదక్షిణ, 21న పల్లకీసేవ, 22న ఏకాంతసేవ, 23న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సి ఉన్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం(8వ తేదీ) ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, డివిజన్ స్థాయి అధికారులు, తహశీల్దార్లుతో సమీక్ష ఉందని తెలిపారు. ఈ క్రమంలో పీజీఆర్ఎస్ను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని వివరించారు. ధ్వనులపై పరిశోధకుల అధ్యయనం ఏర్పేడు: మండలంలోని జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో వారం రోజులపాటు అడ్వాన్స్డ్ బయో అకౌస్టిక్స్ వర్క్షాపు ముగిసింది. న్యూయార్క్కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కెలిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయోఅకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనుల అధ్యయనాలపై పరిశోదకులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వర్క్షాప్లో భాగంగా ఆదివారం రేణిగుంట మండలం మామండూరు అటవీ క్షేత్రాన్ని పర్యటించి, అక్కడ వృక్షాలపై ఉన్న జంతుజాలాల ధ్వనులపై అధ్యయనం చేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఘనంగా స్పోర్ట్స్ డే తిరుపతి తుడా: స్విమ్స్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూనిఫెస్ట్–2026 పేరుతో స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్విమ్స్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్తోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మట్లాడుతూ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా నెల రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందుతో భాగంగా స్పోర్ట్స్ డేని నిర్వహించామన్నారు. క్రీడాపోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అలోక్ సచిన్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, ప్రిన్సిపల్ డాక్టర్ ఉషాకలవత్, స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్, వైద్యాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
కల్తీని కడిగేద్దాం!
కూటమి పాపాలపై ఆ దేవదేవుడే శిక్షిస్తాడు తిరుపతి మంగళం: శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ జరగలేదని, చంద్రబాబు, పవన్కళ్యాణ్ మనసులే కల్తీ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్, ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్ ధ్వజమెత్తారు. తిరుపతిలో లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద నుంచి అలిపిరి వరకు కూటమి నాయకులు అపవిత్రం చేస్తూ నడిచిన రోడ్లను ఆదివారం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, మహిళలు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంతో నీచ రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తూ, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్ మాట్లాడుతూ తిరుపతి పుణ్య క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు కూటమి నాయకులు పసుపు దుస్తులు ధరించి దొంగ దీక్షలతో తిరుపతిలో పాదయాత్ర చేపట్టి నెయ్యిలో కల్తీ చేశారంటూ నమ్మబలికించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లడ్డూ భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుల్లయ్య, తలారి రాజేంద్ర, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, దినేష్రాయల్, పార్టీ సీనియర్ నాయకులు తుడా వెంకటరెడ్డి, నాయకులు రాజేష్, కడపగుంట అమరఽనాఽథ్రెడ్డి, చంద్రయ్య, వెంకటేష్రాయల్, కోటి, స్వరూప్, ఆటో ప్రసాద్, బాలాజీ, ధనశేఖర్, విజయలక్ష్మి, పద్మజ, శాంతారెడ్డి, పునీత, పుష్పాలత, యశోద, పావని తదితరులు పాల్గొన్నారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సైదాపురం: చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ వెంకటగిరి నియోజవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా చంద్రబాబు, పవన్ కల్యాణ్లతోపాటు ఇప్పుడు పయ్యావుల కేశవులు కూడా తమ తీరును అస్సలు మార్చుకోవడం లేదన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిరాధారమైన ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎవరూ తప్పు చేయలేదని, జంతువుల కొవ్వు కలపలేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చారన్నారు. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి నేతలు బరి తెగించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగిందనే భ్రమలో ప్రజలను ఉంచేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో చిట్టేటి హరికృష్ణ,ఽ బాలయ్య, ధనియాల రాధ, శ్రీనివాసులురెడ్డి, ఆరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాసులు ఇస్తేనే.. అటెండెన్స్ మ్యాపింగ్!
తిరుపతి తుడా: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. చేయితడిపితే చాలు ఏ పని కావాలన్నా క్షణాల్లో పని అయిపోతుంది. డిప్యూటేషన్పై పనిచేస్తున్న సీసీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారు. సరెండర్ లీవ్ బిల్లు అనుమతి కావాలంటే ఒక్కొక్క ఉద్యోగి రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిందే. వైద్యులైనా, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులైనా సరే లంచం చెల్లిస్తేనే ఫైలు కదులుతుంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ, సూపరింటెండెంట్, యూడీసీలకు వేర్వేరు ఽమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏదో ఒక సాకుతో పెండింగ్లో పెట్టి కాళ్లు అరిగేలా తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. దీంతో ఉద్యోగులు ఎందుకు ఆ తలనొప్పిని వారు చెప్పిన డబ్బులు ముట్టజెప్పి పనులు చేసుకుని వెళ్తున్నారు. -
భూమి.. అధికార పార్టీ పరం!
రేణిగుంట: పట్టణంలోని అధికార పార్టీలోని ఒక వర్గం వివేకానంద కాలనీ పక్కన గత ప్రభుత్వంలో నిర్మించుకున్న 22 ఇళ్లపై కన్నేసింది. ఆ ఇళ్లను ఎలాగైనా తొలగించి తాము సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తి తెస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో 22 ఇళ్లను వాగు పోరంబోకులో నిర్మించుకున్నాని, గత వారంలో నోటీసులు అంటించారు. ఆదివారం తెల్లవారుజామున జేసీబీలు తీసుకొని వచ్చి అన్ని ఇళ్లను నేలమట్టం చేశారు. రెవెన్యూ వారు చెబుతున్నట్లు 769 సర్వేనెంబర్ లో వివేకానంద కాలనీ ఏర్పాటు దాదాపు 30 సంవత్సరాలైంది. కాలనీకి ఉత్తరాన కాలువ ఉండగా కాలనీకి దక్షిణాన ప్రైవేట్ భూమికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గత ప్రభుత్వంలో పట్టణానికి చెందిన వారు అప్పటి రెవెన్యూ అధికారుల అనుమతితో రేకుల ఇళ్లను నిర్మించుకున్నారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నిర్మించుకున్నారనే కక్షతో పాటు ఆ భూమిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో పట్టణానికి చెందిన అధికార పార్టీలోని ఒక వర్గం నాయకులు పన్నాగం పన్ని అడుగులు వేస్తున్నారు. వాగు పొరంబోకుని అధికార పార్టీలోని ఒక వర్గం నాయకుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పరశురామేశ్వరునికి మహత్కార్యం
●ఏర్పేడు: గుడిమల్లం పరశురామేశ్వరాలయం.. దేశంలోనే తొలి శైవక్షేత్రం. క్రీ.పూ.2వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం శోభాయమానం. ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం గతంలో ఎప్పుడు నిర్వహించారో తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అలాంటి మహత్తర ఘట్టానికి శివాజ్ఞ లభించింది. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పరశురామేశ్వరుని మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఇదీ చరిత్ర పరశురామేశ్వర స్వామివారి విగ్రహం స్వయంభువుగా వెలసి 5 అడుగుల పురుషలింగాకృతిలో కనిపిస్తుంది. విగ్రహంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసావతారంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవ పురుషలింగాకృతిలో ఈశ్వరుడితో విగ్రహం ఉంది. నవపాషాణ శివలింగం(9 రకాల విష పదార్థాలతో కూడిన లింగం) దేశంలో మరెక్కడా లేదు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆలయ నిర్వహణ ఎన్నో ఏళ్లుగా కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. చివరిసారిగా ఇక్కడ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం ఎప్పుడు జరిగందనే ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలేమీ లేవు. అయితే మహాకుంబాభిషేక మహత్కార్యం నిర్వహించేందుకు శివాజ్ఞ లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23వ తేదీన 60 మంది పూజారులతో ఆలయ మహాకుంభాభిషేకం చేయనున్నారు.ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వరాలయం (ఇన్సెట్) గర్భాలయంలోని పరశురామేశ్వరుని విగ్రహంశివయ్య అనుగ్రహం గతంలో ఎప్పుడు చేశారో కూడా తెలియని గొప్ప దైవకార్యం గుడిమల్లం ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవానికి శివయ్య అనుగ్రహంతో నభూతో.. నభవిష్యతి అన్న రీతిలో జరగనుంది. గుడిమల్లం క్షేత్రంలో పూర్వపు ఆలయ కళాసౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. – వంశీకృష్ణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు జన్మ చరితార్థం గుడిమల్లం పరశురామేశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవం జరిపించే అవకాశం పరమశివుడు నాకు కల్పించడం పూర్వ జన్మసుకృతం. చారిత్రక ఘట్టానికి సంబంధించి ఆలయంలో పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకను నిర్వహించడంతో నా జన్మ చరితార్థమవుతుంది. – రామచంద్రారెడ్డి, ఈఓ, గుడిమల్లం ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా మహా కుంబాభిషేకం గుడిమల్లం పరశురామేశ్వరాలయ కుంబాభిషేక మ హోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదాయశాఖ, పురావస్తు శాఖ సమన్వయంతో ఈ వేడుకలో పాల్గొనే సువర్ణావకాశం దక్కడం ఎన్నో జన్మల పుణ్యఫలం. – బత్తల గిరిబాబు, గుడిమల్లం ఆలయ చైర్మన్ -
వీఆర్ఏపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్: ఈ నెల 4వ తేదీన విధులు నిర్వహిస్తున్న ఓబనపల్లి వీఆర్ఏ మణెయ్యపై ఇద్దరు కారంపొడి చల్లి కత్తితో పొడిచి పారిపోయారు. ఈ కేసులో నిందితులను ఆదివారం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యలో అనంతరాజుపేట వద్ద అరెస్ట్ చేశారు. వారి నుండి ఆయుధాలు, మోటార్సైకిల్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన నిందితులు అనరాతి శ్రీనివాసులు, కులశేఖర్ పాత కక్షలు మనసులో పెట్టుకొని మణెయ్యపై దాడి చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న మణెయ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
చెరువును పంచేసుకుంటున్నారు
తిరుపతి నగరంలో అతి విలువైనది కొంకచెన్నాయిగుంట చెరువు. ఈ ప్రాంతంలో నివాసస్థలాలకు మంచి డిమాండ్ ఉండడంతో టీడీపీ, జనసేనకు చెందినవారు ఆక్రమించుకున్నారు. గతంలో మాజీ సైనికోద్యోగులకు పట్టాలు ఇచ్చినా... వారినీ ఆ స్థలంలోకి అడుగుపెట్టనివ్వలేదు. అంతటితో ఆగని పచ్చ బ్యాచ్ ఏకంగా మాజీ సైనికోద్యోగులు తమకు అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు. ప్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. చెరువు ఆక్రమణకు గురైందని పలుమార్లు మీడియా, పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతీసారి రెవెన్యూ అధికారులు వచ్చి తాత్కాలిక షెడ్లు తొలగించి చేతులు దులిపేసుకుని వెళ్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్కి కూతవేటు దూరంలో కొంకచెన్నాయిగుంట చెరువు పోరంబోకు ఉంది. వైఎస్ఆర్ సీపీ హయాంలో మాస్టర్ప్లాన్ రోడ్లు వేయడంతో నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఈ చెరువు పోరంబోకు ఇప్పుడు అత్యంత విలువైనదిగా మారింది. కోట్ల రూపాయలు విలువజేసే ఈ చెరువును ఆక్రమించుకుని అమ్మి సొమ్ము చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పక్కా పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 1992లో 35 మంది స్వాతంత్య్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం ఆ చెరువు పోరంబోకు భూమిని నివాస స్థలాల కోసం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన వారు పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంతకు ముందే మరో 13 మంది ఆ చెరువు పోరంబోకు భూమిని 1983లో తమకు విక్రయించారని మరో వర్గం వారు అడ్డుకున్నారు. మళ్లీ ఆక్రమణలు అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కొందరు ఆ చెరువు పోరంబోకు భూమిపై కన్నుపడింది. కొంకచెన్నాయిగుంట చెరువు వివరాలన్నీ తెలిసిన కూటమి నాయకులు సీపీఐ, సీపీఎంకి చెందిన కొందరి సహకారంతో రంగంలోకి దిగారు. తమకు ఇచ్చిన నివాస స్థలాలను స్వాతంత్య్ర సమరయోధులే వచ్చి 35 మందికి విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చెరువు పోరంబోకు భూమిని ప్లాట్లుగా విక్రయించడం ప్రారంభించారు. అంకణం రూ.25 వేల నుంచి రూ.50 వేలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రూ.లక్ష చొప్పున విక్రయిస్తున్నారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఈ చెరువు ఆక్రమణకు గురైనప్పుడు స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తాము ఎవ్వరికీ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని తీర్పు కూడా ఇచ్చారు. మేం చూసుకుంటాం.. కానిచ్చేయండి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతలు మరోసారి కొంకచెన్నాయిగుంట చెరువుపై దృష్టి పెట్టారు. నకిలీ పత్రాలతో నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. పత్రికలు, మీడియాలో వచ్చేలోపు నిర్మాణాలు పూర్తి చేసి విద్యుత్ మీటర్, ఇంటి పన్ను తీసుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. అక్రమార్కులు హడావిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధుల పీఏలు రంగంలోకి దిగడం గమనార్హం. -
అర్హత ఉన్నా ఫలితం శూన్యం
మాది పెనుమూరు మండలం చెరువ ముందర ఊరు. నా భర్త పేరు జ్యోతిశ్వర్నాయు డు. మాకు పార్థీవ్ చౌదరి అనే కుమారుడు ఉన్నాడు. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి శరీరం మొత్తం సహకరించడం లేదు. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు. పింఛన్ పొందేందుకు 90 శాతం అర్హత ఉన్నట్లు సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. అయినా కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. మండలం, జిల్లా అధికారుల చుట్టూ బిడ్డను ఎత్తుకుని ఎన్ని సార్లూ తిరిగినా న్యాయం జరగడం లేదు. కనీసం కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవరూ చెప్పడం లేదు. – కుమారుడు పార్థీవ్ చౌదరితో తల్లి ఎన్నిసార్లు తిరిగినా లాభం లేదు మాది తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామం. పింఛన్ కోసం ఇప్పటికి వంద సార్లు అధికారులు అర్జీలు అందజేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ పొందలేని పరిస్థితిలో ఉన్నాను. కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. – దశరథ, కొత్త పింఛన్ బాధితుడు -
సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష
తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతి, దేశ వికాసానికి సంస్కృత భాష ప్రతీకని టీటీడీ అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో నాలుగు రోజులుగా జరిగిన నేషనల్ టాలెంట్ ఫెస్ట్–2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. శనివారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధ్యాత్మికత మానవుని సన్మార్గంలో నడిపించే ఒక శక్తి అని చెప్పారు. అనంతరం పలు శాస్త్ర విభాగా ల్లో జరిగిన ప్రతిభా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా టోఫ్రీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, పూరిలోని జగన్నాథ సంస్కృత వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కిషోర్ చంద్ర పాడి, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ దక్షణమూర్తి శర్మ, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతం తిరుపతి రూరల్: పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో ‘‘నేషన్ వైడ్ రూల్ అవుట్ ఆఫ్ ఎన్పీఎస్టీ అండ్ ఎన్ఎంఎం’’ అన్న అంశంపై శనివారం రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అడ్వైజర్ డీకే చతుర్వేది మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ వి.ఉమ మాట్లాడుతూ సమాజంలోని ఉన్నతస్థాయి వ్యక్తులందరూ తమ గురువుల చేతిలో రూపుదిద్దుకున్నవారే అన్నారు. ఎన్సీటీఈ ఎన్ఎంఎం ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుని ముఖ్యవిధి అన్నారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో సామర్థ్యాలు పెంపొందించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నారు. వర్క్ షాప్లో ఎన్సీటీఈ సభ్యులు డాక్టర్ చంచల్ మల్హోత్రా, ప్రొఫెసర్ టి.జి అముదవల్లిలతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్ ఎదుట కామిరెడ్డి బైఠాయింపు పెళ్లకూరు: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి న్యాయం కోసం బైఠాయించారు. చిల్లకూరులోని మన్నేమత్తేరి చెరువుకట్టపై చాలా కాలంగా వేపచెట్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేష్, మరి కొందరు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికివేశారు. స్థానిక సర్పంచ్ పగడాల హరిబాబురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులు, వారు ఉపయోగించిన ఆటో, పనిముట్లను అప్పగించి, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేలోపు పోలీసులు నిందితులను వదిలేశారు. దీంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పోలీస్స్టేషన్కు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, ఇచ్చిన ఫిర్యాదుపై రసీదు ఇచ్చే వరకు పోలీస్స్టేషన్ నుంచి కదిలేదిలేదని బైఠాయించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు వచ్చి ‘పోలీస్స్టేషన్ వద్ద ఎందుకు కూర్చున్నావు? రసీదు ఇవ్వడానికి నువ్వు ఫిర్యాదు ఇచ్చావా?.. ముందు స్టేషన్ దాటి అవతలకు వెళ్లు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకట్టపై ఉన్న వేప చెట్లు నరికిన నిందులను పోలీసులకు పట్టించినప్పటికి కేసు నమోదు చేయకుండా వదిలేసిన పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సత్యనారాయణరెడ్డి కోరారు. ఈవిషయమై సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. -
తిరుపతిలో తిరువళ్లూరు ముద్దాయిలు మకాం
తిరుపతి అర్బన్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురు నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దాయిలు ఇటీవల తిరుపతిలో మాకాం వేసినట్లు సమాచారం ఉందని తిరువళ్లూరు కలెక్టర్ ఎం. ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువళ్లూరు కలెక్టర్తోపాటు ప లువురు ఆ జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పలు అంశాలపై సమీక్షించారు. తిరువళ్లూరు కలెక్టర్ మాట్లాడుతూ తమ జిల్లాలో పలు కేసులు ఉన్న పలువురు వ్యక్తులు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో వారికి అడ్డుకట్టవేయాల్సి ఉందని, మరోవైపు వారి సమాచారం లభించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూత వేయాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తప్పకుండా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. నకిలీ ఓటర్లను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం దుకాణాలు తప్పకుండా మూత వేస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ సుబ్బరాయుడు మాట్లాడు తూ నాన్బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దా యిలు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటే వారిని తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి, డీఆర్వో నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి జిల్లా నుంచి పాల్గొన్నారు. -
22 కిలోల గంజాయి స్వాధీనం
– ముగ్గురి అరెస్టు వెంకటగిరి రూరల్: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టణంలోని వెంకటగిరి పోలీసుస్టేషన్లో శనివారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి పెనుబర్తి గణేష్తోపాటు మరో ఐదుగురు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు రహస్య సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు తనిఖీ చేశారు. వారి వద్ద 22 కిలోల గంజాయిని ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఇద్దరు యువకులు పరారయ్యారు. ఇద్ద రు మైనర్ బాలురతోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశా రు. వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, 22 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్టు తిరుపతి రూరల్: మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథ నం మేరకు.. ఉప్పరపల్లి వాటర్ ట్యాంకు వద్ద శనివారం రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తమ సిబ్బందితో అక్కడ కు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చే శారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయితో పా టు ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కె. దుర్యోధన్రెడ్డిగా గుర్తించిన పోలీసులు తిరుపతిలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
సెమీ కండక్టర్ల హబ్గా భారత్
నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. -
10న వెటర్నరీ వర్సిటీలో కిసాన్ మేళా
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన ఐసీఏఆర్, ఎన్ఎంఆర్ఐ సౌజన్యంతో కిసాన్ మేళాను నిర్వహించనున్నట్లు పశు వైద్యకళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్ మేళాలో పశుసంవర్థక, వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల వారీగా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కిసాన్ మేళాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రుణ సదుపాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు తిరుపతి అర్బన్: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని డీఆర్వో నరసింహులు, న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన అబ్జర్వర్ అజయ్జోషి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని రెండు సెంటర్లలో రెండు సెషన్స్ల్లో ఆదివారం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఉదయం పేపర్–1 పరీక్ష 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–ఏ), శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–బీ) సెంటర్లలో 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లును లైజన్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డుతో వస్తేనే అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే విద్యుత్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
పింఛనే శ్వాస..
జాడ లేని ఎన్టీఆర్ భరోసా ●చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడ మంజూరు చేయకపోగా కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేసుకుంది. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్ అనే ధోరణిలో బాబు సర్కారు వ్యవహరిస్తోంది. రెండేళ్లు ఒక కొత్త పింఛన్ కూడ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను రాజకీయ రంగును పులిమి తొలగించింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో మూడు రెవెన్యూ డివిజన్లు 36 మండలాల పరిధిలో 22,99,699 మంది జనాభా ఉన్నారు. పింఛన్ల పంపిణీ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని డప్పులు కొట్టుకుని ప్రచారం చేస్తున్న చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరుపై అలసత్వం వహిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఒక్క కొత్త పింఛన్ సైతం మంజూరు చేయలేయని దుస్థితి. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే వంద లాది మంది అర్హులు పింఛన్లు మంజూరు చేయండి సారూ అంటూ మొరపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పింఛన్ అర్జీదారులకు న్యాయం చేయలేక ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రతి వారం పీజీఆర్ఎస్లో అర్జీలే కొత్త పింఛన్లు మంజూరు కోసం అర్హులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ ఇవ్వాలంటూ అధికారుల ఎదుట తమ గోడును విన్నవించుకుంటున్నారు. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల మంజూరుకు పీజీఆర్ఎస్లో 20,452 అర్జీలు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అర్జీల్లో ఒక్కరికి కూడా న్యాయం చేయలేని నిస్సహయతలో అధికారులు మిన్నకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లే చంద్రబాబు సర్కారు ఎమ్మెల్యేలకు సైతం చేదు అనుభవం ఎదురవుతోంది. ఒక్క పింఛన్ ఇప్పించలేని ఎమ్మెల్యేతో లాభమేమి అంటూ అర్హులు విమర్శలు గుప్పిస్తున్నారు.కుప్పానికి ప్రత్యేక రూల్ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను అందజేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుని నియోజకవర్గం అయినప్పటికీ గత సర్కారులో 35,637 మందికి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుత సర్కారులో ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ మిగిలిన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారు. నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కుప్పానికి మాత్రం ప్రత్యేక రూల్ అనే ధోరణిలో 3,895 కొత్త పింఛన్లను మంజూరు చేశారు. మిగిలిన నియోజకవర్గాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా మోసం చేస్తున్నారు. పింఛన్ల కోతకే ప్రాధాన్యం చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరు కంటే ఉన్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,183 మందికి పింఛన్లు అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జిల్లాలో 2,64,902 పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 19,500 మంది పింఛన్లను తొలగించి అర్హుల పొట్ట కొట్టారు. వేల సంఖ్యలో పింఛన్లను తొలగించడంతో బాధితులు చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.పింఛన్ కోసం ఎదురు చూపులు మాది తవణంపల్లి మండలం చింతమాకులపల్లి గ్రామం. నా కుమార్తె నివేదిత దీర్ఘకాల వ్యాధితో చాలా రోజులుగా ఇబ్బంది పడుతోంది. దినచర్యలో సొంతంగా ఏ పనిచేసుకోలేక కండరాల బలహీనతతో అవస్థలు పడుతోంది. ఇప్పటికే వైద్యం కోసం స్థోమత ఉన్నంత వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందించే రూ.15 వేల పింఛన్ కోసం అధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తే మాకు న్యాయం చేసినట్టవుతారు. – కుమార్తె నివేదితతోఈశ్వర్ మంచం పట్టినా మంజూరు కాలేదు మాది తవణంపల్లి మండలం ఏ గొల్లపల్లి పంచాయతీ వడ్డిఇళ్లు గ్రామం. మేసీ్త్ర పనిచేస్తేనే మా కుటుంబం ముందుకుసాగుతుంది. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నా భర్త మేసీ్త్ర పని చేస్తుండగా కిందపడి కాళ్లు, చేయి, తలకు పెద్ద గాయాలు అయ్యాయి. పనికి వెళ్లలేని దుస్థితి. మంచానికే పరిమితమయ్యాడు. వికలాంగ పింఛన్ కోసం చాలా సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. నెలలు గడుస్తున్నా మాకు కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు కొత్త పింఛన్ల ఇస్తారో అర్థమే కావడం లేదు. – బాధితుడు సుబ్రహ్మణ్యం, పిల్లలతో భార్య లోకేశ్వరి -
ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి!
టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతూ.. చిత్తూరు అర్బన్ : ‘‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. అదే సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పడిన సీబీఐ–సిట్ కమిటీ తొమ్మిది నెలలు విచారించి శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వు లేవని కోర్టుకు రాతపూర్వక నివేదిక ఇచ్చింది. ఇంకేం చెప్పాలి చంద్రబాబు నాయుడు..? మరేం రాయాలి..? మీ ప్రతి ఒక్క మా ట లో అసహనం, అభద్రత కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని హైందవ వ్యతిరేకిగా చూపిస్తూ, లడ్డూ అనే బాంబును ఆయుధంగా చేసుకుని వైఎస్సార్ సీపీపై బురద చల్లడానికి పవన్ కళ్యాణ్, పచ్చ పత్రికలతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీకు గుణపాఠం తప్పక చెబుతారు’’ అంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సిట్–సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో 32 మందిని కల్తీ నెయ్యిలో బాధ్యులుగా చూపిందని, ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. పైగా జంతుకొవ్వు లేదనే విషయాన్ని కూడా ప్రస్తావించిందన్నారు. ఈ నివేదికను జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు తన కుట్రలతో వైఎస్.జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త ఈ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019–24 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై విచారించిన సిట్.. 2014–19 మధ్యలో సరఫరా చేసిన నెయ్యిపై సైతం దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడుతాయన్నారు. టీటీడీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డి, అటుపై వైఎస్ జగన్కే సాధ్యమయ్యిందన్నారు. చిత్తూరులో అమలు కావడం సంతోషం జిల్లా అనుబంధ కమిటీల టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవాలని వైఎస్.జగన్ చెబుతున్న 2.0 కార్యక్రమం.. చిత్తూరులో అమలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యం వైఎస్.జగన్ హయంలోనే జరిగిందన్నారు. పార్లమెంటు పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న తప్పుల్లో సింహభాగం బాధ్యత పవన్ కళ్యాన్దేన్నారు. ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నారన్నారు. తన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రాయలసీమ ప్రాజెక్టులకు తాకట్టుపెట్టిన వ్యక్తిగా బాబు చరిత్రకెక్కారన్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ లడ్డూల విషయంలో బాబుకు తగిన శిక్ష శ్రీవారే విధిస్తారన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారని, వైఎస్సార్సీపీలో ఇక నుంచి కార్యకర్తలదే భవిష్యత్తన్నారు. గ్రామ కమిటీలు చెప్పిందే వైఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తారని, వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కెపి.శ్రీధర్, రూరల్ అధ్యక్షుడు జయపాల్, గుడిపాల అధ్యక్షులు ప్రకాష్, నాయకులు చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, విజయసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు హాజరైన పార్టీ శ్రేణులవిజయానందరెడ్డితో కలసి ప్రసంగిస్తున్న భూమన కరుణాకర రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతోందన్నారు. అమిత్ షా శిష్యుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి సభ్యుడు సౌరబ్ బోరా నాడు రూ.30 లక్షలు వెచ్చించి అయోధ్యకు లక్ష శ్రీవారి ల డ్డూలు తీసుకెళ్లాడని, అతను లడ్డూల తయా రీకి కల్తీ నెయ్యిను ఉపయోగించాడనే వి షయం పవన్ కళ్యాణ్కు సైతం తెలుసన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని, వైఎస్.జగన్కు ఇందులో సంబంధంలేని మాట్లాడిన పవన్కళ్యాణ్.. రెండు రోజుల్లో మళ్లీ కొవ్వు కలిపారని, జగన్కు సంబంధం ఉందని చెప్పడం అబద్దాలతో రాజకీయం చేయడమేనని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. -
పట్టపగలే నగల చోరీ
పాకాల: పట్టపగలే రోడ్డు పక్కన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నేండ్రగుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. నేండ్రగుంటకు చెందిన రవి ఇంటికి తాళం వేసుకుని మధ్యాహ్నం సుమారు 12.30 నుంచి 1.30 గంటల ప్రాంతంలో తన కుమారుడి షాపు వద్దకు వెళ్లాడు. అలాగే ఆ ఇంటిపైన అద్దెకు ఉన్న వాసు ఇంటికి తాళం వేసుకుని దైవదర్శనం కోసం కాణిపాకం వెళ్లాడు. వాసు వినాయకస్వామి దర్శనం ముగించుకుని స్కూటర్లో ఇంటి వద్దకు రావడంతో దుండగులు మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడం గమనించాడు. వాసు ఇంటిపైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగల గొట్టి ఉండడం గుర్తించారు. రవి ఇంట్లో తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నెక్లెస్, కమ్మలను చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ ఇళ్లను పరిశీలించారు. ఈ మేరకు ఎస్ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎస్హెచ్ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక
పుత్తూరు : మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ (పీఎస్హెచ్ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్హెచ్ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా నియమించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.మధుసూదన్రాజు (తిరుపతి రూరల్), కోశాధికారిగా కె.నరేష్ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్), అసోసియేట్ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. తిరుపతిలో రోడ్డు ప్రమాదం ఇంటర్ విద్యార్థి మృతి తిరుపతి క్రైం: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మూల వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య కుమారుడు బాబు (17) ఉద్యోగం కోసం తిరుపతికి వచ్చి పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో స్నేహితుడు హరికృష్ణతో కలిసి స్కూటీపై ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ పక్కన ఉన్న సందు దారి నుంచి ప్రధాన రోడ్డులోకి వస్తుండగా, టీవీఎస్ సర్కిల్ వైపు నుంచి అన్నమయ్య సర్కిల్ దిశగా అతివేగంగా వచ్చిన బైక్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.12 గంటలకు మృతి చెందాడు. మృతుడి అన్న పల్లపు రమణ కుమారుడు పల్లపు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి వెంకటగిరి రూరల్: కరెంట్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాంపాళేనికి చెందిన ఈగ రమణయ్య (52) గురువారం గొడ్డేరువాగు సమీపంలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు రమణయ్యకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణయ్య మృతి చెందడంతో కాంపాళెం ప్రాంతంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. -
సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి
నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి సినీ నటి మీనాక్షి చౌదరి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్డ్స్డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సినీ నటి మీనాక్షిచౌదరి హాజరయ్యారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన వారికి కృష్ణయ్య, మీనాక్షిచౌదరి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరకంగానూ, మానసికంగానూ ధృఢంగా ఉంటేనే చదువుపై దృష్టిని సారించే అవకాశం ఉంటుందన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. దేహ ధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ శనివారం పూర్వ విద్యార్థుల అలుమిని డే, ఆదివారం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సినీ హీరోయిన్స్ నిధి అగర్వాల్, శ్రీలీల, హీరో తేజా సజ్జా, తమన్ సంగీత విభావరి, నటరాజ్ ట్రూప్ నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. -
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీకాళహస్తి : ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉచిత దర్శనానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ బలోపేతం, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి శివరాత్రిని కొత్త శివరాత్రిలా భావించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాచుర్యం ఉందని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బాల్యవివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి స్వామి, అమ్మవార్ల పసుపు,కుంకుమ పాకెట్ క్యాలెండర్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడతామని ఆలయ ఈఓ బాపిరెడ్డి చెప్పారు. -
ఎమ్మెల్యే గారూ..అసెంబ్లీలో మాట్లాడండి
తిరుపతి అర్బన్: ‘ఎమ్మెల్యే గారూ.. అసెంబ్లీ సమావేశాల్లో...ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడండి సార్..ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అయ్యోర్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.’ అంటూ శనివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు యూటీఎఫ్ జిల్లా కమిటీకి చెందిన ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల పెన్షన్ బకాయిలు చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎల్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్కార్డుల మెడికల్ బిల్లుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి, గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా కార్యదర్శులు పద్మజ, సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మోహన్, డివిజనల్ కోఆర్డినేటర్ మురళి, కృష్ణంరాజు, నేతలు ఖాదర్ బాషా, హేమాద్రి బాబు, ప్రభుకుమార్, వరలక్ష్మి, మురళి, గోపాల్ పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ గోల్ఘాట్ బాల్ పోటీలు
తిరుపతి అర్బన్: నగరంలో నాలుగురోజులుగా జరుగుతున్న 3వ సబ్ జూనియర్ బాల, బాలికల జాతీయ గోల్ఘాట్ బాల్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీలు గేమ్స్ వ్యవస్థాపకుడు నోట్ల రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో జీవకోనలోని విశ్వం స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్లు, రిఫరీలు, వలంటీర్లు, విశ్వం పాఠశాల యాజమాన్యంతోపాటు పలువురు పిల్లల తల్లిదండ్రుల సహకారం అమూల్యమైనదని కొనియాడారు. 23 రాష్ట్రాల నుంచి 500 మందికి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, పుద్దిచ్చేరి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, అసోం, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ నుంచి క్రీడాకారులు విచ్చేశారని వెల్లడించారు. అనంతరం విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్ విశ్వచందన్రెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు, మెడళ్లు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోల్ షూట్ బాల్ ఇండియన్ కోశాధికారి రామ్ ప్రవేశ్ కుమార్ వీరూ, సౌత్ ఇండియా ఇన్చార్జి కరుణాకరన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రియా, సంయుక్త కార్యదర్శి ప్రసన్న కుమార్, కోశాధికారి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట: భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.35 లక్షల విలువైన 763 కిలోల ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అధికారుల కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలంలోని శేషాచల అడవుల్లో భాకరాపేట అటవీశాఖాధికారులు శుక్ర వారం ఉదయం కూంబింగ్ చేశారు. ఆ సమయంలో అనుమానాస్పద వాహనం వస్తుండగా ఆపారు. అయితే డ్రైవర్ తప్పించుకునేందుకు యత్నించగా సిబ్బంది వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా సుమారు 763 కిలోల ఎరచ్రందనం దుంగలు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్తోపాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. భక్తుల సేవే మహద్భాగ్యం తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆయన శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈఓకు అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ తిరుపతి అర్బన్: నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వర్చువల్ పద్ధతిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులతో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ నెల 17న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వెల్లడించారు. డీఎంఅండ్ హెచ్వో బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనత తగ్గడమే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,97,311 మందికి అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతం, కరకంబాడి బీట్ ప్రాంతం 2016లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తనిఖీలు చేసింది. తమిళనాడు, తిరువణ్నామలై జిల్లాకు చెందిన శివమూర్తి సేతు, తిరుపతి శివమణి అటవీ ప్రాంతంలో అక్రమంగా సంచరించడాన్ని గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆర్టీసీ అధికారుల పరిశీలన నాయుడుపేటటౌన్: మండలంలోని విన్నమాల సమీపంలో ఆర్టీసీ బస్సులో వెనుక నుంచి మంటలు చేలరేగిన సంఘటనకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 29 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి వినుకొండకు వెళుతుండగా విన్నమాల వద్దకు వచ్చే సరికే బస్సు వెనుక వైపు ఒక్కసారిగా మంటలు చేలరేగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జగదీష్తోపాటు సూళ్లూరుపేట డిపో మేనేజర్ కళ తదతరులు, మెకానిక్ బృందంతో బస్సును పరిశీలించారు. రక్షణ విజ్ఞాన సదస్సులో ఎస్వీయూ వీసీకి గౌరవ ఫెలోషిప్ తిరుపతి సిటీ: విజయవాడ వేదికగా జరిగిన రక్షణ విజ్ఞాన సదుస్సులో ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావుకు అరుదైన గౌరవం లభించింది. అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్టీసీ) ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో ఆయనకు ఏఎస్టీసీ గౌరవ ఫెలోషిప్ను ప్రకటించింది. -
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సులో పక్షులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓను అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ ఆదేశించారు. పులికాట్ సరస్సును అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియ శుక్రవారం సందర్శించారు. అనంతరం అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బడ్డెట్లో సుమారు రూ.100 కోట్లు సముద్ర ముఖద్వారాల పూడికకు కేటాయించినట్టుగా కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె శుక్రవారం పులికాట్ సరస్సు పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అటకానితిప్ప పర్యావరణ కేంద్రం పక్కనే చిన్నపాటి చెరువు ఉండడాన్ని చూసిన ఆమె ఇక్కడ పెడల్బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులు బాగా ఆనందించే అవకాశం ఉంది కదా.. మరి ఎందుకు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేయలేదని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు సీఎఫ్ సెల్వం, డీఎఫ్ఓ హారిక ఉన్నారు. -
మహిళా వర్సిటీలో ‘వికాస్–2026’ జోనల్ సదస్సు
తిరుపతి రూరల్: పద్మావతి మహిళావర్సిటీలో ‘‘వికాస్–2026 పరిశ్రమజ్ఞానం, అప్రెంటీస్షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై సౌత్జోన్ సదస్సును యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్జోషీ ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం, వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు యువతను నడిపించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నత విద్యాసంస్థలు పనిచేయాలన్నారు. అందులో భాగంగానే యూజీసీ 2025లో తీసుకువచ్చిన ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రాంను తప్పక అమలు చేయాల్సి ఉందన్నారు. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సుల గైడ్లైన్స్ను తప్పక అమలు చేసిన విద్యాసంస్థల విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కొత్త ప్రణాళికలు, ఎంటర్ప్రెన్యూర్స్లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోందని వెల్లడించారు. మహిళా వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ వికాస్ 2026 సౌత్ జోన్ సదస్సులో ఇండస్ట్రీ అకాడమీ అనుసంధానం, స్వయంప్లస్ మాడ్యూల్స్ రూపకల్పన, కోక్రియేషన్ ఆఫ్ కరికులం తదితర ముఖ్య అంశాలపై అర్థవంతమైన చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆర్ ఉష, యూజీసీ సంయుక్త కార్యదర్శి అవిచల్ కపూర్, సదస్సు కో ఆర్డినేటర్లు విద్యావతి, శోభారాణి పాల్గొన్నారు. -
స్పెల్–2 ప్రాక్టికల్స్కు 143 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ స్పె ల్–2 ప్రాక్టికల్స్లో భాగంగా తొలిరోజు శుక్రవారం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టి కల్స్ పరీక్షకు 3,785 మందికి గాను 3,697 మంది విద్యార్థులు హాజరుకాగా మధ్యాహ్నం జరిగిన ప్రయోగ పరీక్షకు 3,080 మందికి గాను 3,025మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 10వ తేదీవరకు జరగనున్నాయన్నారు. హోమ్ లోన్ మేళా నేడు, రేపు తిరుపతిఎడ్యుకేషన్ : కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 7, 8వ తేదీల్లో హోమ్ లోన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ బ్యాంకు జీఎం పాండురంగ మితాయ ఓ ప్రకటనలో తెలిపారు. కరకంబాడీ రోడ్డులోని గెస్ట్లైన్ డేస్ హోటల్ సమీపంలోని ఏబీ ఆవాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫొనెక్స్ టవర్ ప్రాంగణంలో రెండు రోజుల పాటు హోమ్ లో న్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో వినియోగదారులకు తక్షణమే లోన్ అప్రూవల్, తక్కువ వడ్డీ రేటు, ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 70134 10562 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.10లక్షల విరాళం తిరుపతితుడా: స్వి మ్స్ బాలాజీ ఆరో గ్య వరప్రసాదిని ప థకానికి బెంగళూరు కు చెందిన నారాయ ణ సిల్క్స్ అధినేత నమ్రత ఆర్ దేవత తండ్రి డీఎస్ రాఘవేంద్ర కోరిక మేరకు రూ. 10,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కు మార్ను ఆయన చాంబర్లో దాత తరఫున తి రుపతికి చెందిన వై రాఘవేంద్ర శుక్రవారం క లసి అందుకు సంబంధించి పత్రాలను, చెక్కు ను అందజేశారు. పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోనికి తీసుకుని విరాళం అందజేసినట్టు దాతలు తెలిపారు. -
నారాసుర ఆధరహో!
చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మ ద్యం ధరల నియంత్రణ గాలికొదిలేశారు. అమ్ము కున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లు లూఠీ ‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచుకో వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లే దో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లా ల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచు కుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు. తిమ్మిని బమ్మి చేస్తూ.. పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ప్రభుత్వం ధరలు పెంచింది అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీఓ అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పె రిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చే శారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచింనే బోర్డు చూపిస్తున్నారు. ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు. విచ్చలవిడిగా ‘బెల్టు’ రెండు జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొ ట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతి చోటా మ ద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు. తిరుపతి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మద్యం దుకాణాలు – 225 మద్యం బార్లు – 27 రోజుకు వ్యాపారం (సగటు) – రూ. 2 కోట్లు పెరిగిన ధరలతో భారం – రూ.32 లక్షలు -
● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్షాపులు ● రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి
ఆస్పత్రులే అక్రమాల అడ్డా.. ప్రైవేటు ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆవరణలోనే మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు నగరం, జీడీనెల్లూరు, పలమనేరు, కుప్పం, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి, సత్యవేడు, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా మెడికల్ షాపులు టేర్పాటు చేసుకున్నారు. రోగి బ యటకు అడుగు పెట్టకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో పరీక్షలు, ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకం మూడు ఒకే చోట జరుగుతున్నా, నియంత్రణ మాత్రం శూన్యం. -
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
భాకరాపేట అడవిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.డాక్టర్ చీటి విలువ జీరో డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు వి లువ లేకుండా పోయింది. ‘‘ఏ మందైనా ఇ స్తాం’’ అన్న ధోరణితో మెడికల్ షాపులు వ్యవహరిస్తున్నాయి. ఇది వై ద్యవృత్తికే మచ్చగా మారుతోంది. రోగులు అ డగ్గానే మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రా ణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్ చీటీ లేకుండానే. డా క్టర్ ఒక మాత్ర రాస్తే మెడికల్ షాపుల్లో మరొకటి ఇచ్చి, అదే కాంబినేషన్ అని చెబుతారు. కాంబినేషన్ ఒకటే అయినా.. అది తక్కువ ధ ర, ఎక్కువ కమీషన్ ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మో సాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతు న్నా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారులకు ఇదే బలంగా మా రింది. మొత్తంగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మాఫియా ముసుగులో పడి..తనిఖీలకు అంటిముట్టనట్టు తిరుగుతున్నారు. -
శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి
తిరుమల: శ్రీవారిని శుక్రవా రం సినీ నటి మీ నాక్షి చౌదరి ద ర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. 32 మంది విద్యార్థుల డిబార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన పలు కోర్సులకు సంబంధించిన యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 32 మంది విద్యార్థులను స్క్వాడ్ అధికారులు డి బార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధి కారి రాజామాణిక్యం తెలిపారు. -
రెండిళ్లలో చోరీ
నాయుడుపేట టౌన్: పట్టణంలోని రాజగోపాలపురం ఆరో వీధిలో ఉన్న రెండు ఇళ్లలో సుమారు రూ.4 లక్షలకు పైగా నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి అభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. రాజగోపాలపురంలో నివాసం ఉంటున్న గుండుబోయిన నరేష్ ఇంటికి తాళం వేసి, పెళ్లకూరు మండలం బంగారంపేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అలాగే అదే ఇంటి మిద్దైపె నివాసం ఉంటున్న కారిపాక చిట్టిబాబు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. రెండు ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దుండగులు తలుపులు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. నరేష్ గురువారం ఇంటి వద్దకు వచ్చి చూసే సరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో దాచి ఉంచిన రూ. 2లక్షలకు పైగా నగదు, 4.50 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. చిట్టిబాబు కూడా గురువారం సాయంత్రం ఇంటి వద్దకు చేరుకుని, పరిశీలించగా బీరువాలో దాచి ఉన్న 5 సవర్ల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు, 1.50 కిలోలకు పైగా వెండి వస్తువలు అపహరించుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాటరీ పద్ధతిలో 4 బార్లు తిరుపతి క్రైమ్: జిల్లాలో మిగిలి ఉన్న నాలుగు బార్లకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయించారు. శ్రీకాళహస్తి బార్కు–4, సూళ్లూరుపేట బార్కు–10, గూడూరులోని రెండు బార్లకు–8 దరఖాస్తులు వచ్చా యి. దరఖాస్తుల ద్వారా రూ.1.10 కోట్లు, ప్రాసెసింగ్ ద్వారా రూ.1.12 కోట్లు, మొదటి కంతు ద్వారా రూ.36.25లక్షలు, మొత్తంగా రూ.1.57 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2028 ఆగస్టు 31 వరకు వీరికి బార్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. -
మహిళా వర్సిటీలో వికాస్–2026
తిరుపతి రూరల్: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వేదికగా వికాస్– 2026ను ఘనంగా నిర్వహించనున్నట్టు సదస్సు కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ విద్యావతి, ప్రొఫెసర్ శోభారాణి తెలిపారు. గురువారం వర్శిటీలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వికాస్– 2026 సదస్సులో ‘‘పరిశ్రమ జ్ఞానం, అప్రెంటీస్ షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై ఒక్క రోజు సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి, సంయుక్త కార్యదర్శి డా. అవిచల్ కపూర్ , ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొ ఎస్.విజయభాస్కర్ రావు, వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ హాజరై ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలను జాతీయ అభివృద్ధి, సామాజిక పరివర్తనకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలల నుంచి నిపుణులు, పరిపాలనా అధికారులు హాజరవుతారని చెప్పారు.లారీ ఢీకొని ఒకరి మృతికలువాయి(సైదాపురం): కలువాయి మండలంలోని గురువారం లారీ ఢీకొనడంతో జాతీయ దాటుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసారగం మండలం ఉప్పలపాడు గ్రామనికి చెందిన భాగాది నరసింహులు(38)గా పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని సంఘటన స్థలంలో వదిలి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఏనుగు దంతాలపై స్మగ్లర్ల కన్ను
పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ా ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకికర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపుసాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు.విదేశాల్లో భలే డిమాండ్చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది. -
టాలెంట్ ఫెస్ట్కు విశేష స్పందన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ ఫెస్ట్–2026కు విశేష స్పందన లభించింది. వర్సిటీలో రెండో రోజు గురువారం దేశంలోని 24 యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి శాస్త్ర ప్రతిభను చాటుకున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన ప్రతిభా పోటీల్లో వేద భాష్య భాషణ, వ్యాకరణ శాస్త్ర భాషణ, సాహిత్య శాస్త్ర భాషణ, వేదాంత శాస్త్ర భాషణ, జ్యోతి ష్య శాస్త్ర భాషణ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో అవార్డులు, బహుమతులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా సాహిత్య విభాగ సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రత్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, అడిషనల్ కోఆర్డినేటర్గా వ్యాకరణ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు. 6 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయయసర్కిల్:శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో కారులో ఎరచ్రందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్చేసి ఆరు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఏఆర్ఎస్ఐ ఈశ్వర్రెడ్డి బృందం, ఎఫ్ఆర్ఓ పి.సుభాష్ గురువారం కేవీబీపురం మండలం వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎఫ్బీఓ సురేష్ కుమార్తో కలసి మారప్పరెడ్డి కండ్రిగ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. అటువైపు వేగంగా వచ్చిన ఒక కారు టాస్క్ఫోర్సు పోలీసులను చూసి కొద్ది దూరం ముందుగా ఆపేశారు. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఆరు ఎరచ్రందనం దుంగలు లభించాయి. అదుపులోకి తీసుకున్న వారిని అరెస్టు చేసి విచారించగా, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కారు సహా వారిని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. వీరిని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ ఖాదర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి రోగికీ నాణ్యమైన వైద్య సేవలు తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవల కోసం విచ్చేస్తున్న ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్ ఎమెర్జెన్సీ విభాగంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, స్విమ్స్ వైద్యం రావద్దంటోందని ప్రచురించిన కథనం అవాస్తమని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు బెడ్, వెంటిలేటర్ వంటి సౌకర్యాలు అందకపోయినా, అడ్మిషన్ నిరాకరించినా వెంటనే మెడికల్ సూపరింటెండెంట్ 94935 47803, ఆర్ఎంఓ 9866356239 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. -
ఉపాధి, వ్యవస్థాపకతే ఉన్నత విద్య లక్ష్యం
తిరుపతి సిటీ: ఉన్నత విద్య పూర్తిగా డిగ్రీతో కేంద్రీకృతం కాకుండా ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా అనుసంధానించాలని యూజీసీ జాయింట్ సెక్రటెరీ డాక్టర్ అవిచల్ రాజ్కపూర్ సూచించారు. ఎస్వీయూలోని సెనేట్ హాల్లో గురువారం ఎన్ఈపీ–2020తో దేశంలో ఉన్నత విద్య.. మారుతున్న దృశ్యం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యసించారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. 2023లో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ పరివర్తన, పరిశ్రమ సహకారం, జీవితాంతం అభ్యసించడం వంటి చర్యలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్యా వ్యవస్థల అవసరాన్ని ప్రపంచ మేధావులు, నాయకులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. సమగ్ర డిజిటల్ వ్యూహాలను విశ్వ విద్యాలయాలను అవలంభించాలని ఆయన కోరారు. వీసీ టాటా నర్సింగరావు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎన్ఈపీ అమలు స్థితి గురించి, విద్య, డిజిటల్ అభ్యాసం, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, పరిశోధన ప్రమోషన్, పరిశ్రమల అనుసంధానం వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా విశ్వవిద్యాలయం సంస్కరణలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, పలు కళాశాలల నుంచి ప్రిన్సిపాళ్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?
ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి
తిరుపతి అర్బన్: ఘన, ద్రవ వ్యవర్థాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలసి మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థల నుంచి నివేదికలు కోరారు. అనంతరం జిల్లాస్థాయిలో ఓ నివేదికను తయారుచేసి న్యూఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కి అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో వందశాతం వాస్తవ పరిస్థితులను పొందుపరుస్తూ నివేదికను ఇవ్వాలని ఆయన స్పష్టంచేశారు. -
ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత
నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో ఉగాది నాటికి లక్షకు పైగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు టిడ్కో గృహాల శాఖ ఎండీ సునీల్కుమార్రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల సముదాయాలను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి టిడ్కో గృహాల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడ్కీ గృహాల శాఖ ఎస్ఈ మహేష్, సీఈ మరియన్, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా, మెప్మా సీఎంఎం సురేంద్ర, డీసీఓ ముషీర్ అహ్మద్, సీఎల్టీసీ మునీర్ తదితరులు ఉన్నారు. -
సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఒప్పందం
తిరుపతి రూరల్: శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి తెలుగు భాష, సంస్కృతిని నేర్పడానికి శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖ ముందుకు వచ్చింది. బోధన, అభ్యసన, అకడమిక్ సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు నెరవు శ్రీకాళహస్తి మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు సంయుక్తంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించటానికి పరస్పర సహకారం అందించుకోనున్నారు. ఈ అవగాహన ఒప్పందంతో శ్రీలంకలోని తెలుగు విద్యార్థులకు తెలుగు భాషను నేర్పడమే కాకుండావారి మూలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్. ఉష, డీన్ ఆచార్య సి.వాణి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతిపాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడుకు జిల్లా నేతలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభకు హాజరైన పార్టీ శ్రేణులుచలో పోతిరెడ్డిపాడుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని పార్టీ నేతలు, శ్రేణులు నిర్వహించారు. చంద్రబాబు నీచ రాజకీయాలతో రాయలసీమకు చేస్తున్న తీవ్ర నష్టం, రాయలసీమ హక్కుల కోసం పోరాడేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కొరముట్ల శ్రీనివాసులు, వెంకటేగౌడ్, సునీల్కుమార్, ఎమ్మెల్సీ భరత్, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్రెడ్డి, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, విజయానందరెడ్డి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. – తిరుపతి మంగళం -
వీరప్పన్లు!
కౌండిన్య, మోర్థానలో..మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దులో పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు -
సంప్రదాయాల విలువలు పెంచండి
నారాయణవనం: భవిషత్తుకు దారి చూపే వృత్తి వి ద్యలతో సమానంగా కుటుంబ, దేశ సంప్రదాయాలకు విలువలు పెంచేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలని అశోకరాజు అన్నారు. సిద్ధార్ధ ఇంజినీ రింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా బుధవారం ట్రెడిషనల్(సంప్రదాయ) డే నిర్వహించారు. చైర్మన్ నుంచి విద్యార్థులు వరకు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు వి చ్చేశారు. అధ్యాపకులకు విద్యార్థులకు తంబోల, ఫొటో కాంపిటీషన్, మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి షీల్డ్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ అశోక రాజు మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించారని తెలిపారు. ఆధునిక, పాశ్చాత్య దేశాల పోకడలతో సంప్రదాయాల విలువలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సా యంత్రం ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక, నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. 23 కిలోల గంజాయి స్వాధీనం – ఐదుగురి అరెస్టు నాయుడుపేట టౌన్: మేనకూరు కేంద్రంగా చేసు కుని గంజాయి విక్రయాలు జరిపే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాకు సంబంధించి ఐదుగురిని బుధవారం పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు బుధవారం వెల్లడించారు. నాయుడుపేట అర్బన్ పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి విలేకరుల సమావేఽశంలో డీఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. నా యుడుపేట మండలంలో మేనకూరు పరిశ్రమల కేంద్రం వద్ద గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో డీఎస్పీ సారధ్యంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, మహిళా ఎస్ఐ భానుప్రసూన పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టించారు. బుధవారం పోలీసులతోపాటు తహసీల్దార్ మా గర్ల రాజేంద్రతో కలిసి మండలంలోని మేనకూరు బైపాసు రోడ్డు వద్ద ఆకస్మికంగా సోదాలు జరిపి, 11 గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బిహర్ రా ష్ట్రానికి చెందిన ముఖేష్ గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన సుధాకర్ దాస్, షీబా దాస్, గోపాబంధు దాస్, జార్ఖండ్కు చెందిన పింకిదేవిని అరెస్టు చేసి నట్టు సీఐ తెలిపారు. విచారణలో ఇతర రాష్ట్రా లకు చెందిన వీరంతా ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా తెస్తు మేనకూరులో విక్రయాలు జ రుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐ , ఎస్ఐని డీఎస్పీ అభినందించారు. -
తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్ను జయించడం సాధ్యం
తిరుపతి తుడా: తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ అవగాహన వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇందిరా మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్పై అనవసరమైన భయాన్ని వీడి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్విమ్స్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ను స్టేజ్–1, స్టేజ్–2 దశలో గుర్తిస్తే దాదాపు వంద శాతం కోలుకునే అవకాశం ఉందన్నారు. చెడు అలవాట్లతోనే సమస్య పొగతాగడం, మద్య సేవనం, ఊబకాయం, అసమతుల్య ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, ఇవన్నీ నివారించదగిన కారణాలేనని తెలిపారు. ప్రధానంగా యువత చిన్న వయసులోనే పొగాకు అలవాట్లకు బానిస కావడం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. క్యాన్సర్ అనే మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల, వైద్య సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ అవగాహన వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ -
23 కిలోల గంజాయి స్వాధీనం
నాయుడుపేటలో బుధవారం పోలీసులు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.కింది ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు రేణిగుంట మండలం గాజులమండ్యం ప్రాంతానికి చెందిన వ్యక్తి. వయస్సు 70. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడిని జనవరి 27వ తేదీన స్విమ్స్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అక్కడి వైద్యుల బృందం రోగి ఆటో దిగకుండానే వివరాల కూపీ లాగారు. చూడడానికి పేదలుగా ఉండడంతో కేసు సీరియస్గా ఉందని, ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు, మీరు పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. మా ఆయన శ్వాస తీసుకోవడం లేదు, బెడ్లో చేర్చుకోండి అంటూ కంటతడి పెట్టినా.. వైద్యులు మాత్రం కనికరించలేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం, మీరు అర్జెంటుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండంటూ భయపెట్టడంతో చేసేది లేక అదే ఆటోలో రుయాకు తరలించారు. -
కనికరించలేరా?
కాళ్లావేళ్లాపడినా ఆర్డీఓ కోర్టు తీర్పుకు విలువలేదా! ●ఆక్రమణకు గురైన భూమి సాక్షి ప్రతినిధి తిరుపతి: ‘పండు ముసలి 90 ఏళ్లు.. ఈయన ఓ నిరుపేద రైతు.. బస్టాండ్లలో నిద్రిస్తూ న్యాయం చేయాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అయ్యా నా భూమి ఆక్రమణకు గురైంది.. న్యాయం చేయండి.’ అంటూ అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నాడు. అయినా న్యాయం జరగలేదు. వివరాలలోకి వెళ్లితే... తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం, బోడేవాండ్లపల్లి గ్రామం, పి వడ్డిపల్లెకు చెందిన కే సిద్ధయ్యకు 50 ఏళ్ల క్రితం అప్పటి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది యల్లమంద గ్రామం సర్వే నంబర్ 1489లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. అదే మండలం వీఆర్ ఆగ్రహారం గ్రామానికి చెందిన భూస్వామి శిరివేలు రమేష్ 2019లో నిరుపేద రైతు అనుభవిస్తున్న 3.65 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీలు నిర్వహించి బతిమలాడుకున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు దిగసాగాడు. ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు ఆ భూస్వామి కుమ్మక్కు కావడంతో వారు అతనికి సపోర్టుగా మాట్లాడే వారు. దీంతో ఏమీ చేయలేని దుస్థితిలో బాధితుడు సిద్ధయ్య అప్పటి ఆర్డీఓ కార్యాలయం మదనపల్లెలో ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తున్నా పట్టించుకోకుండా ఆక్రమించిన పొలంలో మామిడి మొక్కలు నాటి సాగు చేశాడు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి ఆర్డీఓ కార్యాలయ కోర్టుకు కేసు బదిలీ కావడంతో వాస్తవాలను ఆరా తీసిన కోర్టు 2022 ఆగస్టులో సిద్ధయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆర్డీఓ కోర్టు ఆదేశాలూ బేఖాతరు రైతు సిద్ధయ్యకు చెందిన 3.65సెంట్ల భూమిని తక్షణం తిరిగి అప్పగించాలని ఎర్రావారిపాళెం మండల రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ అధికారులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలుసార్లు ఆర్డీఓ కార్యాలయంలోనూ, కలెక్టర్ కార్యాలయంలోనూ సిద్ధయ్య ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వృద్ధ రైతు తమని ఏమి చేసుకోలేడనే నమ్మకంతో ఆక్రమణ దారుడు మరో అడుగు ముందుకేసి మిగిలిన 1.38 సెంట్ల భూమిని సైతం తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆర్డీఓ కోర్టు ఆదేశాలిచ్చినా తమ భూమిని ఆక్రమణదారుడు వదలకపోవడంతో తిరుపతి ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ వృద్ధ రైతు ప్రదక్షణలు చేస్తూ కనిపించిన వారిని న్యాయం చేయండని బతిమలాడుతున్నాడు. అయ్యా.. న్యాయం చేయండి మహా ప్రభూ! వయస్సు మీద పడింది. నడవలేని స్థితి. నాకు ఉన్న 5ఎకరాల భూమిని ఆక్రమించారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఆక్రమణ దారుడు శిరివేలు రమేష్ నా భూమిలోకి నన్ను అడుగు పెట్టనీయడం లేదు. 2022లో ఆర్డీఓ కోర్టు ఆదేశించినా కనీసం పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ను అమలు చేయాలని ఏళ్ల తరపడి మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి రావద్దంటూ అధికారులు గర్జిస్తున్నారు. ఈ వయస్సులో ఇంత దారుణంగా ఇటు అధికారులు, అటు ఆక్రమణ దారుడు నన్ను వేధించడం తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికై నా అధికారులు నాకు న్యాయం చేయాలి. – కే సిద్ధయ్య, రైతు, ఎర్రావారిపాళెం మండలం -
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం ● ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వేడుకోలు
●విద్యుత్ మీటర్ రీడర్ల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపే కారణమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకండి’ అంటూ టీడీపీ అగ్ర నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, ప్రస్తుతం గృహ వినియోగదారులకు సైతం చకచకా బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్లు ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు అందిస్తారు. ఇందుకు రీడర్లకు ఒక్కో బిల్లుకు పట్టణాల్లో రూ.3.6 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.73 పైసలను విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకొన్న కాంట్రాక్టర్కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో రూ.4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారిగా కాంట్రాక్టర్లు ఉంటారు. గతం ప్రభుత్వంలో కొండంత భరోసా సంబంధిత కాంట్రాక్టర్లు తమకు రూ.3.3 పైసలు చెల్లిస్తున్నారంటూ రీడర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేశారు. రీడర్లకు కొండంత అండగా నిలిచారు. బొక్కేస్తున్న ‘యువగళం’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్కు కష్టాలెక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగళం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు రీడర్లకు రూ.2.8 పైసలు, కొన్నిచోట్ల రూ.3 వంతున ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకో.. లేకుంటే వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్గా రోడ్డుపైకి! శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడిందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులోని చిప్ ద్వారా రీడింగ్ను విద్యుత్ కార్యాలయం నుంచే సేకరించి, మొబైల్ రీచార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగుకానున్నారు.15 ఏళ్లుగా పనిచేస్తున్నా.. గత 15 ఏళ్లుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం వస్తున్న వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగ భద్రత ఆందోళనకరంగా ఉంది. భవితవ్యం అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, మీటర్ రీడర్, పుత్తూరు ఉద్యోగ భద్రత కల్పించాలి మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే పని కల్పించండి. షి ప్టు ఆపరేటర్లుగా, వాచ్ టు వార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, బ్రేక్ డౌన్ గ్యాంగ్, వాచ్మెన్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ వంటి విధుల్లో చేర్పించండి. మా కుటుంబాలకు అండగా నిలవండి. –సి.రమేష్, ఉపాధ్యక్షుడు,ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ కమిటీ విజ్ఞప్తి చేశాం ప్రభుత్వానికి, విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మా ఉద్యోగ భద్రతపై విజ్ఙాపనలు అందజేశాం. ప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాలేదు. ఉపాధి చూపమని వేడుకొంటున్నాం. ప్రభుత్వం కనికరం చూసుతుందని ఆశిస్తున్నాం – యువరాజ్, మీటర్ రీడర్, పుత్తూరు -
రేపటి నుంచి ఇంటర్ స్పెల్–2 ప్రాక్టికల్స్
తిరుపతి సిటీ: జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్ స్పెల్–1 ప్రాక్టికల్స్ గురువారంతో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి స్పెల్–2 ప్రాక్టికల్స్ జిల్లాలోని 89 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే నాలుగో రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాక్టికల్స్కు ఉదయం సెషన్లో 33 మంది, మధ్యాహ్నం సెషన్లో 54 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 7న ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు హాజరై సుమారు 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. శ్రీవారి సేవలో యాదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి తిరుమల: మేలుకొటే యాదుగిరి యతిరాజ మ ఠం పీఠాధిపతి యాదుగిరి యతిరాజ స్వామిజీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా రు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ పేష్కార్ రామకృష్ణ, పోటు పేష్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 69,389 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 20,247మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కా నుకల రూపంలో హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టి కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
కూటమి పాలనపై విసిగిపోయారు!
తిరుపతి మంగళం: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి నమ్మక ద్రోహం చేసిన కూటమి పాలనపై రెండేళ్లకే రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కార్యకర్తలకే అగ్రస్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకరరెడ్డి ఉన్న రెండు సార్లు శ్రీవారి ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. శ్రీవారి భక్తి చానల్, వాడవాడలా శ్రీవారి కల్యాణాలు, దళిత గోవిందం వంటి అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కరుణాకరరెడ్డిదన్నారు. అలాంటి గొప్ప దైవభక్తి కలిగిన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్కళ్యాణ్ లడ్డూలో కల్తీ అంటూ దుష్ప్రాచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలతోనే వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసుకోగలమన్నారు. పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ కమిటీల్లో నియమించాలని సూచించారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి, వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు వారేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అందరి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందాయంటే అది ఒక జగనన్న పాలనలో మాత్రమేనన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అనంతరం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా తిరుపతిలో పదివేల మందితో పార్టీ అనుబంధ కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఉన్న యాభై డివిజన్లకు గానూ 45 డివిజన్లలో కమిటీలను పూర్తి చేయడంతోపాటు డిజలైజేషన్ చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు తిరుపతి నగరంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వల్లేనన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే కార్యకర్తలకే పెద్దపీట -
సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి
– టీటీడీ ఇన్చార్జి ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుపతి సిటీ: శాస్త్ర సంప్రదాయాలకు సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను సంరక్షించి భావి భారతావనికి అందించాలని టీటీడీ ఇన్చార్జి ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో బుధవారం మూడు రోజుల పాటు జరగనున్న అర్చక శిక్షణ తరగతులను ఆయన వీసీ రాణి సదాశివమూర్తితో కలసి జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని పలు ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కై ంకర్యాలను మరింత నియమబద్ధంగా నిర్వహించేందుకు శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇందులో 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు దోహదపడతాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి సూళ్లూరుపేట: పట్టణంలోని హోలీక్రాస్ సెంటర్ వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటిలోని సీఈటీసీ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేట గాండ్లవీధిలో నివాసముంటున్న గోపిశెట్టి శ్రావణి (31) ఉదయాన్నే కంపెనీ బస్సు ఎక్కి డ్యూటీకి వెళ్లింది. ఆమె సమీప బంధువులు ఫోన్ చేసి బుధవారం పొదుపునకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో మీటింగ్ ఉందని చెప్పారు. ఆమె బస్సు ఆపి తడ రెవెన్యూ కార్యాలయం వద్ద దిగింది. సూళ్లూరుపేటకు వచ్చేందుకు అవతలి వైపు రోడ్డు పక్కకెళ్లి అదే కంపెనీలో పనిచేస్తున్న ఎల్లా రాజశేఖర్ (32) తడ నుంచి సూళ్లూరుపేటకు మోటార్సైకిల్పై వస్తుండగా ఆపింది. అతనితో పాటు మోటార్సైకిల్పై సూళ్లూరుపేటకు వస్తూ హోలీక్రాస్ సర్కిల్ వద్ద షార్రోడ్డులో మలుపు తిరిగే సమయంలో వెనుకనే వస్తున్న కంటైనర్ ఢీకొని, వారు కింద పడ్డారు. కంటైనర్ శ్రావణిపై దూసుకెళ్లడంతో ఆమె మృతి చెందింది. తమిళనాడులోని ఆరణి పట్టణం సుబ్రమణ్యంనగర్కు చెందిన ఎల్లా రాజశేఖర్ మోటార్సైకిల్తోపాటు పక్కకు పడడంతో తీవ్రమైన గాయపడిన గమినించిన స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారమందుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
స్విమ్స్ వైద్యం..
స్విమ్స్ వైద్యం.. కాసులే ముఖ్యం.. పేదలకు వైద్యం దక్కకపోవడం.. ఆరోగ్యశ్రీ చెల్లకపోవడమే ఇక్కడ ప్రత్యేకం..వాహనంలోనే రోగి స్థితిగతులపై ఆరా తీయడం.. బిల్లులు కట్టగలరా? లేదా?ని కూపీ లాగడం.. పేదలని తెలిస్తే తిరస్కరించడం.. ఆపై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహాలివ్వడం ఇక్కడి వైద్యుల నైజం.. ఇలా స్విమ్స్ వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. పేదలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని స్విమ్స్ ఆస్పత్రికి వస్తే, ఇక్కడ పనిచేసే వైద్యుల బృందం వారికి ఊపిరి పోయలేని పరిస్థితి నెలకొంది. కళ్లు చెదిరే ఈ వాస్తవాలు జనవరి 27వ తేదీన సాక్షి నెట్వర్క్ పరిశీలనలో వెలుగు చూశాయి. తిరుపతి టాస్క్ఫోర్స్: స్విమ్స్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ మైకు కనిపిస్తే పాలకులు.. అధికారులు పోటీ పడి మాట్లాడుతుంటారు. ఇది నమ్మి పొరుగు జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగున వస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీరా ఇక్కడికి వచ్చాక బెడ్లు ఖాళీలేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. వైద్యం కోసం ఎంత మొరపెట్టుకున్నా రోగికి అత్యవసర విభాగంలో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తమ వారికి సకాలంలో వైద్యం అందించలేకపోయామంటూ బోరున విలిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగికి, వారి కుటుంబాలకు స్విమ్స్లో ఎదురవుతున్నాయి. ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు. నిత్యం ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం పదుల సంఖ్యలో వచ్చే రోగులకు ఎదురవుతున్న దుస్థితి. డబ్బులు కట్టే పరిస్థితి లేదని గుర్తిస్తే బెడ్లు లేవని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే అత్యవసర విభాగంలోకి నో ఎంట్రీ చెప్పేస్తున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన రోగికి మంగళవారం స్విమ్స్ వైద్యు లు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో రుయాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యులతో సిఫార్సు చేయించుకుంటే అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ కింద ఒకరిద్దరికి ఇక్కడ అడ్మిషన్ లభిస్తుంది. మిగిలిన రోగులను భయపెట్టి, నిర్దాక్ష్యింగా వచ్చిన దారినే వెనక్కి తరిమేస్తున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితిలో అర్ధరాత్రి వచ్చినా కనికరం లేకుండా మరో ఆస్పత్రికి వెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు. దీంతో పేదలకు ఇక్కడ అత్యవసర వైద్యం అంత ఈజీగా అందడం లేదు. అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ లేదంటున్న అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అత్యవసర వైద్యం కోసం వస్తున్న రోగులకు స్విమ్స్ చుక్కెదురు అవుతోంది. అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ వర్తించదంటూ వైద్య అధికారులు తేల్చి చెబుతున్నారు. అడ్మిషన్ కావాలంటే ముందు డబ్బులు చెల్లించాలని, ఇక్కడ వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా చెల్లిస్తేనే రోగిని లోనికి తీసుకుంటామంటూ నిర్మొహమాటంగా తేల్చి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య నిబంధనలకు విరుద్ధమని తెలిసినా స్విమ్స్ వైద్యాధికారులు ఆరోగ్యశ్రీ రోగి అంటే నో ఎంట్రీ అంటున్నారు. రోజు అడ్మిట్ అయ్యే రోగుల్లో 10 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉండడం లేదని తెలుస్తోంది. ఎక్కువ శాతం మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వాస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో పరుగులు తీస్తున్నారు. స్విమ్స్కు పెరుగుతున్న రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం 70 నుంచి వంద పడకలతో ఎమర్జెన్సీ విభాగాన్ని నిర్వహించాలని సిఫార్సులున్నా టీటీడీ ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్ దించకుండానే వెనక్కి.. అరచేతిలో ప్రాణాలు -
నర్సింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి
తిరుపతి తుడా: నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, వెంటనే ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం నర్సింగ్ కళాశాల ఎదుట మృతుని తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇదే కళాశాల చైర్మన్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తమను లైంగికంగా హింసించే వాడని అనేకసార్లు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బుధవారం అదే కళాశాలలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సూళ్లూరు పేటకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యా ర్థిని సైతం శారీరకంగా కలవాలని హింసించేవాడని ఆమె తన తల్లిదండ్రులకు పలుసార్లు మొరపెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తూ కట్టని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టేవారన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, ప్రవీణ్, చిన్న, హరి, వినయ్, సురేష్, అశోక్, ఎన్ఎస్యూఐ నాయకులు మల్లికార్జున, బాలాజీ, నల్సా నాయకులు సుందర్ పాల్గొన్నారు. -
కూటమి నేతల అక్రమాలు మితిమీరుతున్నాయ్!
తిరుపతి కల్చరల్: కూటమి ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత నాయుడుపేటలో ఆ పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జనాలు మితిమీరిపోతున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దోపిడీనే లక్ష్యంగా కూటమి నేతలు గంగాధర్ప్రసాద్, చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్రెడ్డి, రాజేంద్ర, రఫీ అక్రమాలు, దౌర్జన్యాలు సాగిస్తూ ప్రశ్నించే వారిపై దాడులతో అ ణచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నాయుడుపేట టౌన్లో లాటరీ ద్వారా 14 వైన్షాపు లు దక్కించుకుని, ఆ షాపుల నుంచి మద్యం గ్రామీణ ప్రాంతాలకు తరలించి, పల్లెల్లో బెల్టు షాపులు నడుపుతున్నారన్నారు. అయితే ఇదే లాటరీలో బొబ్బు వెంకటరత్నం మద్యం షాపులను దక్కించుకుని ఆయన తాను భాగస్వామ్యంగా ఆ మద్యం షాపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు పాటి స్తూ నిబద్ధతతో సమయ పాలన పాటిస్తూ ఎమ్మార్పీ కే మద్యం విక్రయిస్తున్నామని తెలిపారు. దీంతో తమ మద్యం షాపును సిండికేట్లో కలపాలని కూటమి నేతలు తమపై ఒత్తడి తెచ్చారని, దీనిని తాము నిరాకరించామన్నారు. అప్పటి నుంచి అనేక రకాలుగా తమపై దౌర్జన్యాలు, దాడులు చేపట్టడమేకాక సుమారు 14 తప్పుడు కేసులు బనాయించి ఆందోళనలకు గురి చేశారన్నారు. సీఐ బాబి ఓ రోజు తమను బెదిరిస్తూ నెల మామూళ్లు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని, ప్రస్తుతం రూ.45 వేలు ఇవ్వాలని లేకుంటే కేసులు పెట్టి జై లుకు పంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము రూ.30 వేలు ఇస్తామని చెప్పి ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు డబ్బులు తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ రామ్మోహనరావు, సీఐ బాబిపై కేసు పెట్టి వారిని జైలుకు పంపారని తెలిపారు. దీంతో మరింత రెచ్చిపోయిన కూటమి నేతలు నిత్యం తమపై దాడులు చేస్తూ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకుని, తనకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్రెడ్డి, బీసీ సెల్ నేత బాబు, వెంకటరత్నం, జితేంద్ర, గిరిరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్: నగరంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫుట్పాత్ నుంచి దొర్లిపడిన సమయంలో, అటు వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అతని కాలి మీదుగా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన బస్సు తిరుపతి నుంచి తిరువణ్నామలైకి వెళుతున్న చిత్తూరు–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో, అతడిని గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేశారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ పాకాల: గుర్తు తెలియని దుండగుడు మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తెలంగాణ యాత్రికులు ఆలయాల సందర్శన యాత్రలో భాగంగా దామలచెరువు మీదుగా వెళుతూ వేకువ జామున టీ, కాఫీలు తాగడానికి సమీపంలోని వరుణ్ డాబా వద్ద బస్సు ఆపారు. బస్సులో నుంచి దిగిన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా, సాయినగర్కి చెందిన మురళీధర్రావు భార్య సంధ్యారాణి వాష్రూమ్ను వినియోగించుకునేందుకు డాబా ప్రాంగణంలోనే ఉన్న బాత్రూమ్ వద్దకు వెళ్లింది. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు డాబా గోడ దూకి, బాత్రూమ్ వద్దకు చేరుకుని సంధ్యారాణి మెడలోని సుమారు 4 తులాలు బంగారు గొలుసు హఠాత్తుగా అపహరించి, పరుగులు తీశాడు. వెంటనే బాధితురాలు కేకలు వేసి తోటి ప్రయాణికులను పిలిచింది. అప్పటికే దుండగుడు కనిపించకుండా పారిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. పరిశోధనలకు అవకాశాలు కల్పించాలినారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసుకోవడానికి సరైన వసతులను కల్పిస్తే పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుందని తిరుపతి రతన్టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్) సీఈఓ విజయవంత్ మాథూర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా మంగళవారం 16వ నేషనల్ లెవెల్ టెక్నిరల్ సింపోజియం సిద్ధార్థ క్వెస్ట్–2కే26ను నిర్వహించారు. క్వెస్ట్లో వివిధ కళాశాలల నుంచి 575 పేపర్ ప్రెజెంటేషన్లు నమోదు కాగా 10 బ్రాంచీల నుంచి 510 పేపర్లు ప్రజెంటేషన్లను ఎంపిక చేశారు. పరిశోధనల పరస్పర సహకారానికి రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విజరయ్వంత్ మాథూర్ మాట్లాడుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజినీరింగ్ విద్యార్థులకు సరైన ప్లాట్ఫామ్ను కల్పించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సునీల్కుమార్ (ఐఐటీ, తిరుపతి), సాంబయ్య (జేఎన్టీయూ), ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు. బంగారం చోరీ రేణిగుంట: పట్టణంలోని బుగ్గవీధిలో నివాసమున్న బి.కల్పన ఇంట్లో 47 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధి తురాలు రేణిగుంట అ ర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పో లీసుల కథనం మేరకు.. బుగ్గవీధికి చెందిన బి.కల్పన (49) 2 తేదీ ఉదయం సుమారు 7.30 గంటలకు ఆమె ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం తీసి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. ఇంట్లోని బీ రువా తెరిచి ఉండడం, అందులోని వస్తువులు చిందవందరగా పడి ఉండడంతో దాన్ని పరిశీలించగా అందులో ఉన్న బంగారు గాజులు రెండు జతలు, బంగారు చైను, బంగారు ఉంగరం మొత్తం సుమారు 47 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రూపు–1లో శ్రీతేజస్విని
సైదాపురం:గూడూరు మండలానికి చెందిన మూడి శ్రీ తేజస్విని ఏపీపీఎస్సీ గ్రూపు–1 ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గూడూరు మండలం కంద లికి చెందిన శ్రీతేజస్విని తమ స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆరో తరగతి నుంచి కృష్ణా పురంలోని నవోదయ విద్యాలయంలో హైస్కూలు వి ద్యను పూర్తి చేశారు. తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఏపీపీఎస్సీ గ్రూపు–1లో ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూపు–1లో శ్రీతేజశ్విని విజయం సాధించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. -
ఓవరాల్ చాంపియన్గా ఎన్ఎస్యూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా నాలుగు రోజులుగా జరిగిన సౌత్జోన్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. దేశంలోని 13 వర్సిటీల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులు పలు పోటీల్లో ప్రతిభ చూపి, ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మంగళవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎల్ జయరాములు ముఖ్యఅతిథి విచ్చేసి ప్రసంగించారు. సంస్కృత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే తమ తరఫున ఇంటర్నేషనల్ స్పాన్సర్షిప్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాకే వర్సిటీకి రెండు గోల్డ్ మెడళ్లు, బెస్ట్ రీసెర్చ్ గోల్డ్మెడల్, స్పోర్ట్స్లో ప్రతిభ కనబరచిన వారికి రెండు క్రీడా గోల్డ్ మెడల్స్ అందజేస్తామని చెప్పారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత విద్యతో పాటు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సౌత్జోన్ స్పోర్ట్స్ మీట్ గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి అఖిల భారత స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పలు విభాగాలలో ప్రతిభ చూపి పతకాలను గెలుచుకున్న క్రీడాకారులకు అతిథులు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి సేతురామ్, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రొఫెసర్ దక్షిణమూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
నిరంతరాయ విద్యుత్ సరఫరానే ధ్యేయం
తిరుపతి రూరల్: వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే ధ్యేయంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ’కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవాశీర్వాదంతో కలిసి తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగేళిలో పర్యటించారు. ఆ గ్రామంలో విద్యుత్ లైన్లను పరిశీలించి, సరఫరా తీరుపై వినియోగదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రూఫ్ టాప్ సోలార్, స్మార్ట్ మీటర్ల ఉపయోగాలను వినియోగదారులకు వివరించారు. ఆ తర్వాత నారాయణవనం 33/11 కేవీ సబ్–స్టేషన్ను తనిఖీ చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల అంశంపై వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, లో–వోల్టేజ్ సమస్యను అధిగమించడం తదితర సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిప్రసాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సంఘ విద్రోహులతో ప్రాణహాని
పెళ్లకూరు: నియమ నిబంధనల ప్రకారం చట్టానికి లోబడి వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ చట్టాలను కాపాడాల్సిన కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్న వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తే చీకటి వ్యాపారం చేసుకునే పొరికి బ్యాచ్కి ఉలికిపాటు ఎందుకని కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చిల్లకూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతి సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్రాజు కలిసి చేస్తున్న అనుచిత ఒత్తిళ్లను తట్టుకోలేక ఉన్నతాధికారులను ఆశ్రయించి ఏసీబీకి పట్టించామన్నారు. ఈ క్రమంలో షాపులో పని చేస్తున్న ఓ గుమస్తాని అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్స్టేషన్లో నిర్భంచి దుర్భాషలాడడంతోపాటు ప్రతి నెలా మాముళ్లు భారీగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారన్నారు. సీఐ బాబీ చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించినట్టు వెల్లడించారు. అయితే ఏసీబీకి పట్టుబడిన సీఐ సహకారంతో చీకటి వ్యాపారాల ద్వారా లబ్ధి పొందుతున్న నాయుడుపేట, విన్నమాల ప్రాంతాలకు చెందిన షేక్ రఫీ, దార్ల రాజేంద్ర అనే సంఘ విద్రోహులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత దూషణలు చేయడం, పరుష పదజాలంతో దుర్భాషలాడం, వీడియోల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ తెర వెనుక నుంచి నడిపిస్తున్న మరి కొందరు స్మగ్లర్లు వల్ల ప్రాణహాని ఉందన్నారు. ఎందుకంటే ఏసీబీకి పట్టుబడిన సీఐ బాబీ, హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్రాజులకు చాలా కాలంగా రౌడీషీటర్లు, దొంగలు, గంజాయి వ్యాపారులతో సత్సంబంధాలున్నాయని, ఈ క్రమంలోనే ఇరువురు జైల్లో ఉంటూ రఫీ, రాజేంద్రతో బెదిరింపు వీడియోలు గ్రూపుల్లో పెడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు, హోమ్మంత్రి అనిత, డీజీపి, ఐజీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఏసీబీ ఉన్నతాధికారులకు, ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి, తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు విన్నవించారు. -
సివిల్స్చాందిని
తిరుపతి సిటీ: టీటీడీలో రిసెప్షన్–1 డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న బయ్యాల భాస్కర్ కుమార్తె చాందిని శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీ కొలువు సాధించింది. తిరుపతిలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె బీటెక్ చైన్నెలోని ఓ ప్రముఖ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో రెండేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంది. సివిల్ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకున్న ఆమె గ్రూప్–1, గ్రూప్–2 వంటి పోటీ పరీక్షలకు సైతం హాజరవుతూ వచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మూడు రకాల ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించింది. ఇందులో ఇటీవల విడుదలైన గ్రూప్–2లో ఇంటర్మీడియట్ విద్యామండలిలో అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలాగే జుడీషియల్ డిపార్ట్మెంట్లో సైతం ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికై బుధవారమే విధుల్లో చేరింది. ఇంతలోపే గ్రూప్–1 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. పోటీ పరీక్ష ఏదైనా తానున్నానంటూ సత్తా చాటి జిల్లా వాసులు ప్రశంసలందుకుంటోంది. తన లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని డీఎస్పీగా ఉద్యోగంలో చేరి సివిల్స్ కోసం మరింత కష్టపడతానని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న చాందినికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలిందే. -
గ్రావెల్ అక్రమ రవాణాపై గ్రామస్తుల తిరుగుబాటు
వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లం చెరువు సమీపంలో గ్రావెల్ను అక్రమంగా తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలించడంపై స్థానిక గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. దీంతో గ్రావెల్ మట్టితో తమిళనాడుకు తరలిపోతున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుండో వచ్చి గ్రావెల్ మాఫియా వ్యాపారం చేయడమేమిటని స్థానికులు వారిని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజులుగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ మాఫియాను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధానంగా లారీల తాకిడికి రోడ్లు ధ్వంసం కావడం, దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్నామలై జిల్లా, పోలూరు తాలూకా, పులియాన్ కుప్పం గ్రామానికి చెందిన పి శేఖర్కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరి ప్రసాద్, కానిస్టేబుల్ పళని కథనం మేరకు.. కార్వేటినగరం పోలీసులకు 2017 జనవరి 5వ తేదీ వచ్చిన సమాచారంతో కార్వేటినగరం మండలం, గురువరాజు గుంట సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐదుగురు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి ఐదు దుంగలుగా మార్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. 163 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసి, పుత్తూరు సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ దశలో నిందితుడు శేఖర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై విచారణ తప్పించి మిగిలిన నలుగురిపై కేసు విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం కేసుల విచారణ కోర్టు తిరుపతిలో ఏర్పాటు కావడంతో కేసు తిరుపతికి బదిలీ అయింది. పోలీసులు నిందితుడు శేఖర్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు శేఖర్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీఎస్పీడీసీఎల్లో పలువురికి ఉద్యోగోన్నతులు తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహించే అధికారుల్లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ రామచంద్రరావుకు చీఫ్ జనరల్ మేనేజర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గతంలో హెచ్ఆర్డీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శోభా వాలెంటీనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కూడా సీహెచ్ రామచంద్రరావుకు అప్పగించారు. అలాగే ఏపీఎస్పీడీసీఎల్లో పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన పీహెచ్ జానకిరామ్ గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయడంతో ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న జె.రమణాదేవికి పి–ఎంఎం విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.. కర్నూలు సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహించే బి.లతకు జనరల్ మేనేజర్ (ఐటీ– ఎస్ఏపీ)గా, కార్పొరేట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న కె. హేమలతకు సూపరింటెండింగ్ ఇంజినీర్ (డీపీఈ)గా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎన్. డేవిడ్ లివింగ్ స్టోన్, ఎల్. ప్రసాద్, ఎస్. కళ్యాణ్ చక్రవర్తికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్.లలితకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
తిరుపతి మంగళం: పద్మావతిపురంలో బు ధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ని యోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థా యి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయ ర్ శిరీష పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్ష కేంద్రం మార్పు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభం కానున్న యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి స్వల్ప మార్పు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడంతో అక్కడ పరీక్ష కేంద్రాలను స్థానిక ఎమరాల్డ్స్, గాయత్రి డిగ్రీ కళాశాలలకు మార్చామని పేర్కొన్నారు. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో సెంటర్ను కేటాయించిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 149 మంది గైర్హాజరు తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ మూడో రోజు పరీక్షకు 149 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 90 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ప్రాక్టికల్స్కు 4,589 మంది గాను 4,506 మంది విద్యార్థులు, మధ్యాహ్నం 90 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 4,135 మందికి గాను 4,069 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 69,262 మంది స్వామివారిని ద ర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల స మ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
గ్రామాల అభివృద్ధికి పన్నుల వసూలే కీలకం
తిరుపతి సిటీ: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని, అందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు, శానిటేషన్ నిర్వహణ, పీ3 విధానం అమలుపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూలులో అలసత్వం వహిస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుందని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బకాయి పన్నులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ వసూలు చేయాలన్నారు. శానిటేషన్ – స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇంటింట చెత్త సేకరణ, తడి–పొడి చెత్త, ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను కూడా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్నామన్నారు. పీ3 విధానం అమలులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ రాజ్ సిబ్బందికి కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్రావు, డీపీఓ సుశీలాదేవి, డీడీఓలు, జిల్లా పంచాయతీ శాఖాధికారులు, సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
లోటుపాట్లు సవరిస్తున్నాం
జిల్లాలో తిరుపతి, గూడూ రు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్లు ఉన్నాయి. తిరుపతి మినహా మిగిలిన మూడు డివిజన్లకు నేను ఈఈగా ఉన్నాను. అలాగే జిల్లా అధికారిగా అంటే ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేస్తున్నాను. 6,157 ఇళ్ల తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు రిపోర్ట్ పెట్టారు. దాంతో 5,240 ఇళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉంది. వాటిని చక్కదిద్దుతాం. తిరుపతి ఈఈ ఉద్యోగ విరమణ పొందారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొత్త అధికారిని ఏర్పాటు చేయిస్తాం. – శ్రీనివాసరావు, జిల్లా పీడీ, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట ఈఈ -
పక్కా ఇళ్లు..
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ హౌసింగ్ భాగోతం అంతా ఇంతా కాదు. ప్రధానంగా జగనన్న కాలనీల్లో(ఎన్టీఆర్ నగర్)ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు మంజూరు చేయడం దుమారంగా మారింది. అప్పటి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 571 లే అవుట్లు వేసి, పేదలకు 61,799 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు మంజూరు చేయించారు. రెండేళ్లలో 50 శాతం ఇళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక కొరత ఓ వైపు, చేసిన పనులకు బిల్లు లు సకాలంలో ఇవ్వకపోవడం మరోవైపు, అప్పటి ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లు వైఎస్సార్సీపీకి అనుకూ లం అంటూ కాంట్రాక్టర్లను మార్పు చేయడం మరోవైపు పెట్టుకుంది. ఈ మార్పులకే ఎనిమిది నెలలు కాలం గడిచింది. దీంతో ఇంటి నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఆ తర్వాత ఏడాది నుంచి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో హౌసింగ్ అధికారులు మార్పులు చేసిన ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్ల స్థానంలో తమ సతీమణి, అన్నదమ్ముళ్లు, బంధువులకే కాంట్రాక్టర్ల బాధ్యతలు అప్పగించి పెత్తనం మొత్తం హౌసింగ్ ఉద్యోగులు చేపట్టడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా నిర్మాణాల్లో ప్రతి వారం, ప్రతి నెలా పురోగమం చూపాలంటూ రాష్ట్రస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో చిత్ర విచిత్రంగా వ్యవహరించారు. సాధారణంగా ఐదు దశల్లో బేస్మెంట్, కిటికీ లెవల్ గోడలు, స్లాబ్ లెవల్ గోడలు, స్లాబ్, పూతలు ఇలా ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ.1.80 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. నాణ్యతకు ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఇంటి నిర్మాణానికి సిమెంట్ 90 బస్తాలు వాడావాల్సి ఉంది, అందుకు రూ. 24,930 ఖర్చు చేయాలి. అలాగే స్టీల్ 480 కిలోలు వాడాలి. అందుకు రూ. 33,600 ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన మొత్తాన్ని ఇసుక, సిమెండ్ రాళ్లు లేదా ఇటుకలకు, కూలీలకు ఖర్చు చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చంద్రబాబు సర్కార్లో నిబంధనలకు విరుద్ధంగా, సంపాదనే ధ్యేయంగా ఇంటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా బేసిమెంట్ లెవల్కు మట్టిని నింపకపోవడం, సిమెంట్ 90 బస్తాలు వాడకుండా అందులో 70 శాతం సిమెంట్ను మాత్రమే వాడుకుని అధిక మొత్తంలో ఇసుకను ఉపయోగించడం, స్టీల్ విషయంలోను 480 కిలోల్లో 50 శాతం మాత్రమే వాడినట్లు తెలుస్తుంది. ఇలా నామమాత్రంగా పనిచేయడంతో నాణ్యత పూర్తిగా లోపించినట్లు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల కిందట పీడీ సస్పెన్షన్ జిల్లా హౌసింగ్ పీడీ దయాకర్ను రెండు నెలల కిందట సిమెంట్, స్టీల్ స్టాక్కు సంబంధించి సక్రమంగా లెక్కలు లేకపోవడంతో సస్పెండ్ చేశారు. అనంతరం గూడూరు ఈఈగా ఉన్న శ్రీనివాసరావుకు పీడీ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా గూడూరు ఈఈగా, శ్రీకాళహస్తి ఈఈగా, సూళ్లూరుపేట ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్క ఉద్యోగికి నాలుగు పోస్టులు కట్టబెట్టారు. అయినా ఆయన కలెక్టరేట్లోని హౌసింగ్ జిల్లా కార్యాలయానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. పీడీ పోస్టు, మూడు ఈఈ పోస్టులు శ్రీనివాసరావుకే గృహనిర్మాణ విభాగానికి సంబంధించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఈఈగా శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. మొత్తంగా ఆయనకు నాలుగు పోస్టులు కట్టబెట్టారు. గృహనిర్మాణానికి సంబంధించి జిల్లాలో నాలుగు డివిజన్లకు నలుగురు ఈఈలు పనిచేయాల్సి ఉంది. ఆ డివిజన్లలో ఈఈ పాత్రే కీలకం. వేగంగా పనులు పూర్తి చేయడం ఈఈ డైరెక్షన్లోనే ఉంటుంది. అయితే నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లకు ఒక్కరే ఈఈ. అంతేకాకుండా జిల్లా అధికారిగా పీడీ పోస్టును ఆయనకే కట్టబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఈ నెల 31న(శనివారం) తిరుపతి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న మోహన్రావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించడానికి డీఈలు ముందుకు రావడం లేదని చర్చసాగుతోంది. దీంతో ఆ పోస్టును శ్రీనివాసరావు తీసుకుంటే ఇక అంతేసంగతులు అంటూ చర్చసాగుతుంది. అడుసు పాళెం జగనన్న లే అవుట్ ఇంటి నిర్మాణ బిల్లులో మోసాలిలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణానికి ఐదు దశల్లో రూ.1.80 వేలు బిల్లు చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో బేసిమెంట్ వేయడంతోపాటు లోపల బేసిమెంట్ లెవల్కు మట్టితో నింపడానికి రూ.70 వేలు, రెండో దశలో కిటికీల వరకు గోడలు నిర్మాణానికి రూ.20 వేలు, మూడో దశలో స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి రూ.30 వేలు, నాలుగో దశ స్లాబ్ వేయడానికి రూ. 40 వేలు, చివరిగా పూతలు వేయడానికి రూ, 20 చొప్పున మొత్తంగా 1.80 లక్షలు ఒక్కో ఇంటికి జమ చేయాలి ఉంది. ఇల్లు కట్టకుండానే బిల్లులు నిర్మాణ దశలు తారుమారు పురోగమనం చూపాల్సి రావడంతో మొదటి దశలో ఉండే పనులు రెండో దశగా, రెండో దశ పనులు మూడో దశగా, మూడో దశను నాలుగో దశగా, నాలుగో దశ పనులను ఐదో దశగా, ఐదో దశ పనులు పూర్తి అయినట్లు చూపించారు. అయితే దశల వారీగా ఫొటోలను అన్లైన్లో అప్లోడ్ చేయాల్సిఉంది. ఈ క్రమంలో మొదటి దశ ఇంటికి సమీపంలో రెండో దశలో ఉన్న ఇంటి ఫొటోను, రెండో దశ ఇంటికి మూడో దశలో ఉన్న ఇంటి ఫొటో, మూడో దశ ఇంటికి నాలుగో దశ ఫొటోను, నాలుగో దశ ఇంటికి ఐదో దశ ఫొటోను అప్లోడ్ చేశారు. ఈ మేరకు ఇంటి బిల్లులు మంజూరు చేయించారు. అయితే ఆ తర్వాత ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు జియోట్యాగింగ్ సర్వే నిర్వహించారు. ఏ దశలో ఉన్న ఇంటిని ఆ దశలో జియో ట్యాగింగ్ చేస్తేనే తీసుకోవడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా దశల్లో తేడాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చా యి. 6,157 ఇళ్లు తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లో తేడాలను సవరించాలని స్పష్టం చేశారు. అయితే వారం రోజు ల్లోనే జిల్లా అధికారులు 5,240 ఇళ్లను సవరించామని అన్లైన్లో కొట్టేశారు. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉందని రిపోర్ట్ పంపించారు. దీంతో మరోసారి అనుమానంతో హౌసింగ్ విజిలెన్స్ కమిటీ వచ్చింది. విజిలెన్స్ వారం రోజులు పరిశీలన తర్వాత గందరగోళంగా దశలను చూపించిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. -
మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు
నాగలాపురం: మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వేదవళ్లి సమేత వేదనారాయణ స్వామి ఆల య కుంభాభిషేకానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. రెండున్నరేళ్లుగా ఆలయంలో బాలాలయం పనులు జరుగుతున్నందున మూలస్థానం మూసివేసి, స్వామి వారి ఉత్సవమూర్తుల ద్వారా భక్తులకు దర్శనం కల్పించేవారు. వేదనారాయణుడి దర్శనాన్ని పునరుద్ధరించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 17న అంకురార్పణ, 18 నుంచి యాగశాల వైదిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం గర్భాలయ మూలవర్లకు మహా సంప్రోక్షణ, నివేదనలు సమర్పించి, భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి సారిగా రాముల వారి ఆలయ గోపురానికి, వేదవళ్లి తాయారు మండపానికి బంగారు వర్ణంతో, ముందు వైపు ఉన్న రాజగోపురానికి తెలుపు రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. -
ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ
● అనుభవమే తప్ప..ఆ భూములకు పాసు పుస్తకాలే లేవ్ ● క్రయ, విక్రయాలు రుణ అర్హత శూన్యం ●ఐదు శతాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నారు. తరాలుగా ఆ పుడమిని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. అయినా ఆ పొలాలపై వారికి అనుభవం తప్ప, వారి సొంతం కావడం లేదు. వారి పేరున పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. యాజమాన్య హక్కు పత్రాలు లేవు. వారికి ఆ భూముల క్రయవిక్రయాలకు అర్హత లేదు.. ఏ బ్యాంకులోనూ వారికి అప్పు పుట్టదు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం యాభై ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం దక్కలేదు. ఇదీ సైదాపురం మండలం కలిచేడు రైతులు దీనగాఽథ. సైదాపురం: దున్నేవాడిది భూమి అంటూ ప్రభుత్వ ప్రకటలనలు కేవలం కాగితాలు, ప్రచారానికే పరిమితమవుతున్నాయి. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నేటి వరకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవంటే ప్రతి ఒక్కరు అవాక్కవతారు. కేవలం ఆ రైతులు అండగల్లో మాత్రమే అనుభవదారులుగానే మిగిలిపోతున్నారు. కనీసం వన్బీలో అసలు ఆ రైతుల పేర్లే ఉండవు. దీంతో ఆ రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పులు పుట్టడం లేదు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల్వివాలని గతంలో అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామంటూ ముందుకు వచ్చారు. దీంతో ఆయకట్టు రైతులంతా ఎకరాకు కొంత మొత్తం చందాలు వేసుకుని, మరీ అధికారులకు ముట్టజెప్పారు. అయితే ఆ అధికారులు బదిలీ అయిపోయారు. కానీ ఆ రైతులకు నేటికీ పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ సంఘటన మండలంలోని కలిచేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని కలిచేడులో సుమారు 1800 ఎకరాల ఇనాం భూములున్నాయి. రాజాలు పాలించే సమయంలో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సుమారు 50 ఏళ్ల నుంచి ఆ భూములను ఆ గ్రామానికి చెందిన వారు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగానే చూపిస్తున్నారు. కేవలం అడంగల్లో మాత్రం సాగు చేసే రైతుల పేర్లును అనుభవదారులుగా నమోదు చేశారు. ఈ విషయమై గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకోవడంతో అప్పటి జాయింట్ కలెక్టర్ చొరవ చూపి ఆ భూములను సమగ్ర సర్వే చేసి, సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన బదిలీ కావడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది. ఆరెళ్ల కిందట ప్రతి రైతు వద్ద నగదు కూడా వసూలు చేశారు. హడావుడిగా సర్వే పనులు పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే విషయం మళ్లీ పెండింగ్ పండింది. నగదు చెల్లించిన రైతులకు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందారు. అప్పడు వసూలు చేసిన నగదును తీసుకున్న స్థానిక అధికారులు కూడా బదిలీ అయ్యారు. దీంతో రైతులు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పాసుపుస్తకాలు లేకపోవడంతో ఏ బ్యాంకు నుంచి రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టడంలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తాము సాగు చేసుకుంటున్న భూములకు పాసు పుస్తకాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. కలిచేడు రైతులు -
శ్రీవారి సేవలో ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: న్యూజిలాండ్ టీ20 సిరీస్లో ఘన వి జయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా ఫీ ల్డింగ్ కోచ్ దిలీప్ సోమ వారం వేంకటేశ్వర స్వా మివారిని దర్శించుకున్నా రు. శ్రీవారి దర్శనం అనంతరం దిలీప్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండు రోజుల్లో ఫీజులు తగ్గిస్తాం తిరుపతి సిటీ: ఎస్వీయూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులు తగ్గించాలని కోరుతూ సోమ వారం వీసీ చాంబర్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకు లు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం రెక్టార్ అప్పారావును కలిసి వినతిపత్రం అందజేశారు. బీఈడీ ఫీజుల విషయంలో ఈసీ సమావేశంలో చర్చించి, రెండు రోజుల్లో తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. -
తుంబూరు అడవిలో చిరుత సంచారం
నారాయణవనం: మండలంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తుందన్న ఫిర్యాదుతో సోమవారం అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తుంబూరు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం గాలించారు. స్థానికుల కథనం మేరకు.. తుంబూరు పంచాయతీ శ్రీనివాస ఎస్టీ కాలనీకి చెందిన మునిరాజ మేకలను ఆదివారం సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం చిరుత సుమారు మేకపిల్లను నోట కరచుకుని అడవి లోకి వెళ్లిపోవాడాన్ని గమనించారు. రాత్రి పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీసులు శ్రీనివాస ఎస్టీ కాలనీ సమీపంలో అటవీ ప్రాంతాన్ని గాలించారు. చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించలేదు. క్రూర జంతువులు మేకను తీసుకుని వెళ్లి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా అడవిలో సంచరించడం, పశువులు, మేకలను మేత కోసం అడవిలోకి తోలవద్దని పోలీసులు సూచించారు. ఫార్మర్ యాప్ సద్వినియోగం చేసుకోండి తిరుపతి అర్బన్: కొత్తగా వచ్చిన ఫార్మర్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు వెల్లడించారు. ఈ–పంట నమోదుకు సంబంధించి రైతులే స్వయంగా తమ పొలంలోకి వెళ్లి మొబైల్ ద్వారా చేసుకోవడానికి కొత్తగా వచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సీజన్కు సంబంధించి ఈ–పంట నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 20వ తేదీకి నూరుశాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రూప్–2 ప్రతిభావంతులకు ఘన సత్కారం తిరుపతి కల్చరల్: గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ప్రతిభావంతులను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వపు డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు సోమవారం ఘనంగా సత్కరించి, అభినందించారు. సత్కారం అందుకున్న వారిలో రవి, మహేష్, సువర్ణ, చేతన్, సాయిరాం, బాలాజీ, విజయ్, మోహన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభతో గ్రూప్–2లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించి, ఉన్నత కొలువు అధిరోహించాలని సూచించారు. -
పీజీఆర్ఎస్లో..అర్జీల రచ్చ
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అవసరమైన మేరకు ప్రింటింగ్ అర్జీలు లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. పీజీఆర్ఎస్కు మొత్తం 644 అర్జీలు వచ్చాయి. ఒక్కో అర్జీకి 5 నుంచి 10 మంది రావడంతో కలెక్టరేట్ 3 వేల నుంచి 6 వేల మందితో నిండిపోయింది. అర్జీదారులకు అధికారులు ఇచ్చే ప్రింటింగ్ పేపర్ అర్జీలను అవసరం మేరకు ఉంచకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. పార్టీ కండువా వేసుకుంటే క్యూ అవసరం లేదు అధికారపార్టీకి చెందిన పలువురు తమ పార్టీకి చెందిన కండువాను మెడలో వేసుకుని క్యూలో కాకుండా నేరుగా పీజీఆర్ఎస్ చాంబర్లోనికి గుంపులు గుంపులుగా వెళ్లి, అధికారులను కలసి అర్జీలను అందజేశారు. కొందరు ఏ పార్టీతో సంబంధం లేకున్న.. జేబులో కండువాను మెడలో వేసుకుని క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లి, అర్జీ ఇచ్చిన తర్వాత జేబులో పెట్టుకుని వెళ్లిపోయారు. క్యూలో గంటల కొద్ది వేచి ఉన్న వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు నానా తిప్పులు పడ్డారు. ఒక దశలో క్యూలో ఉన్న అర్జీదారులు అరుపులు కేకలు వేయడంతోపాటు పీజీఆర్ఎస్ హాలు తలుపులను పెద్దగా కొట్టడంతో చాంబర్లో ఉన్న డీఆర్వో నరసింహులు, డీఆర్డీఏ పీడీ శోభనబాబు తదితరులు క్యూ వద్దకు వారే వచ్చి అర్జీలను స్వీకరంచారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీజీఆర్ఎస్ నిర్వహణ బాధ్యత పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్కు అప్పగించారు. పదవి ఆమె చేతిలో ఉన్నా పెత్తనం మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అర్జీదారులకు అవసరం అయిన కుర్చీలు, ప్రింటింగ్ అర్జీలు, తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేయకపోవడంతో అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, దేవేంద్రరెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ భూములు కాపాడాలి పుల్లంపేట మండలం అనంతసముద్రం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 329, 328, 327, 326, 333లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించారని పుల్లంపేట ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. దీంతో కలెక్టరేట్లో అధికారులకు అర్జీను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. -
ఐఐటీలో ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్
ఏర్పేడు: న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్– 2026నకు అధికారిక ప్రీ–సమ్మిట్ ఈవెంట్ అయిన ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్’ కార్యక్రమం సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో జరిగింది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్యక్షతన జరిగిన ఈ ప్రీ– ఈవెంట్లో చట్టపరమైన అవగాహ న,వినియోగదారుల రక్షణ, గోప్యతను కాపాడే మోసా ల నివారణ, పర్యావరణ స్థిరత్వం, డేటా గోప్యతా సాధనాలు, ఏఐ అక్షరాస్యత వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించే దృక్పథాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సుమారు 60 మంది విద్యార్థులు పరిష్కార మార్గాలను వివిధ కోణాల్లో ప్రదర్శించారు. తిరుపతి ఐఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చిమలకొండ, రిషా ల్యాబ్ (ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ – హ్యూమన్ అనలిటిక్స్లో పరిశోధన), డీన్ (కాంపిటెన్సీ, డెవలప్మెంట్, ఔట్రీచ్) కార్యాలయం ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల పాల్గొన్నారు. -
పరిశోధనలకు టీం వర్క్ అవసరం
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పురోగతిని సాధించే క్రమంలో చేసే పరిశోధనలకు టీంవర్క్ ఎంతో అవసరమని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు అన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సోమవారం 13 ఇంజినీరింగ్ బీటెక్ బ్రాంచీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ బ్రాంచ్ల విద్యార్థులు పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్లు, జస్ట్ ఏ మినిట్, మిని ప్రాజెక్ట్ ఎక్స్పో, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ డీబగ్గింగ్, లోగో కాంపిట్ షన్, గ్రూప్ డిష్కషన్, ఫొటో కాంపిటిషన్, వర్డ్ ఫజల్, ప్రోమో తదితర పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిచిలిన వారికి బహుమతులను అందజేశారు. చైర్మన్ అశోకరాజు మాట్లడుతూ వృత్తి విద్యలతో ఉనికిని చాటుకోవడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి తిరుపతి తుడా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆవుల చంద్రశేఖర్ వెల్లడించారు. తిరుపతి రుయా ఆస్పత్రిని ఆయన అధికారులతో కలసి సోమవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుయా ప్రాంగణంలో మొక్కల పెంపకానికి అనువైన నాలుగు స్థలాలను ఎంపిక చేశామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్ పార్కుతో పాటు, వాకింగ్ ట్రాక్, సీటింగ్ బెంచీలు, పూల మొక్కలు, తాగునీటి వసతి ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులతోపాటు, పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటామన్నారు. సీఈఓతోపాటు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జే రాధ, ఇంజినీర్ డి లావణ్య, ఆర్ జోత్స్న, అధికారులు డాక్టర్ హరికృష్ణ ఉన్నారు. జాతీయ పోటీల్లో మహిళావర్సిటీ విద్యార్థిని ప్రతిభ తిరుపతి రూరల్: తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పద్మావతీ మహిళా యూనివర్సిటీలో బీపీఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న పి రమ్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు యూనివర్సిటీ వ్యాయామ విభాగ అధిపతి జి.సరోజినీ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య ఉమ, రిజిస్టార్ ఆచార్య ఉషా సోమవారం ఆ విద్యార్థిని అభినందించారు. -
సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జూపార్కు రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు. ఈ సైన్స్ క్విజ్ పోటీలను లయన్స్ క్లబ్ ఆఫ్ గరుడాద్రి తిరుపతి, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి సైన్స్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం సైన్స్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని వెలికితీయడంతోపాటు వారిలో పోటీ స్ఫూర్తిని రగిలించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8 నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని, ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో కూడిన బృందంగా హాజరుకాచ్చని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ప్రిలిమినరీ రౌండ్, 21, 22, మార్చి 1, 2వ తేదీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్స్, మార్చి 7, 8వ తేదీల్లో సెమీఫైనల్, మార్చి 14న ఫైనల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు ‘‘హెచ్టీటీపీఎస్://టీఐఎన్వైయుఆర్ఎల్.కామ్/ఆర్ఎస్సీటీఏఎన్ఎన్యూఏఎల్ క్విజ్’’ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో, అలాగే సైన్స్ సెంటర్లో నేరుగాను దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 0877–2286 202, 79896 94681 నంబర్లలో, అలాగే ‘‘ఆర్ఎస్సీటీఈడీయుపీఆర్ఓ:జీమెయిల్.కామ్’’ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గరుడాద్రి ప్రతినిధులు మక్కిన భాస్కర్, బండి మధుసూదనరెడ్డి, చక్రవర్తి చెన్నుపాటి, జేసీఐ ప్రతినిధులు మక్కిన జె.లక్ష్మీతేజ, ఉమామహేశ్వర్, జి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
– ఇద్దరి మృతి నాగలాపురం: ద్విచక్రవాహనంలో వెళుతూ చింత చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యు వకులు మృతి చెందిన ఘటన మండలంలోని కృష్ణాపురంలో సోమవారం వేకువ జామున చోటు చేసుకుంది. ఎస్ఐ సునీల్ కథనం మేరకు.. నిండ్ర హరిజనవాడకు చెందిన నాగరాజు(23), రామగిరి గ్రామానికి చెందిన సంజయ్ (23) ద్విచక్రవాహనంలో నాగలాపురంలోని టీఆర్ఆర్ కళ్యాణ మండపానికి ఆదివారం సాయంత్రం వివాహానికి బయలుదేరారు. పెళ్లి చూసుకుని రాత్రి మండపంలో తన స్నేహితులతో ఉండి సోమవారం వేకువ జామున నాగరాజు, సంజయ్ తిరిగి ఇంటికి బయలు దేరారు. మార్గం మధ్యలో కృష్ణాపురం సమీపంలో మలుపు వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చింత చెట్టును ఢీకొన్నారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రంలో ప్రజా పాలన ఏదీ?
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలతో రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తున్నారే తప్ప, ప్రజా పాలన ఎక్కడ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు, పంది కొవ్వులు కలిపారంటూ చేసిన ఆరోపణలు సీబిఐ నివేదికతో పటాపంచల్ అయ్యాయన్నారు. ఆ నిజాలను కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు, పవన్కళ్యాణ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కట్టా గోపియాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, మల్లెమొగ్గల ఉమాపతి, రుద్రగోపి, పద్మజ, బాలాజీ, రమణారెడ్డి, ధనశేఖర్, గోలి విజయలక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం
– నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరి(సైదాపురం):‘రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. రాజకీయ నాయకులకే బెదిరింపులు వస్తున్నాయి. హింస, రాజకీయ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్బుక్ పరిపాలన అమలవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విఽధించడం ఎంతో అవసరం’ అని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు బయట పెట్టినందు కు ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబుపై దాడి చేశారన్నారు. ఇది రాజ్యాంగ పాలన కాదని, రెడ్ బుక్ పాలన అని విమర్శించారు. రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతీకార రాజకీయాలు, విషపూరిత వాతావరణానికి తెరలేపుతున్నట్లు తెలిపారు. పోలీస్ గ్రీవెన్స్కు 105 అర్జీలు తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీకాళహస్తిలో జాబ్మేళా రేపు తిరుపతి అర్బన్: శ్రీకాళహస్తిలో బుధవారం నిర్వహించనున్న జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జాబ్మేళా పోస్ట్ర్ను కలెక్టర్తోపాటు జేసీ గోవిందరావు, డీఏఓ ప్రసాద్రావు, డీఆర్డీఏ పీడీ శోభనబాబు, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి లోకనాథం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్, సిడాప్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హజరై..ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న యువత అర్హులని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 89198 89609, 79895 09540, 9988 853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా తిరుమల : తిరుమలలో మంగళవారం జరగాల్సిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినా టీటీడీ ఈఓ బదిలీ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిసింది నూతన ఈఓ బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సమవేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న నూతన తిరుమల ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనంతరం బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎస్వీయూలో పీహెచ్డీ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఐదో తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్వ్యూలకు 50 మందిగాను 47 మంది హాజరయ్యారని ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాదరాజు తెలిపారు. -
కలిచేడులో ఆస్పత్రుల పునరుద్ధరణ ఎప్పుడో చెప్పండి
సైదాపురం: కలిచేడులో 1950లో నిర్మించిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జనరల్ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రిల సేవలను ప్రభుత్వం ఎప్పడు పునరుద్ధరిస్తుందో తెలియజేయాలని పార్లమెంట్ సమావేశాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి సోమవారం ప్రశ్నించారు. అలాగే సైదాపురం మండలంలోని తలుపూరు, కలిచేడులో ఉన్న మైకామైన్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఎంఎంఎల్డబ్ల్యూ) పాఠశాలకు నిర్మించి సుమారుగా 77 ఏళ్లు అయ్యిందని, ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఆ పాఠశాలను పునరుద్ధరించేందుకు లేవుట్, డ్రాయింగ్లు సమర్పించినప్పటికీ నేటి వరకు కార్యచరణ ప్రారంభం కాలేదని ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు స్పందించిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 17 ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు ఈఎస్ఐసీ ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డిస్పెన్సరీల నిర్వహణ, సిబ్బంది నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో జాప్యం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. కలిచేడు ఆస్పత్రి పునరుద్ధరణ అంశంపై స్పందిస్తూ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చే యాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలుంటాయని మంత్రి పేర్కొన్నారు. -
గ్రామ కమిటీలతో వైఎస్సార్ సీపీ బలోపేతం
రైల్వేకోడూరు అర్బన్: గ్రామ కమిటీల ద్వారా వైఎస్సార్ సీపీని బలోపేతం చేయనున్నట్లు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని వెంకటేశ్వరపురంలో గ్రామ కమిటీల ఏర్పాటుకు రచ్చబండ నిర్వహించారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద ప్రజలకు ఒరింగిందేమీ లేదన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి, చివరకు మోసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, చదువు, ఆరోగ్యంతో ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. చంద్రబాబు ఆ పథకాలు ప్రజలకు అందకుండా ధ్వంసం చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమమే మన పార్టీకి అండదండలని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు జగన్ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలను ప్రేరేపిస్తూ పార్టీ శ్రేణులు, నేతల వేధింపులు, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, వెంకటరెడ్డి, యనమాల మహేష్, శంకరయ్య, బుడుగుశివయ్య, సిద్దూరాయల్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగంతో నయా బిహార్గా ఏపీ
సూళ్లూరుపేట: ‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రెడ్బుక్ రాజ్యాంగం నయా బిహార్గా మార్చేసింది. ప్రస్తుతం బిహార్ సుభిక్షంగా వుంది కదా! మరి ఏపీని ఎందుకు అల్లకల్లోలం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదు కదా! మరి శ్రీవారికి క్షమాపణ చెప్పి ప్రా యశ్చితం చేసుకోమంటే అది బూతా.. ప్రశ్నించిన వా రి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు కాల్చేస్తారా! డైవర్షన్ పా లిటిక్స్లో టీడీపీ కూటమి పీహెచ్డీ చేసింది.’ అని వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వ క ర్త కిలివేటి సంజీవయ్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై సోమవారం సంజీవయ్య స్థాని క సీఐ మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. కి లివేటి మాట్లాడుతూ హిందువులకు ఆరాధ్య దైవమైన వేంకటే శ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కల్తీ చే శారని బాధ్యత కలిగిన సీఎంగా చంద్రబాబు లేని పోని ప్రచారం చేయడం సబబేనా! అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి పందికొవ్వు, ఆవుకొవ్వు కలిపారని సనాతన హైందవ ధర్మం అని లేని పోని రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందేనన్నారు. వీళ్లు చేస్తున్న లేనిపోని రాద్ధాంతంపై మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి ఈ అబద్ధపు ప్రచారాన్ని సిట్తో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందేనని అన్నారు. గత నాలుగైదు రోజుల ముందు లడ్డూలో జంతుకొవ్వు లేదని చెప్పినా కూటమి నేతలు ఉన్మాదంతో ఊగిపోయి, ప్రతి పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం తప్పు కాదా! అని ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కూటమి నాయకులు దాడికి యత్నించిన సమయంలో మాట తూలి, చంద్రబాబును కాకుండా అక్కడున్న వ్యక్తులను దూ షించారన్నారు. దీనిపై అలా అనకుండా ఉండాలని కూ డా అంబటి బాధపడ్డారనన్నారు. అంత మాత్రాన ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇటీవల నెల్లూరులో ప్రసన్నకుమార్రెడ్డి, నేడు గుంటూరులో అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాలో జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి మారణకాండ సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టం చే యడం సబబేనా బాబూ? అన్నారు. లడ్డూలో జంతుకొవ్వు లేదని సీబీఐ నిర్ధారణ చేసింది కదా! మరి మీ అందరికీ చిత్తశుద్ధి ఉంటే వేంకటేశ్వరస్వామి వద్ద సాగిల పడి, క్షమాపణలు చెప్పి భక్తులకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే దౌర్జన్య కాండ విశాఖపట్నం ఎంపీ, గీతం విద్యాసంస్థలు అధినేత మతకుమిల్లి భరత్కు సుమారు రూ.5 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ బయటకు తీయడంతో వెంటనే డ్రైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం రచయిత నారా లోకేష్కు తోడల్లుడైన భరత్కు భూములను అప్పగించే ప్రయత్నాలపై తమ పార్టీ ఉద్యమాలకు సిద్ధమైన తరుణంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ను చేసి దాడులు, దారుణ మారణ కాండను సృష్టించి రాష్ట్రాన్ని మరో బీహార్లా తయారు చేశా ర న్నారు. దేశమంతా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలో లో కేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని డౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ పట్టణ అఽ ద్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు మీజూరు రామకృష్ణారెడ్డి, బందిల మహేష్, పాల్గొన్నారు. -
శివ శివా..క్షమించవా?
సాక్షి,టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మ హాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరో వారం రోజు ల్లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. కానీ ఈ తరుణంలో వరుసగా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఒకింత భక్తుల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం.. నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్రిశూల స్నానం..భయం..భయం! శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఆదివారం త్రిశూల స్నాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చివరిలో భక్తులు వెళుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పా టు చేసిన ఐరన్ ఫెన్సింగ్కు కరెంట్ సరఫరా రావడంతో వందల మంది భక్తులు షాక్కు గురయ్యా రు. వెంటనే ఓ ఎలక్ట్రీషియన్ మేల్కొనడంతో పె నుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమా రు వంద మంది భక్తులకు స్వల్పంగా కరెంట్ షాక్ కొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై ఆల య అధికారులు ఏమీ జరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ‘కొంచెం ఆలస్యమైతే వందల మంది ప్రాణాలు పో యేవి. అప్పుడు బాధ్యత ఎవరిది?’ అంటూ మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఫొటోలకు ఫోజులు..సంప్రోక్షణలు త్రిశూల స్నానం సందర్భంగా అధికారులు, కొందరు పాలక మండలి సభ్యులు ఫొటోలకు ఫోజులివ్వడంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఓ ముఖ్య అధికారి, మరొకరు త్రిశూలాన్ని చేత్తో స్పృచించిన్నట్టు తెలుస్తోంది. దీన్ని చూసిన అక్కడి అర్చకులు అవాక్కయ్యారు. త్రిశూల స్నానం అనంతరం ఆలయం అంతటా సంప్రోక్షణ చేపట్టారు. చూసుకోవాలిగా..! త్రిశూల స్నానం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామోత్సవానికి బయల్దేరారు. అదే సందర్భంలో ఓ మృతదేహం ఎదురుగా రావడంతో వాహనాలను అక్కడే ఆపేశారు. కానీ ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ముందుగానే పసిగట్టలేకపోయారు. ఇక చేసేది లేక పట్టణ మాడ వీధులు.. స్వామి, అమ్మవార్ల గర్భాలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. మహాశివరాత్రి ముందు ఇలా వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఒకింత భక్తుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, ఆలయాధికారులు, పాలక మండలి పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మరో వారం రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు -
ఇసుక దందా ఆగేంతవరకు పోరాటం సాగిస్తా
కలువాయి(సైదాపురం): ‘అధికారపార్టీ నేతలు ధన దాహానికి సహజవనరులు అడుగంటి పోతున్నాయి. అక్రమ తవ్వకాలతో పెన్నానది గర్భశోకంతో అల్లాడిపోతోంది. ఈ అక్రమ ఇసుక దందా ఆగేంత వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాను.’ అని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి శపథం చేశారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలతో కలసి కలువాయి మండలంలోని తెలుగురాయపురం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను శుక్రవారం నేదురుమల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగురాయపురంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా కూటమి నేతలు బరితెగింపునకు నిదర్శనమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో పెన్నానదిలో పెద్ద పెద్ద యంత్రాలతో నిత్యం వందల సంఖ్యలో ఇక్కడ నుంచి ఇసుకను స్థానిక రెవెన్యూ కార్యాలయం మీదుగానే తరలించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా ఈ ఇసుక దందా జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. నదీగర్భంలోని రహదారి ఏర్పాటు చేయడంతోపాటు యంత్రాలను అక్కడే ఉంచడం, ఇసుక రీచ్పై టీడీపీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే అధికారపార్టీకి చెందిన నేతలు ఎంత బరితెగించారన్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఇసుక దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబునల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యులు అనీల్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మాగినేని కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, మన్నారపు రవికుమార్యాదవ్, శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్రెడ్డి, పులి ప్రసాద్రెడ్డి, నేతలు నారాయణరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి రాక
తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 226 రోజుల తరువాత తిరిగి చంద్రగిరి నియోజకవర్గానికి శనివారం వస్తున్నారు. ఆ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తుండగా తుమ్మలగుంట వాసులు చెవిరెడ్డి చేత గ్రామ దేవతలకు పూజలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి పరిసరాలకు చేరుకునే చెవిరెడ్డికి అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దామినేడు వద్ద ఘన స్వాగతం విజయవాడ నుంచి రోడ్డు మార్గం మీదు వచ్చే చెవిరెడ్డికి చంద్రగిరి నియోజక వర్గంలోకి అడుగుపెట్టే దామినేడు వద్ద ఘన స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్తో గజమాలలను వేయడం, హారతులతో సాదరంగా ఆహ్వానించడంతోపాటు పూలవర్షం కురిపించేలా నిర్ణయించారు. అలాగే తనపల్లి సర్కిల్, వేదాంతపురం సర్కిల్, రామానుజపల్లి సర్కిల్ వద్ద ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు కార్యకర్తలు కలసి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చివరగా తుమ్మలగుంట తెలుగుతల్లి విగ్రహం వద్ద గ్రామస్తులు దిష్టి తీసి, ఆయనను గ్రామంలోకి ఆహ్వానించనున్నారు. ఆ తరువాత ఆయన కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, శ్రీ శక్తి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు. -
పులికాట్లో పక్షుల గణన
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సుకు వచ్చే విదేశీ వలస పక్షుల లెక్కింపును అటవీశాఖాధికారులు, పర్యావరణ నిపుణులు, పక్షి పరిశోధకులు, వలంటీర్లు శుక్రవారం చేపట్టారు. ఈ సరస్సుకు ఎన్ని జాతులు పక్షులు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయ నే అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నా రు. ఈ సర్వే శని, ఆదివారాల్లో కూడా నిర్వహిస్తా మని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సె ల్వం, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజనల్ అధికారి హారిక తెలిపారు. పక్షి జాతుల వైవిధ్యం, వాటి సంఖ్య, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసుకోవడం, వాటి జీవనశైలిపై అధ్యయ నం చేస్తున్నారు. ఈ ఏడాది పక్షులు గణనలో గణనీయంగా కనిపించే ప్రముఖ జాతుల్లో పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, స్పాట్బిల్ట్ బాతులు, హెరా న్లు, ఎగ్రెట్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. మొత్తంగా తీసుకుంటే 118 రకాలైన పక్షులు 1,99,659 ఉన్నట్టుగా గుర్తించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు! నాయుడుపేట టౌన్ : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయ స్వార్థం కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయడంతో ప్రపంచంలోని 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని సూళ్లూరుపేట మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మండలంలోని తిమ్మాజీకండ్రిగలోని అభయానుగ్రహ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంజీవయ్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి తదితరులతో కలిసి ఆలయం వద్ద పూజలు చే సి, టీడీపీ, జనసేన నేతలకు కనువిప్పు కల గాలని మొక్కుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సు ప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా తెలియజేసిందన్నారు. వైఎస్సార్ సీపీ నేత కామిరెడ్డి స త్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ లో కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. నాణ్యమైన భోజనం అందించండి తిరుపతి అర్బన్: బీసీ వసతి గృహాల్లో ఉంటు న్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మల్లికార్జున్ వెల్లడించారు. విజయవాడ నుంచి శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతిలోని పలు బీసీ హాస్టళ్లను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్టల్ విద్యార్థులకు ఓ వైపు చదువుతోపాటు ఆరోగ్య విషయాల్లోను నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భరత్రెడ్డికి సూచించారు. నిత్యం పిల్లలపై నిఘా పెట్టాలని చెప్పారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల ప్రతినిధులు ఎంపిక తిరుపతి కల్చరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుప తి జిల్లాలో వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీ ప్ర తినిధులకు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కా ర్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా రాష్ట్ర మైనారిటీ సెల్ సహా య కార్యదర్శిగా శ్రీకాళహస్తికి చెందిన షేక్ ఖా దీరుల్లా, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సహాయ కార్యదర్శి గా కంచి గురవయ్య, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సహాయ కార్యదర్శిగా కె.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ సహాయ కార్యదర్శిగా పి.అఽశోక్రెడ్డి, వైఎస్సార్టీయూసీ సహాయ కార్యదర్శిగా సత్యవేడుకు చెందిన బి.సురేష్ నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తిరుపతికి చెందిన ఇమ్రాన్బాషా, ఖాదర్ బాషా, ఆరణి సంధ్య నియమితులయ్యారు. హరిత పాఠశాలలకు 8 అవార్డులు తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 పాఠశాలలు గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్కు ఎంపిక కా వడంతో ఆ స్కూళ్ల హెచ్ఎంలు న్యూఢిల్లీలో శుక్రవారం అవార్డులు అందుకున్నారు. వారితోపాటు ఏపీఎన్జీసీ జిల్లా సమన్వయకర్త బాలచైతన్యకు అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్లలోని స్టెయిన్ ఆడిటోరియంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ సునీత అవార్డులను ప్రదానం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగవరం మండలంలోని పత్తికొండ జెడ్పీ హైస్కూలు, బొమ్మసముద్రం ప్రభు త్వ హైస్కూలు, తరిగొండ జెడ్పీ హైస్కూల్, కరకంబాడి జెడ్పీ హైస్కూలు, వెదురుకుప్పం జెడ్పీ హైస్కూలు, పుత్తూరు బాలికల హైస్కూలు, ఆర్కేఎంపురం హైస్కూలు, చింతలపట్టడ హైస్కూలు కు హరిత అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల డీఈఓలు కేవీఎన్ కు మార్, రాజేంద్ర ప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీలు గౌ రీశంకర్, వెంకటరమణతోపాటు పలువురు అవా ర్డు అందుకున్న వారిని అభినందించారు. -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఏర్పేడు: నాన్ థర్మల్ ప్లాస్మా టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శుక్రవారం ప్లాస్మా రీసెర్చ్ గ్రూప్, వాటర్ క్వాలిటీ రీసెర్చ్ గ్రూప్లు సంయుక్తంగా నిర్వహించిన నాన్–థర్మల్ ప్లాస్మా టెక్నాలజీపై అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ప్రొఫెసర్ షిహాబుద్దీన్ ఎం.మాలియేకల్, డాక్టర్ రీతేష్ కుమార్ గంగ్వార్ నేతృత్వంలోని బృందం ప్లాస్మా శాస్త్రాన్ని వ్యవసాయం, పర్యావరణ భద్రత, పారిశ్రామిక రంగాల్లోని కీలక సవాళ్లకు ఎలా వినియోగించాలో వివరించారు. ఈ ప్రదర్శనలో ప్రధానంగా వికేంద్రీకృత స్థాయిలో, ప్రత్యక్ష ప్రదేశంలో పోషక విలువలు గల లిక్విడ్ ఫెర్టిలైజర్ల తయారీకి అనువైన స్కేలబుల్ ప్లాస్మా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వాతావరణంలోని నైట్రోజన్న్ను ప్లాస్మా సాంకేతికత ద్వారా పంటలు సులభంగా గ్రహించగల నీటిలో కరిగే నైట్రేట్లు, రియాక్టివ్ పదార్థాలుగా మార్చడం ద్వారా స్థిరమైన పోషక వనరును అందించవచ్చని చెప్పారు. ఈ విధానం ద్వారా ఖరీదైన దిగుమతి రసాయన ఎరువులపై వ్యవసాయ రంగం ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు, స్థిరమైన వ్యవసాయం, పర్యా వరణ పరిరక్షణకు ఈ సాంకేతికత మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ అధికారి షణ్ముగం, కాలుష్య నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ
రేణిగుంట: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సేవల వేగం, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశా రు. చాలా మంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, మార్కెట్ విలువ ధ్రువపత్రాలు, భార రహి త ధ్రువపత్రాలు జారీ విషయంలో ఆలస్యం అవుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, సి బ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలో అనధికార వ్యక్తులు ఉండడం గమనించిన ఇలా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉంటా యని హెచ్చరించారు. -
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
తిరుపతి అర్బన్: పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్లో ఉత్తీర్ణత సాధించిన యువతీయువకులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు. రష్యాకు సంబంధించిన సైబర్ స్టీల్ కంపెనీలో మెటల్, పైప్నకు చెందిన ఉద్యోగులకు ఐటీఐ, డిప్లొమా చదువుకున్న వారు ఏడాది పాటు అనుభవం ఉన్న యువతకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన 24–40 ఏళ్లు వారు రెండేళ్లు ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ విభాగాల్లో అనుభవం ఉన్న యువతీ, యువకులకు దుబాయ్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అదనపు సమాచారం కోసం 91609 12690 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు పింఛన్ల పంపిణీ తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు శనివారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వస్తున్న నేపథ్యంలో ముందు రోజు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఏ, మెప్మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో 2,64,902 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. శనివారం పంపిణీ చేయకుండా మిగిలినపోయిన వారికి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 300 మీటర్ల లోపు దూరం నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,03,77,227 వచ్చినట్లు ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయ ఆవరణలోని కొట్టు మండపం వద్ద శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 94 గ్రాములు, వెండి 677 కిలోలు, విదేశీ కరెన్సీ 181 వచ్చింది. ఈ హుండీ లెక్కింపును పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు. పీజీ తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో పలు పీజీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంఏ, ఎమ్మెస్సీలోని పలు విభాగాలకు చెందిన ఫలితాలు శుక్రవారం విడుదల చేశామని, ఫలితాల కోసం విద్యార్థులు మనబడి వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. జపాన్ సైన్స్ ప్రొగ్రామ్కు ఎస్వీయూ బృందం తిరుపతి సిటీ: జపాన్ దేశం టోయామాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ ఆధ్వర్యంలో వచ్చే నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రొగ్రామ్కు ఎస్వీయూ బృందం హాజరుకానుంది. ఈ మేరకు ఎంపికై న బృందానికి వీసీ నర్సింగరావు శుక్రవారం ప్రయాణ టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జపాన్లో జరిగే సాకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కు వర్సిటీ నుంచి ఫిజిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ హేమలత రుద్రమదేవితోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి బాలాజీ ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి సంజయ్ యాదవ్తో కూడిన బృందం హాజరుకానున్నారని తెలిపారు. విద్యా, పరిశోధన, అధునాతన సైన్న్స్, టెక్నాలజీపై అవగాహనతోపాటు ప్రయోగశాల సందర్శనలు, నిపుణుల ఉపన్యాసాలు, సైన్న్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం ప్రధాన లక్ష్యంతో ఈ ప్రొగ్రామ్ జరగనుందని చెప్పారు. ఎంపికై న బృందాన్ని రెక్టార్ అప్పారావు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు
నారాయణవనం: నడుస్తున్న టెక్నాల జీ యుగంలో సాంకేతిక పరిశోధనల తో మంచి గుర్తింపును, అవకాశాలను అందుకోవచ్చని పలువురు పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబిలీ వా ర్షికోత్సవాల్లో శుక్రవారం వర్క్షాప్లు, సెమినార్లు, నిపుణుల, అతిథుల ఉపన్యాసాలు జరిగాయి. ప్రముఖ టెక్నాలజీ పరిశ్రమలు, అకాడమిక్ రంగాల నిపుణులు ఎజిల్వన్ (చైన్నె), తిరుపతి ఐఐటీ నిపుణులు విఘ్నేష్, వెంకటయ్య, కౌటిల్య శ్రీధర్, రాజేంద్ర ప్రసాంత్ (ఐఐఐటీ శ్రీసిటీ), వైలూరు పెరుమాలు (ఐటీ కన్సల్టెంట్ డెలాయిట్)లు ఆధునిక సాంకేతికత, పరిశ్రమ అవసరాలు, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమాలు పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు పేర్కొన్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన నగదు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి గురువారం తిరుమలలోని కారు పార్కింగ్ ప్రాంతంలో అనుమానితులు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్ రమేష్ (35), అదే రాష్ట్రం హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్ (32)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు భక్తుల రద్దీని గమనించి అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని ముందుగా పరిచయం పెంచుకుని, భక్తులు స్నానానికి వెళ్లిన సమయంలో వారి లగేజ్ బ్యాగులను చోరీస్తున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి మొబైల్ ఫోను, రూ.45 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఓవరాల్ చాంపియన్స్గా విశాఖ, కృష్ణా
తిరుపతి సిటీ: రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్స్గా విశాఖ, కృష్ణా జిల్లాల జట్లు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మూడు రోజుల నుంచి జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఘనంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ పద్మారావు హాజరై విజేతలకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక ధృడత్వానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనే ప్రతి ఒక్కరూ విజేతలేనని తెలిపారు. బాలుర విభాగంలో జరిగిన పోటీల్లో విశాఖపట్నం రీజియన్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్ షిప్ను గెలుచుకున్నారు. అలాగే బాలుర విభాగంలో వ్యక్తిగత చాంపియన్షిప్ను విశాఖకు చెందిన విద్యార్థి త్రినాథ్ కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్ షిప్ను కృష్ణా జిల్లా విద్యార్థినులు కై వసం చేసుకున్నారు. వ్యక్తిగత విభాగంలో కడపకు చెందిన విద్యార్థిని భావ్య సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణారావు, ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, డాక్టర్ ద్వారకనాథ్రెడ్డి, ఎస్వీ కుమార్, ఎస్ శ్రీనివాసులు, ఎస్వీయూ పీడీ డాక్టర్ ఎం శివశంకర్రెడ్డి, హరిప్రసాద్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, 100 మంది పీడీలు పాల్గొన్నారు. -
మూకుమ్మడిగా ఇద్దరిపై దాడి
దొరవారిసత్రం: రెండు వర్గాలు మధ్య చిన్నపాటి వివాదం పెద్దది కావడంతో బైక్పై వెళుతున్న ఇద్దరి పై పలువురు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన గురువారం రాత్రి వేణుంబాకం రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ సంఘమేశ్వరావు, ఎస్ఐ అజయ్కుమార్ కథనం మేరకు.. వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వలిపి శివకుమార్, రామాంజనేయులు, అదే గ్రామానికి చెందిన విద్యాసాగర్ మధ్య పాతకక్షల దృష్ట్యా వాదోపవాదాలకు దిగి, గురువారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఇరువురు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగానే ఇరువర్గాల వారు పోలీస్ స్టేష న్ సమీపంలో వాదులాడుకుని తలపడేందుకు సిద్ధపడ్డాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ, పోలీసులు మందలించి పంపారు. అప్పటికే ఓ వర్గానికి చెందిన విద్యాసాగర్ స్వగ్రామం నుంచే కాకుండా బ యటప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులను దొ రవారిసత్రం గ్రామానికి పిలిపించాడు. స్టేషన్ వద్ద ఏమి జరుగుతుందోనని తెలుసుకునేందుకు వడ్డికండ్రిగకు చెందిన హరినాఽథ్, రమణయ్య వచ్చి తిరి గి నాయుడుపేటకు బైక్ పై వెళుతుండగా విద్యాసాగర్ వర్గానికి చెందిన పలువురు వేణుంబాకం రోడ్డు వద్ద కాపుకాసి, మూకుమ్మడి దాడికి దిగడంతో హరినాఽథ్ పరారయ్యాడు. రమణయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పిడిన ఏడు గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వడ్డికండ్రిగలో పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం
బాబు సర్కారు మరోసారి స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచి, ప్రజల నడ్డివిరవనుంది. చాంపియన్స్గా విశాఖ, కృష్ణా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్లుగా విశాఖ, కృష్టా జిల్లా ల జట్లు నిలిచాయి.ముడుపు చెల్లిస్తేనే.. మ్యుటేషన్ శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026మ్యుటేషన్ చేసుకోవడానికి జిల్లాలో సాగుతున్న రెవెన్యూ బేరాలు తెలిసిందే. కొన్నిచోట్ల బాహాటంగానే కొందరు పైసలిస్తేనే ఫైల్ ముందుకు సాగుతుందని చెప్పేస్తున్నారు. మరికొందరు అధికార పార్టీ నేతల అధికారులకు సిఫారసు చేయించి మ్యుటేషన్ చేయిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే పాలకపక్షానికి చెందిన చోటా నేతలు తమకు పెద్ద మొత్తంలో ఇచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులకు మించి అధికార పార్టీ చోటా నేతలు డిమాండ్ చేయడంతో... మళ్లీ అధికారుల వద్దకే క్యూ కడుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా డైబ్భె వేల మంది మ్యుటేషన్ దరఖాస్తులు చేసుకున్నట్లు స్పష్టం అవుతుంది. 15 నుంచి 20 శాతానికి మించి పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా 75శాతం దరఖాస్తులను డాక్యుమెంట్స్ సక్రమంగా లేవంటూ రిజెక్ట్ కొట్టినట్లు తెలుస్తోంది. 30 రోజుల వ్యవధి సాధారణంగా మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సి ఉంది. మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల తర్వాతే ఫైల్ వీఆర్ఓకు వెళుతుంది. ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్కు, అనంతరం తహశీల్దార్కు ఫైల్ చేరుతుంది. అయితే 28 లేదా 29 రోజుల సమయంలో నగదు బేరాలు కుదిరితే ఓకే చేస్తున్నారు. లేదంటే డాక్యుమెంట్స్ పెండింగ్ అంటూ ఓ సాకుగా చూపించి రిజెక్ట్ కొట్టేస్తున్నారు. అందులో వారసత్వ ఆస్తులకు చెందిన మ్యుటేషన్లు సైతం ఇలానే సాగుతున్నాయి. దీంతో సచివాలయ పరిధిలోని వీఆర్ఓల నుంచి జిల్లా కలెక్టర్ వరకు మ్యుటేషన్ దరఖాస్తులు తిరుగుతూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఓజిలి మండలంలో ఓ వీఆర్ఓ, ఓ తహశీల్దార్, రామచంద్రాపురం మండలంలో ఓ వీఆర్ఓను అర్జీల పరిష్కారం అంశంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని తేలడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. అయితే అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు. తడ: కొందరు వీఆర్ఓలు స్థానికులు కావడం, ఏళ్ల తరబడి ఇక్కడే కొలువులు చేస్తూ ఉండడంతో ఎవరి వద్ద ఎంత దండుకోవచ్చు అనే వివరాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఇక్కడి అధికారులు తమ చేతివాటం నిరాటంకంగా సాగిస్తున్నారు. మండలంలో రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 2,419 సర్వే నంబర్లు మ్యుటేషన్కి రాగా అందులో 1,922 నంబర్లు పరిష్కారం అయ్యాయి. మరో 432 తిరస్కరించబడగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయం వద్ద చెట్ల కిందే నిరీక్షిస్తున్న రైతులుమ్యుటేషన్ కోసం రైతు ఒక ఎకరాకు వీఆర్ఓకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు అందించాలి. లేదంటే అక్కడు పలు రకాల తిరకాసులుంటాయి. వెంటనే ఆ ఫైలు ఆర్ఐ వద్దకు చేరుతుంది ఆయనకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు అందించాలి.అక్కడి నుంచి డీటీతోపాటు తహశీల్దార్ వద్దకు ఫైలు వస్తుంది. అక్కడ ఆ అధికారి చెప్పినంత ఇ వ్వాల్సిందే. లేదంటే ఆ ఫైలు అప్పడే తిరస్కారానికి గురవుతుంది. ఇలా ప్రతి ఒక్క అధికారికి ముట్టజెబితేనే పని అవుతుంది. లేదంటే ఫైలు రిజెక్ట్ అవుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ముడుపులు ఇస్తే తప్ప ముటేషన్లు జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవ ల రామచంద్రాపురం మండలం పీవీపురం గ్రామ రెవెన్యూ అధికారిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఇచ్చినంత తీసుకుని గుట్టుగా ముటేషన్లను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. పాకాల మండలంలో మ్యుటేషన్లు ఏవీ పెండింగ్ లేవని తహశీల్దారు చెప్పగా చిన్నగొట్టిగల్లు మండలంలో ఆరు మ్యుటేషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ అవన్నీ కోర్టులో న్నందున అక్కడి తహశీల్దార్ నిలుపుదల చేసినట్టు సమాచారం. రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాల యంలో మ్యుటేషన్లకు గుట్టుగా డబ్బులు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తున్నట్టు దరఖాస్తుదారులు చెబుతున్నారు. చంద్రగిరి మండలంలో మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ ఎంతో కొంత ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని 8 గ్రామ పంచాయతీల పరిధిలో రీసర్వే ప్రక్రియ జరుగుతున్నందున మ్యుటేషన్లు పెద్దగా రావడం లేదు. జనవరి 1 నుంచి మ్యుటేషన్ నిలుపుదల ముందే మ్యుటేషన్ దరఖాస్తులు పేరుకుపోయాయి. దానికితోడు జిల్లాల పునర్విభజన, జేసీ అధికారాలను ఇటీవల తహశీల్దార్లుకు, ఆర్డీఓలకు బదిలీ చేసిన నేపథ్యంలో కొద్ది రోజులు మ్యుటేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో జనవరి 1 నుంచి పూర్తిగా నిలుపుదల చేశారు. సాధారణంగా వారసత్వ ఆస్తుల బదిలీలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులకు సంబంధించి, అన్ రిజిస్టర్డ్ అంశాలు, సర్వే రిపోర్ట్ లేకపోవడం తదితర సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మ్యుటేషన్ పెద్ద సమస్యగా మారిపోయింది. భూముల మ్యుటేషన్ల కోసం రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో లంచాలివ్వలేక ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు భూముల విస్తీర్ణం, మరోవైపు భూముల రేట్లు ఆధారంగా కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన కాసులు ముట్ట చెబితేనే సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. లేదంటే ఏదో ఒక సాకు చూపి, గడువు తీరినాక రిజెక్ట్ కొట్టేస్తున్నారు. దీంతో పేదలకు చెందిన మ్యుటేషన్లు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. కాసులున్నవారు, అధికార పార్టీ నేతలకు మాత్రం అడంగల్, వన్బీలలో పేర్లు మార్పు చేస్తూ రెవెన్యూ అధికారులు తమ విధేయతను చాటుకుంటున్నారు. – తిరుపతి అర్బన్ 14 నెలలుగా తిరుగుతున్నాడు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శేసెట్టి విజయ్కుమార్. వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేటకు చెందిన వారు. ఈయనకు సంబంధించిన సర్వే నెంబర్ 42–2, 42–5లో 63 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల కోసం 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మ్యుటేషన్కు చలానా కట్టి సుమారుగా ఏడాది పైన కావస్తోంది. నేటికీ ఆయన పొలానికి సంబంధించి పాసుపుస్తకాలు అందలేదు. ఈ విషయంపై బాధితుడు నిత్యం రెవెన్యూ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ఎవ్వరూ సమాధానం కూడా ఇవ్వడం లేదు. -
దేవుడితో రాజకీయాలా?
శ్రీవారి భక్తురాలిగా గత 30 ఏళ్ల నుంచి తిరుమలకు తరచూ వెళ్తున్నా. ప లుసార్లు మొక్కులు తీర్చుకునేందుకు కాలినడక సై తం వెళ్లా. శ్రీవారి లడ్డూ ప్ర సాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ప్రచారం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై బహిరంగంగా ప్రకటించారు. విచారణ చేపట్టకముందే ఇలా వదంతులు రావడం బాధేసింది. ప్రస్తుతం సీబీఐ నివేదికతో అసలు విషయం తేలిపోయింది. –సుభద్రమ్మ, భక్తురాలు, తిరుపతి రూరల్ అసలు విషయం తేలిపోయింది శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొ వ్వు కలిసిందనే విషయంపై ప్రభుత్వం నానా రా ద్ధాంతం చేసింది. రాజకీయాలకు టీటీడీని వేదిక చే సుకోవడం మంచిది కాదు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని బాబు సర్కారు సిట్ ను నియమించి విచారణ చేపట్టింది. కానీ సీబీఐ విచారణలో జంతు కొవ్వు కలవలేదని నివేదిక సమ ర్పించింది. –రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి -
పట్టపగలే రెండిళ్లలో చోరీ
అయ్యవారిపాళెంలో పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.కూటమి అపచారానికి పరిహార హోమంతిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అసత్య ప్రచారానికి శుక్రవారం తిరుపతిలో ఉదయం 10 గంటలకు శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం నిర్వహించనున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీపై బురదజల్లాలన్న దురాలోచనతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే నీచ రాజకీయాలు చేసి లడ్డూలో ఆవు, పంది కొవ్వు కలిపామంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ దుష్ప్రాచారం చేశా రని మండిపడ్డారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. ఆ దర్యాప్తులో శ్రీవారి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని తుది నివేదికలో తేల్చిచెప్పిందన్నారు. దాంతో చంద్రబాబు, పవన్కళ్యాణ్లు వైఎస్సార్సీపీపై మోపిన నింద సీబీఐ నివేదికతో పటాపంచలయ్యిందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్కళ్యాణ్ చేసిన పాపాలకు తిరుపతిలో పరిహార హోమం నిర్వహించనున్నట్లు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
సూళ్లూరుపేట: స్థానిక పోలీస్స్టేషన్లో 2018 సెప్టెంబర్ 10న నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ జిల్లా ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత గురువారం తీర్పు చెప్పారని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపారు. తమిళనాడులోని సేలం జిల్లా పెదనాయకంపాళెం తాలూకా, ఎరివలవూరుకు చెందిన ఆర్ మహాదేవన్ (24), అదే జిల్లా, తాలూకాలోని పూడూర్ గ్రామానికి చెందిన పీ వెంకటేష్ (23)ను గంజాయి అక్రమ రవాణాకేసులో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అధికారులు ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించి, ప్రాసిక్యూషన్ తరుఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్కే రఫీ మాలిక్కు అందజేయడంతో ఆయన వాదనలు వినిపించి నేరం రుజువు చేశారు. దీంతో గురువారం నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ ఫస్ట్క్లాస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి జీ గీత తీర్పు చెప్పారని సీఐ తెలిపారు. కరెంట్ షాక్తో యువకుడి మృతి ఏర్పేడు: పచ్చిగడ్డి కోస్తుండగా, గట్టుపై పడి ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన కుప్పయ్యకండ్రిగలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం కుప్పయ్యకండ్రిగకు చెందిన ఆరూరు కేశవులు కుమారుడు ఆరూరు వెంకటరమణ అలియాస్ అజయ్కుమార్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో పొలం పనులు, ఇంటి పనులు చేస్తూ కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటున్నాడు. వీరికి ఉన్న రెండు ఆవులను మేపటానికి గురువారం గ్రామానికి సమీపంలోని బీడు భూములకు తోలుకెళ్లాడు. ఆవులు మేస్తుండగా, పక్కనే ఉన్న పంట పొలాల గట్లపై ఉన్న పచ్చిగడ్డిని కొడవలిలో కోస్తుండగా, 11కేవీ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగ తెగి గట్టుపై పడి ఉండగా, గడ్డిని కోస్తూ అతను విద్యుత్ తీగను పట్టుకోవడంతో షాక్కు గురై అపరస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
రాజకీయ ప్రతీకారంతోనే చెవిరెడ్డి అక్రమ అరెస్టు
– మాజీ ఎమ్మెల్సీ యండపల్లి చంద్రగిరి: ‘లిక్కర్ స్కామ్ అనే రాజకీయ ప్రతీకార కక్ష్య ముసుగులో ప్రజలతో సంబంధం లేని తప్పుడు కేసులు సృష్టించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ పరాకాష్ట.’ అని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన గురువారం ఆనందం వ్యక్తం చేస్తూ, ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. ప్రజాస్వామ్యంలో విపక్ష రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య కార్యకర్తల గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో, ఆధారాలు లేని కేసులు పెట్టి, వ్యక్తిత్వ హననం చేస్తూ, రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టించడమే కూటమి ప్రభుత్వ పాలనగా మారిందన్నారు. -
అక్రమ ఆస్తుల కేసులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి అరెస్టు
తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఆఫీస్ సబార్డినేట్పై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మూడో శ్రేణి ఆఫీస్ సబార్డినేట్ నల్లిపోగు తిరుమలేష్పై తిరుపతి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గురువారం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో మొత్తం 11 స్థిరాస్తులు (ఇళ్ల స్థలాలు, ఫ్లాట్, భవనాలు), 1.472 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, రూ.15.26 లక్షల నగదు, ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉండగా, సోదాలు కొనసాగుతున్నా యని పేర్కొన్నారు. నిందితుడిని నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసి, నెల్లూరులోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
తిరుపతి అర్బన్: గృహ నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్ త్రీలో డీవియేషన్, రెక్టిఫైకేషన్(అవకతవకలు)పాల్పడిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో గృహనిర్మాణశాఖకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాల సమయంలో బేస్మెంట్కు మట్టి పోయకుండా, బేసిమెంట్ వేయకుండా కొందరు బిల్లులు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి అవాస్ యోజన స్కీమ్ ద్వారా 1,608 గృహాలను ఉగాదికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాల్లో తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అలాగే గడువులోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. -
అవినీతి అధికారుల్లో అలజడి
సైదాపురం: మ్యూటేషన్ పనుల్లో మాయజాలం ప్రదర్శించిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పని చేసిన రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ కావడంతో జిల్లాలో అలజడి నెలకొంది. ఏకంగా ఏడుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లతోపాటు ముగ్గురు వీఆర్వోలకు, ఒక్క సర్వేయర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదేశాలు రావడంతో రెవెన్యూ అధికారుల్లో కలవరం మొదలైంది. 2022 జూలై 2, 3 తేదీల్లో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏకకాలంలో 16 మంది నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారులు సైదాపురం తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో అలజడి 2022లో ఏసీబీ దాడుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారుల్లో అలజడి మొదలైంది. ఆ అధికారుల జాబితాలో ఉన్న శ్రీనివాసరావు ప్రస్తుతం చిల్లకూరు తహసీల్దార్గా విధులను నిర్వర్తిస్తున్నారు. ఈనెల 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే ఎంవీ సుధాకర్రావు, మునిలక్ష్మి, కాయల సతీష్ ఉద్యోగ విరమణ చేశారు. ఇతర జిల్లా నుంచి 2019లో ఎన్నికల సమయంలో వచ్చిన వి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం పాలకృష్ణ, కె.జయజయరావు విధుల్లో కొనసాగుతున్నారు. ఆ సమయంలో డీటీలుగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి ప్రస్తుతం బాలాయపల్లి తహసీల్దార్గా ఉన్నారు. అలాగే కిషోర్రెడ్డి కూడా ఉన్నారు. సర్వేయర్ హజరత్తయ్య ఇటీవలే మృతి చెందారు. వీఆర్వోలు రమాదేవి, హరిబాబు, మునిబాబు విధుల్లో ఉన్నారు. వీరంతా పదిరోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.14400కు ఫిర్యాదుతో దాడులు మండలంలో పేదలకు అందాల్సిన ప్రభుత్వ భూములను ముగ్గురి పేర్లతో ఒకే ఏడాదిలో మ్యుటేషన్ చేసి యాజమాన్య హక్కులు కల్పించే ప్రయత్నం, అగ్రిమెంట్లు చేసుకున్న భూములకు పట్టాదారుపాసుపుస్తకాలు ఇవ్వడం లాంటివి గోల్మాల్ చేయడంతో కొంత మంది బాఽధితులు ప్రభుత్వ ట్రోల్ ఫ్రీ 14400కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డిజిటల్ కీని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీ గండిపడినట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే భూమార్పిడి చేయడంతో పాటు 22ఏ జాబితాలో ఉన్న భూములను కూడా పట్టాదారు పాసుపుస్తకాలను అందించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏం సమాధానం చెబుతారో?
పవిత్రమైన తిరుమల ప్ర సాదంపై గుడిమెట్లు కడిగి మరీ సీఎం, డెప్యూటీ సీఎంలు దుష్ప్రచారం చే శారు. అసత్యపు ఆరోపణ లు చేశారు. అయితే విచా రణలో సీబీఐ ఎటువంటి కొవ్వు కలపలేదని తేల్చింది. ఇప్పుడు సీఎంచంద్రబాబు, డెప్యూటీ సీ ఎం పవన్కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు. వా స్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు ఉద యం నుంచి డైవర్షన్ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్కల్యాణ్, చంద్రబాబు భక్తులకు బహిరంగంగా క్షమా పణ చెప్పాలి. – నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అప్పుడస్సలు నమ్మలేదు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని విచారణ చేపట్టక ముందే కూటమి ప్రధాన నేతలు దారుణంగా ప్రకటనలు చేశారు. శ్రీవారి భక్తులుగా మా కుటుంబం నమ్మలేదు కానీ కొందరు భక్తులు ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి లడ్డూ తో రాజకీయాలు చేయడం బాధగా అనిపించింది. రెండేళ్లుగా సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్నా. నివేదికలో జంతు కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలవలేదని తేల్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు ఏవైనా శ్రీవారిని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు. – శ్రీనివాసన్, తమిళ భక్తుడు, తిరుపతి ● -
బోధనేతర సిబ్బంది వర్సిటీకి వెన్నెముక
తిరుపతి సిటీ: యూనివర్సిటీకి బోధనేతర సిబ్బంది వెన్నెముకతో సమానమని, విద్యార్థులకు సంస్థకు సేవ చేయడం దైవంతో సమానమని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుసా సహకారంతో వర్సిటీలో బోధనేతర సిబ్బందికి వృత్తి నైపుణ్యంపై నెల రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం గురువారం సెనేట్ హాల్లో ప్రారంభభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఒక సాధారణ పరిపాలనా వ్యాయామం కాదని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవాతత్పరత బలోపేతం చేయడానికి ఉద్దేశించిందన్నారు. ఉద్యోగులు అడ్మిషన్లు, పరీక్షలు, స్కాలర్షిప్లు, జీతం, ఆడిట్లు, డిజిటల్ రికార్డులు, ఫిర్యాదుల పరిష్కారం వంటివి విషయాలను నైపుణ్యంతో చేయాల్సి ఉంటుందన్నారు. రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్వీయూ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీధర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


