breaking news
Tirupati District News
-
పొగమంచుపై ముందస్తు చర్యలు
రేణిగుంట: స్థానిక విమానాశ్రయ పరిసరాల్లో ప్రస్తుతం పొగమంచు అధికంగా ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం విమానాశ్రయంలో ఫాగ్ ప్రిపేర్నెస్, డ్రైరన్ను నిర్వహించారు. ఐఎండీ, ఎయిర్లైన్స్, ఏఏసీ అధికారులు పాల్గొని, ఆలస్య విమానాల ప్రయాణికుల కో సం ప్రత్యేకంగా వేచి ఉండడానికి, రి ఫ్రెష్మెంట్ సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రయాణికులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ భూమి నాథన్ తెలిపారు. ‘విశ్వం’కు బెస్ట్ స్కూల్ ఎక్సెలెన్స్ అవార్డు తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవ త్సరానికి గాను తిరుప తి విశ్వం టాలెంట్ స్కూల్కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సెలెన్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్య త, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణా లు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో చోరీ కలువాయి(సైదాపురం): కలువాయిలోని రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగలు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఆలయ తాళలు రంపంతో కట్చేసి ఆలయంలోని అమ్మవార్ల రెండు మంగళ సూత్రాలు, హుండీలో సొత్తు అపహరించినట్లు ఆలయ పూజారి నాగభూషణం తెలిపారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మఠం భూమిలో ఇరువర్గాల ఘర్షణ తిరుపతి రూరల్: హథీరాంజీ మఠం భూమిలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం భౌతిక దాడులకు దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రెండు వర్గాల వారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లోని హథీరాంజీ మఠం భూముల్లో జరిగే అక్రమ కట్టడాలపై శనివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. స్వల్ప వివాదం తలెత్తడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒక్కసారిగా కర్రలు, మద్యం బాటిళ్లతో దాడులకు తెగబడి, అరుపులతో భయానక వాతావరణం కల్పించారు. దీంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా తిరుపతి రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. -
మీ ప్రాణాలకు రక్షణ
ద్విచక్రవాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించండి. అది మీ ప్రాణాలకు రక్షగా ఉంటుంది. తలజుట్టు ఊడిపోతుందన్న ఫ్యాషన్కు పోయి తలకు హెల్మెట్ ధరించడం గిల్టీగా ఫీలువుతున్నారు. దాంతో అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ వినియోగంపై రవాణా, పోలీసుశాఖ అధికారులు వాహనచోదకులకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనచోదకుల్లో చలనం రాకపోవడం భాదాకరం. ఇప్పటికై నా వాహనదారులు హెల్మెట్ను ధరించి ప్రాణాలను కాపాడుకోండి. – కొర్రపాటి మురళీమోహన్, తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి -
అనురాగం పంచి..
కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబసభ్యులు కృష్ణకుమారి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె హేమమాధురి, బంధుమిత్రులు చిత్తూరురూరల్ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అందులో నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి(64), శ్యామ ల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతి చెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరాయి. ఒంటరిదాన్ని చేశావయ్యా! చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠి వీధి లో విషాదచాయాలు అలముకున్నాయి. ఆయన ఇంటి వద్ద బంధువులు, కుటుంబీకుల ఆర్తనాదాలు మి న్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్భాయ్ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ క లచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కొలిచి..గుండెలవిసి! మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్భాయ్ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవలను పూజించేవారు. నిత్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం కల్పించారు. దుర్గానగర్ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్రెడ్డి శనివారం యూఎస్ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు. శ్యామలకు తుది వీడ్కోలు చిత్తూరు కార్పొరేషన్: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్, ఆయ న భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి వెక్కివెక్కి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకొని కుంగిపోయారు. పర్యాటకం అంటే ఇష్టపడే శ్యామల గత నెలలో నీలమ్మ, దీక్షితతో కలిసి సింగపూర్కు వెళ్లినట్లు సీనియర్ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్కుమార్రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు. కృష్ణకుమారి (ఫైల్) కొడుకులు.. కూతుళ్లు.. బంధువులు.. భార్యలు.. స్నేహితులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనురాగాల పొదరింట్లో పెనవేసుకున్న బంధాల మధ్య జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నో జ్ఞాపకాలు పంచారు. కష్టసుఖాలకోర్చి బిడ్డలను పెంచి పెద్ద చేశారు. వారి బాగోగులు కళ్ల చూడకనే తీపి గురుతులను వదలి పరలోకాలకు వెళ్లిపోయారు. భర్తలేని లోటుతో కొందరు, తల్లీదండ్రిని కోల్పోయిన బాధతో పిల్లలు.. జీవిత చరమాంకంలో కుటుంబానికి బాసటగా నిలిచే పెద్దవాళ్లు.. ఇలా జిల్లాకు చెందిన ఎనిమిది మంది శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు–మారేడుమిల్లి ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. వారి మృతదేహాలు శనివారం జిల్లాకు చేరాయి. వారిని చూసి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇందులో కొందరికి అంత్యక్రియలు నిర్వహించగా.. మరికొందరికి నేడు దహన క్రియలు పూర్తి చేయనున్నారు. అమ్మా..నాన్నా వెళ్లిపోయారా? పలమనేరు: చింతూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సునంద, శివశంకర్రెడ్డి మృతదేహాలు పలమనేరుకు చేరాయి. ఆ మేరకు వీరి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి ఒక్కగానొక్క కుమారుడైన వెంకటసాయి గుండెలవిసేలా రోదించాడు. ‘ఇక తనకు దిక్కెవరంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు శివశంకర్రెడ్డి తల్లి ఇంద్రాణమ్మ బాధ వర్ణణాతీతంగా మారింది. ఆదివారం ఆ భార్యభర్తలకు ఒకేచోట అంత్యక్రియలు జరగేలా కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెనుమూరు(కార్వేటినగరం): మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన హరినాథరెడ్డి భార్య కృష్ణకుమారి మృత దేహం శనివారం స్వ గ్రామానికి చేరింది. మృతురాలికి భర్తతోపాటు ఒక్కగానొక్క కుమార్తె హేమమాధురి ఉన్నారు. ‘నాకు త్వరలో మంచి భవిష్యత్ను అందించాలని, ఆలయాలను దర్శించుకుని పుణ్యం సంపాదించాలని బయలుదేరిన మూడో రోజే ఆయుష్యు తీరిపోయిందా తల్లి.. ఇక అమ్మా అని ఎవరిని పిలిచేది.. ఇంత త్వరగా అమ్మ అన్న పిలుపునకు దూరమవుతానని అనుకోలేదమ్మా..’ అంటూ కుమార్తె హేమమాధురి రోదించడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. జీవనాధారం కో సం బెంగళూరులో స్థిరపడినప్పటికీ నిత్యం కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఫోన్ ద్వారా సరదాగ మాట్లాకునేవారు. కృష్ణకుమారి మారేడు మిల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. అమ్మాయిని ఒక అయ్య చేతిలోకి పెట్టకుండానే.. ‘ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించావు. ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టకుండా మృత్యుఒడిలోకి జారుకున్నావా...?. నేను ఏం చేయగలను.. నీవు లేకుండా బిడ్డను ఎలా సాకగలను’ అంటూ కృష్ణకుమారి భర్త హరినాథరెడ్డి రోదించడం అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. సంతోషంగా ఉన్న కుటుంబంలో దేవుడు ఇంత విషాదాన్ని నింపుతాడా .. నీ చేతుల మీదుగా నేను వెళ్లాలనుకున్నా.. కానీ నా చేతుల మీదుగా నిన్ను సాగనంపుతానని కల్లో కూడా ఊహించ లేదు కృష్ణకుమారి’ అంటూ గుండెలవిసేల రోదించడం అందర్నీ కలచి వేసింది. అనంతరం కృష్ణవేణి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కమీషన్ల కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
తిరుపతి రూరల్: గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కోసమే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్యవిద్యను దూరం చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగనన్న ఇచ్చిన పిలుపుతో సైన్యంలా కదిలిన పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలు అనుకున్న సమయానికి కోటి సంతకాలను పూర్తి చేశారన్నారు. విద్యార్థి విభాగం నేతలకు ధన్యవాదాలు కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి పెద్ద ఎత్తున విద్యార్థులను చైతన్యపరచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన విద్యార్థి విభాగం నేతలు అందరికీ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 15న జరిగే ర్యాలీని విజయవంతం చేయండి తిరుపతిలోని పద్మావతీపురంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల15వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాలు పత్రాలను పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా ఆ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థి విభాగం నాయకులు తప్పక హాజరై విజయవంతం చేయాలన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్
ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు ఏర్పేడు: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ వెల్లడించారు. 8 రోజులపాటు తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఇప్పటికే తిరుపతి ఐఐటీకి చేరుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తిరుపతి ఐఐటీతోపాటు మద్రాస్, హైదరాబాద్ ఐఐటీల్లోనూ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీ ఇండోర్, అవుట్డోర్ క్రీడా ప్రాంగణం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం ఐఐటీలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ రెజ్లర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి 5వేల మందికి పైగా విద్యార్థులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు ఈనెల 21వ తేదీతో ముగియనున్నాయి. తిరుపతి ఐఐటీ వేదికగా చెస్(మిక్స్డ్), టెన్నిస(పురుషులు, మహిళలు), వెయిట్ లిప్టింగ్(పురుషులు) పోటీలు జరగనున్నాయి. -
అమ్మగారు మళ్లీ తనిఖీలు!
ఆమె ప్రజాప్రతినిధి కాదు.. నామినేటెడ్ పదవి కలిగిన వారు కూడా కాదు. శాసనసభ్యుడి తల్లి. అయితే తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులకు హడలెత్తిస్తుంటారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలో, స్థానిక ఆస్పత్రుల్లో, హాస్టళ్లతో తనిఖీలు చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పట్లో జనం శ్రీకాళహస్తి షాడో ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఆ తర్వాత కొద్ది రోజులు పర్యటనలు చేయలేదు. తాజాగా శనివారం విమానాశ్రయ సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వసతి సదుపాయాలు, భోజన నాణ్యత, తరగతుల నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు పట్టికలు, విద్యా ప్రమాణాలు, పరిశుభ్రత అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. – రేణిగుంట -
నేను మీ శిరోధైర్యాన్ని..!
●తిరుపతి మంగళం : నాకే బాధేస్తోంది.. ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరుపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు రాకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా. ఇంతకూ నేనెవరనేగా మీ అనుమానం. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్ను. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికై నా మీరు మారండి.. నా మాట వినండి. నన్ను తలకెక్కించుకోండి. తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ఊడి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. ఐఎస్ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. శరీరం మొత్తంలో తలే కీలకం. దానికి దెబ్బ తగలకుండా నేను కాపాడుతా. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. హెల్మెట్ ధరించకుండా వెళితే పెట్రోల్ కూడా పట్టవద్దని పెట్రోల్ బంకుల యజమానులకు కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాహనచోదకుల్లారా తలకు హెల్మెట్ లేకుండా ప్రయాణించగలరేమో.. కానీ బైక్లో పెట్రోల్ లేకుండా ప్రయాణించలేరు కదా. -
గజ..గజ..!
వామ్మో..చలి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు.. చల్లగాలులు.. పొద్దుపోతే మంచు ప్రభావం.. అర్ధరాత్రి దాటాక ఆవరిస్తున్న పొగమంచు.. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వెరసి జిల్లావాసులు గజగజ వణుకుతున్నారు. తిరుపతి తుడా:చలి పంజా విసురుతోంది. చలి తీవ్ర తకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జిల్లాలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మంచు తీవ్రత రోజు రో జుకు పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకే మొ దలవుతున్న చలి ప్రభావం మరుసటి రోజు ఉద యం 9 గంటల వరకు కనిపిస్తోంది. ఉదయం 6 గంటల వరకు చలి మరీ ఎక్కువగా ఉంటోంది. రాబోవు రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో.. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో మార్పు లు చోటు చేసుకోవడంతో చలి తీవ్రత పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది అత్యంత కనిష్టంగా ఇప్పటివర కు 17 డిగ్రీలు దిగిపోవడం చలి తీవ్రతను స్పష్టం చే స్తోంది. డిసెంబర్ చివరి, జనవరి మొదటి వారాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది. పెరిగిన గిరాకీ చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, శాలువలు, మంకీ క్యాప్లు, ఇతర రక్షణ దుస్తులకు గిరాకీ పెరుగుతోంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అవసరం రావడంతో వ్యాపారులు సామాన్యుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ధరలను అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు.వణికి పోతున్న ప్రజానీకం చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం జిల్లాపై తీ వ్రంగా కనిపిస్తోంది. మన్యం జిల్లాలను తలపించేలా గ్రామీణ ప్రాంతాల్లో మంచు కురు స్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కమ్మేస్తున్న మంచు మంచు పల్లెల్ని కమ్మేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా మంచు గుప్పెట్లోకి జిల్లా వెళ్లిపో యింది. ముఖ్యంగా తిరుమలలో చలి మంచు తీవ్ర త అధికంగా ఉంది. పాలు, కూరగాయల వ్యాపారు లు, రైతులు మంచులో తడిసి ముద్దవుతున్నారు. మంచు కారణంగా చిరువ్యాపారులు, రైతుల రోజు వారి దినచర్య సమస్యగా మారింది. మంచు కా రణంగా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా రు. ఉదయం 7 గంటల వరకు లైట్లు వెలుతురుతో నే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. -
పరిహారం మొక్కుబడిగా ఇస్తే నష్టపోతాం
పంట నష్టపరిహారం మొక్కుబడిగా ఇస్తే భారీగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల లెక్కన నష్ట పరిహారం ఇస్తే తీసుకుంటామని, లేదంటే ఆత్మహత్యలకైనా సిద్ధమేనని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చులు నష్టపరిహారంగా ఇస్తామంటే ఈ ఏడాది ఫలితం నష్టపోయినట్టే కదా! అని చెబుతున్నారు. విత్తనాలు విక్రయించిన పూజిత అగ్రో సర్వీస్ సెంటర్ యజమాని నంద్యాలలో రూ.650 బస్తా తీసుకొచ్చి రైతులకు రూ.1300 పైగా విక్రయించారు. 20 రోజులకే వెన్ను వచ్చేసిందని రైతులు గగ్గోలు పెడుతున్న విషయాన్ని అన్నపూర్ణ సీడ్ కంపెనీ నుంచి పరిహారంగా రెండు లోడ్లు విత్తనాలను కూడా తీసుకొచ్చారని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల వంతున ఈ ఏడాది గిట్టుబాటు ధర ప్రకారం నష్టపరిహారం అన్నపూర్ణ సీడ్ కంపెనీ, పూజిత ఆగ్రో సెంటర్ వారినుంచి తీసి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
టెట్ మూడో రోజూ ప్రశాంతం
తిరుపతి సిటీ: జిల్లాలో మూడో రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలు, చైన్నెలోని మూడు పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సెషన్కు 1,784 మంది హాజరుకావాల్సి ఉండగా, 1,666మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్లో 1,655 మంది హాజరు కావాల్సి ఉండగా 1,450 మంది హాజరైనట్లు తెలిపారు. దుబాయ్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్: దుబాయ్లో జనరల్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి లోకనాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓఎంసీఏపీ, వరల్డ్ పీపుల్ సొల్యూషన్స్ సంస్థల సహకారంతో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్హత పదో తరగతి, వయస్సు 21–37 వరకు ఉండాలని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ఫీజు రూ.30 వేలతోపాటు జీఎస్టీ ఉంటుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని చెప్పారు. అదనపు సమాచారం కోసం 91609 12 690, 99888 53335, 871265 5686, 879011 8349నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రశాంతంగా నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష తిరుపతి సిటీ: జిల్లాలో 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 2,060 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,212 మంది విద్యార్థులు హాజరయ్యారని, 848 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ జట్టులో తిరుపతి జిల్లా క్రీడాకారిణికి స్థానం తిరుపతి ఎడ్యుకేషన్ : గోల్ షాట్బాల్ భారత జట్టులో తిరుపతి జిల్లా నెరబైలుకు చెందిన క్రీడాకారిణి రెడ్డిచర్ల దేవీప్రియ చోటు సాధించారు. గత నెల 15వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించిన గోల్ షాట్బాల్ భారత జట్టు ఎంపిక పోటీల్లో సీ్త్రల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు నేపాల్ దేశం ఖాట్మాండులో నిర్వహించనున్న దక్షిణాసియా అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టులో ఈమె ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర, పుణెలో నిర్వహిస్తున్న భారత జట్టు ప్రాక్టీస్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న ఆమె 2010 నుంచి ఇప్పటివరకు హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, షూటింగ్బాల్ తదితర క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. తొలిసారిగా భారత జట్టులో స్థానం సాధించిన ఆమెను గోల్ షాట్బాల్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.మురళి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
చాలా ఉత్సాహంగా ఉంది
తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న 58 ఐఐటీ ఇంటర్ స్పోర్ట్స్ మీట్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నేను పోటీ పడుతున్నాను. తిరుమల వెంకన్న పాదాల చెంత ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. – జ్ఞానిప్రకాష్, బీటెక్ సీఎస్ఈ, విద్యార్థి, ఐఐటీ జోధ్పూర్, రాజస్థాన్ క్రీడల్లోనూ సత్తా చాటుతాం ఐఐటీ విద్యార్థులంటే కేవలం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను సమాజానికి పరిచ యం చేయటమే కాకుండా క్రీడల్లోనూ మేము ఎవరికీ తీసిపోము. ఇక్కడ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు బాగున్నాయి.దేశంలోని అన్ని ఐఐటీల నుంచి జట్లు పోటీలో పాల్గొనడం ఛాలెంజింగ్గా అనిపిస్తోంది. – పర్వేష్ జక్కర్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఐఐటీ, జోధ్పూర్, రాజస్థాన్ సర్వసంస్కృతుల సమ్మేళనం మేము దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటీల్లో చదువుతు న్న భావి ఇంజినీర్లు. తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చాం. మేము ప్రాక్టీ స్ ప్రారంభించాం. చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించి ఐఐటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ప్రతిభ మాలో ఉంది. – అమన్ కుమార్ గౌతమ్, ఐఐటీ, రూర్కీ, ఉత్తరాఖాండ్, ● -
తిరుమలలో నాకాబందీ
తిరుమల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలలో శనివారం వేకువజాము నుంచి నాకా బందీ నిర్వహించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ ఫారెస్ట్, బాంబు స్క్వాడ్, టీటీడీ ఫైర్ సిబ్బంది, క్రైమ్, ట్రాఫిక్ తదితర విభాగాల 82 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్లోని సుమారు 1,043 ఇళ్లను తనిఖీ చేశారు. నివాసితుల గుర్తింపు కార్డులు, వాహన రికార్డులు పరిశీలించడంతోపాటు అనుమానిత వ్యక్తుల వేలు ముద్రలను సేకరించారు. ఓనర్లు, టెన్డెంట్లు వివరాలను సేకరించామన్నారు. సరైన రికార్డు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 12 మంది వ్యక్తులను గుర్తించారు. అలాగే 15 గృహాల్లో నివాసేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నాలుగు గృహాల్లో లైసెనన్స్ లేకుండా వ్యాపారాల నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒక ఇంట్లో అనధికారికంగా కుక్కను పెంచుకున్నట్లు గుర్తించి, స్థానిక ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. గుండెపోటుతో ఏపీఎస్పీ జవాను మృతి సూళ్లూరుపేట రూరల్: మండలంలోని ఆబాక గ్రామంలో నివాసమున్న ఏపీఎస్పీ జవాను దెయ్యాల జనార్దన్ (45) గుండెపోటుతో ఇంటి వద్ద శనివారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. దెయ్యాల జనార్దన్ వెంకటగిరి తొమ్మిదో బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని శనివారం ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఎస్పీ డీఎస్పీ విజయానంద్ నేతృత్వంలో పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జనార్దన్ మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జనార్దన్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అంత్యక్రియల్లో ఏపీఎస్పీ ఎస్లు మురళీకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అంతు చిక్కని వైరస్తో నాటుకోళ్లు మృతి బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో అంతు చిక్కని వైరస్ సోకడంతో వేల నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజుల్లో మండలంలోని పలు గ్రామాల్లో వేల నాటు కోళ్లు మృతి చెందుతుండడంతో పెంపకం దార్లు లబోదిబోమంటున్నారు. దీంతో గ్రామాల్లో నాటుకోళ్లు జాడ లేకుండా పోతుంది. గాజులపెళ్లూరులో సుమారు 300కు పైగా నాటుకోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా రూ.వేలు పలికే పందెం కోళ్లు సైతం మృతి చెందడంతో భారీగా నష్టపోతున్నా రు. కోళ్లను కాపాడుకుంనేందుకు పెంపకం దార్లు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాధి సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే కుప్పకూలి మృతి చెందుతున్నారు. అయినా పశు వైద్యాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. -
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు గునపాడు పీడీ
చిట్టమూరు: మండలంలోని గునపాడు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్న పిడుగు భరత్ మహీపతి జాతీయ స్థాయిలో జరిగే మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఓఈ–2 భూపయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో హ్యామర్త్రో విభాగంలో బంగారు పతకం, డిస్కస్త్రోలో వెండి పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొ న్నారు. 2026 జనవరిలో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ బీవీ కృష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు సీతారామయ్య, పెంచలయ్య, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, రేణుక, వరలక్ష్మి, శ్రీనివాసులు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
విష సంస్కృతికి తెర లేపుతున్నారు!
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే హత్యలు, లైంగికదాడులు, కిడ్నాప్లు, బెదిరింపులు, దందాలు, రౌడీయిజం తదితర విషసంస్కృతి రోజు రోజుకు పెట్రేగి పోతుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అరాచక శుక్తులు గతంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై దాడి చేసి, భయాందోళనలకు గుర్తిచేసిన సంఘటన ఇంకా మరువలేదన్నారు. అలాగే రోజూ నెల్లూరులో దందాలు, హత్యలు, బెదిరింపులు సాధారణం అయ్యా యని తెలిపారు. ఈ క్రమంలోనే నెల్లూరు 24వ డివిజన కార్పొరేటర్ ఫమీదా తండ్రి నజీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం గూడూరు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారు పేరుగా ఉండేదని, అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల వారిని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి కేసు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బురదమడుగు చెరువు పరిశీలన దొరవారిసత్రం : మండలంలోని బురదమడుగు గ్రామ పరిధిలోని చెరువును ఇరిగేషన్ శాఖ ఏఈ వీరస్వామి శుక్రవారం సందర్శించారు. ‘సాక్షి’ దినపత్రికలో చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. చెరువు కట్ట తెగ్గొట్టిన విషయంపై స్థానిక రైతులను కలిసి ఏఈ ఆరా తీశారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణపై నివేదికను సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు అందజేస్తామన్నారు. అలాగే పంట కాలువ విషయంలో పూర్తి స్థాయిలో సర్వే చేయించిన అనంతరం రానున్న వేసవి కాలంలో పంట కాలువను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణలు, పంట కాలువ విషయంపై స్థానిక తహసీల్దార్ శైలకుమారి దృష్టికి కూడా తీసుకువెళ్లామని ఏఈ తెలిపారు. -
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
చంద్రగిరి: అదృశ్యమైన వ్యక్తి కేసును ఎట్టకేలకు మదనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. తన భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోలేదన్న మృతుడి భార్య విజయలక్ష్మి వేదనపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన పోలీసులు శుక్రవారం చంద్రగిరిలోని ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఆవులపల్లె నరసింహులు(40) వ్యవసాయంతోపాటు నాటు వైద్యం చేసేవాడు. నరసింహులు కురబలకోట మండలానికి చెందిన నాగరాజు, అతని స్నేహితుడు నారాయణస్వామి, కత్తి నరసింహులతో కలసి తిరిగేవాడు. ఈ క్రమంలో నాగరాజు ఇంటికి నరసింహులు పలుసార్లు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్యతో నరసింహులు చనువుగా ఉండడంతో అతడిని నాగరాజు అనుమానించాడు. ఈ నేపథ్యంలో నరసింహులు హతమార్చాలని నాగరాజు పథకం పన్నాడు. దీంతో అక్టోబర్ 27వ తేదీన చంద్రగిరిలో నాటువైద్యం చేయాలని నాగరాజు, ఆవులపల్లె నరసింహులు చెప్పాడు. నరసింహులు, నారాయణస్వామి బస్సులో శ్రీనివాసమంగాపురానికి చేరుకున్నారన్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాగరాజు బంధువు మునిరాజ వారిద్దరిని తన ద్విచక్ర వాహనంలో నరసింగాపురం సమీపంలోని ఓ మామిడితోటలోకి తీసుకెళ్లారు. అక్కడ నాగరాజు, నారాయణ స్వామి, కత్తి నరసింహులు కలసి ఆవులపల్లె నరసింహులు కాళ్లు చేతులు కట్టేసి కేకలు పెట్టకుండా ప్లాస్టర్తో నోటిని మూసివేశారు. అనంతరం ఆవులపల్లె నరసింహులు మెడకు తాడును బిగించి హత్య చేసి, అక్కడే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో తహసీల్దార్ శివరామసుబ్బయ్య సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి, శవ పంచనామా నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా తన భర్తను చంపిన నిందితులను నుంచి తమకు ప్రాణహాని ఉందని మృతుడి భార్య విజయలక్ష్మి మీడియా ఎదుట వాపోయారు. -
అంగన్వాడీలతో పెట్టుకుంటే..అధోగతే
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లతో పెట్టుకుంటే చంద్రబాబు సర్కార్కు అధోగతేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వే లాది మంది తమ న్యాయమైన కోర్కెల సాధనకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లకు అండగా ఉంటామని చె ప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటపై నిలవలేదని మండిపడ్డారు. న్యాయమైన కోర్కెలు మాత్రమే అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్నారన్నారు. గుజరాజ్ మోడల్లో చేస్తామని చెప్పడం కాదని..గుజరాజ్ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంగన్వాడీ వర్కర్ల రూ.24,800, హెల్పర్లకు 20,400 జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వాణిశ్రీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజమ్మ, ఐఏస్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గుడ్లూరు భారతి మాట్లాడుతూ పది రకాల యాప్లు కాకుండా ఒకే యాప్ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి మునిరాజా తదితరులు పాల్గొన్నారు. -
చోరీకి వెళ్లి హత్య
తిరుపతి క్రైమ్: ఇంట్లో పనిచేసే వ్యక్తి చోరీ చేయడానికి వెళ్లి యజమానులు ప్రతిఘటించడంతో హత్య చేసి, దోచుకెళ్లిన కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26వ తేదీన శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి కండ్రిగకు చెందిన చెవిరెడ్డి మహదేవ్రెడ్డి, జయమ్మ నిద్రిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. దీనిని గమనించిన జయమ్మ కేకలు వేయడంతో మహదేవ్ రెడ్డి కూడా నిద్రలేచాడు. దుండగుడు భయంతో జయమ్మను కత్తితో పొడిచి, ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు చేనుతో పాటు చేతికున్న గాజులను చోరీ చేశాడు. ఈ క్రమంలో ఆమె భర్త మహాదేవరెడ్డి పై దాడికి పాల్పడి, పారిపోయాడు. బాధితుల కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తుండగా తడ–శ్రీకాళహస్తి మెయిన్ రోడ్డులోని తంగెళ్లపాళెం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ఈ కేసును ఛేదించడంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఎస్టీపీఓ నరసింహమూర్తి, సీఐలు నాగార్జున రెడ్డి ప్రకాష్ ఎంతగానో కృషి చేశారన్నారు. చొరీకి పథకం రచించి.. పుల్లిరెడ్డి కండ్రిగకు చెందిన రమేష్ రెడ్డి(42) జయమ్మ వద్దనే పొలంలో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అనుకోని కారణాలతో పూర్తి స్థాయిలో అప్పులు కావడంతో ఎలాగైనా అప్పులు తీర్చుకోవడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే పక్కా ప్లాన్ వేసి, యాజమాని అయిన జయమ్మ ఇంట్లోనే చోరీ చేసేందుకు గత నెల 26వ తేదీన రాత్రి హ్యాండ్ కట్టర్, దుస్తులు, ముఖానికి కట్టుకునే గుడ్డ, కారంపొడి తీసుకుని మృతురాలి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే అక్కడ జరిగిన ప్రతిఘటనలో దంపతులపై కత్తితో దాడి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే జయమ్మ మృతి చెందగా ఆమె భర్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. నిందితుడి నుంచి తాళిబొట్టు, చైను, రెండు బంగారు గాజులతోపాటు చోరీతోపాటు హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. -
అపహరణల పర్వానికి తెరతీసిన టీడీపీ
్ఠవాకాడు: కూటమి నేతల మాట వినని వారిని హించించడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టి కిడ్నాప్ చేసే స్థాయికి బాబు ప్రభుత్వం దిగజారిందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన వాకాడులోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. వాకాడు బీసీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, నేదురుమల్లి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సయ్యద్ నజీర్ బాషా అనే వృద్ధుడిని గురువారం రాత్రి బాబు ప్రభుత్వం అండదండలతో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి భయపెట్టి అపహరించుకుపోయారన్నారు. నజీర్బాషా కుమార్తె ఫామిదా నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్గా కొనసాగుతుందన్నారు. ఈమె గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ టీడీపీలో చేరి, విసిగి వేశారిపోయిందన్నారు. తమ తప్పులు తెలుసుకున్న ఫామిదాతోపాటు నలుగురు కౌన్సిలర్లు తాడేపల్లిలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి పార్టీలో చేరారన్నారు. దీంతో నజీర్బాషాతోపాటు నెల్లూరులో మరో నలుగురు కార్పొరేటర్ల బంధువులను అపహరించినట్లు తెలిసిందన్నారు. తమ కార్యకర్త నజీర్ అపహరణపై వాకాడు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. వృద్ధుడైన నజీర్కి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామ్కుమార్రెడ్డి హెచ్చరించారు. నజీర్ను తీసుకొచ్చి వారి బంధువులకు అప్పజెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు, కోట మండలాల కన్వీనర్లు సుధాకర్నాయుడు, సంపత్కుమార్రెడ్డి, నాయకులు నాగూర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, జనార్దన్రెడ్డి, పెంచలరెడ్డి, సుధాకర్రెడ్డి, శేషురెడ్డి, వెంకటయ్య, పెంచలయ్య, మోహన్రెడ్డి, రవి పాల్గొన్నారు. -
నవోదయ– 2026 మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్కు విశేష స్పందన
తిరుపతి సిటీ: స్థానిక విశ్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనన్స్ నిర్వహించిన నవోదయ–2026 మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. త్వరలో నిర్వహించనున్న నవోదయ–2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మో డల్ పరీక్షను స్థానిక విశ్వం స్కూల్లో గురువారం నిర్వహించారు. నవోదయ ప్రవేశపరీక్ష నమూనా లోనే రూపొందించిన ఈ పరీక్షకు మొత్తం 347 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థి ముందుండాలంటే చిన్న వయసులోనే పోటీపరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చిన్న వయసులోనే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంతోనే జాతీయస్థాయి పరీక్ష ల్లో విజయాలు సాధ్యమవుతాయన్నారు. విశ్వం విద్యార్థులు నవోదయ– 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన 69 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ సంస్థకీ లేని అసాధారణ రికార్డు అన్నారు. వివరాలకు 8688888802/ 9399976999 నంబరు, వరదరాజనగర్లోని వి శ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. -
● నేడు అంగన్వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్వాడీవర్కర్లకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్టీయూ మద్దతు
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు న్యాయమైన తమ పోరాటానికి సిద్ధమయ్యారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంగన్వాడీల సమ్మెను బలపరచి..తాము అధికారంలోకి వస్తే అన్నీ సమస్యలకు తక్కువ వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అంగన్వాడీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని మండిపడుతున్నారు. పలు రకాల యాప్లతో పనిభారం తప్ప..సమస్యకు పరిష్కారం చూపలేదని దుయ్యబడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైళ్లు పాడైన నేపథ్యంలో కొత్త మొబైల్స్ను ఇవ్వాలని పోరాటాలు చేసినా, పట్టించుకోలేదని గుర్తుచేశారు. దీంతో గతంలో ఇచ్చిన మొబైళ్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన సంగతిని తెలియజేస్తున్నారు. పోరాటాలకు అంగన్వాడీలు సిద్ధం అవుతున్న విషయం తెలుసుకుని.. హుటాహుటీనా మొబైళ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని తప్పుపడుతున్నారు. 2,492 అంగన్వాడీ కేంద్రాలు మూతే.. కలెక్టరేట్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టడానికి నిర్ణయించారు. దీంతో జిల్లాలోని 2,492 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం మూతపడనున్నాయి. వాల్పోస్టర్ల ఆవిష్కరణ తిరుపతిలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వ ర్క ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఐఎస్టీయూ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి, టీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయచంద్ర, సుబ్రహ్మణ్యం, తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరాజమ్మ, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చండి ప్రతిపక్షంలో ఉన్న సమ యంలో ఇచ్చిన హామీల ను నెరవేర్చాలని కోరు తున్నాం. అంగన్వాడీ వర్కర్లు అనేక సమస్య లతో బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం సరికాదు. న్యాయమైన కోర్కెల కోసమే మా పోరాటం. శాంతియుతంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించాం. న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాం. – పద్మలీలా, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ) పనిభారం పెరిగింది పనిభారం బాగా పెరిగింది. లెక్కలేనన్ని యా ప్లు వచ్చేశాయి. ఒక్కొ క్క అంశానికి ఒక్కొక్క యాప్ను ఇచ్చేశారు. అ న్ని యాప్లను ఒక్కటిగా తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కనీస వేతనాలు రూ.26 వేలు చేయాలని కోరుతున్నాం. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి. – వాణిశ్రీ, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీస్కూళ్లు బలోపేతం చేయాలి ప్రీస్కూళ్లను బలోపేతం చేయాలి. ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయాలి. లబ్ధిదారులకు ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచాలి. మెనూ చార్జీలను పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. హెల్పర్ల పదోన్నతలకు నిర్థిష్టమైన గైడ్లైన్స్ రూపొందించాలి. మినీ వర్కర్ల క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. – సౌజన్య, అంగవ్వాడీ వర్కర్స్ యూనియన్ శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షురాలుజిల్లా సమాచారం అంగన్వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11 అంగన్వాడీ సెంటర్లు 2,492 అంగన్వాడీ మెయిన్ సెంటర్ల కార్యకర్తలు 2,092 అంగ్వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348 అంగన్వాడీ హెల్పర్లు 2,066 మంది అంగన్వాడీ పరిధిలో మొత్తం 1,46,669 మంది గర్భిణిలు 12,788 బాలింతలు 11,007 6నెలల లోపు పిల్లలు 9,627 6 నెలలపైన–3 ఏళ్ల లోపు పిల్లలు 65,433 3 ఏళ్లపైన 6 ఏళ్లు లోపు పిల్లలు 47,814 -
గాయపర్చుకుని యువకుడు తిరుమలలో హల్చల్
తిరుమల : తిరుమలలో ఓ యువకుడు తనకు తాను చేతిని గాయపర్చుకుని హల్చల్ చేసిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ, అబ్బాసియా కాలనీకి చెందిన గోగుల నగేష్ 20 ఏళ్ల కిందట కూలీ పనుల నిమిత్తం వచ్చి రేణిగుంటలో ఉంటూ భవన నిర్మాణ పనులకు తిరుమలకు వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో నగేష్ కొడుకు శ్రీనివాస్(20) తిరుములలో ఉంటూ సమస్యలు సృష్టిస్తుండడంతో సంవత్సరం క్రితమే ఇతడిని తిరుమల నుంచి కిందకు పంపారు. అయితే ఇతను గురువారం తిరుమలకు చేరుకుని స్థానిక డీఎన్ఏ రోడ్డులో తన ప్రేమ విఫలమైందంటూ తనను తాను బ్లేడుతో గాయపరుచుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై రౌడీషీట్ను ఓపెన్ చేయడంతోపాటు, అతని కుటుంబాన్ని తిరుమలకు రాకుండా పట్టణ బహిష్కరిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. -
చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు
చెరువు కట్టను తెగొట్టడంతో రైతులు తాత్కలికంగా వేసిన ఇసుక బస్తాలు దొరవారిసత్రం: మండలంలోని బురదమడుగు చెరు వు పొరంబోకు భూమి ఆక్రమించి సాగు చేసే ఆక్రమణదారులు పంట పొలాలు నీట మునిగిపోవడంతో గత వారం చెరువు కట్టను రాత్రికి రాత్రే తెగొట్టిన ఘ టన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. బురదమడుగు చెరువు కింద సుమారు 50 ఎకరాల ఆయకట్టు ఉండగా స్థానికులు పలువురు భూస్వాములు చె రువు పొరంబోకు భూమి సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమించి గత కొన్నేళ్లు నుంచి సాగు చేస్తున్నారు. ఇటీవన దిత్వా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చెరువు నిండిపోవడంతో పొరంబోకు భూమిలో సా గైన వరి ఎక్కడ మునిగిపోతుందోనని ఆక్రమణదారు లు చెరువు కట్టను తెగొట్టి నీటిని వదిలేశారు. దీంతో చెరువు నుంచి నీరు పొలాలపై ప్రవహించడంతో పొ లాలు దెబ్బతింటున్నాయి. ఇగిగేషన్ అధికారులుతో పాటు రెవెన్యూ అధికారులు తెలిపిన ఎలాంటి చర్యలు చేపట్టలేని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇంధన పరిరక్షణపై సీఎండీ పోస్టర్స్ ఆవిష్కరణ
–19, 20 తేదీల్లో తిరుపతిలో ప్రత్యేక ఎగ్జిబిషన్ తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 14వ తేదీ నుంచి జరిగే ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ గురువారం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో ఈనెల 19, 20 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తామని, ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులకు ఇంధన పరిరక్షణ–అవశ్యకత అంశంపై స్టాల్స్ ఏర్పాటు పోటీలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంధన పరిరక్షణ అంశంపై సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో విద్యార్థులకు వక్తృత్వపు, క్విజ్ పోటీలను నిర్వహిస్తారని, ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఆన్లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహిస్తామన్నారు. అందులో విజయం సాధించిన వారికి 20వ తేదీన బహుమతుల ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు, తిరుపతి ఎస్ఈ చంద్రశేఖరరావు, ఈఈ గంగాధర్రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్, ఎన్జీవో సంస్థ ప్రతినిధి మధుబాబు పాల్గొన్నారు. -
నేడు యువజన విభాగం బలోపేతంపై సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తిరుపతి లోని డీపీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఐదు జిల్లాల పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్వంశీ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతంపై ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు, నగర, మండల యువజన విభాగం నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. టెట్కు 95 శాతం మంది హాజరు తిరుపతి సిటీ: జిల్లా పరిధిలో రెండో రోజు జరిగిన టెట్కు 95 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం ఉదయం సెషన్లో 7 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 333 మంది హాజరు కావాల్సి ఉండగా 302 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరిగిన రెండో సెషన్ పరీక్షలకు 470 మంది హాజరు కావాల్సి ఉండగా 420మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలపారు. భూసేకరణ పనులు వేగవంతం తిరుపతి అర్బన్: శ్రీసిటీ ఫేజ్ –2కు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో శ్రీ సిటీ ఫేజ్ – 2కు సంబంధించి వెబ్ ల్యాండ్, ఎల్జీ ఫేజ్–1,2 పెండింగ్ భూసేకరణ పనులు, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వెబ్ ల్యాండ్పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
జాతీయ జూడో పోటీలకు ఎస్వీజేసీ విద్యార్థులు
తిరుపతి సిటీ: రాజస్థాన్ వేదికగా ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న జాతీయ బ్లైండ్ జూడో చాంపియన్ పోటీలకు తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రిన్సిపల్ సి ప్రకాష్ బాబు జాతీయ పోటీలకు ఎంపికై న పి యశ్వంత్రెడ్డి, బీ అంజి, వీ నవీన్, ఏ జీవన్ బాబు, ఎమ్ అంజిని ప్రత్యేకంగా అభినందించారు. 14న అండర్–12 బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : అండర్–12 బాయ్స్ క్రి కెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9గంటలకు నిర్వహించ నున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసి యేషన్ (సీడీసీఏ) కార్యదర్శి మందపాటి స తీష్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి, చిత్తూరు, పీలేరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి డి విజన్కు సంబంధించి మంగళం రోడ్డులోని సీ వీ క్రికెట్ అకాడమీలో, చిత్తూరు డివిజన్కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్లో, మదనపల్లి డివిజన్కు సంబంధించి పీలేరు లోని పీఐఓసీ క్రికెట్ నెట్స్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు 01–09–2013 సెప్టెంబర్ ఒ కటో తేదీలోపు జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎంపిక ప్రక్రియ ప్రాంగణంలో తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాల న్నారు. వివరాలకు 8886185559, 90002 14966 నంబర్లలో సంప్రదించాలన్నారు. యూరియా కొరత లేదు తిరుపతి అర్బన్: జిల్లాకు యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎరువుల దుకాణయజమానులు కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్య లు తప్పవని హెచ్చరించారు. రబీ సీజన్కు 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నెలల వారీగా యూరియాను రైతులకు అవసరం అయిన మేరకు తెప్పించి ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ పోటీలకు జిల్లా షూటర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : న్యూఢిల్లీ, భోపాల్ నగరా ల్లో ఈ నెల 14నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షి ప్ పోటీల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు షూటర్లు అర్హత సాధించారు. వీరిలో ఎం.అద్భుత వైష్ణవి, ఎ.హారిక, పి.హితేష్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో, ఎన్.సుష్మ, బి.నందగోపాల్ ఎయిర్ రైఫిల్ విభాగాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని శ్రీనివాస స్పో ర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని డీఎస్డీఓ శశి ధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం అధ్యక్షుడు దేవరాజ్ అభినందించారు. చిత్తూరు కార్పొరేషన్: ఉ మ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా రెడ్డివారిగురువారెడ్డిని(టీడీపీ)ని ని యమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, బందారపల్లెకు చెందిన ఆయన్ను చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. -
63,178 స్మార్ట్ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి?
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపో యినప్పటికీ.. తమ మార్కు కోసం రాజకీయ కోణంలో భాగంగా ప్రశాంతంగా ఉన్న అనేక విభాగాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో స్మార్ట్ రేషన్కార్డుల అంశం ఒకటి. గతంలో ఉన్న పాత రేషన్కార్డుల స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్ 16 నుంచి కొత్తగా స్మార్ట్ రేషన్కార్డుల పేరుతో పసుపు రంగుతో కూడిన కార్డుల పంపిణీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. జిల్లాలో 1,457 చౌకదుకాణాల్లో 5,64,567 రేషన్కార్డులు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 5,01,389 కార్జులు జారీ చేశారు. ఇంకా 63,178 కార్డులను జారీ చేయాల్సి ఉంది. కొత్తకార్డుల దరఖాస్తుకు స్మార్ట్ ఏదీ కొత్తగా 70 వేల మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారికి స్మార్ట్ రేషన్కార్డులు రాలేదు. ప్రధానంగా ఏటా పెద్ద కుటుంబాల్లో ఉంటున్న అన్నదమ్ములు వివాహం అనంతరం విడిపోయి, కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 20 వేల నుంచి 22 వేల మంది ఉన్నారు. అలాగే వివాహం కావడంతో తల్లిదండ్రుల కార్డుల నుంచి ఆడబిడ్డలు భర్త కార్డులో చేర్చడం కోసం దరఖాస్తులు చేసుకున్నవారు, పుట్టిన చిన్నబిడ్డలను ఏడాది తర్వాత రేషన్కార్డుల్లో చేర్చడానికి దరఖాస్తులు చేసుకున్నవారు, మృతి చెందిన వారిని కార్డు నుంచి పేరు తొలగించాలని దరఖాస్తులు చేసుకున్నారు. అడ్రస్ మార్పు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు.. ఇలా వివిధ రకాలుగా దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు జిల్లాలో 48వేల మంది ఉన్నారు. మొత్తంగా 70 వేల మంది సవరణల్లో భాగంగా కొత్త రేషన్కార్డుల్లో భాగంగా స్మార్ట్ రేషన్కార్డులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈకేవైసీ పేరుతో చాలమందికి బియ్యం అందడంలేదు. మరోవైపు అదనంగా డీలర్లుకు ఇవ్వాల్సిన 20 శాతం బియ్యం ఇవ్వకపోవడంతో ఏ డీలర్ పరిధిలోని కార్డుదారులు ఆ డీలర్ వద్ద బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు 1నుంచి 18 వరకు ఇస్తున్న బియ్యాన్ని 1 నుంచి 15 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఎండీయూ వాహనాలు రద్దు చేశారు. 288 డీలర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. బియ్యం తప్ప కందిపప్పుతోపాటు ఇతర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు నానా తిప్పులు పడుతుంటే..కొత్తగా స్మార్ట్ కార్డు ఇబ్బందులు తప్పడం లేదు. పంపిణీకి నోచుకోని 63,178 కార్డులు ఎవరి వద్ద ఉన్నయో తెలియక కార్డుదారులు అయోమయంలో పడ్డారు. మొన్నటి వరకు రేషన్ డీలర్ల వద్ద ఉండేవి. తర్వాత సచివాలయానికి పంపించాం..అక్కడికి వెళ్లి తీసుకోండి అంటున్నారు. తాజాగా వీఆర్వోల వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు చివరిగా ఏ డీలర్ వద్ద బియ్యం తీసుకున్నారో ఆ డీలర్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఉదాహరణకు ఓ కార్డుదారుడికి రేణిగుంట రేషన్ షాపు పరిధిలో కార్డు ఉంటే అతను తిరుపతిలో ఏదో ఒక డీలర్ వద్ద చివరి నెల(సెప్టెంబర్)బియ్యం తీసుకుని ఉంటే ఆ డీలర్ వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయానికి మిగులు కార్డులను పంపిణీ చేసినట్లు చర్చసాగుతోంది. ఈ గందరగోళంతో పలువురు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 63,178 కార్డులు ఉంటే వాటిని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పంపిణీ చేయని కార్డులను వెనక్కి పంపుతాం ఇప్పటికీ పంపిణీ చేయని స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాలో 60 వేలకు పైగా తహసీల్దార్ కార్యాలయానికి చేరాయి. త్వరలో తీసుకోండి.. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేస్తాం. వాటిని వెనక్కి పంపాల్సి వస్తుంది. కొత్తకార్డులకు స్మార్ట్ కార్డులు త్వరలో వస్తాయి. పక్క డీలర్ వద్దకే కాకుండా రాష్ట్రంలో ఏ డీలర్ వద్దకు వెళ్లిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. – శేషాచలం రాజు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
ఇదీ ఒక గెలుపేనా..!
ఏర్పేడులో ఎంపీటీసీ సభ్యులందరూ వైఎస్సార్ సీపీ వారే ఏర్పేడు: ‘ఎనిమిది నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది.. అందరూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులే.. అయినా టీడీపీ నేతలు ఒక్క ఎంపీటీసీ సభ్యు డు లేకపోయినా అధికారబలంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ స భ్యులను బెదిరించి, ప్రలోభాల కు గురి చేసి 9 మందిని వైఎస్సా ర్ సీపీని ఫిరాయించేలా చేసి తమ వైపునకు తిప్పుకుని ఒక్క స్థానం కూడా లేనిచోట రాజకీ య కుయుక్తులతో ఎంపీపీ పదవిని దక్కించుకు న్నారు. గురువారం ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను చూసి ఇది కూడా ఒక్క గెలుపేనా..? అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.’ ఏర్పేడు మండలంలో ఉన్న 16 మంది ఎంపీటీసీ సభ్యుల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత రాజీనామా చేయగా, ము సలిపేడు ఎంపీటీసీ స భ్యులు రమణమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో ప్రస్తుతం 14 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ.. అయితే ఉన్న 14మంది ఎంపీటీసీ సభ్యు లు కూడా వైఎస్సార్ సీపీ వారే. అయితే ఎంపీపీ అభ్యర్థి అయిన పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మితోపాటు కోబాక ఎంపీటీసీ సభ్యురా లు ఎన్.గౌరి, కందాడ ఎంపీటీసీ సభ్యురాలు జి.రేవతి, మడిబాక ఎంపీటీసీ సభ్యురాలు కె.పద్మమ్మ, చెల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు ఏ.రాధ, పాపానాయుడు పేట ఎంపీటీసీ సభ్యుడు కె.మునిరాజు, వికృతమాల ఎంపీటీసీ సభ్యుడు పి.రవి, అంజిమేడు ఎంపీటీసీ బి.శ్రీనివాసులు, పాతవీరాపురం ఎంపీటీసీ సభ్యుడు టి.క్రిష్ణవేణి వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించి, టీడీపీ శిబిరంలో చేరిపోయా రు. వీరందరిని టీడీపీ నేతలు ప్రలోభాలకు, బె దిరింపులకు గురి చేసి బుధవారం మధ్యాహ్నమే ప్రత్యేక శిబిరానికి తీసుకెళ్లి, వారి సెల్ఫోన్లను లా క్కున్నారు. వారందరినీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతలు తీసుకొచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శంకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట నారాయణ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏర్పే డు ఎంపీడీఓ సౌభాగ్యం ఎన్నికల ప్రక్రియను ప్రా రంభించారు. అయితే మిగిలిన ఐదుగురు వైఎస్సార్ సీపీ సభ్యులు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను బాయ్కాట్ చేయడంతో టీడీపీ మద్దతిచ్చిన 9 మంది వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎంపీటీసీ స భ్యులతోనే ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కాసేపటికే పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్కుమార్ అక్కడకు చేరుకుని ఎంపీపీని అభినందిస్తూ సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను లాక్కుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నామని టీడీపీ సంబరాలు చేసుకోవడంపై ప్రజలు ఇదీ ఒక్క గెలుపేనా? అని పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీటీసీ లేకపోయినా.. ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థా నాలున్నాయి. 16 స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు. ఇక్కడ ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడంతో నాలుగేళ్ల కిందట జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత కారణా లతో ఈ ఏడాది ఏప్రిల్లో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎంపీపీ ఎన్నిక జరిగింది. టీడీపీ ప్రలోభాలకు లొంగక.. టీడీపీ ప్రలోభాలు, తీవ్రస్థాయి బెదిరించినా ఆ మందూరు ఎంపీటీసీ సభ్యుడు, తాజా మాజీ ఎంపీపీ జమళ్ల శ్రీనివాసయాదవ్, బండారుపల్లి ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ టి.జనార్ధన్రెడ్డి, ఏ ర్పేడు ఎంపీటీసీ సభ్యుడు ఎం.భరత్కుమార్, మ ర్రిమంద ఎంపీటీసీ సభ్యుడు కె.నాగరాజరెడ్డి, గు డిమల్లం ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సావిత్రి టీడీ పీ చెంతకు చేరలేదు. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికంగా జరగనున్నట్లు భా వించిన వీరు ఎన్నికకు గైర్హాజరయ్యారు. -
ముమ్మరంగా ప్రభుత్వ స్కూళ్లలో సామాజిక తనిఖీ
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సోషియల్ ఆడిట్ ప్రక్రియ ప్రారంభించినట్లు సమగ్రశిక్షా అభియాన్ సీఎంఓ సురేష్ చెప్పారు. పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ఆరా తీసి, ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల కమిటీ సమక్షంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు పాఠశాల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. అన్ని వసతులు బాగుంటే గ్రేడ్–1 పాఠశాలలో అన్ని వసతులు బాగుంటే ఆ పాఠశాలను గ్రేడ్–1గా పరిగణిస్తున్నారు. మౌలిక వసతులు సరిగా లేని పాఠశాలలు, వసతి గృహాలకు గ్రేడ్ –4 స్థాయిని కేటాయించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 150 పాఠశాలలకు పైగా సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పాఠశాలల్లోనూ. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నాసిరకం భోజనాలు వడ్డిస్తున్నారని, విద్యార్థులకు తగిన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాలు పలుసార్లు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జిల్లాలో పాఠశాలలు, వసతి గృహాల పరిస్థితిపై సోషల్ ఆడిట్ ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు ఆడిట్ జరిపి గ్రేడ్లను కేటాయించి ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. -
ఆర్ఐఓ కార్యాలయం ముట్టడి
తిరుపతి సిటీ: చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు గురువారం తిరుపతిలోని ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా ఆర్ఐఓ ఆ కళాశాలపై విచారణ చేపట్టక పోవడం దారుణమని మండిపడ్డారు. ఆ విద్యా సంస్థలపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్వీయూ ప్రెసిడెంట్ మన్నం ప్రేమ్కుమార్, నగర అధ్యక్షుడు స్వరూప్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఎన్ఎల్ఎస్ఏ అధ్యక్షుడు సుందర్ రాజు, బీడీవీఎస్ ప్రెసిడెంట్ కొండా యుగంధర్, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులపై క్రమశిక్షణ కొరడా
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులపై సీఎండీ శివశంకర్ కొరడా ఝుళిపించారు. విధుల్లో నిర్లక్ష్యం, అనధికారక సర్వీసులు ఇవ్వడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వంటి అంశాలపై క్షు ణ్ణంగా పరిశీలించిన ఆయన ఏకంగా 25 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎవరెవరిపై ఎందుకు చర్యలు తీసుకున్నారంటే.. తిరుపతి సర్కిల్లో ఏఈగా విధులు నిర్వహిస్తూ సీనియారిటీని పాటించకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పి.ఉత్తన్నకు రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తిరుపతి సర్కిల్లో విధు లు నిర్వహిస్తూ గోశాల, నీటి సరఫరా ప్లాంట్లకు అనధికారిక విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడంతో డీఈఈ డి.వసంతయ్యకు రెండు ఇంక్రిమెంట్లు, ఏఈఈలు వీఎస్ గిరి, ఎస్.మెహబూబ్బాషా, లైన్ ఇన్స్పెక్టర్ టీడీ లక్ష్మీపతి, లైన్మన్ ఎన్.రాధాకృష్ణ, అసిస్టెంట్ లైన్మన్ బి.దామోదరం, ఎనర్జీ అసిస్టెంట్ కె. లోకేష్లకు ఒక ఇంక్రిమెంటు వంతున ఆపివేశారు. తిరుపతి సర్కిల్లో పనిచేస్తూ సంస్థ నిబంధనలను పాటించని అంశంలో ఏఈఈలు సి.రవిచంద్ర బాబు, ఎం.మోహన్రావు, బి.వెంకటరమణ, వై.బాలగున్నయ్యకు, కర్నూలు సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈఈలు వై.గర్జప్ప, ఎన్.మద్దిలేటికి ఒక ఇంక్రిమెంట్ ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు. తిరుపతి సర్కిల్లో పనిచేస్తూ అనధికారికంగా లైన్లను మార్చడం, విద్యుత్ సేవల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏఈఈ ప్రసాద్, అసిస్టెంట్ లైన్మన్ జి.సాంబశివకు మూడు ఇంక్రిమెంట్లను ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ జారీ చేశారు. కర్నూలు సర్కిల్లో డీఈఈగా పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరైన డి.ఖాజావలికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వీరిపై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ జారీ నెల్లూరు సర్కిల్లో ఇటీవల ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.శివశంకరయ్య, కర్నూలు సర్కిల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్.విశ్వశాంతి స్వరూప్ ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టినందుకు, గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్లో విద్యుత్ పరికరాల సంఖ్యను తప్పుగా నమోదు చేసిన విషయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. శంకరయ్య, ఏఈ బి.మల్లికార్జునకు, తిరుపతి సర్కిల్లో పనిచేసే ఏఈ ఎల్.చలపతి వ్యవసాయ విద్యుత్ సర్వీసులను జారీ చేయడంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ను జారీ చేశారు. జేఈపై సమగ్ర విచారణకు ఆదేశం నెల్లూరు సర్కిల్లో జూనియర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న వి.వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, గ్రానైట్ ఫ్యాక్టరీకి అనధికారికంగా స ర్వీసును మంజూరు చేయడం, తన భార్య పేరుతో ఉన్న విద్యుత్ సర్వీసుపై బకాయిలు ఉన్నప్పటికీ సర్వీసును రద్దు చేయక పోవడం, విధులకు గైర్హాజరైన వాచ్ మ్యాన్కు అటెండెన్స్ ఇవ్వడం వంటి అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ఉత్వర్వులను జారీ చేశారు. అలాగే కడప సర్కిల్లో ఏఈగా విధులు నిర్వహించిన ఎన్. రాజశేఖర్రెడ్డి కోర్టు కేసుకు సంబంధించిన అప్పీల్ను సకాలంలో ఫైల్ చేయకపోవడంపై వివరణ ఇవ్వా లని ఆదేశించారు. నెల్లూరు సర్కిల్లోని ట్రైనింగ్ సెంటర్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధు లు నిర్వహిస్తూ అనధికారిక కార్యక్రమాలను చేశారన్న అభియోగంపై కె.హంజానవాజ్ఖాన్పై నివేదికను సమర్పించాల్సిందిగా నెల్లూరు ఎస్ఈని ఆదేశించారు. ఇంతకు ముందు తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై మరో ముగ్గురు ఉద్యోగుల చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ జరుగుతున్నందున విచారణ పూర్తయిన తరువాత తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. -
అమ్మవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి తన శిష్య బృందంతో కలసి గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన చంద్రగిరి: నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థి మూడో అంతస్తు నుంచి కిందపడిన ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎన్ఎస్యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, విద్యార్థి నాయకుడు కుమార్లతో కలసి గురువారం కళాశాల వద్దకు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్ని ఈ ఘటనపై నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్ఘటనలో అనేక అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. విద్యార్థి భవిష్యత్తు ప్రమాదంలో పడేలా కాలేజీ వ్యవస్థ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా!
చంద్రగిరి: నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా అని భర్త మృతదేహం కోసం ఓ ఇల్లాలు కాళ్లరిగెలా తిరుతున్నా పోలీసులు మాత్రం వంకలు చెబుతూ కాలయాపన చే స్తూ, ఆ ఇల్లాలికి శోకాన్ని మిగిల్చుతున్న విషాద ఘట న మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన నరసింహులు (35) అక్టోబర్ 27న కనిపించకుండా పో యాడు. కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగినా, పోలీసులు మాత్రం డైరీలో ఎంట్రీ పెట్టడానికే వారం పట్టింది. ఈ నెల 3వ తేదీన మాత్రమే అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆపై నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. విచారణలో చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్య చేసి పాతిపెట్టినట్టు స్పష్టమైన వివరా లు బయటకొచ్చాయి. తన భర్తను దారుణంగా హత్య చేసి, శ్రీనిసమంగాపురం సమీపంలోని ఓ తోటలో పా తిపెట్టారని తెలుసుకున్న అతని భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలు విలపిస్తున్నారు. రెండు నెలల క్రితం ఘటన జరిగితే, పోలీసులు తీరిగ్గా కేసును ఛేదించడంతో, పాతిపెట్టిన మృతదేహంలో ఎముకల గూళ్లు తప్ప ఏ అవశేషాలు మిగిలే పరిస్థితి లేదు. అయినా తన భర్త అస్థికలైనా ఇప్పించండి సారూ..అంటూ మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులను వేడుకుంటోంది. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
తిరుపతి రూరల్ : రాష్ట్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి విమర్శించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. బకాయిలు ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టులు చేయించడం చంద్రబాబు ఫాసిస్ట్ పాలనకు నిదర్శనమన్నారు. పెండింగ్లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి మాట్లాడుతూ.. ఫీజుల బకాయిలపై శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యతో పాటు ఇతర విద్యార్ధులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమం ఆగదని, ఫీజులు చెల్లించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు ప్రేమ్కుమార్ , చంద్రగిరి మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, ఆర్సీపురం మండల అధ్యక్షుడు, యశ్వంత్ రెడ్డి, ఎర్రావారిపాళెం మండలం అధ్యక్షుడు శేష రెడ్డిలతో పాటు విద్యార్థి నాయకుడు ముని తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల రక్షణ అందరి బాధ్యత
తిరుపతి సిటీ : మానవ హక్కుల రక్షణ పౌరులందరి బాధ్యతని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఎస్వీయూలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ మానవ హక్కులపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. రెక్టార్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, విశ్వం స్కూల్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రవిబాబు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ కోదండరామిరెడ్డి , లాయర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. మహిళా వర్సిటీలో.. తిరుపతి రూరల్ : మహిళా వర్సిటీలో మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ శ్యామ్సుందర్ మాట్లాడుతూ పౌరులందరు తమ హక్కులనే కాక బాధ్యతలను కూడా గుర్తించాలని కోరారు. సోషల్ మీడియా సైట్లో జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కో–ఆర్డినేటర్ ఆచార్య వాణి మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షణ న్యాయ విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణపై విద్యార్థినులతో ఆచార్య టి.సీతా కుమారి ప్రతిజ్ఞ చేయించారు. -
ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం
చంద్రగిరి : చదువుల ఒత్తిడిని భరించలేకనే మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆ విషయం పక్కదారి పట్టించేందుకు నారాయణ కాలేజీ యాజమాన్యం నాటకాలు ఆడుతోందని వెఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి విమర్శించారు. రెండు చేతులు కూడా సక్రమంగా పట్టని కిటికీ నుంచి విద్యార్థి కిందకు దూకాడని చెబుతున్నారంటే వీరిని ఏమనాలి..? నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం అగరాల వద్దనున్న నారాయణ విద్యాసంస్థలో అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ యువకుడు రక్తపు గాయాలతో పడుండగా కాలేజీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతడు కిటికీలో నుంచి బయటకు వచ్చి పైపుల ద్వారా కిందకు దిగే ప్రయత్నంలో కిందపడి దెబ్బలు తగిలినట్టు బుకాయిస్తున్నారన్నారు. ప్రాణాలకు తెగించి అన్నం కోసం బయటకు వెళతారా ? కాలేజీ సిబ్బంది చెబుతున్న మాటలు చూస్తుంటే అనుమానంగా ఉందని, ఆ పిల్లాడిపై చదువుల ఒత్తిడి తేవడం వల్లనే తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోందన్నారు. నిజాలు బయటకు రావాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, నారాయణ విద్యాసంస్థల యజమాని రాష్ట్ర మంత్రి కావడం వల్ల పోలీసులు ఆ కేసును అణగదొక్కుతారు తప్ప లోతుగా విచారణ చేపట్టరని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల సంఘం నుంచి పోరాడుతామని, అవసరమైతే న్యాయ స్థానాల్లో కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్, ఎస్వీయూ అధ్యక్షు ప్రేమ్కుమార్, ఆర్సీపురం అధ్యక్షులు యశ్వంత్రెడ్డి, ఎర్రవారిపాళ్యం అధ్యక్షులు శేషారెడ్డి, ఎన్ఎల్ఎస్ఏ విద్యార్థి నేత సుందర్, బీఎన్ఎస్ విద్యార్థి సంఘం నేత విక్రమ్ యాదవ్, బీసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు తిరుమలేశులు పాల్గోన్నారు. -
పలువురు తహసీల్దార్ల బదిలీ
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలువురు తహశీల్దార్లను బదిలీచేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి రూరల్ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న రామాంజులునాయక్ను కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బదిలీచేశారు. ఆ స్థానానికి శ్రీకాళహస్తి తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న జనార్ధన్రాజును బదిలీచేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈ–సెక్షన్ సూపరింటెండెంట్గా ఉన్న డి.లక్ష్మీనారాయణను బీఎన్ కండ్రిగకు, అక్కడ పనిచేస్తున్న తహశీల్దారు శ్రీదేవిని సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన సౌలభ్యం కింద వారిని బదిలీ చేసినట్టు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైపుల లారీ బోల్తా రేణిగుంట : మండలంలోని గాజులమండ్యం సమీపంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాళహస్తి నుంచి చైన్నె వెళ్తున్న పైపుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ నాగరాజు చేరుకొని క్రేన్ల సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. బైక్ ఢీకొని వృద్ధుడి మృతి డక్కిలి : బైక్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని వెంకటగిరి– రాపూరు జాతీయ రహదారిలోని లింగసముద్రం దళితవాడకు చెందిన గోనుగొడు వెంకటరామయ్య (60) అనే వృద్ధుడిని వెంకటగిరి నుంచి మాధవాయిపాళెం వైపు వెళ్తున్న కరిపం శివ అనే యువకుడు బైక్తో ఢీకొనడంతో వెంకట రామయ్య తీవ్రంగా గాయపడ్డారు. 108లో వెంకటగిరి సీహెచ్సీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు డక్కిలి ఇన్చార్జి ఎస్ఐ కామినేని గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివ తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. ప్రొఫెసర్లకు వైద్య పరీక్షలు పూర్తి తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈమేరకు బుధవారం అధ్యాపకులు లక్ష్మణ్ కుమార్, శేఖర్రెడ్డిలను వైద్య పరీక్షల నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెస్ట్ పోలీసులు కోర్టులో హాజరుపరచినట్లు సమాచారం. -
ఏడు గంగల జన జాతర
తేరువీధిలో నల్లగంగమ్మ శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా జరుగుతున్న ఏడు గంగల జాతర వైభవంగా సాగుతోంది. అమ్మవారి గుడి వద్ద నుంచి ఏడుగురు గంగమ్మలను ఆయా జాతర కమిటీలు మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు విశేషంగా పాల్గొని హారతులు సమర్పించారు. ముతాలమ్మ గుడి వద్ద ప్రత్యేక హారతులు సమర్పించిన తరువాత పెండ్లి మండపం వరకు చేరుకుని మొదటి గంగమ్మను స్థాపించారు. భద్రకాళీలా భక్తులకు మొదటి గంగమ్మ పొన్నాలమ్మ రూపంలో కటాక్షించింది. గంగమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమ్మవార్లకు ఏడు గంగమ్మల ఆలయం వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కాగా ఊరేగింపులో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొత్తపేట గంగమ్మ ఊరేగింపులో ప్రముఖ సినీ హీరో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్ను పోలిన డూప్లు ప్రజలను ఆకర్షించారు. – శ్రీకాళహస్తి -
టీటీడీకి రెండు ఈవీ కార్లు విరాళం
తిరుమల : తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాఝెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. అదేవిధంగా చైన్నెకి చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాఝెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు. మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలి వరదయ్యపాళెం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని డీఆర్డీఏ పీడీ శోభన్బాబు ఆకాంక్షించారు. బుధవారం పిచ్చాటూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక పురోగతికి పునాది అన్నారు. డీపీఎం వెంకటేష్, ఏపీఎంలు రాధమ్మ, చంద్రబాబు పాల్గొన్నారు. -
క్రీడాకారుడు గణేష్కు కలెక్టర్ అభినందన
తిరుపతి కల్చరల్ : నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గణేష్ను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. గణేష్ ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన క్రీడాకారుడిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నేటి నుంచి సఖీ సురక్ష తిరుపతి అర్బన్ : ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు సఖీ సురక్ష పేరుతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మెప్మా అధికారులతో కలసి పోస్టర్లను విడుదల చేశారు. జిల్లాలోని 35 సంవత్సరాల వయస్సుపైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం వెంకటగిరి నియోజకవర్గంలో 411 మహిళా సంఘాలకు, 12వ తేదీన తిరుపతిలో 425 మహిళా సంఘాలు, గూడూరు నియోజకవర్గంలో 12వ తేదీన 810 సంఘాలు, 13 వతేదీన తిరుపతిలో మిగిలిన 425 సంఘాలు, 13న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 696 సంఘాలు, 15వ తేదీన తిరుపతిలోని మరో 1270 సంఘాలు, 16వ తేదీన పుత్తూరులోని 510 సంఘాలలోని మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
శ్రీసిటీలో టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(పీఈటీఐ) సంస్థ తమ అవరణలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎన్ఏబీఎల్( నీటి/ మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ సన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీని ‘ క్లీన్ అండ్ గ్రీన్’ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. దీని ద్వారా పరిశ్రమలకు వేగ వంతమైన ఖచ్చితమైన, విశ్ససనీయ నీటి పరీక్షా సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.పేక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ కొత్త ల్యాబ్ ‘మేక్ ఇన్ ఇండియా’ఆలోచనకు అనుగుణంగా అత్యాధునిక టెస్టింగ్ సేవలను అందిస్తుందన్నారు. -
వైద్య విద్యపై నీచ రాజకీయం
వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మరింత మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉన్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించారు. అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురాలోచనతో వైద్య విద్యపై నీచ రాజకీయాలు చేస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు. – భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు,తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు తిరుగుబాటు తప్పదు కూటమి ప్రభుత్వం నియంత పోకడలతో ముందుకెళ్తోంది. ఇది ప్రజా తిరుబాటుకు నాంది. ఈ తిరుబాటు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేస్తుంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. ప్రజా వ్యతిరేకానికి నిదర్శనమే మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి 30లక్షల సంతకాలు. సూపర్సిక్స్ లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం లేదు. – ఆర్కే.రోజా, మాజీ మంత్రి -
ప్రశాంతంగా మొదటి రోజు టెట్
తిరుపతి సిటీ : జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలల్లో ఉదయం సెషన్లో 714 మంది హాజరు కావాల్సి ఉండగా 659 మంది హాజరయ్యారు. 55 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండవ సెషన్ టెట్కు 297 మంది హాజరు కావాల్సి ఉండగా 260 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 37 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరును పక్కాగా చేపట్టామని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలల్లో తాగునీటితో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. -
గ్యాస్ బిల్లు అధికంగా వసూలు చేస్తే చర్యలు
తిరుపతి తుడా : గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య.. గ్యాస్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం ఆమె నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ పాజిటివ్ ప్రిస్క్రిప్షన్ సర్వే మీద జిల్లాలో 28 గ్యాస్ డీలర్లపై ఎక్కువ పాజిటివ్ కాల్స్ వచ్చాయన్నారు. గ్యాస్ డీలర్లకు సంబంధించిన గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఐవీఆర్ఎస్ నివేదికలు తేల్చాయన్నారు. ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ బాయ్స్కు నియమ నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఇలాంటివి జిల్లాలో పునరావృతం అయితే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి మరోసారి బాంబు బెదిరింపు చంద్రగిరి : శ్రీవేంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. యూనివర్సిటీకి చెందిన ఈ–మెయిల్కు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్, బాంబ్ విచ్చిన్నకర బృందాలు వర్సిటీ పరిసరాల్లో సోదాలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, చెత్త కుండీలు, చెట్ల పొదలు తదితర ప్రాంతాలను జల్లెడ పట్టారు. చివరకు అది ఫేక్ మెసేజ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తరహాలో నెల రోజుల కిందట కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 13న జాతీయ లోక్ అదాలత్ తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో 13వ తేదీ శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం. గురునాథ్ తెలిపారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు తిరుపతి కోర్టు ఆవరణలో ఈ జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు బుధవారం న్యాయమూర్తి పేర్కొన్నారు. లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం కోసం ఎనిమిది బెంచులను ఏర్పాటు చేయనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్లో సివిల్, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు, రెవెన్యూ, వాజ్యం వేయని కేసులు, ఇతర కేసులను పరిష్కరిస్తామన్నారు. కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు,పోలీసు అధికారులు, ఇతర అధికారులు సహకరించాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,901 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,128 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
శ్రీకాళహస్తి: వైద్య విద్య ప్రైవేటీకరణకు నిరసరనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తెలిపారు. ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’పై మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి మాట్లాడారు. మన బిడ్డలు వైద్యవిద్య చదవడానికి రష్యా, చైనా వెళుతున్నారు..చైనాలో మన బిడ్డలకు గ్యారెంటీ ఉంటుందా? గతంలో రష్యాలు యుద్ధం జరిగినప్పుడు అక్కడ మెడిసిన్ చేస్తున్న మన పిల్లల పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అన్నారు. రాష్ట్రంలో పేదవారు గొప్ప చదువులు చదువుకోకూడదా? పెత్తందారులు మాత్రమే గొప్ప గొప్ప చదువులు చదవాలా,. ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదివే అర్హత లేదా?అని ప్రశ్నించారు. కుల మతాలకతీతంగా ప్రతి పేదవాడు మెడిసిన్ చదవాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, 50 శాతం భవనాలు కూడా నిర్మించారని తెలిపారు. అయితే చంద్రబా బు సర్కారు వాటిని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిందన్నారు. ఆ దుశ్చర్యను అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 66 వేల పైచిలుకు సంతకాలను ప్రజల నుంచి స్వచ్ఛందంగా సేకరించిందన్నారు. వయ్యాల కృష్ణారెడ్డి, షేక్ సిరాజ్ బాషా, కోగిలి సుబ్రమణ్యం, ఉత్తరాజీ శరవణ కుమార్, కంటా ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, పఠాన్ ఫరీద్, పాల్గొన్నారు. -
కంటి తుడుపుగా ప్రభుత్వ సాయం
వరదయ్యపాళెం (కేవీబీపురం): కేవీబీపురం మండలంలోని కళత్తూరు దళితవాడలోని ముంపు బాధితులకు ప్రభుత్వం కంటి తుడుపు సాయం అందించింది. ఆ మేరకు మంగళవారం కళత్తూరు దళితవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ శంకర్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపునకు గురై నష్టం సంభవించిన ఒక్కో కుటుంబానికి రూ. 10వేలు చొప్పున 420 కుటుంబాలకు రూ. 42లక్షల ఆర్థికసాయాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.1,20,65,600 మెగా చెక్కును బాధిత ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళత్తూరు గ్రామంలో జరిగిన ఘోర విపత్తు కారణంగా ప్రభుత్వం నుంచి తక్షణమే సహాయక చర్యలు అందజేశామన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవికుమార్, తహసీల్దార్ రోశయ్య, ఎంపీడీఓ మాలతి, నాయకులు రామాంజుల నాయుడు, గోపినాథ్ రెడ్డి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు. పరిహారంపై ప్రజలు అసంతృప్తి ముంపు కారణంగా కళత్తూరులో జరిగిన కొండంత నష్టానికి గోరంత సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని స్థానిక బాధిత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి తక్కువ పక్షంలో రూ. 50 వేలు నుంచి రూ. లక్షకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఇంత నష్టం జరిగితే ఒక్కో ఇంటికి రూ. 10వేల సాయంతో కంటి తుడుపు చర్యలతో మమ అనిపించారని స్థానిక ప్రజలు గుసగుసలాడారు. -
బాబు సర్కారు పేదల పొట్టగొడుతోంది!
తిరుపతి లీగల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రభు త్వం ప్రైవేటీకరణ చేసి, పేదల పొట్ట కొడుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సౌజన్యంతో మంగళవారం తిరుపతి కోర్టుల ప్రధాన ద్వారం వద్ద న్యాయ వాదులు కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ సీఎం చేయని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి తెచ్చి, కొన్ని ప్రాంతాల్లో కళాశాలల నిర్మాణాలు పూర్తి చేసినా ఆ కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటు వారి చేతిలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, ప్రజలు పాల్గొని సంతకాలు చేశారు. సంతకాల సేకరణలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు రాజశేఖర్, నరహరిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కె. విజయకుమార్, కోటేశ్వర్ రెడ్డి, ఏ. ప్రకాష్ రెడ్డి, ఎన్. వెంకటేష్, మహాదేవ్, శైలేంద్ర, బాలాజీ, కరుణాకర్ నాయుడు, వేలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు రాచగున్నేరి విద్యార్థిని ఝాన్సీ
శ్రీకాళహస్తి: జిల్లాస్థాయి విద్య,వైజ్ఞానిక ప్రదర్శనలో శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఝాన్సీ ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై ంది. ఝాన్సీ రాచగున్నేరి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోటీలో పాల్గొనేందుకు గైడ్ టీచర్గా సైన్న్స్ టీచర్ లింకన్ వ్యవహరించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకుంది. ఈ నెల 27వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు సుజాత, రామ్మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు గిరిజ గ్రామస్తులు అభినందించారు. -
రాపూరు పోలీస్ స్టేషన్లో ఐజీ
రాపూరు: స్థానిక పోలీస్స్టేషన్ను మంగళవారం గుంటూరు జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. సేష్టన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పలు పోలీస్స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. రాపూరులో చిన్నచిన్న భూ సమస్యలున్నాయని క్రైమ్ కూడా పెద్దగా లేదని ఈ సంవత్సరం ఇప్పటివరకు 163 కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. పోలీసుల పనితీరు బాగుందని వారిని అభినందించారు. ఆయన వెంట నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు,సీఐ సత్యనారాయణ, ఎస్ఐరాజేష్ తదితరులు ఉన్నారు. నృసింహుని సేవలో ఐజీ పెంచలకోనలోని శ్రీ పెనుశిలలక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామిని మంగళవారం గుంటూరు జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మోటార్బైక్, ఆటో ఢీ
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు కోట:మండలంలోని చిట్టేడు వద్ద ప్రధాన రహదారిపై మంగళవా రం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెంద గా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గూడలి అరుంధతీయ కాలనీలో విషాదం నింపింది. ఎస్ఐ పవన్కుమార్ కథనం మేరకు.. గూడలి అరుంధతీయ కాల నీకి చెందిన ధనరాశి లావణ్య(26), తన భర్త మల్లికా ర్జున్తో కలసి గూడూరు హాస్పిటల్ వెళ్లేందుకు మోటార్బైక్లో బయలుదేరారు. చిట్టేడు వద్ద గూడూరు నుంచి విద్యానగర్ వస్తున్న ఆటో, మోటార్బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లావణ్య సంఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త మల్లికార్జున్ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం గూడూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అబ్బాస్కు గా యాలయ్యాయి. సంఘటన స్థలాన్ని గూడూరు డీఎస్పీ గీతాకుమారి, వాకాడు సీఐ హుస్సేన్బాషా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతి
వెంకటగిరి రూరల్: కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామానికి చెందిన పొటేళ్ల ప్రసన్న కుమార్ (30) మృతదేహమై బాలాయపల్లి మండలం నిండలి వాగులో లభ్యమయ్యారు. ప్రసన్న కుమార్ గత నెల 30 తేదీన తోటి స్నేహితులతో కలసి ఇంటి వద్ద నుంచి వెళ్లారని, తర్వాత తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తండ్రి శీనయ్య ఈనెల 3వ తేదీన బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మండలంలోని నిండలి వాగులో ప్రసన్న కుమార్ మృత దేహం లభ్యం కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆర్టీసీలో అసమర్థ పాలన
తిరుపతి అర్బన్: ఆర్టీసీ అధికారులు అసమర్థ పాలనను సాగిస్తున్నారని ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య, జిల్లా అధ్యక్షులు జీవీఆర్ కుమార్, సెక్రటరీ బీఎస్ బాబు ధ్వజమెత్తారు. మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీపీటీఓ(జిల్లా ప్రజా రవాణా అధికారి) కార్యాలయానికి ఆర్టీసీ ఎన్ఎంయూఏ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం డీపీటీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు డీపీటీఓ కార్యాలయానికి చేరుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదని సూచించారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘం నేతలు తాము శాంతియుతంగా తమ డిమాండ్లను వెల్లడించడానికి మాత్రమే వచ్చామని తెలిపారు. అయితే ఆ సమయంలో డీపీటీఓ జగదీష్ లేకపోవడంతో ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ నేతలు చెంచులయ్య, జీవీఆర్కుమార్, బీఎస్ బాబు మాట్లాడుతూ ఓ వైపు ప్రయాణికులకు..మరోవైపు ఉద్యోగులకు కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. జిల్లాలో కొత్త బస్సుల ఆవశ్యకతను డీపీటీఓ విజయవాడలోని ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూఏ నేతలు సన్యాసిరావు, టీవీ లక్ష్మీ, గుణశేఖర్, సతీష్, ఆర్ముగం, నాగేశ్వరరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వంలో ఉచిత నవోదయ మోడల్ ఎంట్రన్స్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం విద్యా సంస్థల్లో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి తెలియజేశారు. 6వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సంసిద్ధం కావడంతో పాటు సబ్జెక్ట్ పరంగా లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. నమూనా పరీక్షకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరయే విద్యార్ధులు హాల్ టికెట్ (అడ్మిట్ కార్డ్) జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 8688888802 / 9399976999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రైవేటు స్కూల్ బస్సు సీజ్ నాయుడుపేటటౌన్ : జనంపై దూసుకెళ్లిన స్కూల్ బస్సును సీజ్ చేసి, డ్రైవర్తోపాటు పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామానికి చెందిన ఆ బస్సు ఇన్చార్జి తనయాలి సుధీర్పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం చెంచుబాబు తెలిపారు. బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తామని డీఎప్పీ హెచ్చరించారు. హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు వరదయ్యపాళెం: మండలంలోని మిట్ట హరిజనవాడలో గత నెల 30న జరిగిన వంట మాస్టర్ హరి (33) హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సత్యవేడు సీఐ మురళి, ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం సీఐ ఈ వివరాలు వెల్లడించారు. మిట్ట హరిజనవాడకు చెందిన వంట మాస్టర్ హరి, అదే గ్రామంలోని గౌతమ్, ప్రేమ్ కుమార్ మధ్య పాత కక్షల ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 30న హరి భార్య దేవసేన ఊరెళ్లింది. ఇదే అదునుగా భావించిన గౌతమ్, ప్రేమ్కుమార్ వారి ఇంటికి హరిని పిలిపించుకుని, అతనితో స్నేహభావంగా మెలిగి మద్యం తాగించి హత్యకు పాల్పడ్డారు. అయితే హత్య చేసేందుకు తమిళనాడుకు చెందిన తమ స్నేహితులు జాన్పాల్, పెలిస్థియన్ అలియాస్ బెంచిల్ను రప్పించుకుని వారి సహకారంతో హత్యకు పాల్పడ్డారు. నిందితులు ఇబ్బలమడుగుకు వెళ్లే మార్గంలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసు కుని విచారణ చేపట్టారు. వారు నేరం అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఆలయ భూముల్లో క్రీడా మైదానం
సాక్షి టాస్క్ ఫోర్స్: అధికార పార్టీ నేతల ఒత్తిడితో తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లోని సుమారు 30 ఎకరాల ఆలయ భూముల్లో క్రీడా మైదానానికి అనుమతి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గూడూరు వేంకటేశ్వరస్వామి గ్రూపు దేవస్థానానికి చెందిన ఈఓ చిల్లకూరు మండలం కలవకొండలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, తీర ప్రాంతంలోని లింగవరం దేవస్థానానికి కూడా అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆలయాలకు చెందిన భూముల కౌలు వేలం పాటలు నిర్వహించే సమయంలో ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే కట్ట బెట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే లింగవరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయానికి సుమారు 110 ఎకరాల వరకు మాన్యం భూములున్నాయి. ఈ భూములను స్థానికంగా ఉండే పేదలు కొన్నేళ్లుగా వేలం పాటలు పాడుకుని వేరుశనగ సాగు చేసుకునే వారు. ఈ ఏడాది వేలం పాటల నిర్వహణకు సంబంధించి బహిరంగ ప్రకటన ఇవ్వకుండా 80 ఎకరాల వరకు వేలం పాటలు నిర్వహించారు. ఇందులో భాగంగా తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లోని సుమారు 30 ఎకరాలు ఉండగా ఈ భూములకు కూడా వేలం పాటలు నిర్వహించకుండా ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడితో సుమారు 30 ఎకరాలను క్రీడా మైదానం పేరుతో ధారాదత్తం చేశారు. ఆ భూముల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు అక్కడి స్థానిక నాయకుడి చేతుల మీదుగా మంగళవారం శంకుస్థాపన కూడా చేశారు. ఈ విషయంపై స్థానికులు అక్కడే ఈఓను ప్రశ్నించగా ‘నా ఇష్టం ఆ భూమికి వేలం పాటలు నిర్వహించడం లేదు.’ అని సమాధానం ఇచ్చారు. ఇదే విషయంపై దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సుధీర్బాబును వివరణ కోరగా ఆలయ భూముల వేలం పాటలకు లింవరం గ్రామానికి తాను కూడా వెళ్లానని, అయితే సర్వే నంబర్ 20లోని 30 ఎకరాల భూములు వేలం వేయలేదనే విషయం తనకు కూడా తెలియదన్నారు. అలాగే అక్కడ క్రీడా మైదానం ఏర్పాటు చేయడంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేలం పాటల నిర్వహణ బహిరంగంగానే చేపడతామని, ఇక్కడ కూడా కరపత్రాలు పంపిణీ చేశామని దండోరా వేయడం, ఆటోలో మైక్ అనౌన్స్ చేశారా అనే విషయం తెలియదన్నారు. -
రెవెన్యూ దౌర్జన్యం!
తొట్టంబేడు: ‘ఐసీడీఎస్ సిబ్బందికి సమావేశ మందిరం, గోడౌన్ ముఖ్యం. ఆ రెండూ సమకూర్చిన తర్వాతే బిల్డింగ్ని స్వాధీనం చేసుకోండి. అప్పటి వరకు వారి జోలికెళ్లొద్దు. సమస్య సృష్టించొద్దు..’ అంటూ తొట్టంబేడు రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ అవేవీ వారు పట్టించుకోలేదు. మంగళవారం ఉన్న ఫళంగా తొట్టంబేడు మండల కార్యాలయంలో నిర్వహిస్తున్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం ఎక్కడ? అని ప్రశ్నించగా.. అవేవీ తమకు తెలియదు.. ఆర్డీఓ చెప్పారు.. మీరు అక్కడికెళ్లి మాట్లాడుకోండి.. అంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు రోడ్డున పడినట్టయ్యింది. అసలేం జరిగిందంటే.. గతంలో మండల కార్యాలయానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం శిథిలావస్థకు చేరింది. విధిలేని పరిస్థితుల్లో 2019 నుంచి తొట్టంబేడు మండల కార్యాలయంలోనే శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం కొనసాగుతోంది. అక్కడే సమావేశ మందిరం, గోడౌన్ ఉండడంతో కొంత అనుకూలంగా మారింది. కానీ శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కొనసాగడంపై అక్కడి రెవెన్యూ అధికారులకు కొంత కంటగింపుగా మారింది. దీంతో ఎలాగైనా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని స్కెచ్చేశారు. ఈ క్రమంలోనే ఆర్డీఓతో చర్చలు జరిపారు. ఎట్టకేలాకు భవనం స్వాధీనానికి తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అదే క్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై స్పందిస్తూ ఐసీడీఎస్కు ప్రత్యామ్నాయం చూపాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ అవేవీ పట్టించుకోకుండా మంగళవారం శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడంపై అంగనన్వాడీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఏంచేయాలబ్బా? శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్, మున్సిపాలిటీ కలిపి 208 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మొత్తం 416 అంగన్వాడీ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెలా నాలుగు సార్లు సెక్టార్, ప్రాజెక్టు సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం కార్యాలయం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంచాయతీ బిల్డింగ్కు తాళాలు తొట్టంబేడు మండల కార్యాలయంలోని పంచాయతీ బిల్డింగ్ను శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు కేటాయించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అక్కడి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్ తమకు బిల్లులు రాలేదంటూ పేచీ పెట్టారు. గత సోమవారమే భవనానికి తాళాలు వేసి తీసుకెళ్లిపోయారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరుమెదపలేదు. కాంట్రాక్టర్ను ఒప్పించి తాళాలు ఇప్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై తొట్టంబేడు తహసీల్దార్ భారతిని వివరణ కోరగా.. తొట్టంబేడు మండల కారాలయంలోని భవనం అవసరమైందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాలతోనే ఇక్కడ కొనసాగుతున్న శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారికి పంచాయతీరాజ్ భవనాన్ని అప్పగించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. -
బస్ షెల్టర్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు
చిల్లకూరు:తిరుపతి జిల్లా పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి రూ.5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేసినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్ను తొలగించారని, దీంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి తొలగించిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. రోడ్డుపై నిల్చుని, గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి దుస్థితి నెలకొందని తెలిపారు. మూడు మండలాలకు వెళ్లే కూడలి కావడంతో ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుందని సమస్య తీవ్రతను స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా తెలుసుకున్న వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళి బస్షెల్టర్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. దీంతో రూ. 5లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. బస్ షెల్టర్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఎంపీ గురుమూర్తి సంబంధిత అధికారులకు ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
తడ: జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహ నం ఢీకొన్న ప్రమాదంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని పురుషుడు మృతి చెందాడు. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తడకండ్రిగ పంచాయతీ పరిధిలో చైన్నె వైపు వెళ్లే మార్గంలోని ఓ మెస్ సమీపంలో, జాతీయ రహదారిపై మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్ఖలా నికి చేరుకున్నారు. జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఇతన్ని చైన్నె వెళ్లే వాహనం వెనుక నుంచి ఢీ కొనడంతో మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమి త్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ పోటీలకు నాయుడుపేట క్రీడాకారుడు నాయుడుపేటటౌన్: పల్నాడు జిల్లా నర సారావుపేటలో మూడు రోజులుగా జరిగిన స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ అండర్–17 ఫుట్బాల్ పోటీల్లో నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు ఇందుకూరు రోల్డ్కృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి, జాతీయ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ గౌన్బాషా తెలిపారు. జనవరి 11న హర్యాణాలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొన్నంటున్నట్లు తెలిపారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు తిరుపతి రూరల్: మహిళ మెడలో బంగారం గొలుసు లాక్కుని వెళ్లిన కేసులో నిందితులను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలంలోని పెరుమాళ్లపల్లి సమీపంలో మ ల్లిక అనే మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోయిన సంఘటనకు సంబంధించి తి రుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటలలోపే నిందితులను గుర్తించి రైల్వే కో డూరు శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన కస్తూరి జయకృష్ణ, రైల్వే కోడూరు శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన మాచినేని శిరీషా, పుల్లంపేట మండలం కొట్టలపల్లికి చెందిన లింగుంట వినీలను చెర్లోపల్లి సర్కిల్ వద్ద మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 24 గ్రాముల బంగారం గొలుసుతోపాటు కత్తులు, ఆటో (ఏపీ39 విడి 5613) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
మా స్థలాన్ని ఆక్రమించి.. దౌర్జన్యం చేస్తున్నారు!
చంద్రగిరి మండలంలోని మామిడిమానుగడ్డ గ్రామంలో నాకు 56 సెంట్లు భూమి ఉంది. అందులో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. అయితే స్థానికంగా ఉంటున్న చెంగల్రాయల నాయుడు, కుమార్చౌదరి, రాజేంద్రనాయుడు, వెంకటసుబ్బానాయుడు, జానకిరామనాయుడు, సుబ్బరామనాయుడు మా భూమి ఆక్రమించి, మాపై దౌర్జన్యం చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ న్యాయం చేయాలి. – చల్లా రవి, చంద్రగిరి మండలం ఇంటి స్థలం ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపుతున్నారు! తొట్టంబేడు మండలంలో ని చియ్యవరం గ్రామాని కి చెందిన నా కుమారు డు ఏకాంబరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తాజా గా నేను ఇంటి పట్టా కోసం పీఎంఏవై కింద దరఖాస్తు చేసుకున్నాను. అయితే మా కోడలు హేమలత పేరుతో ఇంటిపట్టా ఇచ్చినట్లు అన్లైన్లో చూపుతుందని, దాని రద్దు చేస్తే కొత్త పట్టా దరఖాస్తును స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. స్థానిక అధికారులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్కు వచ్చాను. – చెంగయ్య, చియ్యవరం గ్రామం -
వేడుకగా అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం
నాయుడుపేటటౌన్: పట్టణంలో సోమవారం రాత్రి అయ్యప్పస్వామి అఖండ కర్పూర జ్యోతి పూజోత్స వం వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో జరిగిన 44వ అఖండ జ్యోతి పూ జోత్సవానికి వందలాది మంది భక్తులు తరలివచ్చా రు. అయ్యప్పస్వామిని దర్శించుకుని తన్మయం చెందారు. అయ్యప్పస్వామి అఖండ జ్యోతి పూజోత్సవంలో ఉదయం నుంచే వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అ నంతరం కలశాన్ని ఊరేగించారు. కోటకొండ గజేంద్రస్వామితోపాటు గురుస్వాములు ఒక్కొక్క మెట్టు కు పూజలు చేస్తూ స్వామివారిని స్తుతిస్తూ 18 మెట్ల పై కర్పూర జ్యోతులను వెలిగించారు. అనంతరం దాదాపు వెయ్యి కిలోలపైగా తారక ప్రభు భక్త బృంద గురుస్వాములు సేకరించిన కర్పూరాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రాంగణం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్లు జలదంకి వెంటకకృష్ణారెడ్డి, షేక్ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి అఖండ కర్పూర జ్యోతి వెలిగించారు. భక్తులు అయ్యప్ప నామస్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. వివిధ అమ్మవార్ల వేషధారణలతో నృత్యాలు, కేరళ పంచవాయిద్యాలు, తప్పిట్ల నడుమ మహిళలు దీపాలు చేతపట్టి అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తికి స్వాగతం పలుకుతూ పట్టణ పురవీధుల్లో నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, భగవాన్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి, జలదంకి వెంకట కృష్ణారెడ్డి, కనమర్లపూడి సుబ్రమణి, చదలవాడ కుమార్, పాపాడి చంద్రారెడ్డి, గంధవళ్లి సిద్ధయ్య, చిరువేళ్ల మునిరాజ, కోటకొండ ప్రతాప్, నరేంద్ర పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేయాలి
తిరుపతి క్రైమ్: తిరుమలలో జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. సోమవారం పోలీస్ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా తిరుమలలో భారీగా పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, లైన్ మేనేజ్మెంట్, అత్యవసర స్పందన బృందాల నియామకం, పాదచారి మార్గాల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కుటుంబాలతో వచ్చే చిన్నపిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక హెల్ప్డెస్క్లు, చైల్డ్ మిస్సింగ్ టీమ్స్ను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుమల మొత్తం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి, సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే క్విక్ రెస్పాన్స్ టీమ్స్, హెల్త్ సపోర్ట్, అంబులెన్స్ మార్గాలు, ఫైర్ సర్వీసెస్తో సమన్వయం చేసుకోవాలన్నారు. -
పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ను అన్నీ విభాగాల అధికారులు సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై పీజీఆర్ఎస్కు 308 అర్జీలు వచ్చాయి. అందులో 184 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు ప్రతి జిల్లా అధికారి తప్పకుండా హజరుకావాలని స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్, జేసీ, డీఆర్వోతో పనిలేకుండా మీ డ్యూటీలో భాగంగా క్రమం తప్పకుండా హాజరుకావడంతోపాటు సమయపాలన పాటించడం..మీ వద్దకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, దానికి పరిష్కారం చూపే దిశగా పనిచేయాలని చెప్పారు. అంతేతప్ప పరిష్కారం కాకపోయినా పరిష్కారం అయినట్లు లెక్కలు చూపితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నిరసనలు కాగా అఖిల భారతీయ జనసంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పలువురు పేదల భూములు, స్థలాలను కబ్జా చేస్తున్నారని, ఆ సమస్య నుంచి బయటపడడానికి నానా తిప్పులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 90శాతం మందికి స్థలాలు చూపించారని, మిగిలిన 10 శాతం మందికి స్థలాలు చూపలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారికి స్థలాలు చూపాలని తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన వారితో కలసి సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథం డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థానికులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పేరూరు చెరువును పటిష్టం చేయండి పేరూరు చెరువు ప్రమాదస్థితిలో ఉందని సరైన భద్రత కల్పించాలని తిరుపతి రూరల్ ఎంపీపీ చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిలో భూగర్భజలాలను భర్తీ చేయడానికి పేరూరు చెరువు కీలకం అన్నారు. చెరువును మరింత పటిష్టం చేయాలని కోరారు. -
‘డయల్ యువర్ సీఎండీ’కి 70 వినతులు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకూడదని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించారు. 9 జిల్లాల నుంచి 70 మంది ఫోన్లు చేసి, తమ సమ్యలను వివరించగా సంబంధిత జిల్లా నోడల్ ఆఫీసర్లు వాటిని నమోదు చేసుకున్నారు. సీఎండీ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించబోనని, వినియోగదారులతో అమర్యాదగా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారుల నుంచి అందుకున్న వినతుల్లో కర్నూలు నుంచి 18, కడప 13, అనంతపురం 15, నెల్లూరు 3, శ్రీసత్యసాయి 3, చిత్తూరు 1, తిరుపతి 11, నంద్యాల నుంచి 6 వినతులు వచ్చాయన్నారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ఖాన్, కె.గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్.జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
నీటి గుంటలో పడి యువకుడి మృతి
వాకాడు: ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వాకాడు గొల్లపాళెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇన్నమాల ఈశ్వరయ్య (37) అనే యువకుడు మధ్యాహ్న సమయంలో గ్రామానికి సమీపంలోని నీటిగుంటలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాడు ప్రమాదవశాత్తు గుంటలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఈశ్వరయ్య ఆచూకీ కోసం కోట అగ్రిమాపకశాఖ, అంజలాపురం గ్రామానికి చెందిన మత్స్యకార గజతగాళ్లు సుమారు 5 గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి గుంటలో నుంచి ఈశ్వరయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్ నిఖిల్ తెలిపారు. జనాలపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు – మద్యం మత్తులో డ్రైవర్ నాయుడుపేట టౌన్: నాయుడుపేట గడియారం సెంటర్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ జనాల మీదకు దూసుకు వచ్చిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ను స్థానికులు పట్టుకు ని పోలీసులకు అప్పగించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ సుమారు 25 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకుని వస్తుంది. పట్టణంలోని పోలేరమ్మ సెంటర్ వద్ద జనాల మీదకు బస్సు దూసుకువెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ ఇమ్మానియేల్ మద్యం తాగి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బస్సులో ఉన్న విద్యార్థులను నిర్వాహకులు వచ్చి గమ్యస్థానాలకు చేర్చారు. డ్రైవర్ ఇమ్మానియేల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక ప్రతిభావంతుల్లో మనోధైర్యాన్ని నింపాలి
చంద్రగిరి: ప్రత్యేక ప్రతిభావంతులను జాలి, దయతో ఆదరించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవితా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను, పథకాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–2 భాస్కర్ బాబు, బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటరమణ రెడ్డి, ఐఈఆర్టీఎస్ వెంకటరాజేశ్వరి, శ్యామలదేవి, ఐఈడీఎస్ఎస్ ఉదయ్కుమార్, జయలక్ష్మి పాల్గొన్నారు. -
భారత్ జట్టులో ఆంధ్రా క్రీడాకారులు
తిరుపతి ఎడ్యుకేషన్ : గోల్ షాట్ బాల్ భారత సీ్త్ర, పురుషుల జట్టులో నలుగురు ఆంధ్ర క్రీడాకారులు చోటు సాధించారు. ఆ మేరకు గోల్ షాట్ బాల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.మురళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 15వ తేదీన పంజాబ్లో నిర్వహించిన గోల్షాట్ బాల్ భారత జట్టు ఎంపిక పోటీల్లో సీ్త్రల విభాగంలో తిరుపతి జిల్లా నెరబైలుకు చెందిన దేవిప్రియ, అనంతపురం జిల్లాకు చెందిన సభాఖానం, గుంటూరు జిల్లాకు చెందిన ప్రజ్ఞ, పురుషుల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రాచవీటి తేజేంద్రలు ప్రతిభ కనబరచి భారత జట్టులో చోటు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 15నుంచి 19వ తేదీ వరకు నేపాల్ దేశం, ఖాట్మాండ్లో నిర్వహించే సౌత్ ఏషియస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపా రు. రాష్ట్ర క్రీడాకారులు భారత్ జట్టులో స్థానం సాధించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం మనకు గర్వకారణమని, అంతర్జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరచి రాణించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ మళ్లింపు శ్రీకాళహస్తి: ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉండడంతో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని తెలిపారు. ఏపీసీడ్స్ వైపు నుంచి పట్టణంలోకి వచ్చే బస్సులు, లారీలు, భారీ వాహనాలు పట్టణంలోకి నిషేధమన్నారు. బైపాస్ రోడ్డు నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నంది సర్కిల్ అక్కడి నుంచి ఎంజీఎం ఆస్పత్రి మీదుగా బస్ స్టాండ్ వైపునకు మళ్లించినట్లు తెలిపారు. అలాగే నాయుడుపేట వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశం లేదన్నారు. నంది సర్కిల్ నుంచి ఎంజీఎం ఆస్పత్రి మీదుగా బస్టాండ్కు మళ్లించనున్నట్లు చెప్పారు. ఇక బస్ స్టాండ్ నుంచి పట్టణంలోకి వెళ్లే భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతి లేదన్నారు. వాటిని ఎంజీఎం ఆస్పత్రి నుంచి నంది సర్కిల్, బైపాస్రోడ్డు మీదుగా ఏపీసీడ్స్ మార్గం వైపు మళ్లించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలు ప్రత్యేక అనుమతితో ఏపీసీడ్స్ కూడలి, పొన్నాలమ్మ గుడి మీదుగా నేరుగా ఆలయ వైపు వెళ్లడానికి అనుమతించిన్నట్లు తెలిపారు. జాతీయ పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు తిరుపతి సిటీ: కలకత్తా వేదికగా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయారు. గత నెల కాకినాడ వేదికగా జరిగిన అంతర్జిల్లాల అండర్–19 సిమ్నాస్టిక్ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ సి భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై వారిలో ఎస్ ధరణి, గంగాభవాని, చైతన్యశ్రీ, యామిని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయి సుమతి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కాలువలో పడి వ్యవసాయ కూలీ మృతి
నాయుడుపేట టౌన్: మండలంలోని పండ్లూరు సమీపంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి వెంగమాంబపురం గ్రామానికి చెందిన మర్రి గురుప్రసాద్(45) మృతి చెందాడు. పోలీసులు కథనం మేరకు.. వెంగమాంబపురం గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఆదివారం ఇంటి నుంచి పండ్లూరు సమీపంలో ఉన్న పొలాల వద్దకు కూలి పనుల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం పండ్లూరు గ్రామ సమీపంలోని చెరువు తూము వద్ద కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు జారీ అందులో పడిపోయాడు. అయితే అతను సోమవారం ఉదయం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి పండ్లూరు గ్రామ సమీపంలో మృతదేహం పడి ఉంటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాబి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
శ్రీసిటీలో సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీపై సదస్సు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025–2030పై ఉన్నతస్థాయి సమావేశం సోమవారం శ్రీసిటీలో నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణతోపాటు చెత్త నుంచి సంపద సృష్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించారు. డాక్టర్ పి.కృష్ణయ్య, ఇతర ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్, శ్రీసిటీ అమలు చేస్తున్న 3ఆర్ (రెడ్యూస్, రీయూస్, రీ సైకిల్) విధానాల ప్రాధాన్యత, నిబద్ధతను వివరించారు. ప్రత్యేకించి శ్రీసిటీ జీరో వ్యర్థ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, స్కోర్ పోర్టల్ను వినియోగించుకుని శ్రీసిటీ ప్రాంతంలో 3ఆర్ పద్ధతులను మరింత బలోపేతం చేయాలని పరిశ్రమల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక కేంద్రాలకు శ్రీసిటీ ఆదర్శం ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో ఇతర పారిశ్రామిక కేంద్రాలకు శ్రీసిటీ ఆదర్శంగా నిలుస్తుందని డాక్టర్ కృష్ణయ్య తెలిపారు. శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, పారిశ్రామిక ఉప ఉత్పత్తులను రీసైకిల్, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం అత్యుత్తమ పద్ధతులుగా పేర్కొన్న ఆయన, వ్యర్థ నిర్వహణ ఏజెన్సీలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. కాగా తన సందేశంలో ఏపీపీసీబీ చైర్మన్కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీీపీసీబీ సభ్యుడు నాగేశ్వర రాజు, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ముని ప్రసాద్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు
తిరుపతితుడా: రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని ఏళ్ల నుంచి యాజమాన్యానికి విన్నవించినా పరిష్కరించకపోవడంతో సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సీఐటీయూ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వరంలో సోమవారం రుయా సూపరింటెండెంట్తోపాటు కార్మిక శాఖ మంత్రికి, కమిషనర్ ఆఫ్ లేబర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా కార్మిక శాఖ, సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి మునిచంద్ర, నరసింహులు మాట్లాడుతూ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 రూల్ నంబర్ 71 ప్రకారం సమ్మె నోటీసులు 18 డిమాండ్లతో ప్రధానంగా ఈ సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి కార్మికులందరూ 14 రోజులపాటు నల్ల బ్యాడ్జీలు ధరించి, తమ నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తారని, 14 రోజుల తర్వాత యాజమాన్యం చర్చించి సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెబాట పట్టాల్సివస్తుందన్నారు. -
క్రీడలు దినచర్యలో భాగం కావాలి
చంద్రగిరి: క్రీడలు దినచర్యలో భాగంగా కావాలని ఎస్వీ వెట ర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జేవీ రమణ అన్నారు. ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా, సాంస్కృతిక పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముగింపు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అకాడమిక్ అంశాలతో పాటు క్రీడలు కూడా దినచర్యలో భాగం కావాలని సూచించారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ క్యూరేటర్ సి.సెల్వన్ మాట్లాడుతూ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడంతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలపై మరింత అవగాహన వస్తుందన్నారు. అనంతరం ఎన్జీరంగా వర్సిటీ పరిధిలోని 19 కళాశాలల విద్యార్థులకు వివిధ క్రీడా సాంస్కృతిక, వ్యక్తిత్వ అంశాల్లో పోటీపడిన వారికి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక, వక్తృత్వ అంశాలలో ఓవరాల్ చాంపియన్షిప్ను బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ రామచంద్రరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎస్యూ ఘటనకు బాధ్యులను తొలగించాలి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజుల క్రితం జరిగిన దారుణం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను వర్సిటీ నుంచి తొలగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం వర్సిటీ ఎదుట పెద్ద ఎత్తన నిరసన కార్యక్రమం చేపట్టాయి. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను వర్సిటీ అధికారుల చొరవతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వర్సిటీలో ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ తొలి ఏడాది చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసి సెల్ఫోన్లో చిత్రీకరించి బెదిరింపులకు గురి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రేమ్కుమార్ వర్సిటీ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు డాక్టర్ ఓబుల్ రెడ్డి, చెంగల్ రెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీణ్కుమార్, ప్రేమ్కుమార్, సుందర్రాజు, శివకుమార్, స్వరూప్ కుమార్, యశ్వంత్ రెడ్డి, వినోద్ కుమార్, రఫీ, ప్రదీప్ కుమార్, భాస్కర్ యాదవ్, ఉత్తరాది విజయ్, వినోద్ కుమార్ , నాగేశ్వరరావు , హరి నాయక్ , తిరువర్ధన్ రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు. -
అధికారుల పర్యవేక్షణేదీ?
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ మొదలైంది. ఈ సీజన్లో 2.30 లక్షల ఎకరాల్లో 1.50లక్షల మంది రైతులు వరిపంటను సాగుచేయనున్నారు. ఈ క్రమంలో సీజన్కు ముందే వ్యవసాయశాఖ అధికారులు ఏ వరి రకం పంటను సాగుచేస్తే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఆ పంటకు మంచి డిమాండ్ ఉంటుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఉంటే బాగుండేది. అలాగే వ్యవసాయాధికారులు విత్తనాలు అమ్ముతున్న డీలర్ దుకాణాలను తనిఖీలు చేయడంతోపాటు వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే మంచిగా ఉండేది. ఏదిఏమైనప్పటికి రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – రవి, రైతు, వరదయ్యపాళెం -
నకిలీ విత్తన గాథ
వినవయ్యా.. నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం.. మనోవేదనతో కుమిలిపోతున్నాం. దశాబద్దాలుగా వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తున్నాం. ఏ ప్రభుత్వంలోనూ ఈ తరహాలో మోసం జరగలేదు. మేము ఎప్పుడూ ఇలా మోసపోలేదు. సాధారణంగా నాట్లు వేసిన 80 రోజుల తర్వాత పొట్ట, వెన్ను రావాల్సి ఉంది. అలా వస్తేనే దిగుబడి ఎకరాకు 30 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 40 బస్తాలు వస్తుంది. అయితే నకిలీ వరి విత్తనాలతో కేవలం నాట్లు వేసిన 20 రోజులకే పొట్ట, వెన్ను వచ్చేస్తుంది. ఇలా వస్తే ఎకరం 10 బస్తాలు దిగుబడి కూడా రాదు. దీంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూళ్లూరుపేట రైతులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరిగిన సందర్భంగా సూళ్లూరుపేటకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సాగు చేయడంతో ముందస్తుగా వచ్చిన పరి కంకులను చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ వద్దకు వెళ్లారు. ‘సూళ్లూరుపేటలో రైతులు వరి పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ క్రమంలో పూజిత అగ్రో సర్వీసెస్ సెంటర్లో ఈ ఏడాది సెప్టెంబర్లో బీపీటీ–2782 నంబర్ వరి విత్తనాలు దిగుబడి ఎక్కువగా వస్తుందని ఆ డీలర్ నమ్మబలికారు. దాంతో ఆ డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేశాం. బిల్లులు కూడా ఉన్నాయి. 25 రోజుల నారు నాటితే పంట బాగా వస్తుందని చెప్పారు. దాంతో అలానే నాటాం. అయితే నాట్లు వేసిన 70 నుంచి 80 రోజులకు పొట్ట, వెన్ను రావాల్సి ఉండగా 20 రోజులకే వచ్చేస్తుంది. డీలర్ను గట్టిగా ప్రశ్నిస్తే తమకు నంద్యాల నుంచి అ్నపూర్ణ కంపెనీ ద్వారా విత్తనాలు వచ్చాయి..వాటిని మాత్రమే రైతులకు విక్రయించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు సాగు చేసిన నకిలీ విత్తనాల పంటను దున్నలేక..పంటను వదిలిపెట్టలేక..మళ్లీ కొత్తగా నాట్లు వేయాలంటే అదును లేక.. మళ్లీ పెట్టుబడి లేక..ప్రతి రోజు పొలం వద్దకు వెళ్లి పంట వద్ద కన్నీరు పెట్టుకుంటున్నాం.. ఆ నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్పై చర్యలు తీసుకోవాలి.. రైతులకు న్యాయం చేయాలి.’ అని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.నకిలీలతో నష్టపోయాం -
లైంగిక దాడి ఘటన నన్ను కలచివేసింది!
వేడుకగా అఖండ జ్యోతి నాయుడుపేటలో సోమవారం అఖండ జ్యోతి పూజోత్సవం వేడుక నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.రేపటి నుంచి టీచర్లకు అర్హత పరీక్షలు ప్రారంభంక్రీడలు దినచర్యలో భాగం కావాలి క్రీడలు దినచర్యలో భాగం కావాలని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జేవీ రమణ అన్నారు.మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ప్రభుత్వం యూరియా ఇస్తామని ప్రకటించడంతో కావలివారిపల్లికి చెందిన ఓ రైతు కే వడ్డేపల్లె రైతు సేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నాడు. తీరా ఆయన టోన్ నంబర్ వచ్చే సరికి ఓ బస్తా మాత్రమే యూరియా ఇస్తామన్నారు.. ఇదేమిటంటే.. తీసుకుంటే తీస్కో లేకపోత పక్కకు జరుక్కోమని చెప్పారు. కే వడ్డేపల్లి ఆర్ఎస్కే వద్దనే కాదు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. ప్రభుత్వమేమో యూరియా కొరత లేదని చెబుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులేమో ఒక్కొక్క బస్తానే ఇస్తామని చెబుతున్నారు. ఫలితంగా పుడమి పుత్రులు యూరియా కోసం తిప్పలు పడక తప్పడం లేదు.కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం గుమికూడిన రైతులుక్యూలో నిల్చుకోలేక అవస్థలు పడుతున్నాం యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వచ్చా ను. టోకెన్ ఇచ్చారు క దా వరుస క్రమంలో పి లుస్తారని వేచి చూస్తుండగా అందరూ క్యూలో నిలబడాలని చెప్పారు. గంటలు గడుస్తున్నా నాకు ఇచ్చిన టోకెన్ నంబర్ పిలవలేదు. అక్కడ నిలబడలేక చేతిలో ఉన్న కాగితాలు వరుసలో పెట్టి పక్కన కూర్చున్నా. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – నరసింహారెడ్డి, రైతు, పెద్దమ్మగారిపల్లి ఎంతైనా ఇస్తామని.. ఒక బస్తా ఇచ్చారు యూరియా కొరత లేదు.. మీకు ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి గంటల తరబడి నిలబడితే ఒక బస్తా చేతికిచ్చి కొద్ది రోజుల తరువాత మరొక బస్తా ఇస్తామని చెప్పి పంపుతున్నారు. వరి పంటకు అవసరమైనన్ని బస్తాలు ఒకే సారి ఇస్తే రవాణా ఖర్చులు అయినా మిగులుతాయి కదా. – బి.రెడ్డి, రైతు, వడ్డేపల్లి యూరియా కోసం ఇన్ని కష్టాలా? సాధారణంగా పంటలకు అందించే యూరియా కో సం రైతులు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని కల లో కూడా అనుకోలేదు. వరి పంట సాగులో ప్రధానంగా యూరియా వాడాల్సి ఉందని తెలిసినా వ్య వసాయ శాఖ అధికారులు అవసరమైన మేరకు యూరియా తెప్పించలేక పోతున్నారు. అలాగని యూరియా కొరత ఉందని చెప్పలేక పోతున్నారు. రైతులకు గొడవ చేయకండని, నచ్చజెప్పి ఒక బస్తా చేతికిచ్చి పంపుతున్నారు. – జ్యోతిరెడ్డి, రైతు, వడ్డేపల్లి యూరియా కోసం యుద్ధమే చేయాలి యూరియా బస్తా కోసం వస్తే యుద్దమే చేయాల్సి వస్తోంది. గంటల తరబ డి నిలబడినా టోకెన్ పిలవలేదు. అధికారులు ముందుగా టోకెన్లు ఇచ్చి నా రైతులకు కష్టాలు మాత్రం తప్పలేదు. క్యూలో నిల్చుకోలేక చెట్ల కింద సేదతీరుతున్నా. అదికూడా ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ కావాలంటే కుదరదని చెబుతున్నారు. – పద్మావతి, మహిళా రైతు, పోలిరెడ్డిపల్లిశ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,343 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. పోలీస్ గ్రీవెన్స్కు 112 అర్జీలు తిరుపతి క్రైం: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 112 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందు లో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. 15 నుంచి హెల్మెట్ తప్పనిసరి తిరుపతి క్రైమ్: ద్విచక్ర వాహన చోదకులు ఈ నెల 15వ తేదీ నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు సోమవారం విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సుమా రు 45 శాతం మరణాలు ద్విచక్ర వాహనచోదకుల మితిమీరిన వేగం, హెల్మెట్ రహిత ప్రయాణంతో జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.హెల్మెట్ వాడకంతో 40 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉన్నట్లు జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు పట్టకూడదని నిబంధనలను అమలు చేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యావంతులైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, యువత, అందరూ ద్విచక్ర వాహనచోదకులతోపాటు వెనుక కూర్చొని ఉన్నవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.యూరియా..సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలోని అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. నిద్రాహారాలు మాని ఆర్ఎస్కేల వద్ద నిరీక్షిస్తున్నారు. పొద్దస్తమానం వేచి ఉంటే ఎప్పటికో ఓ బస్తా ఇచ్చి, లేదు పొమ్మంటున్నారు. అవసరం మేరకు దొర క్కపోవడంతో కర్షకులు నీకా? నాకా అని పోటీలు పడాల్సి వస్తోంది. ఇందుకు చంద్రగిరిలో సోమ వారం జరిగిన ఘటనే నిదర్శనం. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం ఉదయం 5 గంటలకే రైతులు యూరియా కోసం క్యూలో నిలుచున్నారు. వరుసలో నిల్చోలేక పట్టాదారు పాసుపుస్తకం, టోకెన్లను వరుసలో పెట్టి కూర్చున్నారు. తమ టోకెన్ నంబర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. టోకెన్ నంబర్ పిలిచిన తరువాత అడిగినంత యూరియా ఇవ్వకుండా ఒక బస్తా మాత్రమే ఇస్తామనడంతో చాలా మంది రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు పంచాయతీలకు ఒకే చోట పాకాల మండలంలోని కె.వడ్డేపల్లి, కావలివారిపల్లి, అదెనపల్లి, గాదంకి పంచాయతీలకు చెందిన రైతులందరికీ కె.వడ్డేపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా బస్తాలను సరఫరా చేస్తామని ముందుగా ప్రకటించడంతో రైతులు అందరూ అక్కడకు చేరుకున్నారు. నాలుగు పంచాయతీలకు చెందిన రైతులు ఒకేసారి ఆర్ఎస్కేల వద్దకు రావడంతో గందరగోళం నెలకొంది. డిగ్రీ పరీక్షలు వాయిదాతిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో మంగళవారం నుంచి జరగాల్సిన డీగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ప రీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు సోమవా రం తెలిపారు.సాంకేతిక సమస్యలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరీక్షలనియంత్రణాధికారి తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు. తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు టెట్ తరహా అర్హత పరీక్షలను బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 సెంటర్లలోనూ, అలాగే తమిళనాడు రాష్ట్రం చైన్నెలో 3 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి 21వ తేదీ వరకు జరగనున్న అర్హత పరీక్షలు రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజర య్యే టీచర్లు పరీక్షా కేంద్రాలకు అర్ధగంట ముందే చేరుకోవాలని, నిమిషం అలస్యమైనా అనుమతించే ప్రసక్తి లేదన్నారు. అభ్యర్థులకు కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పక్కదారి పట్టిస్తున్న పచ్చపార్టీ నేతలు పక్కదారికి మళ్లించిన పచ్చ నేతలు యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో స్థానిక పచ్చపార్టీ నేతలు వచ్చిన యూరియా బస్తాలను పక్కదారికి మళ్లించడంతోనే పంపిణీలో ఆలస్యమైందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. టోకెన్లు ఇచ్చినా సరే గంటల తరబడి నిరీక్షణ చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆర్బీకే వద్ద యూరియా బస్తాల కోసం నీకా, నాకా అన్నట్టుగా రైతులు పోటీలు పడ్డారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అధికారులు కొంత సమయం పంపిణీని నిలిపివేయాల్సి వచ్చింది. ఇదే విషయంపై మండల వ్యవసాయ శాఖ అధికారి హరితను వివరణ కోరగా కె.వడ్డేపల్లి రైతు సేవా కేంద్రానికి 300 యూరియా బస్తాలు దిగుమది కాగా 300 మంది రైతులకు టోకెన్లను జారీ చేశామని, అందరికీ ఒక్కొక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశామన్నారు. అయితే ఒకేసారి అందరు రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందన్నారు. అయితే రైతులు మాత్రం 300 బస్తాలకంటే అదనంగా యూరియా వచ్చిందని, పచ్చపార్టీ నేతలకు అవసరమైన బస్తాలను పక్కదారిలో పంపి, మిగిలిన యూరియా మాత్రమే రైతులకు పంచుతున్నారని ఆరోపించారు. తలో మాట రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదంటోంది ప్రభుత్వం.. రైతులకు ఎంత కావాలంటే అంత యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.. రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళితే ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెబుతారు.. ఎందుకలా..? యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు కదాని ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి సమాధానం రాదు.. ఒక్క బస్తా మాత్రమే ఇస్తాం.. ఇష్టం ఉంటే తీసుకో లేదంటే పక్కకు తప్పుకో అంటారు.. ఆ ఒక్క బస్తా యూరియా తీసుకోవడానికి రైతులు ఎన్నెన్నో అవస్థలు పడక తప్పడం లేదు. -
మళ్లీ పెట్టుబడి పెట్టలేం
వరి పంట సీజన్లో నాట్లు వేస్తేనే గిట్టుబాటు అవుతుంది. దానికి తోడు నకిలీ విత్తనాలతో సాగు చేసిన వరిపంటను దున్నివేసి, మళ్లీ సాగు చేయడానికి పెట్టుబడి లేదు. ఓ వైపు విత్తనాలు కొనుగోలు చేయాలి.. మరోవైపు పొలాన్ని రెండు నుంచి మూడు సార్లు దుక్కిచేయాలి.. ఇంకోవైపు ఎరువులు వేయాలి. అంతేకాకుండా కూలీల అవసరం ఉంది. ఎకరం పంటను సాగు చేయడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాగు చేసినా సీజన్ ముగియడంతో దిగుబడి వస్తుందో లేదో అనే ఆందోళన నెలకొంది. – విజయభాస్కర్రెడ్డి, రైతు, కోటపోలూరు -
మమ్మల్ని వీధిపాలు చేశారు
ఇప్పుడు ఉండేది మా తెలుగుదేశం ప్రభుత్వం.. మిమ్మల్ని కాపాడేది ఎవరు? అని పలుసార్లు ఖాదర్ బాషా అనే టీడీపీ కార్యకర్త బెదిరించారు. అతని మాటలు విని రెవెన్యూ అధికారులు మా ఇంటిని కూల్చివేశారు. మా ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని అంటున్నారు. కానీ అదే టీడీపీ కార్యకర్త ఇల్లు కూడా మా పక్కనే వారు చెప్పే సర్వే నంబర్ లోనే ఉంది. అది ఎందుకు తొలగించ లేదు. అతను ఇచ్చే డబ్బులకు ఆశపడి మా కుటుంబాన్ని నడివీధి పాలు చేశారు. – సాహిదా, బాధితురాలు కూతురు, గురవరాజుపల్లి, రేణిగుంట మండలం -
పంచాయతీలు.. విభజన వ్యూహాలు
గ్రామ పంచాయతీల విభజనకు బాబు సర్కారు వ్యూహం పన్నుతోంది. అందుకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయి సిబ్బందితో పచ్చనేతల కనుసన్నల్లో సర్వేలు జరిపిస్తోంది. ఈ నెలాఖరుకు ఈ తంతు ముగిస్తే.. తమ అనుకూల గ్రామాలు ఒక పంచాయతీలో.. వ్యతిరేక గ్రామాలను చీల్చి తలో పంచాయతీలో కలిపేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆపై ఎన్నికల క్రతువుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం పంచాయతీలు 774 స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు 15 గ్రేడ్–1 పంచాయతీలు 49 గ్రేడ్–2 పంచాయతీలు 145 గ్రేడ్–3 పంచాయతీలు 565 జిల్లాలో మండలాల సంఖ్య 34 అదనంగా జిల్లాలో చేరనున్న మండలాలు 3 జిల్లాలో రెవెన్యూ డివిజన్లు సంఖ్య 4 మున్సిపాలిటీలు 8 కార్పోరేషన్ 1 (తిరుపతి) జిల్లా జనాభా 25.65 లక్షలు తిరుపతి అర్బన్: వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీల వర్గీకరణకు తెరలేపింది. ఆ మేరకు జోరుగా ఏ పంచాయతీ మనవైపు...ఏ పంచాయతీ అటు వైపు అని సర్వే సాగిస్తున్నారు. ఈ నెలాఖరుకు సర్వే తంతు ముగియనుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కొత్త పంచాయతీల లెక్కలు ప్రకటించనున్నారు. అనంతరం ఏప్రిల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పంచాయతీలపై ఫోకస్ పెట్టింది. పంచాయతీల్లో పట్టు సాధిస్తే ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చనే కోణంలో కసరత్తు మొదలు పెట్టినట్లు చర్చ సాగుతోంది. జిల్లాలో 774 పంచాయతీలున్నాయి. వీటిని ఎలా కుదించాలి, లేదా పంచాయతీలు పెంచాలా? ఏ గ్రామాన్ని ఏ పంచాయతీలో కలిపితే రాజకీయ ప్రయోజనం ఉంటుంది. మన పార్టీకి అనుకూలంగా ఉన్న పంచాచతీ ఏదీ? వ్యతిరేకంగా ఉన్న పంచాయతీ ఏదీ? ఏ పంచాయతీలో ఎలాంటి ఆర్థిక వనరులున్నాయి? అనే అంశాలపై జోరుగా సర్వే సాగుతోంది. ఈ క్రమంలో పంచాయతీల సంఖ్య తగ్గిపోతుందని కొందరు వాదిస్తుంటే.. పంచాయతీల సంఖ్య పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. అయితే పలు గ్రామాలు మాత్రం ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీలోకి మార్పు జరుగుతుందని చెబుతున్నారు. సాధారణంగా అయితే కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలంటే గ్రామ జనాభా, ఆర్థిక వనరులు, ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య దూరం, రెవెన్యూ వ్యవహారాలు, పాఠశాలలు, అంగన్వాడీ, ఇతర సౌకర్యాలు తదితర అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కూటమికి చెందిన రాజకీయ నేతలు డైరెక్షన్లో కసరత్తు సాగుతున్నట్లు చర్చసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలిలా.. పంచాయతీల వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు చేపడితే అందరికీ అమోదయోగ్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే రాజకీయ కోణంలో వర్గీకరణ చేస్తే గందరగోళం తప్పదని, పెద్ద ఎత్తున పోరాటాలు చోటుచేసుకుంటాయని పంచాయతీ అధినేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే జరుగుతోంది. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆమేరకు ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెలాఖరుకల్లా ఎంపీడీఓల నుంచి ప్రతిపాదనలు రానున్నాయి. అనంతరం తుది జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తాం. – సుశీలాదేవి, జిల్లా పంచాయతీ అధికారి -
పేద మహిళ ఇంటి స్థలంపై టీడీపీ కార్యకర్త కన్ను
రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లిలో మైమూన్ అనే మహిళ తన కుమార్తె, మనవళ్లతో ఉంటోంది. ఇల్లు లేని మైమూన్కు దళితవాడకు చెందిన నండ్ర రత్నమ్మ తమ స్వాధీన అనుభవంలో ఉన్న భూమిలో 2 సెంట్లు ఇచ్చింది. అందులో ఐదేళ్ల క్రితం మైమూన్ రేకుల ఇల్లు నిర్మించుకుని ఇడ్లీ దుకాణం నడుపుతోంది. స్థానికంగా ఉండే టీడీపీ కార్యకర్త కన్ను ఆ స్థలంపై పడింది. అప్పటి నుంచి స్థలం తనదంటూ మైమున్ కుటుంబ సభ్యులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారుల ద్వారా మైమున్ను భయపెట్టారు. అధికారుల ఒత్తిడి ఎక్కువ కావడంతో మైమున్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సదరు ఇంటిపై స్టే విధించింది. అయినప్పటికీ టీడీపీ కార్యకర్త రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఉపయోగించి ఆ మహిళను తీవ్ర మనోవేదనకు గురిచేశారు. ఇటీవల మైమున్కు చెయ్యి విరగడంతో వైద్యం చేయించుకునేందుకు పుత్తూరుకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన టీడీపీ కార్యకర్త..రెవెన్యూ అధికారులను పంపించి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె రేకుల ఇల్లును నేలమట్టం చేయించాడు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న మైమూన్ కుటుంబ సభ్యులు జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించారు. ఇంటి శిథిలాల కింద పడి ఉన్న సామాన్లను ఎత్తుకుంటూ..ఎవరూ లేని సమయంలో ఇలా తమ ఇంటిని కూల్చివేయడం అన్యాయమని వాపోయారు. -
శబరిమల యాత్రలో అపశ్రుతులు
చిల్లకూరు: తిరుపతి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అయ్యప్పస్వామి భక్తుల శబరిమల యాత్రలో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు బోల్తా పడగ, మరో ఘటనలో కారు కల్వర్టును ఢీకొని నుజ్జునుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. భక్తిభావంతో అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు బయలు దేరిన భక్తులు ప్రయాణించే బస్సు బోల్తా పడడంతో పలువురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన చిల్లకూరు మండలం రైటార్ సత్రం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు, గురుజాల నుంచి సుమారు 40 మంది అయ్యప్ప భక్తులతో ప్రైవేటు ట్రావెల్ బస్సు శనివారం రాత్రి శబరిమలకు బయలు దేరింది. ఈ క్రమంలో బస్సు మండలంలోని రైటార్ సత్రం వద్దకు వచ్చే సరికే ముందు ఆపి ఉన్న లారీని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు బస్సు ఒరిగి పోవడంతో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలు కాగా ఆదినారాయణ, కోడేల సతీ్ష్, నాగేశ్వరరావుకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం భక్తుల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయ్యప్ప భక్తులు సమీపంలో ఉన్న అమరావతి హోటల్లో సేద తీరారు. అనంతరం మరో బస్సు వచ్చిన తరువాత వారు శబరిమలకు బయలు దేరి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్వర్టును ఢీకొన్న అయ్యప్ప భక్త బృందం కారు చంద్రగిరి: శబరిమల యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతున్న కారు కల్వర్టును ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అయ్యప్పస్వామి భక్తులు గాయపడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రైల్వేకోడూరుకు చెందిన అయ్యప్ప స్వాములు, శబరిమల యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం తమ కారులో రైల్వే కోడూరుకు పయనమయ్యారు. అగరాల వద్ద వస్తుండగా కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడం కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది. దీంతో కారు గాల్లో ఎగిరి పడి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాయికుమార్, అజయ్కుమార్, జస్వంత్, మణికంఠ, నితీష్, యోగేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. వీరిలో సాయికుమార్కు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న నృత్య, కళాత్మక పోటీలు
చంద్రగిరి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎస్వీ వ్యవసాయ కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక, క్రీడా పోటీలు మూడో రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా ఆదివారం నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అథ్లెటిక్ తదితర పోటీలు అట్టహాసంగా జరిగాయి. నృత్య పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలతో పాటు సెటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం తదితర విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులు పోటీపడి తమ ప్రతిభను కనబరిచారు. చదరంగం విభాగంలో శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, బాల్ బ్యాడ్మింటన్లో ఉదయగిరి వ్యవసాయ కళాశాల, 100 మీటర్ల పరుగు పందెంలో తాడిపత్రి వ్యవసాయ కళాశాల, 200 మీటర్ల పరుగు విభాగంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి వ్యవహారాల ఇన్చార్జి డాక్టర్ కే హరిప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మా స్వాధీన అనుభవంలో ఉన్న భూమి
50 ఏళ్లుగా మా కుటుంబ అనుభవంలో ఉంటున్న భూమిలో రోడ్డు పక్కన పది మందికి అప్పట్లో మా అత్త ఇంటి స్థలాలు ఇచ్చింది. వారు అందరూ ఇళ్లు కట్టుకుని కాపురాలు ఉంటున్నారు. మైమూన్ అనే మహిళకు మా అత్త రెండు సెంట్లు భూమిని ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఆ స్థలం నాది అని అనడం విడ్డూరంగా ఉంది. ఆ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు మా వద్ద ఉన్నాయి. ఆ స్థలం ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అనడం న్యాయం కాదు. ప్రభుత్వ భూమి అయితే మొత్తం పది ఇళ్లను తొలగించాలి కదా. టీడీపీ కార్యకర్త కూడా అదే సర్వే నంబర్లోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు. ఆ ఇంటి జోలికి ఎందుకు వెళ్లలేదు. – నండ్ర వరమ్మ, గురవరాజుపల్లి హరిజనవాడ, రేణిగుంట మండలం -
స్కాలర్ షిప్ పరీక్షకు విశేష స్పందన
తిరుపతి సిటీ: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ (ఎన్ఎమ్ఎమ్ఎస్) పరీక్షలకు విశేష స్పందన లభించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆదివారం 14 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎన్ఎమ్ఎమ్ఎస్ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షకు 2,958 మంది నమోదు చేసుకోగా, అందులో 2,860మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఎటు వంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వివాదస్పద భూమిపై ఏఎస్పీ, ఆర్డీఓ విచారణ బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని రెండు గ్రామాల మధ్య నెలకొన్న భూవివాదంపై ఏఎస్పీ రవిమనోహరచ్చారి, ఆర్డీఓ కిరణ్మయి ఆదివారం విచారణ చేపట్టారు. నీర్పాకోట రెవెన్యూ పరిధిలోని 87–9లో ఉన్న 29 సెంట్లు భూమికి సంబంధించి రెండు నెలక్రితం నీర్పాకోట, కాంపాళెం గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడిషనల్ ఎస్పీ, ఆర్డీఓ, వివాస్పద భూమిని పరిశీలించారు. అక్కడే ఇరువర్గాల వారిని విచారించి, వివరాలు సేకరించారు. దీనిపై ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ వివాస్పద భూమి ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ తిమ్మయ్య, తహసీల్దార్ శ్రీదేవి, ఎస్ఐ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నేచురల్ బాడీ బిల్డింగ్లో శ్రీకాళహస్తి వాసికి పసిడి పతకం శ్రీకాళహస్తి: గోవాలో గత నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నేషనల్ నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీకాళహస్తికి చెందిన షేక్ జావిద్ బంగారు పతకం సాధించాడు. దీంతో ఆదివారం వై ఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్బాషా అతన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన షేక్ జాబిద్ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్ర నేషనల్ హ్యూమన్రైట్స్ ఉపాధ్యక్షులు కామి వెంకటేశ్వర్లు, రమేష్, మాత య్య, లాలు, శంషుద్దీన్ పాల్గొన్నారు. -
మేయర్పై అవిశ్వాసం దారుణం
చిల్లకూరు: నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాసం ప్రకటించడం దారుణమని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. గూడూరు టవర్ క్లాక్ ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం గిరిజన సంఘాల నాయకులు కుటుంబాలతో కలసి వచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ గిరిజన మహిళ నెల్లూరు కార్పొరేషన మేయర్గా ఉండడం అగ్ర వర్ణాల వారికి ఇష్టం లేక పోవడంతోనే ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గిరిజనులకు అండగా ఉండి, వారి అభ్యున్నతిని కాంక్షిస్తామని ప్రకటనలు చేశారని, అలాంటి ఓ గిరిజన మహిళకు ప్రభుత్వంలోని పెద్దలు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తగదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాపాడలేక పోవడం చూస్తుంటే అణగారిన వర్గాల వారు ఉన్నత పదవులను అలంకరించడం వారికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన సంఘాల నాయకులు తిరువీధుల వాసు, వెంకటేష్, సుజాతమ్మ, గిరిజ తదితరులు పాల్గొన్నారు. కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి తిరుపతి అర్బన్: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓ వి డాట్ ఇన్) వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. కాగా ఈ నెల 8వ తేదీ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. అంజూరులో టీడీపీ నేత అత్యుత్సాహం కేవీబీపురం: మండలంలోని అంజూరు పంచాయతీలో టీడీపీ నే త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రు. గత ప్రభుత్వంలో అంజూరు దళితవాడలో రూ.32 లక్షల ని ధులతో 900 మీటర్ల మురుగునీటి కాలువలను నిర్మించారు. ఈ పనులకు సంబఽంధించి ఆ గ్రామంలో దిమ్మె ఏర్పాటు చేసి, పనుల వివరాలను పొందుపరిచారు. అయితే ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత రూ.5 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేశారు. ఈ పనులకు సంబంధించి ప్రత్యేకంగా నేమ్ బోర్డు ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డుపై వివరాలను తొ లగించి ప్రస్తుతం చేపట్టిన సిమెంటు రోడ్డు నిర్మాణ వివరాలను పొందుపరిచా రు. ఈ ఘటనను గ్రామస్తులు సురేష్, చెంగయ్య, సుబ్రమణ్యం, మురళి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డును ఎలా చెరిపివేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు సైతం ఇలాంటి దుర్మార్గాలపై చర్యలు తీసుకోరా? అని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రైవేటీకరణ దారుణం
వైద్యవిద్య బలోపేతం అయితే పేద రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలను నిర్వహిస్తే మరింత మంది డాక్టర్ కోర్సులు చదువుకునేందుకు వీలవుతుంది. దీనికనుగుణంగానే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వైద్య విద్యను పెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. ఇది దుర్మార్గం. – గణపతిరెడ్డి, సర్పంచ్, నడవలూరు, రామచంద్రాపురం మండలం ● -
ఎస్వీయూ పీజీ స్పాట్కు సెట్ అర్హత సడలింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ తా రాస్థాయిలో పడిపోయింది. దీంతో వర్సిటీ అధికారు లు స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలికి మొర పెట్టుకున్నారు. గత నెలరోజులుగా పెండింగ్లో ఉన్న ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్లకు ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ఇప్పటికీ వర్సిటీలో అన్ని వి భాగాల్లో కలిపి సుమారు 3 వేలకు పైగా సీట్లు ఉండగా అందులో ఏపీ పీజీసెట్–2025 కన్వీనర్ కోటా కింద 45 శాతం సీట్లు సైతం భర్తీ కాలేదు. దీంతో 2025–26 విద్యాసంవత్సరంలో ఎస్వీయూలో పీజీ అ డ్మిషన్లు ఊహించని స్థాయి దిగజారడంతో వర్సిటీ భవిత ప్ర శ్నార్థకంగా మారిందని,ఉన్నత విద్యామండలి చొరవ చూపాలని పలుసార్లు విద్యార్థి సంఘాలు విన్నవించా యి. దీంతో స్పాట్ అడ్మిషన్లకు అనుమతి దక్కింది. సెట్ అర్హత సడలింపు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఏపీ పీజీ సెట్–2025 అర్హత ప్రామాణికాన్ని ఉన్నత విద్యామండలి సడలించింది. సెట్లో అర్హత పొందిన, సెట్ పరీక్షకు హాజరుకాకపోయినా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరేందుకు అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వర్సిటీలో మిగిలిన సీట్ల భర్తీకి సుగమం అయ్యింది. దీంతో ఈ ఏడాది కనీసం 60 శాతం సీ ట్లు భర్తీ అయ్యేనా? అని అధ్యాపకులు, వర్సిటీ అధి కారులు ఎదురు చూస్తున్నారు. విద్యార్థి సంఘాల విజయం స్పాట్ అడ్మిషన్లలో పీజీ సెట్ అర్హతను సడలింపు ఇస్తే నే వర్సిటీలో కనీసం 60 నుంచి 70శాతం అడ్మిషన్లు జరుగుతాయని విద్యార్థి సంఘాలు పలుసార్లు వర్సిటీ అధికారులకు, ఉన్నత విద్యామండలి అధికారులకు వి న్నవించుకున్నాయి. కానీ అధికారులు నియంతృత్వధోరణితో వ్యవహరించడంతో అడ్మిషన్లు పడిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల విన్నపానికి అధికారులు దిగివచ్చి స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి స్పాట్ అడ్మిషన్లు ఎస్వీయూలో రిజిస్ట్రార్ భూపతి నాయుడు పీజీ స్పాట్ అడ్మిషన్లకు తేదీలను ప్రకటించారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 8వ తేదీ ఎంకామ్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, 9వ తేదీన ఎంఎస్సీ, 10వ తేదీన ఎంఏ ఆర్ట్స్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఏపీ పీజీసెట్–2025లో అర్హత సాధించిన వారికి ఇస్తామని, రెండో ప్రాధాన్యతలో నాన్ సెట్ విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు వర్సీటీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0877–2248589 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
శ్రీకాళహస్తిలో కోటి సంతకాల సేకరణ
శ్రీకాళహస్తి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో 34వ వార్డు పరిధిలో ఆదివారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య విద్య ప్రజల హక్కు అని, పీపీపీ విధానంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని తమ మద్దతు తెలిపారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల: అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు శివప్రసాద్ ఆదివారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయాధికారులకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు పాల్గొన్నారు. పది పరీక్ష ఫీజు గడువు పొడిగింపు తిరుపతి సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి చెల్లించాల్సి ఫీజు గడువును అపరాధరుసుము లేకుండా ఈనెల 9వ తేదీ వరకు చెల్లించవచ్చనని ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 12వతేదీ వరకు, రూ. 200 అపరాధ రుసుముతో 15వ తేదీ వరకు, రూ. 500 అపరాధ రుసుముతో 18వ తేదీవరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను రెండు సార్లుగా పరిశీలించి జాగ్రత్తగా తప్పులు లేకుండా యూడీఎస్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,007 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఏడు గంగమ్మల జాతర చాటింపు శ్రీకాళహస్తి: పట్టణంలో బుధవారం ఏడుగంగమ్మల జాతరను పురస్కరించుకుని ఆదివారం బేరివారి మండపం వద్ద గంగమ్మకు సంబంధించి కొండమిట్టలో చాటింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెట్టురాయి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను రజకులు సంజాకుల గురవయ్య, బాలనుబ్రహ్మణ్యం చేశారు. అనంతరం ధూప, దీప నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ కమిటీ సభ్యులు వజ్రం కిషోర్, అంజూరు రాజా, నాగమల్లి దుర్గాప్రసాద్, వినయ్, మెకానిక్ రెడ్డి, సుబ్బు, పవన్ రాయల్, సతీష్రయల్, గ్యాస్ బాబు, చందు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
సంతకం..
సిరా చుక్కలు సంతకాల రూపం ధరిస్తున్నాయి.. అక్షర ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ సంతకాలే సమరశంఖారావం పూరిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. సర్కారుపై దండెత్తుతున్నాయి.. వైద్య విద్యను బాబు ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్నాయి. చిన్న ఉద్యమంగా మొదలై మహోద్యమంగా అవతరిస్తున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల యాగంలో పాలుపంచుకోవడానికి ఊరూవాడా సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలపై ప్రైవేటు పెత్తనం వద్దంటూ సామాన్య, మధ్యతరగతి జనం స్వచ్ఛందంగా సంతకం చేసి, తమ నిరసనను వెలిబుచ్చుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం.. మహాద్యమంలా సాగు తోంది. పార్టీలకతీతంగా విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతుండడంతో తిరుపతి, చిత్తూరు, జిల్లాల్లో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రా ష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కళాశాలలు 2023–2024 మధ్య కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆ ఐదు కళాశాలల ద్వారానే అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతోంది. ఉద్యమం.. మహోద్యమం! ఉద్యమం సాగుతోందిలా.. -
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దు
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయవద్దండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. జగనన్నపై నమ్మకంతో కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి పార్టీలకతీతంగా జనం మద్ద తు పలుకుతున్నారు. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని అనేక మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కోటి సంతకాల ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. –జి. కిరణ్కుమార్, వైద్య విద్యార్థి, తిరుపతి ● -
అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి
–జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి తుడా: తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్) పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ రెండో బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుడా పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, శెట్టిపల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును, శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని సూచించారు. ఈ సందర్భంగా పెరుమాళ్లపల్లి పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, కర్మక్రియల షెడ్డు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఉప్పరపల్లి నుంచి మహిళా విశ్వవిద్యాలయం వరకు నాలుగు లేన్ల రోడ్డు, మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రేణిగుంట మండలం సూరప్పకసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతినగర్ లే అవుట్లో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపారు. తుడా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, తుడా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ తుడా నిధులు దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తుడా సెక్రటరి శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం
పీజీ తొలిసెమిస్టర్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ బోటనీ, మ్యాథ్స్, రెగ్యులర్ ఎంఏ మొదటి సెమిస్టర్ ఆర్కియాలజీ, హిస్టరీ, పాపులేషన్ స్టడీస్, సోషల్ వర్క్, సంస్కృతం, లింగ్విస్టిక్స్ , ఉర్దూ, హ్యూమన్ రైట్స్, ఉమెన్ స్టడీస్ విభాగాల ఫలితాలను విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి క్రైమ్: నగరంలో శనివారం రాత్రి గరుడ వారధి ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం మేరకు.. మానస సరోవర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న తోట పుష్యమిత్ర (26)కు ఏమైందో ఏమో గానీ శనివారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో పుష్యమిత్ర కింద వెళుతున్న కారుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా కారు కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదలకు చైతన్య వారధి అంబేడ్కర్
తిరుపతి కల్చరల్: దేశంలో పెనవేసుకుపోయిన కులవ్యవస్థ మాసిపోవాలని పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ బారత దేశంలోని పేదలకు చైతన్య వారధి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ నాగరికత ఏర్పడిన తరువాత ఉన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని తెలిపారు. మానవుల్లో అత్యంత మేధావిగా, పేద ప్రజల జీవితాలను పరిపూర్ణంగా మార్చిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కట్టా గోపియాదవ్, ఎస్సీ విభాగం నేతలు తలారి రాజేంద్ర, నల్లానిబాబు, అజయ్, దేవదానం, కల్లూరి చెంగయ్య, విజయలక్ష్మి, మాధురి, శాంతారెడ్డి,మద్దాలి శేఖర్, రమణారెడ్డి. ధనశేఖర్ పాల్గొన్నారు. -
హోంగార్డు సేవలు ప్రశంసనీయం
తిరుపతి క్రైమ్: హోంగార్డు సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఏర్పడిందని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో ఒక భాగమని హోంగార్డ్స్ ప్రజలకు పోలీసులకు వారధిగా పనిచేయాలని సూచించారు. 26 ఏళ్లగా పోలీసులతో ఏమాత్రం తీసిపోని విధంగా వీరంతా సేవలందిస్తున్నారన్నారు. హోంగార్డు సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటామని, వారికి ఏ విధమైన సాయం కావాలన్న తనని నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వారి కుటుంబీకులు ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహర్ ఆచారి, శ్రీనివాసులు, రామకృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంబేడ్కర్కు నివాళి అంబేడ్కర్కు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
ఇన్ఫోసిస్కి ‘శ్రీరామ’ విద్యార్థులు
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. శనివారం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు పాఠ్యాంశాలు బోధిస్తున్నారని వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు పాల్గొన్నారు. 14 మంది ఎస్ఐలకు బదిలీల అటాచ్మెంట్లు తిరుపతి క్రైమ్: జిల్లాలో పనిచేస్తున్న 14 మంది ఎస్ఐలకు బదిలీలు ఇస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘంగా పనిచేస్తున్న ఎస్ఐలను బదిలీలు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీరందరూ కూడా బదిలీ స్థానాల్లో త్వరలోనే బాధ్యతలు స్వీకరించినన్నారు. బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే భక్తులు శనివారం బర్డ్ ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు దాతలు హైదరాబాద్లోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడికి చెక్ను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. -
కూటమి నేతలకు ఉలుకెందుకు?
తిరుపతి కల్చరల్: తిరుమల పరకామణి కేసులో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన వాస్తవాలను మాట్లాడితే ఆ మాటలను హేళన చేస్తూ కూటమి నేతలు మూకుమ్మడిగా ఉలికిపాటుతో విమర్శలు చేయడమేమిటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్కుమార్ ప్రశ్నించారు. శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కట్టుకథలు అల్లుతూ ప్రజలను మభ్యపెట్టే నైజం కూటమి నేతలదేనన్నారు. తిరుమలలో ద్రోహం జరిగిపోయిందంటూ కల్తీ నెయ్యి, పరకామణి సంఘటనలను ఎత్తి చూపుతూ ఆ నిందను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 30 ఏళ్లుగా పరకామణిలో దోపిడీ జరుగుతోందని, రూ.కోట్లు దోచుకున్నారని, టీడీపీ నేతలు పని గట్టుకుని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. పరకామణిలో చోరీ ఘటనను గుర్తించి పట్టుకున్నదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనేనని, అంతకముందు మీరు ఎందుకు పట్టుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో పరకామణిలో చోరీ ఘటనలో రవికుమార్ 9 డాలర్లు దొంగలించినట్లు పట్టుబడినప్పుడు తెలిసిందని, దీని విలువ రూ.72 వేలని అయినా విచారణ చేసి గతంలో జరిగిన వాస్తవాలను వెలికి తీసి, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులను న్యాయనిపుణుల సలహాతో దేవుడికి స్వాధీనం చేసింది కూడా అప్పటి టీటీడీ అధికారులని తెలిపారు. టీటీడీలో పటిష్ట భద్రత, ఆధునిక పరికరాల వినియోగం ఉన్నా నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి తాను చూసినట్లు పదే పదే ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సైతం ఎలాంటి విచారణ జరగకనే తిరుమలలో శ్రీవారి ప్రసాదాలకు ఇచ్చే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వొ కల్తీ జరిగిందని ప్రకటించారని, చంద్రబాబుకు ఈ విషయం ఎవరు చెప్పారో ఆయన సమాధానం చెప్పాలన్నారు. నెయ్యి కల్తీ విషయంపై మొదట ఆరోపణలు చేసిన చంద్రబాబును సిట్ అధికారులు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న కంపెనీతోనే మళ్లీ వైఎస్సార్ సీపీ నెయ్యి కొనుగోలు చేసిందన్న విషయాన్ని కూడా విస్మరించి తప్పుడు ఆరోపణలతో వైఎస్సార్సీపీ పరువు దెబ్బతీయాలని కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. ఒక టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి భక్తి పరాయనుడంటూ గొప్పలు చెప్పుకుంటూ తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించడం విడ్డూరమన్నారు. రెండు సార్లు బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన శ్రీవారి దర్శన టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీకు దేవుడిపై భక్తి ఉంటే తాను అలాంటి పనులు చేయలేదు, నేడు స్వామి భక్తులకే టికెట్లు ఇచ్చానని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నీవు బోర్డు సభ్యుడిగా ఎవరెవరికి ఎంత మందికి దర్శన టికెట్లు ఇచ్చావో చెప్పి నీ సచ్ఛీలత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నల్లాని బాబు, మహేష్, మద్దాల శేఖర్ పాల్గొన్నారు. -
మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా?
తిరుపతి అర్బన్: ప్రజా ప్రతినిధులు ముందుగా మీరు మాట్లాడి వెళ్లిపోతే ఎలా సార్.. మా సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుంది.. మా సమస్యలపై మేము మాట్లాడిన తర్వాత.. వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ మాట్లాడాలని దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దీంతో ముందుగా దివ్యాంగుల సంఘం నేతలకు మాట్లాడే అవకాశం కల్పించారు. కలెక్టరేట్లో శనివా రం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొణతం చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)ని నియమించాలని నిలదీశారు. చిత్తూరు జిల్లా ఏడీ విక్రమ్కుమార్రెడ్డికే తిరుపతి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ఏమిటని నిలదీశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈ నెల 3వ తేదీ జరగాల్సి ఉండగ, ఆ రోజు ఏడీ విక్రమ్కుమార్రెడ్డి చిత్తూరులో నిర్వహించాల్సి రావడంతో అదే రోజు ఇక్కడ జరిపే వీలులేక 6వ తేదీ నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇంద్రధనస్సు పేరుతో పురుషులకు సైతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఎస్సీ, ఎస్టీ తరహాలో దివ్యాంగులకు రాయితీలు, బాపట్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే వికలత్వం 70 శాతం పైబడిన వారికి మాత్రమే అంటూ మెలిక పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని 6,500 మందికి వికలత్వం శాతాన్ని తగ్గించి పింఛన్లు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మీ సమస్యలను నోట్ చేసుకున్నామని తప్పకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల ఏడీ విక్రమ్కుమార్రెడ్డి మాట్లాడారు. తరువాత వివిధ సేవలందించిన దివ్యాంగులకు ప్రశాంసాపత్రాలు పంపిణీ చేసి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంఘం నేతలు మురళి, సుబ్రమణ్యం, మీనాక్షి, మురళీగౌడ్,శివకుమారి, మధులత, పెంచలయ్య, మాధవన్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుకు గండి కొట్టేశారు!
చిట్టమూరు: రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చెరువుకు గండి కొట్టేశారు. దీంతో ఆ చెరువు ఆయకట్టులో పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. చిట్టమూరు మండలం యాకసిరి చెరువుకు సమీపంలో సాగరమాల రహదారి నిర్మాణం జరుగుతుండడంతో ఆ ప్రాంతంలో భూములకు మంచి విలువ వచ్చింది. దీంతో మండల స్థాయి నాయకులు తిరుపతికి చెందిన ఓ వ్యక్తితో కలసి చెరువుకు ఆనుకుని 80 ఎకరాల్లో సాగరమాల–2 అనే పేరుతో వెంచర్ వేసి, దానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఇక్కడ సర్వే నంబర్18లోని చెరువు పొరంబోకు కింద ఉన్న సుమారు 40 ఎకరాలను పేద రైతులు సాగు చేసుకుంటుండగా స్థానిక నాయకుల ద్వారా వాటిని కొనుగోలు చేసుకుని పట్టా భూమిలో కలుపుకుని ఏడాది క్రితం వెంచర్ వేశారు. అయితే ఈ ఏడాది భారీగా వర్షాలు కురవడంతో చెరువుకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో వెంచర్కు నిర్మించి ప్రహరీ గోడ ఎక్కడ కూలి పోతుందోనని రాత్రికి రాత్రి యంత్రాలతో సుమారు 20 అడుగుల మేర రెండు చోట్ల చెరువుకు గండి కొట్టారు. చెరువుకు గండి కొట్టడంతో నీరు వృథాగా దిగువకు పోతుంది. దీంతో చెరువు ఆయకట్టు కింద సాగు చేసే సుమారు 2, 500 ఎకరాలకు ఈ ఏడాది పంట పండకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గండి కొట్టిన ప్రాంతాన్ని రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కింద సుమారు 2,500 ఎకరాల వరకు వరి సాగు చేస్తారని, అలాంటి చెరువుకు గండి కొట్టి నీరంతా వృథాగా దిగువకు పోవడంతో రైతులు ఈ ఏడాది పంట పూర్తి స్థాయి పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని అన్నారు. -
తిరుపతి జిల్లా అర్చకుల నూతన జేఏసీ అధ్యక్షుడిగా ఎన్.వంశీకృష్ణశర్మ
ఏర్పేడు: తిరుపతి జిల్లాలోని దేవాదాయ, ధర్మా దా యశాఖ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, భజంత్రీల సిబ్బంది జేఏసీ జిల్లా నూతన అధ్యక్షుడిగా గుడిమల్లం పరశురామేశ్వరాలయ అర్చకులు ఎన్.వంశీకృష్ణశర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాపానాయుడుపేటలోని శ్రీ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో జిల్లా జేఏసీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఆకుల సతీష్ (భారతీయ మజ్దూర్ సంఘ అధ్యక్షులు) అధ్యక్షుడిగా యన్. వంశీకృష్ణ శర్మ (అర్చకులు, పరుశురామేశ్వర స్వామి దేవస్థానం, గుడిమల్లం), ఉపాధ్యక్షుడిగా టి.మణి(సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, పాకాల), ప్రధానకార్యదర్శిగా కే.ప్రకాష్, సంయుక్త కార్యదర్శిగా వి.ఢిల్లీ (పూజారి, ఆంజనేయపురం), కార్యనిర్వాహక కార్యదర్శిగా శివకుమార్ శర్మ (కనుపూరు ముత్యాలమ్మ గుడి), కోశాధికారిగా బాలాజీ (బుగ్గమఠం, తిరుపతి) ఎన్నికయ్యారు. అలాగే ఈసీ సభ్యులుగా సేతు కుమార్(పల్లి కొండేశ్వర స్వామి ఆలయం), లోకేష్ (దేశమ్మ గుడి, తిరుపతి), లలిత (గుడి మల్లం దేవస్థానం), మధు (గుడిమల్లం దేవస్థానం) పి.మణి (పాకాల సుబ్రహ్మణ్యస్వామి గుడి) జి.ఎస్ వరప్రసాద్ (అర్చకులు, ముత్యాలమ్మ గుడి, కనుపూరు), ఏ .సురేంద్ర (ముత్యాలమ్మ గుడి, కనుపూరు), పి .బాలాజీ (పోలేరమ్మ గుడి, నాయుడుపేట), సీ హెచ్ సోమశేఖర శర్మ( నాయుడుపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఇండిగో రద్దుతో పెరిగిన విమాన టికెట్ల ధరలు
రేణిగుంట: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కావడంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తున్న 12 విమానాల్లో పది సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకు వెళ్లేందుకు ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్ చేసుకుని శుక్రవారం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయని తెలియడంతో అసహనానికి గురై ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా తిరుపతి నుంచి అత్యధికంగా ప్రయాణికులను చేరవేసే ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్లు ధరలను అమాంతం పెంచాయి. సాధారణంగా తిరుపతి నుంచి హైదరాబాద్కు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఛార్జీ కాగా, శుక్రవారం ఒక టికెట్ ధర రూ.20వేలకు పైగా పెంచారు. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ పరిధిలో శుక్రవారం తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసులు ఎనిమిది మంది ఎరచ్రందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారినుంచి 12 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ కంట్రోల్కు చెందిన ఆర్ఎస్ఐ పి.నరేష్ బృందం స్థానిక ఎఫ్బీఓ అంజనా స్వాతితో కలసి గురువారం అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్ద కొంతమంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. టాస్క్ఫోర్స్ బృందం వారిని సమీపించడంతో వారు పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 12 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎరచ్రందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. వారిని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్జే శ్రీనివాస్ విచారించారు. అనంతరం సీఐ ఖాదర్ బాషా ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, వేలూరు జిల్లాకు చెందిన పి.లక్ష్మణన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.ఆరు లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది కథనం మేరకు.. 2016 సంవత్సరంలో తిరుమల, తుంబర తీర్థం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు లక్ష్మణన్ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. లక్ష్మణన్పై నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు పెద్దపీట
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై ఈఓ భక్తులకు వివరించారు. ● డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు. ● వైకుంఠ ద్వార దర్శనాలకు కేటాయించిన 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయం సామాన్య భక్తులకే కేటాయింపు. ● పది రోజుల్లో 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు. ● డిసెంబర్ 30, 31, జనవరి ఒకటో తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ. ● నవంబర్ 27 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు. ● డిసెంబర్ 2వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు. ● మొదటి మూడు రోజులు ఎస్ఈడీ, శ్రీవాణి దర్శనాలు రద్దు. మిగిలిన 7 రోజులకుగాను 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం వెయ్యి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తాం. ● జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం– 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం. ● పది రోజులపాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రత్యేక దర్శనాలు రద్దు. ● స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం. ● దాతలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బుకింగ్కు అవకాశం. ● జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్లైన్లో బుకింగ్కు అవకాశం. ఈ కార్యక్రమంలో టీటీడీ టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
● ఎంపీ గురుమూర్తి తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిత్తూరు, తిరు పతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్యశాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవు తున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండ డం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవా లని కోరారు. ప్రతి ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. స్క్రబ్ టైఫస్ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆస్పత్రిలో వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. నేటి నుంచి నాలుగో బాలల సైన్స్ ఫెస్టివల్ తిరుపతి ఎడ్యుకేషన్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం(రీజనల్ సైన్స్ సెంటర్)లో ఈ నెల 6, 7వ తేదీల్లో 4వ బాలల సైన్స్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫెస్టివల్కు తిరుపతి పరిసరాల్లోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 70 విభిన్న సైన్స్ నమూనాలను విద్యార్థులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. ఈ ఫెస్టివల్లో సైన్స్ డ్రామా పోటీలతో పాటు స్థిరత్వం, సామాజిక సమస్యలు, ఒత్తిడితో కూడిన సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలపై విద్యార్థులు తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు వీలుగా ఐడియాథాన్ పోటీని నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 7వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ బాలల సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనాలని రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కోరారు. ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు తుది గడువు 10 తిరుపతి సిటీ: జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియడ్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మేరకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అపరాధ రుసుము రూ.25తో ఈనెల 12 వరకు, రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 15వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రస్తుత సమాజంలో విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక చిన్న బజార్వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజాన్ని వెనక్కి నెడతాయన్నారు. అవి పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. చిన్న వయస్సులో పెళ్లి జరిగిన బాలికలు ఎన్నో మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని ఉదాహరణలతో వివరించారు. అందుకే ప్రతి విద్యార్థీ చదువు పూర్తి చేసి, తమ ప్రతిభను వెలికితీసుకుని, స్వయం సమర్థులు అవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. -
ఆలస్యం చేయవద్దు
మైట్ కాటుతో ఏడు నుంచి పది రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం వస్తుంది. తలనొప్పి బాధిస్తుంది. చాలామంది సాధారణ జ్వరం, తలనొప్పేనని నిర్లక్ష్యం చేస్తారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్క్రబ్ టైఫస్ అనేక అంటు వ్యాధులతో మిళితమై గందరగోళానికి దారితీస్తుంది. రోగులలో రోగ నిర్ధారణకు సెరోలాజిక్ పరీక్షను నిర్వహించవచ్చు. ఎస్చార్ లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ బయాస్పీని కూడా రోగనిర్ధారణకు ఉపయోగించవచ్చు. దీనిపై రోగులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. –డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు తక్షణం వైద్యులను సంప్రదించాలి జ్వరం రెండు, మూడురోజులు కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేసుకుని జ్వరానికి గల కారణాలను నిర్థారణ చేసుకోవాలి. వీటిని లెక్కచేయకుండా రెండు మందు బిళ్లలు మింగితే తగ్గిపోతుందని అనుకోవడం కరెక్టు కాదు. అలసత్వం వహించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు. జ్వరాల్లో స్క్రబ్ టైఫస్ ఒకటి. ఈ వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రధాన అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై మచ్చలను గమనించవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో స్క్రబ్ టైఫస్ను గుర్తించి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ వరప్రసాద్, సీనియర్ వైద్యులు, తిరుపతి -
పవన్ కల్యాణ్.. పేరూరు చెరువును కాపాడండి
తిరుపతి రూరల్: మండలంలోని పేరూరు చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పేరూరు వాసులు కోరుతున్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయానికి ఆనుకుని నూతనంగా నిర్మించిన డీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించనున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ను స్వయంగా కలసి లేఖను అందజేయనున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్రెడ్డి ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఆ మేరకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు వినతి పత్రం సమర్పించడంతో ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ నరేంద్ర కుమార్, డీఈ ఉపేంద్రరెడ్డి, ఏఈ హిమంతు చౌదరి పేరూరు చెరువును సందర్శించారని చెప్పారు. చెరువుకు వచ్చే మురుగునీటి కాలువలను పరిశీలించి మురుగు నీరు చెరువులో కలుస్తున్నట్టు గుర్తించారని తెలిపారు. ఆ చెరువు కలుషితమైతే సమీపంలోని 32 గ్రామాల్లో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ఆ చెరువుకు ఏఏ పంచాయతీల నుంచి మురుగునీరు వస్తుందో గుర్తించిన అధికారులు ఆ మురుగునీటి కాలువలన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి నీటిని శుద్ధి చేయిస్తామని, ఆ తర్వాత నీటిని బయటకు పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది జరిగి నాలుగు నెలలు గడిచినా ప్రయోజనం లేదని, నీటి శుద్ధి యంత్రాన్ని తక్షణం మంజూరు చేయించి, పేరూరు చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రుణ లక్ష్యం సాధించాలి
తిరుపతి అర్బన్: పీఎం స్వనిధి పథకం పరిధిలో రుణ లక్ష్యం సాధించాలని, ఆ మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్చార్జి జేసీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు ఇచ్చే సమయంలోనే పంట బీమా చేయించాలని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు బ్యాంకర్లు విద్యారుణాలు విరివిగా ఇవ్వాలని సూచించారు. ఏ బ్యాంక్కు ఆ బ్యాంక్ వారు లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని తెలిపారు. అలాగే పొదుపు సంఘం సభ్యులకు జాప్యం లేకుండా రుణాలు ఇవ్వాలని, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి రుణాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు చెందిన రాజేష్కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పరమేశ్వర్ నాయక్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్డీఎం రవికుమార్, డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్, మెప్మా పీడీ ఇఫ్రైన్ తదితరులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ కథ కంచికేనా!
తిరుపతి సిటీ: ఎస్వీయాలో 2016 నుంచి యూజీ కోర్సులకు సెమిస్టర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో అప్పటివరకు ఇయర్లీ ప్యాటర్న్తో యూజీ చదివి కొన్ని సబ్జెక్టులల్లో తప్పిపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూజీ ఇయర్లీ ప్యాటర్న్ (1990–91 నుంచి 2014–15 బ్యాచ్లు) సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశమిస్తూ ఎస్వీయూ అధికారులు గత ఏడాది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. సబ్జెక్టులు పెండింగ్లో ఉన్న విద్యార్థులు 2024 అక్టోబర్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఇయర్లీ ప్యాటర్న్ కరికులమ్లో సబ్జెక్టులు పెండింగ్లో ఉన్న విద్యార్థులు ఫీజలు చెల్లించి, సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల పరిస్థితి ఆగమ్యగోచరం ఎస్వీయూ పరిధిలో ఇయర్లీ ప్యాటర్న్ విధానంలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసి పలు సబ్జెక్టుల్లో తప్పిపోయిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా తప్పిపోయిన సబ్జెక్టులకు సంబంధించి వర్సిటీ అధికారులు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించకపోవడంపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరికొందరు అభ్యర్థులు ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ రంగాల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన క్రమంలో రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల కాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకటిస్తారా..నిలిపివేస్తారా? సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయకపోవడం దారుణమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో రాజకీయాలు తప్ప విద్యార్థుల సమస్యలు, వర్సిటీ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు పలుసార్లు వర్సిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన వీసీ నర్సింగరావు తక్షణం జోక్యం చేసుకుని, పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
శబరిమల యాత్రలో విషాదం
బుచ్చినాయుడుకండ్రిగ: శబరిమలైకు వెళ్లి అ య్యప్పస్వామిని దర్శ నం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని కారణి గ్రామానికి చెందిన వేణు(48) తాపీపని కూలీగా పనిచేసుకుంటున్నాడు. అతని కుమారుడు నరేష్ (30) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వేణు, నరేష్తోపాటు నరేష్ కుమార్తె చాతుర్య అయ్యప్పస్వామి మాలను ధరించి, దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం వేణు, కొడుకు నరేష్, నరేష్ కుమార్తె చాతుర్య (9)తోపాటు వరదయ్యపాళెం మండలం గోవర్థనపురం గ్రామానికి చెందిన మునితేజతో కలసి కారులో శబరిమలైకి వెళ్లారు. మంగళవారం ఉదయం శబరిమలైలో అయ్యప్పస్వామి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అయ్యారు. మార్గం మధ్యలో తమిళనాడు రాష్ట్రంలోని తేనే టౌన్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొనడంతో పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. దీంతో కారు డ్రైవింగ్ చేస్తున్న నరేష్, పక్కనే ఉన్న వేణుకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. మునితేజకు రెండు కాళ్లు విరిగిపోగా, చాతుర్య ఎగిరి కాలువలోని పొదల్లో పడడంతో స్వల్పగాయాలయ్యాయి. తేనే టౌన్లోని ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, గురువారం కారణి గ్రామానికి మృతదేహాలు వస్తాయని తెలిపారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పీజీలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ
తిరుపతి తుడా: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య పరీక్షలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం ఆయన ఘనంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ నిర్వహించి, పీజీ పరీక్షలలో కళాశాల విద్యార్థుల అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలివడం అభినందనీయమన్నారు. ఎస్వీ వైద్య కళాశాలల్లో అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఇక్కడ వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులు దేశంలోని ఎటువంటి ప్రముఖ ఆస్పత్రులోనైనా నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందించగలరని పేర్కొన్నారు. ఇందులో బయోకెమిస్ట్రీ విభాగంలో రాష్ట్రస్థాయిలో డాక్టర్ స్నేహ ప్రథమ స్థానం, డాక్టర్ మౌనిక రెండో స్థానం సాధించారని తెలిపారు. అలాగే ఫార్మకాలజీ విభాగంలో డాక్టర్ ఎం శ్రీలక్ష్మి ప్రథమ స్థానం, ఫోరెన్సిక్ మెడిసన్ విభాగంలో డాక్టర్ జనని ప్రథమ స్థానం, డాక్టర్ అరవింద్ ఐదో స్థానం సాధించారని, అలాగే సైకియాట్రీ విభాగంలో డాక్టర్ సుహాని ప్రథమ స్థానం, పీడియాట్రిక్స్ విభాగంలో డాక్టర్ కేఎస్ పవిత్ర ప్రథమస్థానం, డాక్టర్ శరణ్య మురుగేషన్ ద్వితీయ స్థానం, నేత్ర వైద్య విభాగంలో డాక్టర్ బి శ్రావణి ప్రథమ స్థానంలో నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వైద్యులను విభాగాధిపతులు, వైధ్యాధికారులు, వైద్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. -
దిత్వా.. జనం గుండెల్లో దడ
వాకాడు: ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం వాకాడు మండలంలోని 28 గ్రామాలు, కోట మండలంలోని 31 గ్రామాలు, చిల్లకూరు మండలంలో 30 గ్రామాలు, సూళ్లూరుపేట మండలంలో 29 గ్రామాలు, తడ మండలంలో 28 గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, కాలవలు, నదులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని 45 వేల ఎకరాల్లో రైతులు నాటిన వరి నాట్లపై వరదనీరు సుమారు 3 నుంచి 5 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో వరి నాట్లు పాచిపోయాయి. ఫలితంగా రైతులకు కంటతడి మిగిలింది. జిల్లాలోని 79 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరంలో అలజడి కొనసాగుతోంది. వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో 11 గేట్ల ద్వారా 11 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి వరదనీటిని ఒకసారిగా దిగువకు వదలడంతో బాలిరెడ్డిపాళెం– గంగన్నపాళెం మధ్య ఉన్న వంతెన మునిగిపోయి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వాకాడు చెరువు పొంగి రహదారులపై ప్రవహించడంతో వాకాడు– చిట్టమూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు గ్రామాల్లోని వీధులు నదులను తలపిస్తున్నాయి. పొలాలపై ప్రవహిస్తున్న వరదనీరు కిందకు వెళ్లేందుకు రహదారులు అడ్డురావడం, వాటికి సరైన తూములు ఏర్పాటు చేయకపోవడంతో పంటలు పాచిపోతున్నాయి. కొన్ని చోట్ల రహదారులకు తూములు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు భూస్వాములు స్వార్థంతో వాటిని మూసేసి వారి పొలాలను కాపాడుకుంటున్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు. తొట్టంబేడులో అత్యధికంగా 83.6 మి.మీ వర్షం జిల్లా వ్యాప్తంగా బుధవారం తొట్టంబేడు మండలంలో 83.6 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు జిల్లా అధికార గణాంకాలు చెబుతున్నాయి. తొట్టంబేడు మండలంలతో 83.6 మి.మీ, ఏర్పేడు 61.2 మి.మీ, సత్యవేడు 52.6 మి.మీ, శ్రీకాళహస్తి 51.8 మి.మీ, నాగలాపురం 47.8 మి.మీ, సూళ్లూరుపేట 45.2 మి.మీ, వరదయ్యపాళెం 39.4, పెళ్లకూరు 38.0, దొరవారిసత్రం 37.2, తడ 36.6 వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. -
మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
తిరుపతి రూరల్: మండలంలోని మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అ వసరమని డీఆర్డీఏ పీడీ శోభన్బాబు తెలిపారు. తిరుపతి గ్రామీణ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం వెలుగు ప్రాజెక్ట్ ఆధర్యంలో జిల్లాస్థాయి విజన్ మాడ్యూల్పై మండల సమైక్య, కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని పది మండలాలు ఏపీఎం, సీసీ, అకౌంటెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 3 నుంచి 6 వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణలో మొదటి రోజు హాజరైన పీడీ శోభన్బాబు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి మహిళ తన ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ తయారు చేసుకోవాలని, అప్పుడే మండల సమాఖ్యలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ప్రతి సభ్యురాలు ఒక విజన్ పెట్టుకుంటే ఆ విజన్ను అమలు చేయడానికి వెలుగు ప్రాజెక్టు అధికారులు అండగా నిలబడతారని, తద్వారా సుస్థిర జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడవచ్చన్నారు. ఏపీడీ ప్రభావతి, డీపీఎం వెంకటేష్, మాధవి, ట్రైనర్స్ మునెయ్య ,నరసింహులు, ఏపీఎంలు రాధమ్మ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ తిరుపతి సిటీ: స్థానిక చిన్నబజార్ వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఏపీ స్టేట్ ఉమెన్ కమిషన్ అధికారి ఎస్కే రుక్య బేగం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని బాలికలను కోరారు. కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, డీవైఈఓ ఇందిరా దేవి, హెచ్ఎం విజయ, ఎంఈఓ బాలాజీ, ఎంఈఓ 2 భాస్కర్ నాయక్, ఎన్సీసీ అధికారి భారతి, మహిళా పోలీస్ అధికారి గిరిజ, ఉపాధ్యాయులు మల్లీశ్వరి , సుజాత, సుకుమారి పాల్గొన్నారు. -
తిరుపతికి రైల్వే డివిజన్ స్థాయి కల్పించండి
తిరుపతి అర్బన్: స్థానక రైల్వేస్టేషన్కు డివిజన్ హోదా కల్పించాలని, ఈ అంశంపై గతంలోనూ పార్లమెంట్లో ప్రస్తావించామని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి బుధవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విన్నవించారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎంపీలు రైల్వేశాఖా మంత్రి కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్ను రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు వేంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం తిరుపతికి వచ్చిపోతుంటారన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని గతంలోనూ తమకు విన్నవించామని గుర్తుచేశారు. దశాబద్దాలుగా ఈ సమస్య కొనసాగుతుందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేయడంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయన్నారు. అలాగే తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. దక్షిణం వైపు మార్గం మూత వేయడంతో ఎమ్మార్పల్లి, పద్మావతి నగర్, ఎస్వీ నగర్, ఉల్లిపట్టెడ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే అందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే నగరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా విజ్ఞప్తి మేరకు పుత్తూరు ధర్మరాజుల గుడి సమీపంలోని రైల్వే ట్రాక్ సమస్యల పరిష్కారానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వెందోడు, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని, స్టాపింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. నవజీవన్, భగత్కికోఠి, ఎర్నాకులం ఎక్స్ప్రెస్లకు నాయుడుపేటలో స్టాపింగ్ ఏర్పాటు చేయాలతని తెలిపారు. అలాగే కృష్ణ ఎక్స్ప్రెస్, తిరుపతి–పూరీ ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, తిరుపతి–గూడూరు ఫ్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. ఆ మేరకు రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
హామీ ఏమైంది బాబుగారూ!
తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు మామిడి రైతులకిచ్చిన హామీ ఏమైందో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మా ట్లాడుతూ మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో చిత్తూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కిలో మామిడికి రూ.8 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీ ఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా, మామిడి రైతులకు నగదు జమ కాకపోవడం ఏమిటన్నారు. ఇప్పటివరకు జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి రైతులకు అందాల్సిన నగదు రాకపోవడంతో వారంతా ఫ్యాక్టరీల చుట్టు తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్లో రైతులు పడుతున్న కష్టాలను అన్నీఇన్నీకాదన్నారు. మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ వారి పక్షాన నిలబడిన 30 మందిపై కేసులు పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందో చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. కిలోకు రూ.12 ఇస్తామని, అందులో ఫ్యాక్టరీల నుంచి రూ.8 చొప్పు న, ప్రభుత్వం నుంచి రూ.4 చొప్పున ఇస్తామని చెప్పారు. అయితే ఫ్యాక్టరీలు అందులో పెద్ద ఎత్తున కోతలు విధించాయన్నారు. కోతలు విధించినా మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వందల ఎకరాల్లో మామిడి రైతులు పంటను వదిలిపెట్టారని, మరికొందరు ధరలు లేకపోవడంతో పొలంలోనే మామిడి కాయలను వదులుకున్నారని, ఇంకొందరు పెద్ద ఎత్తున మామిడి తోటలను తొలగించారన్నారు. తమ పాలనలో రైతే రాజు అంటూ ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతుల దుస్థితిని తెలుసుకోవాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న అక్కసును రైతులు నిరసన రూపంలో వెళ్లగక్కారని, దాంతోనే రోడ్డెక్కారని గుర్తుచేశారు. మామిడి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉబ్బలమడుగుకు రావొద్దు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని భారీ వర్షాలకు ఉబ్బలమడుగులోని కాలువలు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయని, పర్యాటకులు రావద్దని తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ వెంకటరత్నమ్మ తెలిపారు. వారు బుధవారం ఉబ్బలమడుగుకు వెళ్లకుండా ఫారెస్టు చెక్పోస్టు వద్ద రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లను పెట్టించారు. వారు మాట్లాడుతూ తుపాన్ల కారణంగా భారీ వర్షం కురుస్తోందని, దీంతో ఉబ్బలమడుగులోని కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. కాలువలలో పర్యటకులు దిగితే ప్రమాదమని, ఎవరు వెళ్లకూడదన్నారు. -
శబరిమల యాత్రలో విషాదం
అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు.‘దిత్వా’.. జనం గుండెల్లో దడ దిత్వా తుపాన్ జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. వర్షం కురుస్తూనే ఉండడంతో వాగు లు, వంకలు గా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తిరగలేని వయస్సులో.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అక్కులమ్మ. చిన్నగొట్టిగల్లు మండలం మారసానివారిపల్లి. ఈమె వ్యవసాయ భూములు వారి సమీప బంధువులు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలోని సచివాలయంలో ఫిర్యాదు చేయగా సిబ్బంది మండల తహసీల్దార్కు ఇవ్వాలని చెప్పారు. అక్కడకు వెళ్లి అర్జీ ఇచ్చిన ఆ వృద్ధురాలికి వీఆర్వో, విలేజ్ సర్వేయర్లను పంపి, భూమి హద్దులు ఏర్పాటు చేయిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. సచివాలయంలో పనిచేసే విలేజ్ సర్వేయర్ కానీ, వీఆర్వో కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఆమె న్యాయం కోసం ఎదురుచూస్తోంది. – తిరుపతి రూరల్ వలంటీర్ ఉన్నప్పుడే మేలు ఈయన పేరు మస్తాన్. నేను ప్రైవేట్ ఎలక్ట్రీషి యన్. ఈయన తిరుపతి కొర్లకుంటలో కాపురం ఉండారు. ఈయన పిల్ల ల స్కాలర్ షిప్నకు సంబంధించి తంబ్ వేయాలని నవోదయ కాలనీ లోని సచివాలయానికి వెళ్లారు. మాకు ఇంకా లిస్టు రాలేదని సిబ్బంది చెప్పారు. ఆయన వేరే ఇంటికి మారాను. ఈ విషయం సచివాలయం వారికి చెప్పారు. ఆ సచివాలయానికి వెళ్లి అడ్రస్ మార్చు కుని కాలేజీ వారికి చెప్పాలన్నారు. ఈ పనికోసం ఒక్క రోజు ఆయన కూలి పోయింది. – తిరుపతి అన్నమయ్య సర్కిల్ కనికరించడం లేదు రామచంద్రాపురం నడవలూరు దళితవాడకు చెందిన ప్రదీప్కు గత ఒకటి న్నర సంవత్సరం క్రితం మెదడులో రక్తం గడ్డకట్ట డంతో పక్షవాతం వచ్చింది. కాలు, చేయి పనిచేయక పోవడంతో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి పింఛన్కు అర్హత కలిగేలా 80 శాతం వరకు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని సచివాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నాడు. అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆ దివ్యాంగుడు కన్నీరుపెట్టుకుంటున్నాడు. – రామచంద్రాపురంనాలుగు వారాలుగా తిరుగుతున్నా ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చెన్నూరు వెంకటసుబ్బయ్య. ఈ యనది వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేట. ఈయ న ఆదాయ, కులధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం నాలుగు వారాల కిందట బంగారు పేట వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. రో జు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సర్టిఫికెట్లు అందలేదు. సచివాలయం సిబ్బందిని ప్రశ్నిస్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడగండని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. – సైదాపురం సమాధానం ఇచ్చేవారే లేరు ఈ ఫొటోలో వ్యక్తి పేరు ఎన్.సుధాకర్రెడ్డి పాకా ల మండలం ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి గారి ఇండ్లుకు చెందిన వ్యక్తి. ఆ పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. అందరూ రైతులే. పంటల సాగు చేసుకుని బతుకుతున్నారు. యూరి యా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళుతుంటే అక్కడ ఎవరు కనిపించడం లేదు. ఆ పక్కనే వున్న సచివాలయం వద్దకు వెళ్లి అడుగదామంటే అక్కడ సమాధానం ఒక్కరు లేరు. యూరియా సమస్యను ఎవ్వరు తీరుస్తారో చెప్పేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. – పాకాల -
సమాధానం చెప్పడమే లేదు
ఈ ఫోటో ఉన్న వ్యక్తి పేరు బట్టా మాణిక్యం. ఊరు చాగణం. సైదాపు రం మండలం వాసి. చా గణం గ్రామంలో సచివాలయం వెళ్లితే అధికారులెవరూ కనీసం సమాధానం ఇవ్వడం లేదు. గ్రామంలో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. సంబంధింత అధికారి వద్దకు పోతే అసలు సమాధానం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – సైదాపురం సేవలు అందడం లేదు.. ఈమె పేరు మారుబోయిన కోటమ్మ, కొత్తపా ళెం గ్రామం. ఒంటరిగా నివసిస్తోంది. నాకు సొంత ఇల్లు లేదు. పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమీపంలో ఉన్న కొత్తపాళెం సచివాలయానికి చాలా సార్లు తిరిగింది. అక్కడ పనిచేసే ఉద్యోగులెవరూ అందుబాటులో ఉండడం లేదు. ఎన్ని సార్లు సచివాలయానికి వెళ్లినా సిబ్బంది లేర నే సమాధానం వస్తుంది. – కోట -
సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు
ఎప్పుడు వెళ్లినా సచివాలయ ఉద్యోగులు కనిపించడం లేదు. తిరుపతిలోని ఒకటో డివిజన్, అక్కారంపల్లి, కొత్తపల్లి శ్మశానం అభివృద్ధికి సచివాలయం ఉద్యోగులకు సమస్యను చెప్పడానికి ఓ వైపు, కార్పొరేషన్ అధికారులకు సమస్యను వివరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే సచివాలయ ఉద్యోగులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. –మల్లీశ్వరి, 1వ డివిజన్, తిరుపతి రేషన్ కార్డు కోసం తిప్పలు నేను తిరుపతి తారకరామ నగర్లో నివాసమున్నాను. రేషన్ కార్డు కోసం రెండు నెలలుగా సచివాలయం చు ట్టూ తిరుగుతున్నా పని కా లేదు. స్థానికుల సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో సిబ్బంది గతంలో తక్షణ స్పందించడంతో మా సమస్యలు రోజుల వ్యవధిలోనే పరిష్కారం అయ్యేవి. ప్రస్తుతం సచివాలయంలో సమస్యలకు పరిష్కారం దొరకడం కష్టతరంగా మారుతోంది. – పి.కరుణ, తిరుపతి రోడ్లు, వీధిలైట్ల కోసం తిరుగుతూనే ఉన్నా.. మా ఇంటికి వెళ్లే రోడ్డులో వీఽ దిలైట్లు సక్రమంగా వెలగ డం లేదు. ఈ విషయం సచివాలయ ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని పలుసార్లు వెళ్లాను. ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. ఆరా తీస్తే వారంతా సర్వేలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఏ సమస్య చెప్పాలన్నా సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం సచివాలయాలు బోసిపోయాయి. – సురేంద్రబాబు, జీవకోన, తిరుపతి -
బకాయలపోరు
పురుగుమందు డబ్బా తెచ్చివ్వండి. ఇక్కడున్న రైతులంతా తలా కొద్దిగా తాగి చనిపోతాం. ఇంకెందుకు ఈ బతుకులు. కాయలు తోలిన డబ్బులు అడిగితే తప్పా? ఆరునెలలు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ఏదీ? కిలోకు రూ.3 ఇస్తే ఏం చేసుకోవాలి. రైతులంటే అలుసా? ఎందుకు మమల్ని వేధిస్తున్నారు. కిలో రూ.8 ఇవ్వాలంటూ గుడిపాల మండలంలో మంగళవారం ఫ్యాక్టరీలను ముట్టడించి..ఆపై రోడ్డుపై బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలి లేదంటే ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. గుడిపాల జాతీయ రహదారిపై రోడ్డెక్కిన మామిడి రైతులు మామిడిసాగు విస్తీర్ణం 50వేల హెక్టార్లు ఈఏడాది దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఫ్యాక్టరీలు 46 కాయలు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు 31 ఫ్యాక్టరీలకు అమ్ముకున్న కాయలు 2.31లక్షల మెట్రిక్ టన్నులు ఫ్యాక్టరీలకు విక్రయించిన రైతులు 49,350 ర్యాంపుల సంఖ్య 26 ర్యాంపులకు చేరిన కాయలు 1.44 లక్ష మెట్రిక్ టన్నులు ర్యాంపులకు తోలిన రైతులు 30,600 ప్రభుత్వం గిట్టుబాటు ధర కిలో రూ.8 ఫ్యాక్టరీలు ఇస్తున్న ధర కిలో రూ.3 నుంచి 4 ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.360 కోట్లు (సుమారు) జిల్లాలో మామిడి రైతుల కష్టం ఫ్యాక్టరీల పాలవుతోంది. ఇన్నాళ్లు రాజులా బతికిన ఫలరాజుల కడుపు మండిపోతోంది. రైతుల ఫలం ఫ్యాక్టరీల్లో గుజ్జుగా మారి.. ప్రతిఫలం చేతికి చిక్కనంటోంది. నెలల తరబడి రైతాంగం బిల్లుల కోసం ఎదురుచూస్తోంది. తీరా కిలో రూ.3, రూ.4 చెల్లించడంతో బిల్లులపై ఆవేదన చెంది మంగళవారం గుడిపాల మండలంలో రైతులు రోడ్డెక్కి ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం/గుడిపాల : మామిడిలో తోతాపురి రకం కోతలు జూన్ మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు ఒకటే కష్టాలు. దిగుబడి విక్రయించుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. టోకెన్ల కోసం తోపులాట, తొక్కిసలాట నడుమ నలిగిపోయారు. ట్రాక్టర్లు దొరక్క తిప్పలు పడ్డారు. తీరా కాయలు ఫ్యాక్టరీలో అన్ లోడింగ్ చేసేందుకు నిద్రలేనిరాత్రుళ్లు గడిపారు. రాత్రుల్లో జాగరణ చేసి..పగలంతా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు పడ్డారు. అయితే ఆ తర్వాత కూడా రైతులను ఫ్యాక్టరీలు వేధిస్తూనే ఉన్నాయి. గుజ్జు లాగేసుకున్నారు జిల్లాలో మామిడి 50 వేల హెక్టార్లల్లో విస్తరించింది. ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అవుతుందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం కాయలు దిగుబడి అయ్యాయి. టేబుల్ రకం మామిడి మాత్రం వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తోతాపురిని కొంత వరకు ఎగుమతి చేయడంతో పాటు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు చేరాయి. 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను రైతులు ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. తీరా వారి కష్టం ఫ్యాక్టరీ పాలవుతోంది. సిండికేట్గా మారిన ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి రైతులను దెబ్బతీసేందుకు ఫ్యాక్టరీలు లోలోపల కుట్రలు పన్నుతోంది. సిండికేట్ అయి..మామిడి రైతులను దగా చేస్తున్నారు. కోతల సమయంలో కాయలు వద్దని తిరస్కరించింది. తర్వాత అధికారుల ఒత్తిడితో కొనుగోలు చేస్తున్నట్లు కటింగ్ ఇచ్చారు. చెల్లింపు విషయాన్ని నొక్కి పెట్టారు. కాయలు కొనలేమని బోర్డు పెట్టించి..రైతులకు కన్నీళ్లు తెప్పించారు. తీరా కాయలు కొనుగోలు చేసి..రైతుల కష్టంపై నీళ్లు చల్లింది. కేజీ రూ.3, రూ.4 అంటూ పాట పాడుతోంది. కనిపించని గిట్టుబాటు ధర ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధరను ప్రకటించింది. ప్రభుత్వం కేజీకి రూ. 4 ప్రోత్సాహక నిధి ఇస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున చెల్లిస్తుందని గొప్పలు చెప్పారు. తీరా ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధరకు వెనుకాడుతోంది. వారు ఇచ్చే ధర ప్రకారమే డబ్బులు తీసుకోవాలని హుకుం జారీ చేస్తోంది. దీంతో మామిడి రైతులు కన్నెర్ర జేసి ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. చోద్యం చూస్తున్న పాలకులు ప్రస్తుత పాలకుల పంచ్లు సినిమా డైలాగ్లు మించిపోతున్నాయి. మామిడి రైతులను ఉద్దేశించి పాలకులు విసిరిన డైలాగ్లు..మాటలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వ గిట్టుబాటు ధర కేజీ రూ.8కి ఇవ్వాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీలు సీజ్ చేస్తామని పంచ్లు విసిరారు. ఆ పంచ్లు ఆ వేదికకే పరిమితం అయ్యాయని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాలకులు పట్టించుకోని పక్షంలో మామిడి పోరుకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మామిడి వివరాలు.. రోడ్డెక్కిన అన్నదాత గుడిపాల మండలం కొత్తపల్లి సమీపంలోని ఓ పళ్ల గుజ్జు పరిశ్రమ రూ. 3, రూ.4 చొప్పున రెండు రోజులగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మామిడి రైతులు మంగళవారం ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. కేజీకి రూ.3, రూ.4 ఎలా ఇస్తారని మండిపడ్డారు. రైతులంతా ఏకమై...జాతీయ రహ దారిపై బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్కచేయక తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దిగిరావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రహదారి పొడవునా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని సర్ధుబాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆపై ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని రైతులను సర్ధుబాటు చేశారు. కలెక్టర్ వద్ద చర్చిద్దామని, ఫ్యాక్టరీ వాళ్లను కూడా పిలిపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
తిరుపతి మంగళం : ఆంధ్రప్రదేశ్లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై మంగళవారం పార్లమెంట్లో ఎంపీ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో పథకం అమలు వివరాలను వెల్లడిస్తూ జిల్లాలో 15,553 పశువుల బీమా కోసం రూ.2.89 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రైతులకు 1,463 పశుగ్రాసం మిని కిట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పశుసంవర్థక రంగంలో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అందించే కార్యక్రమంలో భాగంగా 62 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో రూ.5.89 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనాల విషయానికొస్తే, తిరుపతి జిల్లాలో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ కింద 36 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు నేరుగా లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 1,094 మంది ఎస్సీ రైతులు, 118 మంది ఎస్టీ రైతులు పరోక్షంగా ఈ పథకం కింద ప్రయోజనం పొందినట్లు తెలిపారు. ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్ ప్లాన్ నిధుల నుంచి కాకుండా ఈ పథకంలోనే ప్రత్యేకంగా నిర్దిష్ట నిధులు కేటాయించే విధానాన్ని ప్రవేశపెడితే అనేక మంది పాడి రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని ఎంపీ గురుమూర్తి కోరారు. ఎస్సీ, ఎస్టీ రైతులు పశు సంపద రంగంలో ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రత్యేక జోక్యం చేసుకోవాలని కోరారు. పథకం అమలు నిలిచిపోవడంతో పశు పోషణపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం నిలిచిపోవడంతో రైతులు తమ పశువులకు బీమా చేసుకోలేకున్నారని, దీంతో ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులతో చనిపోయిన పశువుల స్థానంలో, కొత్తవి కొనుగోలు చేయలేక రైతులు నష్టపోతున్నారని ఎంపీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పథకం అమలును వేగవంతం చేసి, రైతులకు సత్వర ప్రయోజనాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
అబుదాబి, దుబాయ్లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు
తిరుపతి అర్బన్: బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన యువతులకు అబుదాబి, దుబాయ్లో హోమ్కేర్ నర్స్ ఉద్యోగాలను జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ భాగస్వామ్యుంతో ఇప్పించనున్నామని ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 21–40ఏళ్ల వయస్సులోపు ఉండి, వృత్తిలో రెండేళ్ల అనుభ వం ఉండాలని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9160912690, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డిగ్రీ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: అటానమస్ హోదాలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల డిగ్రీ మూడో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అతి త్వరగా విడుదల చేసేందుకు సహకరించి కళాశాల అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో 95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ సభ్యులు జి సుధాకర్, చంద్రశేఖర్, సంధ్య పాల్గొన్నారు. 4,5 తేదీల్లో ఎస్వీ వెటర్నరీలో జాతీయ సమావేశంచంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజుల పాటు పీజీ, డాక్టరల్, యూజీ చివరి సంవత్సరం విద్యార్థులకు వెటర్నరీలో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పశువుల ఆరోగ్యం, ఉత్పాదనపై ప్రభా వం అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలు, వారి ఆవిష్కరణల ద్వారా పశువుల్లో వ్యాధులు తగ్గించి, పాలు, మాంసం ఉత్పత్తులు పెంచి జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలోని 8 రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొనడంతోపాటు వారి పరిశోధన పత్రాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ సమావేశంలో మొత్తం 6 అంశాలపై చర్చించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ ఫుడ్స్, ఫీడ్ మిల్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్రావు, వీసీ జేవీ రమణ, అంకో సీక్ కంపెనీ చైర్మన్ డాక్టర్ శ్రీలత, న్యూజీలాండ్, అస్ట్రేలియాకు చెందిన జీఓటీఎస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొనున్నారన్నారు. -
కనిపిస్తే కబ్జా..అడగరనే దర్జా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 11లో 3.22ఎకరాల కాలువ పోరంబోకు భూమిని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కబ్జాదారులు చేస్తున్నారు. గతంలో ఆ భూమిని కాజేయాలని చేసిన ప్రయత్నాలను అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆక్రమణదారులు ఆ భూమిని అలాగే వదిలేసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి అండదండలతో యథేచ్ఛగా చదును పనులు చేపట్టినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. రూ.కోట్ల విలువైన కాలువ పోరంబోకు భూమిని కబ్జాదారులు కాజేస్తుంటే అడ్డుకోకపోవడంపై మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఆ కాలువ భూమిని కంటికిరెప్పలా కాపాడితే ఇప్పటి అధికారులు దగ్గరుండి చదును చేయిస్తున్నా రని ఆరోపిస్తున్నారు. కాలువ భూమిని చదును చేయ డానికి మూడు రోజులుగా రెండు జేసీబీలు పనిచేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అటు వెళుతున్నా ఆగని ఆక్రమణ తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం ఉదయం తిరుపతి నుంచి ఉప్పరపల్లి మీదుగా వకు ళామాత ఆలయానికి వెళుతున్న క్రమంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కాలువ పోరంబోకు భూముల్లో కబ్జాదారులు చదును చేసే పనులు చేస్తున్నారు. అదే సమయంలో మంత్రి వెంట వెళుతున్న రెవెన్యూ అధికారులు సైతం ఆ దురాక్రమణను కళ్లా రా చూస్తూ వెళ్లారే తప్ప ఏ ఒక్కరు అడ్డుకున్న దాఖ లాలు లేవని ఉప్పరపల్లి వాసులు చెబుతున్నారు. గ్రామ అవసరాలకు పెట్టుకున్న ఆ భూమిని కాజేస్తుంటే ఆపేవారు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆక్రమిత భూమిలో చదును పనులు ఆపకుంటే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ‘అధికార పార్టీలో ఉన్నాం.. అనుకున్నదంతా అక్రమిస్తాం.. మమ్మల్ని ఆపేదెవరు.. అడిగేదెవరు.. అంతా మా ఇష్టం.. అది ప్రభుత్వ భూమి అయినా.. చెరువులైనా.. మఠం భూములైనా.. కాలువ భూములైనా సరే కబ్జాకు కాదేదీ అనర్హం అన్న రీతిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కోట్లు విలువైన భూములను కళ్లముందే కాజేస్తున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నోరుమెదపడం లేకున్నారు.. సాక్షాత్తు రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆ మార్గంలో వెళుతున్నా సరే కబ్జా దారులు దర్జాగా చదును పనులు చేస్తున్నా సంబంధిత అధికారులు చూస్తూ వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.’ రెవెన్యూ రికార్డుల్లో కాలువ పోరంబోకు ఆక్రమిత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులు అన్నీ కాలువ పోరంబోకుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్కు ఫి ర్యాదు చేస్తామని, ఆపై న్యాయ పోరాటం చేస్తా మని ఉప్పరపల్లి వాసులు చెబుతున్నారు. రూ.కోట్ల విలువ చేసే కాలువ పోరంబోకు భూ మిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై తహసీల్దార్ రామాంజులునాయక్ను వివ రణ కోరగా కాలువ భూములను కాపాడుతామని, చదును చేసే పనులను వెంటనే నిలుపుదల చేయిస్తామన్నారు. -
గ్రేటర్కు గండి
కౌన్సిల్ తీర్మానానికి విలువ లేదు.. ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు.. పచ్చ ఎమ్మెల్యే మాటకే విలువ. వారు చెప్పిందే అమలు.. వెరసి.. గ్రేటర్ తిరుపతి తీర్మానంలో మార్పులు.. కొన్ని గ్రామాలే విలీనం.. మిగిలిన వాటికి చోటు లేదు. ఇదీ కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమీక్ష తీరు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానానికి టీడీపీ ఎమ్మెల్యేలు గండికొట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, చంద్రగిరి పరిధిలోని గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో కలిపేందుకు స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల ఆమోదం మేరకే గ్రేటర్ తిరుపతిలో కొన్ని గ్రామాలను మాత్రమే విలీనం చేయనున్నారు. ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపిన గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో నుంచి తొలగించినట్లు తెలిసింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంగా విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి నిపుణులు, మేధావులు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టి గ్రేటర్ తిరుపతికి ఆమోదం లభించేలా కృషి చేశారు. ఆ తీర్మానంలో 10 లక్షల జనాభాతో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే కౌన్సిల్ సమావేశంలో కూటమి సభ్యులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసినా.. అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల తీర్మానానికి అంగీకరించక తప్పలేదు. కౌన్సిల్లో తమ పంతం నెగ్గించుకోలేకపోయినా.. మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారుల ద్వారా సాధించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 63 గ్రామాలతో గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ తీర్మానం చేస్తే.. మంగళవారం కలెక్టరేట్లో ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కేవలం 13 గ్రామాలకే పరిమితం చేసినట్లు ప్రకటించడంతో కౌన్సిల్ తీర్మానానికి విలువలేకుండా చేసి కార్పొరేటర్ల హక్కులను కాలరాశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్నట్టు శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలోని ఏర్పేడు మండలం, చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని మరి కొన్ని గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో కలిపే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆయా గ్రామాల పరిధిలోని విలువైన ప్రభుత్వ భూముల కోసమే గ్రేటర్ తిరుపతిలో కలపకుండా అడ్డుకుంటున్నారనే స్థానికులు ఆరోపణలకు బలం చేకూర్చేలా సమీక్షా సమాశంలో నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సొంత అజెండానే ముఖ్యం 22ఏలోని భూములకు విముక్తి కల్పించండి జిల్లాలో భూములకు పట్టాలున్నా.. లబ్ధిదారులు అమ్ముకునే వీలు లేకుండా 22ఏలో ఉన్నాయని, అందులో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మంత్రి దృష్టి తీసుకెళ్లారు. భూ యజమానుల పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం విక్రయించుకోవాలన్నా, బ్యాంకులో తనఖా పెట్టాలన్నా వీలు లేకుండా భూములు 22ఏలో చేర్చారని తెలియజేశారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, నగర వాసుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు తమ మాట వినడం లేదని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకుపోవటం గమనార్హం. -
రాజకీయాలు వేరు..కుల, మతాలు వేరు
తిరుపతి అర్బన్:రాజకీయాలు వేరు..కుల, మతాలు వేరు రెండింటిని ముడిపెట్టడం సరికాదని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఇన్చార్జి జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్ రఘువంశీతో కలసి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, తా ను ఎస్సీ ఎమ్మెల్యే కావడంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోతున్న విషయంపై మంత్రిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కులం, మతంతో సంబంధం లేదని చెప్పారు. సత్యవేడు ఎమ్మెల్యే సస్పెన్షన్ ఎత్తివేస్తారా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అలాగే రాయల్ చెరువుకు గండి పడడంతో పలు గ్రామాల్లో తీవ్రమైన నష్టం చోటుచేసుకుంటే కలెక్టర్, ఎస్పీ మాత్రమే చెరువును పరిశీలించారని, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు ఎవరూ అటు వైపు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తాను చెరువును పరిశీలించకపోయినా ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. గూడూరును నెల్లూరులో కలుపుతామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేశారు. భౌగోళికంగా గూడూరు నెల్లూరుతో ముడిపడి ఉన్నప్పటికీ తిరుపతి అభివృద్దికి గూడూరు కీలకమన్నారు. తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, శెట్టిపల్లి భూ సమస్యలకు సరైన పరిష్కారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, పాశం సునీల్కుమార్, విజయశ్రీ , కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నిరసనలు గూడూరు జేఏసీ చైర్మన్ దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు నిరసన చేపట్టారు. అలాగే దామినేడు రైతులు ్త మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలవడానికి కలెక్టరేట్కు చేరుకున్నారు. అలాగే శెట్టిపల్లి వా సులు తమ భూములను అధికారులు ల్యాండ్ పూలింగ్లో చేర్చాలని డిమాండ్ చేశారు. -
నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది!
● అక్రమ కేసులు ఎంతో కాలం నిలవవు ● అండగా ఉంటా.. ధైర్యంగా ఎదుర్కొందాం ● చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్కు ధైర్యం చెప్పారు. పాత కక్షలతో యువకుడి హత్య వరదయ్యపాళెం: పాత కక్షలతో ఓ యు వకుడికి మద్యం తాగించి,ఆ మత్తు లో ఉన్న అతడిని దారుణంగా హత్య చేసిన ఘటన వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం మిట్ట దళితవాడలో చోటు చేసుకుంది. ఈ హత్య జరిగిన రెండో రోజు సమాచారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లక్ష్మీపురం మిట్ట దళితవాడకు చెందిన పోలూరు హరి (34) వృత్తి రీత్యా వంట మాస్టర్. అదే కాలనీకి చెందిన గౌతమ్ అనే వ్యక్తితో ఇటీవల మద్యం సేవిస్తుండగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అతడు తన సోదరుడు ప్రేమ్కుమార్తో కలసి తమిళనాడు నుంచి మరో ఇద్ద రు స్నేహితులను పిలుపించుకుని మద్యం సేవించడం కోసం పో లూరు హరిని గత ఆదివారం గౌతమ్ ఇంటికి రప్పించుకున్నారు. సరదాగా అందరూ కలసి ఇంట్లో మద్యం సేవించారు. ఇంతలో పాత గొడవల సమయంలో జరిగిన వివాదాలను లేవనెత్తిన గౌ తమ్, హరితో గొడవ పడేందుకు సిద్ధమయ్యాడు. అయితే తిరగబడిన హరిపై గౌతమ్, అతని సోదరుడు ప్రేమ్కుమార్, మరో ఇద్ద రు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. బండరాయి, కొ య్యితో హరి తలపై కొట్టి హత్య చేశారు. హరి మృత దేహాన్ని అదే కాలనీలో కాపురం చేయని పాత ఇంటి బాత్రూమ్లో పడేశారు. దీంతో ఆదివారం రాత్రి హత్య ఘటన జరిగినప్పటికీ మంగళవారం ఉదయం మేకల కాపరి మృత దేహాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన డీఎస్పీ రవికుమార్, సీఐ మురళి, ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ప్రధాన నిందితుడు గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సమాచారం. మరో నిందితుడు ప్రేమ్కుమార్ తమిళ నాడుకు చెందిన ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. -
గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు
వాకాడు: మండలంలోని వాలమేడులో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీ కేజీ కారణంగా మంటలు చెలరేగాయి. స్థాని కుల కథనం మేరకు.. వాలమేడు గిరిజన కా లనీకి చెందిన మానికల శీనయ్య ఇంట్లో గ్యా స్ లీక్ అవుతున్న విషయం గుర్తించకుండా గాస్ స్టౌవ్ వెలిగించడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లతోపాటు దుస్తులు, వస్తు సామగ్రి కాలిపోయా యి. కోట అగ్నిమాపకశాఖ అధికారులు ఘ టనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వాకాడు తహసీల్దార్ మహ్మద్ ఇగ్భా ల్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసి భరోసా ఇచ్చారు. మృతదేహాలు అప్పగింత చంద్రగిరి:దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఒకే ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి అయ్యింది. గుడియాత్తం పట్టణానికి చెందిన సత్యరాజ్, పూన్గొట్టై కు టుంబ సభ్యులకు తిరుచానూరు పోలీసులు స మాచారం అందించడంతో మంగళవారం వా రు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలకు పో స్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాలను వారి కు టుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. దామినేడు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి ప్రధానద్వారం లోపల గడియ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మృతదేహాల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, వైద్యాధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రకారం బాలుడితో పాటు సత్యరాజ్, పూన్గొట్టై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో మంగళవారం 8వ ఐఎల్సీసీ సదస్సు రెండో రోజు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అల్గారిథంలు, క్వాంటమ్ సమాచారంపై జాతీయ స్థాయి హ్యాండ్స్–ఆన్ వర్క్షాప్ను నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో జ్ఞాన ఉత్పత్తి, నైపుణ్యం, వ్యాప్తిపై దృష్టి సారించి క్వాంటమ్ వాలీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకు రావడం ఆనందదాయకమని ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో పూణేకు చెందిన క్వాంటమ్ శాస్త్రవేత్త అమిత్ సక్సేనా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద తదితరులు ప్రసంగించారు. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లో 62 మందికి ఉద్యోగాలు
తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్, ఎంసీఏ విద్యార్థినులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారు నిర్వహించిన ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందులో 62 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని ప్లేస్మెంట్ అధికారి ఆచార్య బి.కిషోరి తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను వర్శిటీ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.రజిని, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ పి. మల్లికార్జునలు అభినందించారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
తిరుపతి మంగళం: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితోపాటుగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, పాడైన ఆర్వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటి ట్యాంకులు, వంటగది పరిశుభ్రత లోపం వంటి కారణాలతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం తదితర వివరాలు తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఎంపీ గురుమూర్తికి వివరించారు. అయితే, వారందరికీ వైద్య చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, లోపాలున్న చోట వెంటనే సరిదిద్దినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పిన వాటికి భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగక ముందే చర్యలు తీసుకొంటే సమస్య ఉండేది కాదన్నారు. ఇప్పటికీ చాలా వసతి గృహాల్లో కనీస వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తప్పులు సరిదిద్దక పోగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా నివేదికలు పంపుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధాన మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం వివరాలతోపాటు పాఠశాలల్లో భోజన నాణ్యత, భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి మంత్రి వివరిస్తూ, ఈ పథకాన్ని అమలు చేయడం, ప్రతిరోజూ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. -
ఎయిడ్స్పై అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి కల్చరల్: ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ మహమ్మారిపై అప్రమత్తంగా ఉంటూ తద్వారా ఎయిడ్స్ నిర్మూలనకు దోహదపడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహతి కళాక్షేత్రంలో ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అత్యంత ప్రాధాన్యం అని తెలిపారు. హెచ్ఐవీ నిర్మూలనకు జిల్లా వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. హెచ్ఐవీ సోకిన వారు భయపడాల్సిన అసవరం లేదని, వైద్యుల సూచనల ప్రకారం మందులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. హెచ్ఐవీ సంబంధిత పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. అంతకుముందు హెచ్ఐవీ బాధితులకు సంఘీభావంగా చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ‘దిత్వా’ తేలిపోయింది తిరుపతి అర్బన్: దిత్యా తుపాన్తో జిల్లాకు భారీ వర్షాలు కురుస్తాయని అంతా భావించారు. అయితే తేలికపాటి వర్షాలతోనే తుపాన్ ప్రభావం తప్పిపోయిందని అధికారులు అంటున్నారు. మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా సగటున 13.9 మిల్లీమీటర్ల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే అత్యధికంగా సత్యవేడులో 38.2, తడలో 37.4, వరదయ్యపాళెంలో 35.8, బీఎన్ కండ్రిగలో 30.4 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. అయితే జిల్లాలో రబీ సీజన్ నేపథ్యంలో ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతులు దిత్వా తుపాన్లో నష్టం జరుగుతుందని ఆందోళన చెందారు. తేలికపాటి వర్షాలు రావడంతో ప్రమాదం తప్పిందని ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు అయితే పూర్తి చేశామని...ఏ చెరువుకు 50 నుంచి 60 శాతానికి మించి నీరు చేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
తీరంలో ముసురు.. చలిగాలులు
గ్రామాల హద్దులను తాకుతున్న కెరటాలు వాకాడు: దిత్వా తుపాన్ ప్రభావంతో సోమవారం జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ముసు రు వర్షంతోపాటు చలిగాలులు వీయడంతో ఆయా గ్రామాల ప్రజలు చలికి గజగజ వణుతున్నారు. అలాగే సముద్రం ఉగ్రరూపం దాల్చి దాదాపు 20 మీటర్లు ముందు జరిగి గ్రామాల సమీప తీరాన్ని తాకుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు ఐదు రోజులుగా ఇంటికి పరిమితమై ఆకలితో అలమటిస్తున్నారు. తుపాన్ సమయాల్లో బాధిత గ్రామాల ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుందని సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అత్యవసర పరిస్థితి లో కూడా ప్రజలు బయటకు రాలేకున్నారు. పనుల కు వెళ్లలేక ఇంట్లోనే ఉన్న ఆయా కుటుంబాల ప్రజ లు తిండి తిప్పలకు నానా అగచాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తుపాన్ సమయాల్లో ఉచితంగా బియ్యం ఇచ్చేవారని, నేడు ఎవరు పట్టించుకోవడంలేదని మత్స్యకార కుటుంబాలు వాపోతున్నాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతానికి స మీపంలో ఉన్న చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపో యి చలిగాలులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు చ లికి తట్టులేక వేడి ప్రదేశాల్లో ఉన్న గృహాల్లో తలదాచుకుంటున్నారు. లోతట్టు గ్రామాల వీధులు వర్ష పు నీటితో ఛిధ్రమై నదులను తలపిస్తున్నాయి. -
కార్పొ‘రేటు’ కట్టారు!
బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల వారి పిల్లలు ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు, మన పిల్లలను కూడా అక్కడే చదివిస్తే ఉజ్వల భవిత చేకూరుతుందనే మూఢ నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నాటుకుపోయింది. దీంతో ఇష్టమున్నా..లేకపోయినా ప్రైవేటు పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు యాజమాన్యం ఇప్పటికే అధిక ఫీజులు వసూలు.. అభ్యసన సామగ్రి వ్యాపారాలు సాగించాయి. అంతటితో ఆగకుండా పదో తరగతి పరీక్ష ఫీజులోనూ దోపిడీకి తెర లేపాయి. సర్కారు నిర్ణయించిన ఫీజుకు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డివిరుస్తున్నాయి. తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్, టెక్నో స్కూల్స్ అంటూ పేర్లు పెట్టి ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో అకడమిక్ కోర్సులకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులను సైతం మభ్యపెట్టి తమ పాఠశాలల వంక చూడకుండా ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను అప్పుల పాలు చేసి రూ.కోట్లు దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రభుత్వం మార్చి 16వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు విద్యాసంస్థలు తమ దందాను షురూ చేశాయి. చెల్లించాల్సిన ఫీజు రూ.125.. వసూలు చేస్తోంది రూ.1200 జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల ఫీజులు రూ.125 చెల్లించాల్సి ఉండగా ఏకంగా నాలురెట్లు పెంచి, ఒక్కో విద్యార్థి నుంచి రూ. 950 నుంచి రూ.1200 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల దోపిడీకి అంతులేదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోపాటు వారిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మభ్యపెట్టడంతో ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. జిల్లాలో 206 ప్రైవేటు పాఠశాలల్లో దందా షురూ! జిల్లాలోని సుమారు 300 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఇందులో 206 పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫీజల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోందని విద్యార్థి సంఘాల ప్రత్యేక సర్వేలో తేలింది. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి సుమారు 22 వేల మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పది రోజులుగా జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు ప్రైవేటు విద్యా సంస్థల పరీక్ష ఫీజు వసూలుపై ప్రత్యేక నిఘా ఉంచాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాల తీరు బయట పడింది. ఈ విషయమై అధికారులకు సమాచారం అందించినా తూతూ మంత్రంగా దందా చేస్తున్న ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ తక్షణం అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునేలా జిల్లా విద్యాశాఖను ఆదేశించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పుల పాలు చేస్తున్నారు మా అమ్మాయి తిరుపతి నగరంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 6వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు రూ.125 అని తెలిసింది. కానీ మా వద్ద నుంచి రూ.1200 వసూలు చేశారు. ఫీజు కట్టిన నగదుకు సంబంధించి కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఫీజు కట్టినట్టు మేము నమోదు చేసుకున్నాం. ఇక మీరు వెళ్లండి అని చెప్పారు. సంవత్సరం ఫీజు ఇప్పటికే సుమారు రూ.1.50 లక్షలు చెల్లించాం. పరీక్ష ఫీజుల సైతం ఇంత మొత్తంలో వసూలు చేయడం దారుణం. మమ్ముల్ని అప్పులు పాలు చేస్తున్నారు. –సరస్వతీదేవి, విద్యార్థిని తల్లి, తిరుపతి -
మంత్రి ఏడిపింఛన్
ఇప్పుడే ఏదో కొత్త పింఛన్లు పంచినట్లు బిల్డప్.. పాత పింఛన్ల పంపిణీకి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వస్తున్నారని హంగామా.. తిరుపతిలో ఆయన చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఉంటుందని హడావుడి.. పింఛన్లు అందుకునే వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు మంత్రి రాక కోసం ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షణ.. పింఛను ఇంటివద్దనే కాకుండా గుంపుగా ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు.. పింఛన్ చేతికొచ్చేసరికి మధ్యాహ్నం 12:30 గంటలైంది. వీళ్ల ఆర్భాటం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అని లబ్ధిదారులు తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లారు. తిరుపతి తుడా: నగరంలో డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అన గాని సత్యప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, సచివా లయ సెక్రటరీలు రెండు గంటల ముందే జీవకోన అంబేడ్కర్ కూడలి పరిసర ప్రాంతాల నుంచి లబ్ధిదారులను వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. మంత్రి మధ్యాహ్నం 12.15 గంటలకు రావడంతో లబ్ధిదారులు నిరీక్షించక తప్పలేదు. ఇంటి వద్దకు వెళ్లకనే.. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గౌరవంగా పింఛను పంపిణీ చేసే పటిష్టమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే మంత్రి వస్తున్నాడని లబ్ధిదారులందరినీ ఒకే చోట గుంపుగా ఉంచి, పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇలాగేనా పింఛన్లు పంపిణీ చేసేదంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులుగా మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేయమన్నారు? లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని తెలియదా? అంటూ ఆమె మండిపడ్డారు. బల ప్రదర్శనలా పింఛన్ పంపిణీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం బల ప్రదర్శనలా సాగింది. వాహనాలతో ఆ ప్రాంతం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టిలో పడేందుకు ఎవరికి వారు పోటీపడ్డారు. ఫొటో కనిపించేందుకు ఎగబడ్డారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఎన్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ , టీడీపీ నేతలు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీధర్ వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఘరానా మోసగాడు అరెస్టు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్స్టేషన్ పరిధిలో కొన్ని నెలలుగా సీఐనని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన ఘరానా మో సగాడిని భాకరాపేట ఎస్ఐ రాఘవేంద్ర సోమ వా రం అరెస్టు చేశారు. ఎస్ఐ కథనం మేరకు.. శివకుమార్ అనే వ్యక్తి తాను పోలీస్ అధికారి అని చెప్పకుంటూ, కేసులు పెడతానని భయపెట్టి పలువురి వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్లు ఎస్ఐ రాఘవేంద్ర గుర్తించారు. ఈ మేరకు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివకుమార్ నకిలీ ఐడీలు, నకిలీ పోలీస్ లోగో ఉన్న బ్యాడ్జీలు, వాకీటాకీలు ఉపయోగించి అసలు పోలీస్లా నటించేవా డు. మరింత నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్రైవే ట్ వాహనాలపై ‘‘పోలీస్’’ స్టిక్కర్లు అతికించి తిరుగుతూ పలువురి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దోచు కున్నాడు. ఈ క్రమంలో శివకుమార్, అతని స్నేహితుడు రమణ ఇద్దరు భాకరా పేట పోలీస్ స్టేషన్కు వచ్చి తాము పోలీసులమని, తన బంధువులు అ మ్మాయి మోసపోయిందని, ఆమెను కాపాడాలని పోలీస్స్టేషన్లోనే పంచాయితీ పెట్టి పోలీసులు సైతం బెదిరించాడు. అనుమానించిన భాకరాపేట ఎస్ఐ రాఘవేంద్ర నకిలీ సీఐని అరెస్టు చేశారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు చిత్తూరు జిల్లా లైజనింగ్ ఆఫీసర్ హరిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ రవి కథనం మేరకు.. 2018 జనవరి 25వ తేదీ రొంపిచర్ల పోలీసులు పీలేరు తిరుపతి రోడ్డు, రొంపిచర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లి సమీపంలోని దండపాణి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఓ కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. కారులోని ఐదుగురు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. సదుం మండలం, బూరగమంద గ్రామానికి చెందిన పగడాల వెంకటరమణ, సదుం మండలం సీతన్న గారిపల్లికి చెందిన మల్లెల హరినాథ్ని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నే రం రుజువు కావడంతో ఇద్దరికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు. -
డివైడర్ని ఢీకొన్న కారు
● నలుగురికి స్వల్ప గాయాలు పాకాల: వేగంగా వస్తూ డివైడర్ని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయా లైన సంఘటన సోమవారం మండలంలోని కోనప్పరెడ్డిపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జా తీయ రహదారిపై తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతూ కోనప్పరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పిన కా రు డివైడర్ని ఢీకొంది. దీంతో కారులోని కర్ణాటకవాసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమా దం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్గౌడ్ తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్పై శిక్షణ నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ క ళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్పై ఐదు రోజు ల శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 40 మంది అధ్యాపకులు శిక్షణలో పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రా ముఖ్యత, ప్రాథమిక సిద్ధాంతాలు, ఆ ధునిక పరిశోధనా ధోరణులు, అనువర్తనాలపై నిపుణులు అధ్యాపకులకు శిక్షణ అందించనున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫిజిక్స్ వి భాగం అసోసియేట్ ప్రొఫెసర్లు రితీష్ కుమార్ అగర్వాల్(ఐఐటీ తిరు పతి) చిత్రాసేన్ జైనా(ఐఐఎస్ఈఆర్) మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా విస్తరిస్తున్న క్వాంటమ్ టెక్నాలజీలపై అధ్యాపకులు అవగాహ న పెంచుకోవాలన్నారు. సిలబస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభ్యాసాలను ప్రవేశపెట్టి, విద్యార్థులను నిష్టాతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్ఓడీలు మల్లిక, మురళి, కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమబాల, ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీలో తిరుపతి 19వ స్థానం తిరుపతి అర్బన్: తొలి రోజు 2,62,108 పింఛన్లకు 2,43,184 పంపిణీ చేశారు. 92.78 శాతం మాత్రమే పంపిణీ చేయడంతో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
తడ: హత్యకేసులో నిందితుడిని పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. సోమవారం తడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నా యుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఈ వివరాలను వెల్లడించారు. తడ మండలం, చేనిగుంట గిరిజనకాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న టైర్ల పంచర్ కొట్టులో బిహార్ రాష్ట్రానికి చెందిన సహ్మద్ అలీ పని చేస్తున్నాడు. నవంబర్ 26వ తేదీ సాయంత్రం చేనిగుంట గ్రామానికి చెందిన మీంజూరు ప్రతాప్ అనే వ్యక్తి వచ్చి సైకిల్కి గాలి పట్టమని అలీని డిమాండ్ చే శాడు. ఇది కార్లు, లారీల టైర్లకు పట్టే మిషన్ అయినందున సైకిల్కి గాలి పట్టడం కుదరదని నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రతాప్ అందుబాటు లో ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని ఆలీ తలపై కొట్టడంతోపాటు సిమెంటు రాయితో తలపై బలంగా కొట్టా డు. అదే సమయంలో అక్కడ ఉన్న స్థలం యజమాని కోగిలి రామయ్య అడ్డుకునేందుకు ప్రయ త్నించగా అతన్ని కూడా సిమెంటు రాయితో కొట్టి పరారయ్యా డు. ఫిర్యాదు అందుకున్న సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, తడ ఎస్ఐ కొండపనాయుడు నిందితుడు ప్రతాప్ని అరెస్టు చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. -
పొలం వివాదంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: పొలం వివాదంలో ఓ దళిత కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన డక్కిలి మండలం చెన్నసముద్రం (తురకపల్లి)లో సోమ వారం చోటు చేసుకుంది. బాధితులు డక్కిలి వరలక్ష్మి కుటుంబ సభ్యల కథనం మేరకు.. వరలక్ష్మి కుటుంబానికి చెందిన వారసత్వ భూమిని ఆమెకు, ఆమె కుమారులకు తెలియకుండా ఆమె భర్త తిరుపాల్ను మిట్టపాళెం గ్రామానికి చెందిన ఎం శేఖర్ నాయుడు అనే వ్యక్తి తీసుకెళ్లి రిజిష్టేషన్ చేయించుకున్నాడు. ఆ విషయం తెలియడంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఈ విషయా న్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో జరిగిన వివాదంపై డక్కిలి పోలీస్ స్టేషన్లో శేఖర్ నాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కాగా పొలంలో శేఖర్ నాయుడు వారికి తెలియకుండా వరినాట్లు వేశాడు. దీంతో బాధితులు తమ పొలంలో వరి నాట్లు వేశారని తెలిసి వరలక్ష్మి భర్త తిరుపాల్, కుమారుడు చక్రి పొలం దగ్గరకి వెళ్లి వీడియోలు తీస్తుండగా గమనించిన ఎం శేఖర్ నాయుడు, వేముల రమేష్, రంగినేని శివరాజా, పోలేరయ్య చక్రిపై దాడి చేశారు. ఈ విషయమై డక్కిలి ఎస్ఐ శివ శంకర్ను వివరణ కోరగా ఈవివాదంపై గతంలో శేఖర్ నాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణలో ఉందని చెపఆపరు. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
‘డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’కి 62 సమస్యలు
తిరుపతి రూరల్: ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 62 మంది తమ సమస్యలను ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యు వర్ సీఎండీ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లతో కలసి హాజరైన సీఎండీ శివశంకర్ గత సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి వినియోగదారులు దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న త మ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. అందులో ప్ర ధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జా ప్యం, విద్యుత్ లైన్ మార్పు, కాలిపోయిన, చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల మార్పు, లో–ఓల్టేజ్ సమస్యలు ఉన్నాయి. కర్నూలు నుంచి 15, కడప 13, అనంతపురం 11, నెల్లూరు 8, శ్రీసత్యసాయి 5, చిత్తూరు 4, తిరుపతి 2, అన్నమయ్య 2, నంద్యాల నుంచి 2 వినతులు వచ్చాయి. 265 సమస్యలకు గాను 96 పరిష్కారం.. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ ద్వారా గత నెల 24వ తేదీ వరకు మొత్తం 265 మంది వినియోగదారులు తమ సమస్యలను విన్నవించగా అందులో 96 సమస్యలను ఇప్పటికే పరిష్కరించగా మరో 22 సమస్యలు పాలసీ మ్యాటర్కు సంబంధించినవి కావడంతో సంబంధిత విభాగాలకు పంపడం జరిగిందన్నారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్ జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభా వాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం. ఉమాపతి, పి.సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, రామచంద్రరావు, చక్రపాణి, సురేంద్రరావు, భాస్కర్రెడ్డి. జగదీష్, ప్రసాద్, వెంకటరాజు పాల్గొన్నారు. -
వైద్యం కోసం వస్తే.. జాబ్ ఇప్పిస్తానని నమ్మించి..
తిరుపతి క్రైమ్: ఓ వైద్యుడి మోసాలపై బాధితులు ఆధారాలతో సహా ఆదివారం ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. తిరుపతికి చెందిన బాధితురాలు కోమల తెలిపిన వివరాల మేరకు.. సంకల్ప ఆస్పత్రిలో వైద్యం కోసం బంధువులను తీసుకురాగా అక్కడే విధుల్లో ఉన్న వైద్యుడు రమేష్ యాదవ్ మాటల్లో పెట్టి మీ అబ్బాయికి సింగపూర్లో నెలకు రూ.లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తానని ఇందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని నమ్మించాడు. కొడుకు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బాధితురాలు కూడబెట్టిన డబ్బును రెండు దఫాలుగా డాక్టర్ రమేష్ యాదవ్కు రూ.5 లక్షలు చెల్లించింది. ఆస్పత్రి పేరు చెప్పి బాధితురాలిని బాగా నమ్మించాడు. అలానే మరో నలుగురు నుంచి ఇదేవిధంగా నమ్మబలికి లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ ఆశ చూపిన రమేష్ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధితురాలు చెప్పుకొచ్చారు. ఆస్పత్రికి వచ్చి విచారించగా చాలా రోజుల క్రితమే అతను తమ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడని, ప్రస్తుతం చైన్నెలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరినట్లు తెలుస్తోందని సంకల్ప ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో బాధితురాలు అవాకై ్కంది. సంకల్ప ఆస్పత్రి పేరు చెప్పి, ఇక్కడ వైద్యుడిగా ఉండడంతోనే రమేష్ యాదవ్ను నమ్మామని బాధితురాలు లబోదివోమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని మోసానికి పాల్పడిన డాక్టర్ రమేష్ యాదవ్ నుంచి డబ్బులు ఇప్పించాలని ఆమె కంటతడి పెట్టుకున్నారు. -
కొత్త పింఛన్ల ఊసే లేదు..
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫించన్లు కోత కొనసాగుతూనే ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు 18 నెలల వ్యవధిలో జిల్లాలో 13,979 మంది పింఛన్లు తగ్గించారు. గత నవంబర్ నెలలో 2,62,556 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ డిసెంబర్ నెలకు 2,62,108 మందికి పింఛన్లు అందించనున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలోనే 448 మందికి తగ్గించారు. ప్రతి నెల 600 నుంచి 700 పింఛన్లు తగ్గిపోతున్నాయి. విజయవాడలో ఉందంట ఆ జాబితా.. పింఛన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని డీఆర్డీఏ అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. మృతి చెందిన వారి జాబితా ఇవ్వాలని కోరితే తమ వద్దలేదని విజయవాడలోని డీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తీసుకోమని సమాధానం ఇస్తున్నారు. మరోవైపు భర్త చనిపోయి వితంతువులైన వారు 8,250 మందికి పైగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు అర్హులైన వయోవృద్ధులు 10,300 మందికి పైగా పింఛన్ల కోసం జిల్లాలో ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల ఊసే ఎత్తని ప్రభుత్వం ఉన్న పింఛన్లను తగ్గించే పనిలో ఉంది. గత మూడు నెలల క్రితం జిల్లాలో దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల 7,600 పింఛన్లు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా న్యాయం కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన పాత డాక్టర్లచే మళ్లీ పరీక్షలు చేయిస్తున్నారు. మరో నెల రోజుల్లో (వచ్చే జనవరిలో)ఈ పరీక్షల ప్రక్రియ పూర్తి అవుతుందని, అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. అందులో ఎంతమందికి మళ్లీ వికలత్వం తగ్గించి సర్టిఫికెట్లు ఇస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. న్యాయం కోసం మరోసారి పోరాటాలు చేస్తామని దివ్యాంగుల సంఘం నేతలు ముందే హెచ్చరిస్తున్నారు. లక్షమంది ఎదురు చూపులు.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తే జిల్లాలో మరో లక్ష మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వారు ఎంతో ఆశగా చూస్తున్నారు. -
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
అధికార పార్టీకి చెందిన ఆక్రమణదారులు కాలువలు, కుంటలు, గుట్టలే కాదు గ్రామకంఠం భూమినీ వదలడం లేదు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డులు అన్నీ చెబుతున్నా.. ఆ భూమి గ్రామకంఠానికి చెందినది గ్రామస్తులు చెబుతున్నా ఆక్రమణదారులు యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నా.. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా లెక్క చేయడం లేదు.. ఎవరు ఎన్ని అడ్డు చెప్పినా అవేవీ పట్టించుకోకుండా ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్ : జిల్లాలో ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని చేతులు కలిపి కోట్లు విలువైన ప్రభుత్వ భూములను అప్పగించేస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీ బొప్పరాజుపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న సర్వేనంబరు 184/4లో సుమారు 2.50 ఎకరాల గ్రామ కంఠం భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత గుట్టుగా ఆక్రమించి ఫెన్సింగ్ రాళ్లు నాటారు. ఆ సమయంలో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా తహసీల్దారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రాళ్లను ఏమాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. తాజాగా ఆ రాళ్లు మధ్య ఉన్న భూమిలో గుట్టుగా ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. కోట్లు విలువైన గ్రామకంఠం భూమిలో బహిరంగంగా ఇంటి నిర్మాణాలు సాగించినా సరే ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష ఆందోళనలకు రంగం సిద్ధం గ్రామ కంఠం భూమిని గ్రామ అవసరాలకు కాకుండా ఓ అధికార పార్టీకి కట్టబెడుతున్న తహసీల్దారు, ఇతర రెవెన్యూ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్న జిల్లా కలెక్టర్ తీరుకు నిరసనగా గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున ప్రత్యక్ష ఆందోళనలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రులకు ఫిర్యాదులు చేస్తామని, అప్పటికీ స్పందించకుంటే కోర్టుల్లో దావాలు వేస్తామని హెచ్చరించారు.వరుస ఫిర్యాదులు చేసినా ఆపేదెవరు ? గ్రామంలోని ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు పచ్చపార్టీకి చెందిన ఓ నాయకుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పావులుకదుపుతుండడం, ఆ నాయకుడి నియోజకవర్గ స్థాయి నాయకుడు అండగా నిలబడడంతో ఆక్రమిత భూమిలో యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు కళ్ల ముందే ఆక్రమిస్తున్నా అధికారులకు కనిపించడం లేదా..? సామాన్య ప్రజలు జానెడు స్థలం ఆక్రమిస్తే తొలగించేంతవరకు నిద్రపోని రెవెన్యూ అధికారులకు ఈ దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ఇదే విషయంగా రామచంద్రాపురం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ను, మండల తహసీల్దారును కలసి పలుమార్లు వినతిపత్రాలు అందించారు. -
5న ఆకేపాటి తిరుమల మహా పాదయాత్ర
తిరుపతి కల్చరల్: అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలినడక మార్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కడప మాజీ జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఈ నెల 5వ తేదీన 23వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వ్యక్తిగత సహాయకుడు శంకరయ్య తెలిపారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఆయన మహాపాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య మార్గం పునరుద్ధరణకు 22 ఏళ్లుగా తిరుమల మహాపాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రను వేలాది మందితో తిరుమలకు వెళుతున్నట్లు వివరించారు. కడప వైపుగా కాలినడక మార్గాన్ని భక్తుల సౌకర్యార్థం టీటీడీ అభివృద్ధి చేయాలన్నదే అమరనాథరెడ్డి సంకల్పమని తెలిపారు. పాదయాత్రలో భాగంగా గోవిందమాల ధారణతో పాల్గొనే భక్తులకు అల్పాహారం, భోజనం, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి పర్యవేక్షిస్తారన్నారు. ఈ సమావేశంలో కల్లూరు చెంగయ్య, ప్రతాప్, కృష్ణ పాల్గొన్నారు. -
సెల్ఫోన్ చూడొద్దని మందలించడంతో..
– మనస్తాపంతో బాలిక ఆత్మహత్య తడ: సెల్ఫోన్పైనే కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఓ తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తడ ఎస్ఐ కొండనాయుడు తెలిపిన వివరాల మేరకు.. కారూరు గ్రామంలో బేల్దారి పని చేసుకుని జీవించే కుమార్కు కొడుకు నవీన్ రాజు, కుమార్తె చిత్ర(16) ఉన్నారు. ఆరంబాకం పాఠశాలలో కూతురు చిత్ర ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే సెల్ఫోన్ ఎక్కువ చూస్తుండడంతో శనివారం తండ్రి మందలించాడు. తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిత్ర చీరతో ఉరి వేసుకుంది. కొంత సమయానికి ఇంటికి వచ్చిన బాలిక సోదరుడు బంధువుల సాయంతో చిత్రను శ్రీసిటీ ఆస్పత్రికి, అనంతరం సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ దర్యాప్తు చేపట్టారు. హోరాహోరీగా బేస్బాల్ పోటీలు పలమనేరు : పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో సాగుతున్న బేస్బాల్ అండర్–14 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన బాలుర పోటీల్లో శ్రీకాకుళంపై విజయనగరం, వెస్ట్ గోదావరిపై ఈస్ట్ గోదావరి, ప్రకాశం జట్టుపై చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. నేడు జరిగే పోటీల్లో బాలికల విభాగంలో చిత్తూరు–అనంతపూర్, శ్రీకాకుళం–ఈస్ట్గోదావరి, గుంటూరు– విజయనగరం, కడప–వైజాగ్ జట్ల మధ్య క్వార్టర్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆపై సెమీస్, ఫైనల్స్ ఉంటాయన్నారు. ఇందులో నిర్వాహకులు బాబు, సాంబశివ, శశి, ప్రకాష్, స్థానిక హెచ్ఎం షంషీర్ తదితరులు పాల్గొన్నారు. -
ముద్దాయిల అరెస్ట్
తిరుపతి క్రైమ్: నగరంలోని ఉపాధ్యాయ నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో ఈనెల 18వ తేదీన ఓ వ్యక్తిపై దాడి చేసి దోచుకెళ్లిన దుండగులను అరెస్ట్ చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. ఈనెల 18వ తేదీన రేణిగుంటకు చెందిన భూకే మహేష్(21), జైలక్ష్మణ్ కుమార్(22), జాఫర్(19), కడప జిల్లాకు చెందిన పోకిలి ప్రభుదాసు(34) వీరంతా కలిపి ముఠాగా ఏర్పడ్డారు. బాధితున్ని రాపిడో డ్రైవర్ అంటూ నమ్మించి బైక్లో నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడి దోచుకున్నారన్నారు. అతని వద్ద నుంచి రూ.25 వేల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో ముద్దాయి అయిన వివేక్ పరారీలో ఉన్నారని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. వీరందరిపై కూడా రౌడీషీట్లు ఓపెన్ చేసి.. ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ కేసును చేధించడంలో ఎస్ఐ లోకేష్ కృషి చేశారన్నారు. -
పిడుగుపాటుకు గాయపడిన వ్యక్తి మృతి
తొట్టంబేడు: గత నెల 21న పిడుగుపాటుకు తీవ్రగా గాయపడిన తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన టి.నరసింహారెడ్డి (36) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. టి.నరసింహారెడ్డి గత నెల 21న కొత్తకండ్రిగ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న తన పొలంలో వరినాట్లు వేస్తున్నాడు. వర్షం కురవడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నాడు. ఈ క్రమంలో అతని పక్కనే పిడుగు పడడంతో తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. అతని తొడ వద్ద గాయమై రక్తస్రావమైంది. అతన్ని కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కోటి సంతకాలతో బాబు కుట్రను అడ్డుకుందాం
నగరి : ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ద్వారా పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆ కుట్రను సంతకంతో అడ్డుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మండలంలోని ముడిపల్లి గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన మాజీ మంత్రికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆమె ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్యను అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. ఏడు మెడికల్ కళాశాలల భవన నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. అందులో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు కూడా సేవలందిస్తున్నాయన్నారు. నేడు పేదలకు ఉన్నత చదువులు ఎందుకు అన్నట్లుగా మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలను కార్పొరేట్ దందాలకు తాకట్టు పెట్టి బడుగు బలహీనులను డబ్బు కోసం బలిచేయడం ప్రభుత్వ ధర్మమా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలు చేస్తున్న సంతకం ప్రభుత్వానికి చివరి హెచ్చరిక అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత నగరి : మండలంలోని ముడిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత చల్లా కుప్పయ్య ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి విచ్చేసిన ఆయనను మాజీ మంత్రి ఆర్కేరోజా పార్టీ కండువా వేసి సాధరంగా ఆహ్వానించారు. చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు వైద్యాన్ని, పేద విద్యార్థుల వైద్యవిద్యను దూరం చేస్తున్నందున సహించలేక పార్టీ మారుతున్నట్లు కుప్పయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీ కన్నియప్ప, ఎంపీటీసీ సులోచనమ్మ, యేసు, నాయకులు బుజ్జిరెడ్డి, చుక్కబ్బశెట్టి, రవికుమార్, అయ్యప్ప, వెంకటేశ్, రామ్రమేష్, రామూర్తి, జగదీష్, శేఖర్, చంద్ర, రవి, ఎల్లప్పరెడ్డి, గోవిందరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాకు రెడ్ అలెర్ట్
తిరుపతి అర్బన్: జిల్లావ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రభావంతో ఆదివారం సగటున 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ప్రధానంగా వెంకటగిరిలో 25.2 మిల్లీమీటర్లు, చిట్టమూరులో 25, పెళ్లకూరులో 23.6, తొట్టంబేడులో 22.4, దొరవారిసత్రంలో 20.6, వాకాడులో 20, నాయుడుపేటలో 19.8, కోటలో 18.6, గూడూరులో 18.4, సూళ్లూరుపేటలో 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. నేడు స్కూళ్లకు సెలవు.. జిల్లాలోని పాఠశాలలకు, అంగన్వాడీ స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే సోమవారం కలెక్టరేట్ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో చెరువుల కరకట్టలు, కలుజులు, తూములు, వరద కాలువలు, కాజ్వేలు తదితర ఇరిగేషన్ పరిధిలో పటిష్టం చేయడానికి ప్రత్యేక నిధుల కేటాయింపు చేయకపోవడంతో తుపాన్తో భారీ వర్షాలు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందోనని ఆందోళన చెందుతున్నారు. సముద్ర తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అవుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు చెందిన వారికి టెన్షన్ తప్పడం లేదు. అన్నదాతలు, మత్స్యకారుల్లో ఆందోళన ఇటీవల మోంథా తుపాన్తో జిల్లావ్యాప్తంగా వరిపంట పెద్దఎత్తున దెబ్బతింది. అయితే అధికారులు మాత్రం పంటసాగులో 33 శాతం కన్నా ఎక్కువ శాతం దెబ్బతింటేనే పరిహారం వస్తుందని లేదంటే ఇవ్వలేమని చెప్పేశారు. జిల్లాలో 33 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న ప్రాంతాలు చాలా స్వల్పంగా చూపడంతో రైతులకు పరిహారం అందలేదు. మరోవైపు ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతులకు పరిహారం అందలేదు. ఈ క్రమంలో తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 1.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మరో లక్ష ఎకరాలు సాగు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా సాగు చేసిన వరి పంట రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 50 శాతం మేరకు నీట మునకలో ఉంది. మరోవైపు పోలాల్లో గట్లుకు గండ్లు పడ్డాయి. సోమ, మంగళవారాలు పెద్ద వర్షాలు వస్తే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అలాగే కూరగాయలు సాగు చేసిన రైతులకు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లోతట్టు గ్రామ ప్రజలు ఆందోళ న చెందుతున్నారు. మత్స్యకారులు రెండు నెలలుగా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు కలెక్టర్ కార్యాలయం 0877 2236007 తిరుపతి ఆర్డీ్ఓ కార్యాలయం 7032157040 శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం 8555003504 గూడూరు ఆర్డీఓ కార్యాలయం 08624 252807, 8500008279 సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం 08623295345 సముద్ర తీరంలో అల్లకల్లోలం వాకాడు: మండల పరిధిలోని సముద్ర తీర గ్రామాల్లో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అలాగే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలోని ప్రజలు చలి గాలులు, వర్షానికి గజగజ వణుకుతున్నారు. తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తీర గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల రైతులు వరినాట్లు వేసిన పొలాలు వర్షపు నీటితో మునిగిపోయి రైతు గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. కొన్ని గ్రామాల్లో వర్షం, ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడుతున్నారు. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు, బ్యారేజీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లోనే ప్రజలు బయటకు రావాలని తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ ఆదేశించారు. సముద్ర తీరానికి ఎవరిని అనుమతించకుండా దుగ్గరాజపట్నం మైరెన్ పోలీసులు తీరంలో నిఘా ఉంచారు. -
దిత్వా వేళ అప్రమత్తంగా ఉండండి
తిరుపతి రూరల్ : దిత్వా తుపాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, ఇప్పటికే సెలవులో ఉన్న వారు విధులకు హాజరు కావాలని సూచించారు. తుపాను తగ్గేంత వరకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలి పోవడం వంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు 1912 లేదా 1800 425 155333 నంబరుకు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు. నేడు యథావిధిగా డయల్ యువర్ సీఎండీ.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ యథావిధిగా జరుగుతుందని సీఎండీ శివశంకర్ తెలిపారు. డిసెంబరు 1వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వినియోగదారులు కాల్స్ చేయవచ్చన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను చెప్పవచ్చన్నారు. శివశంకర్ లోతేటి, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్ -
లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి
సూళ్లూరుపేట : పట్టణంలోని రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా.. స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో రూమ్ ఖాళీ చేయలేదని సిబ్బంది పరిశీలించగా మహిళ మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరక్కపోవడంతో గుర్తు తెలియని మహిళగా భావించారు. తమిళనాడులోని పొన్నేరికి చెందిన మహిళగా భావిస్తున్నారు. ఆరెంజ్ రంగు మీద పసుపు రంగు గళ్లు కలిగిన చీర ధరించి ఉంది. ఎవరైనా తెలిస్తే 94407 96360, 94407 96361 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు
ఏర్పేడు: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఈనెల 14వ తేదీ నుంచి 9 రోజులపాటు తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్నాయి. సాంకేతిక పరిశోధనల దిశగా పుస్తకాలతో కుస్తీ పడుతూ మేథోమదనం చేస్తున్న విద్యార్థులకు ఈ క్రీడోత్సవాలు కాస్త ఆటవిడుపు కానున్నాయి. తిరుపతి ఐఐటీతో పాటు మద్రాస్, హైదరాబాద్ ఐఐటీలు వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ రెజ్లర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 వేలమందికి పైగా విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారు. -
గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!
రామచంద్రాపురంలో గ్రామకంఠం భూమిని కొందరు అధికార పార్టీ నేతలు ఆక్రమించి ఇళ్లు కడుతున్నా అడిగేవారు లేరు.నేడు 8వ ఐఎల్సీసీ సమావేశం తిరుపతి ఐఐటీలో మూడు రోజుల పాటు 8వ ఐఎల్సీసీ)–2025 సమావేశం నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తెలిపారు. సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మగ్గం నేస్తున్న చేనేత కార్మికురాలు, (ఇన్సెట్) పట్టు ముడి సరుకు ఇదే పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేతన్నల కళ్లలో నీటి సుడులు తిరుగుతున్నాయి. పని లేక పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ సహకారంతో పాటు చేతినిండా పని ఉండడంతో వారు దర్జాగా బతికేవారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ రంగం కళావిహీనం అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత రంగానికి సంక్షేమ పథకాలతో పాటు అన్నివిధాలా చేయూతనందిస్తే..టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అరకొరగా అమలు చేస్తూ.. నేతన్న నేస్తం నిలిపేసి మోసం చేస్తోంది. వెంకటగిరి(సైదాపురం): నేతన్న దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఆర్భాటపు హామీలు అమలుకు నోచుకోకపోవడంతో నేతన్నలకు భంగపాటు తప్పడం లేదు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభత్వం అమలు చేయకపోవడం పట్ల చేనేత కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడి.. మరోవైపు ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో నేసిన చీరల ధర పెరిగాయి. వాటిని కొనేవారు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారు. గతంలో కిలో పట్టు రూ.3 వేలు ఉండగా.. రానురాను ప్రస్తుతం రూ.8వేలకు చేరింది. జరి కట్ట రూ.325 ఉండగా ఈ ఏడాది రూ.500 నుంచి రూ.600కు పెరిగింది. రంగులు గతంలో రూ.150 నుంచి రూ.170 ఉండగా ప్రస్తుతం వీటి ధరలు రూ. 300 నుంచి రూ.500కి చేరాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 42 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో వేల మంది చేనేత కార్మికులుగా నమోదయ్యారు. మాస్టర్స్ వీవర్, వద్ద పనిచేస్తున్న వారు, మాస్టర్స్ వీవర్స్ ద్వారా మరి కొంతమంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 15,475 మగ్గాలు ఉన్నాయి. వీటిలో సహకార రంగంలో 4,250 మగ్గాలు నడుస్తున్నాయి. గత మూడు నెలలుగా చాలా మగ్గాలు మూతబడుతూ వస్తున్నాయి. అమలుకు నోచుకోని ముఖ్యమంత్రి హామీ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున ఏటా సాయం అందించింది. 2023 జూలైలో తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నుంచి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతలకు నిధులు విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా నేతన్న నేస్తం ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో అతి త్వరలో నేతన్ననేస్తం కింద రూ.25 వేలు చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్స్, పవర్ లూమ్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన రోజు నుంచే అమల్లోకి వస్తుందన్నారు. జిల్లాలో వంద యూనిట్ల వరకు ఈ పథకం అమలు అవుతున్నప్పటీకీ మిగిలిన జిల్లాల్లో అమలు కావడం లేదు. ఇక విద్యుత్ చార్జీలను మాత్రం విపరీతంగా పెంచారు. 2017 నుంచి సహకార సంఘాలకు, చేనేత కార్మికుల పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.177 కోట్లు బకాయిలను పెండింగులో ఉంచింది. 2018 నుంచి ఆప్కో పాలకవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. చేనేతకు‘చంద్ర’గ్రహణంఅల్లు పడుతున్న చేనేత కార్మికులుఅచ్చు అతుకుతున్న మహిళ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఆర్భాటపు హామీలు -
టీటీడీకి రూ.50 లక్షల విరాళం
తిరుమల: ముంబైకి చెందిన జీన్.బొమ్మాన్జీ దుబాష్ చారిటీ ట్రస్టు టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.50 లక్ష లు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ ట్రస్టు సీఎఫ్ఓ చంద్రశేఖర్ కృష్ణమూర్తి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆల య అధికారులకు విరాళం డీడీని అందజేశారు. ఘనంగా సత్యసాయి జయంతి తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో సత్యసాయి శత జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ము ఖ్యఅతిథి హాజరయ్యారు.కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం చేపట్టారు. సత్య సాయిబాబా జీవితం, సామాజిక శ్రేయస్సుపై ఆయన ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. డీన్ ప్రొఫెసర్ శుక్లా, అధ్యాపకులు వెంకట్రావు, ఆర్.లక్ష్మీనారాయణ, బాలిచక్రవర్తి, నారాయణ, బాలదత్తాత్రేయ, శివకుమార్ పాల్గొన్నారు. -
‘గోల్డెన్’ చాన్స్!
ప్రాణ రక్షణకుబ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి చికిత్స చేస్తున్న వైద్యులుగోల్డెన్ అవర్లో ప్రాణాలు దక్కించుకున్న రోగితో వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు కుటుంబీకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పని అసలే లేదు. ఖరీదైన చికిత్సలను ఉచితంగానే పొందవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి భారీగా వేసిన బిల్లులను చెల్లించలేక తిప్పలు పడుతుంటారు. పేదల ఆరోగ్య రక్షణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా రాయలసీమలోనే పెద్దాస్పత్రిగా పేరుగాంచిన తిరుపతి రుయాలో న్యూరాలజీ విభాగాన్ని బలోపేతం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు నియమించారు. నాణ్యమైన సేవలను పైసా ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్లో రోగిని తీసుకువస్తే వెంటనే ప్రాణం కాపాడేందుకు రూ.50వేల విలువైన ఇంజెక్షన్ను ఉచితంగా వేస్తున్నారు. తిరుపతి తుడా : తిరుపతి రుయా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో కూడిన న్యూరాలజీ విభాగం అత్యుత్తమ సేవలను అందిస్తోంది. న్యూరాలజీ వైద్యం అత్యంత ఖరీదైంది. రుయాలో ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకుంటే మెరుగైన వైద్యంతోపాటు రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పని ఉండదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే రుయాలో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని బలోపేతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో న్యూరాలజీ విభాగం ఆత్యాధునిక వైద్య సేవలను అందిస్తోంది. వందలాది మందికి పునర్జన్మను ప్రసాదిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన బాధితులను గోల్డెన్ అవర్ ( సకాలంలో) తీసుకువస్తే 90 శాతం రికవరీ చేసి పంపిస్తుండడం ఇక్కడి వైద్యుల ప్రత్యేకత. బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణకు అవసరమైన సిటీ స్కాన్, ఎంఆర్ఐ సైతం రుయాలో అందుబాటులో ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ గుర్తించిన వెంటనే నాణ్యమైన వైద్యం అందించి రోగి ప్రాణాలను కాపాడేందుకు ఇక్కడి డాక్టర్లు శ్రమిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీంతో రోగి చెయ్యి, కాలు పడిపోయి పెరాలసిస్ సోకుతుంది , అలానే మూతి వంకర, కళ్లు కనిపించకపోవడం, మాట పడిపోవడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ గా గుర్తించాలి. ప్రత్యేకంగా ఈఈసీ ల్యాబ్ అలాగే రుయా ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రత్యేకంగా ఈఈసీ ల్యాబ్ ఉంది. ఇందులో ఫిట్స్ రోగులకు ఉచితంగానే మెరుగైన చికిత్సలందిస్తున్నారు. మెడ, ఇతర నరాల సమస్యకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఇతర థెరఫీలకు అవసరమైన సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారు. -
పులికాట్లో పర్యాటకుల సందడి
సూళ్లూరుపేట : పులికాట్ సరస్సు నిండు కుండలా కళకళలాడుతోంది. విదేశీ వలస విహంగాల కిలకిలరావాలతో ఆకట్టుకుంటోంది. సరస్సు ఈ మేరకు పర్యాటకులతో సందడిగా మారింది. పులికాట్ సమీపంలోని చెట్లపై వలస పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదుగులో ఉన్నాయి. మగ విహంగాలు సరస్సులో ఆహారం సేకరణలో నిమగ్నమయ్యాయి. పెద్దసంఖ్యలో విహరిస్తున్న విదేశీ పక్షులను వీక్షించి పర్యాటకులు పరవశిస్తున్నారు. గూళ్లకు వెళ్లేప్పుడు అవి చేసే విన్యాసాలను చూసి మైమరచిపోతున్నారు. పక్షులను ఆందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడుతున్నారు. ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)కి అనుబంధంగా ఉన్న శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం స్టీమ్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక, నైపుణ్యతను ప్రదర్శించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, రోబోటిక్స్ వంటి ప్రదర్శించారు. సైన్స్ మోడల్స్, రోబోటిక్స్, టెక్నాలజీ ఆధారిత నమూనాలు, ఇంజినీరింగ్ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేష్ పాటిల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
86 మందికి జరిమానా
తిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్న 37 మందికి ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి శనివారం తీర్పు చెప్పారు. అలాగే నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న 49 మందికి ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున జరిమానా విధించారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహించి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరపరిచారు. ఎస్వీయూతో ఎస్ఆర్ఎం అవగాహన ఒప్పదం తిరుపతి సిటీ: ఎస్వీయూ, ఎస్ఆర్ఎం వర్సిటీల మధ్య కీలక ఒప్పదం కుదిరింది. ఎస్వీయూలో శనివారం వీసీ టాటా నర్సింగరావు, ఎస్ఆర్ఎం అధికారులు ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఎస్వీయూ వీసీ మాట్లాడుతూ డీప్ టెక్ రంగాలలో జాతీయ పురోగతిని వేగవంతం చేసేందుకు, సూపర్ కంప్యూటింగ్, క్వాంటం క్విట్లు, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం నావిగేషన్, థిన్–ఫిల్మ్ టెక్నాలజీలు, డైమండ్ థిన్–ఫిల్మ్ పరిశోధన, సముద్రపు నీటి విద్యుద్విశ్లేషణ, గ్రీన్ హైడ్రోజన్, హైడ్రోజన్ నిల్వ, హైడ్రోజన్–శక్తితో కూడిన డేటా సెంటర్లతో సహా క్లీన్–ఎనర్జీ పరిష్కారాలు వంటి అంశాలపై ఎస్ఆర్ఎం వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం వీసీ ఆచార్య సతీష్ కుమార్, ఎస్వీయూ రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు జేసీబీ.. నాలుగు ట్రాక్టర్లు సీజ్ శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలో ఎంజీఎం హోటల్ వెనుక శుక్రవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తవ్వుతున్న జేసీబీ, నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు గుర్తించి డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికార పార్టీ నాయకులకు చెందిన వాహనాలు కావడంతో ఆ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అనంతరం పట్టుబడ్డ వారిని తహసీల్దార్ ముందు హాజరు పరిచి, నామమాత్రపు ఫైన్తో విడుదల చేసినట్టు సమాచారం. ఒకటిన్నర ఏడాదిగా ఇదే తంతు బాబు ప్రభుత్వం వచ్చాక ఇసుకాసురలు చెలరేగిపోతున్నారు. ఒకటిన్నర సంవత్సరంగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డా నామమాత్రపు ఫైన్తో బయటకు వస్తున్నారు. దీంతో మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. కలంకారీ కళాకారుడి మృతి శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన కలంకారీ కళాకారుడు ఆవులకొండ విజయకుమార్ (72) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. సుమారు 20 ఏళ్లపాటు చైన్నె మ్యూజియంలోని సాంప్రదాయ కలంకారి ఆర్ట్ శిక్షణాలయంలో ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులకు కలంకారీ శిక్షణ అందించారు. చైన్నెలోని కళాక్షేత్రలో ఇప్పటికీ ఆయన రూపొందించిన కలంకారీ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి.


