23 కిలోల గంజాయి స్వాధీనం
– 8లో
నాయుడుపేటలో బుధవారం పోలీసులు 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.
కింది ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు రేణిగుంట మండలం గాజులమండ్యం ప్రాంతానికి చెందిన వ్యక్తి. వయస్సు 70. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడిని జనవరి 27వ తేదీన స్విమ్స్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అక్కడి వైద్యుల బృందం రోగి ఆటో దిగకుండానే వివరాల కూపీ లాగారు. చూడడానికి పేదలుగా ఉండడంతో కేసు సీరియస్గా ఉందని, ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు, మీరు పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. మా ఆయన శ్వాస తీసుకోవడం లేదు, బెడ్లో చేర్చుకోండి అంటూ కంటతడి పెట్టినా.. వైద్యులు మాత్రం కనికరించలేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం, మీరు అర్జెంటుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండంటూ భయపెట్టడంతో చేసేది లేక అదే ఆటోలో రుయాకు తరలించారు.


