పీఏఎల్‌ఎస్‌తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

పీఏఎల్‌ఎస్‌తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం

Jan 25 2026 7:57 AM | Updated on Jan 25 2026 7:57 AM

పీఏఎల్‌ఎస్‌తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం

పీఏఎల్‌ఎస్‌తో తిరుపతి ఐఐటీ భాగస్వామ్య ఒప్పందం

ఏర్పేడు: తిరుపతి ఐఐటీ శనివారం పీఏఎల్‌ఎస్‌(పాన్‌–ఐఐటీ పూర్వ విద్యార్థుల అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ, పీఏఎల్‌ఎస్‌ ట్రస్టీ ఎన్‌.అలిమేలు, చైర్మన్‌ సీఎన్‌ చంద్రశేఖరన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కాంపిటెన్సీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఔట్‌ రీచ్‌ యూనిట్‌ వ్యూహాత్మక సహకారాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, విద్యా ఔట్‌రీచ్‌, సామర్థ్య నిర్మాణంలో సంస్థాగత చొరవలను నడిపించడానికి బాధ్యత వహిస్తుందని వారు విశ్వసించారు. వివిధ ఐఐటీలకు చెందిన పూర్వ విద్యార్థుల నేతృత్వంలో స్వచ్ఛంద సేవకుల ఆధారిత విద్యా చొరవ, ఇంజినీరింగ్‌ విద్యను మెరుగుపరచడానికి, సంస్థలు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లు, ఔత్సాహిక వ్యవస్థాపకులను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు, అధ్యాపక అభివృద్ధి కార్యకలాపాలు, ఉమ్మడి హ్యాకథానలు వంటి సహకార కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డీన్‌లు ప్రొఫెసర్‌ అరుణ్‌ కె. తంగిరాల, ప్రొఫెసర్‌ శశిధర్‌ గుమ్మా, ప్రొఫెసర్‌ రామకృష్ణ సాయి గోర్తి, ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ కాంపిటెన్సీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం సలహాదారు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం గోర్తి, రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె. పి. కృష్ణకుమార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ రుచిక, పీఏఎల్‌ఎస్‌ ప్రతినిధులు సుబ్రమణియన్‌, మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement