ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య! | Tirupati district incident | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!

Feb 8 2026 5:29 AM | Updated on Feb 8 2026 5:29 AM

Tirupati district incident

పుత్తూరులో కలకలం రేపిన ఘటన 

పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్‌ 3వ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ జి.రవికుమార్‌ తెలిపిన వివరాలు.. కృష్ణానగర్‌లో నివసిస్తున్న శివశంకర్, పద్మజ (27) ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజశ్రీ (7), లాస్య (4)ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్‌ నిరుద్యోగి కావడంతో శనివారం ఉదయం శ్రీసిటీ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు.

అయితే పిల్లలను విడిచిపెట్టామని మధ్యాహ్నం 2.30 గంటలకు పాఠశాల నుంచి శివశంకర్‌కు ఫోన్‌ వచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఉన్నానని తెలిసిన వారికి పిల్లలను తీసుకెళ్లాలని చెప్పాడు. వారు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన పద్మ జ పిల్లలను తీసుకెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్‌ తలుపు కొట్టినా ఎంతకూ తీయకపోవడంతో కిటికిలోనుంచి చూడగా అమ్మా యి వేలాడుతూ కనిపించింది.

దీంతో ఇరుగుపొరుగువారిని తీసుకువచ్చి తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లగా తల్లీ కుమార్తెలు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు. వారు అందించిన సమాచా రం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు.పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, శివశంకర్‌ను పెళ్లి చేసుకున్న పాపానికి తాను ఎన్నో కష్టాలపాలయ్యానని, ఊరంతా అప్పులే ఉన్నాయని.. పద్మజ సూసైడ్‌ లేఖలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement